Monday 30 November 2020

‘నీపై పగ తీర్చుకుంటా’... నితిన్‌కి వార్నింగ్ ఇచ్చిన కీర్తిసురేష్

‘మహానటి’ కీర్తి సురేష్‌ తెలుగులో వరుస సినిమాలతో బిజీగా మారింది. లాక్‌డౌన్ సమయంలో ఆమె నటించిన రెండు సినిమాలు ఓటీటీ ద్వారా రిలీజై తీవ్రంగా నిరాశ పరిచిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం నితిన్‌తో ‘రంగ్‌దే’, మహేశ్‌బాబు సరసన ‘సర్కారు వారి పాట’ సినిమాల్లో ఛాన్స్ కొట్టేసింది. ‘రంగ్‌దే’ షూటింగ్ ప్రస్తుతం దుబాయిలో జరుగుతోంది. ఈ క్రమంలోనే సినిమా సెట్లో కీర్తి నిద్రపోతుండగా ఫోటో తీసిన .. దాన్ని సోషల్‌మీడియాలో పోస్ట్ చేశారు. షూటింగ్‌తో తమకు చెమటలు పడుతుంటే కీర్తి మాత్రం హ్యాపీగా రిలాక్స్‌ అవుతోందంటూ కామెంట్ చేశాడు. Also Read: ఈ సరదా ఫోటో సోషల్‌మీడియాలో విపరీతంగా వైరల్ అయింది. దీనిపై స్పందించిన కీర్తి ఆ ఫోటోను పోస్ట్ చేస్తూ.. ‘షూటింగ్ సెట్లో ఎప్పుడూ నిద్రపోకూడదని గుణపాఠం నేర్చుకున్నా. పగ తీర్చుకుంటా’ అని కామెంట్ చేసింది. దీంతో పాటు దుబాయి‌లోని అద్భుతమైన లొకేషన్లో దిగిన ఫోటోలను కూడా తన ఇన్‌‌స్టాగ్రామ్‌ అకౌంట్లో పోస్ట్ చేసింది. Also Read:


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/33wRT5y
v

గ్లామర్ షో అంటే బాడీ చూపించడం కాదు: తాప్సీ

తెలుగులో చాలా సినిమాలు చేసినప్పటికీ సరైన గుర్తింపు దక్కించుకోలేకపోయింది . ఆ తర్వాత బాలీవుడ్‌కి వెళ్లి లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తూ మంచి క్రేజ్ సంపాదించుకుంది. ఆమెకు మంచి మార్కెట్ ఏర్పడటంతో తాప్సీతో సినిమాలు చేసేందుకు దర్శక నిర్మాతలు పోటీపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే కెరీర్లో తాను ఎదుర్కొన్న అనుభవాలు, పరిస్థితుల గురించి తరుచూ ఇంటర్వ్యూల్లో చెబుతుంటుంది తాప్సీ. ఇలాగే ఇటీవల పాల్గొన్న ఓ ఇంటర్వ్యూల్లో గ్లామర్ షో గురించి ఆసక్తికరమైన విషయాలు చెప్పింది తాప్సీ. Also Read: ‘సినిమాల్లోకి వచ్చిన కొత్తలో దర్శకులు బికినీ వేసుకోవాలని చెప్తే మొహమాటం లేకుండా ఓకే చెప్పేదాన్ని. కానీ నాకు వ్యక్తిగతంగా అది ఇష్టం ఉండేది కాదు. నన్ను బికినీలో చూడటానికి ప్రేక్షకులు కూడా ఇష్టపడేవారు కాదని అనిపించేది. అందంగా కనిపించాలంటే స్కిన్ షో చేయడం కాదు అని నా అభిప్రాయం. అందుకే కెరీర్లో కాస్త ఎదిగాక స్కిన్ షో విషయంలో కొన్ని కండిషన్స్ పెట్టుకున్నారు. నిజం చెప్పాలంటే బికినీ నాకు సౌకర్యంగా ఉండదు’ అని చెప్పుకొచ్చింది తాప్సీ. Also Read: అలాగే తన జీవితంలో ఫస్ట్ లవ్ గురించి కూడా తాప్సీ బయటపెట్టింది. తాను తొమ్మిదో తరగతి చదువుతున్న సమయంలో క్లాస్‌మేట్‌‌ని ఇష్టపడ్డానని చెప్పింది. అతడికి కూడా తానంటే చాలా ఇష్టమని, కానీ చదువుకు ఇబ్బంది కలగకూడదని ఆ అబ్బాయితో మాట్లాడటం మానేశానని వెల్లడించింది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/33xyLnZ
v

ఓటేయకపోవడం నేరం.. ప్రశ్నించే హక్కు వదులుకోవద్దు: రాజేంద్రప్రసాద్

జీహెచ్ఎంసీ ఎన్నికల్లో హైదరాబాద్ నగర ప్రజలందరూ తమ ఓటుహక్కు వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు సినీనటుడు . కేపీహెచ్‌ ఏడో ఫేజ్‌లోని పోలింగ్ బూత్ నంబర్ 58లో కుటుంబ సభ్యులతో కలిసి ఈ రోజు ఉదయం ఆయన తన ఓటుహక్కు వినియోగించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన ఎన్నికల్లో ఓటు వేయకపోవడం పెద్ద నేరమని అన్నారు. తమ భవిష్యత్తునే నిర్దేశించే ఎన్నికల్లో ఓటుహక్కు వినియోగించుకోవడం అందరి బాధ్యతని రాజేంద్రప్రసాద్ అన్నారు. ప్రజాప్రతినిధులను నిలదీయాలన్నా, మనకు కావాల్సింది అడిగి నెరవేర్చుకోవాలన్నా ప్రతి ఒక్కరు ఓటుహక్కు వినియోగించుకోవాలన్నారు. తాను అరకులో షూటింగులో బిజీగా ఉన్నప్పటికీ ఓటు వేసేందుకే హైదరాబాద్‌కు వచ్చానన్నారు. పోలింగ్ కేంద్రం బోసిపోవడం చూసి తన మనసు చలించిపోయిందని, నగర ప్రజలు తప్పనిసరిగా తమ ఓటుహక్కు వినియోగించుకుని నగర అభివృద్ధితో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. Also Read:


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3o9z4NN
v

Sukumar: ఈసారైనా లెక్క సరిచేస్తాడా?.. క్రేజీ కాంబోపై మహేశ్ ఫ్యాన్స్ ఆశలు

తెలుగు సినీ దర్శకుల్లో సుకుమార్‌ది ప్రత్యేక శైలి. లెక్కల మాస్టారి నుంచి డైరెక్టర్‌గా మారిన ఆయన విభిన్నమైన చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తుంటారు. తొలి సినిమా ‘ఆర్య’తోనే తానేంటో నిరూపించుకున్న ‘రంగస్థలం’తో మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్‌గా ఎదిగారు. అల్లు అర్జున్‌తో ఆర్య, ఆర్య2.. సినిమాలు తెరకెక్కించిన సుకుమార్ ‘పుష్ప’ పేరుతో పాన్ ఇండియా సినిమా తీస్తున్నారు. ఇండస్ట్రీలో చాలామంది హీరోలకు విజయాలు అందించిన సుకుమార్.. సూపర్‌స్టార్ మహేశ్‌బాబుకు మాత్రం నిరాశ కలిగించారు. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన ‘నేనొక్కడినే’ విమర్శకులను మెప్పించినా కమర్షియల్‌గా హిట్ సాధించలేకపోయింది. Also Read: అయితే రెండో ప్రయత్నంలో మహేశ్‌కు ఎలాగైనా హిట్ ఇవ్వాలన్న కసితో సుకుమార్ ఓ అద్భుతమైన కథను సిద్ధం చేసుకున్నాడట. దీనికి మహేశ్‌ కూడా ఓకే చెప్పేశాడని, ‘పుష్ప’ తర్వాత ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్తుందని ప్రచారం జరుగుతోంది. అయితే సుకుమార్ తన తర్వాతి సినిమా విజయ్ దేవరకొండతో తెరకెక్కించుకునేందుకు సిద్ధమవుతున్నాడు. అయితే మహేశ్, సుకుమార్ కాంబినేషన్లో కచ్చితంగా మరో సినిమా రావడం పక్కా అని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇందులో నిజమెంత ఉందో తెలియాలంటే కొద్దిరోజులు ఆగాల్సిందే. Also Read:


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2KMteDw
v

నాది లవ్ ఫెయిల్యూర్.. కానీ డేటింగ్ చేయాలనుంది: రాశీ ఖన్నా

‘ఊహలు గుసగుసలాడే’ సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన తక్కువ కాలంలోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. మధ్యలో వరుస ఫ్లాపులతో ఇబ్బంది పడినా.. వెంకీమామ, ప్రతిరోజు పండగే, వరల్డ్ ఫేమస్ లవర్.. చిత్రాలతో తిరిగి పుంజుకుంది. సోమవారం తన 30వ పుట్టినరోజు జరుపుకున్న రాశీ.. ఓ ఆసక్తికరమైన విషయాన్ని అభిమానులతో షేర్ చేసుకుంది. తన ప్రేమ వైఫల్యం గురించి చెబుతూనే.. ఎవరితోనైనా డేటింగ్ చేయాలని ఉందంటూ షాకిచ్చింది. ‘ప్రేమ సక్సెస్‌ అవ్వడం అనేది అరుదుగా జరుగుతుందని, ప్రేమలో ఫెయిల్యూర్సే ఎక్కువని... అలాంట చేదు అనుభవం తనకూ ఉందని రాశీఖన్నా గతంలోనే చాలా ఇంటర్వ్యూల్లో చెప్పింది. స్కూల్‌ డేస్‌లో తన సీనియర్‌‌తో ఆమె ప్రేమలో పడగా.. కొన్ని కారణాల వల్ల అది విఫలమైంది. పుట్టినరోజు నాడు ఆమెకు విషెస్ చెప్పిన నెటిజన్లు.. ఇప్పుడు ప్రేమలో ఉన్నారా? అంటూ కొంటెగా అడిగారు. Also Read: ‘ప్రస్తుతానికి నేను సింగిల్‌గానే ఉన్నా. ఇప్పటికైనా నా జీవితంలో ఎవరూ లేరు. నిజం చెప్పాలంటే ఎవరితోనైనా డేటింగ్‌ చేయాలని ఉంది. ఆ అనుభవం ఎలా ఉంటుందో ఆస్వాదించాలని ఉంది. కానీ ఎందుకో ఆ వైపు వెళ్లలేకపోతున్నా’ అని చెప్పుకొచ్చింది రాశీఖన్నా. ఈ అమ్మడి వరుస చూస్తుంటే త్వరలోనే ఎవరితోనో ప్రేమలో పడేలాగా కనిపిస్తోంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2JrehX8
v

ప్రభాస్‌తో మళ్లీ సినిమానా.. జనాలు భరించలేరు: రాజమౌళి షాకింగ్ కామెంట్స్

యంగ్ రెబల్‌స్టార్ అని అభిమానులు ముద్దుగా పిలుచుకునే ప్రభాస్‌ను ఆలిండియా స్టార్‌ని చేసింది కచ్చితంగా రాజమౌళి అనే చెప్పాలి. వీరిద్దరి కాంబినేషన్లో మూడు సినిమాలు వచ్చాయి, ‘ఛత్రపతి’, ‘బాహుబలి 1’, ‘బాహుబలి2’ చిత్రాలలో ప్రభాస్‌ని ఏ రేంజ్‌లో రాజమౌళి ఎలివేట్‌ చేశారో అందరికీ తెలిసిందే. బాహుబలి, బాహుబలి-2 తర్వాత రేంజ్ బాలీవుడ్ హీరోలను మించిపోయింది. అందుకే దర్శక నిర్మాతలు ఆయనతో పాన్ ఇండియా సినిమాలు తెరకెక్కించేందుకు పోటీ పడుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రభాస్, రాజమౌళి కాంబినేషన్లో మరో సినిమా వస్తే ఎలాగుంటుంది... ఇదే ప్రశ్న రాజమౌళికి ఎలాంటి సమాధానం ఇచ్చారో తెలుసా. ఇటీవల జరిగిన ఓ ఇంటర్వ్యూలో రాజమౌళికి ఇదే ప్రశ్న ఎదురైంది. ప్రభాస్‌తో మళ్లీ సినిమా తీస్తారా? అని అడగ్గా.. వామ్మో మళ్లీ ప్రభాస్‌తోనా? అంటూ బెదిరిపోయారు. Also Read: ‘బాహుబలి కోసం ఇద్దరం సుమారు ఐదేళ్లు కలిసి చేశాం. మళ్లీ మా కాంబినేషన్‌లో సినిమా అంటే జనాలు తలలు పట్టుకుంటారేమో’ అని అని రాజమౌళి సరదాగా కామెంట్ చేశారు. ప్రభాస్‌తో మళ్లీ సినిమా చేయడం తనకూ ఇష్టమేనని, మంచి కథ కుదిరితే కచ్చితంగా చేస్తానని చెప్పారు జక్కన్న. Also Read:


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3fTPGpO
v

BAFTA: అరుదైన గౌరవం దక్కించుకున్న ఏఆర్ రెహమాన్‌

దేశం గర్వించదగ్గ ప్రముఖ సంగీత దర్శకుడు ఏ ఆర్‌ రెహమాన్‌కు మరో అరుదైన గౌరవం దక్కింది. బ్రిటిష్‌ అకాడమీ ఆఫ్‌ ఫిల్మ్‌ అండ్‌ టెలివిజన్‌ ఆర్ట్స్‌ (బాఫ్టా) ఆయన్ని ‘బాఫ్టా బ్రేక్‌ త్రూ ఇనిషియేటివ్‌ అంబాసిడర్‌’గా నియమించినట్లు సోమవారం ప్రకటించింది. ఈ క్రమంలో జ్యూరీ సభ్యులు, నెట్‌ఫ్లిక్స్‌తో కలిసి ఆయన దేశంలోని సినిమా, క్రీడలు, టెలివిజన్‌ రంగాల్లో ప్రతిభావంతులైన కళాకారులను గుర్తించనున్నారు. జ్యూరీ సభ్యులు ఎంపిక చేసిన కళాకారులకు సంవత్సరం పాటు మార్గనిర్దేశనం చేయనుంది. ఈ ఘనత సాధించడం పట్ల రెహమాన్ స్పందిస్తూ... ‘భారత్‌ నుంచి అద్భుతమైన టాలెంట్‌ను వెలికితీసి ప్రపంచ వేదికపై నిలిపే అవకాశం నాకు రావడం సువర్ణావకాశంగా భావిస్తున్నా. బాఫ్టాతో కలిసి పనిచేసే అవకాశం దక్కడం సంతోషంగా ఉంది’ అని తెలిపారు. ‘భారతీయ సినిమాతో రెహమాన్‌కు ఉన్న అనుభందం బాఫ్టాకు సేవలందించేందుకు ఉపయోగపడుతుంది. మా సంస్థకు ఆయన అంబాసిడర్‌‌గా నియమితులు కావడం చాలా సంతోషంగా ఉంది’ అని బాఫ్టా చీఫ్ ఎగ్జిక్యూటివ్ అమాండ బెర్రీ పేర్కొన్నారు. Also Read: ఆస


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3oeTAN9
v

జానీ మాస్టర్ జాక్‌పాట్.. డైరెక్టర్‌గా పవన్‌తో తొలి చిత్రం!

కొరియోగ్రాఫర్లు దర్శకులుగా మారడం ఇండస్ట్రీలో కొత్తేమీ కాదు. ఫరాఖాన్, ప్రభుదేవా, లారెన్స్, అమ్మ రాజశేఖర్.. ఇలా బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు చాలా మంది కొరియోగ్రాఫర్లు దర్శకులుగా విజయం సాధించారు. అయితే, టాలీవుడ్‌లో స్టార్ కొరియోగ్రాఫర్‌గా ఎదిగిన జానీ మాస్టర్ కూడా దర్శకుడిగా మారుతున్నారనేది మూడేళ్ల క్రితం మాట. అది కూడా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ను జానీ మాస్టర్ డైరెక్ట్ చేయబోతున్నారని 2017లోనే వార్తలు వచ్చాయి. దీనికి కారణం జానీ మాస్టరే. పవన్ కళ్యాణ్‌కు జానీ మాస్టర్ వీరాభిమాని. పాటలకు జానీ మాస్టర్ కొరియోగ్రఫీ కూడా అందించారు. అయితే, పవన్ కళ్యాణ్‌ను డైరెక్ట్ చేయాలని ఉందని.. ఎప్పటికైనా ఆయనతో సినిమా చేస్తానని గతంలో ఓ ఇంటర్వ్యూలో జానీ మాస్టర్ అన్నారు. అప్పటి నుంచి అప్పుడప్పుడు దీని గురించి వార్తలు వస్తూనే ఉన్నాయి. తాజాగా మరోసారి ఈ టాపిక్ తెరపైకి వచ్చింది. అయితే, ఈ సారి ఒక అడుగు ముందుకు కదిలింది. అదేంటంటే.. జానీ మాస్టర్ దర్శకత్వంలో నటించడానికి పవన్ కళ్యాణ్ పచ్చజెండా ఊపేశారట. Also Read: పవన్ కళ్యాణ్ కోసం ఒక కథను సిద్ధం చేసిన జానీ మాస్టర్ ఇటీవలే ఆ కథను పవర్ స్టార్‌కు నెరేట్ చేశారని ఇండస్ట్రీ వర్గాల సమాచారం. ఈ కథ విన్న పవన్ కళ్యాణ్ సినిమా చేయడానికి అంగీకరించారని అంటున్నారు. పవన్ ఓకే చేయడంతో ఈ కథను రామ్ చరణ్‌కు కూడా వినిపించారట జానీ. చరణ్‌కు కూడా ఈ కథ నచ్చడంతో ఆయనే స్వయంగా కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్‌లో ఈ సినిమాను నిర్మిస్తానని జానీకి హామీ ఇచ్చారని టాక్. ఈ రూమర్‌లో నిజమెంతో తెలీదు కానీ వినడానికి మాత్రం చాలా క్రేజీగా ఉంది. మరి ఈ రూమర్‌లో నిజమెంతో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ‘వకీల్ సాబ్’ విడుదలకు సిద్ధమవుతోంది. సంక్రాంతి కానుకగా ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇది కాకుండా క్రిష్ జాగర్లమూడి, హరీష్ శంకర్, సాగర్ చంద్ర దర్శకత్వంలో వరుస సినిమాలు చేయనున్నారు పవర్ స్టార్. ఈ సినిమాలన్నీ పూర్తిచేసిన తరవాత జానీ మాస్టర్ దర్శకత్వంలో సినిమా ఉంటుందని అంటున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3odFpIb
v

బాబాయ్ సినిమాలో అబ్బాయ్.. పోలీస్ ఆఫీసర్‌గా పవర్‌ఫుల్ రోల్

నటసింహా నందమూరి హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో వస్తోన్న మూడో సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలున్నాయి. ఈ సినిమాలో బాలకృష్ణ రెండు విభిన్నమైన పాత్రల్లో కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన బాలకృష్ణ పరిచయ వీడియో విపరీతంగా ఆకట్టుకుంది. బాలకృష్ణ కొత్త లుక్‌లో అబ్బురపరిచారు. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే బోలెడన్ని రూమర్లు మీడియాలో వినిపించాయి. తాజాగా మరో క్రేజీ రూమర్ చక్కర్లు కొడుతోంది. నందమూరి హీరోలు బాలకృష్ణ, కళ్యాణ్ రామ్, ఎన్టీఆర్‌లను ఒకేసారి వెండితెరపై చూడాలని అభిమానులు ఎప్పటి నుంచో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే బాలకృష్ణ, కళ్యాణ్ రామ్ ఇప్పటికే ‘యన్.టి.ఆర్’ సినిమాలో కలిసి నటించారు. ఇప్పుడు మరోసారి వీరిద్దరూ బోయపాటి సినిమాలో కలిసి నటించబోతున్నారని వదంతులు వినిపిస్తున్నాయి. ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ అతిథి పాత్ర చేయబోతున్నారట. ఇంటర్వెల్ బ్లాక్‌లో కళ్యాణ్ రామ్ ఎంట్రీ ఉంటుందని అంటున్నారు. పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా కళ్యాణ్ రామ్ కనిపిస్తారట. అయితే, దీనిపై అధికారిక ప్రకటన వస్తే కానీ స్పష్టత రాదు. ఇదిలా ఉంటే, ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీలో జరుగుతున్నట్టు సమాచారం. బాలయ్య కూడా ఈ షెడ్యూల్‌లో పాల్గొంటున్నారట. పూర్ణ, సయేషా హీరోయిన్లుగా నటిస్తున్నారని ఇప్పటికే వార్తలు వచ్చాయి. వీరు ముగ్గురూ ప్రస్తుత షెడ్యూల్‌లో పాల్గొంటున్నారని టాక్. కాగా, ఈ చిత్రాన్ని మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్నారు. తమన్ సంగీతం సమకూరుస్తున్నారు. Also Read:


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3qdk7w2
v

బ్లౌజ్‌లెస్ బ్యూటీ.. విరజాజి పూలతో అందాలను కప్పిన అదా శర్మ

బాలీవుడ్‌లో 2008లో వచ్చిన ‘1920’ సినిమాతో వెండితెరకు పరిచయమయ్యారు. తొలి చిత్రంతోనే ఫిలిం ఫేర్ అవార్డును సొంతం చేసుకున్నారు. 2014లో నితిన్ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ‘హార్ట్ ఎటాక్’ సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమయ్యారు. ఆ తరవాత ‘సన్నాఫ్ సత్యమూర్తి’, ‘సుబ్రమణ్యం ఫర్ సేల్’, ‘గరం’, ‘క్షణం’ చిత్రాల్లో నటించారు. వరుసపెట్టి సినిమాలు చేసినా తెలుగులో స్టార్ డమ్ సంపాదించలేకపోయారు అదా. కిందటేడాది ‘కల్కి’ సినిమాలో అదా శర్మ హీరోయిన్‌గా నటించినా ఆ చిత్రం విజయం సాధించకపోవడంతో అదాకు కూడా పెద్దగా గుర్తింపు రాలేదు. అయితే, ఒక ఇప్పుడు థ్రిల్లర్ మూవీతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ‘క్వశ్చన్ మార్క్ (?)’ అనే సినిమాలో అదా శర్మ ప్రధాన పాత్ర పోషించారు. ఈ చిత్రానికి విప్రా దర్శకత్వం వహించారు. గౌరు ఘనా సమర్పణలో శ్రీకృష్ణ క్రియేషన్స్ పతాకంపై గౌరీకృష్ణ నిర్మించిన ఈ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. Also Read: ఇదిలా ఉంటే, అదా శర్మ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటారు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమెకు 5 మిలియన్ ఫాలోవర్లు ఉన్నారు. అందుకే, వాళ్లను ఆకట్టుకోవడానికి అదా హాట్ హాట్ ఫొటోలు పోస్ట్ చేస్తూ ఉంటారు. అంతేకాదు, న్యూ ఫ్యాషన్‌ను ఆమె బాగా ఫాలో అవుతూ ఉంటారు. జుట్టుకు రకరకాల రంగులు, వెరైటీ దుస్తులు ఇలా ప్రత్యేక చూపిస్తూ ఉంటారు. అయితే, తాజాగా అదా శర్మ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఫొటోలు ఫ్యాన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ఈ ఫొటోల్లో ప్రత్యేకత ఏంటంటే.. అదా బ్లౌజ్ వేసుకోకుండా పరిమళాలు వెదజిమ్మే విరాజాజి పూలతో ఎద అందాలను కప్పారు. ఈ ఫ్లవర్ కాస్ట్యూమ్‌తో ఫొటోలకు పోజులిచ్చారు. ఈ ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అంతకు ముందు కూడా ఇలాంటి పూల కాస్ట్యూమ్ ఒకటి ధరించారు అదా. అది మరింత విడ్డూరంగా ఉంది. చిన్న చిన్న తెల్ల పూలతో కూడిన కొమ్మలను ఎద అందాలకు అడ్డంగా ఉంచారు. ఆ ఫొటోలో బ్లూ, బ్లాక్ మిక్స్ హెయిర్‌తో అదా కనిపించారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/37gsMoK
v

నాగశౌర్య సినిమాకు ఆసక్తికర టైటిల్.. ‘లక్ష్యా’న్ని ఎక్కుపెట్టిన విలుకాడు

హీరోగా సంతోష్‌ జాగర్లపూడి దర్శకత్వంలో ఓ మూవీ రూపొందుతోన్న విష‌యం తెలిసిందే. ఈ చిత్రానికి ‘ల‌క్ష్య’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ విషయాన్ని అధికారికంగా ప్రక‌టిస్తూ సోమవారం స్పెష‌ల్ పోస్టర్‌‌ను విడుద‌ల‌చేసింది చిత్ర యూనిట్‌. ఈ పోస్టర్‌లో నాగ‌శౌర్య లుక్ ఆక‌ట్టుకుంటోంది. కండలు శరీరంతో చాలా దృఢంగా కనిపిస్తున్నారు నాగశౌర్య. సోనాలి నారంగ్ స‌మ‌ర్పణ‌లో శ్రీ వేంకటేశ్వర సినిమాస్‌ ఎల్‌ఎల్‌పి, నార్త్‌స్టార్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ప‌తాకాల‌పై నారయణదాస్ కె. నారంగ్‌, పుస్కూర్‌ రామ్‌మోహన్‌రావు, శరత్‌ మరార్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నాగ‌‌శౌర్య స‌ర‌స‌న కేతికా శ‌ర్మ హీరోయిన్‌గా న‌టిస్తోన్న ఈ చిత్రంలో ఒక కీల‌క పాత్రలో విలక్షణ న‌టుడు జ‌గ‌ప‌తి బాబు న‌టిస్తున్నారు. నాగ‌శౌర్య కెరీర్‌లో 20వ చిత్రంగా తెర‌కెక్కుతోన్న ఈ మూవీ నుండి ఇప్పటికే విడుద‌ల‌చేసిన స్టన్నింగ్‌ ఫస్ట్‌లుక్ అంద‌రినీ థ్రిల్ చేసింది. ‘ది గేమ్ విల్ నెవ‌ర్ బీ ద సేమ్’ అంటూ ఎయిట్‌ ప్యాక్ బాడీతో చేతిలో బాణం ప‌ట్టుకుని వారియ‌ర్ పోజ్‌లో నాగ‌శౌర్య నిల్చొని ఉన్న లుక్ సూప‌ర్బ్ అని అంద‌రూ అప్రి‌షియేట్ చేశారు. ప్రాచీన విలువిద్య నేప‌థ్యంలో స్పోర్ట్స్ బేస్డ్ ఫిలింగా అన్ని క‌మ‌ర్షియ‌ల్ హంగుల‌తో ఈ చిత్రం తెర‌కెక్కుతోంది. అంతేకాదు, ఆర్చరీ మీద రూపొందుతోన్న తొలి భారతీయ చిత్రమిది. కాగా, ఈ సినిమాకు రామ్‌రెడ్డి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. కాలభైరవ సంగీతం సమకూరుస్తున్నారు. జునైద్ సిద్ధిఖీ ఎడిటర్. కథ, స్క్రీన్‌ ప్లే, దర్శకత్వం సంతోష్‌ జాగర్లపూడి. ఈ సినిమాతో మరో రెండు సినిమాల్లో ప్రస్తుతం నాగశౌర్య నటిస్తున్నారు. సితార ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌లో ‘వరుడు కావలెను’ అనే సినిమాలో నటిస్తున్నారు. రీతూ వర్మ హీరోయిన్. దీంతోపాటు సొంత బ్యానర్ ఐరా క్రియేషన్స్‌లో ఒక రొమాంటిక్ ఎంటర్‌టైనర్ చేస్తున్నారు. ఈ చిత్రంలో షర్లీ సేతియా హీరోయిన్‌గా ఎంపికైంది. అనీష్ కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. Also Read:


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2HXeaCc
v

‘కె.జి.ఎఫ్’ డైరెక్టర్‌తో ప్రభాస్ మూవీ.. రెండు రోజుల్లో రానున్న ప్రకటన అదే!

‘కె.జి.ఎఫ్’ చిత్ర నిర్మాణ సంస్థ హోంబలే ఫిలింస్ సోమవారం ఒక కీలక ప్రకటన చేసింది. తాము నిర్మించబోతున్న మరో భారీ పాన్ ఇండియా మూవీ వివరాలను డిసెంబర్ 2న మధ్యాహ్నం 2 గంటల 9 నిమిషాలకు వెల్లడిస్తామని ప్రకటించింది. అయితే, ఇది ‘కె.జి.ఎఫ్’ డైరెక్టర్ ప్రశాంత్ నీల్, రెబల్ స్టార్ కాంబినేషన్‌లో వచ్చే సినిమా గురించేనని సమాచారం. ఈ మేరకు కన్నడ చిత్ర పరిశ్రమ నుంచి సమాచారం వస్తోంది. ప్రశాంత్ నీల్ నెక్ట్స్ మూవీ ప్రభాస్‌తో గానీ, యంగ్ టైగర్ ఎన్టీఆర్‌తో గానీ ఉండబోతుందని ఇప్పటికే బోలెడన్ని వార్తలు వచ్చాయి. దీని గురించి సోషల్ మీడియాలో ఈ ఇద్దరి హీరోల అభిమానులు ఆరా తీసినా ‘కె.జి.ఎఫ్ చాప్టర్ 2’ షూటింగ్ పూర్తిచేసేంత వరకు తన తరవాత సినిమా గురించి ఎలాంటి ప్రకటన చేయలేనని ప్రశాంత్ స్పష్టం చేశారు. అయితే, ఇప్పుడు దానికి సమయం ఆసన్నమైందని అంటున్నారు. సోమవారం హోంబలే ఫిలింస్ చేసిన ప్రకటన దీని గురించే అని టాక్. ‘‘ప్రియమైన ప్రేక్షకుల్లారా, మీరెప్పుడూ మాకన్నా మా సినిమానే ఎక్కువగా ప్రేమిస్తారు. ఈ ప్రేమను ఇలానే పొందడానికి మరో సినిమాతో మీ ముందుకు వస్తున్నాం. ఇది ‘ఇండియన్ ఫిలిం’. డిసెంబర్ 2వ తేదీ మధ్యాహ్నం 2:09 గంటలకు వచ్చే మా ప్రకటన కోసం వేచి చూస్తూ ఉండండి’’ అని హోంబలే ఫిలింస్ ట్వీట్ చేసింది. ఈ ట్వీట్ చేసిన వెంటనే చాలా మంది ప్రభాస్ ఫ్యాన్స్ ఇది కచ్చితంగా తమ హీరో గురించేనని ఫిక్స్ అయిపోయారు. ఈ మేరకు ట్విట్టర్‌లో స్పందిస్తున్నారు. సినిమా ఇండస్ట్రీ నుంచి వస్తోన్న సమాచారం కూడా ఇదే. ‘బాహుబలి’ తరవాత ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ అయిపోయారు. ఈయన దేశమంతటా అభిమానులు ఉన్నారు. ప్రభాస్ ఖాతాలో ప్రస్తుతం దీనితో కలిపి నాలుగు పాన్ ఇండియా మూవీస్ ఉన్నాయి. ప్రస్తుతం ప్రభాస్.. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో ‘రాధే శ్యామ్’ సినిమా చేస్తున్నారు. పూజా హెగ్డే హీరోయిన్. దీని తరవాత నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఒక సైన్స్ ఫిక్షన్‌లో నటించనున్నారు. ఇంకా టైటిల్ ఖరారు చేయని ఈ సినిమాలో దీపికా పదుకొనె హీరోయిన్. అమితాబ్ బచ్చన్ కీలక పాత్ర పోషించబోతున్నారు. అలాగే, ఓం రౌత్ దర్శకత్వంలో మైథలాజికల్ డ్రామా ‘ఆదిపురుష్’లో ప్రభాస్ నటించబోతున్నారు. సైఫ్ అలీ ఖాన్ రావణుడిగా నటించనున్న ఈ చిత్రంలో కృతి సనన్ సీత పాత్ర పోషించనున్నారని టాక్. ఈ మూడు పాన్ ఇండియా మూవీస్ తరవాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో మరో పాన్ ఇండియా మూవీ ప్రభాస్ చేయనున్నారని సమాచారం. Also Read:


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3fPxY6L
v

‘బజార్ రౌడీ’గా సంపూర్ణేష్ బాబు.. స్టెప్పులేయిస్తున్న ప్రేమ్ రక్షిత్

బ‌ర్నింగ్ స్టార్ సినిమా వస్తుందంటే అభిమానుల్లో కొత్త ఉత్సాహం వస్తుంది. సెటైరికల్ సినిమాలతో టాలీవుడ్‌లో కొత్త ట్రెండ్‌ను సృష్టించిన హీరో సంపూ. ఆయ‌న న‌టించిన‌ ‘హృద‌య‌కాలేయం’, ‘కొబ్బరిమ‌ట్ట’ చిత్రాలు బాక్సాఫీసు వద్ద విజయవంతం అయ్యాయి. ‘కొబ్బరిమట్ట’ తరవాత మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాలేదు సంపూ. దీనికి ఒక కారణం లాక్‌డౌన్ కూడా. లాక్‌డౌన్ త‌రువాత సంపూర్ణేష్ బాబు న‌టించిన చిత్రం శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటుంది. ఈ చిత్రానికి ‘బ‌జార్ రౌడీ’ అనే టైటిల్‌ని ఖ‌రారు చేశారు. ఈ చిత్రానికి వసంత నాగేశ్వరావు దర్శకత్వం వహిస్తున్నారు. కె‌ఎస్ క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌‌పై నిర్మాత సందిరెడ్డి శ్రీనివాస‌రావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో సంపూర్ణేష్ బాబుకి జోడీగా మ‌హి న‌టిస్తుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. తాజాగా రామోజీ ఫిలిం సిటీలో ఒక పాటను చిత్రీకరిస్తున్నారు. ఈ పాటకు ప్రముఖ కొరియోగ్రాఫర్ ప్రేమ్ రక్షిత్ కొరియోగ్రఫీ అందిస్తున్నారు. ‘ఛ‌త్రప‌తి, విక్రమార్కుడు, య‌మ‌దొంగ, ప‌రుగు, మ‌గ‌ధీర‌, ఆర్య-2, డార్లింగ్‌, సింహ‌, మ‌ర్యాద‌ రామ‌న్న, 100% ల‌వ్‌, బృందావ‌నం, కందిరీగ‌, పూల‌రంగ‌డు, ఇష్క్‌, ర‌చ్చ, సీత‌మ్మ వాకిట్లో సిరిమ‌ల్లె చెట్టు, బాహుబ‌లి, రంగ‌స్థలం’ లాంటి ఎన్నో బ్లాక్‌ బ‌స్టర్ మూవీస్‌కే కాకుండా త‌మిళంలో ‘మార్షల్‌, వీరం, శ‌గుని, వేలాయుదం’ లాంటి సూప‌ర్ హిట్ చిత్రాల‌కి, సూప‌ర్‌ స్టార్స్‌కి కొరియోగ్రఫి అందించారు ప్రేమ్ రక్షిత్. ఇప్పుడు ఈయన ‘బ‌జార్ రౌడీ’తో అదిరిపోయే స్టెప్పులు వేయిస్తున్నారు. Also Read: ఈ పాట గురించి ద‌ర్శకుడు వ‌సంత నాగేశ్వరావు మాట్లాడుతూ.. ‘‘ఎంతో బిజీగా ఉండి ఎన్నో బ్లాక్‌ బ‌స్టర్ ఫిలింస్‌కి కొరియోగ్రాఫర్‌గా ప‌నిచేసి ఆ చిత్రాల గ్రాఫ్‌ని మార్చేసిన ప్రేమ్ ర‌క్షిత్ మాస్టర్ మా చిత్రంలో మా ‘బ‌జార్ రౌడీ’తో స్టెప్స్ వేయించినందుకు ఆయ‌న‌కి హృద‌య‌పూర్వక ధ‌న్యవాదాలు. ఈ సాంగ్ ప్రస్తుతం రామోజీ ఫిల్మ్‌ సిటీలో 20 మంది డాన్సర్లతో హీరో సంపూర్ణేష్ బాబు, మ‌హిపై చిత్రీక‌రిస్తున్నాం. ఈ చిత్రానికి సంబంధించిన టాకీ పూర్తిచేసాం. త్వర‌లో క్లైమాక్స్, మ‌రో రెండు సాంగ్స్‌తో షూటింగ్ పూర్తవుతుంది. ఈ చిత్రానికి ‘బ‌జార్ రౌడీ’ అనే టైటిల్ అనుకున్న వెంట‌నే మా యూనిట్ అంద‌రి ద‌గ్గర‌ నుండి చాలా మంచి రెస్పాన్స్ రావ‌టం మాలో కొత్త ఉత్సాహాన్ని నింపింది. మా నిర్మాత సందిరెడ్డి శ్రీనివాస‌రావు గారు బ‌డ్జెట్ విష‌యంలో ఎక్కడా లిమిటేష‌న్ పెట్టకుండా చిత్రాన్ని నిర్మిస్తుంటే మా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్ శేఖ‌ర్ గారు త‌న అనుభ‌వంతో ఎక్కడ ఖ‌ర్చుపెడితే స్క్రీన్ మీద క‌న‌బ‌డుతుందో చ‌క్కటి ప్లానింగ్‌తో ముందుకు వెళ్తున్నారు. ఈ చిత్రంలో ముఖ్యమైన పాత్రల్లో షాయాజీ షిండే, 30 ఇయ‌ర్స్ పృథ్వి, నాగినీడు, ష‌ఫి, జీవా, స‌మీర్‌, మణిచంద‌న‌, న‌వీన‌, ప‌ద్మావ‌తి, కత్తి మహేష్ నటిస్తున్నారు. ఈ చిత్రం ఫస్ట్ లుక్‌, టీజ‌ర్ త‌దిత‌ర వివ‌రాలు అతి త్వర‌లో తెలియ‌జేస్తాం’’ అని అన్నారు. కాగా, ఈ చిత్రానికి మరుధూరి రాజా మాటలు రాశారు. ఎ. విజయ్ కుమార్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. సాయి కార్తీక్ సంగీతం సమకూరుస్తున్నారు. జాషువా ఫైట్స్ కంపోజ్ చేస్తున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/33u87wn
v

జగన్ పిల్లోడే కానీ దేశంలోనే నెం.1 సీఎం, కేసీఆర్ లాస్ట్: బాబు మోహన్ షాకింగ్ కామెంట్స్

ఏపీ ముఖ్యమంత్రి మోహన్ రెడ్డిపై ప్రశంసల వర్షం కురిపించారు ప్రముఖ కమెడియన్, బీజేపీ నాయకుడు . దేశంలోనే నెంబర్ ముఖ్యమంత్రి సీఎం అని కొనియాడారు. ఈ సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రిపై సంచలన కామెంట్స్ చేశారు. జగన్ నెంబర్ 1 అయితే కేసీఆర్ లాస్ట్ అంటూ ఆరోపణలు గుప్పించారు బాబు మోహన్. ఆయన మాట్లాడుతూ.. ‘ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ దేశంలోనే నెంబర్ 1 సీఎం. అద్భుతంగా పాలిస్తున్నాడు. పెన్షన్ల విధానంలో మార్పులు తీసుకువచ్చి వాలంటీర్స్‌ని పెట్టుకున్నాడు. గ్రామ సచివాలయాలు అంటూ సేవకుల్ని పెట్టుకున్నారు. వాలంటీర్లు ఇంటికి వెళ్లి మరీ పెన్షన్లు ఇస్తున్నారు. కరోనా టైంలో ఊరు ఊరికీ పోయి టెస్ట్‌లు చేయించాడు.. ప్రత్యేక వాహనాలు పెట్టాడు. జగన్ పిల్లాడు.. రాజకీయ అనుభవం లేదు.. తండ్రి చాటు బిడ్డ జగన్. అయినా అద్భుతంగా చేశాడు. తెలంగాణ ముఖ్యమంత్రి అడ్రసే లేదు. ఆ ముఖ్యమంత్రి ఈ ముఖ్యమంత్రి ఫ్రెండ్సే కదా.. కరోనా టైంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ టెస్ట్‌ల విషయంలో బ్రహ్మాండంగా చేశాడని ప్రధానమంత్రి మెచ్చుకున్నారు. అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకంటే కరోనా విషయంలో అద్భుతంగా చేశారని నెంబర్ వన్ సీఎం జగన్ అని ఆయనకు ఫస్ట్ ర్యాంక్ ఇచ్చారు. తెలంగాణ ముఖ్యమంత్రికి లాస్ట్ ర్యాంక్ ఇచ్చారు. ఈయన ఊ అంటే ప్రధానిని మారుస్తా అంటాడు.. ఏం మారుస్తాడే ఏమో ఈయన చేతుల్లో ఏముందో.. మొన్న జనం మార్చేవారే కానీ కొద్దిలో పోయింది. రేపటి ఎన్నికల్లో తెలుస్తోంది.. ఈయన్ని మారుస్తాడా.. జనమే మారుస్తాడా అన్నది. మహానుభావుడు ఎన్టీఆర్ ఏమన్నాడు.. ప్రజలే దేవుడు అన్నారు.. కేసీఆర్‌కి మాత్రం డబ్బున్నోడే దేవుడు. పేదోడంటే అడ్రస్ ఉండదు. దళితులు అంటే లెక్కే ఉండదు. చిన్నవాళ్లు అంటే అసలు ప్రజలే కానట్టుగా ఉంటారు. ఎన్టీఆర్ లాంటి మహానుభావుడు ప్రజలేదు దేవుళ్లు.. సమాజమే దేవాలయం అన్నాడు. కానీ కేసీఆర్‌కి జనం కాదు డబ్బున్నోడే దేవుడు’ అంటూ సంచలన కామెంట్స్ చేశాడు బాబు మోహన్.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/37nMxLd
v

‘కె.జి.యఫ్’ నిర్మాత నుంచి మరో పాన్ ఇండియా మూవీ

కన్నడ సినిమాలు ఒకప్పుడు సాదాసీదాగా ఉండేవి. కన్నడ సినిమాలకు అంత మార్కెట్ ఉండేది కాదు కాబట్టి భారీ బడ్జెట్ చిత్రాలు వచ్చేవి కాదు. కానీ, హోంబలే ఫిలింస్ అనే నిర్మాణ సంస్థ వచ్చిన తరవాత లెక్కలు మారాయి. భారీ బ‌డ్జెట్‌, హై టెక్నిక‌ల్ వేల్యూస్‌తో క్వాలిటీ చిత్రాల‌ను నిర్మించి కన్నడ సినీ పరిశ్రమ‌ను మరో స్థాయికి తీసుకెళ్లారు హోంబ‌లే ఫిలింస్ నిర్మాణ సంస్థ అధినేత విజ‌య్ కిర‌గందూర్‌. క‌న్నడ సూప‌ర్‌ స్టార్స్ పునీత్ రాజ్‌కుమార్‌తో ‘నినింద‌లే’, య‌ష్‌తో ‘మాస్టర్ పీస్‌’ వంటి సూప‌ర్‌ డూప‌ర్ హిట్ చిత్రాల‌ను రూపొందించి అంద‌రి దృష్టిని ఆక‌ర్షించారు. త‌ర్వాత పునీత్ రాజ్‌కుమార్‌తో చేసిన ‘రాజ‌కుమార‌’ చిత్రం హ‌య్యస్ట్ గ్రాసర్‌గా నిలిచి శాండిల్‌వుడ్‌లో అగ్ర నిర్మాణ సంస్థగా హోంబ‌లే ఫిలింస్ అంద‌రి దృష్టిని ఆక‌ర్షించింది. రాకింగ్‌ స్టార్ య‌ష్‌తో చేసిన భారీ బడ్జెట్‌ మూవీ ‘కె.జి.య‌ఫ్ చాప్టర్‌1’తో బాక్సాఫీస్ వ‌ద్ద సెన్సేష‌న్ క్రియేట్ చేసి పాన్ ఇండియా నిర్మాణ సంస్థగా హోంబ‌లే ఫిలింస్ త‌న మార్క్‌ను క్రియేట్ చేసింది. ఇప్పుడు హోంబ‌లే ఫిలింస్ నిర్మాణంలో రూపొందుతోన్న మ‌రో పాన్ ఇండియా భారీ బ‌డ్జెట్ మూవీ ‘కె.జి.య‌ఫ్ చాప్టర్ 2’ విడుద‌లకు సిద్ధమవుతోంది. తాజాగా హోంబ‌లే ఫిలింస్ మ‌రో పాన్ ఇండియా మూవీని నిర్మించ‌డానికి స‌న్నాహాలు చేస్తోంది. ఈ విషయాన్ని నిర్మాత విజయ్ కిరగందూర్ మీడియాకు వెల్లడించారు. Also Read: విజ‌య్ కిరగందూర్ మాట్లాడుతూ.. ‘‘మా బ్యాన‌ర్‌లో పాన్ ఇండియా చిత్రంగా విడుద‌లైన ‘కె.జి.య‌ఫ్ చాప్టర్ 1’ ఎంత‌టి విజ‌యం సాధించిందో ప్రత్యేకంగా చెప్పన‌క్కర్లేదు. ఇప్పుడు మ‌రో పాన్ ఇండియా చిత్రం ‘కె.జి.య‌ఫ్ చాప్టర్ 2’పై ఎలాంటి అంచ‌నాలున్నాయో తెలుసు. అంద‌రి అంచ‌నాల‌ను మించేలా సినిమాను ధీటుగా రూపొందిస్తున్నాం. అలాగే ఇప్పుడు మా బ్యాన‌ర్‌లో మూడో పాన్ ఇండియా సినిమాను రూపొందించనున్నాం. భార‌తీయ భాష‌ల‌న్నింటిలో రూపొంద‌నున్న ఈ సినిమా టైటిల్‌, న‌టీన‌టులు, టెక్నీషియ‌న్స్ వివ‌రాల‌ను డిసెంబ‌ర్ 2న మ‌ధ్యాహ్నం 2 గంట‌ల 9 నిమిషాల‌కు తెలియ‌జేస్తాం’’ అని చెప్పారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2Vh9oCv
v

RRR: 50 రాత్రుల కష్టం.. బైబై చెప్పేసిన రామ్ చరణ్, ఎన్టీఆర్.. జక్కన్న నెక్స్ట్ ప్లాన్ ఇదే

మెగా పవర్ స్టార్ , యంగ్ టైగర్ హీరోలుగా రూపొందుతున్న భారీ బడ్జెట్ మూవీ RRR. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా తాజా షెడ్యూల్ నేటితో పూర్తయింది. ఈ షూటింగ్ విశేషాలు తెలుపుతూ ట్విట్టర్ ద్వారా సందేశం పోస్ట్ చేసింది టీమ్. గత కొన్ని రోజులుగా చిత్రంలోని కీలక ఘట్టాలను కెమెరాలో బంధించిన టీమ్.. నేటితో సెలవు తీసుకొని మరో షెడ్యూల్ ప్రారంభించడానికి రెడీ అవుతోంది. ''దాదాపు 50 రోజుల నైట్ షూట్ పూర్తి చేశాం. ఇక చలికాలపు రాత్రులకు గుడ్ బై.. ఇక తదుపరి షెడ్యూల్ కోసం వేరే దేశాల్లోని అందమైన ప్రదేశాలకు వెళ్లబోతున్నాం'' అని పేర్కొంటూ ట్వీట్ చేసింది RRR టీమ్. ఇటీవలే లొకేషన్స్‌ వద్ద ఉన్న పరిస్థితులను వీడియో రూపంలో ప్రేక్షకుల ముందుంచారు మేకర్స్. ఈ వీడియోలో యూనిట్ సభ్యులు మొత్తం చలిలో వణుకుతూ షూట్‌లో పాల్గొంటున్నట్లు కనిపించారు. రాజమౌళి, ఎన్టీఆర్, కెమెరామెన్ సెంథిల్ కుమార్.. ఇలా అందరూ సెట్‌లో ఏర్పాటు చేసిన హీటర్స్ దగ్గర చలి కాచుకుంటూ కనిపించారు. ఈ షెడ్యూల్‌లో చెర్రీ, ఎన్టీఆర్‌లపై భారీ యాక్షన్ సీక్వెన్స్ షూట్ చేశామని చెప్పింది చిత్రయూనిట్. Also Read: ఈ పోరాట సన్నివేశాలు చిత్రంలో దాదాపు 20 నిమిషాల నిడివితో ఉంటాయని తెలిస్తోంది. ఆ సందర్భంలోనే తొలిసారి అల్లూరి సీతారామరాజు, కొమురం భీమ్‌ కలుస్తారని.. అక్కడి నుంచే ఇద్దరూ ఒక్కటై పోరాటం కొనసాగిస్తారని సమాచారం. చిత్రంలో అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్, కొమురం భీమ్‌గా ఎన్టీఆర్ నటిస్తుండగా.. వారి సరసన ఆలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. చిత్ర నిర్మాణ బాధ్యతలు చేపట్టిన డీవీవీ దానయ్య భారీ రేంజ్‌లో ఈ మూవీ నిర్మిస్తున్నారు. RRRపై మెగా, నందమూరి అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3mmm5rC
v

'కార్పొరేటర్'‌పై కన్నేసిన జబర్ధస్త్ కమెడియన్.. షకలక శంకర్ భలే ప్లాన్ చేశాడే!

ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో జీహెచ్ఎంసీ ఎన్నికల హవా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో సిచ్యువేషన్ క్యాచ్ చేస్తూ కొత్త సినిమా ''ని అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు మేకర్స్. గత కొన్ని రోజులుగా డిఫరెంట్ సినిమాలతో హంగామా చేస్తున్న జబర్దస్త్ కమెడియన్ ఈ సినిమాలో లీడ్ రోల్ పోషిస్తున్నాడు. కార్పొరేషన్ ఎలక్షన్స్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ మూవీ రూపొందుతోంది. ఈ సినిమాతో సంజయ్ పూనూరి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. సమీప మూవీస్-ఎయు అండ్ ఐ స్టూడియోస్ బ్యానర్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఎ.పద్మనాభరెడ్డి నిర్మాతగా, డాక్టర్ ఎస్.వి.మాధురి సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. గత కొంతకాలంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా చివరిదశకు చేరుకుంది. కేవలం రెండు పాటలు మినహా షూటింగ్ అంతా పూర్తయింది. Also Read: మొత్తం 5 పాటలు, 4 ఫైట్స్‌తో రెగ్యులర్ ఫార్మట్ లోనే వినోదానికి పెద్ద పీట వేస్తూ తెరకెక్కుతున్న ఈ చిత్రంలో అంతర్లీనంగా ఒక మంచి సందేశం ఉంటుందని అంటున్నారు మేకర్స్. షకలక శంకర్ పర్ఫార్మెన్స్ 'కార్పొరేటర్' చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందని దర్శకుడు డాక్టర్ సంజయ్ చెబుతున్నారు. ఈ చిత్రంలో శంకర్ సరసన సునీత పాండే, లావణ్య శర్మ, కస్తూరి హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. ఎం.ఎల్.పి.రాజా సంగీతం అందిస్తున్నారు. అతిత్వరలో ఈ మూవీ రిలీజ్ డేట్ ప్రకటించనున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3mgKgYp
v

Sunday 29 November 2020

వైరల్ అవుతున్న సింగర్ సునీత రెండో పెళ్లి వార్తలు.. ఇంతకీ ఇందులో నిజమెంత?

ఇదిగో పులి అంటే అదిగో తోక అంటారు కొందరు గాసిప్ రాయుళ్లు. ఏ చిన్న హింట్ దొరికినా దానికో కథ అల్లేసి కన్ఫ్యూజన్‌లో పడేస్తుంటారు. ఈ క్రమంలోనే గత రెండు మూడు రోజులుగా సింగర్ పెళ్లి వార్తను సోషల్ మీడియాలో వైరల్ చేసేస్తున్నారు. సునీత రెండో పెళ్లికి సిద్ధమైందని కొందరంటే.. ఆమెకు కాబోయే భర్త ఈయనే అంటూ ఇంకొందరు మరో అడుగు ముందుకేసి మ్యాటర్ చెప్పేశారు. దీంతో టాలీవుడ్ సర్కిల్స్‌లో ఈ అంశం హాట్ టాపిక్ అయింది. తెలుగు చిత్రసీమలో సింగర్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సునీత.. ఎన్నో సూపర్ డూపర్ హిట్ సాంగ్స్ పాడింది. యాంకర్‌గా, హోస్ట్‌గా, డబ్బింగ్ ఆర్టిస్టుగా కూడా టాలెంట్ ప్రూవ్ చేసుకుంది. అంతేకాదు పేరుకే సింగర్ అయినా అందంతో కూడా తనకంటూ సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పర్చుకుంది సునీత. కాకపోతే పెళ్లి విషయంలో మాత్రం ఫెయిల్ అయింది. పర్సనల్ లైఫ్‌లో చాలా కష్టాలు అనుభవించింది. 19 ఏళ్ల వయసులోనే పెళ్లి చేసుకున్న ఆమె.. ఆ తర్వాత ఇద్దరు పిల్లలు పుట్టాక కొన్ని కారణాల వల్ల విడాకులు తీసుకొని భర్తకు దూరంగా ఉంటోంది. Also Read: ఈ నేపథ్యంలో గురించి గత కొన్నిరోజులుగా రకరకాల వార్తలు వస్తున్నాయి. తాజాగా బయటకొచ్చిన న్యూస్ ప్రకారం అతిత్వరలో ఆమె రెండో పెళ్లి జగరనుందని, డిజిటల్‌ రంగంలో హవా కొనసాగిస్తున్న ఓ బిజినెస్‌మ్యాన్‌ను సునీత పెళ్లి చేసుకోబోతోందని చెబుతున్నారు. సునీతను చేసుకోబోయే వాడిది కూడా రెండో పెళ్లే అనే టాక్ నడుస్తోంది. గతంలో సునీత విషయపై ఇలాంటి రూమర్సే రాగా.. తాను ఇలాంటి రూమర్స్ పెద్దగా పట్టించుకోనని చెప్పింది. అయినా మళ్లీ ఇప్పుడు అదే రకమైన రూమర్స్ షికారు చేస్తుండటం, ఇప్పుడు సునీత నుంచి రియాక్షన్ రాకపోవడం అనుమానాలకు తావిస్తోంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3mrGrjm
v

18 ఏళ్ల వయసులో అలా చేశా.. ముప్పై మంది చూస్తుండగానే! యాంకర్ విష్ణుప్రియ బోల్డ్ కామెంట్స్

సినిమా అన్నాక రొమాంటిక్ సీన్స్ కామన్. పైగా ఈ రోజుల్లో రొమాంటిక్ డోస్ దంచికొడితేనే ప్రేక్షకులు బాగా అట్రాక్ట్ అవుతున్నారు. దీంతో కథతో పాటు హీరోయిన్ అందాల ఆరబోతకు ప్రాముఖ్యత ఇస్తున్నారు దర్శకనిర్మాతలు. మరోవైపు హీరోయిన్లు కూడా కథ డిమాండ్ చేయాలే గానీ రొమాంటిక్ సీన్స్ చేసేందుకు సందేహించమంటూ ఓపెన్‌గా చెప్పేస్తున్నారు. ఈ క్రమంలోనే యాంకర్ తన తాజా సినిమా '' గురించిన విషయాలు చెబుతూ బోల్డ్ కామెంట్స్ చేసింది. బులితెరపై హాట్ యాంకర్‌గా భారీ పాపులారిటీ కూడగట్టుకున్న విష్ణుప్రియ ప్రస్తుతం 'చెక్‌మేట్' సినిమాలో లీడ్ రోల్ పోషిస్తోంది. చిన్ని కృష్ణ ప్రొడక్షన్స్ పతాకంపై ప్రసాద్ వెలంపల్లి దర్శక నిర్మాతగా తెరకెక్కించిన ఈ సినిమా షూటింగ్ ఫినిష్ చేసుకొని విడుదలకు సిద్ధమైంది. రాజేంద్రప్రసాద్, విష్ణుప్రియ సందీప్, దీక్షపంత్, బ్రహ్మనందం, రఘుబాబు షకలక శంకర్ కీలక పాత్రలు పోషించారు. ఇటీవలే విడుదలైన ఈ మూవీ ట్రైలర్‌లో విష్ణుప్రియ హాట్‌నెస్, రొమాంటిక్ డోస్ చూసి అంతా ఆశ్చర్యపోయారు. Also Read: కాగా తాజాగా 'చెక్‌మేట్' షూటింగ్ సంగతులపై రియాక్ట్ అయిన విష్ణుప్రియ.. ఈ సినిమాలో తాను చాలా హాట్ రోల్ చేశానని, ఓ ఇరవై.. ముప్పై మంది చూస్తుండగానే హాట్ సీన్స్ చేశానని చెప్పుకొచ్చింది. ''హాస్టల్‌లో భగవద్గీత చదువుకునే 18 ఏళ్ల అమ్మాయినైన నేను.. సడెన్‌గా ఇలాంటి హాట్ రోల్ చేయడం కాస్త ఇబ్బందిగా అనిపించింది గానీ.. కథ డిమాండ్ మేరకు కొన్ని సీన్స్ చేశాను. హాట్ సీన్స్ చేయడం చాలా హార్డ్ కానీ మా డైరెక్టర్ దాన్ని కంఫర్టబుల్‌గా తెరకెక్కించారు. అయినా ఆ సీన్స్ చేసేది నేను కాదు సినిమాలోని క్యారెక్టర్. అందుకే నన్ను నేను మోటివేట్ చేసుకొని కెమెరా ముందు నటించా'' అని చెప్పింది విష్ణుప్రియ.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2JuaurH
v

అందాల భామతో రాఘవేంద్ర రావు పెళ్లి సందడి.. దర్శకేంద్రుడు ఫిక్సయ్యారిలా!

గత 25 ఏళ్ల క్రింద తెలుగు సినీ ప్రేక్షకులకు 'పెళ్లి సందడి' రూపంలో ఓ కొత్త రకం వినోదాన్ని పంచిన దర్శకేంద్రుడు .. తిరిగి అదే పేరులో ఈ తరం ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు రెడీ అవుతున్నారు. ఈ మోడ్రన్ పెళ్లి సందడిని ఇటీవలే కన్ఫర్మ్ చేస్తూ టైటిల్ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. ఇందులో శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా నటిస్తున్నారని తెలిపిన ఆయన, హీరోయిన్ ఎవరనేది మాత్రం సస్పెన్స్ లోనే పెట్టి ఆమె కోసం వేట ప్రారంభించారు. లేటెస్ట్ సమాచారం మేరకు రోషన్‌తో రొమాన్స్ చేయబోయే అందాల భామను కన్ఫర్మ్ చేశారని తెలుస్తోంది. పాత పెళ్లి సందడితో హీరో శ్రీకాంత్ కెరీర్‌‌ని మలుపుతిప్పిన దర్శకేంద్రుడు.. ఇప్పుడు కొత్త పెళ్లి సందడితో శ్రీకాంత్ తనయుడు రోషన్ కెరీర్ నిలబెట్టాలని ప్లాన్ చేస్తున్నారట. ఈ మేరకు ఇందులో నటించబోయే హీరోయిన్, నటీనటుల ఎంపిక విషయంలో ప్రత్యేక శ్రద్ద పెట్టారట. ఇప్పటికే శ్రీదేవి రెండో కూతురు ఖుషి కపూర్‌ని ఓ హీరోయిన్‌గా తీసుకున్నారని తెలియగా.. మరో హీరోయిన్‌గా మలయాళ భామ మాళవిక నాయర్‌ని ఓకే చేశారనేది ఇన్‌సైడ్ టాక్. విజయ్ దేవరకొండ, నాని ప్రధాన పాత్రల్లో వచ్చిన 'ఎవడే సుబ్రమణ్యం' సినిమాలో, అలాగే 'టాక్సీ వాలా' సినిమాలో నటించి తనని తాను ప్రూవ్ చేసుకుంది మాళవిక. ఈ నేపథ్యంలో పెళ్లి సందడిలో మాళవిక అందాలను హైలైట్ చేస్తూ ఆమె కెరీర్ లోనూ ఈ సినిమాను టర్నింగ్ పాయింట్ చేయాలని భావిస్తున్నారట రాఘవేంద్ర రావు. ఇదే గనక నిజమైతే కెరీర్ పరంగా ఇక మాళవిక వెనుకకు తిరిగి చూడాల్సిన అవరసరమే రాకపోవచ్చు. Also Read: ఈ మోడ్రన్ పెళ్లి సందడికి రాఘవేంద్ర రావు దర్శకత్వ పర్యవేక్షణ చేపట్టనుండగా.. గౌరీ రోనంకి దర్శకత్వం వహించనున్నారు. ఆక్రా మీడియా వర్క్స్ సమర్పణలో రాఘవేంద్ర రావు సోదరుడు కె. కృష్ణమోహన్ రావు నిర్మించనున్నారు. అప్పట్లో తనదైన బాణీలతో పెళ్లి సందడి కళ తెచ్చిన కీరవాణి మరోసారి తన సంగీతంతో కట్టిపడేయనున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3o7u3Fn
v

మూడో సారికీ రెడీ.. మళ్లీ గర్భం దాల్చాలని ఉంది.. అసలు విషయం చెబుతూ ఓపెన్‌ అయిన అనసూయ

జబర్దస్త్ లేడీ భరద్వాజ్ తన మనసులోకి మాటలను బయటపెట్టి ఆశ్చర్యపరిచింది. ఏ పేరెంట్ అయినా సరే.. ఇద్దరు పిల్లలుంటే చాలని భావిస్తున్న ఈ రోజుల్లో తనకు మూడో సంతానం కనాలని ఉందని పేర్కొంటూ ఓపెన్ అయింది అనసూయ. మూడోసారి గర్భం దాల్చడానికి తనకెలాంటి అభ్యంతరం లేదని, మళ్లీ తల్లి కావాలనుందని ఆమె చెప్పిన మాటలు జనాల్లో హాట్ టాపిక్ అయ్యాయి. విషయం ఏదైనా కూడా మొహమాటం లేకుండా అసలు మ్యాటర్ చెప్పేయడం అనసూయకు అలవాటు. అదే ఆమెను చాలా సందర్భాల్లో ట్రోల్స్ బారిన పడేసింది. అయినా అనసూయతో ఆవగింజంత మార్పు కూడా కనిపించడం లేదు. తన మనసులోని మాటను నిర్మొహమాటంగా బయటపెట్టేస్తోంది. మరోవైపు విలక్షణ పాత్రలు ఎంచుకుంటూ వెండితెరపై కూడా సత్తా చాటుతున్న ఈ జబర్దస్త్ భామ.. ప్రస్తుతం '' అనే మూవీ చేస్తోంది. రెండు రోజుల క్రితమే ఈ సినిమా ఫస్ట్‌లుక్ రిలీజ్ చేయగా అందులో గర్భవతిగా కనిపించి షాకిచ్చింది అనసూయ. Also Read: దీంతో అనసూయ మరోసారి గర్భవతి అయ్యిందంటూ సోషల్ మీడియా అంతా హోరెత్తిపోయింది. ఈ నేపథ్యంలో తాజాగా ఓ మీడియాతో మాట్లాడిన ఆమె.. మాతృత్వంలో ఉన్న ఆనందం గొప్పదని, మరోసారి గర్భవతి అయి ఆ మాతృత్వపు ఆనందం పొందాలని ఉందని తెలుపుతూ ఓపెన్ అయింది. గతంలో తన ప్రెగెన్సీ సమయంలో పొందిన ఆ అనుభూతి మరోసారి పొందాలని ఉందని, అందుకే మళ్లీ తల్లి కావాలని అనుకుంటున్నా అంటూ అనసూయ చెప్పిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ఇప్పటికే ఇద్దరు పిల్లలకు తల్లి అయిన ఆమె.. మళ్లీ తల్లి అవుతా అని చెబుతుండటం పబ్లిసిటీ స్టంట్ మాత్రమే అంటున్నారు నెటిజన్లు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2Jjd0By
v

కొరటాల శివతో అల్లు అర్జున్ మూవీ.. బన్నీ రోల్ ఇదే! వైరల్ అవుతున్న క్రేజీ అప్‌డేట్

ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో ప్యాన్ ఇండియా మూవీ 'పుష్ప' చేస్తున్న అల్లు అర్జున్.. తన తదుపరి సినిమాను కొరటాల శివతో చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ సినిమాను అఫీషియల్‌గా ప్రకటించారు. ఓ ఆసక్తికరమైన పోస్టర్ రిలీజ్ చేసి బన్నీ- కొరటాల కాంబోను కన్ఫర్మ్ చేశారు. దీంతో ఈ సినిమా ఎలా ఉండబోతోంది? స్టోరీ లైన్ ఏంటి? అనే దానిపై క్రేజీ రూమర్స్ చక్కర్లు కొడుతున్నాయి. ముఖ్యంగా ఇందులో చేయబోయే రోల్ గురించిన విషయాలు మరింత ఆసక్తి రేపుతున్నాయి. అల్లు అర్జున్ కెరీర్‌లోనే ఎన్నటికీ గుర్తుండిపోయేలా ఆయన కోసం ప్రత్యేకంగా బలమైన కథ రెడీ చేస్తున్నారట . సామాజిక కోణంలో ఎంచుకున్న కథకు తనదైన స్టైల్‌లో మెరుగులు దిద్దుతున్నారట. ఫస్టాఫ్‌ అంతా అల్లు అర్జున్‌ని స్టూడెంట్‌ లీడర్‌ గానూ, అదేవిధంగా సెకండాఫ్‌ అంతా రాజకీయ నాయకుడి గానూ చూపించనున్నారనే టాక్ బయటకొచ్చింది. ఈ క్యారెక్టర్స్ కోసం బలమైన డైలాగ్స్ కూడా సిద్ధం చేస్తున్నారని సమాచారం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై అల్లు అర్జున్ ఫైట్ చేయడం ఈ సినిమాలో చూడొచ్చని అంటున్నారు. ఇది చూసి తెలిసి బన్నీ ఫ్యాన్స్‌ తెగ సంబరపడుతున్నారు. Also Read: ఇవే నిజమైతే బన్నీ కెరీర్‌లో కొరటాలతో చేయబోయే ఈ మూవీ ఓ మైలురాయిగా నిలవడం కన్ఫర్మ్ అంటూ అప్పుడే లెక్కలు వేయడం స్టార్ట్ చేశారు అల్లు అర్జున్ అభిమానులు. ఇకపోతే ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న 'పుష్ప' సినిమాలో నటిస్తున్నారు అల్లు అర్జున్. ఇందులోనూ ఆయనది డిఫరెంట్ క్యారెక్టరే. లారీ డ్రైవర్ పుష్పరాజ్ పాత్రలో బన్నీ కనిపించనుండగా, ఆయన సరసన రష్మిక మందాన తన అందాలతో మ్యాజిక్ చేయనుంది. ఈ మూవీ షూటింగ్ ఫినిష్ కాగానే కొరటాల శివతో సినిమా స్టార్ట్ చేయనున్నారు అల్లు అర్జున్.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/36kfpEF
v

OTT: సరికొత్త ATTలో ఫస్ట్ మూవీ ‘డర్టీ హరి’ .. ఫోన్ కొడితే ఫుల్ మసాలా మూవీ

కరోనా కష్టకాలంలో మూవీ లవర్స్‌కి వినోదాన్ని పంచింది ఓటీటీ. ఆహా, అమేజాన్ ప్రైమ్, హాట్ స్టార్ వంటి ఓటీటీ ప్లాట్ ఫామ్స్ ద్వారా అనేక సినిమాలు విడుదలయ్యాయి. ఈ ఓటీటీకి మంచి ఆదరణ లభించడంతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది ఏటీటీ. కొందరు సినీ ప్రముఖులు కలిసి ఏటీటీ () యాప్‌ని లాంఛ్ చేయబోతున్నారు. ఇందులో తొలి సినిమాగా డ‌ర్టీ హ‌రీని ప్ర‌ద‌ర్శించ‌బోతున్నారు. ప్రముఖ నిర్మాత ఎంఎస్ రాజు దర్శకత్వంలో రూపొందిచిన రొమాంటిక్ మూవీ డ‌ర్టీ హ‌రి. రుహాని శ‌ర్మ‌, శ్ర‌వ‌ణ్ రెడ్డి, సిమ‌త్ర కౌర్ త‌దిత‌ర‌లు న‌టించిన ఈ సినిమా టీజ‌ర్ కి సోష‌ల్ మీడియాలో విశేష ఆద‌ర‌ణ ల‌భించిన విష‌యంలో తెలిసిందే, ఈ నేప‌థ్యంలో డ‌ర్టీ హ‌రి చిత్రాన్ని కొత్త ఓటిటి ప్లాట్ ఫామ్ ఏటీటీ ద్వారా డిసెంబ‌ర్ 18న విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు మొద‌లైయ్యాయి. పే ఫర్ వ్యూ పద్దతిలో నడిచే ఈ కొత్త ఏటీటీ యాప్ కు తెలుగు ఆడియెన్స్ లో ప్రత్యేక స్థానం ఉంటుందని అంతా చాలా బలంగా నమ్ముతున్నారు. చిత్రంతో పాటు ఇంకా పలు సినిమాలు ఈ కొత్త ఏటీటీ స్ట్రీమింగ్ అవ్వబోతున్నాయి. ఫోన్ కాల్ చేసి సినిమా చూసే నూత‌న‌ విధానంను ఈ కొత్త ఏటీటీ రెడీ అవుతుంది. ఈ ఏటిటి కి ఇద్ద‌రు పెద్ద ద‌ర్శ‌కులు ప‌నిచేయ‌టం విశేషం, వారే ఈ యాప్ ని యూజ‌ర్ ఫ్రెండ్లీగా సిద్ధం చేశారు. ఈ ఏటిటి డిసెంబర్ 18న లాంచ్ చేస్తున్నారు డిసెంబ‌ర్ మెద‌టి వారం లో దీని గురించి అధికారిక ప్ర‌క‌ట‌న రానుంది.. ఈ యాప్‌కి సంబంధించి మరిన్ని వివరాలు త్వరలో తెలియ చేయనున్నారు. ప్రముఖ నిర్మాత ఎంఎస్ రాజు దర్శకత్వంలో రూపొందిచిన రొమాంటిక్ మూవీ డ‌ర్టీ హ‌రి. రుహాని శ‌ర్మ‌, శ్ర‌వ‌ణ్ రెడ్డి, సిమ‌త్ర కౌర్ త‌దిత‌ర‌లు న‌టించిన ఈ సినిమా టీజ‌ర్ కి సోష‌ల్ మీడియాలో విశేష ఆద‌ర‌ణ ల‌భించిన విష‌యంలో తెలిసిందే, ఈ నేప‌థ్యంలో డ‌ర్టీ హ‌రి చిత్రాన్ని ఓ కొత్త ఓటిటి ద్వారా డిసెంబ‌ర్ 18న విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు మొద‌లైయ్యాయి. ఇప్పటికే తెలుగు ప్రేక్ష‌కులు ఓటిటిల్లో విడుద‌ల అవుతున్న సినిమాల్ని ఆద‌రిస్తున్నారు, దీంతో కొంద‌రు సినీ ప్రముఖలు ఈ ఏటీటీని తీసుకు రాబోతున్నారు, ఇందులో తొలి సినిమాగా డ‌ర్టీ హ‌రీని ప్ర‌ద‌ర్శించ‌బోతున్నారు. పే ఫర్ వ్యూ పద్దతిలో నడిచే ఈ కొత్త ఏటీటీ యాప్ కు తెలుగు ఆడియెన్స్ లో ప్రత్యేక స్థానం ఉంటుందని అంతా చాలా బలంగా నమ్ముతున్నారు. డర్టీ హరి చిత్రంతో పాటు ఇంకా పలు సినిమాలు ఈ కొత్త ఏటీటీ స్ట్రీమింగ్ అవ్వబోతున్నాయి. ఫోన్ కాల్ చేసి సినిమా చూసే నూత‌న‌ విధానంను ఈ కొత్త ఏటీటీ రెడీ అవుతుంది. ఈ ఏటిటి కి ఇద్ద‌రు పెద్ద ద‌ర్శ‌కులు ప‌నిచేయ‌టం విశేషం, వారే ఈ యాప్ ని యూజ‌ర్ ఫ్రెండ్లీగా సిద్ధం చేశారు. ఈ ఏటిటి డిసెంబర్ 18న లాంచ్ చేస్తున్నారు డిసెంబ‌ర్ మెద‌టి వారం లో దీని గురించి అధికారిక ప్ర‌క‌ట‌న రానుంది, మ‌రిన్ని వివ‌రాలు కూడా అతి త్వ‌ర‌లో విడుద‌ల కానున్నాయి.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3ljhogS
v

అర్ధరాత్రి వేళ సుమ కనకాల రచ్చ.. మన టైమ్ రావాల్సిందే అంటూ గుట్టు విప్పిన యాంకరమ్మ!!

బుల్లితెర సెన్సేషన్, మాటల మహారాణి ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో తెగ హంగామా చేస్తోంది. లాక్‌డౌన్ వేళ ఖాళీ సమయం దొరకడంతో బుల్లితెర స్టార్ కాస్త సోషల్ మీడియా స్టార్ అయిపోయింది. ఎప్పటికప్పుడు తన వీడియోలు షేర్ చేస్తూ ఫాలోయింగ్ పెంచుకుంటోంది. ఈ క్రమంలోనే తాజాగా.. తాను అర్దరాత్రి మేకప్ వేసుకుని రెడీగా ఉన్నానని పేర్కొంటూ ఓ వీడియో పోస్ట్ చేసి అసలు మ్యాటర్ చెప్పేసింది. తన పెంపుకు కుక్క జోరోతో కలిసి ఆడుతున్న ఆటలు, పని మనిషిని ఆట పట్టిస్తున్న వీడియోలతో హంగామా చేస్తున్న సుమ మరోసారి తనదైన మాటలతో అందరినీ ఆకట్టుకుంది. అమెరికాలోని తెలుగు ప్రేక్షకుల కోసం '' అనే షోను హోస్ట్ చేస్తోంది యాంకర్ సుమ. ప్రతి ఏడాది ఈ షోను నిర్వహిస్తామని పేర్కొన్న ఆమె.. దీనికోసమే ఇలా ఈ అర్దరాత్రి సమయంలో మేకప్ వేసుకుని రెడీ అయ్యాయని చెబుతూ వీడియో వదిలింది. అయితే గతేడాది కంటే ఈ సారి ఓ గంట ఆలస్యంగా ప్రోగ్రాం మొదలుపెట్టామని చెప్పుకొచ్చింది. టైమ్ ముందుకు జరిగినా వెనక్కి జరిగినా మన టైమ్ రావాల్సిందే అంటూ ఫన్నీగా ముగించింది. దీంతో ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. Also Read: డిజిటల్ టెక్నాలజీని అందిపుచ్చుకుంటూ సరికొత్తగా అడుగులేస్తున్న సుమ.. యూట్యూబ్‌లో సుమక్క పేరిట ఓ ఛానల్ క్రియేట్ చేసి ఫుల్లుగా ఎంటర్‌టైన్ చేస్తోంది. ఈట్ విత్ టాక్ అనే కొత్త షోను పెట్టి.. సెలబ్రిటీలను ఇంటికి పిలిచి వారిచేతనే ఏదో ఒక స్పెషల్ వంటకాన్ని వండిస్తోంది. దీంతో సుమక్క ఛానల్ తక్కువ కాలంలోనే మంచి పాపులారిటీ దక్కించుకుంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/39pUsKz
v

Bandla Ganesh: జోకర్ కాదిక్కడ ఫైటర్.. ఎమ్మెల్సీ కవిత కామెంట్‌పై బండ్ల గణేష్ రియాక్షన్

జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో పేరు మరోసారి సెన్సేషన్ అవుతోంది. ఏదో ఒకరకంగా ఆయన పేరు ప్రస్తావనలోకి వస్తుండటం గమనిస్తున్నాం. ఇటీవల ఎన్నికల ప్రచారంలో భాగంగా టీఆర్ఎస్ నిర్వహించిన ఓ సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్సీ .. ఒకానొక సందర్భంలో బండ్ల గణేష్ పేరు తీయడంతో ఆ వీడియో వైరల్ అయింది. గత సంవత్సరం బండ్ల గణేష్ చేసిన కామెడీలా ఈ సంవత్సరం బండి సంజయ్ చేస్తున్నారంటూ ఆమె సందేశమివ్వడం జనాల్లో చర్చనీయాంశం అయింది. ఈ నేపథ్యంలో తాజాగా కవిత కామెంట్‌పై రియాక్ట్ అయ్యారు బండ్ల గణేష్. ''నేను జోకర్‌ని కాదు.. ఫైటర్‌ని.. కానీ ప్రస్తుతం ఎలాంటి రాజకీయ పార్టీలో ఉండదలచుకోలేదు. ఆల్ ది బెస్ట్'' అని పేర్కొంటూ కవితకు ట్యాగ్ చేశారు. ఆయన చేసిన ఈ కామెంట్ చూసి.. బండ్లన్నకు మద్దతుగా భిన్న రకాలుగా స్పందిస్తున్నారు నెటిజన్లు. దీంతో ఈ ట్వీట్ నెట్టింట వైరల్ అవుతోంది. Also Read: తనకు రాజకీయాలతో సంబంధం లేదు మొర్రో అని మొత్తుకుంటున్నా కొందరు పనిగట్టుకుని మరీ ఆయన‌పై బురద జల్లే ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో పదే పదే తాను ఏ రాజకీయ పార్టీలో లేనని చెప్పుకొస్తున్నారు బండ్ల గణేష్. దయచేసి గతంలో మాట్లాడిన మాటల్ని ఇప్పుడు పోస్ట్ చేయొద్దని ఒకటికి పది సార్లు అభ్యర్థిస్తుండటం గమనార్హం. ఇకపోతే రీసెంట్‌గా 'సరిలేరు నీకెవ్వరు' సినిమాలో నటించిన బండ్ల గణేష్.. తిరిగి నిర్మాతగా పలు సినిమాలు చేసేందుకు రెడీ అవుతున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/37htNgb
v

Sri reddy: సెక్సీ ఫొటోలతో సమంత వ్యాపారం చేస్తోంది.. పెళ్లయ్యాక కూడా ఆమె.. బాబోయ్ ఎంత మాట..!!

ఒకానొక సమయంలో క్యాస్టింగ్ కౌచ్ అంటూ సంచలనం సృష్టించిన .. ఆ తర్వాత చెన్నైలో మకాం వేసి అవకాశం చిక్కినప్పుడల్లా బడా దర్శక నిర్మాతలు, నటీనటుల వ్యవహారాలపై కామెంట్స్ చేస్తున్న సంగతి తెలిసిందే. బడా బాబుల చీకటి కోణాలపై రియాక్ట్ అవుతూ ప్రతి ఒక్కరినీ టార్గెట్ చేస్తూ వస్తోంది సంచలన తార శ్రీ రెడ్డి. ఈ క్రమంలోనే తాజాగా స్టార్ హీరోయిన్, అక్కినేని కోడలు బికినీ లుక్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచింది. సోషల్ మీడియాలో బూతులతో వీరంగం సృష్టించడం శ్రీ రెడ్డికి కొత్తేమీ కాదు. సెక్సీ ఫోటోలు, హాట్ కామెంట్స్ చేస్తూ ప్రతి క్షణం తన సోషల్ మీడియా అకౌంట్స్‌ని ట్రెండింగ్‌లో ఉంచుకునే శ్రీ రెడ్డి.. తాజాగా సమంతను టార్గెట్ చేయడం సినీ వర్గాల్లో హాట్ ఇష్యూగా మారింది. ప్రస్తుతం మాల్దీవుల్లో వెకేషన్ ట్రిప్ ఎంజాయ్ చేస్తున్న సమంత, ఇటీవల బాత్‌టబ్ జలకాలాడుతూ హాట్ పోజిచ్చిన తన బికినీ లుక్ షేర్ చేసింది. దీంతో ఈ పిక్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. అయితే ఇదే ఫోటోను తన ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసిన శ్రీ రెడ్డి.. అర్థనగ్న ఫొటోలతో సమంత వ్యాపారం చేస్తోందంటూ ఆమెపై ఆటం బాంబ్ వేసింది. Also Read: ''గాయ్స్.. ఓ సారి ఈ ఫోటోను పూర్తిగా చూడండి. సమంతకు పెళ్లయింది.. ఆమెకు 100 తరాలు కూర్చొని తిన్నా తరగని ఆస్తి ఉంది. అయినా కూడా తన అందాలను ఆరబోస్తూ ఇలా ఎందుకు వ్యాపారం చేస్తుందో!'' అంటూ అక్కినేని కోడలిపై సెన్సషనల్ కామెంట్ వదిలింది శ్రీ రెడ్డి. గతంలో కూడా ఇలాగే సమంత బాడీ పార్ట్స్‌పై శ్రీ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఆమె వ్యవహారం టాలీవుడ్ వీధుల్లో మరోసారి చర్చల్లో నిలిచింది. శ్రీ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు చూసి సామ్ అభిమానులు తెగ ఫీలై పోతున్నారు. చూడాలి మరి ఈ వ్యవహారం ఎక్కడి దాకా వెళ్తుందనేది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3fIxy2c
v

విశాఖ తీరాన 'హానీ ట్రాప్'.. అందమైన లొకేషన్స్‌లో అలా!!

విశాఖలోని అందమైన లొకేషన్స్‌లో '' మూవీ తొలి షెడ్యూల్ షూటింగ్ శరవేగంగా సాగుతోంది. భరద్వాజ్ సినీ క్రియేషన్స్ బ్యానర్ పి. సునీల్ కుమార్ రెడ్డి దర్శకత్వంలో వి.వి.వామన రావు నిర్మిస్తున్న ఈ చిత్రంలో ఋషి, శిల్ప, తేజు అనుపోజు, శివ కార్తీక్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ షెడ్యూల్‌లో చిత్రానికి సంబంధించిన కీలక సన్నివేశాలతో పాటు రెండు పాటల్ని చిత్రీకరిస్తున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత వి.వి.వామన రావు మాట్లాడుతూ.. 'ఈ చిత్రంలో ఒక ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నాను. హీరో ఋషి, హీరోయిన్ శిల్పలపై కొన్ని రొమాంటిక్ సన్నివేశాలతో పాటు ఎమోషనల్ సన్నివేశాలను చిత్రీకరికరించాం. శివ కార్తీక్ యువ రాజకీయ నాయకుడిగా నటిస్తున్నాడు. ఆ సన్నివేశాల్ని చాలా చక్కగా చిత్రీకరించాం. ఈ నెలాఖరుకు విశాఖ షెడ్యూల్ పూర్తి చేస్తాం. ఇప్పటి ట్రెండ్‌కి తగ్గట్లుగా కథని సమకూర్చాను. దానికి తగ్గట్లుగా సునీల్ కుమార్ రెడ్డి అద్భుతమైన లొకేషన్స్‌లో కాంప్రమైజ్ కాకుండా తెరకెక్కిస్తున్నారు. మేము అనుకున్న దానికన్నా సినిమా బాగా వస్తోంది'' అన్నారు. Also Read: దర్శకుడు పి. సునీల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. ''ఇది ఒక సోషల్ థ్రిల్లర్ మూవీ. యూత్ ఆడియెన్స్‌కి నచ్చే ఎన్నో అంశాలు ఈ చిత్రంలో ఉన్నాయి. ప్రస్తుత సమాజంలో జరుగుతున్న అనేక సంఘటనలను ఈ చిత్రం తెరమీదదకు తెస్తోంది. భీమిలి, అరకు లాంటి అందమైన లొకేషన్స్‌లో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం. ఎస్ వి శివరాంగారి కెమెరా పనితనం, ప్రవీణ్ ఇమ్మడి మ్యూజిక్ చిత్రానికి ప్రధాన ఎస్సెట్స్ అవుతాయి. నటీనటులు అందరూ మంచి సహకారం అందిస్తున్నారు. డిసెంబర్ నుండి హైదరాబాద్‌లో జరిగే రెండవ షెడ్యూలుతో షూటింగ్ పూర్తవుతుంది. చిత్రాన్ని జనవరి కల్లా రెడీ చెయ్యాలని ప్లాన్ చేస్తున్నాం'' అన్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/36fmIO4
v

Saturday 28 November 2020

ఏది నిజం ఏది అబద్దం? మ‌న‌ల్ని ఉక్కిరిబిక్కిరి చేసేస్తున్నారు.. ఉదయభాను ఎమోషనల్ కామెంట్స్

యాంకర్ .. తెలుగు ప్రేక్షకులకు పరిచయమే అక్కర్లేని పేరిది. బుల్లితెర యాంకర్, హోస్ట్, సినీ నటిగా ఆమె ప్రతిఒక్కరికీ సుపరిచితం. యాంకర్‌గా మాటల తూటాలు పేల్చుతూ ఆకట్టుకునే ఉదయభాను.. ఎప్పటికప్పుడు సమాజ పరిస్థితులు, నిజ జీవిత అంశాలపై స్పందిస్తూ ఉంటుంది. సోషల్‌ మీడియాలో యమ యాక్టివ్‌గా ఉంటూ తన అభిప్రాయాలను చెబుతూ ఉంటుంది. తాజాగా జీహెచ్ఎంసీ ఎన్నికల వేళ ఓటు యొక్క విలువను తెలుపుతూ జనాన్ని ఎడ్యుకేట్ చేసింది ఉదయభాను. ఈ మేరకు ఆమె విడుదల చేసిన వీడియో, అందులో ఆమె మాట్లాడిన విధానం సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఆలోచింపజేస్తున్నాయి. గ్రేటర్‌ పోరులో వినియోగంపై ఎంతో అద్భుతమైన సందేశమిచ్చింది ఉదయభాను. ప్రజాస్వామ్య దేశంలో ఓటును అమ్ముకుంటే జరిగే పరిణామాలపై తనదైన శైలిలో వివరించింది. జీవితం ఒక యుద్ధమైతే దాన్ని గెలవడానికి మనకున్న ఆయుధం ఓటు హక్కు అని, దాన్ని నిర్వీర్యం చేయొద్దని పేర్కొంటూ చక్కని తెలుగు భాషలో సూటిగా మాట్లాడింది. ప్రలోభాల కోసం కాదు.. ప్రగతి కోసం ఓటేద్దామని పిలుపునిచ్చింది. ''అభివృద్ధి జరిగిందా? అవినీతి పెరిగిందా..? కళ్లారా చూస్తున్నాం.. చెవులారా వింటున్నాం. సామాన్యుడి స్వప్నం సాకారమయ్యిందా అంటే మాహానేతలంతా మహా అద్భుతంగా మాట్లాడతారు. ఎవ‌రి మీడియా వారిది, ఎవ‌రి మాధ్య‌మాలు వారివి. మాట‌ల గార‌డీ, అంకెల గార‌డీతో మ‌న‌ల్ని ఉక్కిరిబిక్కిరి చేసేస్తున్నారు. ఏది నిజం? ఏది అబ‌ద్ధం? ఈ ప్ర‌శ్న‌కు వేరే ఎక్క‌డో వెతుక్కోవాల్సిన అవ‌స‌రం లేదు. మ‌న జీవితాలే సాక్ష్యం. స‌మాధానం మ‌న మ‌న‌స్సాక్షికి బాగా తెలుసు. జీవితం ఒక యుద్ధ‌మైతే, దాన్ని గెల‌వ‌డానికి మ‌న‌కున్న ఆయుధం ఓటు హ‌క్కు. దాన్ని నిర్వీర్యం చేయొద్దు. క‌చ్చితంగా ఓటు వేసి తీరుదాం. అప్పుడే ప్ర‌శ్నించ‌గ‌లం. పిడికిలి ఎత్త‌గ‌లం. మన ఓటు హక్కును వందలు, వేలు వెదజల్లు కొంటున్నారంటే లక్షణంగా లక్షలు లక్షలు దోచేస్తారు. కోటాను కోట్లు దర్జాగా దోచేస్తారు. రాబడి ఉంటేనే కదా.. పెట్టుబడి పెట్టేది. కానీ అది దానం కాదు. మన మన స్వేదం, మన రుధిరం, మన భారతావని భవితం. కావున‌ ప్ర‌లోభాల కోసం కాదు ప్ర‌గ‌తి కోసం ఓటేద్దాం. ప్ర‌జాస్వామ్నాన్ని కాపాడుకుందాం'' అంటూ ఉదయభాను చెప్పిన మాటలు ఎన్నో మెదళ్లను కదలిస్తున్నాయి. Also Read:


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/37ewoYw
v

Bigg Boss Telugu 4: క్రేజీ అప్‌డేట్.. హౌస్‌లోకి ఎంటరైన మరో స్టార్ హీరో.. నాగార్జునతో కలిసి రచ్చ రచ్చ

బుల్లితెరపై బిగ్ బాస్ షోకి ఉన్న క్రేజ్ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. టీఆర్పీ పరంగా చూసినా, ప్రేక్షకాదరణ పరంగా చూసినా ఈ రియాలిటీ షోకి ఉన్న పాపులారిటీ మరే ఇతర ప్రోగ్రామ్‌కి లేదని అనడంలో అతిశయోక్తి లేదు. ముఖ్యంగా తెలుగు ప్రేక్షకులు బిగ్ బాస్‌పై ఎక్కువ మక్కువ చూపుతున్నారు. దీనికి అనుగుణంగానే బిగ్ బాస్ యాజమాన్యం సరికొత్తగా ప్లాన్ చేస్తూ ప్రేక్షకులకు వినోదం పంచుతోంది. ఇందులో భాగంగా ఈ వారం ఎపిసోడ్ కోసం నాగార్జునతో పాటు రచ్చ చేసేందుకు మరో స్టార్ హీరోను రంగంలోకి దించుతున్నారు. ఇప్పటికే మూడు సీజన్లలో భారీ ఆదరణ చూరగొన్న బిగ్ బాస్ నాలుగో సీజన్‌లోనూ అదే హవా కొనసాగిస్తోంది. మొదట కాస్త తడబడినా ఆ తర్వాత పుంజుకొని వినూత్నంగా ముందుకెళ్తోంది. బిగ్ బాస్ హౌస్ లోకి ఊహించని గెస్టులను ఆహ్వానిస్తూ ఇప్పటికే ఉన్న క్రేజ్ అమాంతం పెంచేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆదివారం జరిగే ఎపిసోడ్‌లో నాగార్జునతో కలిసి రచ్చ చేసేందుకు కన్నడ స్టార్ హీరో రంగంలోకి దించుతున్నారు. Also Read: నిన్ననే నాగార్జునతో పాటు షూటింగ్‌లో పాల్గొన్నారు సుదీప్. ఆదివారం ఎపిసోడ్‌లో ఆయన చేతుల మీదుగా ఒక కంటెస్టెంట్‌ను సేవ్ చేయడంతో పాటు త్వరలో కన్నడంలో తాను ప్రారంభించబోతున్న బిగ్ బాస్‌కు సంబంధించిన విషయాన్ని కూడా సుదీప్ షేర్ చేసుకుంటారని సమాచారం. వీకెండ్ ఎపిసోడ్స్‌లో రెగ్యులర్‌గా స్పెషల్ సర్‌ప్రైజ్‌లు ఇస్తూ బిగ్ బాస్ మేనేజ్‌మెంట్ ఈ వారం సుదీప్ హంగామాతో మ్యాజిక్ చేయనుండటం ఆసక్తికర అంశం. ఇకపోతే తాను బిగ్ బాస్ హౌస్‌లో గెస్టుగా కనిపించనున్న విషయాన్ని సుదీప్ స్వయంగా ట్వీట్ చేస్తూ నాగార్జునతో కలిసి దిగిన పిక్ షేర్ చేశారు. నాగార్జునతో కలిసి తెలుగు బిగ్ బాస్ తెరపై కనిపించనుండటం, బిగ్ బాస్ కంటిస్టెంట్లతో మాట్లాడుతూ సరదాగా గడపడం చాలా ఆనందంగా ఉందని ఆయన పేర్కొన్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2VewLg8
v

Prabhas‌ ఆదిపురుష్ ఇంట్రెస్టింగ్ అప్‌డేట్.. లక్ష్మణుడి పాత్రపై ఫుల్ క్లారిటీ!

ప్రభాస్ హీరోగా బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ రూపొందించనున్న భారీ సినిమా ''. ఇటీవలే ఈ మూవీని అఫీషియల్‌గా అనౌన్స్ చేయడంతో యావత్ సినీ లోకమంతా ఈ సినిమా గురించే చర్చించుకుంటున్నారు. ముఖ్యంగా ఈ భారీ మూవీలో ప్రభాస్‌తో కలిసి నటించనున్న నటీనటులు ఎవరనే దానిపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. ఈ క్రమంలో రాముడిగా నటిస్తున్న ప్రభాస్‌ని ఢీకొట్టే రావణుడి పాత్ర కోసం బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్‌ని తీసుకున్న యూనిట్.. లక్ష్మణుడి పాత్రను మాత్రం సస్పెన్సులో పెట్టేసింది. రాముడి తమ్ముడైన లక్ష్మణుడి పాత్ర సినిమాకు చాలా కీలకం కాబట్టి ఈ పాత్ర ఎవరు చేస్తారనే దానిపై సినీలోకం ఆతృతగా ఎదురు చూస్తోంది. అయితే ఇందుకోసం ఓ యువ నటుడిని తీసుకున్నట్లు ప్రచారం ఊపందుకుంది. మొదట ఆయనెవరో కాదు టాలీవుడ్ నటుడు శ్రీవిష్ణు అన్నారు. కానీ లేటెస్ట్ సమాచారం మేరకు ఆదిపురుష్‌లో లక్ష్మణుడి పాత్ర కూడా బాలీవుడ్ నటుడినే వరించిందని, బాలీవుడ్ యువ నటుడు సన్నీ సింగ్‌ని ఫైనల్ చేశారని తెలుస్తోంది. త్వరలో దీనిపై అధికారిక ప్రకటన కూడా రానుందని టాక్. ప్రభాస్ కెరీర్‌లో 22వ సినిమాగా రానున్న ఈ ఎపిక్ పీరియాడికల్ యాక్షన్ డ్రామాలో విజువల్ ఎఫెక్ట్స్ కోసం అవతార్, స్టార్ వార్స్ ఫేమ్ స్పెషలిస్టులను తీసుకున్నారట మేకర్స్. అలాగే ప్రభాస్ సరసన సీత పాత్ర కోసం కృతిసనన్‌‌ని కన్ఫర్మ్ చేశారని మరో సమాచారం. 2021 ప్రారంభంలో ఈ మూవీ సెట్స్‌పైకి వెళ్తుందని ప్రకటించారు మేకర్స్. హిందీ, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం భాషల్లో భారీ ఎత్తున ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3mixxUV
v

RRR: యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆన్ ఫైర్.. నడకలో నందమూరి రాజసం.. వీర లెవల్ అంతే!!

దర్శకధీరుడు రాజమౌళి రూపొందిస్తున్న భారీ సినిమా . యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా నటిస్తున్నారు. ఇప్పటికే మేజర్ పార్ట్ షూటింగ్ ఫినిష్ చేశారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్యాన్ ఇండియా మూవీగా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. దీంతో విడుదలకు ముందే RRRపై ఓ రేంజ్ హైప్ క్రియేట్ అయింది. ఈ మూవీకి సంబంధించిన అప్‌డేట్స్ సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తున్నాయి. ఈ క్రమంలోనే ఇటీవలే విడుదలైన '' వీడియో నెట్టింట అరుదైన రికార్డు సొంతం చేసుకుంది. మార్చి నెలలో విడుదలైన రామ్ చరణ్ 'భీమ్ ఫర్ రామరాజు' వీడియో యూట్యూబ్‌లో దుమ్ముదులపగా.. దసరా కానుకగా విడుదలైన ఎన్టీఆర్ 'రామరాజు ఫర్ భీమ్' వీడియో ఆన్‌లైన్ సెన్సేషన్ అయింది. నిజానికి ఈ వీడియోపై కొన్ని వర్గాల నుంచి వ్యతిరేకత వచ్చినా రికార్డుల వేటలో మాత్రం ముందంజలో ఉండటం విశేషం. అక్టోబర్ 22వ తేదీన విడుదలైన ఈ టీజర్ ఇప్పటివరకు 2 లక్షలకు పైగా కామెంట్లను దక్కించుకుంది. దీంతో టాలీవుడ్‌లో ఈ రేంజ్ కామెంట్లు దక్కించుకున్న మొదటి టీజర్‌గా 'రామరాజు ఫర్ భీమ్' వీడియో నిలిచింది. అలాగే యూట్యూబ్‌లో దూసుకుపోతున్న ఈ వీడియో ఇప్పటివరకు 3 కోట్లకు పైగా వ్యూస్ రాబట్టడం గమనార్హం. Also Read: ఇకపోతే లాక్‌డౌన్ కంటే ముందే RRR మేజర్ పార్ట్ షూటింగ్ ఫినిష్ చేసిన రాజమౌళి.. రీసెంట్‌గా షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో వేసిన ప్రత్యేక సెట్‌లో మరో షెడ్యూల్ కంప్లీట్ చేసే పనిలో ఉన్నారు. ఈ నేపథ్యంలో భుజాన బ్యాగ్ వేసుకొని, మాస్క్ ధరించి ఎన్టీఆర్ అలా నడుస్తూ వస్తున్న ఓ పిక్ తాజాగా నెట్టింట వైరల్‌గా మారింది. ఈ పిక్ చూసిన ఫ్యాన్.. ''ఆ నడకలో నందమూరి రాజసం ఉట్టిపడుతోంది. వీర లెవల్ అంతే'' అంటూ కామెంట్ చేస్తున్నారు. RRRలో తన పార్ట్ షూటింగ్ ఫినిష్ అయ్యాక వస్తుండగా తీసిందే ఈ పిక్ అని సమాచారం. డీవీవీ దానయ్య సమర్పణలో భారీ బడ్జెట్ కేటాయించి RRR (రౌద్రం రణం రుధిరం) రూపొందిస్తున్నారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ కొమురం భీం రోల్ పోషిస్తుండగా, అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్ నటిస్తున్నారు. ఆలియాభట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. అజయ్ దేవ్‌గణ్, శ్రీయ కీలకపాత్రలు పోషిస్తున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2Jg2N8Q
v

బర్త్‌డేను బికినీలో సెలబ్రేట్ చేసుకున్న యువ నటి.. ఇదో స్టైలు!

‘జవానీ జానేమన్’ సినిమాలో సైఫ్ అలీ ఖాన్ కూతురిగా నటించి సినీ పరిశ్రమకు పరిచయమైన అలయా ఎఫ్ శనివారం 23వ ఏట అడుగుపెట్టింది. అయితే, ఈ యువ నటి తన పుట్టినరోజు వేడుకను చాలా వెరైటీగా జరుపుకుంది. ముంబైలోని సముద్ర తీర పట్టణం అలీబాగ్‌లో తన స్నేహితులతో కలిసి శుక్రవారం అర్ధరాత్రి తన స్టైల్లో బర్త్‌డే సెలబ్రేట్ చేసుకుంది. అయితే, తన పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన అందరికీ కృతజ్ఞలు తెలుపుతూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పోస్ట్ పెట్టింది అలయా. ఈ పోస్ట్‌లో తన పుట్టినరోజు వేడుకకు సంబంధించి ఒక ఫొటోను పొందుపరిచింది. ఈ ఫొటోలో అలయా బికినీలో దర్శనమిచ్చింది. అంటే, సముద్ర తీరంలో బికినీలో బర్త్‌డేను ఎంజాయ్ చేసింది అలయా. ఈ ఫొటోతో పాటు ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ఒక బూమెరాంగ్ వీడియోను కూడా పోస్ట్ చేసింది. ఈ వీడియోలో అలయా మోకాళ్ల వరకు గౌను, కాళ్లకు హై హీల్స్‌తో కనిపించింది. అంతేకాదు, తన పేరులోని A F అక్షరాలను పెద్దగా మంచి లైటింగ్‌తో పెట్టారు. ఆ అక్షరాల ముందు నుంచి అలయా నడుచుకుంటూ వెళ్తోంది. మొత్తం తన 23వ పుట్టినరోజును ఈ యంగ్ బ్యూటీ ఫుల్‌గా ఎంజాయ్ చేసినట్టుంది. కాగా, ప్రముఖ నటి పూజా బేడి కూతురే ఈ అలయా. ఈ ఏడాది జనవరిలో వచ్చిన ‘జవాని జానేమన్’ సినిమాతో బాలీవుడ్‌కు పరిచయమైంది అలయా. ఈ చిత్రానికి నితిన్ కక్కర్ దర్శకత్వం వహించారు. 21 ఏళ్ల గర్భవతిగా ఈ సినిమాలో అలయా కనిపించింది. అలయాకు తండ్రిగా సైఫ్ అలీ ఖాన్, తల్లిగా టబు నటించారు. ఈ సినిమా విడుదలైన తరవాత అలయా కూడా నెపోటిజం విమర్శలను ఎదుర్కొన్నారు. అయితే, తనపై వచ్చిన నెపోటిజం విమర్శలను ఆమె తిప్పి కొట్టారు కూడా. ఇండస్ట్రీలో అవకాశాల కోసం ప్రయత్నించే బయటి వ్యక్తులతో పోలిస్తే తమకు ఛాన్స్ కాస్త ఎక్కువగానే ఉంటుందని అలయా అభిప్రాయపడింది. తాము 10 సార్లు ఆడిషన్స్‌లో రిజెక్ట్ అయితే.. బయట వాళ్లు 100 సార్లు రిజెక్ట్ కావచ్చని అంది. తమ పోరాటంతో పోలిస్తే వాళ్ల పోరాటం ఎక్కువగానే ఉంటుందని ఒప్పుకుంది. అంతమాత్రాన తమ వద్ద ప్రతిభ లేదని కాదని కూడా చెప్పింది. ఇండస్ట్రీలో ప్రియాంక చోప్రా, అలియా భట్, దీపికా పదుకొనే అంటే తనకు ఇష్టమని.. అయితే బాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకోవాలి అనేది తన కోరిక అని చెప్పింది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2Jrm33e
v

అమ్మ మాటలు కదిలించాయి.. అందుకే నటుడినయ్యా: రావు రమేష్

తన విలనిజంతో ఎందరో ప్రేక్షకులను ఆకట్టుకున్న నటుడు . తండ్రిని మించిన కొడుకుగా ఇప్పుడు అంతకంటే ఎక్కువగానే ఇండస్ట్రీలో రాణిస్తున్నారు. విలనిజంతో పాటు కామెడీ, సెంటిమెంట్‌ పాత్రలను అద్భుతంగా పండిస్తూ ప్రత్యేకత చాటుకుంటున్నారు. బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన ‘సీమసింహం’తో టాలీవుడ్‌కి పరిచయమైన రమేష్‌కు... ‘కొత్త బంగారు లోకం’, ‘గమ్యం’ సినిమాలు బ్రేక్ ఇచ్చాయి. Also Read: అయితే రావు రమేష్‌కు అసలు నటన అంటే ఆసక్తి లేదంటే నమ్మగలమా. అవును ఇండస్ట్రీకి రాకముందు రమేష్‌ దర్శకుడు అవుదామనుకున్నారట. ఇదే విషయాన్ని తల్లికి చెప్పగా.. ‘డైరెక్టర్ కావాలంటే లెన్స్ తెలిస్తే సరిపోదు.. 24 విభాగాలపైనా పట్టు ఉండాలి, జీవితం తెలియాలి. ముళ్ల బాట దాటుకుని వెళ్లిన తర్వాతే వెలుగు కనిపిస్తుంది. ముందు నటుడిగా నిరూపించుకో’ అని చెప్పారంట. తల్లి చెప్పిన మాటలతో మనసు మర్చుకున్న రావు రమేష్‌ డైరెక్షన్ ఆలోచనను పక్కన పెట్టి నటుడయ్యారట. ఈ విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో ఆయనే స్వయంగా చెప్పారు. Also Read:


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2VdrBko
v

ప్రభాస్ ‘ఆదిపురుష్’.. సీతగా కృతి సనన్ ఖరారు!

‘రాధే శ్యామ్’ తరవాత రెబల్ స్టార్ చేయబోతున్న భారీ చిత్రం ‘ఆదిపురుష్’. సుమారు రూ. 500 కోట్ల బడ్జెట్‌తో బహుభాషా చిత్రంగా రూపొందుతోన్న ఈ ఎపిక్ డ్రామా ప్రీ ప్రొడక్షన్ వర్క్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. ఓం రౌత్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాను టి-సిరీస్ అధినేత భూషన్ కుమార్ నిర్మిస్తున్నారు. అయితే, ఈ చిత్రంలో ప్రభాస్ సరసన సీతగా నటించడానికి బాలీవుడ్ నటి కృతి సనన్ ఖరారు చేశారని సమాచారం. ఈ సినిమాలో ప్రభాస్ రాముడిగా కనిపించనున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ ప్రతికథానాయకుడిగా లంకేశ్ పాత్ర పోషిస్తున్నారు. అయితే, సీత పాత్ర పోషించబోయే నటిని ఇప్పటి వరకు ఖరారు చేయలేదు. సీత పాత్రను పోషించబోయే నటీమణుల జాబితాలో ఇప్పటి వరకు అనుష్క శెట్టి, అనుష్క శర్మ, కియారా అద్వానీ, కీర్తి సురేష్ పేర్లు వినిపించాయి. అయితే, కృతి సనన్‌ను ఫైనలైజ్ చేసినట్టు ముంబై మిర్రర్ స్పష్టం చేసింది. Also Read: నిజానికి కృతి సనన్ టాలీవుడ్ ద్వారానే వెండితెరకు పరిచయమయ్యారు. మహేష్ బాబు సరసన ‘1 నేనొక్కడినే’ సినిమాలో నటించి తెరంగేట్రం చేశారు. ఆ తరవాత అక్కినేని నాగచైతన్యతో ‘దోచేయ్’ సినిమాలో నటించారు. అనంతరం బాలీవుడ్‌కు చెక్కేసి అక్కడ బిజీ స్టార్ అయిపోయారు. కృతి సనన్ చేతిలో ప్రస్తుతం మూడు సినిమాలు ఉన్నాయి. అన్నీ షూటింగ్ దశలోనే ఉన్నాయి. ఇప్పుడు ‘ఆదిపురుష్’ లాంటి భారీ ఆఫర్ కృతి తలుపు తట్టింది. త్వరలోనే సీత పాత్రధారిగా కృతి సనన్‌ను పరిచయం చేయనున్నారట. వచ్చే ఏడాది జనవరి నుంచి ‘ఆదిపురుష్’ షూటింగ్ ప్రారంభమవుతుందని సమాచారం. ఒకటే సుధీర్ఘ షెడ్యూల్‌లో సినిమాను పూర్తి చేస్తారట. 3డిలో షూట్ చేయనున్న ఈ సినిమాకు సంబంధించి ప్రస్తుతం ఏర్పాట్లు జరుగుతున్నాయని తెలిసింది. షూటింగ్ చాలా వరకు స్టూడియోలోనే క్రోమా స్క్రీన్‌‌పై జరుగుతుందట. ‘అవతార్’, ‘స్టార్ వార్స్’ వంటి భారీ హాలీవుడ్ సినిమాలకు పనిచేసిన అంతర్జాతీయ స్థాయి వీఎఫ్ఎక్స్ టెక్నీషియన్స్‌ను ఇప్పటికే ఓం రౌత్, భూషన్ రంగంలోకి దించారని అంటున్నారు. రామాయణం ఆధారంగా రూపొందుతోన్న ఈ చిత్రాన్ని 2022 ఆగస్టు 11న హిందీ, తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో విడుదల చేయనున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3mc3bDE
v

కీర్తి సురేష్ తల్లి కూడా స్టార్ హీరోయినే.. చిరంజీవితో బ్లాక్‌బస్టర్‌ మూవీ..

సినీ ఇండస్ట్రీలో వారసత్వం అన్నది సాధారణమే. హీరోలుగా, విలన్లుగా రాణించిన చాలామంది తమ వారసులను కూడా సినీ పరిశ్రమలో తీసుకొస్తూనే ఉన్నారు. తెలుగులో ఇప్పుడున్న హీరోల్లో చాలా తక్కువ మంది మాత్రమే ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చారు. అయితే హీరోలే కాదు అలనాటి హీరోయిన్లలో కొందరు తమ కూతుళ్లను హీరోయిన్లుగా ఇండస్ట్రీలో రాణిస్తున్నారు. అలాంటి వారిలో ఒకరు. తెలుగు, తమిళ భాషల్లో టాప్ హీరోయిన్‌గా ఎదిగిన కీర్తి సురేష్ తల్లి ఒకప్పుడు అగ్ర హీరోయిన్‌గా కొనసాగారు. తెలుగు సినిమాల్లో కూడా నటించిన విషయం కొద్ది మందికి మాత్రమే తెలుసు. Also Read: తమిళనాడులోని కన్యాకుమారి జిల్లా నాగర్‌ కోయిల్‌లో 1963లో పుట్టిన మేనక అసలు పేరు పద్మావతి. 1980లో విడుదలైన ‘రమాయి వయసుకు వంతుట్ట’ అనే సినిమా ద్వారా వెండితెరకి ఎంట్రీ ఇచ్చారు. ఆరేళ్లలోనే తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ భాషల్లో కలిపి ఏకంగా 116 సినిమాల్లో నటించారు. అతి తక్కువ సమయంలోనే వంద సినిమాల్లో నటించిన రికార్డు ఆమె సొంతం. చిరంజీవి కెరీర్‌ను మలుపు తిప్పిన ‘పున్నమినాగు’ సినిమాలో మేనక హీరోయిన్‌గా నటించారు. కెరీర్లో బిజీగా ఉన్న సమయంలోనే ప్రముఖ నిర్మాత జి.సురేష్‌ కుమార్‌ని వివాహం చేసుకుని సినిమాలకు గుడ్‌బై చెప్పేశారు మేనక. వీరికి ఇద్దరు కూతుళ్లు. కీర్తి సురేష్‌ మలయాళంలోనే అనేక సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్‌గా నటించి ప్రస్తుతం దక్షిణాదిలో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా కొనసాగుతున్నారు. వందకు పైగా సినిమాల్లో నటించిన మేనకకు జాతీయ ఉత్తమ నటి అవార్డు అందుకోవాలన్న ఆశ కలగానే మిగిలిపోయింది. అయితే ‘మహానటి’ సినిమాతో కీర్తి సురేష్‌ ఆ అవార్డు అందుకోవడంతో మేనక ఉప్పొంగిపోయారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/36dtbJc
v

ప్రముఖ దర్శకుడు శివ తండ్రి కన్నుమూత

ప్రముఖ తెలుగు, తమిళ దర్శకుడు శివ ఇంట విషాదం చోటుచేసుకుంది. ఆయన తండ్రి జయకుమార్ కన్నుమూశారు. జయకుమార్ షార్ట్ ఫిలింస్, డాక్యుమెంటరీలకు ఫొటోగ్రాఫర్‌గా పనిచేశారు. 400కు పైగా షార్ట్ ఫిలింస్, డాక్యుమెంటరీలు జయకుమార్ ఖాతాలో ఉన్నాయి. జయకుమార్‌కు శివ పెద్ద కుమారుడు. రెండో కుమారుడు బాల నటుడిగా, దర్శకుడిగా మలయాళ సినీ పరిశ్రమలో రాణిస్తున్నారు. కుమార్తె విదేశాల్లో శాస్త్రవేత్తగా స్థిరపడ్డారు. జయకుమార్ చాలా ఏళ్లుగా చెన్నైలోని విరుగంబాక్కంలో ఉంటున్నారు. చుట్టుపక్కల వారి బాగోగులు చూసుకోవడం, సామాజిక సేవలో జయకుమార్గా యాక్టివ్‌గా ఉండేవారు. జయకుమార్ తండ్రి వేలన్ కూడా సినీ పరిశ్రమకు చెందినవారే. ఆయన నిర్మాతగా, స్క్రిప్ట్ రైటర్‌గా సినీ పరిశ్రమకు సేవలందించారు. ఇక జయకుమార్ పెద్ద కుమారుడు శివ మొదట సినిమాటోగ్రాఫర్‌గా ప్రయాణం మొదలుపెట్టారు. తెలుగులో ‘శ్రీరామ్’, ‘నేనున్నాను’, ‘గౌతమ్ ఎస్ఎస్‌సీ’, ‘బాస్’ చిత్రాలకు సినిమాటోగ్రాఫర్‌గా పనిచేశారు. అయితే, 2008లో గోపీచంద్ హీరోగా వచ్చిన ‘శౌర్యం’ చిత్రంతో దర్శకుడిగా మారారు. ఆ తరవాత వరసగా ‘శంఖం’, ‘దరువు’ సినిమాలకు దర్శకత్వం వహించారు. తెలుగులో శివకు పెద్దగా గుర్తింపు రాలేదు. కానీ, తమిళంలో మాత్రం స్టార్ డైరెక్టర్ హోదాను పొందారు. కార్తి హీరోగా వచ్చిన ‘సిరుతాయి’ సినిమాతో తమిళ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన శివ.. అక్కడ ఆరంగేట్ర చిత్రంతోనే ఆకట్టుకున్నారు. ఆ తరవాత స్టార్ హీరో అజిత్‌తో వరుసగా ‘వీరం’, ‘వేదాళం’, ‘వివేగం’, ‘విశ్వాసం’ చిత్రాలను అందించి శివ స్టార్ డైరెక్టర్ అయ్యారు. ప్రస్తుతం సూపర్ స్టార్ రజినీకాంత్‌తో ‘అన్నాతే’ సినిమాను రూపొందిస్తున్నారు. Also Read:


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2VdfHXC
v

హీరో రాజశేఖర్ తన రెండిళ్లను అమ్ముకున్నారట.. ఇందులో నిజమెంత?

చాలా మంది నటులు తాము డాక్టర్ కావాలనుకుని యాక్టర్ అయ్యామని చెబుతుంటారు. కానీ మాత్రం డాక్టర్ అయ్యాకే యాక్టర్‌గా మారారు. తమిళ కుటుంబానికి చెందిన రాజశేఖర్ 1962, ఫిబ్రవరి 4న తమిళనాడులోని తానే జిల్లాలోని లక్ష్మీపురంలో జన్మించారు. ఆయన తండ్రి ఓ పోలీసు. దీంతో తాను కూడా పోలీస్ కావాలని రాజశేఖర్ అనుకునేవారట. అయితే తండ్రి ప్రోత్సాహంతో డాక్టర్ కోర్సు చదివారు. అయితే కాలేజీలో చదువుతున్న సమయంలో.. నువ్వు చాలా బాగుంటావు.. హీరోగా ప్రయత్నించొచ్చు కదా అని స్నేహితులు ప్రోత్సహించేవారట. దీంతో సినిమాలపై ఆసక్తి పెంచుకున్న ఆయన హీరో కావాలనుకున్నారు. దీంతో ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్‌లో ట్రైనింగ్ కోసం దరఖాస్తు చేశారు. అదే సమయంలో ఎమ్మెస్ సీటు రావడంతో దాన్ని వదులుకుని మరీ సినిమాల్లోకి వచ్చారు. ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్‌లో శిక్షణ పొందుతున్న సమయంలోనే ప్రసిద్ధ దర్శకుడు భారతీరాజా తాను తీయబోయే సినిమాలో కొత్త హీరో కోసం వెతుకుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న రాజశేఖర్ ఆయన్ని కలుసుకుని తన టాలెంట్ చూపించి ఛాన్స్ కొట్టేశారు. అయితే ఆ సినిమా సెట్స్‌పైకి వెళ్లేందుకు చాలా సమయం పట్టింది. ఈలోగా ఓ కొత్త దర్శకుడు రాజశేఖర్‌ని కలిసి కథ వినపించగా ఆయనకు నచ్చిందట. దీంతో భారతీరాజాకు అసలు విషయం చెప్పగా నీ ఇష్టమని చెప్పారట. Also Read: దీంతో రాజశేఖర్ ఆ కొత్త దర్శకుడితో సినిమా మొదలుపెట్టి.. కొద్దిరోజుల తర్వాత భారతీరాజాను కలిశారు. సినిమా ఎప్పుడు మొదలుపెడదామని ఆయన్ని అడగ్గా ‘నేను కొత్త హీరోతో సినిమా చేద్దామనుకున్నాను. కానీ ఇప్పుడు నువ్వు కొత్త హీరోవి కాదు’ అని చెప్పేశారట. దీంతో మనస్తాపం చెందిన రాజశేఖర్ అక్కడి నుంచి నిరాశగా వెనుదిరిగారు. కొద్దిరోజుల తర్వాత భారతీరాజా ఆయన్ని పిలిచి అదే సినిమాలో విలన్ వేషం ఇచ్చారు. ఈ సినిమా విజయం సాధించడంతో రాజశేఖర్‌కు తమిళంలో అవకాశాలు పెరిగాయి. మరోవైపు ఇదే సినిమా తెలుగులో ‘అరుణ కిరణం’ పేరుతో రీమేక్ చేయగా రాజశేఖర్ హీరోగా టాలీవుడ్‌కు పరిచయమయ్యారు. Also Read: ఆ తర్వాత ‘అంకుశం’ సినిమాలో పవర్‌ఫుల్ పోలీసాఫీసర్‌గా విశ్వరూపం చూపించిన రాజశేఖర్ తెలుగులో అగ్రహీరోగా ఎదిగారు. ముఖ్యంగా పోలీసు కథలంటే దర్శక నిర్మాతలు ఆయన్నే ఫస్ట్ ఛాయిస్‌గా ఎంచుకునేవారు. అలా వరుస సినిమాలు చేస్తూ తెలుగు చిత్ర పరిశ్రమలో స్థిరపడిపోయారు. ఈ క్రమంలోనే హీరోయిన్ జీవితలో ప్రేమలో పడి 1991లో ఆమెను వివాహం చేసుకున్నారు. వీరికి శివానీ, శివాత్మిక అనే ఇద్దరు కుమార్తెలున్నారు. మధ్యలో వరుసగా సినిమాలన్నీ ప్లాఫులు కావడంతో రాజశేఖర్ ఆర్థికంగా ఇబ్బంది పడ్డారు. దీనికి తోడు సొంతంగా నిర్మించిన సినిమాలు కూడా ఆయనకు నష్టాలనే మిగిల్చాయి. ఈ ఆర్థిక కష్టాల నుంచి బయటపడేందుకు చెన్నైలో తనకున్న రెండిళ్లను ఆయన అమ్మేశారని తెలిసిన వాళ్లు చెబుతుంటారు. కొంతకాలం తర్వాత ‘ఎవడైతే నాకేంటి’ సినిమాతో బ్లాక్‌బస్టర్ అందుకున్న రాజశేఖర్ టాలీవుడ్‌లో మళ్లీ పుంజుకున్నారు. గరుడవేగ, కల్కి చిత్రాలు ఆయన మార్కెట్‌ని పెంచాయి. ఇటీవలే కరోనా బారిన పడి కోలుకున్న ఆయన మళ్లీ మేకప్ వేసుకునేందుకు ఉత్సాహపడుతున్నారు. Also Read:


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2JjX55B
v

RGV: పవన్ కళ్యాణ్‌పై వర్మ సెటైర్స్.. చిర్రెత్తిపోయిన మెగా ఫ్యాన్స్! స్వీట్ వార్నింగ్

వివాదాస్పద దర్శకుడు ఏ చిన్న సందర్భం దొరికినా దానిపై తనదైన కామెంట్స్ చేస్తూ సోషల్ మీడియాను దున్నేస్తుంటారని మనందరికీ తెలుసు. సినీ, రాజకీయాలపైనే గాక ఎప్పటికప్పుడు తాజా పరిస్థితులపై ఫోకస్ పెడుతూ ఓపెన్ అవుతుంటారు వర్మ. ఈ నేపథ్యంలోనే గ్రేటర్ ఎన్నికలపై కామెంట్స్ చేస్తూ పవన్ కళ్యాణ్‌పై పంజా విసురుతున్న ఆయన తీరుపై మెగా అభిమానులు మండిపడుతున్నారు. పవన్ కళ్యాణ్‌పై నెగెటివ్ కామెంట్స్ చేయడం ఆపాలంటూ వార్నింగులు ఇస్తున్నారు. దీంతో ఈ ఇష్యూ జనాల్లో హాట్ టాపిక్ అయింది. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ పోటీ చేస్తుందని ప్రకటించడం, ఆ తర్వాత పోటీ లేదని చెప్పడాన్ని తన ఆయుధంగా మలచుకొని పవన్‌పై సెటైర్స్ వేయడం ప్రారంభించారు వర్మ. పవన్ కళ్యాణ్ మంచి ఎంటర్టైనర్ అని, అందుకే రాజకీయాల్లో తాను అతన్నే అనుసరిస్తానని అంటూ తనదైన కోణంలో లాజిక్ అప్లై చేస్తూ కామెంట్ చేశారు ఆర్జీవీ. ఇలాగే గతంలో కూడా ఆయన పవన్ కళ్యాణ్‌పై వర్మ ఓ రేంజ్ కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. దీంతో చిర్రెత్రిపోయిన మెగా ఫ్యాన్స్ వర్మపై ఫైర్ అవుతున్నారు. Also Read: లాజికల్‌గా మాట్లాడినంత మాత్రాన తామేమీ పిచ్చోళ్ళం కాదని, పవన్ కళ్యాణ్‌ని పొగుడుతున్నారా? లేక సెటైర్స్ వేస్తున్నారా? అనేది అర్థం చేసుకోగలమంటూ వర్మపై కౌంటర్లు వేస్తున్నారు మెగా ఫ్యాన్స్. ఇకనైనా అలాంటి సెటైర్లు ఆపాలని, లేదంటే ఊరుకునేది లేదంటూ సోషల్ మీడియా ద్వారా వార్నింగ్స్ ఇస్తున్నారు. దీంతో పవన్- వర్మ ఇష్యూ మరోసారి చర్చల్లో నిలిచింది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2KRfZ4N
v

‘సోలో’గా వస్తోన్న సాయి తేజ్.. క్రిస్మస్‌కి థియేటర్లలో సందడే సందడి

సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ హీరోగా ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంక‌టేశ్వర సినీ చిత్ర బ్యాన‌ర్‌పై బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మించిన చిత్రం ‘సోలో బ్రతుకే సో బెటర్’. సుబ్బు ద‌ర్శక‌త్వం వహించారు. నభా నటేష్ హీరోయిన్‌గా నటించారు. ఈ చిత్రాన్ని జీ స్టూడియోస్ సంస్థ విడుదల చేస్తోంది. క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 25న థియేటర్లలో విడుదల చేస్తున్నారు. ఈ విడుదల తేదీని అధికారికంగా శనివారం ప్రకటించారు. ఈ సందర్భంగా సుప్రీమ్ హీరో సాయితేజ్ మాట్లాడుతూ.. ‘‘ఇన్ని రోజులు మ‌నం ఎలాంటి ప‌రిస్థితులను ఎదుర్కొన్నామో మ‌న‌కు తెలుసు. ఈ నేప‌థ్యంలో ప్రేక్షకుల‌ను మ‌ళ్లీ ఎంట‌ర్‌టైన్ చేయ‌డానికి మేం సిద్ధమ‌వుతున్నాం. అందులో భాగంగా క్రిస్మస్‌కు మిమ్మల్ని న‌వ్వించ‌డానికి వస్తున్నాం. అన్ని ఎమోష‌న్స్ ఉన్న ఈ సినిమా ఫుల్ ప్యాక్‌డ్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా డిసెంబ‌ర్ 25న మీ ముందుకు వ‌స్తోంది’’ అని అన్నారు. నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్ మాట్లాడుతూ.. ‘‘సోలో బ్రతుకే సో బెట‌ర్ సినిమాను క్రిస్మస్ సంద‌ర్భంగా డిసెంబ‌ర్ 25న విడుద‌ల చేస్తుండ‌టం చాలా ఆనందంగా ఉంది. మా సినిమా అంద‌రినీ ఎంట‌ర్‌టైన్ చేస్తుంద‌ని న‌మ్ముతున్నాం’’ అని చెప్పారు. అయితే, తెలంగాణలో థియేటర్లు తెరుచుకోవడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఏపీ ప్రభుత్వం మాత్రం ఇంకా జీవో జారీ చేయలేదు. మరోవైపు, థియేటర్లు సినిమా విడుదల చేస్తూ రిలీజ్ డేట్‌ను ప్రకటించిన తొలి చిత్రం ఇదే. మొత్తం మీద సాయి తేజ్ ‘సోలో’గా వచ్చేస్తున్నారు. ఈ చిత్రానికి తమన్ సంగీతం సమకూర్చారు. వెంకట్ సి. దిలీప్ సినిమాటోగ్రఫీ అందించారు. నవీన్ నూలి ఎడిటర్. అవినాష్ కొల్ల ఆర్ట్ డైరెక్టర్. Also Read:


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/36c9r8R
v

‘కూలీ నెం. 1’ ట్రైలర్: నీటి అడుగున వరుణ్, సారా లిప్ లాక్.. మండిపడుతున్న గోవింద ఫ్యాన్స్

వరుణ్ ధావన్, సారా అలీ ఖాన్ తొలిసారి జంటగా నటించిన చిత్రం ‘కూలీ నెం. 1’. 1995లో గోవింద, కరిష్మా కపూర్ హీరోహీరోయిన్లుగా వచ్చిన సూపర్ హిట్ ఫిల్మ్ ‘కూలీ నెం. 1’కు ఇది రీమేక్. పాత ‘కూలీ నెం. 1’కు దర్శకత్వం వహించిన డేవిడ్ ధావన్ ఈ రీమేక్‌కూ దర్శకత్వం వహించారు. ఈయన హీరో వరుణ్ ధావన్ తండ్రి. డేవిడ్ ధావణ్‌కు దర్శకుడిగా ఇది 45వ చిత్రం. ఈ సినిమాను క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25న అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదల చేస్తున్నారు. ఇదిలా ఉంటే, చిత్ర ప్రచారంలో భాగంగా ‘కూలీ నెం. 1’ ట్రైలర్‌ను శనివారం విడుదల చేశారు. ఈ ట్రైలర్‌ ఎంటర్‌టైనింగ్‌గా అనిపిస్తోంది. ప్రస్తుత జనరేషన్‌కు తగ్గట్టుగా సినిమాను గ్రాండ్‌గా తీశారు. అయితే, ఆ పాత కామెడీ డోస్‌ను మాత్రం తగ్గించలేదు. దీనికి తోడు వరుణ్ ధావన్, సారా అలీ ఖాన్ కెమిస్ట్రీ అదిరిపోయింది. నీటి అడుగున వరుణ్, సారా లిప్‌లాక్ సీన్ ప్రస్తుతం వైరల్‌గా మారింది. ఈ సీన్‌లో వరుణ్ షర్ట్ లేకుండా షార్ట్స్‌లో ఉండగా.. సారా బికినీలో అదరగొట్టింది. ఇదిలా ఉంటే, ‘కూలీ నెం. 1’ ట్రైలర్ చూసిన కొంత మంది సినీ ప్రియులు పెదవి విరుస్తున్నారు. ట్రైలర్ బాగాలేదని సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. ఇక గోవింద అభిమానులు అయితే వరుణ్ ధావన్ ఓవర్ యాక్షన్ చేస్తున్నాడని విమర్శిస్తున్నారు. మొత్తం ఈ ట్రైలర్‌కు సోషల్ మీడియాలో మిశ్రమ స్పందన వస్తోంది. అప్పట్లో ‘కూలీ నెం. 1’ సినిమా ఒక సెన్సేషన్. గోవింద తన పెర్ఫార్మెన్స్, కామెడీ టైమింగ్‌తో కడుపుబ్బా నవ్వించారు. కరిష్మా కపూర్‌కు తొలి భారీ విజయం. మరీ ఈ కొత్త ‘కూలీ నెం. 1’ ఏమవుతుందో చూడాలి. ఈ చిత్రంలో పరేష్ రావల్, జానీ లీవర్, రాజ్‌పాల్ యాదవ్ కీలక పాత్రలు పోషించారు. Also Read:


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/36cjzhZ
v

శ్వేత దుస్తుల్లో దేవకన్యలా మెరిసిపోతున్న ప్రగ్యా జైస్వాల్..

‘కంచె’ సినిమాతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది . అనంతరం నాగార్జున సరసన ‘ఓం నమో వేంకటేశాయ’ చిత్రంలో మెరిసింది. తన అందాలు ఎంతగా ఆరబోసినా ఆమె నటించిన సినిమాలన్నీ ప్లాఫ్ కావడంతో అవకాశాలు తగ్గిపోయాయి. ఇదే సమయంలో బోయపాటి శ్రీను, నందమూరి బాలకృష్ణ కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమాలో ప్రగ్యా ఛాన్స్ దక్కించుకుంది. ఈ సినిమాలో ముందుగా సాయేషా సైగల్‌ని అనుకున్నప్పటికీ కొన్ని కారణాలతో ఆమె ప్రాజెక్టు నుంచి తప్పుకుంది. దీంతో ఈ అవకాశం ప్రగ్యాకు దక్కింది. బోయపాటి డైరెక్షన్లో వచ్చిన ‘జయ జానకీ నాయక’ సినిమాలోనూ ఓ కీలక పాత్రలో ప్రగ్యా నటించింది. ఆ పరిచయంతోనే బోయపాటి తన నెక్ట్స్ సినిమాలో ఆమెకు ఛాన్స్ ఇచ్చాడట. సోషల్‌మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే ప్రగ్యా జైస్వాల్ తన ఫోటోలను పోస్ట్ చేస్తూ ఫ్యాన్స్‌ను అలరిస్తూ ఉంటుంది. తాజాగా తెల్లటి దుస్తుల్లో మెరిసిపోతూ ఆమె దిగిన ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్లో పోస్ట్ చేసింది. ఈ ఫోటోలను చూసిన నెటిజన్లు నిజంగానే దేవకన్యలా ఉన్నావంటూ తెగ పొగిడేస్తున్నారు. Also Read:


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3o5b3aI
v

చిరంజీవి కూతుళ్లతో నిహారిక నైట్ పార్టీ.. మెగా డాటర్స్ బాగానే చిల్ అయినట్లున్నారే!

మెగా ఇంట పెళ్లి సంబరాలు షురూ అయ్యాయి. నాగబాబు కూతురు, మెగా డాటర్ వేడుకల కోసం మెగా ఫ్యామిలీ లేడీస్ అంతా ఒక్కచోట చేరి తెగ సందడి చేస్తున్నారు. చిరంజీవి ఇద్దరు కూతుళ్లు, అక్కలైన సుస్మిత, శ్రీజలకు స్పెషల్ పార్టీ ఇచ్చింది నిహారిక. కొద్దిరోజుల క్రితమే గోవాలో స్నేహితులతో కలిసి బ్యాచిలర్ పార్టీ చేసుకున్న నిహారిక.. ఇప్పుడు తన సిస్టర్స్ అందరికీ గ్రాండ్ పార్టీ ఇచ్చినట్లు తెలుస్తోంది. మూడు నెలల క్రిందట మెగా అభిమానులను సర్‌ప్రైజ్ చేస్తూ తాను 'మిస్' నుంచి 'మిసెస్ నిహా'గా ప్రమోట్ అవుతున్నానని, తనకు కాబోయే భర్త ఇతనే అంటూ చైతన్య ఫోటోను స్వయంగా షేర్ చేసిన నిహారిక.. ఆ తర్వాత వెంటనే నిశ్చితార్ధ కార్యక్రమాన్ని ఫినిష్ చేసేసింది. ఇక డిసెంబర్ 9వ తేదీన డెస్టినేషన్ వెడ్డింగ్ ఉంటుందని ఇటీవలే నాగబాబు ప్రకటించడంతో మెగా ఇంట సందడి మొదలైంది. నెల రోజుల ముందునుంచే ఫ్యామిలీలో సెలబ్రేషన్స్ జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే గత రాత్రి మెగా సిస్టర్స్ అంతా కలిసి చిల్ అయిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. Also Read: ఈ ఫోటోలను నిహారిక తన ఇన్స్‌స్టాగ్రామ్ ద్వారా పంచుకుంది. మెగా డాటర్స్ అందరూ కలిసి ఫుల్లుగా ఎంజాయ్ చేసినట్లు ఈ ఫోటోలు చూస్తుంటే అర్థమైపోతోంది. నిహారిక పోస్ట్ చూసి ఆమెకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు మెగా ఫ్యాన్స్. ఇకపోతే ఆమె పెళ్లి వేదికైన రాజస్థాన్‌లోని ఉదయ్ పూర్‌లోని కోటను అద్భుతంగా అలంకరిస్తున్నారని తెలిసింది. ఇటీవలే అక్కడికి వెళ్లి పెళ్లి ఏర్పాట్లను ప్రత్యక్షంగా పర్యవేక్షించి వచ్చింది నిహారిక. నిహారికకు కాబోయే భర్త పూర్తిపేరు జొన్నలగడ్డ వెంకట చైతన్య. ఇతను గుంటూరు రేంజ్ ఐజీ ప్రభాకర్ రావు కుమారుడు. ఇటీవలే కాబోయే భర్త చైన్యతో పెళ్లికి ముందే దీపావళి సంబరాలు చేసుకుంది నిహారిక. ప్రస్తుతం నిహారిక పెళ్లి సంగతులు, నిహారిక- చైతన్య జోడీ ఫొటోలతో సోషల్ మీడియా హోరెత్తిపోతోంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3fJPYzJ
v

ఓటీటీలోకి విజయ్ ‘మాస్టర్’... రూ.100కోట్లతో డీల్!

తమిళ స్టార్ హీరో క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అతడి సినిమా వచ్చిదంటే బాక్సాఫీస్ బద్దలు కావాల్సిందే. ఇటీవల ఆయన నటించిన సినిమాలన్నీ ఒకదానికి మించి మరొకటి విజయాలు సాధిస్తూ వందల కోట్ల కలెక్షన్లు రాబట్టాయి. దీంతో ఇప్పడు కోలీవుడ్‌లో అందరి దృష్టి ‘’పైనే ఉంది. ‘ఖైదీ’తో ఇండస్ట్రీకి బ్లాక్‌బస్టర్ హిట్ ఇచ్చిన లోకేష్ కనగరాజ్ డైరెక్టర్‌ కావడంతో ‘మాస్టర్’పై అంచనాలు మరింత పెరిగాయి. ఈ సినిమా టీజర్ యూట్యూబ్‌లో రికార్డలు సృష్టిస్తోంది. రెండు వారాల్లోనే 40 మిలియన్ వ్యూస్ సాధించింది. 24 గంటల్లోనే 2 మిలియన్ల లైకులతో సెన్సేషన్‌ క్రియేట్ చేసింది. Also Read: ‘మాస్టర్’ లాంటి భారీ బడ్జెట్‌ సినిమా థియేటర్లలోనే రిలీజ్ చేస్తామని, ఓటీటీ వైపు వెళ్లే ఆలోచన లేదని నిర్మాతలు గతంలోనూ ప్రకటించారు. తమిళనాడు థియేటర్స్‌ యజమానుల సంఘం సైతం విజయ్‌ సినిమా ఓటీటీలో రిలీజ్‌ చేస్తే ఒప్పుకునేది లేదని హెచ్చరించింది. అయితే తాజాగా జరుగుతున్న ప్రచారం ప్రకారం.. ‘మాస్టర్‌’ ఏకంగా రూ.100కోట్లకు నెట్‌ఫ్లిక్స్‌కి అమ్మేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం థియేటర్ల పరిస్థితి అంత బాగోలేదు. థియేటర్లు పూర్తిస్థాయిలో తెరిచినా ప్రేక్షకులు వస్తారన్న నమ్మకం లేదు. అందుకే దర్శక నిర్మాతలు మనసు మార్చుకుని ఈ సినిమాని ఓటీటీకి ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ వార్తలపై చిత్ర యూనిట్‌ ఇంకా స్పందించలేదు. ఈ సినిమాలో విజయ్ సేతుపతి విలన్‌‌గా నటించారు. మాళవికా మోహనన్ హీరోయిన్. ఆండ్రియా, అర్జున్ దాస్, శాంతను భాగ్యరాజ్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. మరోవైపు విజయ్ తన 65వ సినిమా కోసం రెడీ అవుతున్నాడు. సన్ పిక్చర్స్ నిర్మించే ఈ చిత్రం ‘మాస్టర్’ రిలీజ్ అనంతరం సెట్స్‌పైకి వెళ్లనుంది. Also Read:


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/36euJCG
v

కమెడియన్ శంకర్ మేల్కొటే.. ఓ కంపెనీకి సీఈఓ... సినిమాల్లో అవే పాత్రలు

తెలుగు సినీ పరిశ్రమలో ఎంతో మంది హాస్యనటులున్నా కొందరు మాత్రం కలకాలం గుర్తుండిపోతారు. అలాంటి వారిలో ఒకరు. ప్రతి సినిమాలోనూ పిల్లి గడ్డంతో బ్లాక్‌ సూట్‌లోనే దర్శనమివ్వడం ఆయన ప్రత్యేకత. మేల్కొటే సినీ రంగ ప్రవేశం చాలా విచిత్రంగా జరిగిందట. ఉషాకిరణ్ మూవీస్ అధినేత రామోజీరావుకు చెందిన మార్గదర్శి చిట్‌ఫండ్స్‌ సంస్థలో మేల్కొటే పనిచేసేవారు. ఆ సంస్థ కోసం తీసిన ప్రకటనలో ఆయన తొలిసారి నటించారు. కొద్దిరోజుల తర్వాత ఉషాకిరన్ మూవీస్ నిర్మించిన ‘శ్రీవారికి ప్రేమలేఖ’ సినిమాలో హీరో బాస్ పాత్ర కోసం నటుడిని అన్వేషిస్తుండగా మేల్కొటేని పిలిచారట రామోజీరావు. Also Read: అక్కడే ఉన్న గేయ రచయిన వేటూరి సుందర రామ్మూర్తి మేల్కొటేని చూసి ఈయనకు స్క్రీన్ టెస్ట్ అవసరం లేదని రామోజీరావుకు చెప్పారట. ఆ సినిమాలో తెలుగు రాని బాస్‌ పాత్రలో మేల్కొటే ప్రేక్షకులను అలరించారు. అప్పటి నుంచి ఇప్పటివరకు సుమారు 180 చిత్రాల్లో ఆయన నటించారు. ఒకట్రెండు సినిమాల్లో తప్ప అన్ని సినిమాల్లోనూ బాస్‌గానే కనిపించినా ప్రేక్షకుల ఎప్పుడూ బోర్ కొట్టలేదు. సినిమాల్లో ఏదైనా కామెడీ బాస్ పాత్ర ఉందంటే ఇప్పటికీ దర్శక నిర్మాత ఫస్ట్ ఛాయిస్ ఆయనే. అయితే సినిమాల్లో చిన్నచిన్న వేషాలు చేస్తున్నంత మాత్రాన మేల్కొటే బ్యాక్‌గ్రౌండ్ తక్కువేమోనని అనుకోవద్దు. ఆయన పర్సనల్ లైఫ్ గురించి చాలామందికి తెలియదు. నిజానికి ఆయన హైదరాబాద్‌లోని ఓ మార్కెటింగ్ కంపెనీకి సీఈవోగా పనిచేశారు. అంతేకాదు ఆయన అల్లుడు ఎవరో కాదు.. మాజీ రంజీ క్రికెటర్, బీసీసీఐ మాజీ జనరల్ మేనేజర్‌ ఎంపీ శ్రీధర్. మేల్కొటే కూతురు రమాని శ్రీధర్ వివాహం చేసుకున్నారు. మేల్కొటే కొడుకు అమెరికాలో ఓ సంస్థలో సీనియర్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నారు. సినిమాల్లో వేసే పాత్రల్లాగానే మేల్కొటే నిజజీవితంలోనూ బాస్‌గానే పనిచేయడం విశేషం. Also Read:


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3mhJA4S
v

'మిథునం' బాలీవుడ్ రీమేక్.. బాలసుబ్రహ్మణ్యం పాత్రలో అమితాబ్ బచ్చన్!

లెజెండరీ సింగర్ ఈ లోకాన్ని విడిచి రెండు నెలలు గడిచిపోయినా ఆయన జ్ఞాపకాలు ఇప్పటికీ నెమరు వేసుకుంటున్నారు జనం. గాయకుడిగా, నటుడిగా, డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా తెలుగు ప్రేక్షకుల మదిలో ముద్ర వేసిన ఆయన `మిథునం` సినిమాలో విలక్షణ పాత్ర పోషించి ఆకట్టుకున్నారు. రెండే రెండు పాత్రలతో నటుడు, రచయిత తనికెళ్ల భరణి ఈ సినిమాను రూపొందించారు. 2012లో విడుదలైన ఈ మూవీ విమర్శకుల ప్రశంసలందుకుంది. ఇప్పుడు ఈ సినిమాను హిందీలో రీమేక్ చేయబోతున్నారట. Also Read: బాలీవుడ్‌కు చెందిన ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ ఈ సినిమా రీమేక్ హక్కులను దక్కించుకుందట. ఈ హిందీ రీమేక్‌లో బాలీవుడ్ మెగాస్టార్ .. ఎస్పీ బాలు పోషించిన పాత్రలో నటించబోతున్నట్టు టాక్. అమితాబ్‌కు జంటగా ఒకనాటి అందాల తార రేఖ నటించనున్నారని తెలుస్తోంది. హిందీ ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టుగా కొద్దిగా మార్పులు చేర్పులు చేసి ఈ మూవీ తెరకెక్కించబోతున్నట్టు సమాచారం. ఇక ఈ సినిమాను డైరెక్ట్ చేయబోయేది ఎవరు? ఎప్పుడు స్టార్ట్ అవుతుందనేది అధికారిక వస్తేనే క్లారిటీ వస్తుంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3mfPe7V
v

సునీల్-సలోనీ మరోసారి... ‘మర్యాద రామన్న’ కాంబో రిపీట్!

కమెడియన్‌గా రాణిస్తున్న సమయంలోనే హీరోగా టర్న్ తీసుకున్నాడు సునీల్. తొలి సినిమా ‘అందాల రాముడి’తోనే అలరించిన ఆయన రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ‘’తో హిట్ కొట్టాడు. ఆ తర్వాత హీరోగా నటించిన సినిమాలన్నీ ప్లాఫ్ కావడంతో సునీల్‌కు అవకాశాలు తగ్గిపోయాయి. దీంతో ఇప్పుడు విలన్‌గా మారిన ఇటీవలే ‘కలర్ ఫోటో’తో ఆకట్టుకున్నారు. సుకుమార్, అల్లు అర్జున్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘పుష్ప’లో కూడా సునీల్ విలన్‌గా నటిస్తున్నట్లు సమాచారం. అసలు విషయానికొస్తే... ‘మర్యాద రామన్న’లో ప్రేక్షకులను అలరించిన సునీల్, జంట మరోసారి కలిసి నటించనున్నట్లు తెలుస్తోంది. సునీల్ ప్రస్తుతం వి.ఎన్ ఆదిత్య దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఇందులో హీరోయిన్‌గా సలోనీని సెలక్ట్ చేసినట్లు తెలుస్తోంది. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రానున్నట్లు సమాచారం. ఈ వార్తే గనుక నిజమైతే సునీల్, సలోని కలిసి పదేళ్ల తర్వాత మళ్లీ వెండితెరపై కలిసి సందడి చేయనున్నారు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ పరిసరాల్లో సైలెంట్‌గా జరుగుతోందట. Also Read:


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2Jj1VjJ
v

మీరు సూపర్... ప్రభాస్‌‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన మలయాళ స్టార్

‘బాహుబలి’తో ఆలిండియా స్టార్‌గా ఎదిగారు రెబల్ స్టార్ . దక్షిణాదికి ధీటుగా ఉత్తరాదిలోనూ ఆయనకు భారీ ఫాలోయింగ్ ఉంది. అయితే ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగి ఉండాలన్న సూత్రాన్ని ఆయన తూ.చా.తప్పకుండా పాటిస్తారు. తన సహనటులతో పాటు సీనియర్లకు ఎంతో మర్యాద ఇస్తుంటారాయన. అందుకే ప్రభాస్‌ని కలిసిన ఎవరైనా ఆయన వ్యక్తిత్వానికి ఫిదా అయిపోతారు. Also Read: ఈ కోవలోనే మలయాళం స్టార్‌ జయరాజ్‌ కూడా ప్రభాస్‌ని ఆకాశానికెత్తేశారు. ప్రభాస్, పూజా హెగ్డే జంటగా తెరకెక్కుతున్న ‘రాధేశ్యామ్‌’‌లో జయరామ్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సందర్భంగా ప్రభాస్‌తో దిగిన ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్లో పోస్ట్ చేసిన జయరామ్.. ప్రభాస్‌లో నిజాయతీలోనూ సూపర్ అంటూ పొగిడేశారు. రాధేశ్యామ్ గొప్ప ప్రేమకథా చిత్రమని, అందరి హృదయాలను తాకతుందని జయరామ్ అన్నారు. Also Read:


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2J6umlb
v

వడ్డే నవీన్ మొదటి భార్య ఎవరో తెలిస్తే షాకవుతారు...

‘కోరుకున్న ప్రియుడు’ సినిమాతో తెలుగు సినిమా పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చాడు వడ్డే నవీన్. నిర్మాత వడ్డే రమేష్ వారసుడిగా తెరంగ్రేటం చేసిన ఆయన హీరోగా అనేక సినిమాల్లో నటించారు. అయితే ఆయనకు బ్రేక్ ఇచ్చిన సినిమా మాత్రం ‘పెళ్లి’. ఆ తర్వాత మనసిచ్చి చూడు, మా బాలాజీ, ప్రేమించే మనసు, చాలా బాగుంది లాంటి సినిమాలతో విజయాలు అందుకుని తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకున్నాడు. అయితే కెరీర్లో ఎంత వేగంగా ఎదిగాడో అంతకంటే వేగంగా డౌన్ అయిపోయాడు నవీన్. Also Read: సుమారు 28 సినిమాల్లో హీరోగా నటించిన ఆయన అవకాశాలు తగ్గిపోవడంతో రెండు మూడు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటించాడు. అవికూడా పరాజయం పాలుకావడంతో ఆయన్ని పట్టించుకునేవారు లేకుండా పోయారు. ఆయన నందమూరి కుటుంబానికి అల్లుడని చాలామందికి తెలియదు. వడ్డే రమేష్, నందమూరి కుటుంబాల మధ్య ఎప్పటినుంచో సాన్నిహిత్యం ఉండేది. దీంతో ఎన్టీఆర్ కుమారుడు రామకృష్ణ కూతురైన చాముండేశ్వరిని నవీన్ పెళ్లాడాడు. అయితే కుటుంబ కలహాల కారణంగా కొన్నాళ్లకే వారిద్దరు విడాకులు తీసుకున్నారు. ఆ ప్రభావం కెరీర్‌పై పడటంతోనే నవీన్ సినిమాలకు దూరం కావాల్సి వచ్చిందని అప్పట్లో ప్రచారం జరిగింది. ఓ ఇంటర్వ్యూ సందర్భంగా ఈ విషయంపై స్పందించిన వడ్డే నవీన్.. ఈ ప్రచారాన్ని కొట్టి పడేశారు. విడాకుల కారణంగా కొంతకాలం సినిమాలకు తానే దూరమయ్యానని, ఆ తర్వాత అవకాశాలు రాలేదని చెప్పారు. 2016లో రామ్‌గోపాల్ వర్మ, మంచు మనోజ్ కాంబినేషన్లో వచ్చిన ‘ఎటాక్’ సినిమాలో నవీన్ చివరిగా కనిపించారు. మరో అమ్మాయిని పెళ్లి చేసుకున్న ఆయన ప్రస్తుతం భార్య, పిల్లలతో కలిసి హాయిగా జీవిస్తున్నారు. ఇటీవలే ఆయన కొడుక్కి నిర్వహించిన పంచెకట్టు కార్యక్రమంలో సెలబ్రెటీలందరూ హాజరయ్యారు. Also Read:


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3fFTsDg
v

Friday 27 November 2020

ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న కొత్త ప్రయాణం మొదలైంది.. నా బేబీతో కలిసి అడుగు పెట్టా: మంచు లక్ష్మి

మంచు ఫ్యామిలీ నటీనటుల్లో ప్రయాణం ఎంతో ప్రత్యేకమైందని చెపుకోవచ్చు. అటు వెండితెరపై ఇటు బుల్లితెరపై సందడి చేస్తూ తనకంటూ స్పెషల్ ఫాలోయింగ్ ఏర్పర్చుకుంది మంచు లక్ష్మి. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ తమ ఫ్యామిలీ విశేషాలతో పాటు సమాజంలోని పరిస్థితులపై స్పందిస్తూ తన అభిప్రాయలు చెప్పే ఆమె.. తాజాగా కొత్త ప్రయాణం స్టార్ట్ చేసింది. ఈ మేరకు ఆ విషయాన్ని అభిమానులతో పంచుకుంటూ పోస్ట్ పెట్టింది. ట్విట్టర్ వేదికగా తన ముద్దుల కూతురు విద్యా నిర్వాణతో కలిసి కొత్త ఆఫీస్‌లో అడుగుపెట్టిన ఫోటోలను షేర్ చేస్తూ తన ఫీలింగ్స్ అభిమానులతో పంచుకుంది. కొత్త ఆఫీస్‌ ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందని, ఈ క్షణాలు ఎంతో మధురమైనవని అని పేర్కొంటూ మీ ప్రేమ ఆశీర్వాదం కావాలని కోరింది. ఇందుకోసం కొన్నాళ్ళుగా ఎంతో ఎగ్జైటింగా ఎదురు చేశానంటూ ఆనందం వ్యక్తం చేసింది. ఈ మేరకు ఆమె షేర్ చేసిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. Also Read: ఈ మధ్యకాలంలో తన కూతురు విద్యా నిర్వాణతో కలిసి సోషల్ మీడియాలో తెగ హంగామా చేస్తున్న మంచు లక్ష్మి.. ఇటీవలే బుట్టబొమ్మ పాటకు స్టెప్పులేసి అందరి దృష్టిని ఆకర్షించింది. అదే జోష్‌లో టెక్నాలజీ వేగంతో పరుగులు పెడుతూ సరికొత్తగా అడుగులు వేస్తోంది. ఇకపై మంచు లక్ష్మి కొత్త వెబ్ సిరీస్‌లు, టాక్ షోలు చేయబోతోన్నట్లు సమాచారం.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/33qR7qL
v

అనిల్ రావిపూడి మార్క్‌తో 'గాలి సంపత్'.. అరకులో శ్రీ విష్ణుతో కలిసి రాజేంద్ర ‌ప్ర‌సాద్ సందడి

బ్లాక్‌బ‌స్ట‌ర్ డైరెక్ట‌ర్ అనిల్ రావిపూడి సమర్పిస్తూ, స్క్రీన్ ప్లే అందిస్తున్న కొత్త సినిమా 'గాలి సంప‌త్'. అనిల్ కో డైరెక్ట‌ర్, రైట‌ర్, మిత్రుడు ఎస్. క్రిష్ణ నిర్మాత‌గా ఇమేజ్ స్పార్క్‌ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌ను స్థాపించి షైన్ స్క్రీన్స్ బ్యానర్ సాహు గారపాటి, హరీష్ పెద్దిలతో కలిసి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. యంగ్ హీరో , ల‌వ్‌లీ సింగ్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాలో న‌ట‌కిరీటి డా. గాలి సంప‌త్‌గా టైటిల్ రోల్ పోషిస్తున్నారు. అనీష్ ద‌ర్శ‌క‌త్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ అరకులో జరుగుతోంది. రాజేంద్ర ప్రసాద్, హీరో శ్రీ విష్ణుతో పాటు సినిమాలో ముఖ్య తారాగణంపై కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. ఈ షెడ్యూల్ డిసెంబర్ 5 వరకు జరుగుతుంది. ఆ తర్వాత హైదరాబాద్ షెడ్యూల్ ఉంటుంది. ఇప్పటికే విడుదల చేసిన కాన్సెప్ట్ పోస్టర్ సినిమాపై అంచనాలు క్రియేట్ చేసింది. తండ్రీ కొడుకుల మధ్య ముందెన్నడూ చూడని ఓ డిఫరెంట్ ఎమోషన్‌తో అనిల్ రావిపూడి మార్క్ ఎంటర్టైన్‌మెంట్ జోడించి ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తెస్తున్నారు. Also Read: ఈ చిత్రంలో రాజేంద్ర ప్ర‌సాద్‌, శ్రీ విష్ణు, ల‌వ్‌లీ సింగ్‌, త‌నికెళ్ల భ‌ర‌ణి, స‌త్య‌, ర‌ఘుబాబు, శ్రీ‌కాంత్ అయ్యంగార్‌, మిర్చి కిర‌ణ్‌, సురేంద్ర రెడ్డి, గ‌గ‌న్‌, మిమ్స్ మ‌ధు, అనీష్ కురువిల్లా, ర‌జిత‌, క‌రాటే క‌ళ్యాణి, సాయి శ్రీ‌నివాస్‌, రూపల‌క్ష్మి త‌దిత‌రులు నటిస్తున్నారు. అచ్చు రాజ‌మ‌ణి సంగీతం అందిస్తున్నారు. త్వరత్వరగా షూటింగ్ ఫినిష్ చేసి విడుదల చేస్తామని అంటోంది చిత్రయూనిట్.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3lgO22w
v

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...