Thursday 30 September 2021

అల్లు రామలింగయ్య జయంతి.. విగ్రహాన్ని ఆవిష్కరించిన అల్లు వారసులు

టాలీవుడ్‌లో అల్లు బ్రాండ్‌ను సపరేట్‌గా క్రియేట్ చేయాలని, తమ మార్క్ చూపించాలని తెగ తాపత్రయపడుతున్న సంగతి తెలిసిందే. మెగా హీరో అనే ట్యాగ్ నుంచి అల్లు అర్జున్ ఎప్పుడో దూరమైపోయాడు. మెగా అనే పదాన్ని బన్నీ ఎక్కువగా వాడటం లేదు. ఇక అల్లు స్టూడియో అంటూ అల్లు అరవింద్ భారీ ప్లాన్‌తోనే ముందుకు వెళ్తున్నాడు. అల్లు ఎంటర్టైన్మెంట్, అల్లు స్టూడియో అంటూ అల్లు అరవింద్, బన్ని కలిసి మాస్టర్ ప్లాన్ వేస్తున్నాడు. గత ఏడాది అంగరంగ వైభవంగా ప్రారంభించిన అల్లు స్టూడియో పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. అయితే శతజయంతి వేడుకుల మీద మెగా అభిమానులు కూడా ప్రత్యేక కార్యక్రమాలు చేస్తున్నారు. అయితే తాజాగా అల్లు అర్జున్ తన తాతకు నివాళి అర్పించారు. అల్లు రామలింగయ్య గారి శతజయంతి సందర్భంగా అల్లు స్టూడియోలో ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించారు. అల్లు బాబీ, అల్లు శిరీష్‌లతో కలిసి విగ్రహాన్ని ఆవిష్కరించాను. ఆయన మా ప్రతిష్ట, గౌరవం.. వాటిని అల్లు స్టూడియోలోని మా జర్నీతో ముందుకు కొనసాగిస్తామని అల్లు అర్జున్ ఎమోషనల్ అయ్యాడు. బన్నీ ప్రస్తుతం పుష్ప సినిమాతో ఫుల్ బిజీగా ఉన్నాడు. మొదటి పార్ట్ ఈ క్రిస్మస్ కానుకగా రాబోతోంది. ఇక అల్లు శిరీష్ అయితే ఇప్పుడు అను ఇమాన్యుయేల్‌తో రొమాన్స్ చేస్తున్నాడు. ప్రేమ కాదంటా? అనే సినిమాతో రాబోతోన్నాడు. అల్లు బాబీ పూర్తి స్థాయిలో నిర్మాతగా మారబోతోన్నాడు. వరుణ్ తేజ్ గని సినిమాను అల్లు బాబీ నిర్మిస్తున్నాడు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3orsZQ6
v

‘కొండపొలం’ నుంచి ఆహ్లాదకరమైన పాట.. రకుల్‌, వైష్ణవ్‌ల రొమాన్స్ అదుర్స్

‘ఉప్పెన’ సినిమాతో మంచి సక్సెస్ అందుకు నటుడు నటిస్తున్న తాజాగా చిత్రం ‘’. దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది. అడవి నేపథ్యంలో సాగే విభిన్న కథతో ఫస్ట్‌ ఫ్రేమ్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై ఈ సినిమా రూపొందిస్తున్నారు. ఇప్పటికే వదిలిన పోస్టర్లు, పాటలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా ఈ మూవీ ప్రమోషన్స్ పెంచే క్రమంలో ట్రైలర్‌ను వదిలారు. ఈ ట్రైలర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పటికే ఈ సినిమా నుంచి ‘ఓబులమ్మ’ అనే పాటను చిత్ర యూనిట్ విడుదల చేసింది. తాజాగా ‘శ్వాస’ అంటూ సాగే మరో మెలోడీని కూడా వదిలింది చిత్ర యూనిట్. ‘శ్వాసలో హద్దుల్ని దాటలన్న ఆశ. ఆశలో.. పొద్దుల్ని మరిచే హాయి మోశా’ అంటూ సాగే ఈ పాటని యామిని, రోహిత్ పాడారు. ఈ పాటకు సంగీతంతో పాటు సాహిత్యం కూడా అందించారు. ఇక పాటలో అద్భుతమైన లోకేషన్ల నడుమ రకుల్ ప్రీత్, వైష్ణవ్ తేజ్‌ల మధ్య రొమాన్స్‌ని చూపించారు. ప్రస్తుతం ఈ పాట సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది. పాట ఎంతో వినసోంపుగా ఉంది అంటూ అభిమానులు కామెంట్ చేస్తున్నారు. సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి రాసిన నవల ‘కొండపొలం’ నవల ఆధారంగా ఈ సినిమా రూపొందించిన విషయం అందరికీ తెలిసిందే. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్, పాటలు చూస్తుంటే ఈ సినిమాతో వైష్ణత్ తేజ్ మరో హిట్ అందుకోవడం పక్కా అని అంతా భావిస్తున్నారు. ఇక ఈ సినిమా సీనియర్ నటులు కోట శ్రీనివాస రావు, నాజర్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. సాయిబాబు జాగర్లమూడి, రాజీవ్‌ రెడ్డి నిర్మించారు. ఇప్పటికే అన్ని పనులు పూర్తి చేసుకున్న ఈ సినిమా అక్టోబర్ 8వ తేదీన.. ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3A2UMZb
v

అక్రమాస్తుల కేసులో చిక్కుకున్న వడివేలు.. స్టార్ కమెడియన్‌కు షాక్ ఇచ్చిన కోర్టు

తమిళ హాస్య నటుడు తెలుగు ప్రేక్షకులకు సుపరిచితులే. 200లకుపైగా చిత్రాల్లో నటించిన ఆయన తన కామెడీతో అందరి చేత నవ్వులు పూయించారు. అయితే గత కొలంగా అవకాశాలు రాకపోవడం.. ఇతర కారణాల వల్ల ఆయన సినిమాలకు దూరంగా ఉంటున్నారు. తాజాగా ఆయన ఊహించని చిక్కుల్లోపడ్డారు. అక్రమాస్తుల కేసులో విచారణకు హాజరు కావాలని ఆయనకు ఎగ్మూర్ న్యాయస్థానం ఆయనకు నోటీసులు జారీ చేసింది. గతంలో వడివేలు ఇంట్లో ఐటీ దాడులు నిర్వహించిన అధికారులు ఆయన తాంబారం సమీపంలో 3.5 ఎకరాల స్థలాన్ని రూ.1.93 కోట్లకు విక్రయించి దాన్ని లెక్కల్లో చూపించనట్లు గుర్తించారు. అయితే తాను 2007లో కొనుగోలు చేసిన ఈ స్థలం విషయంలో తన సహ నటుడు సింగముత్తు తనని మోసం చేశాడని.. తన ప్రమేయం లేకుండానే ఆ స్థలాన్ని విక్రయించాడని వడివేలు ఆరోపించారు. అంతేకాక.. సింగముత్తుపై ఆయన క్రైం బ్రాంచి పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. అయితే అప్పటి నుంచి ఈ కేసు ఎగ్మూర్ కోర్టులో నడుస్తోంది. గతంలోనే విచారణకు రావాలని కోర్టు వడివేలుకు సమన్లు పంపింది. కానీ, ఆయన కొన్ని అనుకోని కారణాల వల్ల అప్పట్లో విచారణకు హాజరు కాలేకపోయారు. గురువారం ఈ కేసు పిటీషన్ విచారణకు వచ్చింది. ఈ నేపథ్యంలో సింగముత్తు తరఫు న్యాయవాదులు బలంగా వాదనలు వినిపించారు. ఆ స్థలాన్ని తాంబరం సమీపంలోని శేఖర్ అనే వ్యక్తికి వడివేలునే విక్రయించారు అని వాళ్లు కోర్టుకు తెలిపారు. పన్ను ఎగవేయడం కోసమే ఆయన సింగముత్తుపై ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. అయితే వాదోపవాదాలు విన్న కోర్టు.. ఈసారి వడివేలు తప్పటిసరిగా విచారణకు రావాలని ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను డిసెంబర్ 7వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు న్యాయమూర్తి నాగరాజన్ తెలిపారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3omIed7
v

భార్యతో కలిసి మహేష్ తొలిసారిగా అలా.. స్టైలిష్ లుక్‌లో అదరగొడుతున్న స్టార్ కపుల్

సూపర్‌స్టార్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. అయితే సినిమాల్లో ఎంత బిజీగా ఉన్నా.. ఆయన కుటుంబానికి కేటాయించాల్సిన సమయాన్ని కచ్చితంగా కేటాయిస్తారు. సినిమాల నుంచి బ్రేక్ దొరికినప్పుడల్లా.. తన భార్య , పిల్లలు గౌతమ్, సితారలతో కలిసి ఆయన విదేశాలకు విహారయాత్రలకు వెళ్తుంటారు. అందుకు సంబంధించిన పిక్స్ సోషల్‌మీడియాలో వైరల్ అవుతుంటాయి. అయితే ప్రస్తుతం కరోనా ఉంటడంతో.. ఖాళీ సమయాల్లో ఎక్కువగా ప్రయాణాలు చేయకుండా.. ఇంట్లోనే ఫ్యామిలీతో సరదాగా గడుపుతున్నారు మహేష్. ఇక మహేష్ మరియు నమ్రతలది ప్రేమ వివాహం అన్న విషయం అందరికి తెలిసిందే. ‘వంశీ’ అనే సినిమాలో కలిసి నటించిన వీరిద్దరు.. ఆ సినిమాతోనే ప్రేమలో పడ్డారు. ఆ తర్వాత కొన్ని రోజులకు వివాహ బంధంతో ఒక్కటయ్యారు. అప్పటి నుంచి ఇప్పటివరకూ ఎలాంటి విబేధాలు లేకుండా.. అన్యోన్యంగా ఉంటూ.. అదర్శ జంటగా నిలిచారు వీరిద్దరు. ఇక మహేష్‌బాబు సామాజిక సేవా పనులు.. ఇతర వ్యవహారాలు అన్ని నమ్రతనే దగ్గరుండి చూసుకుంటారు. ఆయనకు సంబంధించిన అప్‌డేట్స్ అన్ని ఆమె ఎప్పటికప్పుడు సోషల్‌మీడియా ద్వారా అందిస్తుంటారు. అయితే తొలిసారిగా మహేష్ మరియు నమ్రతలు కలిసి ఓ ఫోటోషూట్ నిర్వహించారట. ప్రముఖ సినీ మ్యాగజైన్ ‘హలో’ కోసం వీరిద్దరు స్టైల్‌లుక్‌లో ఈ ఫోటోషూట్‌లో పాల్గొన్నారని తెలుస్తోంది. ఇందుకు సంబంధించి ఆ మ్యాగజైన్ కవర్ పేజ్ ఫోటో ఒకటి సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది. ఇక సినిమాల విషయానికొస్తే.. మహేష్ ప్రస్తుతం పరశురామ్ దర్శకత్వంలో ‘’ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా తర్వాత ఆయన త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో ఓ సినిమా చేయనున్నారు. ఈ సినిమాలు ముగిసిన తర్వాత ఆయన దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళితో మరో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/39X12Y5
v

ఆ విషయంలో చిన్న క్లాష్.. ధనుష్ అడిగిదానికి ఓకే చెప్పలేకపోతున్న శేఖర్ కమ్ముల!

కోలీవుడ్‌లో మంచి క్రేజ్ ఉన్న హీరోల్లో ఒకరు. ఎలాంటి పాత్ర అయినా సరై.. తన అద్భుతమైన నటనతో దాన్ని ఓ రేంజ్‌కు తీసుకువెళ్తారు ఆయన. ఇక ఆయన సినిమాలు తెలుగులో కూడా డబ్బింగ్ కావడంతో.. ఇక్కడ కూడా ఆయనకు మంచి పాపులారిటీ ఉంది. తమిళంలోనే కాదు.. బాలీవుడ్‌లోనూ పలు సినిమాల్లో నటించిన ఆయన ప్రస్తుతం హాలీవుడ్‌లో సినిమా చేస్తున్నారు. అయితే ఇప్పటివరకూ డబ్బింగ్ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన ధనుష్.. త్వరలో నేరుగా తెలుగు సినిమా చేయనున్నారు. అది దర్శకత్వంలో. శ్రీ వెంకటేశ్వర సినిమాస్‌ బ్యానర్‌పై రూపుదిద్దుకోనున్న ఈ చిత్రానికి నారాయణ్‌ దాస్‌ నారంగ్‌, రామ్మోహన్‌రావు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా గురించి అధికారికంగా ప్రకటన వచ్చింది. రీసెంట్‌గానే ‘లవ్‌స్టోరి’ సినిమాతో మంచి హిట్ అందుకున్న శేఖర్ కమ్ముల ప్రస్తుతం ఈ సినిమా స్క్రిప్ట్ పనుల్లో నిమగ్నమయ్యారు. అయితే ఈ సినిమా స్క్రిప్ట్ విషయంలో ధనుష్, శేఖర్ కమ్ముల మధ్య చిన్న క్లాష్ వచ్చిందని టాక్ వినిపిస్తోంది. అదేంటంటే ధనుష్ ఇప్పటివరకూ చేసిన సినిమాలు అన్ని తమిళ నేటివిటికి తగ్గటుగా ఉంటాయి. సినిమాలో ఆయన వేషధారణ, స్టైల్, యాక్షన్ సన్నివేశాలు.. ఇలా అన్నిటిలో అక్కడి ఫ్లేవరే ఎక్కువగా కనిపిస్తోంది. కానీ, శేఖర్ కమ్ముల మాత్రం అలా కాదు. ఆయన సినిమాల్లో హీరోల పాత్ర చాలా భిన్నంగా, సింపుల్‌గా ఉంటుంది. ముఖ్యంగా ఆయన తన హీరోలను చాలా క్లాస్‌గా చూపిస్తారు. పెద్దగా ఫైట్స్ ఉండవు, మాస్ సన్నివేశాలు ఉండవు, చాలా సాఫ్ట్‌గా ఉంటాయి శేఖర్ కమ్ముల సినిమాలు. అలాంటి పాత్రనే ధనుష్ కోసం కూడా డిజైన్ చేశారట శేఖర్ కమ్ముల. కానీ, దీంతో ధనుష్ విబేధిస్తున్నారట. తమిళ ఆడియన్స్‌కి నచ్చే విధంగా ఆయన పాత్రను డిజైన్ చేయాలని ధనుష్ కోరారట. దీంతో శేఖర్ కమ్ముల ధనుష్ అడిగిన దానికి ఓకే చెప్పలేక, నో చెప్పలేక మదనపడుతున్నారని సమాచారం. మరి ఈ ఇద్దరిలో ఎవరు తమ నిర్ణయం మార్చుకుంటారో వేచి చూడాల్సిందే.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3omTh5X
v

రిపబ్లిక్ ట్విట్టర్ రివ్యూ : సాయి ధరమ్ తేజ్ పర్ఫామెన్స్ హైలెట్

సాయి ధరమ్ తేజ్, ఐశ్వర్యా రాజేష్, రమ్యకృష్ణ, జగపతి బాబు వంటి నటీనటులతో లాంటి దర్శకుడు సినిమా తీస్తున్నాడంటే సాధారణ ప్రేక్షకుడికి సైతం అంచనాలు ఓ రేంజ్‌లో ఉంటాయి. అలాంటి అనే సినిమా పాటలు, టీజర్, ట్రైలర్ వంటి వాటితో అద్భుతంగా మౌత్ టాక్ తెచ్చుకుంది. ఇక తీరా విడుదల తేదీ దగ్గరపడుతుండటంతో బైక్ ప్రమాదానికి గురయ్యారు. ఇంకా ఆస్పత్రిలోనే చికిత్స పొందుతున్నారు. హీరో అలా ఉన్నా కూడా.. ఆయన కోరిక, సంకల్పం మేరకు ఈ చిత్రాన్ని అక్టోబర్ 1న విడుదల చేసేందుకు సిద్దమయ్యారు. అయితే ఈ మూవీని ఇండస్ట్రీలోని సెలెబ్రిటీలకు ముందుగానే చూపించారు. వారంతా కూడా తేజూ నటనను మెచ్చుకున్నారు. ఇక ఇప్పటికే కొన్ని చోట్ల ప్రివ్యూలు కూడా పడ్డాయి. నెటిజన్లు కూడా రిపబ్లిక్ చిత్రాన్ని వీక్షించినట్టున్నారు. వారు కూడా తేజూ నటన మీద ప్రశంసలు కురిపిస్తున్నారు. దేవా కట్టా విజన్‌ను సాయి ధరమ్ తేజ్ ద్వారా చూపించారు.. తద్వారా ఆయన కెరీర్‌లోనే ది బెస్ట్ పర్ఫామెన్స్ ఇచ్చేట్టు చేశారు. ప్రస్తుతం మన సమాజంలోనే కొన్ని సమస్యలను చూపించారు.. సిస్టింలోని లొసుగులను ఎత్తిచూపారు అంటూ ఓ నెటిజన్ సినిమా గురించి చెప్పుకొచ్చాడు. నువ్ ఈ సిస్టింలో ఉండలేకపోతే.. సిస్టింలోంచి బయటకు వెళ్లగొట్టబడతావ్ అంటూ దేవా కట్టా రాసిన డైలాగ్‌ను ఓ నెటిజన్ ట్వీట్ వేశాడు. సాయి ధరమ్ తేజ్ కెరీర్ బెస్ట్ పర్ఫామెన్స్ ఇచ్చాడు అని ప్రశంసలు కురిపించాడు. ఫుల్ సీరియస్ మూవీ అని కొందరు.. మొదటి సీన్ నుంచి నేరుగా వైసీపీ మీదే కౌంటర్లు వేసినట్టు అనిపిస్తుందని మరి కొందరు.. ఈ మధ్య కాలంలోనే ఇంత మంచి సినిమా చూడటం జరిగింది.. నెగెటివ్ రివ్యూలు ఎందుకు ఇస్తారంటూ ఓ నెటిజన్ ఫైర్ అయ్యాడు. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల మీద సినిమా తీశాడని, విశాఖ వాణిగా రమ్యకృష్ణ అదరగొట్టేసిందని, సినిమా హిట్ అంటూ సాయి ధరమ్ తేజ్‌కు కంగ్రాట్స్ చెబుతున్నారు నెటిజన్లు. ఓ నిజాయితీ గత చిత్రాన్ని చూశాను.. చూస్తున్నంత సేపు ఆలోచించేలా థియేటర్ బయటకి వచ్చాక కూడా మనసులో నిలిచే చిత్రం రిపబ్లిక్, సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ నటనలో పది మెట్లు ఎక్కినట్టు అనిపించింది. ఎన్నో మంచి సన్నివేశాలు, సంభాషణలు దేవా కట్టా గారి మార్క్‌ను చూపించింది అని ఓ నెటిజన్ ట్వీట్ వేశాడు. మొత్తానికి సాయి ధరమ్ తేజ్ మాత్రం హిట్ కొట్టేసినట్టు కనిపిస్తోంది. అయితే పూర్తి స్థాయి రివ్యూ మాత్రం మరి కాసేపట్లో రానుంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3imGVHv
v

‘గతంలో అలా ఎప్పుడు చూసుండరు..’ ‘అఖండ’లో తన పాత్ర గురించి హీరో శ్రీకాంత్

మాస్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ దర్శకుడు బోయపాటి శ్రీను. ఆయన సినిమాలో హీరోని ఎంత పవర్‌ఫుల్‌గా చూపిస్తారో.. విలన్‌ని కూడా అంతే పవర్‌ఫుల్‌గా చూపిస్తారు. ఇక హీరో, విలన్ మధ్య ఉండే డైలాగ్స్, ఫైట్స్ అయితే.. ప్రేక్షకులతో థియేటర్‌లో విజిల్స్‌ వేయిస్తాయి అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అలా ఇప్పటివరకూ వచ్చిన బోయపాటి సినిమాల్లో హీరోలకు ఎంత క్రేజ్ వచ్చిందో విలన్ పాత్రలు చేసిన నటులకు అంతే క్రేజ్ వచ్చింది. తాజాగా బోయపాటి సినిమాలో విలన్‌గా నటిస్తున్నారు . గతంలో నాగ చైతన్య నటించిన ‘యుద్ధం శరణం’ అనే సినిమాలో శ్రీకాంత్ ప్రతినాయకుడి పాత్రలో కనిపించారు. కానీ, ఈ సినిమా అంతగా ఆడలేదు. ఇప్పుడు మరోసారి ఆయన బోయపాటి శ్రీను, బాలకృష్ణ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘’ సినిమాలో విలన్‌గా కనిపించనున్నారు. అయితే ఇప్పటివరకూ ఈ సినిమా నుంచి బాలకృష్ణకు సంబంధించిన అప్‌డేట్స్ వచ్చాయి కానీ, శ్రీకాంత్ పాత్రకు సంబంధించి ఎలాంటి అప్‌డేట్ రాలేదు. తాజాగా శ్రీకాంత్ నటించిన మరో సినిమా ‘ఇదే మా కథ’. ఈ సినిమాలో భూమిక, సుమంత్ అశ్విన్, తన్య హోప్ ప్రధాన పాత్రల్లో నటించారు. బైక్ రైడింగ్ ఆధారంగా ఈ సినిమా సాగుతుంది. అయితే ఈ సినిమాకు సంబంధించి ఇచ్చిన ఇంటర్వ్యూలో శ్రీకాంత్ ‘అఖండ’ సినిమాలో తన పాత్ర ఎలా ఉంటుందో చెప్పారు. ఈ సినిమాలో తన పాత్ర చాలా భయంకరంగా, క్రూరంగా ఉంటుందని, గతంలో అలాంటి పాత్రలో తనని ఎప్పుడూ చూసి ఉండరు అని ఆయన అన్నారు. నా పాత్ర వేషధారణ .. ఆ పాత్ర స్వభావం బీభత్సంగా ఉంటాయని.. ఎన్నో గెటప్స్ గీయించి చివరికి బోయపాటిగారు ఒకటి ఫిక్స్ చేశారని ఆయన తెలిపారు. సినిమా చూసిన తర్వాత తనని తిట్టుకోవడం ఖాయమని ఆయన.. కానీ, ఈ పాత్ర తన కెరీర్‌లో ఓ మైలురాయిలా నిలిచిపోతుందనే నమ్మకం ఉందన్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3imP7XU
v

‘నల్లమల’ టీజర్‌.. అసూయ పడ్డాను అంటూ దేవా కట్టా కామెంట్స్

బిగ్ బాస్ షోతో , బాగానే ఫేమస్ అయ్యారు. బిగ్ బాస్ ఇంట్లో స్నేహితుల్లా మారిన ఆ ఇద్దరూ ఇప్పుడు హీరో హీరోయిన్లుగా మారారు. అంటూ ఈ ఇద్దరూ ఇప్పటికే దుమ్ములేపేశారు. ఏమున్నవే పిల్ల ఏమున్నవే అంటూ ఒకే ఒక్క పాటతో నల్లమల సినిమా మీద అంచనాలు పెరిగిపోయాయి. అయితే తాజాగా ఈ మూవీకి సంబంధించిన టీజర్‌ను రిలీజ్ చేశాడు. అమిత్‌ తివారీ, భానుశ్రీ, నాజర్, తనికెళ్ల భరణి, అజయ్‌ ఘోష్, కాలకేయ ప్రభాకర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రం ద్వారా రవి చరణ్ ‌దర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మ‌వుతున్నాడు. ఆర్‌.ఎమ్‌ నిర్మిస్తున్న ఈ మూవీ టీజర్‌ను తాజాగా దర్శకుడు దేవా కట్టా విడుదల చేశాడు. ఈ ఈవెంట్‌కు రావడం అంత ఇష్టం లేకపోయినా వచ్చాను అని అసలు విషయం చెప్పేశాడు. అయితే టీజర్‌లో అమిత్ చెప్పిన డైలాగ్స్, చివర్లో పులి ఉండే షాట్ బాగుంది. ఏమున్నవే పిల్లా అనే పాటను తన ఫ్రెండ్స్‌తో హ్యాంగవుట్ సమయంలో విన్నాను అని, అలాంటి పాట నాకు ఎందుకు లేదు అని అసూయ పడ్డానంటూ దేవా కట్టా చెప్పుకొచ్చాడు. అయితే ఈ చిత్రంలో అద్భుతమైన నటీనటులున్నారని దేవా కట్టా అన్నాడు. ఇక దర్శకుడు రవి చరణ్ మాట్లాడుతూ సినిమా గురించి ఓ రెండు విషయాలు చెబుతానని అన్నాడు. అడవిని అడవి తల్లి.. గోవును గోమాత అని అంటామని, బానిస బతుకుల నుంచి భారతదేశం స్వేచ్చా ఆయువును పీల్చుకుంటున్న సమయంలో నల్లమల అడవుల్లోకి మానవ రూపంలో ఉన్న క్రూరమృగం ఎంట్రీ అయిందంటూ.. ఆ మృగం ఎంట్రీ అయ్యాక ఏం జరిగింది అనేదే ఈ కథ అని చెప్పుకొచ్చాడు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3uqMEkc
v

9 వేల రాత్రులు కలిసి పడుకోవాలి!.. అదరగొట్టేసిన పూజా

అక్కినేని, కలసి నటించిన ట్రైలర్ కాసేపటి క్రితమే విడుదలైంది. అందులో ‘9 వేల రాత్రులు కలిసి పడుకోవాలి, వందల వెకేషన్స్, కొన్ని లక్షల కబుర్లు చెప్పుకోవాలి.. అలాంటి పార్ట్నర్ ఎక్కడ ఉంటాడు’.. ‘నీకు ఎలాంటి అమ్మాయి కావాలి.. పెళ్లి అంటే ఏంటో కూడా తెలీదు’.. ‘నేనూ ఒకప్పుడు ఆ చీకటి నుంచి వెలుతురుకు వచ్చాను..ఓ హోప్‌ను పట్టుకుని.. ఆ హోప్‌ను పట్టుకోవడం పట్టుకోకపోవడం అనేది నీ ఇష్టం’, లోకం సర్దుకుపోమంటుంది.. మందను వదిలి.. కొత్త దారి వెతికి నేను వెళ్తున్నా.. మీరూ రండి’ అనే డైలాగ్స్ అదిరిపోయాయి. ఇక ఈ చిత్రం విడుదల కోసం ఎన్ని రోజులుగా అభిమానులు ఎదురుచూస్తున్నారో అందరికీ తెలిసిందే. కరోనా దెబ్బ మీద దెబ్బ కొడుతుండటంతో వాయిదాలు పడుతూనే వచ్చింది. అలా వాయిదాలు పడుతున్న ప్రతీసారి సినిమాను మరింత మెరుగ్గా దిద్దినట్టు కనిపిస్తోంది. డబ్బింగ్ పనులు కూడా ఈ మధ్యే ముగిశాయి. ఇక పూజా హెగ్డే తన పాత్రకు డబ్బింగ్ చెప్పుకోవడంతో ఆ ఎఫెక్ట్ కనిపిస్తోంది. ట్రైలర్‌ను బట్టి చూస్తే పూజా హెగ్డే, అఖిల్ మధ్య కెమిస్ట్రీ ఓ రేంజ్‌లో ఉండబోతోన్నట్టు కనిపిస్తోంది. ఇక ఈ చిత్రంలో చాలా మంది హీరోయిన్లు కనిపిస్తున్నారు. ఈషా రెబ్బా, ఫరియా అబ్దుల్లా వంటి వారు కూడా తళుక్కున మెరిశారు. పెళ్లి చూపుల వరకే ఆ తారలు ఉంటారా? లేదా వారితో కూడా ఏదైనా ట్రాక్‌ను దర్శకుడు బొమ్మరిల్లు భాస్కర్ నడిపిస్తాడేమో చూడాలి. ఇక ఈ చిత్రం అక్టోబర్ 15న విడుదల కాబోతోంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/39QyXRY
v

‘‘రిపబ్లిక్’ సినిమా చూశాను.. ఆ ప్రార్థనల ఫలితమే తిరిగొచ్చింది..’ హీరో నాని కామెంట్స్

హీరో హీరోగా దర్శకత్వంలో రూపొందించిన సినిమా ‘’. ఈ సినిమాలో సాయి ధరమ్ తేజ్ కలెక్టర్ పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాను జేబీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌, జీ స్టూడియోస్‌ పతాకాలపై భారీ రేంజ్‌లో భగవాన్, జె.పుల్లారావు నిర్మించారు. ఐశ్వర్య రాజేష్ హీరోయిన్‌గా నటించగా.. జగపతి బాబు, రమ్యకృష్ణ ముఖ్య పాత్రలు పోషించారు. ఇప్పటికే విడుదల చేసిన సాంగ్స్, పోస్టర్స్ సినిమాపై భారీ హైప్ క్రియేట్ చేశాయి. ఈ చిత్రాన్ని గాంధీ జ‌యంతి సంద‌ర్భంగా అక్టోబ‌ర్ 1న ప్రేక్షకుల ముందుకు తెస్తున్నారు. అయితే ఈ సినిమా విడుదలకు కొన్ని రోజుల ముందే సాయి ధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదానికి గురికావడంతో సినిమా విడుదల వాయిదాపడుతుంది అని అంతా భావించారు. సాయి ధరమ్ పూర్తిగా కోలుకొనే వరకూ సినిమాను విడుదల చేయరు అని అంతా అనుకున్నారు. కానీ అంచనాలను తారుమారు చేస్తూ.. సినిమాను అనుకున్న సమయానికి విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. మెగాస్టార్ చిరంజీవి ఈ సినిమా ట్రైలర్ విడుదల చేయగా.. సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్ ముఖ్య అతిథిగా హాజరు అయి సాయి ధరమ్ తేజ్‌కు తమ మద్దతు తెలిపారు. తాజాగా మరో టాలీవుడ్ హీరో కూడా ఈ సినిమాకు తన మద్దతు ఇచ్చారు. నాచురల్ స్టార్ ఈ సినిమాను ప్రత్యేక షో ద్వారా వీక్షించారు. అనంతరం ఆయన సినిమా గురించి ట్వీట్ చేశారు. ‘‘రిపబ్లిక్’ సినిమా చూశాను. సాయి ధరమ్ తేజ్ తన చుట్టు ఉన్నవారిపై ఎంత దయ చూపించేవాడో.. దాని వల్ల ఆయన గురించి చేసిన ప్రార్థనల ఫలితం మొత్తం ఈ సినిమా ద్వారా తిరిగి వచ్చింది. దేవ కట్టా ఇచ్చిన సాయి ధరమ్ తేజ్ కమ్‌బ్యాక్ ఈ సినిమా. చిత్ర యూనిట్ మొత్తానికి నా అభినందనలు’ అంటూ నాని ట్వీట్ చేశారు. ఇక సాయి ధరమ్ తేజ్ వేగంగా కోలుకుంటున్నారు అంటూ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ట్వీట్ చేశారు. ఆయన్ని రెండు రోజుల్లో కలుస్తాను అంటూ ఆయన పేర్కొనడంతో.. అభిమానులకు ఎంతో ఊరట లభించింది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3olj7r3
v

కావాల్సినంత ధైర్యాన్ని ఇస్తుందని ఆశిస్తున్నా.. చిరంజీవి ఎమోషనల్

మెగాస్టార్ తన మేనళ్లుడు రిపబ్లిక్ సినిమా గురించి బాగానే తాపత్రయపడుతున్నాడు. సాయి ధరమ్ తేజ్ బైక్ ప్రమాదం జరగడం, ఇంకా ఆస్పత్రిలోనే ఉన్నాడు. కొందరు కోమాలోనే ఉన్నాడని అంటే.. ఇంకొందరు అయితే మాట్లాడుతున్నాడు అని అంటున్నారు. అలా తేజూ ఆరోగ్య పరిస్థితి మీద గందరగోళాన్ని క్రియేట్ చేస్తున్నారు. సాయి ధరమ్ తేజ్ ప్రస్తుతం క్షేమంగానే ఉన్నాడని, త్వరగా కోలుకుంటున్నాడని నాగబాబు చెప్పేశాడు. అయితే సాయి ధరమ్ తేజ్ చిత్రం అక్టోబర్ 1న విడుదల కాబోతోంది. ఈ మేరకు ఇప్పటికే చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలను పూర్తి చేసేసింది. దర్శకుడు, హీరోయిన్ ఇలా అందరూ మీడియా ముందుకు వచ్చారు. మెగా హీరోలు కూడా సాధ్యమైనంత వరకు రిపబ్లిక్ చిత్రాన్ని ముందకు తీసుకెళ్తున్నారు. ఆల్రెడీ సెలెబ్రిటీలకు స్పెషల్ షో వేసినట్టు తెలుస్తోంది. తాజాగా చిరంజీవి రిపబ్లిక్ సినిమా గురించి ఓ పోస్ట్ పెట్టేశాడు. ‘సాయి ధరమ్ తేజ్ త్వరగా కోలుకుంటున్నాడు. అతడికి మీ అందరి ఆశీస్సులు రిపబ్లిక్ చిత్ర విజయం రూపంలో అందుతాయని ఆశిస్తూ, ఆ చిత్ర యూనిట్ అందరికీ నా శుభాకాంక్షలు. అలాగే కరోనా సెకండ్ వేవ్ బారినపడి కుదేలైన సినిమా ఎగ్జిబిషన్ సెక్టార్‌కి ‘రిపబ్లిక్’ చిత్ర విజయం కూడా కోలుకోవడానికి కావాల్సినంత ధైర్యాన్ని ఇస్తుందని ఆశిస్తున్నాను’ అని చెప్పుకొచ్చాడు. దేవాకట్టా దర్శకత్వంలో రాబోతోన్న ఈ చిత్రంలో రమ్యకృష్ణ, ఐశ్వర్యా రాజేష్ వంటివారు నటించారు. ఇప్పటికే వదిలిన ట్రైలర్ నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3ikCWep
v

సినీపరిశ్రమలో మరో విషాదం.. తన అపార్ట్‌మెంట్‌లో ఆత్మహత్య చేసుకున్న హీరోయిన్

గత ఏడాదిన్నర కాలంగా సినిమా, టీవీ పరిశ్రమల్లో వరుసగా విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. యువ హీరోలు, హీరోయిన్లు.. వివిధ కారణాల వల్ల ఈ లోకాన్ని విడిచి వెళ్తున్నారు. అయితే ఇందులో ఎక్కువశాతం మంది ఆత్మహత్య చేసుకొని ప్రాణాలు విడవటం తీవ్ర బాధకు గురి చేస్తోంది. తాజాగా కన్నడ సినీ పరిశ్రమలో కూడా ఇలాంటి విషాదకర ఘటనే చోటు చేసుకుంది. కన్నడ టీవీ నటి బెంగళూరులోని తన అపార్ట్‌మెంట్‌లో ఆత్మహత్య చేసుకుంది. కుంబల్గోడు ప్రాంతంలోని ఆమె అపార్ట్‌మెంట్‌లోనే ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఆమె చాలా సమయం వరకూ ఆమె తలుపు తెరుచుకోకపోవడంతో.. బలవంతంగా ఆమె అపార్డ్‌మెంట్ తలుపులు బద్దతుకొట్టి లోపలికి వెళ్లిన వారికి ఆమె విగతజీవిగా కనిపించింది. దీంతో పాటు ఆమె రాసిన నాలుగు పేజీల.. సూసైడ్ నోట్ కూడా దొరికింది. అయితే ఆమె రాసిన సూసైడ్ నోట్‌లో తన చావుకి ఎవరు కారణం కారు అని.. వ్యక్తిగత కారణాల వల్లే తాను ఆత్మహత్య చేసుకున్నట్లు పేర్కొంది. ఇంగ్లీష్, కన్నడ భాషల్లో రాసిన సూసైడ్ నోట్ ద్వారా పోలీసులు ప్రాధమిక విచారణ ప్రారంభించారు. ఆమె తోటి నటీనటులు, కుటుంబ సభ్యులను వాళ్లు విచారిస్తున్నారు. ముఖ్యంగా తన కుటుంబసభ్యులను ‘క్షమించండి’ అంటూ ఆమె సూసైడ్ నోట్‌లో కోరడంతో మరింత చర్చనీయాంశం అయింది. అంతేకాక.. ఆమెకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవని.. మానసికంగానే ఆమెకు కొన్ని సమస్యలు ఉన్నాయి అంటూ తెలిసింది. సౌజన్య పలు కన్నడ సీరియల్స్‌తో పాటు సినిమాల్లో కూడా నటించింది. ఆమె మరణం ఇప్పుడు కన్నడ చిత్ర పరిశ్రమలో చర్చనీయాంశంగా మారింది. ఓవైపు పోలీసులు ఈ కేసుపై క్షుణ్ణంగా విచారణ చేస్తుండగా.. అభిమానులు, తోటి కళాకారులు సౌజన్య ఆత్మకు శాంతి చేకూరాలని కామెంట్ చేస్తున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/39Yh83r
v

స్టార్ హీరోతో నటించనున్న కియారా.. తెలుగుతో పాటు.. తమిళ ఆడియన్స్‌ని ఫిదా చేసేందుకు రెడీ!

తెలుగులో సినిమాలు చేసి.. ఇక్కడ సరైన అవకాశాలు లభించకపోవడంతో చాలా మంది హీరోయిన్లు బాలీవుడ్ బాటపడుతుంటారు. అయితే కొందరికి అక్కడ మంచి సక్సెస్ లభించడంతో బాలీవుడ్‌లో సెటిల్ అవుతారు. కానీ, కొందరు మాత్రం అక్కడ సినిమాలు చేస్తూనే మళ్లీ తెలుగు లేదా ఇతర దక్షిణ ఇండస్ట్రీల్లో అవకాశాలు కోసం చూస్తుంటారు. రీసెంట్‌గానే తాప్సీ.. ఇదే పని చేసింది. ఓవైపు బాలీవుడ్‌లో సినిమాలు చేస్తూనే.. తమిళంలో సేతుపతితో కలిసి ఓ సినిమాలో నటించింది. ఇక నటి కూడా ఇదే బాటలోకి వచ్చింది. ఇప్పటికే తెలుగులో ‘భరత్ అనే నేను’, ‘వినయ విధేయ రామా’ సినిమాల్లో నటించింది. కానీ, బాలీవుడ్‌ నుంచి ఎక్కువగా అవకాశాలు రావడంతో అక్కడకు చెక్కేసింది ఈ భామ. అయితే ఇప్పుడు మళ్లీ దక్షిణాది ఇండస్ట్రీపైపు అడుగులు వేస్తోంది కియారా. రామ్ చరణ్ హీరోగా, సెన్సేషనల్ దర్శకుడు శంకర్ రూపొందిస్తున్న సినిమాలో ఇప్పటికే హీరోయిన్‌గా కియారాను ఫిక్స్ చేసింది. అయితే ఇప్పుడు మరో స్టార్ హీరోతో నటించి.. ఇటు తెలుగు అటు తమిళ ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అయింది కియారా. వంశీ పైడిపల్లి, దళపతి విజయ్, దిల్ రాజు కాంబినేషన్‌లో త్వరలో ఓ సినిమా రూపొందతున్న విషయం తెలిసిందే. ‘మహర్షి’ సినిమా తర్వాత మహేష్‌ బాబుతో కలిసి మరో సినిమా చేయాలని భావించారు. అయితే డేట్స్ కుదరకపోవడంతో అదే కథని.. విజయ్‌కి తగ్గట్లుగా మార్పులు చేసి.. సినిమా తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. అయితే ఈ సినిమా కోసం దర్శకుడు వంశీ పైడిపల్లి స్టార్ హీరోయిన్‌ను సెలెక్ట్ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. కియారా అడ్వాణీనే ఈ సినిమాలో హీరోయిన్‌గా ఎంపిక చేశారట దర్శకుడు వంశీ పైడిపల్లి. అయితే ఇటు తెలుగుతో పాటు అటు తమిళంలో కూడా మంచి గుర్తింపు వచ్చే అవకాశం ఉండటంతో కియారా కూడా ఈ సినిమాకు వెంటనే ఓకే చెప్పినట్లు సమాచారం. త్వరలోనే దీనిపై అధికారికంగా ప్రకటన వెలువడే అవకాశం ఉంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3uoAPeq
v

నా ఊపిరి పోయేంత వరకు వారితోనే ఉంటా.. మెగా బ్రదర్ నాగబాబు కామెంట్స్ వైలర్

మెగా బ్రదర్ నాగబాబు సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటారో అందరికీ తెలిసిందే. నాగబాబు వేసే కౌంటర్లకు మీమర్లు సైతం షాక్ అవుతుంటారు. అలా నాగబాబు తనలో నిద్రపోతోన్న మీమర్‌ను అప్పుడప్పుడూ పైకి లేపుతుంటాడు. తనలో ఉన్న ఆ కోరిక, ఆశే మీమర్లను సైతం కలిసేలా చేసింది. వారిని స్పెషల్‌గా ఇంటికి పిలిపించుకుని మరీ ముచ్చటించాడు. లైవ్‌లోనూ వారితో మాట్లాడాడు. తాజాగా నాగబాబు తన ఇన్ స్టాలో క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ సెషన్ పెట్టేశాడు. దానిలో భాగంగా నాగబాబు తన మేధాశక్తికి పదును పెట్టేశాడు. అందరికీ కౌంటర్ల మీద కౌంటర్లు వేశాడు. ఇక పోసాని చేసిన కామెంట్ల మీదా తన స్టైల్లో స్పందించారు. గురించి గతంలో పోసాని చెప్పిన మంచి విషయాలు, గొప్పగా మాట్లాడిన వీడియోలను షేర్ చేశాడు. అలా నెటిజన్లు రకరకాల వివాదాలపై నాగబాబును ప్రశ్నలు అడిగారు. ఇక ఓ నెటిజన్ అయితే ఏకంగా పాలిటిక్స్ మీద ఇంట్రెస్ట్ లేదంటే ఎలా మాస్టారు? ప్రజలకు ఎలా సేవ చేస్తారు? అని అడిగాడు. దానికి నాగబాబు తన స్టైల్లో సమాధానం ఇచ్చాడు. తన సోదరుల మీదున్న ప్రేమను అందరికీ తెలిసేలా చేశాడు. ‘అంటే పాలిటిక్స్‌లో ఉండేనే ప్రజలకు సేవా చేయాలి.. లేదంటే చేయకుండా ఉండాలి అంతేగా. అరరే పెద్ద సమస్యే వచ్చిందే.. ఈ విషయం తెలియక చాలా పొరపాటు చేశానే. జోకులు పక్కన పెడితే.. నా ఊపిరి ఉన్నంత వరకు నేను సోదరులతోనే ఉంటాను. వారి ఆశయాలతో నాకు సంబంధం లేకుండా నేను వారితో ఉంటాను.. మద్దతు తెలుపుతాను. పొలిటికల్‌గా కాకుండా నా చేతనైన సహాయం కష్టాల్లో ఉన్న వాళ్లకి చేస్తాను’ అని అన్నాడు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3F8ikQ6
v

బికినీ ఫోటో షేర్ చేయమన్న నెటిజన్.. దిమ్మతిరిగే ఆన్సర్ ఇచ్చిన అనుపమ

కేరళ బ్యూటీ పరమేశ్వరన్ తెలుగు ప్రేక్షకులకు బాగానే దగ్గరైంది. అ ఆ, శతమానంభవతి వంటి చిత్రాలతో అందరినీ కట్టిపడేసింది. హోమ్లీ పాత్రలకు కేరాఫ్ అడ్రస్‌గా అనుపమ మారిపోయింది. అనుపమ ఎప్పుడూ కూడా అందాల ప్రదర్శకు చాన్స్ ఇవ్వదు. చీరకట్టులో కనిపించే అనుపమ.. అప్పుడప్పుడు మోడ్రన్ దుస్తుల్లోనూ మెరుస్తుంటుంది. కానీ ఎప్పుడూ కూడా తన శరీర భాగాలను ప్రదర్శించదు. అలా అనుపమ కట్టూబొట్టూ అంటే అభిమానులకు ఎంతో ఇష్టం. అయితే అనుపమ చీరకట్టుకు ఎంతో మంది ఫ్యాన్స్ ఉంటారు. ఇక అనుపమ తన అభిమానుల కోసం ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గానే ఉంటుంది. ఇక ఆమె పెట్టే క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ ఎప్పుడూ కూడా హాట్ టాపిక్ అవుతుంటుంది. తాజాగా ఆమె అలాంటి ఓ సెషనే ఇన్ స్టాలో పెట్టేసింది. అందులో నెటిజన్లు రకరకాల ప్రశ్నలు సంధించారు. అయితే అందులో దాదాపు రెగ్యులర్ క్వశ్చన్స్ ఉన్నాయి. తెలుగులో చేస్తోన్న ప్రాజెక్ట్‌లు ఏంటి? కొత్త సినిమాలు ఏంటి? ఏం ఇష్టం.. ఏం చేస్తున్నారు.. తమిళం, తెలుగులో మాట్లాడండి అని ఇలా రకరకాలుగా నెటిజన్లు ప్రశ్నలు సంధించారు. అయితే ఓ నెటిజన్ మాత్రం చిరాకు తెప్పించినట్టున్నాడు. బికినీలో ఉన్న ఫోటోను పంపు అని అడిగేశాడు. దీనికి అనుపమ అదిరిపోయే కౌంటర్ ఇచ్చింది. బికినీలో ఉన్న ఫోటో కావాలా? నీ అడ్రస్ పంపు.. నేను ఫోటోను పంపుతా.. ఇంట్లో ఫ్రేమ్ కట్టించుకో అని కౌంటర్లు వేసింది. మొత్తానికి అనుపమ ఆ ప్రశ్న ఎదురవ్వడంతో అసహనానికి ఫీలైనట్టు కనిపిస్తోంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3DejSqn
v

జనసేన.. పావలా గాడు అంటూ శ్రీ రెడ్డి షాకింగ్ కామెంట్స్.. ఉరేసుకుంటావో, చస్తావో నీ ఇష్టం! అటాక్

అనే పేరు వింటేనే అంతెత్తున లేచే శ్రీ రెడ్డి.. మరోసారి సంచలన వ్యాఖ్యలతో దుమారం రేపింది. వైసీపీ కార్యకర్త, సినీ రచయిత, నటుడు పోసాని కృష్ణ మురళి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నడుమ మాటల తూటాలు పేలుతున్న ఈ సమయంలో సంచలన తార రంగంలోకి దిగింది. గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాకు కాస్త బ్రేక్ ఇచ్చి దూరంగా ఉంటున్న ఆమె.. తాజాగా ఓ వీడియో పోస్ట్ చేసి నెట్టింట వీరంగం సృష్టించింది. ఈ వీడియోలో శ్రీ రెడ్డి మాట్లాడుతూ.. ''ఈ పావలా గాడికి ఏం ప్యాకేజ్ అందిందో తెలియదు గానీ.. ప్రతిసారి ఎనకాల జనసేన గుర్తు వేసుకొని ఓ సభ లాంటిది పెట్టి.. ఒక నలుగురు ఆడ పిల్లలను ముందు సీట్లలో కుర్చోబెట్టుకొని, పది మంది ఈలలు వేసే బ్యాచులను డబ్బులిచ్చి పిలిపించుకొని... నీ వెనకాల తెలంగాణాలో ఓ యూనివర్సిటీలో నువ్వు ఎవ్వరిని పోషిస్తున్నావో, ఏ అల్లరి మూకని, చిల్లర మూకని నువ్వు పోగుచేసి బ్లాక్ మెయిల్ చేయడానికి మెయిన్‌టైన్ చేస్తున్నావో ఆ గ్రూపులను వాళ్ళ పేర్లతో సహా నేను బయటపెడతా. నువ్వు చిల్లర మూకలతో ఎలా అయితే దాడులు చేపిస్తున్నావో అవి మేము చేయించలేమా? అలాంటివి మేము చేయించాలంటే పెద్ద విషయమా? కోడి కత్తులంటావు కాసేపు.. వేల కోట్లంటావు కాసేపు.. వీటన్నింటికీ ప్రెస్ మీట్ పెట్టి మరీ సమాధానం చెబుతా. ఆ ప్రెస్ మీట్ చూసుకొని ఉరేసుకుంటావో, చస్తావో.. ఏం చేసుకుంటావో చేసుకో'' అని చెప్పింది. దీంతో శ్రీ రెడ్డి పెట్టిన ఈ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. పవన్ ఫ్యాన్స్, వైసీపీ కార్యకర్తలు రంగంలోకి దిగి కామెంట్ల రూపంలో వాదోపవాదాలు చేసుకుంటున్నారు. మరోవైపు పోసాని కృష్ణ మురళి ఇంటిపై గత అర్ధ రాత్రి వేళ గుర్తు తెలియని వ్యక్తుల దాడి సినీ, రాజకీయ వర్గాల్లో కలకలం సృష్టించింది. అయితే ఈ దాడి చేసింది పవన్ అభిమానులే అని, ఇలాంటి దాడులకు భయపడేది లేదని పేర్కొంటూ పోసాని స్ట్రాంగ్ రియాక్షన్ ఇచ్చారు. పవన్‌పై కూడా ఇలాంటి దాడులు చేయించడం పెద్ద విషయం కాదంటూ మరోసారి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3zPDzm4
v

మొదటి సినిమాకు అంతే.. జానీకి అలా.. అల్లు అరవింద్‌పై పవన్ కళ్యాణ్ సంచలన కామెంట్స్

పవర్ స్టార్ రెమ్యూనరేషన్ గురించి గత కొన్ని రోజులుగా వార్తలు వస్తూనే ఉన్నాయి. రిపబ్లిక్ ఈవెంట్‌లో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. ఒకరికి పది కోట్లు రెమ్యూనరేషన్ ఇచ్చారనుకోండి అంటూ అనేశాడు. అందులో ట్యాక్సులు కూడా పోతాయంటూ ఏదో లెక్కలు చెప్పేశాడు. అయితే తాజాగా పవన్ కళ్యాణ్ రెమ్యూనరేషన్ గురించి హాట్ టాపిక్ అవుతోంది. ఇక పోసాని మురళికృష్ణ చేసిన కామెంట్లు కూడా నెట్టింట్లో హాట్ టాపిక్ అవుతున్నాయి. యాభై కోట్లు అంటూ పోసాని అసలు విషయం చెప్పేశాడు. అయితే యాభై కోట్లు తీసుకుంటాడు అంటూ.. నిర్మాతల వ్యవహారంలోకి దూరుతాడు అంటూ పవన్ కళ్యాణ్ మీద పోసాని కామెంట్లు చేశాడు. అయితే తాజాగా పవన్ కళ్యాణ్ కూడా తన రెమ్యూనరేషన్‌ల గురించి మాట్లాడుతూ అసలు విషయం చెప్పుకొచ్చాడు. తన మొదటి చిత్రం అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమాకు సంబంధించిన రెమ్యూనరేషన్ గురించి తెలిపాడు. ఆన్ లైన్ టిక్కెటింగ్ వ్యవహారం తాను మాట్లాడితే తనకు ఏం లాభం రాదు అని తాను మాట్లాడింది నిర్మాత, థియేటర్ల ఓనర్ల కోసమే అని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశాడు. అయితే తాజాగా పవన్ కళ్యాణ్ తన ప్రసంగంలో గురించి చెప్పేశాడు. అక్కడ అమ్మాయి ఇక్కడ అమ్మాయి సినిమాకు నెలకు ఐదు వేల రూపాయలు ఇచ్చాడు.. సినిమాకు నష్టం రావడంతో మొత్తం తిరిగి ఇచ్చేశాను.. పైగా నాకు పదిహేను లక్షల నష్టం వచ్చింది అంటూ పవన్ కళ్యాణ్ అసలు విషయం చెప్పేశాడు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3mbjZff
v

అఖిల్ సినిమాపై ఆసక్తి రేపుతున్న మరో అప్‌డేట్.. తొలిసారిగా అలాంటి పాత్రలో పూజా

‘’.. సినిమాతో ఎలాగైనా హిట్ ట్రాక్ ఎక్కేయాలని కుతూహలంగా ఉన్నాడు అక్కినేని వారసుడు అఖిల్. ఈ మేరకు యంగ్ హీరోయిన్ పూజా హెగ్డేతో జతకలిసి ఈ సినిమాకు సంబంధించిన రొమాంటిక్ అప్‌డేట్స్ ఇస్తూ అట్రాక్ట్ చేస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే కొద్ది రోజుల క్రితమే ఈ మూవీ నుంచి విడుదల అయిన ‘లెహరాయి’ లిరికల్ సాంగ్‌ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఈ పాటలో అఖిల్, పూజా హెగ్డేల మధ్య కెమిస్ట్రీ హైలైట్‌గా నిలిచింది. అయితే తాజాగా ఈ సినిమా ట్రైలర్ గురించి కూడా అప్‌డేట్ వచ్చింది. ఈ సినిమా ట్రైలర్‌ను గురువారం సాయంత్రం 6.10 గంటలకు విడుదల అవుతుందంటూ చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. అయితే ఈ సినిమా నుంచి లేటెస్ట్‌గా ఓ విషయం వైరల్ అవుతోంది. అదేంటంటే.. సినిమాలో పాత్రకు సంబంధించిన వార్త. ఈ సినిమాలో పూజా వర్క్ ఎలా ఉంది తన రోల్ ఏంటి? ఎలా కష్టపడింది అన్న వాటిపై అఖిల్ మరియు దర్శకుడు లేటెస్ట్ ఇంటర్వ్యూలో తెలిపారు. పూజా ఈ సినిమాలో ఒక స్టాండప్ కమెడియన్ రోల్‌లో కనిపిస్తుందని భాస్కర్ తెలిపారు. అయితే ఆమె.. ఎంతో వర్క్ విషయంలో చాలా ఏకాగ్రతతో ఉంటుంది అని.. మనస్పూర్తిగా ఈ సినిమాలో ఆమె నటించింది అంటూ అఖిల్.. పూజాపై ప్రశంసల వర్షం కురిపించారు. ఇక ఈ సినిమా విషయానికొస్తే.. రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఈ 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్' సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. జీఏ2 పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై మెగా నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఇప్పటిదాకా చూపించని డిఫరెంట్ పాయింట్ టచ్ చేస్తున్నారని టాక్. ఈ సినిమా సంక్రాంతి కానుకగా.. వచ్చే ఏడాది 2021, జనవరి 14వ తేదీన విడుదల కానుంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3zVWuf8
v

పిల్లల్నికనే ప్లాన్‌లో సమంత-నాగ చైతన్య.. రూమర్లకు చెక్ పెడుతూ కీలక నిర్ణయం!!

హీరో నాగ చైతన్య, హీరోయిన్ సమంత గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ‘ఏం మాయ చేశావే’ అనే సినిమాతో తెలుగు ప్రేక్షకులను అలరించిన ఈ జంట.. ఆ సినిమాతోనే ప్రేమలో పడ్డారు. ఇక చాలాకాలం ప్రేమలో మునిగి తేలిన వీళ్లు.. 2017లో వివాహ బంధంతో ఒకటయ్యారు. ఆ తర్వాత కూడా వాళ్లిద్దరు జంటగా పలు సినిమాల్లో నటించి.. ప్రేక్షకులను అలరించారు. అయితే గత కొంతకాలంగా మాత్రం వీరిపై విపరీతంగా రూమర్లు పుట్టుకొచ్చాయి. కొంతకాలం క్రితం సమంత తన సోషల్‌మీడియా ఖాతాల్లోంచి ‘అక్కినేని’ అనే పదాన్ని తొలగించి కేవలం ‘ఎస్’ అనే అక్షరాన్ని పెట్టుకుంది. దీంతో సమంత, నాగ చైతన్యలు విడాకులు తీసుకుంటున్నారు అంటూ వార్తలు పుట్టుకొచ్చాయి. ఇక ఇటీవల విడుదల అయిన నాగ చైతన్య సినిమా ‘లవ్‌స్టోరి’ సినిమా ప్రీ రిలీజ్, సక్సెస్ వేడుకలకు సమంత హాజరు కాకపోవడంతో.. ఈ వార్తలకు మరింత ఊతాన్నిచ్చాయి. అంతేకాక.. సమంత, చైతన్యకు విడాకులు ఇచ్చి.. ముంబైకి షిఫ్ట్ అవుతుంది అని కూడా పుకార్లు పుట్టుకొచ్చాయి. అయితే దీనిపై సమంత కొద్ది రోజుల క్రితం సమంత క్లారిటీ ఇచ్చింది. హైదరాబాద్ తనకు ఇళ్లు వంటిది అని.. దాన్ని వదిలి ఎక్కడకు వెళ్లను అంటూ అంటూ ఆమె స్పష్టం చేసింది. తాజాగా వీరిద్దరికి సంబంధించి మరో వార్త సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది. పెళ్లి జరిగిన నాలుగు సంవత్సరాలు అవుతన్నా.. పిల్లల విషయంలో ఈ జంట ముందడుగు వేయలేదు. కానీ, ఇప్పుడు తమ జీవితంలో మరో అడుగు ముందడుగు వేస్తూ.. పిల్లలను కనాలని ఈ జంట నిర్ణయం తీసుకున్నట్లు సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది. ప్రస్తుతం చైతన్య, సమంతలు వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. కానీ, తన సినిమాలకు బ్రేక్ ఇచ్చి.. శామ్.. తన భర్తతో సంసారం చేసేందుకు సమంత ఇతర సినిమాలు ఒప్పుకోవడం లేదు అని టాక్ వినిపిస్తోంది. అందుకే ప్రస్తుతం వస్తున్న రూమర్ల గురించి మాట్లాడకుండా.. మంచి శుభవార్తతో ప్రేక్షకులకు తమ సంబంధం గురించి క్లారిటీ ఇవ్వాలని చైతన్య, సమంత జంట భావిస్తున్నారట. అందుకే ఇప్పుడు ఈ విషయంపై వాళ్లు నోరు మెదపడం లేదు అని తెలుస్తోంది. మొత్తనికి సమంత, చైతన్యల విడాకుల వ్యవహరంపై వస్తున్న వార్తలకు ఈ వార్త చెక్ పెట్టినట్లే తెలుస్తోంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3F2Qu87
v

పవన్ కళ్యాణ్‌ని చెప్పుతో కొట్టగలను.. మహా అయితే చంపుతారు అంతే కదా! రాళ్లదాడి అనంతరం పోసాని రియాక్షన్

హైదరాబాద్ అమీర్ పేట్‌లోని ఎల్లారెడ్డిగూడలో ఇంటిపై గుర్తుతెలియని వ్యక్తులు రాళ్లదాడికి పాల్పడటం కలకలం సృష్టించింది. నిన్న (బుధవారం) అర్ధరాత్రి సమయంలో కొందరు ఆయన ఇంటిపై రాళ్లు విసిరారు. పోసానిని దుర్భాషలాడుతూ రెచ్చిపోయారు. పోసాని Vs పవన్ కళ్యాణ్ మాటల యుద్ధం నడుస్తున్న ఈ తరుణంలో పోసాని ఇంటిపై రాళ్ళ దాడి జరగడం సినీ, రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారింది. ప్రస్తుతం దీనిపై పోలీసుల విచారణ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ దాడిపై పోసాని రియాక్ట్ అవుతూ తన ఇంటిపై రాళ్లదాడి చేసింది పవన్‌ కళ్యాణ్ అభిమానులేనని ఆరోపించారు. ఏం జరిగినా తనకైతే ఎలాంటి భయం లేదని అన్నారు. ''నాకు నచ్చిన నాయకుడు జగన్‌మోహన్‌రెడ్డి గారు.. నేను చచ్చిపోయే వరకు జగన్ తోనే ఉంటా. గొప్ప ప్రజాసేవకుడైన జగన్ గారిని అరేయ్, ఒరేయ్ అనడం సరికాదు. పవన్ కళ్యాణ్‌వి మొదటి నుంచి సైకో బుద్ధులే. ఆయన ఎవ్వరినైనా ఏమైనా అనొచ్చు కానీ ఆయన్ను మాత్రం ఎవ్వరూ ఏమనకూడదు. తన సినిమా షూటింగుల్లో కూడా ఆవేశానికి లోనై అందరికీ కొట్టడం పవన్‌కి అలవాటు. మొదటినుంచి ఆయనది రెచ్చగొట్టే ధోరణి. ఇలాంటోడు రాజకీయాలకు పనికిరాడు. నాయకుడు ఎలా ఉంటాడో కార్యకర్తలు కూడా అలాగే ఉంటారు. నాకు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎవ్వరితో శత్రుత్వం లేదు. నేనెప్పుడూ ఎవ్వరినీ మోసం చేయలేదు. ఇప్పుడు పవన్‌ని ప్రశ్నించాను కాబట్టి శత్రువు అయ్యాడు. నేను ఒక ఓటరుగా మాట్లాడుతున్నా. ఆయన భాషలో చెప్పాలంటే నేను ఇలాంటి సన్నాసులను చాలామందిని చూశా. ఇలాంటి దాడులు, బెదిరింపుల వల్ల మా మోరల్స్ ఎక్కడికీ పోవు. నేనింకా స్ట్రాంగ్ అవుతా. ఇలా రాళ్ల దాడులకు భయపడను. ఇలాంటి దాడులు నేను పవన్‌పై చేయలేనా? నాకు ఎవ్వడూ అక్కర్లే.. పవన్ కళ్యాణ్‌ని చెప్పుతో కొట్టగలను. మహా అయితే ఏం చేస్తారు చంపుతారు అంతే కదా. రాజకీయాలకు, నా పెళ్ళానికి ఏంటి సంబంధం.. నీకు పెళ్ళాం ఉంది. నీకు అమ్మ ఉంది.. ఇదే మాటలు నేను అంటే ఎలా ఉంటుంది'' అంటూ ఓ రేంజ్‌లో ఫైర్ అయ్యారు పోసాని కృష్ణ మురళి.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3CTjRrm
v

అమీర్ ఖాన్ సెంటిమెంట్‌కు అనుకోని బ్రేక్.. ఆ కారణంగానే ‘లాల్ సింగ్ చద్ధా’ వాయిదా..

బాలీవుడ్ మిస్టర్ పర్‌ఫెక్ట్ సినిమాలు అంటేనే అందులో ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది. సినిమాలో ఆయనకు ఇచ్చిన పాత్రకి తగినట్లు కనిపించేందుకు ఆయన ఎలాంటి సాహసం చేసేందుకు కూడా సిద్ధంగా ఉంటారు. ఒక సినిమా కోసం ఆయన సిక్స్ ప్యాక్ బాడీ చేస్తారు.. మరోసారి పొట్ట పెంచేస్తారు. ఇలా ఆయన సినిమా కోసం పడే కష్టం చూసే ఆయన్ను మిస్టర్ పర్‌ఫెక్ట్ అని అభిమానులు పిలుస్తారు. అయితే అమీర్ ఖాన్‌ను హీరోగా వెండితెరపై చూసి చాలాకాలమే అయింది. దీంతో ఆయన సినిమా ఎప్పుడు విడుదల అవుతుందా అని అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం ఆయన అద్వైత్ చందన్ దర్శకత్వంలో నటిస్తున్న కామెడీ డ్రామా చిత్రం ‘’. ఈ సినిమాలో ఆయన ప్రధాన పాత్రలో నటిస్తూనే నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నారు. 1994లో విడుదలైన ‘ఫారెస్ట్ గంప్’ అనే సినిమా ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించారు. ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తుండగా.. నాగ చైతన్య ఓ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన కొన్ని అప్‌డేట్స్, వర్కింగ్ స్టిల్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ సినిమా విడుదల తేదీపై చిత్ర నిర్మాతలు క్లారిటీ ఇచ్చారు. కరోనా సెకండ్ వేవ్ తర్వాత ఇప్పటివరకూ మహారాష్ట్రలో థియేటర్లు తెరుచుకోలేదు. అయితే పరిస్థితులు మెరుగుకావడంతో వచ్చే నెల నుంచి థియేటర్లను తెరుస్తున్నట్లు మహా సర్కారు ప్రకటించింది. అయితే తొలుత ‘లాల్ సింగ్ చద్ధా’ సినిమాను ఈ ఏడాది క్రిస్మస్ కానుకగా విడుదల చేయాలని చిత్ర యూనిట్ భావించింది. అమీర్ ఖాన్‌ సెంటిమెంట్ కూడా కావడంతో డిసెంబర్ 22న విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. కానీ అదే సమయానికి ‘83’, ‘జెర్సీ’, ‘సర్కస్’ వంటి సినిమాలు విడుదల అవుతుండటంతో.. తమ సినిమాను వచ్చే ఏడాది ప్రేమికుల దినోత్సవం కానుక విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. నిర్మాతల మధ్య స్నేహపూర్వక వాతావరణం ఉండాలనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3CTevMS
v

ఓయో రూమ్‌లో విష్ణు ప్రియ.. సంతృత్తి చెందానంటూ పోస్ట్! యంగ్ యాంకర్ అదిరిపోయే ఆఫర్

ఈ రోజుల్లో బుల్లితెర యాంకర్స్ హవా మరింత పెరిగింది. హీరోయిన్లను మించి అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు బుల్లితెర బ్యూటీలు. వెండితెరపై హీరోయిన్లు ఏ రేంజ్ పర్ఫార్మెన్స్ అయితే ఇస్తున్నారో.. అంతకుమించి అన్నట్లుగా దూసుకుపోతున్నారు నేటితరం బుల్లితెర యాంకర్లు. షో హోస్ట్ చేయడంలో ఎవరికి వారు ప్రత్యేకత చాటుకుంటూ అందాలతో అట్రాక్ట్ చేస్తుండటమే గాక సోషల్ మీడియాలో తెగ హంగామా చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా యంగ్ యాంకర్ విష్ణు ప్రియ పెట్టిన ఓ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది. ఏకంగా గురించి మాట్లాడుతూ తన ఫేస్‌బుక్ ఖాతాలో పోస్ట్ పెట్టింది విష్ణు ప్రియ. తాను పాల్గొనబోతున్న షూటింగ్ కాస్త లేట్ అవుతుందని తెలియడంతో ఓయో రూమ్ తీసుకొని అక్కడ సేద తీరానని చెప్పిన విష్ణు ప్రియ.. ఓయో రూమ్స్ చాలా సౌకర్యవంతంగా ఉన్నాయని చెప్పింది. ఫుల్లుగా సంతృత్తి చెందానని పేర్కొంది. తన బిజీ షెడ్యూల్‌లో ఓయోలో టైమ్ స్పెండ్ చేయడం ఓ అద్భుతమైన అనుభవం అని, ఓయో రూమ్స్ చాలా సేఫ్ అండ్ సెక్యూర్ అని తెలిపింది. ఈ మేరకు ఓయో యాప్ డౌన్‌లోడ్ చేసుకొని క్రెటా కార్ గెలుచుకునే అవకాశం దక్కించుకోండి అని పేర్కొన్న విష్ణు ప్రియ.. ఓయో రూమ్‌లో డిస్కౌంట్ కోసం ఓ కోడ్ కూడా పోస్ట్ చేస్తూ ఆఫర్ ఇచ్చింది. ఇది ఒకరకంగా ప్రమోషన్ అనుకోవచ్చు, మరోరకంగా విష్ణు ప్రియ ఫీలింగ్స్అనుకోవచ్చు. ఎలాగైతేనేం ఆమె పెట్టిన ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది. బుల్లితెర యాంకర్స్ లిస్ట్‌లో ఒకరిగా దూసుకుపోతున్న విష్ణు ప్రియ.. సోషల్ మీడియా వేదికగా అందాలు ఆరబోస్తూ యువతకు స్పెషల్ కిక్కిస్తోంది. ఆమె చేస్తున్న డాన్స్ వీడియోలు, పోస్ట్ చేస్తున్న హాట్ ఫొటోస్ ఎప్పటికప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. అదే సమయంలో సినిమాలలో వస్తున్న ఆఫర్స్ కాదనకుండా గ్రీన్ సిగ్నల్స్ ఇస్తోంది విష్ణు ప్రియ.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3zUmo2O
v

పోసాని దంపతులపై బండ బూతులు.. దొరికితే చంపేస్తాం అంటూ బెదిరింపులు.. కీలక విషయాలు చెప్పిన వాచ్‌మెన్

సినీ రచయిత, వైసీపీ కార్యకర్త పోసాని కృష్ణ మురళి- జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మధ్య మాటల యుద్ధం నడుస్తున్న సంగతి తెలిసిందే. రిపబ్లిక్ సినిమా ప్రీ రిలీజ్ వేదికపై పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలతో మొదలైన రచ్చ అంతకంతకూ పెరుగుతూ వస్తోంది. రెండు సార్లు ప్రెస్ మీట్ పెట్టి మరీ పవన్ వ్యాఖ్యలపై మండిపడ్డారు పోసాని. దీంతో క్రమంగా ఈ ఇష్యూ వ్యక్తిగత దూషణ వరకు వెళ్లింది. తన భార్యాపిల్లలను లాగుతూ పవన్ ఫ్యాన్స్ ఇష్టారీతిలో కామెంట్స్ చేస్తున్నారని పోసాని ఆరోపిస్తున్న తరుణంలో ఆయన ఇంటిపై కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేయడం కలకలం సృష్టిస్తోంది. హైదరాబాద్ అమీర్‌పేటలోని ఎల్లారెడ్డి గూడలో ఉన్న పోసాని ఇంటిపై కొందరు దాడికి పాల్పడ్డారు. నిన్న అర్ధరాత్రి సమయంలో ఆయన ఇంటిపై రాళ్లు, ఇటుకలు విసిరారు. పోసాని దంపతులను బండ బూతులు తిడుతూ పోసాని ఇంటి పరిసరాల్లో తిరిగారు. ఈ విషయాన్ని పోసాని ఉంటున్న ఇంటి వాచ్‌మెన్ చెప్పారు. వారిని చూసి భయంతో తాము బయటకు రాలేదని వాచ్‌మెన్ తెలిపారు. పోసాని కృష్ణమురళి ఇంట్లో గత పదేళ్లుగా పని చేస్తున్నామని, అయితే పోసాని దంపతులు గత 8 నెలలుగా ఇక్కడ ఉండటం లేదని వాచ్‌మెన్ చెప్పారు. తాము తెలిసిన వాళ్ళం కావడంతో ఇల్లు ఈ అప్పజెప్పి వాళ్ళు వేరే చోట ఉంటున్నారని, అప్పటినుంచి తామే వాచ్‌మెన్‌గా పని చేస్తున్నట్లు చెప్పారు. ఏనాడు ఏ భయం లేదు గానీ మొన్న రాత్రి కొందరు వ్యక్తులు పోసానిని బూతులు తిట్టుకుంటూ వెళ్లారని, నిన్న రాత్రి రాళ్ళ దాడికి పాల్పడటంతో కొడతారేమో అని భయమేసి తాము ఇంట్లో నుంచి బయటకు రాలేదని అన్నారు. పోసాని ఎక్కడ దొరికినా కొడతాం, చంపేస్తాం అంటూ గట్టిగా అరిచారని, భార్యాభర్తలిద్దరినీ పచ్చి బూతులు తిట్టారని వాచ్‌మెన్ మీడియాతో చెప్పారు. నైట్ మొత్తం బండ్లపై అటూఇటూ తిరుగుతూ దాడికి పాల్పడరని అన్నారు. కాగా ఓ ఏడెనిమిది మంది వరకు దాడికి పాల్పడినట్టు తెలుస్తోంది. దీనిపై పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3m9cohb
v

పుష్ప సినిమా గురించి వైరల్ అవుతున్న ఇంట్రెస్టింగ్ వార్త.. పార్ట్-1లో విలన్ ఫహాద్ కాదట?

తెలుగు ప్రేక్షకులు మాత్రమే కాదు.. యావత్ భారత దేశ సినీ అభిమానులు ఎప్పుడు చూద్దామా అని ఎదురుచూస్తున్న సినిమాల్లో ‘’ ఒకటి. హీరోగా.. సుకుమార్ దర్శకత్వంలో ఎర్ర చందనం స్మగ్లింగ్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా రూపొందింది. వీరిద్దరి కాంబినేషన్‌లో వస్తున్న హ్యాట్రిక్ చిత్రం ఇది కావడం మరో విశేషం. భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా నుంచి ఇప్పటివరకూ వచ్చిన అప్‌డేట్స్ అన్ని అంచనాలను భారీగా పెంచాయి. ఇక సినిమా టీజర్, తొలి సింగిల్ అన్ని సోషల్‌మీడియాలో రికార్డులు బద్దలు కొట్టాయి. రీసెంట్‌గా ఈ సినిమా నుంచి హీరోయిన్ రష్మిక మందన ఫస్ట్‌లుక్‌ని విడుదల చేసింది చిత్ర యూనిట్. అచ్చమైన పల్లెటూరి అమ్మాయి ‘శ్రీవల్లి’గా రష్మిగా ఫస్ట్‌లుక్‌ అభిమానులను ఆకట్టుకుంది. అయితే ఈ సినిమా ద్వారా ప్రముఖ మలయాళ నటుడు తెలుగు తెరకు పరిచయం అవుతన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఆయన ప్రతినాయకుడు ‘భన్వర్ సింగ్’అనే పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారు. కొద్ది రోజుల క్రితమే ఆయన ఫస్ట్‌లుక్‌ని కూడా విడుదల చేసింది చిత్ర యూనిట్. అయితే ముందు ఒక భాగంగా అనుకున్న ఈ సినిమాను.. ఆ తర్వాత రెండు భాగాలుగా విడుదల చేస్తామని చిత్ర యూనిట్ ప్రకటించిన విషయం తెలిసిందే. ‘పుష్ప-ది రైజ్’ పేరుతో తొలి భాగంగా ఈ ఏడాది డిసెంబర్‌లో విడుదల కానుంది. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ వార్త సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది. తొలి భాగంలో విలన్‌గా ఫహాద్ ఉండరటనే వార్త చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాలో విలన్‌గా ఉంటారు అని.. రెండో భాగంలో ఫహాద్ విలన్‌గా ఎంట్రీ ఇస్తారు అని గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే ఇందుకు సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన లేకపోవడంతో ప్రస్తుతానికి ఇది ఒక రూమర్ అనే అభిమానులు భావిస్తున్నారు. ఇక మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై రూపొందిన ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా నుంచి రెండో పాట విడుదల అయ్యే అవకాశం ఉంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3CTaw2M
v

సాయి ధరమ్ తేజ్ ఆరోగ్యంపై థమన్ అప్‌డేట్.. ‘అతనికి థాంక్స్’ అంటూ ట్వీట్

మెగా ఫ్యామిలీ నుంచి హీరోగా ఎంట్రీ ఇచ్చి.. ఆ తర్వాత ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు నటుడు . కామెడీ, యాక్షన్, డ్యాన్స్ ఇలా అన్ని విషయాల్లో ఆయన నటనతో ప్రేక్షకులను అలరిస్తారు ఆయన. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఆయన ఈ నెల 10వ తేదీన రోడ్డు ప్రమాదానికి గురి అయ్యారు. ఐకియా-కేబుల్‌బ్రిడ్జ్ దాటిన త‌ర్వాత మైండ్‌స్పేస్ జంక్ష‌న్ ప్రాంతంలో సాయితేజ్ ప్ర‌యాణిస్తున్న బైక్ స్కిడ్ అయ్యింది. దీంతో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే అక్కడ ఉన్న వాళ్లు ఆయన్ని అపోలో ఆస్పత్రిలో చేర్పించారు. అయితే సాయి ధరమ్ తేజ్‌కు ప్రమాదం జరిగింది అని తెలియగానే మెగా ఫ్యామిలీ అభిమానులు ఆందోళనకు గురయ్యారు. ఆయన ఆరోగ్యం ఎలా ఉందో అంటూ వాళ్లు కంగారు పడ్డారు. మెగాస్టార్ చిరంజీవితో పాటు.. ఇతర కుటుంబ సభ్యులు ఆయన్ని వెళ్లి పరామర్శించి.. ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉంది అని చెప్పారు. ఆ తర్వాత వైద్యులు ఆయనకు అన్ని పరీక్షలు నిర్వహించి.. సాయి ధరమ్ కాలర్ బోన్‌ విరిగిందని.. దానికి శస్త్ర చికిత్స చేశామని స్పష్టం చేశారు. ఎప్పటికప్పుడు సాయి ధరమ్ ఆరోగ్యం గురించి వాళ్లు అభిమానులుకు అప్‌డేట్స్ ఇస్తున్నారు. అయితే తాజాగా మ్యూజిక్ డైరక్టర్ సాయి ధరమ్ ఆరోగ్యంపై సోషల్‌మీడియా ద్వారా అభిమానులకు అప్‌డేట్ ఇచ్చారు. ‘మన అందరి ప్రార్థనలు ఫలించాయి.. నా మిత్రుడు సాయి థరమ్ తేజ్ వేగంగా కోలుకుంటున్నాడు.. అతని హెల్త్‌కు సంబంధించి అప్‌డేట్ ఇచ్చినందుకు సతీష్‌కు ప్రత్యేకంగా ధన్యవాదాలు. మరో రెండు రోజుల్లో నా మిత్రుడిని కలుసుకుంటున్నందుకు ఎంతో ఆనందంగా ఉంది’ అంటూ థమన్ ట్వీట్ చేశారు. థమన్ చేసిన ఈ ట్వీట్ సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది. ఇక దేవా కట్టా దర్శకత్వంలో సాయి ధరమ్ తేజ్, ఐశ్వర్య రాజేష్‌లు హీరోహీరోయిన్లుగా జగపతి బాబు, రమ్యకృష్ణ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ‘రిపబ్లిక్’. ఈ సినిమా ఆక్టోబర్ 1వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల అవుతోంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2Y3D3nq
v

వావ్! బండ్ల గణేష్.. ప్రచారంలో కూడా వెరైటీ.. ప్రకాష్ రాజ్ ట్వీట్‌ని భలే వాడేశాడే!!

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (MAA) ఎన్నికలు హంగామా షురూ అయింది. అక్టోబర్ 10వ 'మా' ఎలక్షన్స్ జరగనున్న నేపథ్యంలో ఇప్పటికే నామినేషన్స్ ప్రక్రియ ముగిసింది. అధ్యక్ష పోటీలో ఉన్న మంచు విష్ణు, , సీవీఎల్ నరసింహా రావు తమ తమ ప్యానల్ సభ్యులతో సహా విచ్చేసి నామినేషన్స్ నమోదు చేశారు. ఇక 'మా' జనరల్ సెక్రటరీ పదవి కోసం స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న కూడా తన నామినేషన్ వేసి ప్రచార రథం చేపట్టారు. అయితే ప్రచారంలో కూడా ఆయన చూపుతున్న విలక్షణత పలువురి దృష్టిని లాగేస్తోంది. తమ ప్యానల్‌కు ఓటు వేయాలని అధ్యక్ష పదవికి పోటీ పడుతున్న ప్రకాశ్ రాజ్ ట్విట్టర్ ద్వారా కోరుతూ తన ప్యానల్ వివరాలతో కూడిన పోస్టర్ షేర్ చేశారు. ఈ మేరకు మా హితమే.. మా అభిమతం.. మనస్సాక్షిగా ఓటేద్దాం.. మా ఆశయాలను గెలిపిద్దాం అంటూ చేతులు జోడించిన ఎమోజీలను షేర్ చేశారు. దీంతో ఈ ట్వీట్ చూసిన బండ్ల గణేష్ దాన్నీ రీ- ట్వీట్ చేస్తూ వెరైటీ చాటుకున్నారు. ఓన్లీ వన్ ఓట్ ఫర్ బండ్ల గణేష్ ఫర్ జనరల్ సెక్రటరీ అంటూ చేతులు జోడించిన ఎమోజీని షేర్ చేస్తూ ప్రకాష్ రాజ్ చేసిన ట్వీట్‌నే రీ ట్వీట్ చేశారు బండ్ల గణేష్. దీంతో ఇది చూసి బండ్లన్న.. ప్రకాష్ రాజ్ ట్వీట్‌ని భలే వాడేశాడే అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ముందుగా ప్రకాష్ రాజ్ ప్యానల్ లోనే ఉన్న బండ్ల గణేష్.. అందులోకి జీవిత రాజశేఖర్ చేరడంతో ఆమె రాకను వ్యతిరేకిస్తూ ఆ ప్యానల్ నుంచి తప్పుకున్నారు. స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగి పోటీలో నిలిచారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3okCArZ
v

Wednesday 29 September 2021

Love Story: ముద్దు సీన్‌పై సాయి పల్లవి క్లారిటీ.. అలా కానిచ్చేశారు! అసలు విషయం రివీల్

అక్కినేని వారసుడు, యంగ్ హీరో నాగ చైతన్యతో కలిసి చిందులేసే అవకాశాన్ని పర్ఫెక్ట్‌గా వాడుకుంది. 'లవ్ స్టోరీ' సినిమాలో తనదైన స్టెప్పులతో ఓ రేంజ్‌లో రెచ్చిపోయి థియేటర్స్‌లో ఈలల మోత మోగించింది. వెండితెరపై నాగ చైతన్య- సాయి పల్లవి కెమిస్ట్రీ చూసి మురిసిపోయారు తెలుగు ప్రేక్షకులు. బ్యూటిఫుల్ లవ్ స్టోరీని శేఖర్ కమ్ముల తెరకెక్కించిన విధానం, అక్కడక్కడా షూట్ చేసిన రొమాంటిక్ సన్నివేశాలు యూత్ ఆడియన్స్‌ని మైమరిపించాయి. కమర్షియల్ హంగులు, భారీ యాక్షన్ సీన్లు, పెద్ద హీరోల జోలికి పోకుండా తనదైన శైలిలో సినిమాలు చేసే శేఖర్ కమ్ముల.. లవ్ స్టోరీతో అదే మ్యాజిక్ రిపీట్ చేశారు. తన రెగ్యులర్ పంథానే ఫాలో అవుతూ క్లాస్, మాస్ ఆడియన్స్ దృష్టిని లాగేశారు. అయితే ఈ సినిమాకు సంబంధించి ముందునుంచి చర్చల్లో నిలుస్తున్న అంశం నాగ చైతన్య- సాయి పల్లవి . నిజానికి ముద్దు సీన్లంటే ఎంతో దూరం ఉండే సాయి పల్లవి ఈ కిస్ ఎలా ఒప్పుకుంది? అనే టాక్ జనాల్లో ఇప్పటికీ హాట్ టాపిక్ గానే ఉంది. అయితే తాజాగా దీనిపై పూర్తి క్లారిటీ ఇచ్చేసింది సాయి పల్లవి. తాను నాగ చైతన్యను ముద్దు పెట్టుకోలేదని స్పష్టం చేసింది. ఇప్పటివరకు ఇలాంటి సన్నివేశాల్లో నటించని తనను శేఖర్ కమ్ముల ఇబ్బంది పెట్టలేదని, కథ ప్రకారం ఆ సీన్ ఉండాలి కాబట్టి కెమెరామెన్ ట్రిక్‌తో ముద్దు సన్నివేశం కంప్లీట్ చేసి ఆ ఫీల్ తెప్పించారని ఆమె చెప్పింది. ఇకపై కూడా ముద్దు సన్నివేశాల్లో నటించనని సాయి పల్లవి చెప్పడం గమనార్హం. ఇకపోతే థియేటర్స్‌లో 'లవ్ స్టోరీ' కలెక్షన్ల సునామీ కొనసాగుతూనే ఉంది. ఈ విజయం పట్ల చిత్రయూనిట్ చాలా ఆనందంగా ఉంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3imEQLt
v

ఇది జీవితాంతం గుర్తు పెట్టుకునే జ్ఞాపకం.. దీనంతటికీ మీరే కారణం!! నాగ చైతన్య ఎమోషనల్ కామెంట్స్

అక్కినేని నాగ చైతన్య- సాయి పల్లవి జంటగా యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకుల ముందుకొచ్చింది 'లవ్ స్టోరీ' సినిమా. కరోనా తర్వాత థియేటర్స్ పరిస్థితి ఎలా ఉంటుందో అనే సందేహాలకు తెర దించుతూ సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోంది. విడుదలైన అన్ని సెంటర్లలో క్లాస్, మాస్ ఆడియన్స్ మనసు దోచుకుంటూ హౌస్ ఫుల్ కలెక్షన్స్‌తో దూసుకుపోతోంది. ఈ బ్యూటిఫుల్ చూసిన పలువురు సినీ ప్రముఖులు చైతూ, సాయి పల్లవి నటనపై ప్రశంసలు గుప్పించారు. ఈ విజయంతో ఇటు నటీనటులతో పాటు అటు సాంకేతిక వర్గం ఫుల్ ఖుషీ అవుతోంది. ఈ నేపథ్యంలోనే రీసెంట్‌గా 'లవ్ స్టోరీ' సక్సెస్ మీట్ నిర్వహించిన చిత్రయూనిట్.. సక్సెస్ సంబరాలు జరుపుకుంది. , సాయి పల్లవి సహా ఈ చిత్రంలో భాగమైన నటీనటులు, దర్శక నిర్మాతలు అంతా కలిసి ఫుల్ ఎంజాయ్ చేశారు. ఈ మేరకు అంతా కలిసి ఒకే ఫ్రేమ్‌లో ఒదిగిపోయి నవ్వులు చిందించారు. తాజాగా ఇందుకు సంబంధించిన ఓ పిక్‌ని తన ట్విట్టర్ వేదికగా పంచుకున్న నాగ చైతన్య.. ''లవ్ స్టోరీ టీమ్ మొత్తానికి ప్రత్యేక కృతజ్ఞతలు. మీరంతా కలిసి జీవితాంతం గుర్తుండిపోయే జ్ఞాపకాలు ఇచ్చారు'' అని పేర్కొన్నారు. దీంతో ఈ ట్వీట్ నెట్టింట క్షణాల్లో వైరల్‌గా మారింది. సూపర్ ఫ్రేమ్, అదిరింది అంటూ కామెంట్స్ పెడుతున్నారు నెటిజన్లు. సెప్టెంబర్ 24వ తేదీన ప్రేక్షకుల ముందుకొచ్చిన లవ్ స్టోరీ సినిమా డీసెంట్ కలెక్షన్స్ రాబడుతోంది. లవ్ స్టోరీ రన్ చూస్తుంటే ఈ సినిమాకు భారీ ప్రాఫిట్స్ వచ్చే అవకాశం ఉందని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. చైతూ కెరీర్‌కి ఈ మూవీ బిగ్గెస్ట్ టర్నింగ్ పాయింట్ అని చెప్పుకోవచ్చు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3ijZgor
v

పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై జీవిత ఓపెన్ కామెంట్స్.. బండ్ల గణేష్ భయపడుతున్నారంటూ షాకింగ్ రియాక్షన్

'రిపబ్లిక్' సినిమా ప్రీ రిలీజ్ వేదికపై మాట్లాడిన తీరు తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. సాయి ధరమ్ తేజ్ యాక్సిడెంట్ ఇష్యూ మొదలుకొని, ఏపీ ప్రభుత్వ విధానాల గురించి మాట్లాడుతూ పవన్ సంచలన కామెంట్స్ చేశారు. దీంతో ఒక్కసారిగా వైసీపీ వర్గాలు భగ్గుమన్నాయి. పవన్ మాట్లాడిన మాటలను తప్పుబడుతూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు వైసీపీ కార్యకర్తలు. ఇక పోసాని ఎంటర్ కావడంతో పరిస్థితి మరో స్టేజికి వెళ్ళింది. వ్యక్తిగత దూషణలతో రచ్చ క్రియేట్ అయింది. ఇలాంటి పరిస్థితుల నడుమ ఆ రోజు పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై రియాక్ట్ అవుతూ తన అభిప్రాయం బయటపెట్టారు. సినిమా వేరు.. రాజకీయం వేరు అంటూ 'రిపబ్లిక్' సినిమా ప్రీ రిలీజ్ వేదికపై పవన్ కళ్యాణ్ మాట్లాడిన తీరుపై జీవిత స్పందించారు. పవన్ కళ్యాణ్ ఓ పొలిటీషియన్, ఆయనకు ఓ పార్టీ ఉంది.. అలాగే ఆయన ఓ హీరో అని చెప్పిన జీవిత.. ఆయన రాజకీయాల్లో ఉండొచ్చు కానీ మా వరకు ఆయన హీరో మాత్రమే అన్నారు. ఓ హీరోగా పవన్ మంచి వ్యక్తిత్వం ఉన్న మనిషి అని, నిర్మాతలకు, ఇండస్ట్రీకి సాయపడుతూ ఆయన అందరితో ఉంటారని చెప్పారు. సినిమాల పరంగా అయితే పవన్‌తో ఎలాంటి ఇష్యూస్ లేవని జీవిత అన్నారు. అయితే ఓ రాజకీయ నాయకుడిగా ఆయన మాట్లాడిన దానికి, ఇండస్ట్రీకి ఎలాంటి సంబంధం లేదని ఆమె చెప్పారు. సినిమాలకు, రాజకీయాలకు ఎలాంటి సంబంధం లేదని, ఆ రెండిటినీ పోల్చి చూడొద్దని అన్నారు. ఒకే వ్యక్తి అటు పోటీషియన్‌గా, ఇటు నటుడిగా ఉండొచ్చు కానీ రాజకీయాలను సినిమా ఇండస్ట్రీకి అన్వయించొద్దని తెలిపారు. పవన్ కళ్యాణ్ అయితే అలా అన్వయించలేదని తాను భావిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇక 'మా' ఎలక్షన్స్ ఇష్యూపై రియాక్ట్ అయిన జీవిత.. , పృథ్వీ తనను టార్గెట్ చేశారని అన్నారు. పోటీలో ఇంతమంది ఉండగా తనపై మాత్రమే ఫోకస్ పెడుతున్నారంటే తాను చాలా హై పొజీషన్‌లో ఉన్నానని, తనను చూసి వాళ్ళు భయపడుతున్నారు కాబట్టే అలా టార్గెట్ చేస్తున్నారని షాకింగ్ రియాక్షన్ ఇచ్చారు. MAA ఎన్నికల్లో ప్రకాష్ రాజ్ ప్యానల్ తరఫున జనరల్ సెక్రటరీగా జీవిత బరిలోకి దిగుతుండగా, మంచు విష్ణు ప్యానల్ తరఫున రఘుబాబు బరిలో ఉన్నారు. ఇక జనరల్ సెక్రటరీ ఇండిపెండెంట్ అభ్యర్థిగా బండ్ల గణేష్ పోటీకి దిగారు. దీంతో ఈ పోటీ రసవత్తరంగా మారింది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3mstdEf
v

మరో మల్టీస్టారర్ మూవీకి రానా గ్రీన్ సిగ్నల్.. ఈ సారి శర్వాతో జోడీ! మైత్రీ మేకర్స్ పక్కా ప్లాన్

నేటితరం ప్రేక్షకులు మల్టీస్టారర్ మూవీలకు మొదటి ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇద్దరు స్టార్లను ఒకే తారను పంచుకోవడం ఇష్టపడుతున్నారు. ఇలాంటి సినిమాలకే భారీ ఆదరణ లభిస్తుండటంతో దర్శకనిర్మాతలు సైతం మల్టీస్టారర్ మూవీలపై మొగ్గు చూపుతున్నారు. ఇప్పటికే రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా RRR, పవన్ కళ్యాణ్, ప్రధాన పాత్రల్లో 'భీమ్లా నాయక్' సినిమాలు భారీ రేంజ్‌లో రూపొందుతున్నాయి. ఈ నేపథ్యంలోనే టాలీవుడ్‌లో మరో మల్టీస్టారర్ మూవీ కోసం అన్నీ సిద్ధం చేస్తున్నారట. యంగ్ అండ్ టాలెంటెడ్ రానా దగ్గుబాటితో పాటు మరో యంగ్ హీరో కలయికలో ఈ మల్టీస్టారర్ మూవీ రూపొందనుందని తెలుస్తోంది. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై భారీ హంగులతో ప్లాన్ చేస్తున్నారట. వచ్చే ఏడాది ఆరంభంలో ఈ సినిమాను ప్రారంభించి అతి త్వరలో ఫినిష్ చేయాలనేది ప్లాన్. ఈ మేరకు ఇప్పటికే రానా, శర్వాలతో సంప్రదింపులు కూడా పూర్తయ్యాయని, చిత్ర దర్శకుడు, ఇతర వివరాలపై త్వరలోనే ఓ క్లారిటీ రానుందని అంటున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ జరుగుతోందట. ఇకపోతే ఎలాంటి కథలోనైనా తన రోల్ స్పెషల్ అనిపించుకుంటూ విలక్షణ పాత్రలతో ఆకట్టుకుంటున్న దగ్గుబాటి రానా.. తన బాబాయ్ వెంకటేష్‌తో కలిసి మరో మల్టీస్టారర్ మూవీ చేస్తున్నారు. ‘రానా నాయుడు’ అనే పేరుతో ఈ మూవీ రూపొందనుందని ఇటీవలే అఫీషియల్ ప్రకటన ఇచ్చారు మేకర్స్. మరోవైపు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న భీమ్లా నాయక్ సినిమాలో నెగిటివ్ షేడ్స్ ఉన్న రోల్ పోషిస్తున్నారు రానా. ఈ రెండు సినిమాలు కంప్లీట్ అయ్యాకే రానా, శర్వా మూవీ సెట్స్ మీదకొస్తుందని టాక్.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2ZxYLjZ
v

పోసాని రాసలీలలు..! నువ్వు పెద్ద మోసగాడివి.. బండ బూతులు తిడుతూ టాలీవుడ్ నిర్మాత సంచలన కామెంట్స్

పోసాని Vs ఇష్యూ చిలికి చిలికి గాలి వానలా తయారైంది. ఎప్పుడైతే 'రిపబ్లిక్' ఈవెంట్‌లో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్‌పై జనసేనాని పవన్ కళ్యాణ్ కామెంట్స్ చేశారో అప్పటినుంచి వాదోపవాదాలు నడుస్తున్నాయి. మధ్యలో పోసాని ఎంటరై పవన్ కళ్యాణ్‌పై సంచలన వ్యాఖ్యలు చేస్తూ విరుచుకుపడటంతో ఇష్యూ పెద్దదైంది. దీనిపై పలువురు సినీ ప్రముఖులు బాహాటంగా రియాక్ట్ అవుతున్నారు. ఓ వైపు జనసేన కార్యకర్తలు, మరోవైపు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ పోసాని మాట్లాడిన తీరుపై ధ్వజమెత్తుతున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా పోసానితో సినిమా చేసిన ఓ నిర్మాత ఆయనను బండ బూతులు తిడుతూ సంచలన ఆరోపణలు చేశారు. అప్పట్లో నటించిన ''మెంటల్ కృష్ణ, రాజవారి చేపల చెరువు'' సినిమాలకు డిస్ట్రిబ్యూషన్ చేసి ఆ తర్వాత ఆయనతో 2010లో 'పోసాని జెంటిల్మెన్' అనే సినిమాను నిర్మించిన తాజాగా ఓ వీడియో ద్వారా మీడియా ముందుకొచ్చి రెచ్చిపోయారు. పోసానిపై మాటల్లో చెప్పలేని పదజాలం వాడుతూ పవన్ కళ్యాణ్‌కి మద్దతు పలికారు. పోసాని జెంటిల్మన్ సినిమా సమయంలో తనను దారుణంగా మోసం చేశాడంటూ ఓపెన్ అయ్యారు. మంచి సినిమా చేస్తానని చెప్పి డీ- గ్రేడ్ సినిమా తీసి నా చేతిలో పెట్టావు. నీలాంటి వాడిని నమ్మడమే నేను చేసిన తప్పు అంటూ ఫైర్ అయ్యారు. ''నువ్వా మాట్లాడేది.. నాలాంటోళ్ళ దగ్గర ఎంత మంది దగ్గర డబ్బులు దొబ్బావో చెప్పాలా? పోసాని జంటిల్మన్ సినిమా షూటింగులో ఎంత మంది అమ్మాయిలతో రాసలీలలు నడిపావో బయట పెట్టాలా? నా కళ్ల ముందు చేసిన పనుల లిస్ట్ చెప్పనా? నువ్వు చేస్తే సంసారం.. ఎదుటోడు చేస్తే వ్యభిచారమా? ఒకప్పుడు నాకు ఏమీ తెలియని సమయంలో నీ దగ్గరకొచ్చి మోసపోయిన ప్రొడ్యూసర్‌ని నేను. నీవు నిర్మాతల గురించి, పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వం గురించి మాట్లాడుతావా? ఇంకోసారి పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడితే పిచ్చి పిచ్చిగా కొడతా. పవన్ కళ్యాణ్ రెమ్యునరేషన్ గురించి నువ్వు ప్రశ్నిస్తావా? ఆయన తీసుకునే రెమ్యునరేషన్‌కి పక్కాగా ట్యాక్స్ కడుతున్నారు. నీకు దమ్ముంటే నాతో డిబేట్‌కి రా. నువ్వు చేసిన ప్రతి పనిని ఆధారాలతో సహా బయటపెడతా'' అంటూ విరుచుకుపడిన నల్లం శ్రీనివాస్ పోసానిపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ప్రస్తుతం ఆయన చేసిన ఈ కామెంట్స్ నెట్టింట దుమారం రేపుతున్నాయి.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3F3fJHh
v

పవన్ ఎఫెక్ట్.. పేర్నినానితో కలిసి దిల్ రాజు ప్రెస్ మీట్.. ఆసక్తికర పరిణామంతో కీలక వ్యాఖ్యలు

రిపబ్లిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో చేసిన వ్యాఖ్యలు ఎంతటి దుమారాన్ని రేపాయో అందరికీ తెలిసిందే. ఇక ఆ ప్రసంగంలో కులాన్ని కూడా ఎత్తి చూపాడు పవన్ కళ్యాణ్. దిల్ రాజు రెడ్డి అంటూ పదే పదే అన్నాడు. పవన్ కళ్యాణ్ స్పీచ్ కొనసాగుతున్న సమయంలో దిల్ రాజు కొన్ని సార్లు పగలబడి నవ్వేశాడు. ఇంకొన్ని సార్లు ముభావంగా ఉన్నాడు. అయితే దిల్ రాజు పరిస్థితిపై ఆ తరువాత మంత్రి కౌంటర్లు కూడా వేశాడు. కక్క లేక మింగ లేక ఉన్నట్టుందని దిల్ రాజు మీద నాని సెటైర్లు వేశాడు. అయితే తాజాగా మంత్రి పేర్ని నానితో ఇండస్ట్రీ నిర్మాతలు భేటీ అయ్యారు. డీవీవీ దానయ్య, మైత్రి నవీన్, దిల్ రాజు వంటి వారు మంత్రితో చర్చించారు. అనంతరం మీడియాతో దిల్ రాజు మాట్లాడుతూ.. ‘వకీల్ సాబ్ సినిమా సమయంలోనే జీవోలు రావడం, వాటిపై మిస్ కమ్యూనికేషన్స్ జరిగాయి. అయితే సినిమా అనేది చాలా సున్నితం.. దాని వల్ల ఇబ్బంది పడేది నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, థియేటర్లు. ఆ ప్రభావం అంతా కూడా మా మీదే పడుతుంది. సినిమా పరిశ్రమను కాంట్రవర్సీగా తీసుకెళ్లకండి. మా సమస్యలు పరిష్కరిస్తేనే ఇండస్ట్రీ బాగుంటుంది. రెండు రాష్ట్ర ప్రభుత్వాలు మమ్మల్ని సున్నితంగా చూస్తూ మా సమస్యలు పరిష్కరిస్తున్నారు. గత నెలలో సమావేశం జరిగినప్పుడు ఆన్ లైన్ టిక్కెట్లు, వంద శాతం ఆక్యుపెన్సీ వంటి వాటిని మాట్లాడాం. ఏపీ ప్రభుత్వం అన్నింటిపై సానుకూలంగా స్పందించింది. ఆ విషయాన్ని మేం ఇండస్ట్రీలో సరిగ్గా చెప్పలేకపోయాం. దాని వల్ల రకరకాల ఇన్సిడెంట్‌లు జరుగుతున్నాయి. వాటిని మనం చూస్తున్నాం. ఆ ఘటనల తరువాత అందుకే మంత్రి గారిని కలిసేందుకు వచ్చాం. కరోనా వల్ల నిర్మాతల, ఎగ్జిబిటర్లు పడ్డ బాధలను మంత్రి గారికి విన్నవించుకున్నాం. వాటిని ముఖ్యమంత్రి గారి వద్దకు తీసుకెళ్లమని కోరాం. ఇదే జరిగింది. దీన్ని కాంట్రవర్సీ చేయకండి.. రాజకీయాలు వేరు. సినిమాలు వేరు. ప్రభుత్వాలు మాకు ఎప్పుడూ సానుకూలంగా ఉంటాయి. రాజకీయాల వల్ల సినిమాకు ఏ రకంగా డ్యామేజ్ జరగకుండా చూడాల్సిన బాధ్యత మీడియా మీద కూడా ఉంది. మా ఇండస్ట్రీ తరుపున మీకు ఇది మా రిక్వెస్ట్’ అని అన్నాడు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3ihaoma
v

వెంట్రుక పీకి సవాల్ చేసిన పవన్ కళ్యాణ్.. యుద్దం సైజ్‌ ఎలా కావాలో కోరుకోండమ్మా అంటూ పీకే విశ్వరూపం

పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో జనసేనాని కీలక వ్యాఖ్యలు చేశారు.. ఇప్పటి వరకూ సోషల్ యాక్టివిస్ట్‌గానే ఉన్నానని.. ఇప్పటి నుంచి రాజకీయాలు మొదలుపెడతానంటూ వైసీపీ నాయకులకు సవాల్ చేశారు. నా ఇంటి నుంచి మీ ఇంటికి ఎంత దూరమో.. మీ ఇంటి నుంచి నా ఇంటికి అంతే దూరం అనే విషయాన్ని వైసీపీ నాయకులు గుర్తించుకోవాలన్నారు. ఈ సందర్భంలో వైసీపీ పార్టీ నాయకులు తనపై చేస్తున్న వ్యాఖ్యల్ని తిప్పికొడుతూ తనదైన శైలిలో ప్రసంగించారు పవన్ కళ్యాణ్. ఆయన మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వం కమ్మవారి సమాజాన్ని దాడి చేసుకుంటూ వెళ్లిపోతే ప్రతి ఒక్కరూ ఏదో ఒక కులానికి చెందాలి కదా.. మాకు వేరే ఛాయిస్ లేదు. కాశ్మీర్ పండింట్‌లను తరిమేసినట్టుగా.. ఒక జాతిని ఆంధ్రప్రదేశ్ నుంచి తరిమేస్తానంటే తప్పు కదా.. అలా చేయకూడదు.. మానవత్వం కాదు. ఇలాంటి దాడులు, బాధితులకు అండగా ఉంటానని మాట ఇస్తున్నా. వైసీపీ పార్టీకి వాళ్లు నన్ను యుద్దానికి రమ్మని పిలిచారు.. నేను అడగలేదు.. మీరే కవ్వించారు.. మీరే పిలిచారు.. మీరే మా వాళ్లని కొట్టారు.. మా ఆడ బిడ్డల ఒంటిపై చేయి వేశారు.. అక్రమ కేసులు పెట్టారు. ఎస్‌సి ఎస్టీ అబ్రాసిటీ కేసులు పెట్టిస్తున్నారు. మీలాంటి వాళ్లని ఆంధ్రప్రదేశ్ నుంచి తరిమేయాల్సిన సమయం ఆసన్నమైంది. వైసీపీ నాయకత్వానికి సవాల్ విసురుతున్నా.. రండి.. మీరు నా గురించి ఏం మాట్లాడతారో మాట్లాడండి.. ఏం చేస్తారో చేయండి.. ఛాలెంజ్ విసురుతున్నా మీకు ఏం చేస్తారో చేయండి... దమ్ముతో మాట్లాడుతున్నా.. సినిమాలు ఆపుతారా నావి.. ఆపుకోండి.. అంటూ తలపై వెంట్రుకను లాగి చూపించారు పవన్ కళ్యాణ్. ‘దమ్ముంటే నా సినిమాలు ఆపుకోండి.. మిమ్మల్ని వదలను.. భవిష్యత్‌లో ఉంటుంది.. యుద్దానికి మీరు పిలిచారు. నేను కవ్వించలేదు.. కాకినాడలో మీ ఎమ్మెల్యే మా ఆడబిడ్డలపై దాడి చేశాడు.. మేం అడగలేదు.. నన్ను పచ్చి బూతులు తిడితే తిరిగి మా వాళ్లనే లాక్కెళ్లి జైలు‌లో వేశారు. ఇలాంటి అన్యాయాలు ఒక్కటి కాదు.. రాష్ట్ర వ్యాప్తంగా ఇబ్బందులుపెడుతున్నారు. గిద్దలూరులో మా కార్యకర్త ఆత్మహత్య చేసుకునేట్టే చేశారు.. నేను మరిచిపోను. మిమ్మల్ని ఎలా ఎదుర్కోవాలో.. లొంగదీసి కింద కూర్చోబెట్టాలో మాకు తెలుసు. యుద్దం సైజ్‌ ఎలా కావాలో కోరుకోండమ్మా.. ఎలా కావాలి యుద్దం.. ఛాయిస్ ఈజ్ యువర్స్.. జనసేనాని మీరు ఇది గుర్తుపెట్టుకోండి’ అని హెచ్చరించారు పవన్ కళ్యాణ్.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/39KoszT
v

అల్లు అర్జున్‌కు గన్‌ను గిఫ్ట్‌గా ఇచ్చిన ఫ్యాన్.. ఆ గన్‌కు ఉన్న ప్రత్యేకత ఏంటో తెలుసా?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు తెలుగులో ఉన్న క్రేజేంటో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. అయితే కెరీర్ ప్రారంభం నుంచి తెలుగుతో పాటు మ‌ల‌యాళంలోనూ అభిమానుల‌ను సంపాదించుకున్నారు. బ‌న్ని సినిమాల‌న్నీ మ‌ల‌యాళంలో అనువాద‌మ‌వుతుంటాయి. అలా అనువాద‌మైన తెలుగు చిత్రాల‌న్నీ అక్క‌డ ఘ‌న విజయాన్ని సాధించిన‌వే. మ‌లయాళ సినీ ఇండ‌స్ట్రీలో అగ్ర హీరోల‌కు ఎంత క్రేజ్ ఉంటుందో తెలుగువాడైన అల్లు అర్జున్‌కు కూడా ఉందన‌డంలో సందేహం లేదు. ఓ సంద‌ర్భాన మ‌ల‌యాళ ముఖ్య‌మంత్రి కేర‌ళ‌లో జ‌రిగే ప‌డ‌వ ఉత్స‌వాల‌కు అల్లు అర్జున్‌ను ప్ర‌త్యేక అతిథిగా ఆహ్వానించ‌గా బ‌న్నీ హాజ‌ర‌య్యారు. మ‌ల‌యాళంలో ఇంత క్రేజ్ ఉన్న అల్లు అర్జున్‌, ఓ మ‌ల‌యాళ అభిమాని ఓ గ‌న్‌ను బ‌హుమ‌తిగా అందించారు. అయితే స‌ద‌రు అభిమాని ఇండియాలో కాకుండా,యు.ఎ.ఇలో ఈ స‌ర్‌ప్రైజ్ గిఫ్ట్‌ను అందించ‌డం విశేషం. కొన్నాళ్లు ముందు యు.ఎ.ఇకు వెళ్లిన సంగ‌తి తెలిసిందే. బన్నీ యు.ఎ.ఇలో ఉన్నాడ‌నే సంగ‌తి తెలుసుకున్న దుబాయ్‌కు చెందిన మ‌ల్టీ మిలియ‌నీర్ రియాజ్ కిల్ట‌న్ అక్క‌డ‌కు వెళ్లి క‌లుసుకున్నాడు. స‌రే! బ‌న్నీకి ఈ గిఫ్ట్ ఇవ్వ‌డం వెనుక‌, అస‌లు క‌థేంటో తెలుసా..బ‌న్నీకి అందించిన గిఫ్ట్ 160 సంవ‌త్స‌రాల పురాత‌మైనది. ఈ గిఫ్ట్‌ను అందించి త‌న ప్ర‌త్యేక‌త‌ను చాటుకున్నారు రియాజ్‌. సినిమాల విష‌యానికి వ‌స్తే.. ప్ర‌స్తుతం అల్లు అర్జున్ ‘పుష్ప‌’ సినిమాను చేస్తున్నాడు. ఇది రెండు భాగాలుగా రూపొందుతోంది. సుకుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. ర‌ష్మిక మంద‌న్న ఇందులో శ్రీవ‌ల్లి అనే పాత్ర‌ను పోషిస్తుంది. ఈ ఏడాది క్రిస్మ‌స్ సంద‌ర్భంగా పుష్ప ది రైజ్ చిత్రాన్ని విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు జ‌రుగుతున్నాయి. శేషాచ‌ల అడ‌వుల్లో జ‌రిగే ఎర్ర‌చంద‌నం స్మ‌గ్లింగ్ నేప‌థ్యంలో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. మైత్రీ మూవీ మేక‌ర్స్‌, ముత్తం శెట్టి మీడియా సంస్థ‌లు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2YbUN0f
v

నాకు అన్యాయం చేసింది.. జీవితపై నరేష్ సంచలన కామెంట్స్

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఎన్నికల రచ్చ సోషల్ మీడియాలో ఎంతటి రచ్చకు దారి తీస్తోందో అందరికీ తెలిసిందే. ప్రకాష్ రాజ్, ప్యానెల్స్ మధ్యే ఈ పోటీ జరుగుతోంది. ఇక బండ్ల గణేష్ అయితే ఇండిపెండెంట్ అభ్యర్థిగా జనరల్ సెక్రటరీ పదవికి పోటీ చేస్తున్నాడు. ఈ రెండు ప్యానెల్స్ నామినేషన్స్ వేసేశాయి. ఇక మంచు విష్ణు, ఆయన ప్యానెల్ తరుపున మాట్లాడుతూ సంచలన కామెంట్స్ చేశారు. ఒకే ప్యానెల్ గెలిస్తే మంచిదని, రెండు ప్యాన్సల్స్‌లో మెజార్టీలు గెలిస్తే ఇబ్బందులు ఏర్పడతాయన్నట్టుగా చెప్పుకొచ్చారు. జనరల్ సెక్రటరీగా జీవిత రాజశేఖర్‌ను రఘుబాబు గెలిపించాడు. జనరల్ సెక్రటరీగా గెలిచింది. కానీ ఆమె నాకు అన్యాయం చేసింది. అవన్నీ నేను చెప్పదల్చుకోలేను. నేను ఎవ్వరినీ వ్యక్తి గతంగా నిదించాలని అనుకోవడం లేదు. నమ్మడం, నా పక్కన నిలబెట్టుకోవడం.. నా తప్పు అని నరేష్ సంచలన కామెంట్స్ చేశాడు. ఈ సారి మాత్రం విష్ణు ప్యానెల్‌ను గెలిపించండి అని నరేష్ కోరాడు. ప్రకాశ్‌ రాజ్‌ తనకు మంచి స్నేహితుడని నరేష్ అన్నాడు. మంచు విష్ణు ఇక్కడే అందరికీ అందుబాటులో ఉంటాడని, ‘మా’ అధ్యక్షుడిగా విష్ణు సరైనవాడని చెప్పుకొచ్చాడు. తనది కృష్ణుని పాత్ర అని, ‘మా’ కోసం మంచు విష్ణు రథం ఎక్కుతున్నానని చెప్పుకొచ్చాడు. తన మద్దతు. విష్ణుకి ప్రకటిస్తున్నానని నరేష్ అన్నాడు. అయితే అవతలి వారికి కూడా ఎవరు మద్దతు ఇస్తున్నారో బహిరంగంగా చెప్పాలని నరేష్ సవాల్ విసిరాడు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3CQLJwg
v

'ఉప్పెన' బ్యూటీకి యమ డిమాండ్.. రెమ్మ్యూనరేషన్ అమాంతం పెంచేసిన కృతి శెట్టి!!

తొలి సినిమా ‘ఉప్పెన’తో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో గూడు కట్టుకుంది . తెలుగు తెరపైకి ‘ఉప్పెన’లా దూసుకొచ్చి యూత్ ఆడియన్స్ మనసు దోచుకుంది ఈ కన్నడ భామ. పక్కింటి అమ్మాయిగా తెలుగు ప్రేక్షకుల హృదయాలను హత్తుకున్న ఈ బ్యూటీపై దర్శక నిర్మాతల కన్ను పడింది. దీంతో ఆమెకు వరుస ఆఫర్స్ తలుపుతడుతున్నాయి. ఇప్పటికే పలు సినిమాలకు సైన్ చేసిన ఆమెకు మరిన్ని ఆఫర్స్ క్యూ కడుతున్నాయట. ఈ నేపథ్యంలో ఆమె తన రెమ్మ్యూనరేషన్ కూడా పెంచేసిందని తెలుస్తోంది. చైల్డ్‌ ఆర్టిస్ట్‌గా, మోడల్‌గా పలు యాడ్స్‌తో ఓ మోస్తారు గుర్తింపు పొందింది కృతి శెట్టి `ఉప్పెన` సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చి పెద్దగా అందాల ఆరబోతకు తావివ్వకుండా నాచురల్ నటనతో కట్టిపడేసింది. అయితే ఉప్పెన చిత్రానికి గాను ఆమె తీసుకున్న పారితోషికం కేవలం 6 లక్షలు కాగా.. ఈ మూవీ హిట్టయ్యాక మరో 60 లక్షల వరకు గిఫ్ట్స్ రూపంలో అందుకుందట. ప్రస్తుతం `బంగార్రాజు` సినిమాలో నాగచైతన్య సరసన హీరోయిన్‌గా నటిస్తున్న కృతి.. నానితో `శ్యామ్‌ సింగరాయ్‌`, సుధీర్‌బాబుతో `ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి`, రామ్‌ పోతినేనితో మరో సినిమాలో భాగమవుతోంది. దీంతో పాటు నితిన్‌తో ‘మాచర్ల నియోజకవర్గం’ సినిమాలోనూ ఆడిపాడుతోంది. ఇలా వరుస ఆఫర్స్ రావడంతో డిమాండ్‌ని దృష్టిపెట్టుకొని పారితోషికాన్ని అమాంతం పెంచిందట ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం ఆమె రెమ్మ్యూనరేషన్ 80 లక్షలు నడుస్తోందని, ఫ్యూచర్‌లో ఆ మార్క్ మరింత పెరిగే అవకాశం ఉందని అంటున్నారు. చూస్తుంటే ఈ ఏడాది లోనే కృతి పారితోషికం కోటి దాటే ఛాన్సులు కనిపిస్తున్నాయి. ఇది తెలిసి ఏదేమైనా అదృష్టం అంటే కృతిదే అంటున్నారు ఆడియన్స్.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3kMFF1L
v

సమంత వదిన సక్కగా సంసారం చేసుకో.. ఏం జరిగిందో నాకు తెలుసు.. శ్రీరెడ్డి వీడియో వైరల్

నాగ చైతన్య విడాకుల వ్యవహారం నెట్టింట్లో ఎంతగా వైరల్ అవుతోందో అందరికీ తెలిసిందే. ఈ వ్యవహారం మీద ఏ ఒక్కరూ నోరు విప్పడం లేదు. అసలు సంగతి ఇదీ అని ఆ ఇద్దరిలో ఎవ్వరూ కూడా ప్రత్యక్షంగా స్పందించడం లేదు. క్లారిటీ ఇవ్వడం లేదు. కానీ సమంత మాత్రం అప్పుడప్పుడు పరోక్షంగా కొన్ని పోస్ట్‌లు చేస్తోంది. వేధాంత దోరణిలో మాట్లాడుతోంది. ప్రేమ సూక్తులను వల్లిస్తోంది. నిజం ఎప్పటికీ దాగదు అంటూ కామెంట్లు చేస్తోంది. ఇలా సమంత నర్మగర్భంగా చేసే పోస్ట్‌లతో కొత్త అనుమానాలు తలెత్తుతున్నాయి. సమంత చైతన్య విడాకులు దాదాపుగా ఖరారు అయ్యాయని, సమంతకు భరణంగా దాదాపు 300 కోట్లు చెల్లిస్తున్నారంటూ టాక్ వినిపిస్తోంది. అయితే ఈ విడాకుల రూమర్లపై శ్రీరెడ్డి స్పందించింది. ఎప్పుడూ సమంతను ఏకిపారేస్తూ విమర్శలు చేసే ఈ సారి ఎంతో పద్దతిగా మాట్లాడింది. సమంతకు తోటి అమ్మాయిలా మంచి సలహాలు ఇచ్చింది. ఈ మేరకు శ్రీరెడ్డి వీడియో ఒకటి నెట్టింట్లో వైరల్ అవుతోంది. ‘మీ ఇద్దరినీ మేమందరం ఆశీర్వదీస్తున్నాం. మీ ఇద్దరు కలిసి ఉండాలని కోరుకుంటున్నాం. మీరు ఎంతో మంది స్ఫూర్తిదాయకమైన జంటగా ఉండాలి. మిమ్మల్ని చూసి ఎంతో మంది ఇన్ స్పైర్ అవుతుంటారు. ఏమైనా జరిగి ఉండొచ్చు. కానీ అడ్జస్ట్మెంట్ అనేది ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఇది నా రిక్వెస్ట్ మాత్రమే. భార్యాభర్తలు అన్నాక.. సంసారంలో సరిగమలు ఉంటాయి.. కొట్టుకోవడాలు,తిట్టుకోవడాలు, ఈగోలు, యాటిట్యూడ్‌లు, మిస్ అండర్ స్టాండింగ్స్ చాలా ఉంటాయి. మీరు కొంచెం అడ్జస్ట్ అయిపోవాలి. ఓ అమ్మాయి చాలా ఓపిగ్గా ఉండాలని మన భారతదేశం నేర్పించింది. ఓ మంచి వ్యక్తిత్వమున్న సమంతను నేను కోరుకుంటున్నాను. కొన్ని కొన్ని గనుక ఆమె మార్చుకుంటే తన సంసారం బాగుంటుందనేది నా ఉద్దేశ్యం. ఎంత సమంత అని ఇంగ్లీష్, హాలీవుడ్ పేరు పెట్టుకున్నా.. మనం హాలీవుడ్ నటీనటుల్లా చేయలేం. అది మన సంస్కృతి కాదు. మనది ఆ కల్చర్ కాదు. సమంత వదినా సక్కగా సంసారం చేసుకో. ఇదే నా రిక్వెస్ట్. మీకు ఇష్టమైతే సినిమాలు, మోడలింగ్ కూడా చేసుకోండి.. కానీ కొంచెం అడ్జస్ట్ అయితే బాగుంటుందనేది నా ఉద్దేశ్యం. మీ సమస్యలు ఏంటో నాకు తెలుసు. మీరే వాటిని పరిష్కరించుకుంటారని ఆశిస్తున్నాను. వారిద్దరూ బాగుండాలని కోరుకుంటున్నాను.. నాకు పిచ్చి పిచ్చి కామెంట్లు పెట్టకండిరా అయ్యా’ అంటూ శ్రీరెడ్డి వీడియోలో తెలిపింది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3zMhp4h
v

లవ్ స్టోరీ 5 డేస్ కలెక్షన్స్.. ఊహించని విధంగా డ్రాప్! కారణం అదేనా..?

అక్కినేని నాగ చైతన్య- సాయి పల్లవి జంటగా రూపొందిన '' మూవీ కలెక్షన్స్ పరంగా ఫర్వాలేదనిపించుకుంటూ దూసుకుపోతోంది. కరోనా దెబ్బకు కుదేలైన సినీ పరిశ్రమ ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న తరుణంలో థియేటర్స్‌లో 'లవ్ స్టోరీ' మూవీ రిలీజ్ ట్రేడ్ వర్గాల్లో ఆశలు చిగురింపజేసింది. గత శక్రవారం విడుదలైన ఈ సినిమా మొదటి నాలుగు రోజులు చెప్పుకోదగిన కలెక్షన్స్ రాబట్టి ఐదో రోజు మాత్రం ఊహించని విధంగా డ్రాప్ అయింది. గులాబ్ తుఫాన్ కారణంగా కలెక్షన్స్ కాస్త తగ్గినట్లు చెబుతున్నారు ట్రేడ్ పండితులు. నాలుగో రోజు 2.52 కోట్ల షేర్ అందుకున్న లవ్ స్టోరీ సినిమా ఐదో రోజున కేవలం 1.26 కోట్ల షేర్ సాధించింది. ఈ డ్రాప్‌కి కారణం వర్షాలే అని తెలుస్తోంది. బ్రేక్ ఈవెన్‌కి దగ్గరలో ఉన్న ఈ సినిమా ఈ వీకెండ్ ముగిసే సరికి లాభాల్లోకి వస్తుందని అంటున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో మొదటి నాలుగు రోజుల రిపోర్ట్ చూస్తే.. Day 1- 7.13 కోట్లు, Day 2- 5.08 కోట్లు, Day 3- 5.19 కోట్లు, Day 4- 2.52 కోట్లు, Day 5- 1.26 కోట్లు, మొత్తంగా చూస్తే రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి ఈ నాలుగు రోజుల్లో లవ్ స్టోరీకి 21.18 కోట్లు నికర, 34 కోట్లకుపైగా గ్రాస్ వసూళ్లు లభించాయి. ప్రపంచ వ్యాప్తంగా చూస్తే 26.66 కోట్ల నికర, 46.80 కోట్ల గ్రాస్ వసూలైంది. లవ్ స్టోరీ మూవీ విడుదలకు ముందే భారీ బజ్ నెలకొనడంతో ప్రపంచవ్యాప్తంగా చిత్ర ప్రీ రిలీజ్ బిజినెస్ దాదాపు 31 కోట్ల మేర జరిగింది. దీంతో 32 కోట్ల టార్గెట్ పెట్టుకొని బరిలోకి దిగిన ఈ మూవీ అలవోకగా ఈ మార్క్ అందుకుంటుందని తాజా రిపోర్ట్స్‌ని బట్టి తెలుస్తోంది. మరో 5.34 కోట్ల షేర్ అందుకుంటే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ చేరుకున్నట్లే.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3D0NqHP
v

పెళ్లి సందD 'మధురా నగరిలో' సాంగ్ రిలీజ్: దొరక్క దొరక్క దొరికింది తళుక్కు చిలక ఇది..

గత 25 ఏళ్ల క్రింద ‘పెళ్లి సందడి’ పేరుతో సినిమా తీసి రికార్డులు తిరగరాసిన దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు ఇప్పుడు మోడ్రన్ ప్రేక్షకుల కోసం మోడ్రన్ ''తో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. రాఘవేంద్ర రావు దర్శకత్వ పర్యవేక్షణలో రోషన్, శ్రీ లీల హీరోహీరోయిన్లుగా రూపొందుతున్న ఈ సినిమాకు గౌరీ రోనంకి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్స్‌‌‌లో భాగంగా ఇప్పటికే విడుదల చేసిన ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌లు, పాటలు, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా నుంచి 'మధురా నగరిలో' అంటూ సాగిపోతున్న మరో లిరికల్ సాంగ్ రిలీజ్ చేశారు. మాస్ మహారాజ్ రవితేజ తన సోషల్ మీడియా ఖాతా ద్వారా ఈ సాంగ్ లాంచ్ చేస్తూ పెళ్లి సందD యూనిట్‌కి బెస్ట్ విషెస్ తెలిపారు. ''దొరక్క దొరక్క దొరికింది తళుక్కు చిలక ఇది..'' అంటూ క్లాస్ బీట్‌తో రూపొందిన ఈ పాటలో హీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ, రాఘవేంద్రుడి మార్క్ సన్నివేశాలు ఆకట్టుకుంటున్నాయి. కీరవాణి బాణీలు పాటలో స్పెషల్ అట్రాక్షన్ అయ్యాయి. ఆర్‌కే ఫిలిం అసోసియేట్స్‌, ఆర్కా మీడియా వ‌ర్క్స్ బ్యానర్స్‌పై కె. కృష్ణ‌మోహ‌న్ రావు‌ సమర్పణలో రూపొందుతున్న ఈ మూవీకి మాధ‌వి కోవెల‌మూడి, శోభు యార్ల‌గడ్డ‌, ప్ర‌సాద్ దేవినేని నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. దసరా కానుకగా ఈ సినిమా విడుదల కానుంది. ఈ సినిమాలో హీరోగా నటిస్తున్న శ్రీకాంత్ తనయుడు రోషన్ కెరీర్‌కి ఈ సినిమా మంచి బూస్ట్ అవుతుందని తెలుగు ప్రేక్షక లోకం ఆశిస్తోంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3CSz4ZS
v

ఆ దేవుడే ఇలా చేసి ఉంటాడు.. ఇండస్ట్రీలో ఆయనలాంటి వారొక్కరే.. పూనమ్ కౌర్ ఎమోషనల్

సాయి ధరమ్ తేజ్‌కి యాక్సిడెంట్ జరగడం ఏంటో.. ఆయన సినిమా రిపబ్లిక్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా రావడం ఏంటో.. ఆ ఈవెంట్‌లో రాజకీయ కామెంట్లు చేయడం ఏంటో గానీ.. వాటికి ప్రతి స్పందనగా వైసీపీ మంత్రులు రియాక్ట్ అవ్వడం వరకు బాగానే ఉంది. ఆ తరువాత పోసానీ కృష్ణమురళీ ఎంట్రీ ఇచ్చి నానా రచ్చ చేసేశాడు. పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతూ.. ఇండస్ట్రీలోని ఓ పంజాబీ అమ్మాయి అంటూ పేరు ఎత్తడం, ఆమెకు జరిగిన అన్యాయం, ప్రేమ, పెళ్లి, గర్భం, అబార్షన్ అంటూ కొత్త టాపిక్‌ను లైన్‌లోకి తెచ్చాడు. అలా మొత్తానికి టాపిక్ అంతా కూడా చుట్టూ చేరింది. పంజాబీ నటి అంటే అందరూ కూడా పూనమ్ కౌర్‌ అనే అనుకుంటున్నారు. ఎందుకంటే ఈ విషయం గురించి గతంలో ఎన్నో సార్లు చర్చలు జరిగాయి. కత్తి మహేష్ ఎన్నో సందర్భాల్లో పవన్ కళ్యాణ్, పూనమ్ కౌర్ అంటూ ఎన్నెన్నో ఆరోపణలు చేశాడు. పూనమ్ కౌర్ సైతం ఎన్నో సందర్భాల్లో నర్మగర్భంగా ట్వీట్లు వేస్తూ టాలీవుడ్ టాప్ దర్శకుడు, పవన్ కళ్యాణ్ మీద సెటైర్లు వేస్తూ వచ్చేది. కొన్ని సందర్భాల్లో అయితే పవన్ కళ్యాణ్‌ను వెనుకేసుకుని వచ్చేది. గురూజీ అంటూ ఇండస్ట్రీలోని ఓ దర్శకుడిని పూనమ్ దారుణంగా ఏకిపారేసింది. అయితే ఇప్పుడు పూనమ్ కౌర్ వార్తలు దేశ వ్యాప్తంగా వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలో పూనమ్ కౌర్ ఎమోషనల్ అయింది. మీరున్నారనే సందేశాన్ని ఆ దేవుడు నాకు ఈ రోజు పంపించినట్టు అనిపిస్తోంది.. ఐ మిస్ యూ.. ఇండస్ట్రీలో ఉన్న ఏకైక గురు దాసరి గారు.. ఐ మిస్ యూ.. తండ్రి సమానులు అంటూ పూనమ్ కౌర్ ఏదో ఒక రహస్యాన్ని చెప్పేందుకు ప్రయత్నిస్తున్నట్టు కనిపిస్తోంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3uo4YdV
v

నా జీవితంలో ఎంతో ప్రత్యేకమైన వ్యక్తి.. భార్య స్నేహా రెడ్డిపై అల్లు అర్జున్ కామెంట్స్ వైరల్

టాలీవుడ్ క్రేజీ కపుల్స్‌లో ఒకటి అల్లు అర్జున్- జోడీ. మార్చి 6, 2011న అంగరంగ వైభవంగా ప్రేమ వివాహం చేసుకున్న ఈ జంట పదేళ్లుగా వైవాహిక జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. తన సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా కూడా ఫ్యామిలీ కోసం ప్రత్యేకంగా టైమ్ కేటాయిస్తుంటారు స్టైలిష్ స్టార్. ఈ జంటకు 2014లో కొడుకు అయాన్, 2016లో కూతురు అర్హ పుట్టారు. ఏ మాత్రం వీలు కుదిరినా భార్యాపిల్లలతో ఫ్యామిలీ టూర్స్ వేస్తూ ఎంజాయ్ చేస్తుంటారు . అయితే నేడు (సెప్టెంబర్ 29) అల్లు అర్జున్ సతీమణి స్నేహా రెడ్డి పుట్టినరోజు. ఈ సందర్భంగా భార్యకి ఎంతో స్పెషల్‌గా విషెస్‌ చెబుతూ తన సోషల్ మీడియా ఖాతా ద్వారా ఓ మెమరబుల్, స్పెషల్ ఫొటో షేర్ చేశారు అల్లు అర్జున్. ''నా జీవితంలో ప్రత్యేకమైన వ్యక్తికి పుట్టిన రోజు శుభాకాంక్షలు. నీ లాంటి వ్యక్తి నా జీవితంలో భాగం పంచుకోవడం నిజంగా నా అదృష్టం. ఇలాంటి మరెన్నో జన్మదిన వేడుకల్లో నీతో గడపాలని కోరుకుంటున్నాను. హ్యాపి బర్త్‌ డే క్యూటీ'' అని పేర్కొన్నారు అల్లు అర్జున్. బన్నీ పెట్టిన ఈ పోస్ట్ చూసి పలువురు సినీ ప్రముఖులు, ఆయన ఫ్యాన్స్ స్నేహాకు బర్త్ డే విషెస్ పోస్ట్ చేస్తున్నారు. ఇక అల్లు అర్జున్ కెరీర్ సంగతులంటారా.. ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న 'పుష్ప' మూవీతో బిజీగా ఉన్నారు బన్నీ. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తోంది. బన్నీ- సుకుమార్ హాట్రిక్ మూవీగా రాబోతున్న ఈ సినిమాపై బన్నీ ఫ్యాన్స్ బోలెడన్ని అంచనాలు పెట్టుకున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2Wl64KE
v

ఆమెకు సపోర్ట్ చేస్తే.. ఈ సమాజం నన్ను యాక్సెప్ట్ చేస్తుందా.. నాగబాబు సంచలన కామెంట్స్

మెగా బ్రదర్ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటారో అందరికీ తెలిసిందే. ఇక నాగబాబు కౌంటర్లు వేసేందుకు రంగంలోకి దిగిన తలపండిన దిగ్గజ మీమర్లు సైతం షాక్ అవ్వాల్సిందే. మీమ్స్, ట్రోల్స్ వేయడంలో నాగబాబు ఎంతటి సమర్థుడో అందరికీ తెలిసిందే. అయితే ఈ మధ్య కాస్త స్లో అయిన నాగబాబు మళ్లీ లైన్‌లోకి వచ్చాడు. ప్రస్తుతం జరుగుతున్న ఇష్యూల మీద నెటిజన్లు ప్రశ్నలు వేయడం, నాగబాబు తన స్టైల్లో కౌంటర్లు వేయడం జరిగింది. ఈ క్రమంలో మెగా అభిమానులు ఎక్కువగా పోసానీ మీడియా సమావేశం మీదే ప్రశ్నలు సంధించారు. ఇక పవన్ కళ్యాణ్‌ను గతంలో పోసానీ పొగిడిన వీడియోలను పెడుతూనే తన ఉద్దేశ్యం ఏంటో నాగబాబు చెప్పేశారు. అప్పుడు అలా మాట్లాడిన వాడే ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నాడు అంటూ కౌంటర్లు వేసేశాడు. అయితే ఓ నెటిజన్ మాత్రం , ఐపీఎల్ గురించి ప్రశ్నించాడు. ఈ రెంటిలో దేన్ని ఫాలో అవుతున్నారు అని అడిగేశాడు. అయితే ఆ ప్రశ్నకు నాగబాబు తన స్టైల్లో సమాధానం ఇచ్చాడు. బిగ్ బాస్ చూడకుండా ఐపీఎల్ చూస్తూ.. నా బిడ్డలాంటి ప్రియాంక సింగ్‌కి సపోర్ట్ చేస్తే.. ఈ సమాజం నన్ను యాక్సెప్ట్ చేస్తుందా మావా.. అంటూ సెటైర్ వేశాడు. బిగ్ బాస్ షో ప్రారంభ సమయంలోనే నాగబాబు ఓ వీడియోను వదిలాడు. ఈ ఐదో సీజన్‌లో తనకు తెలిసిన ఎంతో మంది షోలోకి వచ్చారని, అందరిలోకెల్లా సాయి తేజ్ అలియాస్ తనకు బిడ్డలాంటి వారని, ఆమె గెలిస్తే చూడాలని ఉందంటూ ఆమెకు తన మద్దతను ప్రకటించాడు నాగబాబు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3mbYevK
v

అవన్నీ రూమర్లే.. ఎట్టకేలకు నోరు విప్పింది.. మొదటిసారి స్పందించిన సమంత

అక్కినేని నాగచైతన్య, అక్కినేని మధ్య మనస్పర్దలు వచ్చాయని, విడాకులు తీసుకుని విడిపోనున్నారని గత కొన్ని రోజుల నుంచి వార్తలు వినిపిస్తున్నాయి. రీసెంట్‌గా స‌మంత హైద‌రాబాద్ విడిచిపెట్టేయ‌నుంద‌ని, ముంబైలో సెటిల్ అవుతుంద‌ని కూడా వార్త‌లు వ‌చ్చాయి. అయితే అటు నాగ‌చైత‌న్య‌, ఇటు స‌మంత ఎవ‌రూ ఈ వార్త‌ల‌పై స్పందించ‌లేదు. మీడియా, అభిమానులు వివిధ మాధ్య‌మాల ద్వారా ప్ర‌శ్నించిన‌ప్ప‌టికీ ఇద్ద‌రూ స‌మాధానాన్ని దాట‌వేశారు. అయితే ల‌వ్‌స్టోరి ప్ర‌మోష‌న్స్ స‌మయంలో, ల‌వ్‌స్టోరి స‌క్సెస్ త‌ర్వాత కూడా స‌మంత ఎక్క‌డా క‌నిపించలేదు. దీంతో అభిమానులు, సినీ ప్రేక్ష‌కులు, మీడియా.. చైత‌న్య‌, సామ్ విడిపోవ‌డం ప‌క్కా అని ఫిక్స్ అయిపోయారు. మీడియాకు క‌న‌ప‌డ‌కుండా, ఒక‌వేళ క‌న‌ప‌డినా స‌మాధానాన్ని దాట‌వేస్తూ వ‌చ్చిన స‌మంత ఎట్ట‌కేల‌కు రీసెంట్‌గా త‌న‌పై వ‌స్తున్న రూమ‌ర్స్‌కు క్లారిటీ ఇచ్చే ప్ర‌య‌త్నాన్ని చేసింది. వివ‌రాల్లోకెళ్తే.. సినిమాల‌కు సంబంధం లేకుండా స‌మంత త‌న సంపాద‌న‌తో సాకి అనే డ్రెస్ స్టోర్‌ను స్టార్ట్ చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ కంపెనీ స్టార్ట్ చేసి ఏడాది పూర్త‌య్యింది. ఈ సంద‌ర్భంగా, ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులు అడిగిన ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం ఇవ్వ‌డానికి సిద్ధ‌మైంది. ఈ క్ర‌మంలో ఓ అభిమాని మీరు ముంబైకి వెళ్లిపోతార‌ని వార్త‌లు వ‌స్తున్నాయండి.. మీరేమంటారు? అని ప్ర‌శ్నించాడు. దానికి అలాంటిదేమీ లేదు. నాకు హైద‌రాబాద్ చాలా ఇచ్చింది. ఈ ప్లేస్‌ను వ‌దిలే ప్ర‌స‌క్తే లేదు అంటూ స‌మాధానం ఇచ్చింది. ముంబైకి వెళ్లన‌ని చెప్పిన స‌మంత, మ‌రి చైత‌న్య‌తో విడిపోవ‌డం విష‌యం గురించి మాత్రం ప్ర‌స్తావించ‌లేదు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3oiojvO
v

పోసాని కృష్ణ మురళిపై మెగా డాటర్ ఫైర్.. మెంటల్‌ ఆస్పత్రిలో వేయండి అంటూ నిహారిక షాకింగ్ కామెంట్స్

'రిపబ్లిక్' ఈవెంట్‌లో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్‌పై జనసేనాని చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వంపై ప‌వ‌న్‌ క‌ళ్యాణ్‌ చేసిన వ్యాఖ్య‌ల‌ను ఖండిస్తూ వైసీపీ కార్య‌క‌ర్త‌, టాలీవుడ్ న‌టుడు పోసాని కృష్ణ‌ముర‌ళి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ప్రెస్ మీట్ పెట్టి మరీ జగన్‌తో నీకు పోలికేంటి అంటూ ఓ రేంజ్‌లో ఫైర్ అయ్యారు. దీంతో ఈ ఇష్యూ జనాల్లో హాట్ టాపిక్ అయింది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ ఇష్యూపై మెగా డాటర్ మరింత ఘాటుగా రియాక్ట్ అయ్యారు. పోసాని కృష్ణ మురళిని వెంటనే మెంటల్‌ ఆస్పత్రిలో చేర్పించాలంటూ సంచలన కామెంట్స్ చేశారు. సినిమాల్లోనే కాదు.. రియల్ లైఫ్‌లో కూడా మెంటల్ కృష్ణ అంటూ నిహారిక చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. పవన్ కళ్యాణ్ 'రిపబ్లిక్' సినిమా వేదికపై ఆడవాళ్లపై అనుచిత వ్యాఖ్యలు చేయలేదని నిహారిక చెప్పారు. జగన్‌ని పవన్ విమర్శించారనే పోసాని అలాంటి వ్యాఖ్యలు చేశారని మండిపడ్డారు. పోసాని ఓ మానసిక రోగి అని, ఆయన్ను వెంటనే మెంటల్ హాస్పిటల్‌లో చేర్పించాలని ఆమె డిమాండ్ చేశారు. ఈ ఇష్యూపై, పోసాని తీరుపై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని, అలాంటి వారిని అస్సలు వదలొద్దని నిహారిక కోరారు. మరోవైపు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ పోసాని పై పవన్‌ కళ్యాణ్ అభిమానులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. అక్కడక్కడా జ‌న‌సేన కార్య‌క‌ర్త‌లు పోసానిపై కేసులు కూడా పెట్టారు. దీంతో ఈ ఇష్యూ సినీ, రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం అయింది. ఒకరిపై ఒకరు వేసుకుంటున్న కౌంటర్లు, ఆ కామెంట్లు చూస్తుంటే ఇప్పుడు పోసాని Vs పవన్ కళ్యాణ్ అన్నట్లుగా మారిపోయింది పరిస్థితి. సోషల్ మీడియాలో పోసానిపై దుమ్మెత్తిపోస్తూ రెచ్చిపోయి కామెంట్స్ చేస్తున్నారు పవన్ ఫ్యాన్స్.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3kP71nS
v

వెంకీ మామ వదిలిన 'నాట్యం' సాంగ్.. మరో 'స్వర్ణ కమలం' అంటూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

డాన్స్ ప్రధాన భూమికగా గతంలో వచ్చిన 'స్వర్ణ కమలం' మూవీ తెలుగు ప్రేక్షకుల మదిలో అలా నిలిచిపోయింది. మళ్ళీ ఇన్నేళ్లకు అదే బాటలో 'నాట్యం' అనే మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. డాన్సింగ్ నేపథ్యంలో రేవంత్ కోరుకొండ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా . ఈ సినిమాతో ప్రముఖ కూచిపూడి డాన్సర్ సంధ్యారాజు నటిగా, నిర్మాతగా, కొరియోగ్రాఫ‌ర్‌గా, ప్రొడక్ష‌న్ డిజైన‌ర్‌గా, కాస్ట్యూమ్ డిజైన‌ర్‌గా ప‌రిచ‌యం అవుతున్నారు. ఈ సినిమా షూటింగ్ ఫినిష్ చేసుకొని అక్టోబ‌ర్ 22న ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌ల‌కు సిద్ధమైంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ఫ‌స్ట్‌లుక్ పోస్ట‌ర్, టీజ‌ర్‌కు ట్రెమండ‌స్‌ రెస్పాన్స్ వ‌చ్చింది. ఇటీవ‌ల న‌ట‌సింహ నంద‌మూరి బాల‌కృష్ణ ఆవిష్క‌రించిన ఫస్ట్ సాంగ్ ప్రేక్షకుల మనసు దోచుకుంది. ఈ నేపథ్యంలో తాజాగా టాలీవుడ్ స్టార్ హీరో చేతుల మీదుగా మరో సాంగ్ 'పోనీ పోనీ' లిరికల్ రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా వెంకటేష్ మాట్లాడుతూ.. ''రేవంత్ దర్శకత్వంలో డాన్సర్ సంధ్య నటించిన నాట్యం సినిమా నుంచి ఈ పోనీ పోనీ సాంగ్ రిలీజ్ చేస్తుండటం ఆనందంగా ఉంది. విలక్షణ కథకు ఎమోషన్స్ కలగలిపి రూపొందించారు. చాలా చక్కగా డాన్స్ చేశారు. చూస్తుంటే స్వర్ణ కమలం మళ్ళీ గుర్తొస్తోంది. అందమైన లొకేషన్స్‌లో ఎంతో అందంగా చిత్రీకరించారు. డాన్స్ బ్యాక్ డ్రాప్‌లో సినిమా రాక చాలా రోజులైంది. చిత్ర యూనిట్ మొత్తానికి ఆల్ ది బెస్ట్'' అన్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3mbJDAm
v

మన జర్నీ ఆగొద్దు.. మా ప్రయాణం నిలిచిపోతుందని ఎంతో ఫీల్ అయ్యా.. నాగ చైతన్య కామెంట్స్ వైరల్

నాగ చైతన్య- సాయి పల్లవి జంటగా శేఖర్ కమ్ముల రూపొందించిన '' సినిమా పాజిటివ్ రెస్పాన్స్‌తో దూసుకుపోతోంది. కలెక్షన్స్ పరంగా భేష్ అనిపించుకుంటోంది. సెప్టెంబర్ 24వ తేదీన ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా అంతా ఊహించినట్లుగానే మంచి సక్సెస్ అందుకోవడంతో హైదరాబాద్‌లోని హోటల్ 'ట్రైడెంట్'లో గ్రాండ్ సక్సెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ వేడుకలో , సాయి పల్లవి స్పెషల్ అట్రాక్షన్ కాగా.. ముఖ్య అతిథిగా నాగార్జున విచ్చేశారు. ఈ సందర్భంగా వేదికపై నాగ చైతన్య మాట్లాడుతూ.. ''నా ప్రతి సినిమా విడుదలైన తొలిరోజు ప్రేక్షకుల స్పందన ఏంటి? క్రిటిక్స్‌ ఏమంటున్నారు? అని తెలుసుకుంటా. వాటిని బట్టి ముందుకెళ్తుంటా. కొవిడ్‌ కారణంగా కొన్నాళ్లు దీనికి దూరమయ్యా. ఈ నెల 24న ‘లవ్‌ స్టోరీ’ విడుదల కావడంతో ఎంతో ఆనందించా. థియేటర్‌కి వచ్చిన తెలుగు సినిమా అభిమానులందరికీ చాలా థ్యాంక్స్‌. దర్శకుడు శేఖర్‌ కమ్ముల నుంచి ఎన్నో కొత్త విషయాలు నేర్చుకున్నా. దర్శకుడు శేఖర్ కమ్ముల గారి కంటెంట్, ఆయనకున్న గుడ్ విల్ ఎంత ఉందో ఇవాళ లవ్ స్టోరీ సక్సెస్ చూపిస్తోంది. మన జర్నీ ఆగొద్దు, ఇకపైనా మంచి సినిమాలు చేద్దాం. ఈ సినిమా విడుదలతో మా ప్రయాణం ఆగిపోతుందనే బాధ కలిగింది. ఈ జర్నీని ఆపొద్దు సర్‌. సినిమా రిలీజ్ అయ్యే ముందు లవ్ స్టోరీ హిట్ కావాలని స్టార్స్, డైరెక్టర్స్ కోరుకున్నారు. మనమంతా ఒక ఫ్యామిలీ అనే ఫీల్ క్రియేట్ చేశారు. వాళ్లందరికీ థాంక్స్. మా నిర్మాతలు కంటెంట్ నమ్మారు. థియేటర్‌లో రిలీజ్ అవ్వాలని హోల్డ్ చేశారు. లవ్ స్టోరి చిత్రంతో శేఖర్ గారు చాలా మంది కొత్త ఆర్టిస్టులను పరిచయం చేశారు. ఈ మ్యాజికల్ సక్సెస్ సందర్భంగా లవ్ స్టోరి టీమ్ అందరికీ కంగ్రాట్స్. మా అభిమానులందరికీ థాంక్స్. కొత్త తరహా సినిమా చేస్తే మీ ఆదరణ ఉంటుందని నిరూపించారు'' అన్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3uo00xr
v

Tuesday 28 September 2021

Pawan Kalyan ఓ సైకో.. కట్టె పుల్లకు చీర కట్టినా ఎత్తి చూసే రకం.. పోసాని వ్యాఖ్యలతో దుమ్ము దుమారం

'రిపబ్లిక్' మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో చేసిన వ్యాఖ్యలతో రచ్చ మొదలైంది. వైసీపీ నేతలను, ముఖ్యమంత్రి జగన్‌ని తీవ్ర స్థాయిలో విమర్శించడంతో వైసీపీ వర్సెస్ జనసేన నాయకుల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఓ వైపు వైసీపీ నాయకులు పవన్‌పై విరుచుకుపడుతుండగా.. సినీ రచయిత, దర్శకుడు, నటుడు ఎంటరై పవన్ మాట్లాడిన తీరుపై ధ్వజమెత్తారు. జగన్‌తో నువ్వు పోల్చుకోలేవు అని మండిపడుతూ పంజాబీ అమ్మాయి ఇష్యూ తెరపైకి తెచ్చారు. దీంతో రచ్చ రెట్టింపయింది. ఈ నేపథ్యంలో పవన్‌ ఫ్యాన్స్‌ తనని టార్గెట్‌ చేసి బెదిరింపులకు దిగారని, తనను తన భార్య పక్కింటి వాడితో రిలేషన్ పెట్టుకుందంటూ ఇష్యూలోకి లాగి వ్యక్తిగత దూషణకు దిగారని ఆరోపిస్తూ పోసాని మరోసారి మీడియా ముందుకు వచ్చారు. పవన్‌ ఫ్యాన్స్‌ గ్రూపులు గ్రూపులుగా బెదిరింపులకు దిగుతున్నారని, కొన్ని వేల ఫోన్స్, మెసేజీలు వస్తున్నాయని చెబుతూ ఫైర్ అయ్యారు. ఇలాంటి చిల్లర బెదిరింపులకు తాను భయపడనని అన్నారు. ''నీకు నీ కటుంబం ఎంత గొప్పో.. నాకు నా కుటుంబం కూడా అంతే గొప్ప. నువ్వు నీ ఫ్యాన్స్‌ని అడ్డుపెట్టుకొని నన్ను టార్గెట్ చేయి ఒప్పుకుంటా.. కానీ నా కుటుంబ సభ్యులను ఎందుకు లాగుతున్నావ్. విమర్శించడం వేరు, తిట్టుకోవడం వేరు. అసలు విమర్శలు తట్టుకోలేని వాడివి రాజకీయాల్లోకి ఎందుకు వచ్చావు. అబద్దం వల్ల సమాజం పాడవుతుంది. తిట్టు వల్ల పాడవదు. ఒక్క విషయం గుర్తు పెట్టుకో నువ్వు ఎంత తిట్టినా నేను డిమోరలైజ్‌ కాను. నన్ను చంపిస్తావా.. నేను రెడీ. నా డెడ్‌ బాడీ కూడా నిన్ను వదలదు'' అన్నారు పోసాని. ఇక మరోసారి పంజాబీ అమ్మాయి మాట తీసిన పోసాని.. పంజాబీ అమ్మాయిని నువ్వు మోసం చేయలేదా? ఆమెకు కడుపు చేసి డబ్బులిచ్చి పంపించలేదా? నువ్వు రాజకీయ నాయకుడివా.. బ్రోకర్ గాడివి నువ్వు. లోఫర్ గాడివి నువ్వు. ఎంత మంది ఆడపిల్లల జీవితాలు పాడుచేసిన నువ్వు మా ఇళ్లపై పెడతావా? మా కుటుంబం గురించి ఇక్కడ చాలా మందికి తెలుసు. నేను లోలోపల ఏడుస్తున్నా. ఇవ్వాళ నా భార్య అయింది. రేపు మీ భార్య అవుతుంది. ఊరుకుంటారా? ఎందుకు నువ్వు రాజకీయాల్లోకి రావడం? సినిమాలు చేసి డబ్బులు సంపాదించుకోవచ్చుగా. ఎలక్షన్‌లో ఓడిపోయిన దగ్గర్నుంచి పవన్ సైకోలా తయారయ్యాడు. ఎవరేమన్నా ఫ్యాన్స్‌తో టార్గెట్ చేస్తున్నాడు. నీకూ ఓ ఆడపిల్ల ఉంది. ఆమె పెద్దదవుతుంది. గుర్తు పెట్టుకో నేను చెబుతున్నా.. రక్త కన్నీరు పెట్టుకుంటావ్. నీకేం తెలుసు ఆడదాన్ని గౌరవించడం. పుల్లకు చీర కట్టినా ఆ పిల్ల ఎవరు అని ఎత్తి చూసే రకం నువ్వు'' అంటూ ఓ రేంజ్‌లో ఫైర్ అయ్యారు. పోసాని చేసిన ఈ కామెంట్స్‌తో పవన్ ఫ్యాన్స్ మరింత రెచ్చిపోతున్నారు. సోషల్ మీడియా వేదికగా పోసానిపై దుమ్మెత్తిపోస్తున్నారు. పోసాని మాట్లాడిన మాటలను ఖండిస్తూ రెచ్చిపోయి కామెంట్లు పెడుతున్నారు. పవన్‌ని అలా తిట్టినందుకు గాను కొన్ని చోట్ల పోసానిపై పోలీస్ కేసులు కూడా పెడుతున్నారు పవన్ ఫ్యాన్స్.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3ohQWJK
v

Posani Krishna Murali: పోసాని కృష్ణ ముర‌ళిపై కేసు న‌మోదు.. మ‌రో కేసు పెట్ట‌డానికి రెడీ అవుతున్న జ‌న‌సేన‌

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి వై.ఎస్‌.జ‌గ‌న్‌, ఇత‌ర నాయ‌కుల‌పై రీసెంట్‌గా జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ళ్యాణ్ చేసిన వ్యాఖ్య‌ల‌పై న‌టుడు, వైసీపీ కార్య‌క‌ర్త పోసాని ఫైర్ అయ్యారు. మంగ‌ళ‌వారం ప్రెస్‌క్ల‌బ్‌లో జ‌రిగిన ప్రెస్‌మీట్‌లో ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌పై ప‌రుష ప‌దజాలంతో పోసాని విరుచుకుప‌డ్డారు. త‌మ నాయ‌కుడిని ప‌రుషంగా మాట్లాడినందుకు పోసానిపై జ‌న‌సేన నాయ‌కులు ఆగ్ర‌హాన్ని ప్ర‌ద‌ర్శించారు. కొంద‌రు అయితే ఆయ‌న‌పై దాడి చేయ‌డానికి కూడా ప్ర‌య‌త్నించారు. పోలీసులు అడ్డుకుని ఆయ‌న్ని ఇంటికి పంపేశారు. పోసానిపై దాడికి ప్రయత్నించిన జనసేన కార్యకర్తలను పోలీసులు పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఆ స‌మ‌యంలో తెలంగాణ జ‌న‌సేన ఇంచార్జి శంక‌ర్‌ గౌడ్ పంజాగుట్ట పోలీస్ స్టేష‌న్‌లోనే పోసాని కృష్ణ‌ముర‌ళిపై కేసుని న‌మోదు చేశారు. ఇలాంటి ప‌రుష ప‌దజాలం వాడినందుకు ప‌ర్య‌వ‌సానాలు ఎదుర్కోవాల‌ని జ‌న‌సేన నాయ‌కులు పోసాని కృష్ణ‌ముర‌ళికి వార్నింగ్ ఇచ్చారు. తాజా స‌మాచారం మేర‌కు ఇప్పుడు జ‌న‌సేన తెలంగాణ మ‌హిళా విభాగానికి చెందిన నేత‌లు సైబ‌రాబాద్ క‌మీష‌న‌ర్‌కు పోసాని కృష్ణ‌ముర‌ళిపై ఫిర్యాదు చేయ‌బోతున్నారు. మంగ‌ళ‌వారం ప్రెస్‌మీట్ అనంత‌రం పోసానిపై దాడి చేయ‌డానికి కొంద‌రు ప్ర‌య‌త్నించారు. దానిపై ఆయ‌న స్పందిస్తూ త‌న‌కు ప‌వ‌న్ క‌ళ్యాణ్ అభిమానుల వ‌ల్ల ప్రాణ‌హాని ఉంద‌ని, త‌న‌కు ఏమైనా జ‌రిగితే ప‌వ‌న్‌క‌ళ్యాణ్ బాధ్య‌త వ‌హించాల‌న్నారు. అంతే కాకుండా బుధ‌వారం తాను కూడా ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌పై పోలీస్ స్టేష‌న్‌లో కేసు న‌మోదు చేయ‌బోతున్న‌ట్లు తెలిపారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/39K1aKi
v

Rashmika Mandanna: ‘పుష్ప’లో రష్మిక లుక్ రిలీజ్.. డిఫరెంట్‌గా క‌నిపిస్తోన్న‌ బ్యూటీ

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌, స్టార్ డైరెక్ట‌ర్ సుకుమార్ కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న హ్యాట్రిక్ మూవీ ‘పుష్ప‌’. ఇది రెండు భాగాలుగా రూపొంద‌నుంది. అందులో తొలి భాగం ‘పుష్ప ది రైజ్‌’ విడుద‌ల‌కు స‌న్న‌ద్ధ‌మ‌వుతుంది. పాన్ ఇండియా రేంజ్‌లో రూపొందుతోన్న ఈ చిత్రంలో బ‌న్నీకి జోడీ శాండిల్ వుడ్ బ్యూటీ ర‌ష్మిక మంద‌న్న న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే. తాజాగా ఈ సినిమా నుంచి ర‌ష్మిక మంద‌న్న పాత్ర ఎలా ఉంటుంది. ఆమె పాత్ర పేరు ఏంట‌ని? విష‌యాన్ని తెలియ‌జేస్తూ చిత్ర యూనిట్ ర‌ష్మిక లుక్‌ను విడుద‌ల చేసింది. సినిమాలో ర‌ష్మిక పాత్ర పేరు శ్రీవ‌ల్లి అనే ఈ పోస్ట‌ర్ ద్వారా తెలియ‌జేసింది చిత్ర యూనిట్. పోస్ట‌ర్‌ను గ‌మ‌నిస్తే.. ర‌ష్మిక అందంగా ముస్తాబ‌వుతుంది. బ‌న్ని ప్రేయ‌సిగా ర‌ష్మిక మంద‌న్న ఎలా ఆక‌ట్టుకుందో తెలుసుకోవాలంటే డిసెంబ‌ర్ వ‌ర‌కు వెయిట్ చేయాల్సిందేన‌ని సినీ వ‌ర్గాలు అంటున్నాయి. తాజా స‌మాచారం మేర‌కు క్రిస్మస్ సందర్భంగా ఈ మూవీలో తొలి భాగం ‘పుష్ప ది రైజ్‌’ను డిసెంబ‌ర్ 17న విడుద‌ల చేయడానికి మేక‌ర్స్ ప్లాన్ చేస్తున్నారు. ద‌స‌రా సంద‌ర్భంగా ఫ్యాన్స్‌కు ట్రీట్ ఇవ్వ‌డానికి ఐకాన్ స్టార్ అండ్ టీమ్ వ‌ర్క్ చేస్తుంది. అందులో భాగంగా ద‌స‌రాకు పుష్ప ది రైజ్ మూవీ నుంచి రెండో సాంగ్‌ను విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నార‌ట‌. శేషాచ‌ల అడ‌వుల్లో జ‌రిగే ఎర్ర‌చంద‌నం స్మ‌గ్లింగ్ నేప‌థ్యంలో పుష్ప సినిమాను సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో మైత్రీ మూవీ మేకర్స్‌, ముత్తం శెట్టి మీడియా సంస్థ‌లు నిర్మిస్తున్నాయి. ఇందులో అల్లు అర్జున్ పుష్ప‌రాజ్ అనే లారీ డ్రైవ‌ర్ పాత్ర‌లో క‌నిపించ‌బోతున్నాడు. కాగా.. మలయాళ విల‌క్ష‌ణ హీరో ఫ‌హాద్ ఫాజిల్ ఇందులో మెయిన్ విల‌న్‌గా క‌నిపించ‌బోతున్నాడు. ఇప్ప‌టికే ఈ సినిమాలో బ‌న్ని పాత్ర‌కు సంబంధించిన టీజ‌ర్‌, దాక్కో దాక్కో మేక సాంగ్స్ రిలీజ్ అయ్యాయి. మంచి ఆద‌ర‌ణ‌ను ద‌క్కించుకున్నాయి.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3ooLULg
v

UV Krishnam Raju: ఎల‌క్ష‌న్ ఆఫీస‌ర్‌కి కృష్ణంరాజు లేఖ‌... ఇంతకీ అందులో ఆయ‌న ఏం రాశారో తెలుసా?

సీనియ‌ర్ క‌థానాయ‌కుడు, నిర్మాత‌, రెబ‌ల్‌స్టార్ ఎన్నిక‌ల ఆఫీస‌ర్‌కు లేఖ రాశారు. ఇంత‌కీ ఎవ‌రా ఎన్నిక‌ల ఆఫీస‌ర్‌.. ఎందుకు కృష్ణంరాజు లేఖ రాశారు అనే వివ‌రాల్లోకి వెళితే.. ప్ర‌స్తుతం మూవీ ఆర్టిస్ట్ అసోసియేష‌న్ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. అక్టోబ‌ర్ 10న ఈ ఎన్నిక‌ల‌కు రంగం సిద్ధ‌మైంది. ఆరోజున ప్ర‌కాశ్‌రాజ్‌, మంచు విష్ణుల‌తో పాటు సి.వి.ఎల్‌.న‌ర‌సింహ‌రావు కూడా మా అధ్యక్ష ప‌ద‌వికి పోటీ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఎన్న‌డూ లేనంత‌గా ఇప్పుడు ‘మా’ ఎన్నిక‌ల పోటాపోటీగా జ‌రుగుతున్నాయి. అయితే ఈ ఎన్నిక‌లకు స‌రిగ్గా జ‌ర‌గ‌డం లేదా? లేకపొతే ఏమైనా అవ‌క‌త‌వ‌క‌లు జ‌రిగాయా? అందుక‌నే మూవీ ఆర్టిస్ట్ అసోసియేష‌న్ క్ర‌మ‌శిక్ష‌ణా సంఘం అధ్య‌క్షుడైన కృష్ణంరాజు ఎన్నిక‌ల అధికారిక లేఖ రాశారా? అనే సందేహం రాక‌మాన‌దు. అయితే ఇవేం కాదు.. ఆయ‌న లేఖ రాయ‌డం వెనుక అస‌లు ఉద్దేశం ఏంటో చూద్దాం. అస‌లు ఆ లేఖ‌లో ఏముందంటే.. ‘‘సీనియర్ ఆర్టిస్ట్‌గా, సీనియ‌ర్ సిటిజ‌న్‌గా ఇప్పుడున్న కోవిడ్ ప‌రిస్థితుల్లో నేను బ‌య‌ట‌కు రావ‌డం లేదు. అయితే అక్టోబ‌ర్ 10న ‘మా’ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఈ ఎన్నిక‌ల్లో నేను ప్ర‌త్య‌క్షంగా పాల్గొని ఓటేసే ప‌రిస్థితులు లేవు. కాబ‌ట్టి నాకు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేసే అధికారాన్ని క‌ల్పించ‌గ‌ల‌రు’’ అని తెలియజేస్తూ ఎన్నిక‌ల అధికారికి త‌న అడ్ర‌స్‌ను తెలియ‌జేస్తూ ఓ లేఖ రాశారు. మ‌రోవైపు కృష్ణంరాజు త‌న న‌ట వార‌సుడు ప్ర‌భాస్ హీరోగా న‌టించిన పాన్ ఇండియా మూవీ ‘రాధేశ్యామ్‌’లో ఓ అతిథి పాత్ర‌లో న‌టించారు. ఆ చిత్రానికి ఆయ‌న ఓ నిర్మాత‌గా కూడా వ్య‌వ‌హ‌రిస్తున్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుగుతున్నాయి. త్వ‌ర‌లోనే ఈ సినిమా విడుద‌ల తేదీపై ఓ క్లారిటీ రానుంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3kPTBIz
v

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...