Tuesday 31 August 2021

అఖండ నుంచి అదిరిపోయే న్యూస్.. బాలయ్యతో ఆ ఫైట్ సీన్స్ పీక్స్‌! బోయపాటి పక్కా స్కెచ్

సినిమా అంటే ఏ రేంజ్‌లో ఉంటుందో ఇప్పటికే చాలా సార్లు ప్రూవ్ అయింది. యాక్షన్ సన్నివేశాలను ఆయన తెరకెక్కించే విధానం మాస్ ఆడియన్స్ చేత గోల పెట్టిస్తుంది. హై వోల్టేజ్ కమర్షియల్ అంశాలతో థియేటర్స్‌కి వచ్చిన ప్రేక్షకులను థ్రిల్ చేయడం బోయపాటి స్పెషాలిటీ. ఇక ఈ మాస్ డైరెక్టర్‌తో నందమూరి నటసింహం జత కలిస్తే సంచలనమే. గతంలో ''సింహ, లెజెండ్'' సినిమాలతో నందమూరి అభిమానులకు పూనకాలు తెప్పించిన ఈ ఇద్దరూ ఈ సారి ''తో ఆ మ్యాజిక్ రిపీట్ చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ విషయం బయటకొచ్చింది. సింహ, లెజెండ్ సినిమాల్లో బాలయ్యను ఎంత పవర్‌ఫుల్‌గా చూపించారో అంతకుమించి ఈ సినిమాలో ప్రెజెంట్ చేయనున్నారట బోయపాటి. ఈ చిత్రంలో మొత్తం ఎనిమిది ఫైట్ సీన్స్ ఉంటాయని, ఇవ్వన్నీ కూడా వేటికవే ప్రత్యేకంగా ఉంటూ పీక్స్‌లో ఉంటాయని తెలుస్తోంది. నందమూరి అభిమానులకు విజువల్ ట్రీట్ ఇవ్వడమే టార్గెట్‌గా పెట్టుకొని బాలయ్యను రంగంలోకి దించుతున్నారట. సందర్భానుసారంగా వచ్చే భారీ యాక్షన్ సీన్స్ హైలైట్ కానున్నాయని తెలుస్తోంది. ఈ చిత్రంలో బాలకృష్ణ రెండు విభిన్నమైన పాత్రల్లో కనిపిస్తారని తెలుస్తుండటం సినిమాపై భారీ హైప్ తీసుకొచ్చింది. అఘోరాగా, అలాగే కలెక్టర్‌గా రెండు బలమైన పాత్రల్లో ఆయన కనిపించనున్నారని సమాచారం. ద్వారక క్రియేషన్స్ పతాకంపై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమాలో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. పూర్ణ కీలక పాత్రలో నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన 'అఖండ' అప్‌డేట్స్ సినిమాపై ఓ రేంజ్ అంచనాలు క్రియేట్ చేశాయి. ఈ చిత్రాన్ని దసరా కానుకగా రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు మేకర్స్.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3yCWwb0
v

ఎంగేజ్మెంట్‌తో సడెన్ షాకిచ్చిన ముక్కు అవినాష్.. జబర్దస్త్ కమెడియన్ పెళ్లి ఫిక్స్.. అమ్మాయి ఎవరంటే!!

బుల్లితెర పాపులర్ కమెడియన్ చేసుకొని సడెన్ షాకిచ్చాడు. తన ఎంగేజ్మెంట్‌ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ తన పెళ్లి ఫిక్స్ అయినట్లు కన్ఫర్మ్ చేశాడు. త్వరలోనే అనే అమ్మాయితో తన పెళ్లి జరగనుందని తెలిపాడు. దీంతో ఈ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. జబర్దస్త్ కమెడియన్‌గా ఎంట్రీ ఇచ్చి ఆరంభంలోనే అద్భుతమైన టైమింగ్‌తో అందరి దృష్టిలో పడ్డాడు ముక్కు అవినాష్. ఎన్నో షోస్ చేస్తూ కామెడీ చేయడంలో తనకంటూ ఓ ప్రత్యేకత ఉందని నిరూపించుకున్నాడు. ఆ తర్వాత బిగ్ బాస్ హౌస్‌లో అడుగుపెట్టి రచ్చరచ్చ చేశాడు. బిగ్ బాస్ ఇంట్లో అవినాష్ కలిపిన పులిహెర, అతని ట్రాకుల గురించి మనందరికీ తెలుసు. అదే సమయంలో ఆయన పెళ్లి మ్యాటర్ కూడా తెరపైకి వచ్చింది. బిగ్ బాస్ హౌస్‌లో తన పెర్ఫార్మెన్స్‌తో అట్రాక్ట్ చేయడమే కాకుండా అదే షోలో పాల్గొన్న లేడీ కంటెస్టెంట్, యాంకర్ అరియానాతో క్లోజ్ రిలేషన్ మెయిన్‌టైన్ చేయడంతో పలు అనుమానాలు రేకెత్తాయి. ఆ తర్వాత తామిద్దరి మధ్య స్నేహబంధం మాత్రమే ఉందని క్లారిటీ ఇస్తూనే ఫామ్ హౌసెస్ తిరుగుతూ ఎంజాయ్ చేశారు. దీంతో అవినాష్- అరియానా ఒక్కటవుతారనే టాక్ కూడా వచ్చింది. ఈ నేపథ్యంలో అలాంటి రూమర్లకు చెక్ పెడుతూ తాజాగా పెళ్లి వార్త మోసుకొచ్చాడు అవినాష్. ''చాలా మంది చాలా సార్లు నా పెళ్లిపై ప్రశ్నలు వేశారు. అతి త్వరలో నా అనూజతో ఒక్కటి కాబోతున్నా. ఎప్పటి లాగే మీ బ్లెస్సింగ్స్ ఉండాలని కోరుకుంటున్నా. సరైన వ్యక్తి జీవితంలోకి వచ్చినప్పుడు ఆలస్యం చేయడం ఎందుకు. మా కుటుంబాలతో పాటు మేము కలిసాం. మీ అనుజా అవినాష్'' అని పేర్కొంటూ తన ఎంగేజ్మెంట్ ఫొటోస్ పంచుకున్నాడు ముక్కు అవినాష్. ఈ ఫొటోస్ చూసి నెటిజన్లు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలుపుతున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2WGoq9b
v

మత్తు మందు ఇచ్చి ఆపై అడల్ట్ వీడియోల షూటింగ్! ప్రొడక్షన్ హౌస్ నిర్వాకం.. వెలుగులోకి సంచలన విషయాలు

సీనియర్ హీరోయిన్ శిల్పా శెట్టి భర్త, బిజినెస్‌మెన్ రాజ్ కుంద్రా రాకెట్ వ్యవహారం బాలీవుడ్ వర్గాలను కుదిపేసింది. పోర్న్ రాకెట్ ఇష్యూలో సంచలన విషయాలు బయటకు వచ్చాయి. రాజ్‌కుంద్రా తమతో బలవంతంగా అశ్లీల చిత్రాలను షూట్ చేసి యాప్‌లో అప్‌లోడ్‌ చేశారంటూ చాలామంది నటీమణులు ఆరోపణలు చేశారు. ప్రస్తుతం ఈ కేసు విచారణ కొనసాగుతుండగానే తాజాగా జార్ఖండ్ మోడల్, మాజీ మిస్‌ ఇండియా యూనివర్స్‌ మరో పోర్నోగ్రఫీ వ్యవహారాన్ని బయటపెట్టడం సినీ వర్గాల్లో హాట్ ఇష్యూ అయింది. ముంబైలోని ఓ ప్రొడక్షన్ హౌస్ మేనేజ్‌మెంట్ తనకు మత్తు మందు కలిపిన కూల్‌ డ్రింగ్‌ ఇచ్చి అసభ్యకర వీడియోలు షూట్ చేశారని పరీ పాసవాన్‌ ఆరోపించింది. ముంబైకి వచ్చిన కొత్తలోనే ఓ ప్రొడక్షన్ హౌస్‌కి వెళ్లగా, ముందుగా వాళ్ళు కూల్ డ్రింక్ ఇచ్చారని, అందులో మత్తు కలిపి స్పృహ కోల్పోయేలా చేసి తాను మత్తులో ఉండగా పోర్న్ వీడియోలు చిత్రీకరించారంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు బాలీవుడ్‌లో దుమారం రేపుతున్నాయి. అయితే ఆ ప్రొడక్షన్ హౌస్ పేరు మాత్రం బయటకు చెప్పని ఆమె, మత్తులోంచి బయటకొచ్చి ఆ విషయం తెలిసిన వెంటనే పోలీస్ కంప్లైట్ ఇచ్చానని, ఆ కేసు ఇంకా కొనసాగుతోందని చెప్పింది. గతంలో పరీ పాసవాన్‌ తన భర్తపై కూడా పోలీస్ కంప్లైట్ ఇచ్చింది. ఈ కేసులో ఆమె భర్త నీరజ్‌ పాసవాన్‌ను పోలీసులు అరెస్టు చేయడం, విచారించడం జరిగింది. ఈ విచారణలో పరీ పాసవాన్‌ పోర్న్ మూవీస్ చేసిందని ఆమె భర్త తరపు బంధువులు ఆరోపించారు. ఈ క్రమంలో తాజాగా ఆమె పూర్తి విషయాలు చెప్పకుండా పోర్నోగ్రఫీ ఇష్యూ తెరపైకి తీసుకురావడం చర్చల్లో నిలిచింది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/38tPjPZ
v

RGV: సినీ నటితో మరో వీడియో.. తగ్గేదే లే! అలా రెచ్చిపోయిన రామ్ గోపాల్ వర్మ.. కామెంట్ల మోత

కాంట్రవర్సీ అనే పదాన్ని తన పేరుకు పర్యాయపదంగా మార్చుకున్నారు . ముక్కుసూటి మనిషే అయినా గత కొంతకాలంగా ఆయన తీరు తీవ్ర చర్చనీయాంశం అవుతోంది. ఎవరేమనుకుంటే ఏంటి.. నాకు నచ్చింది నేను చేస్తా అంటూ వర్మ వెళుతున్న దారి, చేసే పనులు హాట్ టాపిక్ అవుతున్నాయి. వివాదంలో ఉంటూనే ఫ్రెష్ ఫీల్ కోసం వర్మ చేస్తున్న ఫీట్స్ షాకిస్తున్నాయి. ఇటీవలే ఇయన సుల్తానా అనే అప్‌కమింగ్ ఆర్టిస్ట్ బర్త్ డే వేడుకల్లో ఆయన చేసిన రచ్చ మాములుగా లేదు. సుల్తానాతో కలిసి చిందులేస్తూ ఏకంగా ఆమె పాదాలపై పడి దొర్లి దండం పెట్టడంతో అంతా షాకయ్యారు. ఇంతలోనే నటి జ్యోతితో మరో వీడియో బయటకు రావడం, దానిపై ఇటు ఆర్జీవీ అటు వివరణలు ఇవ్వడం జరిగిపోయాయి. ఈ నేపథ్యంలో తాజాగా వర్మ, జ్యోతిలకు సంబంధించిన ఇంకో వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోను నటి జ్యోతి స్వయంగా తన ఇన్స్‌స్టాలో షేర్ చేస్తూ 'లవ్ యూ సర్.. వర్మ వైఖరి నాకు చాలా ఇష్టం' అని ట్యాగ్ చేసింది. 'సాగర సంగమం' సినిమాలోని ఫేమస్ సాంగ్ ‘తకిట తదిమి తందానా’ అనే పాటకు జ్యోతితో కలిసి చిందేస్తూ ఫుల్లుగా ఎంజాయ్ చేశారు రామ్ గోపాల్ వర్మ. ఇది చూసిన నెటిజన్స్ మిశ్రమంగా స్పందిస్తున్నారు. 'మా గురువు గారితో మాములుగా ఉండదు మరి' అని కొందరు కామెంట్స్ చేస్తుంటే 'ఇది మీ జీవితం, మీకు నచ్చినట్లు బతకండి' అంటూ వర్మ దారిలోనే ఇంకొందరు జ్యోతికి మద్ధతుగా నిలుస్తున్నారు. సో.. చూడాలి మరి ఆ రోజు తాలూకు డాన్స్ వీడియోలు ఇంకెన్ని బయటకొస్తాయో, ఎలాంటి రచ్చ చేస్తాయో అనేది!.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/38sIVbF
v

15 నిమిషాల సుఖం కోసం అలా చేయలేను!.. కదిలించేలా రేణూ దేశాయ్ పోస్ట్

ప్రస్తుతం చాలా మంది శాకాహారులుగా మారిపోతోన్నారు. జీవ హింసకు వ్యతిరేకంగా, మూగ జీవుల హక్కులను గుర్తిస్తూ, వాటిపై అవగాహన తెచ్చుకుని కొంత మంది మాంసాహారాన్ని వదిలేస్తున్నారు. అయితే ఇందులో చాలా మంది వేగన్‌గా మారిపోవడానికి రకరకాల కారణాలుంటాయి. ఆ మధ్య ఆహా భోజనంబు షోలో ఆలీ గెస్టుగా వచ్చారు. తన భార్య మటన్ తినడం మానేసిందని దాని వెనుకున్న కథను చెప్పుకొచ్చారు. ఓ సారి మేకను ముక్కలు ముక్కలుగా కట్ చేయడం చూసిందని అప్పటి నుంచి మటన్ తినడం పూర్తిగా మానేసందని చెప్పుకొచ్చారు. అలా ఒక్కొక్కరు ఒక్కో సందర్భంలో రియలైజ్ అవుతుంటారు. అయితే కూడా వేగన్‌గా మారిపోయారట. చాలా మంది సెలెబ్రిటీలు ఇప్పుడు పూర్తిగా శాకాహారులుగా మారిపోయారు. ఇక రేణూ దేశాయ్ తాజాగా ఓ పోస్ట్‌ను షేర్ చేశారు. జంతు పరిరక్షణకు సంబంధించిన ఓ సంస్థ చేసిన పోస్ట్‌ను రేణూ దేశాయ్ తిరిగి షేర్ చేశారు. అలా తన అభిప్రాయాన్ని కూడా చెప్పకనే చెప్పేశారు. నేను వేగన్‌గా ఎందుకు మారిపోయాను?.. ఎందుకంటే.. ఓ జంతువు జీవితకాలం మొత్తాన్ని, దాని భయం, దాని బాధ, నొప్పి ఇవన్నీ కూడా కేవలం నా పదిహేను నిమిషాల సుఖం, సంతోషానికి సరితూగదు అని తెలుసుకున్నాను. ఆ విషయాన్ని నేను రియలైజ్ అయ్యాను. అంటూ ఆ పోస్ట్ సారాంశాన్ని రేణూ దేశాయ్ చెప్పుకొచ్చారు. మన కడుపు నిండి పదిహేను నిమిషాలు ఆనందంగా ఉండేందుకు ఓ జంతువు ప్రాణాన్ని తీసేస్తున్నాం.. అది నచ్చకే వేగన్‌గా మారిపోయాను అని రేణూ దేశాయ్ పరోక్షంగా చెప్పేశారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3kC1YWQ
v

మరో హాలీవుడ్ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన దీపకా.. ఈసారి నటిగానే కాదు.. నిర్మాతగా కూడా

బాలీవుడ్ బాద్‌షా షారుఖ్‌ఖాన్ నటించిన ‘ఓం శాంతి ఓం’ సినిమాతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చి.. తొలి సినిమాతోనే గ్రాండ్ సక్సెస్‌ను అందుకుంది . కెరీర్ ఆరంభంలో కేవలం గ్లామరస్ రోల్స్‌కి మాత్రమే పరిమితమైన ఈ భామ.. ఆ తర్వాత సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో తెరకెక్కిన రామ్ లీలా, భాజీరావ్ మస్తానీ, పద్మావత్ వంటి చిత్రాల్లో నటించి.. అందరి మెప్పు పొందింది. ఇక బాలీవుడ్‌తో పాటు.. హాలీవుడ్‌లోనూ ఓ సినిమాలో నటించింది ఈ సుందరి. అయితే సినిమాల ఎంపికలో దీపికా చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తుంది. తనకున్న ఇమేజీకి తగినట్లుగా ఆమె పాత్రలను ఎంపిక చేసుకుంటుంది. గత ఏడాది యాసిడ్ దాడి బాధితురాలు లక్ష్మీ అగర్వాల్ జీవితగాధ ఆధారంగా తెరకెక్కిన ‘ఛపాక్’ అనే సినిమాలో దీపికా అద్భుతంగా నటించింది. ఇక తన భర్త రణ్‌వీర్ సింగ్ నటిస్తున్న టీం ఇండియా మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ బయోపిక్‌లోనూ ఆమె ఓ ప్రధాన పాత్రలో నటిస్తోంది. ఇక హాలీవుడ్‌లో ‘ట్రిపుల్ఎక్స్’ సినిమాతో అడుగుపెట్టిన ఆమె.. ఇప్పుడు మరో సినిమాను కూడా హాలీవుడ్‌లో చేసేందుకు రెడీ అయిందట. రొమాంటిక్ కామెడీగా రూపొందే ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. టెంపుల్ హిల్ ప్రొడక్షన్స్ కూడా ఈ చిత్ర నిర్మాణంలో భాగస్వామి అవుతోంది. మరో విశేషం ఏమిటంటే, కథానాయిక దీపిక ఇందులో నటించడమే కాకుండా, తాను కూడా ఓ నిర్మాతగా ఈ చిత్ర నిర్మాణంలో భాగస్వామ్యం తీసుకుంటోంది. ఈ విషయాన్ని ఎన్టీఎక్స్ ఫిలిమ్స్ సంస్థ అధినేత ఆడమ్ ఫోజిల్సన్ ట్వీట్ చేశారు. దీపికా వంటి అంతర్జాతీయ స్టార్‌తో కలిసి పని చేయడం ఎంతో సంతోషంగా ఉంది అని ఆయన పేర్కొన్నారు. తన ప్రొడక్షన్ సంస్థ ‘కా ప్రొడక్షన్స్’.. ‘ఎన్టీఎక్స్ ఫిలిమ్స్‌తో కలిసి పని చేయడం గర్వకారణం అంటూ దీపికా కూడా పేర్కొంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3jvGf3h
v

ఆ పని చేస్తున్న హీరో నాని.. ఇంకా కామెంట్స్ చేయాలి అంటూ అభిమానులకు సూచన

హీరోగా నటించిన ‘’ సినిమా విడుదలకు సిద్ధమైన సంగతి తెలిసిందే. సెప్టెంబరు 10న అమెజాన్ ప్రైమ్ ఓటీటీ వేదికగా ‘టక్ జగదీష్’ సినిమాను విడుదల చేయనున్నట్లు.. ఇటీవలే ప్రకటించారు. ‘‘నాయుడుగారి చిన్నబ్బాయి టక్ జగదీశ్ చెబుతున్నాడు.. మొదలెట్టండి’’ అనే డైలాగ్ ప్రోమోతో తేదీని ఖాయం చేశారు. ఈ సినిమా టీజర్ ఇప్పటికే అంచనాలను పెంచేసింది. ఈ సినిమాలోని పాటలు సైతం ఆకట్టుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో నాని అభిమానులు.. ట్రైలర్ ఎప్పుడంటూ వెంటపడుతున్నారు. ఈ సందర్భంగా షైన్ స్క్రీన్ సంస్థ నాని వీడియోను పోస్ట్ చేసింది. పూర్తిస్థాయి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ సినిమాలో నాని సరసన హీరోయిన్‌గా నటిస్తుంది. ఇక ఈ సినిమాపై ఇప్పటికే అంచనాలు ఓ రేంజ్‌లో ఉండగా.. తాజాగా అమెజాన్ ప్రైజ్ ఓ ఆసక్తికర అప్‌డేట్‌ని పోస్ట్ చేసింది. హీరో నాని ‘టక్‌ జగదీష్’ సినిమాపై వస్తున్న కామెంట్లు అన్ని చూస్తున్నారు అంటూ అమెజాన్ ఓ వీడియో పోస్ట్ చేసింది. ఈ వీడియోలో నాని ఇంకా చేయండి.. అంటూ లేదా.. సినిమా త్వరగా చూసేయండి అంటూ అనే చెప్పే విధంగా సైగలు చేయడం మనం చూడవచ్చు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది. ఇక టక్‌ జగదీష్ ఓటీటీ విడుదల విషయంలో చాలా వివాదాలు జరిగాయి. ఈ సినిమాను థియేటర్‌లో విడుదల చేయకుండా ఓటీటీలో విడుదల చేయడాన్ని థియేటర్ల యాజమాన్యలు తీవ్ర వ్యతిరేకత చూపించాయి. అసలు నాని సినిమాలు ఏవీ థియేటర్‌లో విడుదల కాకుండా చూస్తామంటూ కూడా హెచ్చరికలు జారి చేశాయి. కానీ, ఆ తర్వాత తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నట్లు కూడా ప్రకటించాయి. ఇక, ఈ సినిమా విషయానికొస్తే.. ఈ శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందిందిన ఈ సినిమాలో ఐశ్వర్య రాజేష్ కూడా మరో హీరోయిన్‌గా నటిస్తోంది. థమన్ ఈ సినిమాకు సంగీతం సమకూర్చారు. ఏకంగా 45 కోట్లు చెల్లించి ఈ మూవీ హక్కులు అమెజాన్ ప్రైమ్ తీసుకుందని సమాచారం.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3mMQsKM
v

డ్రగ్స్ కేసులో పురోగతి.. సగం విచారణలోనే పూరి నుంచి కీలక విషయాలు లాగేశారు

టాలీవుడ్‌ డ్రగ్స్‌ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) మంగళవారం నుంచి విచారణ మొదలుపెట్టనుంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న 12 మంది సెలబ్రెటీలకు కొద్దిరోజుల క్రితమే నోటీసులు జారీచేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే నేటి(ఆగస్టు 31) నుంచి సెప్టెంబర్ 22వ తేదీ వరకు వారందరినీ హైదరాబాద్‌లోని ఈడీ కార్యాలయంలో వేర్వేరుగా ప్రశ్నించనుంది. ఈ కేసులో ఈడీ ఫోకస్ మొత్తం డ్రగ్స్‌ లావాదేవీల్లో జరిగిన మనీ లాండరింగ్‌పైనే ఉంది. దీంతో ఆ కోణంలోనే సెలబ్రెటీలపై ప్రశ్నల వర్షం కురిపించే అవకాశముంది. ఇక తాజాగా ఈ కేసులో మొట్టమొదలు దర్శకుడు పూరీ జగన్నాథ్ విచారణకు హాజరు అయ్యారు. మంగళవారం.. ఆయన ఈడీ కార్యాలయంకి వచ్చి విచారణలో పాల్గొన్నారు. ఆయన్ని 10.30కు విచారణకు రావాలని ఆహ్వానించగా.. పూరీ కాస్త ముందుగానే 10.05కే విచారణకు వచ్చారు. ఇక ఈడీ కార్యాలయం ముందు ఉన్న మీడియా ప్రతినిధులు ఆయనను కొన్ని ప్రశ్నలు అడగ్గా.. ఆయన ఎలాంటి సమాధానం ఇవ్వకుండా ఈడీ కార్యాలయంలోకి వెళ్లిపోయారు. అయితే ఇప్పటికే పూరితో జరిగిన విచారణలో అధికారులకు పలు కీలక అంశాలు తెలిసినట్లు టాక్ బలంగా వినిపిస్తోంది. అలాగే విదేశీ లావాదేవిలపై కూడా ఆరా తీసినట్లు తెలుస్తోంది. దాదాపు 5 గంటల విచారణ తర్వాత భోజన విరామం ఇచ్చారు. భోజన విరామం అనంతరం పోలీసులు కేసుకు సంబంధించి మరిన్ని విషయాలపై పూరీని విచారిస్తున్నారు. ఈ విచారణ సాయంత్రం ఆరు గంటల వరకూ కొనసాగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఈ విచారణ పూర్తయ్యే సమయానికి కేసుకు సంబంధించి మరిన్ని అంశాలు బయటకు వస్తాయని అనిపిస్తోంది. ఇక ఈ కేసులో సెప్టెంబరు 2న చార్మీ, 6న రకుల్‌, 8న రానా, 9న రవితేజ, ఆయన డ్రైవర్‌ శ్రీనివాస్‌, 13న నవదీప్‌, ఎఫ్‌-క్లబ్‌ పబ్‌ జనరల్‌ మేనేజర్‌, 15న ముమైత్‌ఖాన్‌, 17న తనీష్‌, 20న నందు, 22న తరుణ్‌ విచారణకు హాజరుకావాలని ఈడీ ఆదేశించింది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3BmzFlG
v

నడిరోడ్డు మీద రచ్చ.. భార్యను ముద్దుల్లో ముంచెత్తిన అలీ రెజా

తన భార్య మసూమతో చేసే అల్లరి మామూలుగా ఉండదు. ఈ ఇద్దరూ కలిసి సోషల్ మీడియాలో వెరైటీ వీడియోలను చేస్తుంటారు. ఇక యూట్యూబ్‌లోనూ ఈ ఇద్దరూ వీడియోలతో రచ్చ చేస్తుంటారు. బయటకు వెకేషన్స్ వెళ్లిన సమయంలోనూ వీడియోలతో హల్చల్ చేస్తుంటారు. ఇక అలీరెజాకు లోనావాలాలో ఉన్న ఇంటికి వెళ్లిన సందర్భంగా వదిలిన వీడియో బాగానే వైరల్ అయింది. ఇక మసూమతో కలిసి అలీ రెజా చేసే వీడియోలు, వారి సరసాలకు సంబంధించిన ఫన్నీ వీడియోలు నెట్టింట్లో వైరల్ అవుతుంటాయి. బిగ్ బాస్ ఇంట్లోకి అలీ రెజా కోసం రావడంతో ఎక్కువగా పాపులర్ అయ్యారు. అలా అప్పటి నుంచి ఆమె కూడా సోషల్ మీడియాలో స్టార్ సెలెబ్రిటీగా మారిపోయారు. శివజ్యోతి, హిమజ, రోహిణి వంటి వారితో కలిసి మసూమ బాగానే ఎంజాయ్ చేస్తుంటారు. ఇక రాహుల్ సిప్లిగంజ్, రవికృష్ణ, యాంకర్ రవి వంటివారితోనూ అలీ రెజా పార్టీలు చేసుకుంటూ ఉంటారు. మొన్నీ మధ్యే అలీరెజా రాఖీ సెలెబ్రేషన్స్‌లో భాగంగా అందరూ ఒక్క చోటకు చేరుకున్నారు. ఇక ఇప్పుడు అలీ రెజా తన సినిమా ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉన్నారు. వైల్డ్ డాగ్ ఆశించినంతగా పేరు తీసుకురాలేకపోయింది. అందుకే సరైన సక్సెస్ కోసం అలీ రెజా ప్రయత్నిస్తున్నారు. అలీ రెజా ప్రస్తుతం ఆహ్ (aAh!) అనే చిత్రంతో బిజీగా ఉన్నారు. ఈ మధ్యే ఈ మూవీ నుంచి మొదటి పాటను రిలీజ్ చేశారు. అది బాగానే వైరల్ అయింది. తాజాగా అలీ రెజా తన భార్యను నడి రోడ్డు మీద ముద్దుల్లో ముంచెత్తారు. ఈ ఫోటోలు నెట్టింట్లో తెగ చక్కర్లు కొడుతున్నాయి.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2Wx2jl7
v

ఆయనతో గడపడమంటే చాలా ఇష్టం.. శాంతనుతో రిలేషన్! పెళ్లిపై శృతి హాసన్ ఓపెన్ కామెంట్స్

స్టార్ హీరో కమల్ హాసన్ కూతురిగా సినీ గడపతొక్కి స్టార్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకుంది . ఎక్కువగా మోడ్రన్ కల్చర్ ఇష్టపడే ఆమె సోషల్ మీడియాలో చాలా విషయాలపై ఓపెన్ అవుతుంటుంది. ముఖ్యంగా తన లవ్ మ్యాటర్స్ మాత్రం అస్సలు దాచుకోని ఆమె.. గతంలో తన ప్రియుడు మైఖేల్‌ కోర్సలేతో చేసిన హంగామా అంతా ఇంతా కాదు. ఆ తర్వాత అతనికి బ్రేకప్ చెప్పేసి డూడుల్‌ ఆర్టిస్ట్‌ శాంతను హజారికతో క్లోజ్ రిలేషన్ మెయిన్‌టైన్ చేస్తుండటంతో వాళ్ళిద్దరిపై రకరకాల వార్తలు వైరల్ అవుతున్నాయి. శాంతనుతో ఎక్కువ సమయం గడుపుతూ.. అతనితో కలిసున్న ఫొటోలను తరచూ సోషల్‌ మీడియాతో షేర్‌ చేస్తూ హల్చల్ చేస్తోంది. చెట్టాపట్టాలేసుకొని తిరుగుతూ డేటింగ్ చేస్తూ నిత్యం వార్తల్లో నిలుస్తోంది. దీంతో శృతి పెళ్లిపై తెగ రూమర్స్ పుట్టుకొచ్చాయి. శాంతనుతో శృతి ప్రేమాయణం నడుపుతోందని, త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతోందనే వార్తలు వైరల్ అయ్యాయి. ఈ నేపథ్యంలో తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో పెళ్లిపై ప్రశ్న ఎదురుకావడంతో ఆసక్తికరంగా స్పందించింది శృతి. పెళ్లి చేసుకోవాలని అనిపించిన వెంటనే ఆ విషయం అందరికీ చెప్పేస్తానని, ప్రస్తుతానికైతే అలాంటి ఆలోచనలు లేవని చెప్పుకొచ్చింది. పెళ్లికి సంబంధించి తన దగ్గర ఎలాంటి సీక్రెట్స్‌ లేవని చెప్పిన ఆమె.. శాంతను తన బెస్ట్‌ ఫ్రెండ్‌ అని, ఆయనంటే తనకు ఎంతో గౌరవం ఉందని తెలిపింది. తమ మధ్య అభిరుచులు కలిశాయి కాబట్టే అతనితో ఎక్కువ సమయం గడపడానికి ఇష్టపడతానని చెప్పింది. స్టార్ హీరోయిన్‌గా కెరీర్ కొనసాగుతున్న సమయంలోనే సినిమాలకు చిన్న బ్రేక్ ఇచ్చిన శృతి హాసన్ రీసెంట్‌గా 'క్రాక్' సినిమాతో తిరిగి ప్రేక్షకుల ముందుకొచ్చింది. ప్రస్తుతం ప్రభాస్ హీరోగా రూపొందుతున్న భారీ సినిమా 'సలార్' షూటింగ్‌లో పాల్గొంటోంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3Bv20Gu
v

Aamani అలా ఇంద్రజ ఇలా.. చిన్నప్పటి నుంచి అదే పిచ్చి!

ఆమని, ఇంద్రజలు హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన కాలం గురించి అందరికీ తెలిసిందే. ఈవీవీ, బాపు, ఎస్వీ కృష్ణారెడ్డి వంటి దిగ్గజ దర్శకుల చిత్రాల్లో నటించి స్టార్ హీరోయిన్లుగా మారిపోయారు. , ఇంద్రజలు కలిసి దాదాపు మూడు నాలుగు సినిమాల్లో నటించారు. ఇక ఇప్పుడు ఈ ఇద్దరూ కూడా సెకండ్ ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తూ ఫుల్ హ్యాపీగా ఉన్నారు. ఇండస్ట్రీకి వచ్చాక తామిద్దరం ఫ్రెండ్స్ అయ్యామని చెబుతూ.. ఎన్నో పర్సనల్ విషయాలను పంచుకున్నారు. తాజాగా ఈ ఇద్దరూ ఆలీతో సరదాగా షోలో తమ సినీ, పర్సనల్ జీవితం గురించి నోరు విప్పారు. ‘నాకు చిన్నప్పటి నుంచి చదువంటే పిచ్చి.. చదువుకుంటాను అంటే ఇంట్లో వాళ్లు ఒప్పుకోలేదు. నాకు ఇప్పటికే అది తలుచుకుంటే బాధగా ఉంటుంది. నాకు ఇద్దరు చెల్లెళ్లు. నాకు ఒక అన్నయ్య, తమ్ముడు ఉంటే బాధ్యతలు వారు చూసుకుంటూ నన్ను చదువుకొనిచ్చే వారేమోనని ఫీలవుతుంటాను. నేను చదువుల్లో ఫస్ట్. స్కూల్లో ఫస్ట్ వచ్చేదాన్ని. ఒకవేళ సినిమాల్లోకి రాకపోయి ఉంటే.. జర్నలిస్ట్ అయినా అయి ఉండేదాన్ని, లేదా సైంటిస్ట్ అయినా అయి ఉండేదాన్ని’ అంటూ తనకు చదువుల మీద ఉన్న పిచ్చిన చెప్పుకొచ్చారు. ఇంద్రజ చెప్పిన దానికి వ్యతిరేకంగా ఆమని చెప్పుకొచ్చారు. ‘నాకు చదువులు అంటే అంతగా పడవు. మీడియం స్టూడెంట్‌ను. ఇంద్రజ అంతగా చదివేదాన్ని కాదు. స్కూల్ ఎగ్గొట్టి మరీ సినిమాలు చూసేదాన్ని. స్కూల్‌కు వెళ్లినా కూడా సినిమా మీద ధ్యాస ఉండేది. జయసుధ, జయప్రద, శ్రీదేవీ ఇలా అందరి సినిమాలు చూసేదాన్ని. సినిమాలంటే అంతగా పిచ్చి’ అంటూ ఆమని తన గురించి తెలిపారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3jvsfXx
v

Drug Peddling Case: సినీ నటి ఇంట్లో గంజాయి.. బాత్రూమ్‌లో దాక్కున్నా వదలని పోలీసులు!!

సినీ ఇండస్ట్రీలో మరోసారి కేసు కలకలం సృష్టిస్తోంది. శాండల్‌వుడ్ డ్రగ్స్ కేసులో ఇప్పటికే సంజనా, రాగిణిలు అరెస్ట్ కావడం, సంచలన విషయాలు వెలుగులోకి రావడం జరగగా.. తాజాగా మరో నటి పేరు తెరపైకి రావడం హాట్ టాపిక్ అయింది. శాండల్‌వుడ్ నటి సోనియా అగర్వాల్ ఇంట్లో గంజాయి దొరికినట్లు పోలీసులు చెబుతున్నారు. ప్రస్తుతం ఆమె పోలీస్ కస్టడీలో ఉంది. మాదక ద్రవ్యాలు విక్రయించే ముఠాలో ఒకరు సోనియా వివరాలు చెప్పడంతో ఆమె ఇంట్లో సోదాలు నిర్వహించారట. ఈ క్రమంలో 40 గ్రాముల గంజాయి దొరకడంతో దాన్ని స్వాధీనం చేసుకున్నారని తెలిసింది. కాస్మెటిక్ వ్యాపారాన్ని నిర్వహిస్తున్న నటి సోనియా అగర్వాల్ కొందరు ప్రముఖులతో టచ్‌లో ఉంటూ ఈ డ్రగ్స్ పెడల్‌లో భాగమవుతోందని ఆరోపణలు రావడంతో పోలీసులు సోదాలు చేశారు. సోనియాతో పాటు ఇదే విషయమై ఆరోపణలు ఎదుర్కొంటున్న మరో ఇద్దరు వ్యాపారవేత్తలు డిజె వచన్ చిన్నప్ప, భరత్‌ను బెంగుళూరులోని గోవిందపుర పోలీసులు ఈ రోజు అరెస్ట్ చేశారు. అయితే పోలీసుల ఆకస్మిక దాడి గురించి ముందే సమాచారం అందుకుందట సోనియా అగర్వాల్. వెంటనే ఓ ప్రైవేట్ హోటల్‌లో బుక్ చేసుకొని హోటల్ గదిలోని వాష్‌రూమ్‌లో దాక్కుందని, అయిన సోనియా జాడ తెలుసుకొని పోలీసులు అరెస్ట్ చేశారని అక్కడి మీడియా వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు టాలీవుడ్‌లో కూడా మరోసారి డ్రగ్స్ కేసులు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. గతంలో ఆరోపణలు ఎదురుకున్న సెలబ్రిటీలందరికీ ఎన్‌ఫోర్స్‌మెంట్ డెరక్టరేట్(ఈడీ) రీసెంట్‌గా సమన్లు పంపించింది. ఈ రోజు (మంగళవారం) నుంచి ఈడీ విచారణ మొదలైంది. విచారణలో భాగంగా డైరెక్టర్ పూరీ జగన్నాథ్‌ ఈరోజు ఈడీ ముందు హాజరయ్యారు. ఛార్మి, రకుల్ ప్రీత్ సింగ్, రానా, రవితేజ, నవదీప్, ముమైత్ ఖాన్, తనీష్, నందు విచారణ ఎదుర్కోనున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2WJwq9g
v

Seetimaarr Trailer : సౌత్ కా సత్తా సీటీమార్‌కే.. గోపీచంద్ మాస్ యాంగిల్!

గోపీచంద్ కాంబినేషన్‌లో సంపత్ నంది తెరకెక్కించిన సినిమా సీటీమార్. కబడ్డీ ఆట నేపథ్యంలో రాబోతోన్న ఈ మూవీ ఇప్పటికే పలుమార్లు వాయిదా పడింది. కరోనా, లాక్డౌన్ వల్ల ఆలస్యమవుతూ వచ్చిన ఈ సినిమాకు ఎట్టకేలకే థియేటర్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. వినాయక చవితి సందర్భంగా ఈ మూవీ సెప్టెంబర్ 10న విడుదల కాబోతోంది. తాజాగా ఉస్తాద్ హీరో ఇస్మార్ట్ ఈ మూవీ ట్రైలర్‌ను విడుదల చేశారు. గోపీచంద్‌లోని మాస్ యాంగిల్ మొత్తానికి బయటకు తీసినట్టు కనిపిస్తోంది. యాక్షన్ సీక్వెన్స్‌లకు నిజంగానే పడేట్టు కనిపిస్తోంది. ఇక సీటీమార్ ట్రైలర్ ఆద్యంతం మాస్ ప్రేక్షకులను మెప్పించేందుకు కట్ చేసినట్టుగా అనిపిస్తుంది. గోపీచంద్ మూవీ తరహాలోని భారీ యాక్షన్ సీక్వెన్స్‌లు సీటీమార్‌లో కుప్పలు తెప్పలుగా ఉన్నట్టు కనిపిస్తున్నాయి. ఆటలు, ఆడవాళ్లు అంటూ ఎమోషనల్ సీన్లు కూడా కనిపిస్తున్నాయి. ఆడవాళ్లపై జరిగే వివక్ష, ఆటల్లో ఆడవారిని రానివ్వకుండా సమాజం ఎలాంటి అవమనాలు చేస్తుందో.. పొట్టి బట్టలపై ఎలాంటి కామెంట్లు చేస్తుందో ట్రైలర్‌లో చూపించారు. వారు వేసుకునే బట్టల సైజుతోనే వారి క్యారెక్టర్‌ను గుర్తిస్తారు అంటూ రాసిన డైలాగ్ ఆకట్టుకునేలా ఉంది. సీటీమార్‌లో సౌత్, నార్త్ వివక్షను కూడా అంతర్లీనంగా టచ్ చేసినట్టు కనిపిస్తోంది. ట్రైలర్ చివర్లో చెప్పిన డైలాగ్ అందరినీ ఆకట్టుకునేలాా ఉంది. సౌత్ కా సత్తా మార్ కే నై.. సీటీమార్ కే దికాయేంగే (సౌత్ సత్తా ఏంటో ఇలా కొట్టి చెప్పం. సీటీ కొట్టి మరీ చెబుతాం) అంటూ గోపీచంద్ చెప్పిన డైలాగ్ బాగుంది. మొత్తానికి ఈ మూవీ మాస్ ప్రేక్షకులనే కాకుండా ప్రతీ ఆడియెన్‌ను కట్టిపడేసేలా ఉంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2V0v2OO
v

మీరు చేసింది దేశానికే ఆదర్శం.. ప్రతీ భారతీయుడు దాన్ని చూసి గర్వించాలి: చిరంజీవి

ఈ ఏడాది టోక్యోలో జరుగుతున్న పారా ఒలింపిక్స్‌లో భారత అథ్లెట్లు అద్భుత ప్రదర్శన చేస్తున్నారు. గతంలో ఎన్నడూ లేని రీతిలో ఈ ఏడాది మెడల్స్ పంట పండిస్తున్నారు. ఈ టోర్నమెంట్‌లో టేబుల్ టెన్నీస్ విభాగంలో భవీనా పటేల్ భారత్‌కు తొలి మెడల్ అందించారు. చైనాకు చెందిన క్రీడాకారిణితో పోటీ పడిన ఆమె.. ఓటమిపాలు అయినప్పటికీ.. రజత పతకాన్ని సొంతం చేసుకున్నారు. ఆ తర్వాత.. జావిలిన్ త్రో విభాగంలో సుమిత్, 10మీ ఎయిర్ రైఫిల్ విభాగంలో స్వర్ణ పతకాలు సాధించారు. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు ఈ అథ్లెట్లకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. తాజాగా మెగాస్టార్ వీరిని అభినందిస్తూ ట్వీట్ చేశారు. ఆత్మవిశ్వాసం ముందు అంగవైకల్యం తలవంచాల్సిందేనని నిరూపించి దివ్యాంగులలో గొప్పస్పూర్తిని నింపేలా పారాలంపిక్ క్రీడలలో దేశానికి పతకాలు అందించిన విజేతలకు అభినందనలు. ఈ విజయాలు ప్రతి భారతీయుడు గర్వించేవి’ అంటూ ఆయన పేర్కొన్నారు. ఇక పారాలింపిక్స్‌లో తొలి స్వర్ణం సాధించిన భారత మహిళగా రికార్డు సృష్టించిన అవని లేఖరాకు ఆయన ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. ఇక సినిమాల విషయానికొస్తే.. మెగాస్టార్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో చేస్తున్న ‘ఆచార్య’ అనే సినిమా దాదాపు షూటింగ్ పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధమైంది. దీంతో పాటు ఆయన మెహన్ రాజా దర్శకత్వంలో ‘గాఢ్ ఫాదర్’ అనే సినిమాలో నటిస్తున్నారు. ఇక తమిళంలో అజిత్ నటించిన ‘వేదాళం’ సినిమాను తెలుగులో చిరూ రీమేక్ చేస్తున్నారు. మెహర్ రమేశ్ దర్శకత్వంలో ‘భోళా శంకర్‌’ అనే టైటిల్‌తో ఈ సినిమా రూపొందనుంది. ఈ సినిమాలు చిరంజీవికి సోదరిగా కీర్తి సురేష్ నటిస్తున్నారు. దీంతో పాటు ఆయన మరో సినిమా పనుల్లో కూడా బిజీగా ఉన్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3yvkfdk
v

Suriya భార్యగానా? జ్యోతికగానా?.. బాబోయ్ ఇదేం క్రేజ్.. గంటల్లోనే లక్షల మంది!

గురించి తెలుగు ప్రేక్షకులను ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. నటిగా, హీరోయిన్‌గా జ్యోతిక చేసిన సినిమాలో ఆమె గురించి చెబుతాయి. ఇక స్టార్ హీరోల సరసన నటించిన జ్యోతికకు కోలీవుడ్‌లోనే ఎక్కువ క్రేజ్, అవకాశాలు వచ్చాయి. ఇక అక్కడే హీరో సూర్యతో ప్రేమలో పడి పెళ్లి కూడా చేసుకున్నారు. పెళ్లి తరువాత జ్యోతికి సినీ కెరీర్‌కు కాస్త విరామం ఇచ్చారు. అయితే సెకండ్ ఇన్నింగ్స్‌లో జ్యోతిక దుమ్ములేపుతున్నారు. లేడీ ఓరియెంటెడ్ చిత్రాలకు జ్యోతిక కేరాఫ్ అడ్రస్‌గా మారిపోయారు. ఆమె నటించిన ఎన్నో సినిమాలు సక్సెస్ అయ్యాయి. సూర్య, జ్యోతిక కలిసి కూడా ఎన్నో ప్రయోగాలు చేశారు. జ్యోతికి చివరగా కార్తీతో కలిసి వచ్చారు. కానీ ఆ మూవీ అంతగా వర్కవుట్ అవ్వలేదు. అయితే తాజాగా జ్యోతికి ఇన్ స్టాగ్రాంలోకి అడుగుపెట్టేశారు. ఇక అలా ఎంట్రీ ఇచ్చారో లేదో ఇలా క్షణాల్లో ఫాలోవర్ల సంఖ్య అంతకంతకూ పెరుగుతూనే వచ్చింది. గంటల్లోనే మిలియన్ ఫాలోవర్లను క్రాస్ చేసేశారు. ప్రస్తుతం జ్యోతికకు ఇప్పుడు దాదాపు 13 లక్షల మంది ఫాలోవర్లు వచ్చారు. ఆమె చేసిన ఫస్ట్ పోస్ట్ అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. ఈ ఇండిపెండెన్స్ డే సందర్భంగా ట్రెక్కింగ్‌కు వెళ్లిన జ్యోతికి అక్కడి విశేషాలను పంచుకుంటూ జాతీయ జెండాను షేర్ చేశారు. అందరికీ హలో.. సోషల్ మీడియాలోకి రావడం ఇదే మొదటిసారి. నా లాక్డౌన్ డైరీ నుంచి ఎన్నో మంచి విషయాలను పంచుకోవాల్సి ఉంది. కాశ్మీర్ సరస్సులు, హిమాలయాల, అక్కడి ట్రెక్కింగ్, ఎన్నో అద్భుత విన్యాసాలు చేశాను. ఇండియా ఎంతో గొప్పది అంటూ మొదటి పోస్ట్ చేసి తన దేశభక్తిని చాటుకున్నారు. అయితే జ్యోతికకు ఈ రేంజ్‌లో ఫాలోవర్లు పెరుగుతుండటం చూసి అందరూ షాక్ అవుతున్నారు. ఇది జ్యోతిక క్రేజా? భార్యగా వచ్చిన క్రేజా? అని ఆశ్చర్యపోతోన్నారు. ఇక జ్యోతిక ఇలా ఎంట్రీ ఇవ్వడంపై సూర్య స్పందించారు. మై పొందట్టి.. నువ్వెంతో బలమైన దానివి.. ఇన్ స్టాలో నిన్ను చూసి థ్రిల్ అవుతున్నాను అని కామెంట్ పెట్టేశారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3t1LJWK
v

Sitara Ghattamaneni : పెద్దవాడివి అయిపోయావ్.. నిన్ను ఇక రకరకాలుగా ఏడిపిస్తా.. గౌతమ్‌పై సితార

సూపర్ స్టార్ మహేష్ బాబు తనయుడు గౌతమ్ గురించి ప్రత్యేకంగా చెప్పా్ల్సిన పని లేదు. సితార టైపులో ఎక్కువగా సోషల్ మీడియాలో కనిపించరు. మహేష్ బాబుకు మల్లే కాస్త ఈ హడావిడి ప్రపంచానికి దూరంగా ఉంటారు. నమ్రత, సితార షేర్ చేసే ఫోటోల్లో గౌతమ్ కనిపిస్తాడు. అంతే తప్పా.. తనకు ఇంత వరకు స్పెషల్ అకౌంట్లు లేనే లేవు. సోషల్ మీడియాకు గౌతమ్ వీలైనంత దూరంగా ఉంటుంటారు. అయితే వెకేషన్స్ కోసం బయటకు వెళ్లినప్పుడు మాత్రం ఫ్యామిలీ పిక్స్‌లో గౌతమ్ మెరుస్తుంటారు. ఇక వన్ సినిమాలో గౌతమ్ నటన గురించి అందరికీ తెలిసిందే. వన్ సినిమా ఘట్టమేనేని అభిమానుకు ఎంతో ప్రత్యేకం. మహేష్ బాబు, గౌతమ్ ఇద్దరూ కలిసి ఒకే ఫ్రేమ్‌లో కనిపిస్తారు. అలా ఆ సినిమా వారికి ఎంతో స్పెషల్‌గా మారిపోయింది. నేడు (ఆగస్ట్ 31) గౌతమ్ పుట్టినరోజు. గౌతమ్ పదిహేనవ ఏటలోకి అడుగుపెట్టడంతో మహేష్ బాబు, నమ్రత స్పెషల్‌గా విష్ చేశారు. ఇక చిట్టి చెల్లి సితారా మాత్రం తన స్టైల్లో ఆట పట్టేసింది. గౌతమ్‌ను సితార, మహేష్ బాబు ఎలా ఆడుకుంటారో.. ఆ ఆటల్లో వారు గౌతమ్‌ను ఎలా మోసం చేస్తుంటారో నమ్రత చెబుతుంటారు. ఇక తాజాగా గౌతమ్‌కు సితార విషెస్ చెబుతూ.. హ్యాపీ బర్త్ డే అన్నయ్య. నన్ను ఎప్పుడూ జాగ్రత్తగా చూసుకుంటావ్.. ప్రేమగా చూసుకుంటావ్.. థ్యాంక్యూ. ఇక నువ్ పెద్దవాడివ్ అయిపోయావ్. నిన్ను రకరకాలుగా ఆడుకునేందుకు కొత్త దారులు కూడా దొరికుతాయ్. ఆకాశమంత ప్రేమ నీపై ఉంది అంటూ సితార చెప్పుకొచ్చారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3mJAVvn
v

ఆ పండుగకు వస్తున్న మాస్ మహరాజ.. ఇక ఆ విషయంలో ఎలాంటి డౌట్లు లేవు

ఈ ఏడాది ‘క్రాక్’ సినిమాతో బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్నారు రవితేజ. గోపిచంద్ మలినేని దర్శకత్వంలో, శృతిహాసన్ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాలో మాస్ పోలీస్ ఆఫీసర్ గెటప్‌లో కనిపించారు. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమా భారీ కలెక్షన్లలో దూసుకుపోయింది. ఈ సినిమా చేస్తూనే రవితేజా మరో రెండు సినిమాలు సైన్ చేశాడు. అందులో ‘ఖిలాడి’ ఒకటి. ఈ సినిమా గురించి ప్రకటన వచ్చి చాలా కాలమే అయింది. అయినప్పటికీ సినిమా గురించి సినిమా నుంచి ఎలాంటి అప్‌డేట్ రాలేదు. ఇక ఈ సినిమా షూటింగ్ పూర్తి అయ్యి చాలాకాలమే అయింది. అయినా ఈ సినిమా నుంచి ఎలాంటి అప్‌‌డేట్ రాలేదు. ఇక రవితేజ అభిమానులు ఈ సినిమా నుంచి ఎప్పుడు.. అప్‌డేట్ వస్తుందా.. తమ అభిమాన హీరోను స్క్రీన్‌పై మళ్లీ ఎప్పుడు చూస్తామా అని ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో రవితేజా నటిస్తున్న ‘ఖిలాడి’ సినిమా విడుదల తేదీకి సంబంధించి ఓ ఆసక్తికర వ్యార్త సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సినిమా వినాయక చవితి పండుగ సందర్భంగా విడుదల కానుంది అంటూ వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. జయంతిలాల్‌ గడ సమర్పణలో హ‌వీష్ ప్రొడ‌క్ష‌న్‌, పెన్ స్టూడియోస్ బ్యానర్‌పై రూపుదిద్దుకుంటున్న ఈ మూవీకి ‘ప్లే స్మార్ట్’ అనేది ట్యాగ్‌లైన్‌. ఈ చిత్రంలో అనసూయ భరద్వాజ్, అర్జున్ కీలక పాత్రల్లో నటిస్తుండగా, రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. , మీనాక్షి చైదరీ హీరోయిన్లుగా నటిస్తున్నారు. అయితే ఈ సినిమాకు సంబంధించిన విడుదల తేదీపై త్వరలోనే ప్రకటన వెలుడనుంది. మరి ఈ సినిమాతో రవితేజ ఫ్యాన్స్‌ని ఏ రేంజ్‌లో అలరిస్తారో తెలియాలి అంటే కొన్ని రోజులు వేచి చూడాల్సిందే.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2WCEE2G
v

తనయుల బర్త్ డేపై బండ్ల గణేష్.. బండ్లన్న వారసులు మామూలుగా లేరు కదా!

నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారు. ఎప్పుడు ఎవరికి ఏ అవసరం వచ్చినా కూడా చేతనైన సాయం చేస్తుంటారు. అలా బండ్ల గణేష్ సోషల్ మీడియాలో ప్రదర్శించే దూకుడుకు అందరూ ఫిదా అవుతుంటారు. ఇక బండ్లన్న ఈ మధ్య తన ఫ్యామిలీని కూడా ఫేమస్ చేసే ప్రయత్నంలో ఉన్నట్టు కనిపిస్తోంది. ఆ మధ్య ఓంకార్ షోలో బండ్లన్న తన కూతురిని పరిచయం చేశారు. ఇక ఈ మధ్య తన కొడుకులను రంగంలోకి దించుతున్నారు. ఆ మధ్య తన పెద్ద కొడుకు హితేష్ అంటూ పరిచయం చేస్తూ వదిలిన ఫోటో అందరినీ ఆశ్చర్యపరచింది. జూనియర్ బండ్ల గణేష్ అంటూ హితేష్ మీద ప్రశంసలు కురిపించారు. పైగా బండ్లన్న గతంలో వేసుకున్న షర్ట్‌లోనే హితేష్ కనిపించాడు. అలా మొత్తానికి జూనియర్ బండ్ల గణేష్‌గా హితేష్‌కు మంచి క్రేజ్ వచ్చేసింది. అయితే తాజాగా బండ్లన్న తన కొడుకులిద్దరి ఫోటోలను షేర్ చేశారు. తన కుమారుల పుట్టినరోజు అంటూ బండ్లన్న ఎమోషనల్ అయ్యారు. తన తనయుల (, ) బర్త్ డే అని చెబుతూ అందరి బ్లెస్సింగ్స్ కావాలని బండ్ల గణేష్ కోరారు. ఇక బండ్లన్న ట్వీట్‌కు ఫుల్ రెస్పాన్స్ వస్తోంది. ఏకంగా ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్లు సైతం విషెస్ చెబుతున్నారు. పవన్ కళ్యాణ్, మహేష్ బాబు ఫ్యాన్స్ ఇలా అందరూ కూడా బండ్లన్న వారసుల మీద ట్వీట్లు వేస్తున్నారు. వందేళ్లు ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో ఉంటూ.. బండ్ల వారసత్వాన్ని నిలబెట్టాలంటూ ట్వీట్లు పెడుతున్నారు. మొత్తానికి బండ్లన్న వారసులు మాత్రం సినీ ఎంట్రీ ఇవ్వకముందే ఓ రేంజ్ ఫాలోయింగ్ సంపాదించుకునేలా ఉన్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3js07V8
v

Karthika Deepam బిగ్ ట్విస్ట్: అతన్ని తగులుకున్న మోనిత! ఇక డాక్టర్ బాబు సేఫ్.. ఫొటోస్ వైరల్

కార్తీక దీపం సీరియల్‌ గురించి, అందులోని క్యారెక్టర్స్ గురించి పెద్దగా చెప్పాల్సిన పనిలేదు. నిత్యం రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రతి ఇంట కార్తీకదీపం మోత మోగాల్సిందే. అంతలా పాపులర్ అయిన ఈ సీరియల్‌లో , వంటలక్క క్యారెక్టర్స్ మేజర్ అట్రాక్షన్ అయితే వాళ్ళిద్దరికీ పోటాపోటీగా నిలిచే మరో క్యారెక్టర్ మోనిత. డాక్టర్ బాబును ఎలాగైనా దక్కించుకోవాలని చేసే కుట్రలు ప్రతి ఒక్క బుల్లితెర ప్రేక్షకుడికి తెలుసని చెప్పడంలో అతిశయోక్తి లేదు. మరి అలాంటి మోనిత.. డాక్టర్ బాబుతో కాకుండా వేరొక వ్యక్తితో సన్నిహితంగా కనిపించి షాకిచ్చింది. మోనిత అసలు పేరు శోభా శెట్టి. కన్నడ భామ అయిన ఈ డేరింగ్ పర్సనాలిటీ సోషల్ మీడియాలో యాక్టివ్ రోల్ పోషిస్తూ ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన అప్‌డేట్స్ షేర్ చేస్తుంటుంది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఆమె పోస్ట్ చేసిన కొన్ని ఫొటోస్ నెట్టింట వైరల్‌గా మారాయి. అదే కార్తీక దీపం సీరియల్‌లో డాక్టర్ బాబు తమ్ముడిగా చేస్తోన్న యష్వంత్‌తో కొన్ని ఫోటోలకు ఫోజిచ్చింది మోనిత. ఈ ఫొటోల్లో ఇద్దరూ చాలా సన్నిహితంగా కనిపిస్తున్నారు. అంతేకాదు ఈ ఫొటోస్ షేర్ చేస్తూ దీనికి మంచి క్యాప్షన్ ఇవ్వండి అంటూ పోస్ట్ పెట్టింది మోనిత. బెస్ట్ పర్సన్‌తో సూపర్ సర్‌ప్రైజ్ ఇవ్వబోతున్నా. దీంతో ఇది చూసిన నెటిజన్లు పెద్దఎత్తున రియాక్ట్ అవుతున్నారు. ''జగదేక వీరుడు అతిలోక సుందరి, అన్నని వదిలి తమ్ముడిని పట్టుకున్న మోనిత, అమ్మయ్య మా డాక్టర్ బాబు సేఫ్, అన్నయ్య ఇక మారడు తమ్ముడినైనా సెట్ చేసుకుందాం, చిల్లింగ్ విత్ బెస్టీ'' అంటూ రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. దీంతో ఈ ఫొటోస్ వైరల్‌గా మారాయి.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3sYHj2I
v

సోషల్ మీడియాలో అల్లు అర్జున్ హవా.. బన్నీ రేర్ ఫీట్.. సౌత్ ఇండస్ట్రీలోనే తొలి హీరోగా రికార్డు

రాను రాను సోషల్ మీడియా ప్రభావం పెరుగుతోంది. నిత్యం సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానులతో టచ్‌లో ఉండే సెలబ్రిటీల సంఖ్య పెరుగుతూ వస్తోంది. చిరంజీవి, మోహన్ బాబు లాంటి సీనియర్ హీరోలు సైతం ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ లాంటి సోషల్ ఖాతాల్లో యాక్టివ్ రోల్ పోషిస్తూ ఎప్పటికప్పుడు తమకు సంబంధించిన సమాచారాన్ని అందరి ముందుకు తెస్తున్నారు. ఇక నేటితరం హీరోహీరోయిన్ల హంగామా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఈ నేపథ్యంలోనే స్టైలిష్ స్టార్ తాజాగా అరుదైన ఫీట్ సాధించారు. సౌత్ ఇండస్ట్రీలో మరే హీరోకు సాధ్యం కాని రీతిలో ఫాలోయింగ్ పెంచుకొని సరికొత్త రికార్డు నెలకొల్పారు. ఐకాన్ స్టార్ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఏకంగా 13 మిలియన్ ఫాలోవర్స్ చేరిపోయారు. అంటే కోటి 30 లక్షల మంది అల్లు అర్జున్ అకౌంట్ ఫాలో అవుతున్నారన్నమాట. సౌత్ సినీ ఇండస్ట్రీలో ఈ రికార్డు అందుకున్న తొలి హీరో ఈయనే కావడం విశేషం. 2017, నవంబర్‌లో అధికారికంగా ఇన్‌స్టాలోకి వచ్చిన బన్నీ, క్రమం తప్పకుండా అభిమానులతో టచ్ లోకి వస్తూ అంచెలంచెలుగా ఫాలోవర్స్‌ని పెంచుకుంటూ వచ్చారు. అల్లు అర్జున్ 13 మిలియన్ మైలురాయిని అధిగమించడంతో ఆయన అభిమానులు ఖుషీ అవుతూ ఆయనకు కంగ్రాట్స్ చెబుతున్నారు. టాలీవుడ్ స్టైలిష్ స్టార్‌గా తనదైన నటన, టాలెంట్‌తో సత్తా చాటుతున్న అల్లు అర్జున్.. తన కెరీర్‌లో తొలిసారి పాన్ ఇండియా మూవీ 'పుష్ప' చేస్తున్నారు. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బన్నీ జోడిగా రష్మిక మందన నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా అప్‌డేట్స్ ఓ రేంజ్ అంచనాలు క్రియేట్ చేశాయి. దీంతో పటు 'ఐకాన్' అంటూ మరో ప్రెస్టీజియస్ ప్రాజెక్టు చేస్తున్నారు అల్లు అర్జున్.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3zzdqbP
v

ఆయనతో నాకు ఎలాంటి విబేధాలు లేవు.. ఆ విషయంపై పూర్తి క్లారిటీ ఇచ్చిన బండ్ల గణేష్

ఆయన సినిమాల్లో ఒకప్పుడు తన కామెడీతో అలరించారు. ఆ తర్వాత తన స్వార్జితంతో నిర్మాతగా మారారు. స్టార్ హీరోలతో కలిసి సినిమాలు నిర్మించారు. ఎంతో సక్సెస్ కూడా సాధించారు. ఆయనే .. పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్ అయినా.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ అయినా.. ఆయన రూపొందించిన సినిమాలు బ్లాక్‌బస్టర్ హిట్లుగా నిలిచాయి. అందులో ప్రధానంగా చెప్పుకోవాలి అంటే పవన్‌కళ్యాణ్‌తో తీసిని ‘గబ్బర్‌సింగ్’.. ఎన్టీఆర్‌తో‌ తీసిన ‘బాద్‌షా’.. ‘టెంపర్’ సినిమాలను చెప్పుకోవచ్చు. అయితే గత కొంతకాలంగా జూనియర్ ఎన్టీఆర్‌కి.. బండ్ల గణేష్ మధ్య విభేదాలు వచ్చాయి అంటూ గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. వీరిద్దరికి పడటం లేదంటూ సోషల్‌మీడియాలో ఎవరికి తోచిన విధంగా వాళ్లు రాసుకుంటూ పోయారు. అయితే ఈ వార్తలపై తాజాగా బండ్ల గణేష్ క్లారిటీ ఇచ్చారు. తనకు ఎన్టీఆర్‌కు ఎలాంటి విబేధాలు లేవు అంటూ ఆయన స్పష్టం చేశారు. ఎదో మిస్ కమ్మూనికేషన్ వల్ల అది జరిగింది. అని అయన పేర్కొన్నారు. అన్మదమ్ముల మద్య మనస్పర్థలు వస్తూ ఉంటాయి.. పోతూ ఉంటాయి.. కానీ సంబంధం మాత్రం ఎప్పటికీ అలాగే ఉంటుంది అంటూ అర్థం వచ్చేలా ఆయన స్పష్టం చేశారు. ఇక ప్రస్తుతం ఎన్టీఆర్ వరుస పాన్ ఇండియా ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ఆయన నటిస్తున్న ‘ఆర్ఆర్ఆర్’ సినిమా ఈ అక్టోబర్‌లో విడుదల కానుండగా.. ఆ తర్వాత కొరటాల శివతో, ప్రశాంత్ నీల్‌తో ఆయన సినిమాలు చేస్తున్నారు. ఒక బండ్ల గణేష్ కూడా హీరోగా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వనున్నారు. ఓ రీమేక్ సినిమాతో ఆయన హీరోగా ప్రేక్షకులకు పరిచయం అయ్యే ప్రయత్నాల్లో ఉన్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3DGSD8X
v

‘వరుడు కావలెను’ టీజర్.. అతను ప్రతి బాల్ సిక్స్ కొడితే.. ఆమె అన్ని బాల్స్ నోబాల్ ఇస్తుందట

తెలుగులో డిఫెరెంట్ సినిమాలు చేయడంలో హీరో ఎప్పుడూ ముందుటారు. ఆయన సినిమాలు అంటేనే అందులో ఎదో విలక్షణత ఉంటుంది. ప్రతీ సినిమాలో ఏదో డిఫరెంట్ రోల్ చేస్తూ ప్రేక్షకులను అలరిస్తూ ఉంటారు నాగశౌర్య. అలా వినోదం మాత్రమే కాదు.. మంచి సందేశం ఉన్న సినిమాలు చేస్తుంటారు నాగశౌర్య. ప్రస్తుతం ఆయన నటిస్తున్న సినిమాలు ‘లక్ష్య’, ‘వరుడు కావలెను’. లక్ష్య స్పోర్ట్స్ డ్రామా కాగా.. వరుడు కావలెను ఫ్యామిలీ డ్రామా అని తెలుస్తోంది. లక్ష్యలో ఆయన మాజీ ఆర్చరీ ప్లేయర్‌గా కనిపించనున్నారు. ఇక వరుడు కావలెను సినిమా నుంచి ఇప్పటికే ఫస్ట్ సింగిల్ విడుదల అయింది. ఇక ‘వరుడు కావలెను’ సినిమా నుంచి తాజాగా ప్రేక్షకులకు మరో ట్రీట్ లభించింది. ఈ సినిమా టీజర్‌ని తాజాగా చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ సినిమాలో హీరోయిన్ .. వరుడు కోసం ఎదురుచూస్తున్న అమ్మాయిలా.. అంతకు మంచి చాలా యాటిట్యూడ్ ఉన్న అమ్మయాలా మనకు టీజర్‌లో కనిపిస్తోంది. ఎన్ని సంబంధాలు వచ్చిన ఆమె యాటిట్యూట్ కారణంగా అవి చెడిపోవడం అనేది టీజర్‌లో మనం చూడొచ్చు. ఇక నాగశౌర్య విదేశాల నుంచి వచ్చి.. రితూ వర్మను చూసి ప్రేమలో పడతారు అని టీజర్ చూస్తే మనకి అర్థం అవుతోంది. టీజర్ ఆరంభంలో నటి నదియా, రితూ వర్మలకు మధ్య జరిగే సంభాషణలు ఆసక్తికరంగా ఉన్నాయి. ఇక టీజర్‌లో రితూని పడేయటానికి నాగశౌర్య చేసే విన్యాసాలు ఆద్యంతం నవ్వులు పూయించాయి. ఇక నాగశౌర్య అసిస్టెంట్‌గా ప్రవీణ్, రితూ వర్మ అసిస్టెంట్‌గా వెన్నెల కిషోర్ నటిస్తున్నారు. చివర్లో ‘ప్రతీ బాల్‌కి సిక్స్ కొట్టే బ్యాట్స్‌మెన్‌ని చూశావా’ అంటూ ప్రవీణ్ ప్రశ్నిస్తూ.. ‘ప్రతీ బాల్‌ని నోబాల్‌గా చెప్పే అంపైర్‌ని చూశావా.. అవిడ ఇస్తుంది’ అంటూ వెన్నెల కిషోర్ అంటారు. ప్రస్తుతం ఈ టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. సితారా ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ సినిమాకు లక్ష్మీ సౌజన్య దర్శకత్వం వహిస్తున్నారు. విశాల్ చంద్రశేఖర్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3t2rbO0
v

Monday 30 August 2021

Drugs Case: ఈడీ కార్యాలయానికి పూరీ జగన్నాథ్.. అనుకున్న సమయం కంటే ముందుగానే..

నాలుగు సంవత్సరాల క్రితం టాలీవుడ్‌ని కుదిపేసిన సంగతి తెలిసిందే. ఎంతో మంది సెలబ్రిటీలను ఈ కేసుకు సంబంధించి సిట్ విచారణ చేసింది. ఇందులో ప్రధానంగా దర్శకుడు , రవితేజ, నవదీప్, హీరోయిన్ ఛార్మి తదితరులు అప్పుడు విచారణకు హాజరు అయ్యారు. పలువురు టెక్నిషన్ల కూడా ఈ విచారణకు హాజరయ్యారు. ఇందులో ఎన్నో విషయాలు బయటకు వచ్చాయి. అయితే తాజాగా డ్రగ్స్‌ కేసు మరోసారి తెరపైకి వచ్చింది. అప్పుడు ఆరోపణలు ఎదురుకున్న సెలబ్రిటీలు అందరికీ ఎన్‌ఫోర్స్‌మెంట్ డెరక్టరేట్(ఈడీ) రీసెంట్‌గా సమన్లు పంపించింది. ఈ కేసుపై నేటి(ఆగస్టు 31) నుంచి విచారణ చేపట్టనుంది. ఈ కేసులో హీరోయిన్‌ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, నటులు రానా, రవితేజ తదితరులకు సైతం ఈడీ నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా తొలుత దర్శకుడు పూరి జగన్నాథ్‌ను విచారణకు అహ్వానించింది ఈడీ. ఆయన్ని 10.30కు విచారణకు రావాలని ఆహ్వానించగా.. పూరీ కాస్త ముందుగానే 10.05కే విచారణకు వచ్చారు. ఇక ఈడీ కార్యాలయం ముందు ఉన్న మీడియా ప్రతినిధులు ఆయనను కొన్ని ప్రశ్నలు అడగ్గా.. ఆయన ఎలాంటి సమాధానం ఇవ్వకుండా ఈడీ కార్యాలయంలోకి వెళ్లిపోయారు. ఈ విచారణ దాదాపు మధ్యాహ్నం వరకూ కొనసాగనుంది. ఇక ఈ కేసుకు సంబంధించి ఈడీ విచారణ సెప్టెంబర్ 22వ తేదీ వరకూ కొనసాగతుంది. ఈ నేపథ్యంలో సెప్టెంబరు 2న చార్మీ, 6న రకుల్‌, 8న రానా, 9న రవితేజ, ఆయన డ్రైవర్‌ శ్రీనివాస్‌, 13న నవదీప్‌, ఎఫ్‌-క్లబ్‌ పబ్‌ జనరల్‌ మేనేజర్‌, 15న ముమైత్‌ఖాన్‌, 17న తనీష్‌, 20న నందు, 22న తరుణ్‌ విచారణకు హాజరుకావాలని ఈడీ ఆదేశించింది. డ్రగ్స్ కొనుగోలుకు సంబంధించి సెలబ్రెటీలు ఫెమా నిబంధనలు ఉల్లంఘించి విదేశాలకు పెద్దమొత్తంలో నిధులు మళ్లించినట్టు ఈడీ ప్రాథమికంగా గుర్తించింది. మరి ఈడీ విచారణలో ఎలాంటి ఆసక్తికర అంశాలు బయటకు వస్తాయో.. వేచి చూడాల్సిందే మరి.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/38se7YE
v

రోహిణి, రాకేష్ ముద్దులాట.. లైవ్‌లో అందరూ చూస్తుండగానే శృతిమించి! ఒక్కసారిగా షాకైపోయిన రోజా

ఎక్స్‌ట్రా ఫన్‌తో యమ కిక్కిస్తున్న ఎక్స్‌ట్రా జబర్దస్త్ రేర్ ఫీట్ సాధించింది. భారీ టీఆర్ఫీలు రాబడుతూ కడుపుబ్బా నవ్విస్తున్న ఈ షో 350 ఎపిసోడ్స్ దాటేసింది. ఈ 350వ ఎసిసోడ్ సందర్భంగా స్పెషల్ పార్టీ చేసుకున్న జబర్దస్త్ టీమ్, వేదికపై ఫుల్లుగా ఎంజాయ్ చేశారు. ఈ వేడుకలో , ముద్దులాట హాట్ టాపిక్ అయింది. లైవ్‌లో అందరూ చూస్తుండగానే మరింత శృతిమించి రెచ్చిపోయారు ఈ ఇద్దరూ. గతంలో హాట్ ఇష్యూ అయిన తాగుబోతు రాజమౌళి స్కిట్ గురించి మాట్లాడుతూ మరోసారి రోహిణి బుగ్గపై ఘాటు ముద్దు పెట్టాడు రాకేష్. దీంతో యాంకర్ రష్మీ, జడ్జ్ సీటులో కూర్చున్న ఒక్కసారిగా షాకయ్యారు. ఆ తర్వాత రోహిణి కూడా మరింత రెచ్చిపోయి ఏకంగా రాకేష్‌కి లిప్ కిస్ చేయడం ఈ ఎపిసోడ్‌లో హైలైట్ అయింది. దీంతో ఈ రొమాంటిక్ సీన్, రాకేష్ చెప్పిన డైలాగ్స్ రీపీట్ చేసుకొని మరీ చూస్తున్నారు నెటిజన్లు. కాగా, రీసెంట్‌గా రోహిణి- రాకేష్ ముద్దు ముచ్చట్లు నెట్టింట వైరల్ కావడంతో పలు చర్చలు తెరపైకి వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో వీటిపై రియాక్ట్ అయిన రోహిణి.. ''అతను పెట్టిందే ముష్టి ముద్దు.. దాన్ని ముద్దు అని కూడా అనరు.. బుగ్గా బుగ్గా ఆనిందే తప్ప ముద్దు పెట్టలేదు. అసలు దీన్ని ఎవడైనా ముద్దని అంటారా? అయినా రాకేష్ ముద్దు పెడితే నేను ఊరుకుంటానా..? రాకేష్‌ని చంకలో పెట్టి నలిపేస్తా'' అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది. అలా చెప్పిన రోహిణే ఇప్పుడు అందరిముందు రాకేష్‌ పెదాలపై ముద్దుపెట్టడం రచ్చ రచ్చ అవుతోంది. నిజం సెప్పాలంటే జబర్దస్త్ వేదికపై ఈ మధ్యకాలంలో రొమాంటిక్ డోస్ మాత్రం ఎక్స్‌ట్రానే ఉంటోంది!.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3gKVjZ4
v

NBK 47 Years: అఖండ విజయాలందుకున్న లెజెండ్ ఈ నటసింహం.. బాక్సాఫీస్ లెక్కలు మార్చేసిన నందమూరి హీరో!!

నటవారసత్వం అనేది సినీ ఎంట్రీ సమయంలో ఇచ్చే బూస్టింగ్ మాత్రమేనని చాలా సందర్భాల్లో ప్రూవ్ అయింది. ఏదో ఒకటి రెండు సినిమాల వరకు స్టార్ కిడ్స్ అనే ముద్రతో ఆదరణ లభిస్తుంది కానీ ఆ తర్వాత సదరు స్టార్ కిడ్ టాలెంట్‌పైనే భవిష్యత్ ఆధారపడి ఉంటుంది. ఇలా ఈ కేటగిరీలోనే సినీ ఎంట్రీ ఇచ్చి రికార్డులు చెరిపేస్తూ సంచలనాలకు మారుపేరయ్యారు నందమూరి . ఆయన సినిమాల్లోకి వచ్చి 47 సంవత్సరాలు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా ఆయన '' విజయాలను నెమరు వేసుకుంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు నందమూరి ఫ్యాన్స్. 'తాతమ్మకల'. 1974 సంవత్సరంలో ఈ సినిమాను నందమూరి తారక రామారావు డైరెక్ట్ చేయడమే కాకుండా స్వయంగా నిర్మించారు కూడా. ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామాగా రూపొందిన ఈ సినిమాలో ఎన్టీఆర్‌తో పాటు భానుమతి, హరికృష్ణ, బాలకృష్ణలు కీలక పాత్రల్లో నటించారు. అప్పట్లోనే బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ఘన విజయం సాధించింది. 'తాతమ్మ కల' సినిమా తర్వాత అదే ఏడాది 'రామ్ రహీమ్' అనే మరో సినిమాతో సక్సెస్ అందుకొని 1975లో అన్నదమ్ముల అనుబంధం, వేములవాడ భీమకవి అనే సినిమాలు చేశారు బాలయ్య. చైల్డ్ ఆర్టిస్టుగా ఎక్కువగా తన తండ్రితో స్క్రీన్ షేర్ చేసుకున్న బాలయ్య బాబు.. 1984లో 'సాహసమే జీవితం' అనే సినిమాతో సోలో హీరోగా కెమెరా ముందుకొచ్చారు. అప్పటినుంచి వెనుతిరిగి చూడకుండా బాక్సాఫీస్ లెక్కలు మార్చేశారు బాలకృష్ణ. ''ముద్దుల కృష్ణయ్య, లారీ డ్రైవర్, ఆదిత్య 369, సమరసింహా రెడ్డి, ముద్దుల మామయ్య, భైరవ ద్వీపం, నరసింహ నాయుడు సింహ, లెజెండ్, గౌతమి పుత్ర శాతకర్ణి'' ఇలా వైవిద్యభరితమైన కథలతో ఎన్నో ఇండస్ట్రీ హిట్స్ అందించిన బాలకృష్ణ స్టార్ హీరోగా నేటికీ అదే హవా నడిపిస్తున్నారు. సినిమాల పరంగా సెంచరీ కొట్టేసి ప్రస్తుతం 'అఖండ' మూవీ చేస్తున్నారు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో పక్కా మాస్ ఎంటర్‌టైనర్ మూవీగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3zx3zU0
v

Money laundering case: బిజినెస్‌మెన్‌తో జాక్వలైన్ రిలేషన్.. సెలబ్రిటీ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు

ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో చోటు చేసుకుంటున్న పరిణామాలు జనాల్లో పలు చర్చలకు తావిస్తున్నాయి. ఓ వైపు డ్రగ్స్ కేసులు, మరోవైపు మనీ లాండరింగ్ కేసులు సినీ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. బాలీవుడ్‌లో గ్లామర్ క్వీన్‌గా రాణిస్తున్న మనీ లాండరింగ్ కేసులో విచారణ ఎదుర్కొంటోంది. హవాలా రాకెట్‌లో కోట్లు చేతులు మారడంలో ఆమెను ప్రత్యక్ష సాక్షిగా తీసుకొని ఈడీ అధికారులు విచారణ చేపట్టారు. అనే హవాలా దందాను నిర్వహించే వ్యక్తి అనుమానాస్పద వ్యవహారాలపై దృష్టి సారించిన ఈడీ ఆఫీసర్స్ లోతుగా విచారిస్తున్నారు. ఇటీవల సుకేశ్ ఇంటిపై మెరుపు దాడులు నిర్వహించడంతో అనేక విషయాలు వెలుగులోకి వచ్చాయి. అయితే ఈ కేసుతో లింక్ అయి ఉన్న పారిశ్రామిక వేత్తతో జాక్వలైన్ ఫెర్నాండేజ్‌కు దగ్గరి సంబంధాలు ఉండటంతో సోమవారం ఆమెను కూడా విచారించారు. దాదాపు 5 గంటలకు పైగా ఈ విచారణ కొనసాగినట్లు తెలుస్తోంది. అయితే ఆమెపై ఎలాంటి ప్రశ్నలు సంధించారు? ఏయే విషయాలపై ఫోకస్ పెట్టారనేదానిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. చెన్నైకి చెందిన ఓ పారిశ్రామికవేత్త నుంచి 200 కోట్ల మేర హవాలా కార్యక్రమాలు నిర్వహించారనే ఆరోపణలు రావడంతో ఇటీవల చెన్నై సముద్ర తీరంలో ఉన్న సుకేశ్ చంద్రశేఖరన్‌ ఇంటిపై దాడులు నిర్వహించారు. ఆ సమయంలో రూ.82.5 లక్షల నగదు, రెండు కిలోల బంగారం, డజనుకు పైగా లగ్జరీ కార్లు సీజ్ చేశారు. సుకేష్ చంద్రశేఖర్‌తో లావాదేవీలు జరిగినట్టు అనుమానిస్తూ పలు కోణాల్లో జాక్వలైన్‌ను విచారిస్తున్నట్లు సమాచారం. జాక్వలైన్‌కు పలువురు బాలీవుడ్ ప్రముఖులతో సన్నిహిత సంబంధాలున్న కారణంగా ఈ కేసు బీ టౌన్‌లో హాట్ టాపిక్ అయింది. ఈడీ విచారణలో ఇంకా కొందరు సినీ ప్రముఖుల పేర్లు బయటకు వచ్చే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. ప్రస్తుతం అక్షయ్ కుమార్‌తో కలిసి రామ్ సేతు, బచ్చన్ పాండే సినిమాలు చేస్తోంది జాక్వలైన్‌.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3ywPxR1
v

నమ్రత శిరోద్కర్ న్యూ లుక్ వైరల్.. ఒకే ఒక్క మాటతో మహేష్ బాబు కామెంట్

సూపర్ స్టార్ సతీమణి సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ అనేది మనందరికీ తెలుసు. ఎప్పటికప్పుడు మహేష్ మూవీ ముచ్చట్లతో పాటు ఫ్యామిలీ ఫొటోస్ షేర్ చేస్తూ అభిమానులను ఖుషీ చేస్తుంటారు. ఈ నేపథ్యంలోనే తాజాగా తన లేటెస్ట్ లుక్ షేర్ చేసి షాకిచ్చింది నమ్రత. ఇందులో నమ్రత మునుపెప్పుడూ లేనివిధంగా డిఫరెంట్ లుక్‌లో కనిపించడంతో ఈ ఫోటో నెట్టింట వైరల్ అవుతోంది. ప్రముఖ సెలబ్రిటీ ఫోటోగ్రాఫర్ అవినాష్ గోవారికర్, ఇటీవల గోవాలో జరిగిన 'సర్కారు వారి పాట' షెడ్యూల్‌లో కూడా నమ్రత శిరోద్కర్‌ని ప్రత్యేకంగా కొన్ని ఫొటోస్ తీశారు. ఆ ఫోటోలను తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేస్తూ.. ''చిన్నూ అక్క మీరంటే నాకు ఎంతో అభిమానం ఇష్టం, మీరు ఎల్లప్పుడూ బాగుండాలి, ఈ పిక్స్ నేను ఇప్పటివరకు తీసిన అద్భుతమైన పిక్స్‌లో ఇవి కొన్ని'' అంటూ ట్వీట్ చేశారు. మరోవైపు నమ్రత కూడా ఈ ఫొటోని తన ఇన్స్‌స్టా పేజీలో షేర్ చేస్తూ ఈ ఫోటోషూట్‌లో పాల్గొనడం పట్ల ఆనందం వ్యక్తం చేసింది. ''ఆ రోజు ఏదో సరదాగా మహేష్ జాకెట్ తీసుకుని మేకప్ లేకుండా దిగిన ఈ ఫోటోలను ఇంత బాగా మీరు క్యాప్చర్ చేస్తారని ఊహించలేదు బ్రదర్'' అని ఆమె పేర్కొంది. ఈ ఫొటోస్ చూసిన మహేష్ బాబు 'పర్ఫెక్ట్ పిక్' అంటూ స్వీట్ కామెంట్ చేయడం విశేషం. ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో నమ్రత లేటెస్ట్ లుక్ తెగ చక్కర్లు కొడుతోంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3zJPMK1
v

మరో రీమేక్‌కి రెడీ అవుతున్న మెగాస్టార్.. అతని కోసం ఎదురుచూస్తున్న చిరంజీవి

రాజకీయాల కోసం సినిమాలకు బ్రేక్ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి.. దాదాపు పది సంవత్సరాల తర్వాత ‘ఖైదీ నెంబర్.150’ సినిమాతో ఆయన రీఎంట్రీ ఇచ్చారు. ఇది తమిళంలో సూపర్‌హిట్‌గా నిలిచిన ‘కత్తీ’ సినిమా రీమేక్. అయినప్పటికీ.. చిరు తన యాక్టింగ్‌తో తనదైన ముద్రను చూపించారు. దీంతో ఇది రీమేక్ సినిమాలా కాకుండా ఒరిజినల్ సినిమాగానే అనిపించింది ఇక్కడ తెలుగు ప్రజలకు. అయితే మాత్రమే కాదు.. ఈ మధ్యకాలంలో తెలుగులో స్టార్ హీరోలు అందరు రీమేక్ సినిమాల బాటనే పడుతున్నారు. పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్ కూడా రీమేక్‌ సినిమాలనే ఎంచుకుంటున్నారు. ఇప్పటికే ఆయన ‘పింక్’ సినిమా రీమేక్‌గా రూపొందిన ‘వకీల్‌సాబ్’ అనే సినిమాతో రీఎంట్రీ ఇచ్చారు. ప్రస్తుతం ఆయన మలయాళంలో సూపర్‌హిట్‌‌గా నిలిచిన ‘అయ్యప్పనుమ్ కోశియమ్’ సినిమా రీమేక్‌గా రూపొందుతున్న ‘భీమ్లా నాయక్’ అనే సినిమాలో నటిస్తున్నారు. చిరంజీవి కూడా తమిళంలో బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన ‘వేదాళం’ సినిమా రీమేక్‌గా వస్తున్న ‘భోళా శంకర్’ అనే సినిమాలో ఆయన నటిస్తున్నారు. ఈ సినిమాలో చీరు సోదరి పాత్రలో కీర్తీ సురేష్ నటిస్తుండగా.. మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇక చిరు ప్రస్తుతం మరో రీమేక్ సినిమాకు సిద్ధం అవుతన్నారు.గౌత‌మ్ మీనన్, అజిత్ డైరెక్ష‌న్ లో వ‌చ్చిన అనే సినిమాను చూసిన చిరు.. దాన్ని తెలుగులో రీమేక్ చేయాలని చిరు ఫిక్స్ అయ్యారట. అయితే ఈ సినిమాను ఆయన కుమారుడు రామ్ చరణ్‌నే నిర్మాతగా వహిస్తుండగా.. దర్శకుడి కోసం ఎదురుచూస్తున్నారు. ఓ యువ‌తిని క్రిమిన‌ల్ నుంచి కాపాడే మాజీ పోలీసాఫీస‌ర్ పాత్ర‌లో చిరు క‌నిపించ‌నున్నారు. మరి ఈ సినిమాకు దర్శకుడిగా ఎవరు వస్తారో.. చిరుని ఎలా చూపిస్తారో తెలియాలి అంటే అధికారిక సమాచారం వచ్చే వరకూ వేచి చూడాల్సిందే.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3sZFPW1
v

Bheemla Nayak First Single : రచ్చ మొదలయ్యేది ఆరోజే!

పవర్ స్టార్ అభిమానులు ఇప్పుడు అసలైన పండుగను సెలెబ్రేట్ చేసుకునేందుకు రెడీ అవుతున్నారు. సెప్టెంబర్ 2న పవన్ కళ్యాణ్ బర్త్ డేను గ్రాండ్ లెవెల్‌లో ప్లాన్ చేసుకుంటున్నారు. ఇక సినిమా అప్డేట్లతో సోషల్ మీడియా మొత్తం మార్మోగిపోయేలా ఉంది. అసలే భీమ్లా నాయక్, హరిహర వీరమల్లు అప్డేట్లు రెడీగా ఉన్నాయి. ఇక హరీష్ శంకర్ మూవీ అప్డేట్ కూడా రాబోతోందనే టాక్ వినిపిస్తోంది. ఆ విషయం కాసేపు పక్కన బెడితే తాజాగా ఓ అప్డేట్ వచ్చేసింది. నుంచి చిత్రయూనిట్ అదిరిపోయే వార్త ఒకటి చెప్పేసింది. ఇప్పటికే వదిలిన భీమ్లా నాయక్ ఫస్ట్ గ్లింప్స్ ఫీవర్ ఇంకా వదల్లేదు. గల గల భీమ్లా అంటూ జనాల చెవుల్లో ఇంకా వినిపిస్తూనే ఉంది. అలా తమన్ కొట్టిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌కు అందరూ ఫిదా అవుతున్నారు. అప్పటి నుంచి భీమ్లా నాయక్ ఫస్ట్ సింగిల్ గురించి అభిమానులు ఎదురుచూస్తూనే ఉన్నారు. సెప్టెంబర్ 2న ఈ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ రాబోతోందన్న సంగతిని తమన్ ఇది వరకే రివీల్ చేసేశారు. కానీ తాజాగా ఆ ముహూర్తాన్ని కూడా ఫిక్స్ చేశారు. ఏ సమయానికి పాట రాబోతోందనే తాజాగా ప్రకటించారు. సెప్టెంబర్ 2న ఉదయం పదకొండు గంటల 16 నిమిషాలకు ఫస్ట్ సింగిల్ రాబోతోందని ప్రకటించారు. ఈ మేరకు వదిలిన పోస్టర్, ఆ గన్ను పట్టుకున్న తీరుకు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ఇక సెప్టెంబర్ 2న పవర్ స్టార్ అభిమానులకు పూనకాలు రావాల్సిందే అన్నట్టుగా ఫస్ట్ సింగిల్ ఉండబోతోందట.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3t22LUO
v

Taapsee Pannu: Annabelle Sethupathi : పాత కథల్నే తిప్ప తిప్పి చెబుతున్నారు!

నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. దక్షిణాదిలో విజయ్ సేతుపతి హవా ఇప్పుడు ఓ రేంజ్‌లో ఉంది. ఇక అదే సమయంలో క్రేజ్ దేశ వ్యాప్తంగా ఉంది. లేడీ ఓరియెంటెడ్ చిత్రాలకు తాప్సీ కేరాఫ్ అడ్రస్‌గా మారారు. అలాంటి ఈ ఇద్దరి కాంబినేషన్‌లో ఓ సినిమా రాబోతోంది. హిందీ, తమిళ,తెలుగు, కన్నడ,మళయాలీ భాషల్లో అనే చిత్రం రాబోతోంది. తాజాగా ఈ మూవీకి సంబంధించిన ట్రైలర్‌ను అన్ని భాషల్లో ఒకే సారి విడుదల చేశారు. కరోనా, లాక్డౌన్ వల్ల షూటింగ్ వాయిదా పడుతూ వచ్చింది. ఎట్టకేలకు ఈ మూవీ షూటింగ్ పూర్తయి విడుదలకు సిద్దంగా ఉంది. నేరుగా ఓటీటీలోనే ఈ మూవీ సెప్టెంబర్ 17న రాబోతోందట. డిస్నీ హాట్ స్టార్‌లో ఈ మూవీ విడుదల కాబోతోన్నట్టు ప్రకటించారు. ఇక ఇందులో అన్ని ఇండస్ట్రీలకు చెందిన నటీనటులున్నారు. రాజేంద్ర ప్రసాద్, సురేఖా వాణి, రాధిక, యోగి బాబు ఇలా తెర అంతా నిండుగానే కనిపిస్తోంది. 1948లోని ఓ రాజమహల్ చుట్టూ ఈ కథ నడుస్తుంది. చంద్రముఖి, ఆనందో బ్రహ్మ వంటి సినిమాలను కలిసి కొట్టేసినట్టుగా కనిపిస్తోంది. దానికి తగ్గట్టుగానే ట్రైలర్‌ చివర్లో ఓ డైలాగ్ పెట్టేశారు. కొత్త కథలు చెప్పకు అని తాప్సీ అనడం.. దానికి రివర్స్ కౌంటర్‌ ఇస్తూ యోగిబాబు.. కొత్త కథలు ఎక్కడ చెబుతున్నారు.. పాత కథల్నే తిప్పి తిప్పి అదే చూపిస్తున్నామని అన్నారు. మొత్తానికి ఈ ట్రైలర్ మాత్రం అందరినీ ఆకట్టుకుంటోంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3kE7zvA
v

Bhanumathi Reddy కోసం వచ్చిన ఎంపీ భరత్.. ఆసక్తికరంగా ఫస్ట్ లుక్

రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్‌కు సంబంధించిన వీడియోలు నెట్టింట్లో ఎప్పుడూ వైరల్ అవుతుంటాయి. ప్రజలతో ఆయన మమేకయ్యే తీరు అందరినీ ఆకట్టుకుంటుంది. సినీ పరిచయం ఉన్న తాజాగా ఓ చిన్న చిత్రం కోసం కదిలివచ్చారు. బాలు, అప్స‌ర హీరో , హీరోయిన్లుగా స‌త్య ద‌ర్శ‌క‌త్వంలో డైమండ్ హౌస్ బ్యాన‌ర్‌పై రామ్‌ప్ర‌సాద్ రెడ్డి వ‌ట్ర‌పు నిర్మిస్తోన్న చిత్రం ‘భానుమ‌తి రెడ్డి’. ఈ సినిమా ఫ‌స్ట్ లుక్‌ను ఎం.భ‌ర‌త్ రామ్ విడుద‌ల చేశారు. గ్రామీణ నేప‌థ్యంలో తెర‌కెక్కుతోన్న ప్రేమ‌క‌థా చిత్రానికి ఎంపీ సాయమందించారు. ఈ మూవీ చిత్రీక‌ర‌ణ తుది ద‌శ‌కు చేరుకుంది. ఈ సినిమా ఫ‌స్ట్ లుక్‌ను ఎంపీ భరత్ విడుదల చేస్తూ.. పెద్ద స‌క్సెస్ కావాల‌ని, న‌టీన‌టులు, టెక్నీషియ‌న్స్‌కు మంచి పేరు రావాల‌ని, నిర్మాత రామ్ ప్ర‌సాద్ రెడ్డికి సినిమా అన్ని ర‌కాలుగా పెద్ద స‌క్సెస్ కావాల‌ని అభినంద‌న‌లు తెలిపారు. ఇక ఈ కార్యక్రమంలో ద‌ర్శ‌కుడు స‌త్య మాట్లాడుతూ.. భానుమ‌తి రెడ్డి అనే సినిమా గ్రామీణ నేప‌థ్యంలో రూపొందుతోన్న ల‌వ్‌స్టోరి. ఫైన‌ల్ స్టేజ్ షూటింగ్‌కు చేరుకున్నాం. సినిమా అనుకున్న‌ట్లు బాగా వస్తోంది. రాజ‌మండ్రి ఎం.పి భ‌ర‌త్ రామ్‌గారు మా సినిమా ఫ‌స్ట్ లుక్‌ను విడుద‌ల చేసి అభినంద‌న‌లు తెలిపారు. ఆయ‌నకు స్పెష‌ల్ థాంక్స్‌. ఈ సినిమా విష‌యానికి వ‌స్తే...ప్రేమ‌క‌థలో ఉండాల్సిన సెన్సిబుల్ అంశాల‌తో పాటు రా ఎలిమెంట్స్ కూడా ప్రేక్ష‌కుల‌ను మెప్పించేలా రూపొందిస్తున్నాం. నిర్మాత పూర్తి స్వేచ్ఛ నిచ్చారు. సినిమా బాగా వస్తోంది అని అన్నారు. నిర్మాత రామ్ ప్ర‌సాద్ రెడ్డి వ‌ట్ర‌పు మాట్లాడుతూ.. భరత్ రామ్ గారికి థాంక్స్‌. మా సినిమా ఫ‌స్ట్ లుక్‌ను విడుద‌ల చేసి టీమ్‌కు ఆయ‌న అభినందించ‌డం మాకు ఓ బూస్ట‌ప్ ఇచ్చిందని అన్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3mLTKxJ
v

హైదరాబాద్ వీధుల్లో ‘ఆర్ఆర్ఆర్’ బ్యూటీ.. నడి రోడ్డుపై ఆమెతో కలిసి రచ్చ రచ్చ

‘బాహుబలి’ లాంటి బ్లాక్‌బస్టర్ తర్వాత దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి రూపొందిస్తోన్న మరో భారీ పాన్ ఇండియా చిత్రం ‘’. ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ హీరోలుగా నటిస్తున్నారు. రాజమౌళి, రామ్ చరణ్, ఎన్టీఆర్ కాంబినేషన్‌లో వస్తోన్న సినిమా కావడంతో సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఈ సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని దేశవ్యాప్తంగా ఉన్న అభిమానులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. భారీ బడ్జెట్‌తో జరుగుతున్న ఈ సినిమా షూటింగ్ కరోనా వ్యాప్తి కారణంగా రెండు సార్లు వాయిదాపడటం.. ఈ క్రమంలో సినిమా విడుదల కూడా వాయిపడటం అభిమానులను నిరాశపరిచింది. అయితే ఇప్పుడు ఈ సినిమా షూటింగ్ సజావుగా జరిగిన పూర్తి అయింది. ఒక రెండు పికప్ షాట్లు మినహా మిగితా సినిమా అంతా పూర్తి అయింది అని చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. అయితే ఈ సినిమా షూటింగ్ పూర్తికావడంతో చిత్ర నటీనటులు హాయిగా ఎంజాయ్ చేస్తున్నారు. ఈ సినిమాలో హాలీవుడ్ నటి హీరోయిన్‌గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో కొమురం భీం పాత్రలో నటిస్తున్న ఎన్టీఆర్‌కు ఆమె జోడీగా కనపించనుంది. ఈ సినిమాలో ఆమె బ్రిటీష్ యువరాణి పాత్రలో కనిపించనుందని టాక్ వినిపిస్తోంది. ఇక ఈ సినిమా షూటింగ్ పూర్తికావడంతో ఓలివియా మోరిస్ హాయిగా హైదరాబాద్ వీధుల్లో చక్కర్లు కొడుతోంది. తన స్టైలిష్ట్ అను రెడ్డితో కలిసి ఆమె సరదాగా గడిపింది. హైటెక్ సిటీలో సరదాగా గడిపిన ఒలివియా ఆ తర్వాత దహి పూరి ని కూడా టేస్ట్ చేసింది. రోడ్డు సైడ్ ఫుడ్ తో పాటు కొంత షాపింగ్ కూడా చేసింది ఈ ఇంగ్లీష్ ముద్దుగుమ్మ. ఇందుకు సంబంధించిన ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్ ద్వారా షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్‌మీడియాలో వైరల్ అవుతున్నాయి.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3mGwbGN
v

సాయి బాబా విగ్రహం నుంచి విబూది!.. ఇంట్లో జరిగిన అద్భుతంపై హిమజ

విగ్రహం పాలు తాగిందని, విగ్రహం నుంచి నీళ్లు కారుతున్నాయని, సాయి బాబా చిత్రపటం నుంచి విబూది రాలుతోందని, విగ్రహం నుంచి విబూది రాలుతుందనే వార్తలు అప్పుడప్పుడు వింటూనే ఉంటాం. వీటిని కొంత మంది నమ్ముతారు. ఇంకొంత మంది నమ్మరు. దేవుడిపై నమ్మకం ఉన్న వారు అలాంటి విషయాలను ఎక్కువగా నమ్ముతుంటారు. అయితే తాజాగా బిగ్ బాస్ ఫేమ్ ఓ వీడియోను షేర్ చేశారు. అందులో తన ఇంట్లో జరిగిన ఓ అద్భుతం గురించి చెప్పుకొచ్చారు. ఇది తాను ఎవ్వరినో నమ్మించాలనే ఉద్దేశ్యంతో చేయడం లేదని, తన ఫీలింగ్‌ను చెప్పుకునేందుకు మాత్రమే వీడియో చేస్తున్నానని హిమజ తెలిపారు. హిమజ ఈ మధ్య ఎక్కువగా యూట్యూబ్ మీద శ్రద్ద పెట్టినట్టు కనిపిస్తోంది. ఓ వైపు బుల్లితెరపై షోలు చేసుకుంటూ బిజీగా ఉన్నారు. మరో వైపు భారీ ప్రాజెక్ట్‌లో చాన్సులు కొట్టేస్తున్నారు. హరిహర వీరమల్లు, వరుడు కావలెను వంటి చిత్రాల్లో హిమజ నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఇలా ఎంత బిజీగా ఉన్నా కూడా యూట్యూబ్‌లో నిత్యం వెరైటీ వీడియోలను పెడుతూనే ఉంటారు. తాజాగా హిమజ తన ఇంట్లో జరిగిన అద్భుతం గురించి చెప్పారు. తమ ఇంట్లో సాయి బాబా విగ్రహం ఉందని, తానే చిన్నప్పుడు దాన్ని ఎంతో అందంగా డిజైన్ చేశానని హిమజ తెలిపారు. ఓ స్వామిజీ చెప్పడంతో 19 రోజులు హోమం చేశామని హిమజ అన్నారు. ఇదంతా కూడా 2004లో జరిగిందని చెప్పుకొచ్చారు. అలా 19 రోజులు నిత్యం పూజలు చేయడంతో.. ఇంట్లో అదే కంటిన్యూ అయిందని అన్నారు. రోజూ పూజలు చేస్తూ వచ్చామని, ఆ రోజు తన డ్యూటీ వచ్చిందని చెప్పుకొచ్చారు. ‘సాయి బాబా విగ్రహాన్ని తుడవడం, ముందున్న నీళ్లను మార్చడం వంటివి ఆరోజు నేను చేయాలన్న మాట. అయితే నేను వెళ్లే సరికి సాయి బాబా విగ్రహం నుంచి విబూది వస్తూనే ఉంది. ముందు ఉంచిన నీళ్లలో తులసి వాసన వస్తోంది. ఇదే విషయాన్ని అందరికీ చెప్పాం. ఇంకా పూజలు చేశాం. ఈ విషయాలన్నీ కూడా మీరు నమ్మడానికి చెప్పడం లేదు. స్వతాహగా అనుభవం అయితేనే ఎవ్వరైనా నమ్ముతారు. ఆ ఫీలింగ్ మాటల్లో చెప్పలేను’ అంటూ హిమజ తన గతంలో జరిగిన ఈ అద్బుతం గురించి చెప్పుకొచ్చారు. వీడియో కోసం..


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3mLG9H0
v

Super Star Krishna : Mahesh Babu విషయంలో ఆమె పాత్ర అంతే!.. నమ్రతపై సూపర్ స్టార్ కృష్ణ

వ్యవహారాలన్నీ కూడా దగ్గరుండి మరీ చూసుకుంటుందనే విషయం అందరికీ తెలిసిందే. మహేష్ బాబు వ్యాపార ప్రకటనలు, ఇతర బిజినెస్‌లు, రెమ్యూనరేషన్ విషయాలు, జీఎంబీ వ్యవహారాలు అన్నీ కూడా నమత్రే చూసుకుంటుందనే టాక్ వినిపిస్తూ ఉంటుంది. మహేష్ బాబు తన సినీ కెరీర్ మీద ఫోకస్ పెడితే.. నమ్రత మాత్రం ఆర్థిక వ్యవహారాలను చక్కబెడుతూ ఉంటుందనే అందరూ అనుకునే వారు. కానీ తాజాగా వాటిపై క్లారిటీ ఇచ్చారు. తన కొడుకు, కోడలి సంసారం గురించి కృష్ణ మాట్లాడారు. తాజాగా సూపర్ స్టార్ కృష్ణ ఓ మీడియా చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎన్నో ఆసక్తికర అంశాలను పంచుకున్నారు. రమేష్ బాబు, మహేష్ బాబు సినీ కెరీర్‌లు, నమత్ర విషయాలపై స్పందించారు. మధ్యలో కొన్ని బ్యాడ్ సబ్జెక్ట్‌లు పడటం, సినిమాలు ఆడకపోవడంతో రమేష్ బాబుకు పూర్తిగా ఆసక్తిపోయిందని, అందుకే సినిమాలకు దూరంగా ఉన్నాడని కృష్ణ తెలిపారు. అందుకే హీరోగా కాకుండా.. నిర్మాతగా మారిపోయారని తెలిపారు. మహేష్ బాబు వ్యవహారాలన్నీ కూడా నమ్రత చూసుకుంటారని అంతా అంటారు కదా? అని కృష్ణను అడిగితే.. అందరూ ఆశ్చర్యపోయే సమాధానం చెప్పారు. అలాంటిదేమీ లేదు.. నమ్రత ఎప్పుడూ ఇల్లాలి పని మాత్రమే చేస్తారన్నట్టుగా చెప్పుకొచ్చారు. పిల్లలు, ఇళ్లు అవే తన ప్రపంచం అన్నట్టుగా కృష్ణ తెలిపారు. సినిమాలు, బిజినెస్ వ్యవహారాలన్నీ కూడా మహేష్ బాబే చూసుకుంటాడని కృష్ణ పేర్కొన్నారు. మొత్తానికి మహేష్ బాబు తన వ్యవహారాలు తానే చూసుకుంటారని కృష్ణ చెప్పేశారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3kuxZ2U
v

మాజీ ప్రియుడిపై అంత పగా?.. తమన్నాతో చెప్పి మంత్రం వేయిస్తోన్న శ్రీముఖి!

బుల్లితెరపై, వెండితెరపై తనకంటూ ఓ గుర్తింపును ఏర్పర్చుకున్నారు. మరీ ముఖ్యంగా స్మాల్ స్క్రీన్ మీద శ్రీముఖికి ఉన్న ఫాలోయింగ్ వేరే లెవెల్. బుల్లితెర రాములమ్మగా శ్రీముఖి క్రేజ్ మామూల్ది కాదు. అయితే బిగ్ బాస్ షోతో శ్రీముఖి క్రేజ్ కాస్త తగ్గినట్టు అయింది. ఆమె కోరి తెచ్చుకున్న నెగెటివిటీతో చివరకు బిగ్ బాస్ విజేతగా కానివ్వలేదు. అలా మూడో సీజన్ రన్నర్‌గానే శ్రీముఖి మిగిలిపోయారు. బిగ్ బాస్ షో కంటే ముందుగా శ్రీముఖి బుల్లితెరపై ఫుల్ బిజీగా ఉండేవారు. కానీ షో ముగిసి బయటకు వచ్చాక శ్రీముఖికి అంతగా ఆఫర్లు రాలేదు. బుల్లితెరపై శ్రీముఖి హవా మధ్యలో కాస్త తగ్గింది. స్టార్ట్ మ్యూజిక్ అంటూ చేసిన ఓ షో అట్టర్ ఫ్లాప్ అయింది. మధ్యలో కొన్ని రోజులు ఎలాంటి షోలు కూడా శ్రీముఖి చేయలేదు. ఇక వెండితెరపైనా శ్రీముఖికి అంతగా అవకాశాలేవీ రాలేదు. కానీ ఈ మధ్యే క్రేజీ అంకుల్స్ అంటూ ప్రేక్షకులను పలకరించారు. ఆ సినిమా దారుణంగా బెడిసికొట్టేసింది. అలాంటి బీ గ్రేడ్, నాసిరకం సినిమాలో శ్రీముఖి నటించడంతో ఆమె అభిమానులు సైతం హర్ట్ అయ్యారు. అలా మరోసారి వెండితెరపై తన ప్రయత్నం బెడిసికొట్టేసింది. హీరోయిన్‌గా సక్సెస్ అవుదామని చూసిన శ్రీముఖికి చేదు అనుభవం ఏర్పడింది. అయితే శ్రీముఖి తన బ్రేకప్ గురించి, లవ్ స్టోరీ గురించి తాజాగా నోరు విప్పారు. తన యూట్యూబ్ చానెల్‌లో వంటల ప్రోగ్రాం కోసం శ్రీముఖిని స్పెషల్‌గా పిలిచారు. అందులో మాటల్లో భాగంగా తన బ్రేకప్ గురించి శ్రీముఖి చెప్పుకొచ్చారు. కోపం వచ్చినప్పుడు జుట్టును కత్తిరిస్తాను.. డిప్రెషన్‌లోకి వెళ్లినప్పుడు ఆ పనే చేస్తాను అని శ్రీముఖి అన్నారు. నీక్కూడా ఉన్నాయా? అని సుమ అడగడంతో.. ఏ నాకు ఉండవా? నేను మనిషిని కాదా? నాకు బ్రేకప్ ఉండదా? అంటూ శ్రీముఖి చెప్పుకొచ్చారు. అతడిని అంత ఈజీ వదలను.. తమన్నా ()తో ఓ మంత్రం కూడా వేయిస్తున్నా.. నాశనం అవ్వడానికి అని శ్రీముఖి తెలిపారు. అంటే ఇంకా తన ఎక్స్ మీద శ్రీముఖికి ఇంకా పగ ఉందేమో.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3zubEZA
v

పీనియర్ హీరో విజయ్‌కి తీవ్ర అనారోగ్యం.. ఆందోళనలో అభిమానులు.. అమెరికాలో చికిత్స

డిఫెరెంట్ స్టైల్‌లో సినిమాలు తీయడంలో ఆయన ఎప్పుడు ముందుంటారు. ఆయన సినిమాలు అంటేనే అందులో కావాల్సినంత వినోదం ఉంటుంది. ఆయనే తమిళ హీరో విజయకాంత్. సినిమాల్లోనే కాదు ఆయన బయట కూడా విభిన్నంగానే ఉంటారు. ఆయన మాట్లాడే మాటలు, చేతలు ఎన్నో వివాదాలకు దారి తీస్తాయి. అయినప్పటికీ.. తన తీరు మార్చుకోకుండా ముందుకు వెళ్తురు విజయకాంత్. తమిళంతో పాటు పలు డబ్బింగ్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు కూడా పరిచయమే. ఇక రాజకీయాల విషయానికి వస్తే.. ఆయన తమిళనాడు డీఎండీకే పార్టీ తరపున శాసనసభలో 2011 నుండి 2016 వరకు ప్రతిపక్ష నాయకునిగా భాద్యతలను చేపట్టారు. అయితే ప్రస్తుతం ఆయన అనారోగ్యానికి గురయ్యారు. గత ఏడాది విజయకాంత్ కరోనా వైరస్ బారిన పడ్డారు. అయితే ఆ తర్వాత ఐసోలేషన్‌లో ఉన్న ఆయన.. త్వరగానే కోలుకున్నారు. తాజాగా మరోసారి ఆయన అనారోగ్యానికి గురయ్యారు. దీంతో ఆయనకు తొలుత చెన్నైలోనే చికిత్స అందించారు. కానీ, ఇక్కడి వైద్య సౌకర్యాలు ఆయనకు వైద్యం ఇచ్చేందుకు సరిపోలేదు. దీంతో ఆయన్ను దుబాయ్‌కి తరలించారు. అక్కడి వైద్యలు ఆయనకు చికిత్స అందించారు. అయితే అంతా మెరుగు పడుతుంది అనుకుంటున్న సమయంలో మరోసారి ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా మారింది. దీంతో ఆయన్ని అమెరికాలోనే ఓ హాస్పిటల్‌కి తీసుకు వెళ్లారు. ఆయనతో పాటు ఆయన రెండో కూమారుుడ షణ్ముగం కూడా ఉన్నారు అని సమాచారం. మొత్తానికి విజయకాంత్ త్వరగా కోలుకోవాలి అని ఆయన అభిమానులు బలంగా కోరుకుంటున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3zxuOxQ
v

చివరి క్షణం వరకు చేస్తూనే ఉంటాను.. సుడిగాలి సుధీర్ కామెంట్స్

సుడిగాలి బుల్లితెర, వెండితెరపై చేసే అల్లరి అందరికీ తెలిసిందే. నటుడిగా, మెజిషీయన్, సింగర్, డ్యాన్సర్స, యాక్షన్ ఇలా అన్నింట్లోనూ సుధీర్ తనకు తాను సాటి అని నిరూపించుకున్నారు. అలాంటి సుధీర్ వెండితెరపై హీరోగానూ సక్సెస్ అయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే రెండు సినిమాలతో సుధీర్ హీరోగా తెలుగు ప్రేక్షకులను పలకరించారు. సాఫ్ట్ వేర్ సుధీర్, త్రీ మంకీస్ అంటూ సుధీర్ సిల్వర్ స్క్రీన్ మీద రచ్చ చేశారు. అయితే బుల్లితెరపై సక్సెస్ అయినట్టుగా వెండితెరపై తన మ్యాజిక్‌ను చూపించలేకపోయారు సుధీర్. కానీ ఎలాగైనా సరే వెండితెరపై హీరోగా తన స్టామినాను నిరూపించుకునేందుకు సుధీర్ ప్రయత్నిస్తూనే ఉన్నారు. కాలింగ్ సహస్ర అనే ఓ సినిమాను చేస్తున్నారు. లాక్డౌన్, కరోనా వల్ల ఆ చిత్రం వాయిదా పడుతూనే వస్తోంది. ఇక గాలోడు అనే మరో సినిమాలోనూ సుధీర్ నటిస్తున్నారు. అలా మొత్తానికి బిగ్ స్క్రీన్ మీద సుధీర్ ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నారు. అలా అని బుల్లితెరను నిర్లక్ష్యం ఏమీ చేయడం లేదు. ఎక్స్ ట్రా జబర్దస్త్, ఢీ, శ్రీదేవీ డ్రామా కంపెనీ అంటూ ప్రతీ రోజూ ఎంటర్టైన్ చేస్తూనే వస్తున్నారు. ఇక స్పెషల్ ఈవెంట్లు, పండుగ ప్రోగ్రాంలలోనూ సుధీర్ తన హవాను కొనసాగిస్తున్నారు. ఇదే విషయాన్ని సుధీర్ చెప్పుకొచ్చారు. నా మీద ప్రేమ కురిపిస్తున్న ఆడియెన్స్, నా ఫ్యామిలీ, అభిమానులందరికీ ధన్యవాదాలు. మీ ప్రేమ, ఆదరణ ఇలానే ఎప్పుడూ ఉండాలి.. నా చివరి క్షణం వరకు మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తూనే ఉంటాను అని సుధీర్ చెప్పుకొచ్చారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2Y9jR7L
v

టాలీవుడ్ లోకి మరో సినీ వారసురాలు ఎంట్రీ.. హీరోయిన్‌గా శ్రీకాంత్ డాటర్!

చిత్రసీమలోకి నటీనటుల వారసులు ఎంట్రీ ఇవ్వడం కామనే. ఆ నాటి నుంచి నేటివరకు ఎందరో స్టార్ కిడ్స్ సినీ గడప తొక్కారు. అయితే సక్సెస్ అనేది మాత్రం సదరు వ్యక్తి టాలెంట్‌పై ఆధారపడి ఉంటుందని చాలామంది స్టార్ కిడ్స్ విషయంలో ప్రూవ్ అయింది కూడా. ఈ నేపథ్యంలోనే హీరో శ్రీకాంత్ కొడుకు రోషన్ ఇప్పటికే వెండితెర ఆరంగేట్రం చేయగా.. ఇప్పుడు కూతురు కూడా అదే బాట పట్టిందని తెలుస్తుండటం ఆసక్తికరంగా మారింది. నిజానికి చాలా తక్కువ మంది హీరోలు తమ కూతుళ్లు సినీ ఎంట్రీ కోరుకుంటున్నారు. ప్రస్తుతం ఉన్న స్టార్‌ కిడ్స్‌లో మంచులక్ష్మీ, నిహారిక, శివాత్మిక ఫీమేల్ లీడ్స్ లిస్టులో ఉన్నారు. ఇప్పుడు ఆ లిస్టులో శ్రీకాంత్- ఊహ కూతురు మేధ కూడా చేరబోతోందని ఇన్ సైడ్ టాక్. 17 ఏళ్ల మేధను హీరోయిన్‌గా చేసేందుకు శ్రీకాంత్ దంపతులు ఇంట్రెస్ట్ చూపుతున్నారని తెలుస్తుండటం హాట్ టాపిక్ అయింది. ఇందుకోసమే ప్రస్తుతం భరత నాట్యం శిక్షణ తీసుకుంటోందట మేధ. ఆమె ఎంట్రీ చాలా గ్రాండ్‌గా ఉండాలని భావిస్తున్న శ్రీకాంత్- ఊహ దంపతులు అందుకోసం ఇప్పటికే కథల వేట ప్రారంభించారని తెలుస్తోంది. సరైన కథ, డైరెక్టర్ సెట్ అయితే అతిత్వరలో ఆమె కెమెరా ముందుకు రానుందని అంటున్నారు. ఇకపోతే శ్రీకాంత్‌ కొడుకు రోషన్‌ ‘నిర్మల కాన్వెంట్‌’ సినిమాతో టాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చి కెరీర్‌లో సరైన బ్రేక్ కోసం ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం రాఘవేంద్ర రావు దర్శకత్వ పర్యవేక్షణలో రూపొందుతున్న 'పెళ్లి సందD' సినిమా చేస్తున్నారు. త్వరలోనే ఈ ఫీల్ గుడ్ ఎంటర్‌టైనర్ ప్రేక్షకుల ముందుకు రానుంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3t0l0tr
v

Vijayashantiని అందుకే తొక్కేశారు.. ఆమెను ‘మా’ బ్యాన్ చేసింది : సీవీఎల్ నరసింహారావు

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఎన్నికలు రోజురోజుకూ రసవత్తరంగా మారుతున్నాయి. మా అధ్యక్ష పీఠానికి పోటీ పడే వారి సంఖ్య ఎంతకు చేరిందో అందరికీ తెలిసిందే. ప్రకాష్ రాజ్, మంచు విష్ణు, హేమ, జీవిత రాజశేఖర్, సీవీఎల్ నరసింహారావులు అధ్యక్ష బరిలోకి దిగుతున్నట్టు ప్రకటించేశారు. వీరిలో ప్రకాష్ రాజ్ అందరికంటే ముందున్నారు. ప్రకాష్ రాజ్ తన ప్యానల్‌ను ప్రకటించేశారు. ఇక మంచు విష్ణు అయితే మా బిల్డింగ్ తానే కట్టేస్తానంటూ వీడియోలు కూడా వదులుతున్నారు. నరేష్ మీద, ‘మా’ మీద ఆరోపణలు చేసిందని హేమకు షోకాజ్ నోటీసులు కూడా ఇచ్చేశారు. తెలంగాణ నుంచి మా సంస్థకు అధ్యక్షుడు కావాలని సీవీఎల్ నరసింహారావు తన గొంతును లేవనెత్తారు. సినిమా పరిశ్రమంలో తెలంగాణ వాదాన్ని రగిల్చేందుకు సీవీఎల్ ప్రయత్నిస్తున్నారు. తాజాగా సీవీఎల్ ఓ ఇంటర్వ్యూలో చిత్ర పరిశ్రమలో జరుగుతున్న అన్యాయాలు, మా ఎన్నికల వ్యవహారాలపై నోరు విప్పారు. విభజన చట్టం గురించి చెబుతూ.. ఎన్నో విషయాలను బయటపెట్టేశారు. చిత్రపురి కాలనీలో జరిగిన అన్యాయాలు, అక్రమాల గురించి సీవీఎల్ మాట్లాడారు. పద్మాలయ, రాఘవేంద్ర రావు స్టూడియోల్లోనూ తెలంగాణకు భాగస్వామ్యం ఉందని అన్నారు. సినిమా అభివృద్ది కోసం వాటిని ఇచ్చారు..కానీ ఇప్పుడు అవి రియల్ ఎస్టేట్‌లుగా మారిపోయాయని సీవీఎల్ అన్నారు. ఇక తెలంగాణ వాదాన్ని సపోర్ట్ చేస్తోందనే కారణంతోనే విజయశాంతిని ‘మా’ బ్యాన్ చేసిందని, ఇప్పటికి కూడా ఆమె ‘మా’లో సభ్యురాలు కాదని, ఆమెను తొక్కేశారని సీవీఎల్ అన్నారు. లాంటి గొప్ప నటి ఇప్పుడెవరైనా ఉన్నారా? ఆమెలాంటి నటించగల హీరోయిన్ ఉందా? ప్రతిఘటన, కర్తవ్యం, ఓసేయ్ రాములమ్మ వంటి చిత్రాలు చేయగలరా? అని సీవీఎల్ ప్రశ్నించారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3jqFM2g
v

అది చేయాలి అంటూ అసభ్య సందేశాలు.. నటికి ఫేక్ దర్శకుడి నుంచి తిప్పలు

వాడకం పెరిగిపోయిన తర్వాత ఎన్ని ప్రయోజనాలు జరుగుతున్నాయో.. అన్ని నష్టాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా అమ్మాయిలకు ఈ సోషల్‌మీడియా వల్ల ఎన్నో నష్టాలు జరుగుతున్నాయి. ప్రధానంగా సోషల్‌మీడియా ద్వారా వేధించడం.. ఫేక్ ఫోటోలు సృష్టించడం.. వంటి ఎన్నో దరిద్రపు అనుభవాలను ఎదురుకుంటున్నారు అమ్మాయిలు. తాజాగా ఓ నటికి కూడా ఇలాంటి చేదు అనుభవమే ఎదురైంది. తాను డైరెక్టర్‌ని అంటూ నటి పాయల్ సర్కార్‌కు అసభ్య మెసెజ్‌లు పంపించాడు ఓ వ్యక్తి. బెంగాల్‌లో పుట్టిన డజనుకుపైగా సినిమాల్లో నటించింది. అయితే సినిమాల్లోనే కాక.. రాజకీయాల్లోనే ఆమె తన సత్తా చాటింది. భారతీయ జనతా పార్టీ తరఫున ఆమె ఎన్నికల్లో పోటీ చేసింది. ఇక దీంతో పాటు ఆమె పలు టీవీషోలలో కూడా ఆమె ప్రేక్షకులకు వినోదాన్ని పంచింది. అయితే తాజాగా ఆమెకు ఓ చేదు అనుభవం ఎదురైంది. ఓ సినిమాలో ప్రధాన పాత్ర ఇస్తాను అంటూ.. తాను సీనియర్ దర్శకుడిని అంటూ ఓ వ్యక్తి ఆమెని దారుణంగా మోసం చేశాడు. అంతేకాక.. ఆమె అసభ్యంగా సందేశాలు పంపించాడు. దీంతో ఆమె వెంటనే ముందడుగు వేసింది. ఆ మెసేజ్‌లను స్క్రీన్‌షాట్ తీసి సోషల్‌మీడియాలో పోస్ట్ చేసింది. అతని ప్రొఫైల్ ఓపెన్ చేస్తే అతను రవి కినాగి అంటూ ఫోటోలు కనిపించాయి. అంతేకాకుండా అతను తీసిన సినిమాలు కూడా దర్శనమిచ్చాయి. దీంతో ఆమె.. అతను నిజంగానే దర్శకుడు అని భ్రమపడింది. కానీ, ఆ తర్వాత అతను అసభ్యంగా మెసేజ్‌లు పంపించడంతో అతని నిజస్వరూపం బయటపడింది. ఒక రాత్ర గడపాలి అంటూ అతను ఆమెకు సందేశాలు పంపించడం ప్రారంభించాడు. దీంతో ఆమె ఆ మెసేజ్‌లు అన్ని స్క్రీన్‌షాట్స్‌ తీసి ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసింది. ఆ తర్వాత ఆమె తన సన్నిహితుల సహాయంతో పోలీసులను ఆశ్రయించింది. బరక్‌పూర్‌ పోలీసులు ఈ ఘటనపై విచారణ జరుపుతున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3kS1tIn
v

‘అందుకోసం ఎంతో కష్టపడాలి’.. షర్ట్ తీసేసి స్టంట్ చేసిన సుధీర్ బాబు

డైనమిక్ హీరో హీరోగా.. ‘పలాస 1978’ ఫేమ్ క‌రుణ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన సినిమా ‘’. రీసెంట్‌గా విడుదలైన ఈ సినిమా ప్రస్తుతం మంచి టాక్‌తో రన్‌ అవుతోంది. సినిమా చూసిన ప్రతీ ఒక్కరు పాజిటివ్ రివ్యూనే ఇస్తున్నారు. సినిమాలో యాక్షన్‌తో పాటు సెంటిమెంట్‌ కూడా అదిరిపోయింది అంటూ కామెంట్ చేస్తున్నారు. ఇక ఈ సినిమా విషయానికొస్తే.. హీరోయిన్‌గా నటించగా.. సీనియర్ హీరో నరేష్ ప్రధాన పాత్ర పోషించారు. ఓ విషాదమైన ప్రేమగాథ అయినప్పటికీ.. ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. ఇప్పటికే విడుదల అయిన ఈ సినిమా.. ప్రేక్షకులను అలరిస్తోంది. కలం, మలం అనే కాన్సెప్ట్ మీద ఈ సినిమా రూపొందింది. అయితే ఈ సినిమా కోసం హీరో మాత్రం చాలా కష్టపడ్డారు. తన ఇమేజ్‌ని పక్కన పెట్టిన ఆయన ఎన్నె ఫీట్లు చేశారు. తాజా ఈ సినిమాలో తన షర్ట్ విప్పేసి.. ఫైటింగ్ స్టంట్స్ చేస్తూ ఓ వీడియోని సుధీర్‌బాబు ట్విట్టర్‌ ద్వారా పంచుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక సినిమా విషయానికొస్తే.. ఆనంది ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించింది. ‘శ్రీదేవి సోడా సెంటర్’. రీసెంట్‌గా విడుదలైన ఈ సినిమా ప్రస్తుతం మంచి టాక్‌తో రన్‌ అవుతోంది. సినిమా చూసిన ప్రతీ ఒక్కరు పాజిటివ్ రివ్యూనే ఇస్తున్నారు. సినిమాలో యాక్షన్‌తో పాటు సెంటిమెంట్‌ కూడా అదిరిపోయింది అంటూ కామెంట్ చేస్తున్నారు. తాజాగా సుధీర్ బాబు ఈ సినిమా నుంచి ఓ హాట్‌ని పోస్ట్ చేశారు. ఇందులో ఆయన షర్ట్ లేకుండా ఉండి యాక్షన్ చేస్తున్నారు. ఇది కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. పెద్ద స్టార్ హీరోల నుంచి అభిమానుల వరకూ ఇదే విషయాన్ని కామెంట్ చేశారు. దీంతో శ్రీదేవి సోడా సెంటర్ ఓ హిట్ సినిమా అనే చెప్పుకోవాలి.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3DrRZvN
v

Maestro: నితిన్ 'మాస్ట్రో' నుంచి ఇంట్రెస్టింగ్ వీడియో రిలీజ్.. కృష్ణాష్టమి స్పెషల్ గిఫ్ట్

ఈ ఏడాది వరుస సినిమాలను లైన్‌లో పెట్టిన యంగ్ హీరో ఇటీవలే 'చెక్' సినిమాతో డిజాస్టర్ మూటగట్టుకొని ఆ వెంటనే 'రంగ్ దే' మూవీతో డీసెంట్ హిట్ అందుకున్నాడు. ఇక ఇప్పుడు 'మ్యాస్ట్రో' అంటూ మరో డిఫరెంట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. సూపర్ హిట్ మూవీ ‘అంధాధూన్’ తెలుగు రీమేక్‌‌గా మేర్లపాక గాంధీ దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కుతోంది. , హీరోయిన్లుగా నటిస్తున్నారు. నితిన్ సొంత నిర్మాణ సంస్థ 'శ్రేష్ఠ్ మూవీస్' బ్యానర్‌పై రూపొందుతున్న ఈ సినిమాకు నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి, సోదరి నిఖితా రెడ్డి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. మహతి స్వరసాగర్ సంగీతం అందిస్తున్నారు. చిత్రంలో నితిన్ అంధుడిగా కనిపించనుండటం విశేషం. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన అన్ని కార్యక్రమాలు ఫినిష్ చేసిన చిత్రయూనిట్.. ఓటీటీ వేదిక హాట్ స్టార్‌లో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. సెప్టెంబర్ 17వ తేదీ నుంచి స్ట్రీమింగ్ చేయనున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలు వేగవంతం చేశారు. ఇందులో భాగంగా కృష్ణాష్టమి స్పెషల్ గిఫ్ట్ ఇచ్చారు. '' స్నీక్ పీక్‌ అంటూ నితిన్‌ ఇంట్రెస్టింగ్ వీడియో వదిలారు. నితిన్ కెరీర్‌లో 30వ సినిమాగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రంపై ఆయన అభిమానులు బోలెడన్ని ఆశలు పెట్టుకున్నారు. మరోవైపు ఈ సినిమాతో ఎలాగైనా బిగ్ సక్సెస్ అందుకోవాలని నితిన్ పట్టుదలగా ఉన్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3jy6p5L
v

Trisha: చిరుతో కష్టం బాలయ్యతో ఓకే..! హాట్ టాపిక్ అయిన త్రిష డిసీజన్

ఒకానొక సమయంలో తెలుగు తెరపై హవా నడిపించిన .. ప్రస్తుతం తమిళ సినిమాలతో బిజీగా అంటోంది. తెలుగు తెరపై చాలా అరుదుగా కనిపిస్తున్న ఈ అమ్మడు ఇటీవల చిరంజీవి సరసన 'ఆచార్య' మూవీలో ఛాన్స్ వచ్చినా రిజెక్ట్ చేసిందని విన్నాం. అందుకు కారణాలేంటనేవి పక్కనబెడితే ఇప్పుడు సరసన నటించేందుకు ఆమె రెడీ అయిందని తెలుస్తుండటం టాలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్ అయింది. వరుస ప్రాజెక్ట్స్‌తో బిజీగా ఉన్న నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం బోయపాటి దర్శకత్వంలో రూపొందుతున్న 'అఖండ' మూవీ ఫినిష్ చేసే పనిలో ఉన్నారు. దీని తర్వాత తదుపరి సినిమాను 'క్రాక్' ఫేం దర్శకత్వంలో నటించేందుకు రెడీ అవుతున్నారు. మరోవైపు ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తి చేస్తున్న డైరెక్టర్.. హీరోయిన్‌గా త్రిషను తీసుకున్నారని తెలుస్తోంది. బాలయ్యతో సినిమా అనగానే త్రిష వెంటనే ఓకే చేసిందని, ఇందులో ఆమె గృహిణిగా ఓ పవర్‌ఫుల్ రోల్‌లో కనిపించనుందనే టాక్ వినిపిస్తోంది. బాలయ్యతో రొమాన్స్ చేసేందుకు త్రిష రెడీ అయ్యిందనే విషయం బయటకు రావడంతో ఆమె తీసుకున్న ఈ డిసీజన్‌పై జనాల్లో చర్చలు మొదలయ్యాయి. చిరంజీవితో ఛాన్స్ వచ్చినా వదులుకుంది కానీ బాలకృష్ణతో మాత్రం రెడీ అనడంలో రీజన్ ఏమై ఉంటుందా అని వెతికే పనిలో పడ్డారు జనం. ఏది ఏమైనా నందమూరి ఫ్యాన్స్ మాత్రం బాలయ్య- త్రిష కాంబినేషన్‌ని వెండితెరపై చూడబోతున్నామని తెలిసి ఖుషీ అవుతున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందనున్న ఈ సినిమా కోసం ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన యదార్థ ఘటన నేపథ్యంలో కథ రాసుకున్నారట గోపీచంద్. ఇందులో బాలయ్యతో పాటు మరో హీరోయిన్‌కి కూడా స్కోప్ ఉందని, అందుకోసం బాలీవుడ్ తారల వైపు చూస్తున్నారని సమాచారం.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3BkSea0
v

ఆ సినిమా దర్శకుడితో విజయ్ సేతుపతి మరో సినిమా.. ఈసారి ఎలా చూపిస్తారో?

విజయ్ సేతుపతి.. ఈ పేరు తెలియని సినిమా అభిమానులు ఉండరు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అంతలా సినీ అభిమానులపై తన ప్రభావం చూపించారు ఆయన. హీరోగా చేసినా.. విలన్‌గా చేసినా.. లేదా సపోర్టింగ్ క్యారెక్టర్ చేసినా.. తన ముద్రను చూపిస్తారు . ఇక సినిమాల విషయానికి వస్తే.. ఆయన అంతకు ముందు ఎన్ని సినిమాలు చేసినా.. ఆయనకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టిన సినిమా అంటే ‘’ అనే చెప్పుకోవాలి. ఓ విలక్షణమైన లవ్‌స్టోరీగా ఈ సినిమా రూపొందింది. తమిళంలో తెరకెక్కిన ఈ సినిమాలో హీరోయిన్‌గా అందాల భామ త్రిష నటించింది. దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించడమే కాక.. కలెక్షన్ల పరంగా కూడా ప్రొడ్యూసర్‌కి లాభాలు తెచ్చిపెట్టింది. దీంతో పాటు తెలుగు, కన్నడ భాషల్లోనూ ఈ సినిమాను రీమేక్ చేశారు. తెలుగులో ‘జాను’ అనే టైటిల్‌తో రూపొందిన ఈ సినిమాలో శర్వానంద్, సమంతలు ప్రధాన పాత్రల్లో నటించారు. ఇక పోతే విజయ్ సేతుపతి మరోసారి దర్శకుడు ప్రేమ్‌కుమార్‌తో సినిమా చేస్తున్నారట. ప్రస్తుతానికి డజనుకు పైగా సినిమాలతో బిజీగా ఉన్నారు. పాన్ ఇండియా ప్రాజెక్టుగా రూపొందుతున్ ‘అన్నాబెల్లె సేతుపతి’ సినిమాలో ఆయన నటిస్తున్నారు. ఇందుతో హీరోయిన్ తాప్సీ ప్రధాన పాత్ర పోషిస్తోంది. దీంతో పాట బాలీవుడ్‌లోకి కూడా ఆయన ఎంట్రీ ఇవ్వనున్నారు. అమీర్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘లాల్‌సింగ్ చద్ధా’ సినిమాలో విజయ్ ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు. దీంతో పాటు ఆయన ప్రేమ్‌కుమార్‌తో మరో సినిమాను ఓకే చేశారట. అయితే 96లొ విజయ్‌లో భగ్న ప్రేమికుడిలా చూపించిన ప్రేమ్.. మరి రాబోయే సినిమాలో ఎలా చూపిస్తారో తెలియాలి అంటే కొన్ని రోజులు ఎదురుచూడాల్సిందే.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3yqOTEv
v

Prabhas: కృష్ణాష్టమి స్పెషల్ ట్రీట్.. 'రాధే శ్యామ్' నుంచి సర్‌ప్రైజింగ్ పోస్టర్ రిలీజ్

యంగ్ రెబల్ స్టార్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సినిమా ''. పాన్ ఇండియా మూవీగా రాబోతున్న ఈ మూవీ నుంచి ఇప్పటికే విడుదలైన ఫస్ట్‌లుక్, మోషన్ పోస్టర్, టీజర్‌లు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకోవడంతో వరల్డ్ వైడ్ ప్రభాస్ అభిమానుల్లో ఆతృత నెలకొంది. ఈ నేపథ్యంలో తాజాగా స్పెషల్ ట్రీట్ ఇస్తూ 'రాధే శ్యామ్' నుంచి మరో సర్‌ప్రైజింగ్ పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. యూరప్‌ బ్యాక్‌డ్రాప్‌లో పీరియాడికల్‌ లవ్‌స్టోరీగా తెరకెక్కుతున్నఈ సినిమాలో ప్రభాస్‌ విక్రమాదిత్యగా, డాక్టర్‌ ప్రేరణగా నటిస్తున్నారు. తాజాగా ఈ ఇద్దరి స్టిల్ రిలీజ్ చేస్తూ సర్‌ప్రైజ్ చేశారు మేకర్స్. ఈ పోస్టర్‌ని తన ఇన్స్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసిన ప్రభాస్.. తన అభిమానులకు, ప్రేక్షకులకు పండగ శుభాకాంక్షలు తెలిపారు. ఇందులో హీరోహీరోయిన్లు ప్రభాస్, పూజా హెగ్డేల లుక్ ఎంతో అట్రాక్ట్ చేస్తుండటంతో నెట్టింట వైరల్ అవుతోంది. రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై రాధాకృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాను రాబోయే సంక్రాంతి కానుకగా జనవరి 14వ తేదీన విడుదల చేయబోతున్నారు. గోపీకృష్ణ మూవీస్, యూవీ క్రియేషన్స్ బ్యానర్ల సంయుక్త సమర్పణలో ఈ మూవీ రూపొందుతోంది. చిత్రంలో భాగ్య శ్రీ, సచిన్ కేడ్కర్, ప్రియదర్శి, సాషా ఛేత్రీ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. కృష్ణంరాజు రోల్ స్పెషల్ అట్రాక్షన్ కానుందట. తెలుగు, తమిళ, మలయాళీ, హిందీ, కన్నడ భాషల్లో గ్రాండ్‌గా ఈ మూవీని రిలీజ్ చేయనున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3gJiR0o
v

మాస్ డైరెక్టర్‌తో హీరో రామ్ మూవీ.. ఈసారి డబుల్ ధమాకా ప్లాన్ చేశారట..!

ఒకప్పుడు చాక్లెట్‌ బాయ్, లవర్‌ బాయ్ వంటి ఇమేజ్‌తో సినిమాలు చేశాడు హీరో . అందులో కొన్ని సక్సెస్‌ కాగా.. కొన్ని డిజాస్టర్లుగా మిగిలిపోయాయి. అయితే ‘ఇస్మార్ట్ శంకర్’ అనే సినిమాతో రామ్ లుక్‌ మార్చడమే కాదు.. తనలోని మాస్ యాంగిల్‌ని కూడా చూపించి ప్రేక్షకులకు షాక్ ఇచ్చారు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. కలెక్షన్ల పరంగా కూడా ప్రొడ్యూసర్లకు లాభాలు తెచ్చిపెట్టింది. ఇకపోతే ఈ సినిమా తర్వాత రామ్ ‘రెడ్’ అనే సినిమా చేశారు. కిషోర్ తిరుమల దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో రామ్ తొలిసారిగా డ్యుయల్ రోల్ ప్లే చేశారు. అయితే ఈ సినిమా బాక్సాఫిస్ వద్ద ఫర్వాలేదు అనిపించింది. ప్రస్తుతం రామ్ తమిళ దర్శకుడు లింగుస్వామితో ఓ సినిమా చేస్తున్నారు. ‘’ అనే వర్కింగ్ టైటిల్‌తో ఈ సినిమా రూపొందుతుంది. తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా ద్వారా రామ్ తమిళ ఇండస్ట్రీలోకి అడుగు పెడుతుండగా.. లింగుస్వామికి ఇది తొలి తెలుగు చిత్రంగా నిలువనుంది. శ్రీనివాసా సిల్వర్‌ స్క్రీన్స్‌ బ్యానర్‌పై శ్రీనివాస చిట్టూరీ నిర్మిస్తున్న ఈ సినిమాలో 'ఉప్పెన' బ్యూటీ కృతి శెట్టి హీరోయిన్‌గా నటించనుంది. ఇక ఈ సినిమా తర్వాత రామ్.. మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీనుతో ఓ సినిమా చేయనున్నారట. బోయపాటి ప్రస్తుతం బాలకృష్ణతో ‘అఖండ’ సినిమా పనుల్లో బిజీగా ఉన్నారు. అయితే రీసెంట్‌గానే రామ్‌ని కలిసిన ఆయన ఓ కథ వినిపించడం.. దానికి రామ్ ఓకే చెప్పడం జరిగిందని టాక్ వినిపిస్తోంది. ఇక ఈ సినిమా కూడా రెండు భాషల్లో రూపొందనుంది అని తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించి ఇంకా అధికారక ప్రకటన రావాలి. మొత్తానికి బోయపాటి మాస్ కథకి.. రామ్ ఎనర్జీ కూడా తోడైతే.. ఇక ఆ సినిమా ఏ రేంజ్‌లో ఉంటుందా అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3sYc0oS
v

ఇదేం దరిద్రం రా బాబోయ్!! ప్రియాంక చోప్రా ప్రైవేట్ పార్ట్‌పై భర్త ఫీలింగ్స్.. రియల్లీ షాకింగ్

తనకంటే పదేళ్లు చిన్నవాడైన అమెరికన్ సింగర్ నిక్ జోనాస్‌తో డేటింగ్ చేసి అతన్నే పెళ్లాడింది . దీంతో అప్పట్లో వీళ్ళ లవ్ మ్యాటర్ జనాల్లో చర్చనీయాంశం అయింది. అయితే ఆ చర్చలకు అంతటితో ఫుల్‌స్టాప్ పెట్టకుండా పెళ్లి తర్వాత పబ్లిక్ రొమాన్స్ చేస్తూ నిత్యం జనం నోళ్ళలో నానుతున్నారు ప్రియాంక- నిక్ దంపతులు. వీలు చిక్కినప్పుడల్లా రొమాంటిక్ టూర్స్ వేయడం అలవాటుగా పెట్టుకున్న ఈ ఇద్దరూ ఆయా టూర్ విశేషాలు, ఫొటోలతో సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు. ఇప్పటికే ఎన్నోసార్లు పబ్లిక్ ప్లేస్ లోనే రొమాంటిక్ మూడ్ ఎంజాయ్ చేస్తూ తెగ హంగామా చేశారు. సినిమా ఫంక్షన్స్ విషయంలోనూ వీళ్లది అదే తీరు. ఎక్కడ ఏ ఫంక్షన్ జరిగినా మోడ్రన్ దుస్తుల్లో కనిపించి భర్తతో ఎంజాయ్ చేస్తుంటుంది ప్రియాంక. కెరీర్ పరంగా ఎంత బిజీ అయినా తన ప్రియుడు, భర్త నిక్ జోనాస్‌తో రొమాంటిక్ మూమెంట్స్ ఎంజాయ్ చేయడంలో మాత్రం ఎప్పుడూ ముందుంటూ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అవుతుంది.. ఈ నేపథ్యంలోనే తాజాగా ఓ షాకింగ్ పిక్ షేర్ చేసింది ప్రియాంక. దీనిపై తన ప్రైవేట్ పార్ట్‌ను భర్త స్నాక్స్‌లా కొరుక్కుతింటున్నాడు అన్నట్లుగా ఆమె చేసిన కామెంట్ వైరల్‌గా మారింది. ఇది చూసి నెటిజన్లు షాకయ్యారు. ఆ స్నాక్స్ మాక్కూడా ఇస్తారా అంటూ కామెంట్స్ చేస్తూ ఈ రొమాంటిక్ స్టిల్‌ని తెగ షేర్ చేసుకుంటున్నారు. సోషల్ మీడియా లోనూ యాక్టివ్ రోల్ పోషిస్తున్న ప్రియాంక.. ఎప్పటికప్పుడు గ్లామర్ షోతో పాటు భర్తపై ఉన్న ప్రేమను చాటుకుంటోంది. ఈ మధ్యకాలంలో ప్రియాంక గర్భం దాల్చిందనే వార్తలు కూడా వైరల్ అయ్యాయి. మరోవైపు 'అన్ ఫినిష్డ్' పేరుతో రిలీజ్ చేసిన బుక్‌లో ఆమె చెప్పిన విశేషాలు నిత్యం వార్తల్లో నిలుస్తున్నాయి.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3sXrN7c
v

Sunday 29 August 2021

అషు రెడ్డితో మాట్లాడింది సె** గురించే.. ఎట్టకేలకు ఆర్జీవీ ఓపెన్! మరో హాట్ యాంగిల్‌తో రచ్చ

మనసులో ఎలాంటి దాపరికం అనేది లేకుండా ఏదైనా ముక్కుసూటిగా మాట్లాడే తత్వం రామ్ గోపాల్ వర్మది. మరీ ముఖ్యంగా అమ్మాయిల విషయంలో వర్మ రూటే సపరేటు. నిత్యం ఏదో ఒక కామెంట్ చేస్తూ అలజడి రేపే ఆయన రీసెంట్‌గా ఇయన సుల్తానా, జ్యోతిలతో చేసిన రచ్చ అంతాఇంతా కాదు. సోషల్ మీడియాలో ఆ వీడియోలు తెగ హల్చల్ చేస్తుండగానే.. మరోవైపు బిగ్ బాస్ బ్యూటీ హాట్ యాంగిల్స్ పోస్ట్ చేస్తూ సెన్సేషన్ క్రియేట్ చేశారు వర్మ. కొన్ని సందర్భాల్లో ఏం మాట్లాడుతున్నారో కూడా ఎవ్వరికీ అర్థం కాకుండా మాట్లాడే .. రీసెంట్‌గా అషు రెడ్డి హాట్ యాంగిల్స్ పోస్ట్ చేస్తూ బుకాయించారు. ఈ ఫొటోలో ఉంది అషు రెడ్డి కాదని అంటూనే వైరల్ చేసే ప్రయత్నం చేశారు. ఎలా వెళ్ళామన్నది కాదు ముఖ్యం ఎంతమంది అట్రాక్ట్ అయ్యారు అన్నదే ముఖ్యం అన్నట్లుగా వర్మ దూసుకెళ్తున్నట్లు ఆయన లేటెస్ట్ ఫొటోలు, వీడియోలు చూస్తుంటే అర్థమవుతోంది. ఎలాగైతేనేం కావాల్సినంత ప్రమోషన్ అయితే దక్కిందని అనుకున్నారో ఏమో రీసెంట్‌గా పోస్ట్ చేసిన అషు రెడ్డి హాట్ యాంగిల్స్ విషయంలో ఎట్టకేలకు ఓపెన్ అయ్యారు వర్మ. అరియానాలాగా అషుతో ఇంటర్వ్యూ చేయడం లేదని, అసలు ఈ వీడియో ఏమిటో తనకు అర్థం కావడం లేదు అన్నట్లుగా మాట్లాడిన ఆయన.. తాజాగా అసలు మ్యాటర్ చెప్పేస్తూ మరో హాట్ యాంగిల్ పోస్ట్ చేశారు. ఈ ఫొటోలో ఉన్నది తామే అని చెప్పేస్తూ మరోసారి వార్తల్లోకెక్కారు. అషు రెడ్డితో ఐస్ క్రీమ్ తింటూ సెక్స్ గురించి మాట్లాడుతున్నా అని పేర్కొంటూ ట్వీట్ చేసిన .. ఈ ఇంటర్వ్యూ కి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ఆగస్టు 30వ తేదీ 6 గంటల 9 నిమిషాలకు విడుదల చేస్తున్నామని తెలిపారు. తప్పనిసరిగా ఆ పోస్టర్ చూడాలని అన్నారు. ఇదంతా చూస్తుంటే ఆయన తీరు మరో రచ్చకు తెరలేపేలా కనిపిస్తోంది. సో.. చూడాలి మరి ఈ ఇంటర్వ్యూ ఎలా ఉంటుందనేది!.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2UVRMiS
v

Chiranjeevi: దిగ్గజ క్రికెటర్‌తో చిరు దంపతుల మీట్.. ఇది చాలా స్పెషల్ అంటూ మెగాస్టార్ మెసేజ్

టాలీవుడ్ సీనియర్ హీరో, మెగాస్టార్ సోషల్ మీడియాలో యమ యాక్టివ్‌గా ఉంటున్నారు. ఈ మధ్యే సోషల్ మీడియా ఎంట్రీ ఇచ్చిన ఆయన ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన అప్‌డేట్స్ షేర్ చేస్తూ మెగా అభిమానులను ఖుషీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే చాలా గ్యాప్ తర్వాత తన పాత మిత్రుడిని కలిశానని తెలుపుతూ చిరంజీవి పెట్టిన పోస్ట్ ఆన్ లైన్ వేదికలపై హంగామా చేస్తోంది. భారత దేశ కీర్తి పతాకం ప్రపంచ దేశాలు చూసేలా తొలి క్రికెట్ వరల్డ్ కప్ అందించిన దిగ్గజ క్రికెటర్ కపిల్ దేవ్‌తో చిరంజీవికి మంచి ఫ్రెండ్‌షిప్ ఉంది. అయితే రీసెంట్‌గా ఫలక్‌నుమా ప్యాలెస్‌లో జరిగిన ఓ వేడుకకు చిరంజీవి తన భార్య సురేఖతో కలిసి హాజరు కాగా.. అదే వేడుకకు వచ్చిన కపిల్ దేవ్‌ని చూస చిరు ఒక్కసారిగా సంతోషంతో ఉప్పొంగిపోయారు. చిరంజీవి, ఆయన భార్య సురేఖ కలిసి కాసేపు కపిల్ దేవ్‌తో సరదాగా ముచ్చటించారు. ఈ ఫోటోలకు ట్విట్టర్ వేదికగా షేర్ చేసిన చిరంజీవి.. ''చాలా రోజుల తర్వాత పాత మిత్రుడు కపిల్‌దేవ్‌ను కలవడం ఆనందంగా ఉంది. ఇందుకు ఫలక్‌నుమా ప్యాలెస్‌ మరింత శోభనిచ్చింది. ఎన్నో పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ గతంలోకి వెళ్లి వచ్చాము. దేశానికి మొట్టమొదటి ప్రపంచకప్ అందించిన హర్యానా హరికేన్ కపిల్ దేవ్'' అని పేర్కొన్నారు. చిరంజీవి సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో 'ఆచార్య' మూవీ పనులు పూర్తి చేస్తూనే తన తదుపరి సినిమాల షూటింగ్స్‌లో పాల్గొంటున్నారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ''గాడ్ ఫాదర్, బోళా శంకర్'' సినిమాలతో ఆయన బిజీ బిజీగా ఉన్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3kA2jJr
v

40 ఏళ్ల క్రింద ఈ అమ్మాయి దొరికితే! ఖచ్చితంగా అదే చేసేవాడిని.. పబ్లిక్‌గా హీరోయిన్‌పై ఆర్జీవీ కామెంట్స్

సంచలనాలకు మారు పేరు అని చెప్పుకోవచ్చు. ఆయన నోటివెంట ఎప్పుడు ఎలాంటి పదాలు వస్తాయో ఎవ్వరూ ఊహించలేరు. తనదైన స్టైల్‌లో లాజిక్స్ మాట్లాడుతూ హీరోయిన్ల అందాలపై కామెంట్స్ చేయడంతో దిట్ట వర్మ. ఈ క్రమంలోనే పబ్లిక్‌గా ఓ వేదికపై తాజాగా యంగ్ హీరోయిన్ మేఘ ఆకాష్‌పై ఆయన చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. మేఘ ఆకాష్‌, అరుణ్‌ అదిత్‌, అర్జున్‌ సోమయాజుల లీడ్ రోల్స్‌లో తెరకెక్కిన కొత్త సినిమా ‘’. సుశాంత్‌ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాకు అర్జున్‌ దాస్యన్‌ నిర్మాతగా వ్యవహరించారు. సెప్టెంబర్‌ 3న ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్న నేపథ్యంలో చిత్ర ప్రమోషన్స్‌లో గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరైన రామ్ గోపాల్ వర్మ.. చిత్ర యూనిట్‌పై, ముఖ్యంగా హీరోయిన్ మేఘ ఆకాష్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 40 ఏళ్ల క్రితం నాకు ఇలాంటి అమ్మాయి కనిపించి ఉంటే నేనిప్పుడు ఇలా ఉండేవాడిని కాదేమో.. నాకు డివోర్స్ అయి ఉండేవి కావేమో అంటూ ఆర్జీవీ చేసిన కామెంట్‌తో అంతా ఆశ్చర్యపోయారు. అంతటితో ఆగని వర్మ.. మేఘ చాలా స్వీట్‌గా ఉంటుందని, తనని కలిసిన వారికి డయాబెటిస్‌ కూడా వస్తుందంటూ తనదైన కోణంలో రియాక్ట్ అయ్యారు. వర్మ ఇలా మాట్లాడుతుంటే అక్కడే ఉన్న మేఘ ఉబ్బి తబ్బిబ్బయింది. ఇకపోతే అదిత్‌ మంచి నటుడని, త్వరలోనే అతనితో ఓ సినిమా చేయబోతున్నానని వర్మ అన్నారు. ఈ సినిమా పాటలు, టీజర్‌, ట్రైలర్‌ చాలా బాగున్నాయని తెలుపుతూ చిత్ర బృందానికి ప్రత్యేక శుభాకాంక్షలు చెప్పారు ఆర్జీవీ.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3mKW0Wa
v

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...