from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3y9IZaZ
v
ఎప్పటికప్పుడు సినిమాలకు సంబంధించిన విషయాలతో పాటు సెలబ్రిటీల క్రేజీ అప్డేట్స్ ఈ సినిమా రౌండప్ ద్వారా మీ ముందుకు తెస్తున్నాం. టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ ఇండస్ట్రీల్లోని ముఖ్య విషయాలను సంక్షిప్తంగా ఇలా ఒక్కచోట చేర్చి అందిస్తున్నాం. ఈ రోజు (జూన్ 30) సినిమా రౌండప్లో అల్లు అర్జున్ 'పుష్ప' ప్రమోషన్స్, బాబీ దర్శకత్వంలో చిరంజీవి చేయబోతున్న సినిమాపై ఇంట్రెస్టింగ్ అప్డేట్, కార్తీ సినిమాలో సిమ్రాన్, మరో బాలీవుడ్ ఆఫర్ దక్కించుకున్న రకుల్.. తదితర విషయాలను పొందుపరిచాం. మరి ఇంకెందుకు ఆలస్యం ఈ విషయాలపై ఓ లుక్కేయండి.
మెగాస్టార్ చిరంజీవి వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం 'ఆచార్య' మూవీ చేస్తున్న ఆయన.. డైరెక్టర్ బాబీతో ఓ సినిమాను లైన్లో పెట్టిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. నటీనటుల ఎంపిక విషయంలో బాబీ స్పెషల్ కేర్ తీసుకుంటున్నారట. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించబోతున్న ఈ సినిమాలో ఓ కీలక పాత్ర కోసం నవాజుద్దీన్ సిద్ధిఖీని ఎంపిక చేశారని తెలుస్తోంది. ఆయన కూడా చిరంజీవితో తెర పంచుకోవడానికి ఆసక్తి కనబర్చారట. ఈ ఏడాది చివర్లో ఈ మూవీ పట్టాలెక్కనుంది.
అల్లు అర్జున్- సుకుమార్ క్రేజీ కాంబోలో రాబోతున్న 'పుష్ప' నుంచి స్పెషల్ ట్రీట్ రెడీ చేస్తున్నారట మేకర్స్. బన్నీ డాన్స్ అంటే ఫ్లోర్స్ దద్దరిల్లాల్సిందే. ఆయన తాజా సినిమా 'పుష్ప'లో కూడా అదే రేంజ్ డాన్స్ పర్ఫార్మెన్స్ చూడబోతున్నామని తెలుస్తోంది. మాస్ క్యారెక్టర్ అయినా బన్నీతో స్టెప్పుల విషయంలో సుకుమార్ వెనక్కి తగ్గలేదట. ఇప్పటికే మేజర్ పార్ట్ షూటింగ్ కంప్లీట్ చేసిన సుక్కు.. ఇక ప్రమోషన్స్పై స్పెషల్ కేర్ తీసుకోబోతున్నారట. ఇందులో భాగంగా 'పుష్ప' నుంచి త్వరలో ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట.
ఆంజనేయ స్వామిపై ఉన్న భక్తిని చాటుకుంటూ సీనియర్ హీరో అర్జున్ ఓ ఆలయం నిర్మించారు. చెన్నైలోని విమానాశ్రయానికి సమీపంలో ఉన్న తన సొంత స్థలంలో ఆంజనేయుడికి గుడి కట్టించారాయన. ఆలయ నిర్మాణ పనులు దాదాపు ఫినిష్ కావడంతో జులై 1న కుంభాభిషేకం చేయబోతున్నారు. అభిమానులతో పాటు తనకు తెలిసిన వాళ్లందరినీ ఈ కార్యక్రమానికి ఆహ్వానించాలని అనుకున్నాను కానీ కరోనా పరిస్థితుల కారణంగా అది కుదరలేదని అర్జున్ పేర్కొన్నారు.
తెలుగు తెరపై స్టార్ హీరోయిన్గా తన అందచందాలతో ఆకట్టుకున్న రకుల్ ప్రీత్ సింగ్.. బాలీవుడ్ తెరపై కూడా హవా నడిపిస్తోంది. తాజాగా ఆమెకు బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్కుమార్ సరసన ఓ చిత్రంలో నటించే అవకాశం దక్కిందని సమాచారం. ‘బెల్బాటమ్’ నిర్మాత జాకీ భగ్నానీ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతున్న ఈ సినిమాను అతి త్వరలో సెట్స్ మీదకు తీసుకొచ్చేలా ప్లాన్ చేస్తున్నారు. దీంతో పాటు ''మేడే, థాంక్ గాడ్, ఇండియన్ 2'' సినిమాలు చేస్తోంది రకుల్.
సీనియర్ హీరోయిన్ సిమ్రాన్ సెకండ్ ఇన్నింగ్స్లో ఆచితూచి అడుగులేస్తోంది. సెలక్టెడ్గా సినిమాలు ఎంచుకుంటున్న ఆమె.. హీరో కార్తి కోసం రంగంలోకి దిగుతోందని సమాచారం. పీఎస్ మిత్రన్ దర్శకత్వంలో తెరకెక్కనున్న చిత్రం ‘సర్దార్’. విభిన్నమైన యాక్షన్ థ్రిల్లర్ కథాంశంతో రూపొందనుంది. ఈ సినిమాలో ప్రతినాయిక ఛాయలున్న పాత్రలో సిమ్రాన్ నటించనుందట. ఈ చిత్రంలో కార్తీ రెండు డిఫరెంట్ గెటప్స్లో నటిస్తున్నారు.
మూవీ ఆర్టిస్టు అసోషియేషన్ (మా) ఎన్నికలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. మొదటగా త్రిముఖ పోటీ అనుకున్నారు. కానీ నాలుగో వ్యక్తి కూడా ఎంటరయ్యారు. అయితే ఇవన్నీ కూడా కావు.. చివరకు ఓ మహిళను ఏకగ్రీవం చేయనున్నారనే టాక్ బయటకు వచ్చింది. అలా మొత్తానికి మా ఎన్నికలు మాత్రం మంచి రంజు మీదున్నాయి. ఈ నేపథ్యంలో ఒకరి తరువాత ఒకరు మీడియా ముందుకు వస్తున్నారు. అందరూ మా ఎన్నికల మీద విమర్శలు సంధిస్తున్నారు. మరీ ముఖ్యంగా నాగబాబు వ్యాఖ్యలపై కామెంట్ చేస్తున్నారు. ప్రస్తుతం మా ఎన్నికల్లో అధ్యక్ష పదవీ కోసం సీనియర్ నటుడు ప్రకాష్ రాజ్, మంచు విష్ణు, జీవిత రాజశేఖర్, హేమ , సీవీఎల్ నరసింహా రావులు పోటీ చేసేందుకు సిద్దంగా ఉన్నారు. ఇప్పటికే ఎవరికి తగ్గట్టు వారు తమ తమ వ్యూహాలను రచించుకుంటున్నారు. అందరి కంటే ఎక్కువగా ప్రకాశ్ రాజ్, మంచు విష్ణులు దూసుకుపోతోన్నారు. ప్రకాశ్ రాజ్ ఏకంగా తన ప్యానెల్తో కలిసి మీడియా ముందుకు వచ్చేశారు. ఇక మంచు విష్ణు సైతం తాను రంగంలోకి దిగబోతోన్నట్టు ప్రెస్ నోట్ ద్వారా అధికారికంగా ప్రకటించేశారు.
అయితే తాజాగా నటుడు ఓ కళ్యాణ్ మీడియా ముందుకు వచ్చారు. అతను కూడా అధ్యక్ష పదవికి పోటీ చేయబోతోన్నారనే వార్తలు వచ్చాయి. అయితే వీటిపై ఓ కళ్యాణ్ స్పందించారు. తన ఆవేదన, రూమర్లు, ‘మా’లో జరుగుతున్న వాటి గురించి మీడియా ముందు బహిర్గత పరిచారు. మీడియాతో మాట్లాడుతూ ఓ కళ్యాణ్ నాటి విషయాలను గుర్తు చేశారు. గతంలో ఎన్నికలు జరిగిన తీరు, కోర్టు మెట్లు ఎక్కిన సందర్భం, మా ఎన్నికల సరళి, పెద్దల తీరు ఇలా ప్రతీ ఒక్క అంశం మీద ఓ కళ్యాణ్ కుండ బద్దలు కొట్టేసినట్టు మాట్లాడారు.
ప్రస్తుతం ఉన్న మా సంఘం సభ్యుల తీరు ఎవరికి వారు యమునా తీరే అన్నట్టు అయ్యింది.. నాగబాబు అంటే నాకు గౌరవం. ఆయన్ను బాబు అని పిలుస్తాను. అయన భాధ్యత తీసుకొనే కదా గెలిపించింది.. మరి ఇంతగా పరిస్థితులు దిగజారితే మీరు ఇంట్లో కూర్చొని ఎలా కూర్చుని ఉన్నారు. గెలిపించే సత్తా ఉన్నప్పుడు అందరినీ ఒకే చోట కూర్చుని సమస్యలను పరిష్కరించలేరా?. ఇంతకు ముందు చేసిన అధ్యక్షులకు కూడా నాగబాబే మద్దతు తెలిపారు. ఈ సారి మళ్లీ ప్రకాష్ రాజ్ అంటున్నారు. ఆయన ప్లానింగ్ నచ్చిందని సపోర్ట్ చేస్తాను అని అంటున్నారు. ఇంతకు ముందు ముగ్గురు కూడా మీరు సపోర్ట్ చేసిన వాళ్లే. మళ్లీ అదే రిపీట్ కాదన్న గ్యారెంటీ ఏంటి అని ఓ కళ్యాణ్ ప్రశ్నించారు.
ఇండస్ట్రీలోని పెద్దలు చిరంజీవి అన్నయ్య, మోహన్ బాబు అన్నయ్య, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున ఇలా పెద్దవారంతా ముందుకు రావాలి. వారు కలగజేసుకుని ఈ ఎన్నికలను ఏకగ్రీవం చేయాలి..ఎవరిని ఏ స్థానంలో ఉంచాలో వారే నిర్ణయించాలి. ఈ పరిస్థితులను చక్కబెట్టాలి. సీసీసీ కోసం వారం రోజుల్లో పది కోట్లు తెచ్చిపెట్టిన హీరోలు.. ‘మా’ కోసం ఓ బిల్డింగ్ కట్టలేరా? ప్రభుత్వం సాయం చేయడం లేదనుకుందాం.. ఓ యాభై కోట్లు కలెక్ట్ చేసి బిల్డింగ్ కట్టేంత లేదా? అని ఓ కళ్యాణ్ తన ఆవేదనను బయటపెట్టేశారు.
ఇది నా స్థాయి కాకపోయినా.. నా స్థాయిని మించి నేను సాయం చేసేందుకు వస్తాను. నా మనవరాలి పేరు మీదున్న ఆస్తిని అమ్మి కోటిన్నర వరకు ‘మా’ బిల్డింగ్ కోసం సాయం చేస్తాను. ఎవరైనా సరే ముందుకు వచ్చి ఈ సమస్యలు పరిష్కరించి ఓ బిల్డింగ్ కట్టాలి. తమిళ, కన్నడ, మళయాలి వాళ్లకు ఓ బిల్డింగ్ ఉంది. కానీ మనకు ఇంత వరకు లేనేలేదు. పెద్దలు ఎవరైనా సరే కలగజేసుకుని వీటిని వెంటనే పరిష్కరించాలి.. నేను మీడియా ద్వారా నా బాధను చెబితే వారికి రీచ్ అవుతుందని ఇలా చెబుతున్నాను అని ఓ కళ్యాణ్ అన్నారు.
చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...