Tuesday 31 August 2021

మత్తు మందు ఇచ్చి ఆపై అడల్ట్ వీడియోల షూటింగ్! ప్రొడక్షన్ హౌస్ నిర్వాకం.. వెలుగులోకి సంచలన విషయాలు

సీనియర్ హీరోయిన్ శిల్పా శెట్టి భర్త, బిజినెస్‌మెన్ రాజ్ కుంద్రా రాకెట్ వ్యవహారం బాలీవుడ్ వర్గాలను కుదిపేసింది. పోర్న్ రాకెట్ ఇష్యూలో సంచలన విషయాలు బయటకు వచ్చాయి. రాజ్‌కుంద్రా తమతో బలవంతంగా అశ్లీల చిత్రాలను షూట్ చేసి యాప్‌లో అప్‌లోడ్‌ చేశారంటూ చాలామంది నటీమణులు ఆరోపణలు చేశారు. ప్రస్తుతం ఈ కేసు విచారణ కొనసాగుతుండగానే తాజాగా జార్ఖండ్ మోడల్, మాజీ మిస్‌ ఇండియా యూనివర్స్‌ మరో పోర్నోగ్రఫీ వ్యవహారాన్ని బయటపెట్టడం సినీ వర్గాల్లో హాట్ ఇష్యూ అయింది. ముంబైలోని ఓ ప్రొడక్షన్ హౌస్ మేనేజ్‌మెంట్ తనకు మత్తు మందు కలిపిన కూల్‌ డ్రింగ్‌ ఇచ్చి అసభ్యకర వీడియోలు షూట్ చేశారని పరీ పాసవాన్‌ ఆరోపించింది. ముంబైకి వచ్చిన కొత్తలోనే ఓ ప్రొడక్షన్ హౌస్‌కి వెళ్లగా, ముందుగా వాళ్ళు కూల్ డ్రింక్ ఇచ్చారని, అందులో మత్తు కలిపి స్పృహ కోల్పోయేలా చేసి తాను మత్తులో ఉండగా పోర్న్ వీడియోలు చిత్రీకరించారంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు బాలీవుడ్‌లో దుమారం రేపుతున్నాయి. అయితే ఆ ప్రొడక్షన్ హౌస్ పేరు మాత్రం బయటకు చెప్పని ఆమె, మత్తులోంచి బయటకొచ్చి ఆ విషయం తెలిసిన వెంటనే పోలీస్ కంప్లైట్ ఇచ్చానని, ఆ కేసు ఇంకా కొనసాగుతోందని చెప్పింది. గతంలో పరీ పాసవాన్‌ తన భర్తపై కూడా పోలీస్ కంప్లైట్ ఇచ్చింది. ఈ కేసులో ఆమె భర్త నీరజ్‌ పాసవాన్‌ను పోలీసులు అరెస్టు చేయడం, విచారించడం జరిగింది. ఈ విచారణలో పరీ పాసవాన్‌ పోర్న్ మూవీస్ చేసిందని ఆమె భర్త తరపు బంధువులు ఆరోపించారు. ఈ క్రమంలో తాజాగా ఆమె పూర్తి విషయాలు చెప్పకుండా పోర్నోగ్రఫీ ఇష్యూ తెరపైకి తీసుకురావడం చర్చల్లో నిలిచింది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/38tPjPZ
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...