Wednesday 30 June 2021

ఆ వార్త చూడగానే గుండె తరుక్కుపోయింది.. గొప్ప మనసు చాటుకున్న సంపూర్ణేష్ బాబు

చిన్న హీరోనే కానీ రియల్ హీరో, మనసున్న మంచి మనిషి, ఆపదలో ఉన్నారంటే సాయం చేయడంలో ఎప్పుడూ ముందే అని నిరూపించుకుంటున్నారు . సాటి మనిషి కష్టాల్లో ఉంటే తట్టుకోలేని ఆయన, ఇప్పటికే చాలా సందర్భాల్లో ఔదార్యం చాటుకున్నారు. కరోనా విపత్కర పరిస్థితుల్లో సీసీసీకి, అలాగే వరద బాధితుల సహాయార్థం సీఎం రిలీఫ్ ఫండ్‌కి, రీసెంట్‌గా సినీ జర్నలిస్టు TNR అకాల మరణంతో వారి కుటుంబానికి ఆర్ధిక సాయం అందించిన సంపూర్ణేష్ బాబు.. తాజాగా తల్లిదండ్రులు కోల్పోయిన ఇద్దరు పిల్లలకు సాయం చేసి మంచి మనసున్న హీరో అనిపించుకున్నారు. దుబ్బాక పురపాలక పరిధిలో ఉంటున్న నరసింహచారి దంపతులు అప్పుల భారం మోయలేక ఆత్మహత్య చేసుకున్నారు. దీంతో వారి ఇద్దరు కుమార్తెలు అనాథలుగా మారారు. ఈ విషయం తెలుసుకొని సంపూర్ణేష్ బాబు వారికి 25 వేల రూపాయల ఆర్ధిక సాయం అందించారు. ప్రతి మనిషికి జీవితంలో కష్టం, ఆర్ధిక ఇబ్బందులు ఉంటాయని, వాటికి ధైర్యంగా ఎదుర్కోవాలే తప్ప ఆత్మహత్యకు పాల్పడి కుటుంబాన్ని రోడ్డున పడేయొద్దని సంపూ అన్నారు. ఈ మేరకు తన ఫేస్‌బుక్ ఖాతాలో పోస్ట్ పెట్టిన సంపూర్ణేష్ బాబు.. ''దుబ్బాకలో నరసింహచారి గారి కుటుంబంలో జరిగిన ఈ వార్త చూసి గుండె తరుక్కుపోయింది. కరోనా కష్టకాలంలో ఎంతో మంది పనులు కోల్పోయి వీధిన పడుతున్నారు. తల్లితండ్రులు కోల్పోయిన ఆ పిల్లలకు Rs.25000/- నేను మరియు మా హృదయకాలేయం, కొబ్బరిమట్ట నిర్మాత Sai Rajesh అందిచడం జరిగింది. ఎంత వరకు చదువుకుంటే అంత పూర్తి ఖర్చులు మేము చూసుకుంటాం అని వారికి మాట ఇవ్వటం జరిగింది. ఈ కష్టకాలంలో తోటి వ్యక్తులకు మన వంతు సహాయం అందిచడం మన కర్తవ్యం'' అని పేర్కొన్నారు. దీంతో చిన్ననటుడే అయినా సంపూది పెద్ద హృదయమని, ఆయన చేసిన ఈ సాయం అభినందనీయం అని పలువురు పేర్కొంటున్నారు. ప్రస్తుతం సంపూ 'క్యాలీఫ్లవర్' సినిమా చేస్తున్నారు. రీసెంట్‌గా షూటింగ్ ఫినిష్ చేసుకున్న ఈ మూవీ విడుదలకు రెడీగా ఉంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3y9IZaZ
v

టీడీపీ బ్రతకాలంటే ఎన్టీఆర్ రావాల్సిందే.. తారక్ పొలిటికల్ ఎంట్రీపై బాబు మోహన్ సెన్సేషనల్ కామెంట్స్

గత ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం చవిచూడటంతో ఒక్కసారిగా అందరి చూపు జూనియర్ ఎన్టీఆర్‌పై పడింది. ఈ పరిస్థితుల్లో తెలుగు దేశం పార్టీకి ఓ యువ నాయకుడి అవసరం ఉందనే టాక్ మొదలైంది. అంతేకాదు జూనియర్ మాత్రమే తెలుగు దేశం పార్టీ జెండాను తిరిగి రెపరెపలాడించగలడు అనే చర్చలు షురూ కావడం, దానిపై చాలామంది సినీ, రాజకీయ ప్రముఖులు రియాక్ట్ కావడం చూశాం. కాగా తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో ఇదే అంశంపై సీనియర్ నటుడు, రాజకీయవేత్త సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. గతంలో 2009 ఎన్నికల్లో ఎన్నికల్లో టీడీపీ తరఫున జూనియర్ ఎన్టీఆర్ ప్రచారానికి వెళితే జనం భారీగా వచ్చారు. తాతలా వాగ్ధాటి ఉన్నవాడు కావడంతో అంతా అట్రాక్ట్ అయ్యారు. ఆ సమయంలోనే తారక్ ఎంట్రీ ఖారరైందని అంతా భావించగా అనూహ్యంగా ఆ ఎన్నికల తర్వాత పార్టీ కార్యక్రమాల్లో కనిపించలేదు ఎన్టీఆర్. అయితే మళ్ళీ రీసెంట్‌గా టీడీపీ హవా తగ్గడంతో ప్రతిఒక్కరూ ఎన్టీఆర్ వైపే చూస్తున్నారు. పార్టీకి తిరిగి పూర్వ వైభవం రావాలంటే ఆయనే దిక్కు అని చర్చించుకుంటున్నారు. సరిగ్గా ఈ పరిస్థితుల నడుమ బాబు మోహన్ చేసిన కామెంట్స్ సంచలనంగా మారాయి. 'టీడీపీకి బలం చేకూరాలంటే ఎన్టీఆర్ ఎంట్రీ ఉండాల్సిందే.. అలా అయితేనే పార్టీ బ్రతకొచ్చు' అని బాబు మోహన్ పేర్కొన్నారు. ఎప్పుడొస్తాడా అని తాను కూడా ఎదురు చూస్తున్నట్లు ఆయన తెలిపారు. ఒకవేళ ఎన్టీఆర్ పాలిటిక్స్ లోకి వస్తే పార్టీకి పట్టిన ఆ మసి అంతా కడిగేసి వస్తారో.. లేక వేరే పార్టీ పేరుతో రంగంలోకి దిగుతారో తెలియదుగా అంటూ బాబు మోహన్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. కాగా, ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న RRR సినిమాతో బిజీగా ఉన్నారు ఎన్టీఆర్. ఈ సినిమాలో కొమురం భీం పాత్రలో ఆయన నటిస్తున్నారు. ఇది పూర్తి కాగానే కొరటాల శివతో సెట్స్ మీదకు వెళ్లనున్నారు ఎన్టీఆర్.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3hn2p5E
v

సినిమా రౌండప్: ప్రభాస్‌తో డ్రీమ్.. ఒంటరిగానే బెస్ట్.. ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి

లైన్ లోకి 'ఉప్పెన' బ్యూటీ తొలి సినిమా 'ఉప్పెన'తో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో గుడి కట్టుకుంది హీరోయిన్ . గ్లామర్ ట్రీట్‌కి కాస్త దూరంగా ఉంటూనే తనదైన నటనతో అట్రాక్ట్ చేసిన ఈ బ్యూటీ ప్రస్తుతం 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి' అనే సినిమాలో నటిస్తోంది. సుధీర్ బాబు హీరోగా ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్‌లో కృతి జాయిన్ అయింది. ధనుష్.. 100 కోట్లపైనే తమిళ స్టార్‌ హీరో ధనుష్‌ ఇటీలే చెన్నైలోని పోయిస్‌ గార్డెన్‌లో కొత్త ఇల్లు నిర్మించుకోబోతున్నారు. ఇటీవలే దీనికి భూమి పూజ కూడా చేసిన ఆయన ఈ ఇంటి కోసం ఏకంగా 100 కోట్లపైనే ఖర్చు చేస్తున్నారట. సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ ఇంటికి దగ్గరలోనే ఉన్న ఈ ఇంటిని తనకు నచ్చిన రీతిలో డిజైన్ చేయించుకుంటున్నారట ధనుష్. ఒంటరిగానే బెస్ట్ 'జయం' సినిమాతో ఎంట్రీ ఇచ్చి స్టార్ హీరోయిన్‌గా ఎదిగిన సదా.. తన పెళ్లి విషయమై ఓపెన్ అయింది. తన మనస్తత్వానికి మ్యాచ్ అయ్యేవాడు దొరికితేనే పెళ్లి లేదంటే ఒంటరిగానే ఉంటా అని చెప్పింది. అయినా ఒంటరి జీవితమే బెస్ట్ అంటూ తన మనసులోని మాట బయటపెట్టింది సదా. ప్రభాస్‌తో హీరోయిన్ డ్రీమ్ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌తో నటించడం తన డ్రీమ్ అని చెప్పింది శృతి హాసన్. డార్లింగ్ ప్రభాస్ సరసన 'సలార్' చిత్రంలో నటిస్తున్న ఆమె.. ప్రభాస్‌తో రొమాన్స్ చేసే ఛాన్స్ రావడం అదృష్టంగా భావిస్తోందట. ఈ సినిమాలో శృతి ఓ జర్నలిస్ట్ పాత్రలో కనిపించనుందని సమాచారం.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3jr2uYG
v

అవికా గోర్ పాప్ కార్న్.. వర్షపు జల్లుల్లో తడిసిన అందాలతో చిన్నారి పెళ్లి కూతురు

చిన్నారి పెళ్లికూతురు సీరియల్‌తో కెమెరా ముందుకొచ్చి బుల్లితెర ప్రేక్షకుల మనసు దోచుకుంది . తన సొంత పేరు కంటే ఎక్కువగా చిన్నారి పెళ్లి కూతురు అంటేనే అంతా గుర్తుపట్టే రేంజ్‌లో ఫేమస్ అయింది. ఇక ‘ఉయ్యాల జంపాల’ సినిమాతో హీరోయిన్‌‌గా ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత ''సినిమా చూపిస్తా మావ, లక్ష్మి రావే మా ఇంటికి, మాంజా, ఎక్కడికిపోతావు చిన్నాదాన, రాజు గారి గది 3'' చిత్రాల్లో నటించి కాస్త బ్రేక్ ఇచ్చింది. మళ్ళీ ఇప్పుడు వచ్చిన ఆఫర్స్ అన్నీ ఓకే చేస్తూ ఏకంగా ఆరు సినిమాలకు కమిటైంది అవికా. నాగ చైతన్య హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'థ్యాంక్యూ' సినిమా చేస్తున్న ఆమె, మెగా అల్లుడు కళ్యాణ్ దేవ్ జోడీగా శ్రీధర్ సీపాన దర్శకత్వంలో మరో సినిమా చేస్తోంది. తాజాగా ఈ సినిమా నుంచి ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్ చేయగా.. వర్షపు జల్లుల్లో తడిసిన అందాలతో యూత్ ఆడియన్స్‌ని అట్రాక్ట్ చేసింది ఈ చిన్నారి పెళ్లి కూతురు. ఇకపోతే ఆది సాయి కుమార్‌ సరసన అవికా నటిస్తోన్న ‘అమరన్‌’ మూవీ ఏప్రిల్‌లో లాంఛనంగా ప్రారంభమైంది. బలవీర్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ త్వరలోనే ప్రారంభం కానుంది. మరోవైపు యువ నటులు నవీన్‌ చంద్ర, వెన్నెల రామారావులతో సందడి చేసేందుకు రెడీ అవుతోంది అవికా. ఇదిలా ఉంటే '' అనే సినిమాతో ఆమె నిర్మాతగా కూడా మారడం విశేషం. ఆచార్య క్రియేషన్స్ బ్యానర్‌పై యాడ్‌ ఫిల్మ్‌ మేకర్‌ మురళీ నాగ శ్రీనివాస్‌ గంధం దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో సాయి రోనక్, అవికా గోర్‌ జంటగా నటిస్తున్నారు. ఒకరిపై మరొకరికి విపరీతమైన ద్వేషం గల ఓ అమ్మాయి, ఓ అబ్బాయి ప్రేమకథను ఆసక్తికరంగా మీ ముందుకు తెస్తున్నామని దర్శకుడు తెలిపాడు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3hllrsZ
v

సునిశిత్‌ని తాట తీసిన నందమూరి ఫ్యాన్స్.. హరికృష్ణనే కాదు ఏ హీరోని తిట్టనంటూ వీడియో

సాక్రిఫైజింగ్ స్టార్, ట్రెండింగ్ స్టార్ ఇలాంటి స్టార్లు చాలానే ఉన్నాయి మనోడికి.. పెట్టుకున్నవే కాబట్టి ఎన్నైనా స్టార్లు ఉంటాయి కానీ.. ఈ స్వయం ప్రకటిత స్టార్ తాట తీసేందుకు టాలీవుడ్ స్టార్ హీరోలు రంగంలోకి దిగడంతో క్షమించండి మహాప్రభో అంటూ వాళ్ల కాళ్లపై పడ్డాడు. ఇంతకీ ఈ స్టార్ ఎవరంటే . లావణ్య త్రిపాఠితో నాకు పెళ్తైంది.. తమన్నాతో కాపురం చేశా.. బాహుబలి సినిమా నాతో చేయాల్సింది.. బాహుబలి హీరో ముందు నేనే.. ఆర్ ఆర్ ఆర్ ఛాన్స్ నాకే.. అసలు మహేష్ బాబు, ఎన్టీఆర్, ప్రభాస్‌లు హీరోలే కాదు.. రాజమౌళి దర్శకుడే కాదు.. ఇలాంటి కామెంట్స్‌తో యూట్యూబ్‌లో హల్ చల్ చేసిన సునిశిత్ ఆ మధ్య కాలంలో జైలుకి కూడా వెళ్లొచ్చాడు. నోటికి వచ్చినట్టు వాగడంతో హీరోయిన్ లావణ్య త్రిపాఠి ఇతగాడిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో శ్రీరామోజు సునిశిత్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు పంపారు. అయితే జైలు నుంచి వచ్చిన తరువాత కూడా మనోడిలో మార్పురాలేదు. పాత పాటే పాడుతూ స్టార్ హీరోలందరిపైన నోటికొచ్చినట్టు వాగడం మొదలుపెట్టాడు. రీసెంట్‌గా హరికృష్ణ గురించి నోటికొచ్చినట్టు పేలడంతో ఇతని తాట తీసేందుకు రంగంలోకి దిగారు నందమూరి అభిమానులు. ఈ స్వయం ప్రకటిత హీరో పట్టుకుని నాలుగు తగిలించడానికి రెడీ కావడంతో.. నన్ను క్షమించండి ఇంకెప్పుడూ అలా చేయను అంటూ ఫేస్ బుక్‌లో వీడియో పెట్టాడు. ‘నేను గారి గురించి ఒక పోస్ట్ పెట్టడం జరిగింది.. నందమూరి అభిమానులు హర్ట్ కావడంతో ఆ పోస్ట్‌ని డిలీట్ చేస్తూ నందమూరి హరికృష్ణ గారికి.. నందమూరి అభిమానులకు క్షమాపణలు తెలియజేస్తున్నాను. ఇకపై నేను నందమూరి హరికృష్ణ గారినే కాదు.. టాలీవుడ్‌కి సంబంధించిన ఏ హీరోనీ కూడా హర్ట్ చేయను. ఎవర్నీ విమర్శించను.. ప్రతిఒక్క హీరోకి.. వారి అభిమానులకు క్షమాపణలు తెలియజేస్తున్నాను’ అంటూ వీడియో విడుదల చేశాడు సునిశిత్. చూడాలి మరి మనోడు ఎంత వరకూ మాట మీద ఉంటాడో.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3hc2MBj
v

కవితను వెంటాడుతున్న విషాదాలు.. ఆ చేదు జ్ఞాపకాలు మరువకముందే భర్త కన్నుమూత

కరోనా మహమ్మారి ఎంతోమంది సెలబ్రిటీల ఇళ్లలో విషాదం మిగిల్చింది. గత ఏడాదికి కాలంగా చాలామంది నటీనటులు, వారి వారి కుటుంబ సభ్యులు కన్నుమూయడం జరిగింది. కాగా సౌత్ ఇండియన్ సీనియర్ యాక్ట్రెస్ పాలిట శాపంగా మారింది కరోనా. కొన్ని రోజుల వ్యవధిలోనే ఆమె ఇంట్లో ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు కోల్పోవడంతో కుటుంబ సభ్యుల్లో తీవ్ర విషాదం నెలకొంది. గత పది రోజుల క్రితమే కవిత కొడుకు సంజయ్‌ రూప్‌‌ మృతి చెందాడు. కరోనా ట్రీట్మెంట్ తీసుకుంటూ ఆయన తుదిశ్వాస విడిచాడు. దీంతో ఒక్కసారిగా కృంగిపోయిన కవితకు తన భర్త మృతితో మరో షాక్ తగిలింది. కొడుకు మరణం తాలూకు చేదు జ్ఞాపకాలు మరవకముందే అదే కరోనా మహమ్మారి కవిత భర్తను పొట్టన పెట్టుకుంది. గత కొన్ని రోజుల క్రితం కరోనా బారిన పడిన కవిత భర్త దశరథ రాజు ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆరోగ్యం విషమించడంతో కన్నుమూశారు. దశరథ రాజు మరణవార్త తెలిసి సినీ ప్రముఖులు కవితను పరామర్శిస్తున్నారు. 11 ఏళ్ల వయసులో వెండితెరపై అడుగుపెట్టిన కవిత తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో సినిమాలు చేసి క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా తనకంటూ ప్రత్యేక గురింపు తెచ్చుకుంది. భాషతో సంబంధం లేకుండా సౌత్‌లో దాదాపు 350కు పైగా సినిమాల్లో ఆమె నటించింది. కొన్ని సినిమాల్లో మేజర్ రోల్స్ చేసి మూవీ విజయంలో భాగం పంచుకుంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3w7BakL
v

Sadha: స్టార్ హీరోతో సీక్రెట్ ఎఫైర్‌.. ఆ సమయంలో మంచు మనోజ్ చుక్కలు చూపించాడు! సదా ఓపెన్ కామెంట్స్

గ్లామర్ ఇండస్ట్రీ అన్నాక జనం నోళ్ళలో పలు రకాలుగా నానడం కామన్. నటీనటులపై, ముఖ్యంగా హీరోయిన్స్ విషయమై కుప్పలు తెప్పలుగా గాసిప్స్ పుట్టుకొస్తుంటాయి. ఓ హీరోయిన్ మరో హీరోతో కాస్త క్లోజ్ రిలేషన్ మెయిన్‌టైన్ చేసినా లేదా వరుసపెట్టి రెండు మూడు సినిమాల్లో నటించినా వాళ్ళ మధ్య లవ్ ఎఫైర్ నడుస్తోందంటూ రూమర్స్ వైరల్ చేస్తుంటారు. హీరోయిన్ విషయంలో సరిగ్గా ఇదే జరిగిందట. ఈ విషయాలతో పాటు తన కెరీర్ ముచ్చట్లను తాజాగా 'ఆలీతో సరదాగా' వేదికపై పంచుకుంది సదా. తేజ దర్శకత్వంలో నితిన్ హీరోగా రూపొందిన 'జయం' సినిమాతో తెలుగుతెరకు పరిచయమైంది సదా. ఆ తర్వాత వరుసపెట్టి స్టార్ హీరోల సరసన అవకాశాలు పట్టేస్తూ పలు సౌత్ ఇండియన్ భాషల్లో ఫేమస్ హీరోయిన్ అయింది. విక్రమ్ హీరోగా శంకర్ రూపొందించిన ‘అపరిచితుడు’ సినిమా ఆమెను ఫుల్ పాపులర్ చేసేసింది. కాగా తాజా పోగ్రామ్‌లో కెరీర్ ఆరంభం నుంచి మొదలుకొని ఇప్పటిదాకా జరిగిన అన్ని విషయాలను షేర్ చేసుకున్న సదా.. మంచు వారబ్బాయి రియల్ క్యారెక్టర్ బయటపెట్టింది. మంచు మనోజ్‌తో కలిసి 'దొంగ దొంగది' సినిమాలో నటించింది సదా. ఎప్పుడూ చలాకీగా ఉండే మంచు మనోజ్.. ఆ సినిమా షూటింగ్ సమయంలో సదాను ఏడిపించాడట. ఈ విషయాన్ని ఆలీ లేవనెత్తడంతో వెంటనే రియాక్ట్ అయింది సదా. అవును అప్పటిదాకా ర్యాగింగ్‌ అంటే ఎలా ఉంటుందో తెలియని నాకు మంచు మనోజ్ చుక్కలు చూపించాడు అన్నట్లుగా రియాక్షన్ ఇచ్చింది. సెట్స్‌పై అస్సలు ప్రశాంతంగా ఉండనిచ్చేవాడు కాదని ఆమె చెప్పింది. ఇక తమిళంలో మాధవన్‌తో ఏకంగా మూడు సినిమాలు చేయడం వల్ల ఆయనతో ఎఫైర్ ఉందని జోరుగా చర్చలు నడిచాయని చెప్పిన సదా.. సినిమా ఇండస్ట్రీలో గాసిప్స్ అనేవి ఎంతో కామన్ కాబట్టి వాటిని అంతగా పట్టించుకోలేదంటూ ఓపెన్ అయింది. ఇదే ఇంటర్వ్యూలో తన పెళ్లి మ్యాటర్ కూడా తీసిన ఈ హీరోయిన్ మంచి మనస్తత్వం ఉన్న వ్యక్తి దొరికితే పెళ్లి చేసుకుంటా లేదంటే సింగిల్ గానే ఉంటానని చెప్పింది. అయితే తాను పెళ్లి చేసుకోబోయే వ్యక్తి కచ్చితంగా వీగన్‌ అయి ఉండాలని సదా తెలిపింది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3AfxLDW
v

కత్తి మహేష్ చనిపోవాలంటూ దారుణమైన పోస్ట్‌లు.. ఖుషీ డైలాగ్‌తో IPS పీవీ సునీల్ కుమార్ కౌంటర్

నెల్లూరులో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మూవీ క్రిటిక్ మహేష్ కత్తి తీవ్ర గాయాల పాలై.. చెన్నై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. అయితే ప్రాణాపాయం నుంచి తప్పించుకున్న కొన్నాళ్లు పాటు ఆసుపత్రిలో అత్యవసర చికిత్స తీసుకోనున్నారు. తలకి తగిలిన గాయాలు నయం అవుతుండగా.. నుదిటి ఎముకకు, ముక్కుకు శస్త్ర చికిత్సలు పూర్తయ్యాయి. అయితే కంటికి బలమైన గాయాలు కావడంతో పలు దఫాలుగా ఆపరేషన్స్ చేయనున్నారు శంకర ఆసుపత్రి వైద్యులు. అయితే కంటి చూపు కోల్పోయే ప్రమాదం లేదని తెలుస్తోంది. ఇదిలాఉంటే.. కత్తి మహేష్‌కి యాక్సిడెంట్ జరిగినప్పటి నుంచి సోషల్ మీడియాలో ప్రత్యేకించి ఒక వర్గం దారుణంగా కామెంట్లు పెడుతున్నారు. మానవత్వం మరిచిపోయి కత్తి మహేష్ చనిపోవాలంటూ వరుస పోస్ట్‌లు పెడుతున్నారు. కళ్లు పోయాయని.. చనిపోతాడని.. ఘోరమైన చావు రావాలని ఇలా రకరకాల కామెంట్లు పెడుతూ తెగ సంబరపడుతున్నారు. ఇక కత్తి మహేష్ తిరిగి కోలుకుంటున్న తరువాత కూడా.. దారుణమైన కామెంట్లు పెడుతూనే ఉన్నారు. అయితే వీటిపై ఐపీఎస్ ఆఫీసర్, ఆంధ్రప్రదేశ్‌ సీఐడీ అదనపు డీజీ పీవీ సునీల్‌కుమార్‌ ఘాటుగా రియాక్ట్ అయ్యారు. కత్తి మహేష్ ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీస్తూ.. కొంతమంది తన సన్నిహితులను చెన్నైకి పంపి మరీ కత్తి మహేష్ కుటుంబానికి భరోసా ఇచ్చారు పీవీ సునీల్‌కుమార్‌. అయితే చావుబతుకుల మధ్య ఉన్న కత్తి మహేష్ ఆరోగ్యంపట్ల మానవత్వం చూపించాల్సింది పోయి.. కొంతమంది దారుణంగా కామెంట్లు పెడుతుండటంతో వీపీ సునీల్ కుమార్ స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తూ ఫేస్ బుక్‌లో పోస్ట్ పెట్టారు. ‘కత్తి మహేష్ త్వరగా కోలుకోవాలని ఆశిద్దాము.. సాటి మనుషులుగా ఒక వ్యక్తి చావు బతుకుల మధ్య ఉన్నపుడు సానుభూతి చూపించాలి.. అంతే తప్ప అతడి నిస్సహాయ స్థితి ఎవరికైనా సంతోషం కలిగించింది అంటే ఆ తప్పు వారిది కాదు. ఏది తప్పో ఏది ఒప్పో తెలీకుండా వాళ్ళని అలా పెంచి సమాజం మీదికి ఒదిలిన తల్లితండ్రులది. ఇంత కిరాతక సమాజంలో బతుకుతున్నామా అనిపించేలా ఉంది పరిస్థితి. తనను విమర్శించిన వ్యక్తిపై దాడి జరిగితే వాళ్ళ ఇంటికి వెళ్ళి ఓదార్చిన గొప్ప మానవతా వాది చిరంజీవి గారి లాంటి వారి నుండి నేర్చుకోవలసింది ఆ మానవత్వం. ఈ సందర్భంలో నా అనుభవాలు రెండు చెప్పాలి. మా బంధువుల్లో నా మీద విషం చిమ్మే ఒక వ్యక్తి కి హార్ట్ సర్జరీకి డబ్బు అవసరం అయ్యింది. కన్న బిడ్డలు మొహం చాటేశారు. నేను పూర్తి డబ్బు కట్టాను. ఆ వ్యక్తి కోలుకుని బతికి కొన్నాళ్ళపాటు నన్ను దేవుడు అని పొగిడి తిరిగి విషం చిమ్మే పని ప్రారంభించాడు. పెడితే పెళ్ళి.. పెట్టకపోతే చావు కొంతమందికి అలానే నిత్య పరగడుపు.. మనిషికి కృతజ్ణత ఉండవచ్చు.. అది సహజం. కానీ పాముకీ, తేలుకీ విషం కక్కటం సహజం అలాంటి మనిషికి సాయం చేసినందుకు నేను బాధ పడను. వాళ్ళు పోవాలని కోరుకోను.. శత్రువు మారాలి లేదా ఓడిపోవాలి అని కోరుకోవచ్చు.. కానీ చనిపోవాలని కాదు. ఎవరేం చేసినా ఖుషీ సినిమాలో విజయ్ కుమార్ సిద్దుతో అన్నట్టు "మనకి అన్నిటికీ నవ్వే " అంటూ పోస్ట్ పెట్టారు .


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3h7gaqk
v

మరోసారి ఆసుపత్రిలో చేరిన వెటరన్ యాక్టర్ దిలీప్ కుమార్.. ICUలో చికిత్స

బాలీవుడ్ సీనియర్ యాక్టర్ మరోసారి ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయనకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తడంతో.. వెంటనే బుధవారం ఉదయం ముంబైలోని హిందుజా హస్పిటల్‌లో చేర్పించారు. ప్రస్తుతం ఐసీయూలో ఉంచి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఇటీవలే అనగా జూన్ 6వ తేదీన దిలీప్‌‌కి శ్వాస సంబంధిత సమస్యలు రావడంతో ఆసుపత్రిలో చేర్పించి మెరుగైన చికిత్స చేయించారు. అయితే ఆయన ఆరోగ్యం కాస్త కుదుట పడటంతో రెండు వారల క్రితం డిశ్ఛార్జి చేసి ఇంటికి పంపించారు. దాదాపు 15 రోజుల తర్వాత మళ్లీ అదే సమస్యతో ఇప్పుడు ఆయన హాస్పిటల్‌లో చేరడంతో అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఐసీయూలో చికిత్స పొందుతున్న దిలీప్ ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగానే ఉందని సమాచారం. ప్రత్యేక వైద్య నిపుణుల పర్యవేక్షణలో ఉంచి ఆయన ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తోంది హాస్పిటల్ సిబ్బంది. ప్రస్తుతం దిలీప్ కుమార్ వయస్సు 98 సంవత్సరాలు. 1944లో తెరకెక్కిన ‘జ్వార్‌భాత’ సినిమాతో వెండితెరపై కాలుమోపిన ఆయన ఎన్నో సినిమాల్లో నటించి పేరు ప్రఖ్యాతలు గడించారు. 1998లో విడుదలైన ‘ఖిల్లా’ మూవీ తర్వాత ఆయన తన సినీ కెరీర్‌కి గుడ్ బై చెప్పారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2Ua2SjC
v

Allari Naresh: సభకు నమస్కారం అంటూ అల్లరోడి ఎంట్రీ.. వాళ్ళను విమర్శించడమే ధ్యేయంగా ముందడుగు!

జయాపజయాలతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తూ వస్తున్నాడు టాలీవుడ్ యంగ్ హీరో అల్లరి నరేష్. వైవిధ్యభరితమైన కథాంశాలను ఎంచుకుంటూ తనదైన శైలిలో కామెడీ పండిస్తున్న ఆయన.. తెలుగు తెరపై రాజేంద్రప్రసాద్ తరువాత స్థానంలో నిలిచాడని చెప్పుకోవచ్చు. మినిమమ్ గ్యారంటీ హీరోగా దర్శకనిర్మాతలకు బెటర్ ఛాయిస్ అవుతున్న ఈ అల్లరోడు '' అంటూ మరో డిఫరెంట్ కాన్సెప్ట్ సినిమాతో మనముందుకు రాబోతున్నాడు. నేడు (జూన్ 30) పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా ప్రీ లుక్ రిలీజ్ చేస్తూ అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు. రీసెంట్‌గా ‘నాంది’ సినిమాతో సూప‌ర్ డూప‌ర్ హిట్ ఖాతాలో వేసుకున్న ఆయన.. ఇప్పుడు 'సభకు నమస్కారం' అంటున్నాడు. స‌తీశ్ మ‌ల్లంపాటి దర్శకుడిగా పరిచయం కాబోతున్న ఈ సినిమాను ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై మ‌హేశ్ కోనేరు నిర్మిస్తున్నారు. అల్లరోడి కెరీర్‌లో 58వ సినిమాగా ఈ మూవీ రూపొందుతోంది. తాజాగా విడుదలైన పోస్ట‌ర్‌లో ఓ వైపు జేబులో నోట్ల క‌ట్ట‌లు, మ‌రోవైపు జేబులో మందు సీసా కనిపిస్తుండటం చూస్తుంటే ఇది పొలిటికల్ నేపథ్యంలో రూపొందుతున్న సినిమా అని అర్థమవుతోంది. ఈ చిత్రంలో నరేష్ క్యారెక్టర్ గత సినిమాలకు పూర్తి భిన్నంగా ఉంటుందని అంటున్నారు. నాంది లాగే సీరియస్ సబ్జెక్ట్‌ని తీసుకొని, ఎన్నికల్లో ఓట‌ర్ల‌ను ప్ర‌లోభ పెట్టే రాజ‌కీయ నాయ‌కుల శైలిని విమ‌ర్శించేలా పొలిటిక‌ల్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా ఈ మూవీ రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. సెప్టెంబ‌ర్ రెండో వారం తర్వాత ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించనున్నారట. ఇతర తారాగణంతో పాటు సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలను అతిత్వరలో చిత్రయూనిట్ ప్రకటించనుంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3h66aO0
v

Rashmika Mandanna: విజయ్ దేవరకొండతో అలాంటి రిలేషన్.. ఫొటోతో సహా మ్యాటర్ రివీల్ చేసిన రష్మిక

నేటితరం ప్రేక్షకుల మనసులో క్రేజీ హీరో హీరోయిన్లుగా బలమైన ముద్ర వేసుకున్నారు విజయ్ దేవరకొండ- . 'గీత గోవిందం' సినిమాలో ఈ ఇద్దరి కెమిస్ట్రీ చూసి టాలీవుడ్ ప్రేక్షకలోకం ఫిదా అయింది. ఆ తర్వాత 'డియర్ కామ్రెడ్' సినిమాలోనూ అదే రేంజ్ రొమాన్స్ పండించి సూపర్ హిట్ జోడీ అనిపించుకుంది ఈ జంట. దీంతో జనాల్లో ఈ పెయిర్ స్పెషల్ ఇమేజ్ కూడగట్టుకుంది. ఇక వీలుచిక్కినప్పుడల్లా వీళ్ళిద్దరూ సరదాగా కలుస్తుండటం చూసి ప్రేక్షకుల్లో అనుమానాలు మొదలుకావడం, వాటిపై అటు రష్మిక ఇటు స్పందించడం చూశాం. తాజాగా మరోసారి అదే అంశం తెరపైకి వచ్చింది. సోషల్ మీడియాలో యమ యాక్టివ్‌గా ఉంటూ ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ అప్‌డేట్స్ అభిమానులతో పంచుకుంటున్న రష్మిక.. తాజాగా కొద్దిసేపు తన ఇన్స్‌స్టా వేదికగా చాట్ చేసింది. ఈ కార్యక్రమంలో చాలా విషయాలపై ఆమె ఓపెన్ అయింది. విజయ్ దేవరకొండ అంటే తనకు చాలా ఇష్టమంటూ మనసులో మాట బయటపెట్టిన ఈ కన్నడ బ్యూటీ.. మేమిద్దరం మంచి స్నేహితులం మాత్రమే అని తేల్చిచెప్పింది. తన బెస్ట్ ఫ్రెండ్ విజయ్ అని ఆమె చెప్పడం విశేషం. ఇక.. విజయ్ దేవరకొండతో దిగిన ఫొటోల్లో చాలా ప్రత్యేకమైన ఫొటో ఇదే అని తెలుపుతూ 'డియర్‌ కామ్రేడ్‌' షూటింగ్ సమయంలో తీసిన ఓ పిక్ షేర్ చేసింది రష్మిక. అలాగే తన వ్యక్తిగత ఇష్టాయిష్టాలపై కూడా ఓపెన్ అవుతూ తనకు స్మోకింగ్ అంటే నచ్చదని, స్మోకింగ్ చేసే వాళ్లకి దూరంగా ఉంటానని చెప్పింది. ఎలాంటి హంగులు, ఆర్భాటాలు లేని ఓ సాధారణ వ్యక్తిగా కనిపించే వ్యక్తి భర్తగా రావాలని కోరుకుంటున్నట్లు ఆమె వెల్లడించింది. అల్లు అర్జున్ హీరోగా రూపొందుతున్న రష్మిక మందన తాజా సినిమా 'పుష్ప' గురించి మాట్లాడుతూ.. అల్లు అర్జున్ డెడికేషన్‌పై కామెంట్ చేసింది. కెమెరా వెనుక ఎంతో సరదాగా ఉండే బన్నీ, ఒక్కసారి క్యారెక్టర్‌లోకి ఎంటరైతే ప్రొఫెషనల్‌గా మారిపోతారని చెప్పింది. ఆయనతో కలిసి నటించడం చాలా ఆనందంగా ఉందని ఆమె పేర్కొంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3juohi6
v

Tuesday 29 June 2021

సినీ ఇండస్ట్రీలో మరో విషాదం.. సీనియర్ నటి మందిరా బేడీ భర్త కన్నుమూత

గత కొంతకాలంగా సినీ ఇండస్ట్రీని వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. కరోనా కాటుకు కొంతమంది సెలబ్రిటీలు బలైపోగా.. పలు అనారోగ్య కారణాలతో ఇంకొందరు సెలబ్రిటీలు ఈ లోకం విడిచి వెళ్లారు. ఓ విషాదం తాలూకు విషయాలు పూర్తిగా మరవకముందే మరో విషాద వార్త వినాల్సి వస్తుండటం సినీ వర్గాలను కలవరపెడుతోంది. తాజాగా సీనియర్ నటి భర్త, ప్రముఖ నిర్మాత మరణంతో సినీ లోకంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. బుధ‌వారం ఉద‌యం 4 గంటల 30 నిమిషాల సమయంలో గుండెపోటు రావడంతో రాజ్ కౌశల్ క‌న్నుమూసిన‌ట్లు స‌న్నిహిత వ‌ర్గాలు పేర్కొన్నాయి. తన సొంత ఇంట్లో నిద్రిస్తుండగా తెల్లవారు జామున గుండెపోటు రావడంతో వైద్యులను సంప్రదించే లోపే ఆయన తుది శ్వాస విడిచారని తెలుస్తోంది. నిర్మాత రాజ్ కౌశల్ ఇక లేరనే వార్త తెలిసి పలువురు బాలీవుడ్ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తున్నారు. బాలీవుడ్‌లో రాజ్ కౌశల్ పలు సినిమాలను నిర్మిచడమే గాక.. ప్యార్ మే క‌బీ క‌బీ, షాదీ కా ల‌డ్డు లాంటి చిత్రాలకు దర్శకత్వం కూడా వహించారు. కొన్నేళ్ల క్రితం నటి మందిరా బేడిని ఆయన వివాహం చేసుకున్నారు. వీరికి ఒక్క కుమారుడు. అలాగే గతేడాది ఓ బాలికను దత్తత తీసుకున్నారు. ఇక మందిరా విషయానికి వస్తే.. 90వ దశకంలో శాంతి టీవీ సీరియల్ ద్వారా హోమ్లీ క్యారెక్టర్‌తో బుల్లితెరకు పరిచయమైన ఆమె, పలు హిందీ చిత్రాలతో పాటు, సీరియల్స్‌, వెబ్‌ సీరిస్‌ల్లో నటించింది. ద‌క్షిణాదిన శింబు మ‌న్మ‌థుడు, ప్ర‌భాస్ సాహో చిత్రాల్లో న‌టించి మెప్పించింది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3y7IqP7
v

పెళ్లి తర్వాత సునీత డేరింగ్ డిసీజన్.. భర్తతో కలిసి అలా స్కెచ్చేసిన సింగర్! ఇదే జరిగితే..

ఎప్పుడైతే రెండో పెళ్లి వార్త బయటకొచ్చిందో అప్పటి నుంచి ఆమెకు సంబంధించిన న్యూస్ నిత్యం వార్తల్లో నిలుస్తోంది. స్టార్ సింగర్‌గా కొన్ని వందల సినిమాల్లో తన గాత్ర మాధుర్యంతో అలరించిన సునీత.. ఈ ఏడాది ఆరంభంలో కొత్త జీవితాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. బిజినెస్‌మెన్ రామ్‌ వీరపనేనిని ఆమె పెళ్లాడింది. ఈ పెళ్లి తాలూకు సంగతులు, ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. కొందరు నెగెటివ్ కామెంట్స్ చేసినా కాంట్రవర్సీల జోలికి పోలేదు సునీత. మరోవైపు తన రెండో పెళ్లి తర్వాత సోషల్ మీడియాలో యాక్టివ్‌నెస్ పెంచేసి.. ఎప్పటికప్పుడు అభిమానులతో టచ్‌లో ఉంటోంది సునీత. కుటుంబ విషయాలతో పాటు కెరీర్ సంగతులను పంచుకుంటోంది. అలా అప్పటి నుంచి ఆమెకు సంబంధించి ఏదో ఒక వార్త హైలైట్‌ అవుతూనే ఉంది. ఈ నేపథ్యంలోనే తాజాగా సునీత కూడా భర్తతో పాటు వ్యాపార వ్యవహారాలు చూసుకునేందుకు రెడీ అవుతుందనే సమాచారాలు వైరల్ అవుతున్నాయి. ఇప్పటికే సునీత భర్త మ్యాంగ్‌ వీడియోస్‌తో పాటు మరికొన్ని డిజిటల్‌ చానల్స్‌కు హెడ్‌గా ఉన్నారు. అయితే ఇప్పుడు తన బిజినెస్ మరింత విస్తరించాలని భావించిన ఆయన సునీత సాయం కోరడంతో ఆమె కూడా ఓకే చెప్పిందట. అలా ఇద్దరూ కలిసి మ్యాంగో బ్యానర్‌పై వెబ్‌ సిరీస్‌లు నిర్మించేందుకు ప్లాన్‌ చేస్తున్నారట. ఈ వెబ్‌ సిరీస్‌ల నిర్మాణ బాధ్యతలు సునీతనే పూర్తిగా మోయనుందని విశ్వసనీయ వర్గాల సమాచారం. అంతేకాదు కొత్త దర్శకులు, నటీనటులను ఎంకరేజ్ చేసేలా సునీత దంపతులు ప్లాన్ చేశారని తెలుస్తోంది. దీనికి సంబంధించి త్వరలోనే అధికారిక ప్రకటన రావొచ్చని అంటున్నారు. రోజురోజుకూ ఓటీటీ కంటెంట్‌ ప్రభావం పెరుగుతున్న నేపథ్యంలో సింగర్ సునీత ఇలాంటి నిర్ణయం తీసుకోవడం సరైందని అంటున్నారు ఈ విషయం తెలిసిన జనం. ఆమెకు బిజినెస్ కావడమే గాక కొత్త టాలెంట్‌ని ప్రోత్సహించేందుకు ఇదో వేదిక కానుండటం శుభపరిణామం అంటున్నారు. సో.. చూడాలి మరి సునీత వ్యాపార ప్రకటన ఎప్పుడొస్తుందనేది!.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3AfyYLc
v

సినిమా రౌండప్: అల్లు అర్జున్ అభిమానులకు గుడ్ న్యూస్.. చిరంజీవితో పాటు ఆయన! రంగంలోకి సిమ్రాన్‌

ఎప్పటికప్పుడు సినిమాలకు సంబంధించిన విషయాలతో పాటు సెలబ్రిటీల క్రేజీ అప్‌డేట్స్ ఈ సినిమా రౌండప్ ద్వారా మీ ముందుకు తెస్తున్నాం. టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ ఇండస్ట్రీల్లోని ముఖ్య విషయాలను సంక్షిప్తంగా ఇలా ఒక్కచోట చేర్చి అందిస్తున్నాం. ఈ రోజు (జూన్ 30) సినిమా రౌండప్‌లో అల్లు అర్జున్ 'పుష్ప' ప్రమోషన్స్, బాబీ దర్శకత్వంలో చిరంజీవి చేయబోతున్న సినిమాపై ఇంట్రెస్టింగ్ అప్‌డేట్, కార్తీ సినిమాలో సిమ్రాన్‌, మరో బాలీవుడ్ ఆఫర్ దక్కించుకున్న రకుల్.. తదితర విషయాలను పొందుపరిచాం. మరి ఇంకెందుకు ఆలస్యం ఈ విషయాలపై ఓ లుక్కేయండి.

ఎప్పటికప్పుడు ముఖ్యమైన సినిమా అప్‌డేట్స్ సంక్షిప్తంగా అందించాలని ఈ సినిమా రౌండప్ మీ ముందుకు తెస్తున్నాం. మరి ఈ రోజు (జూన్ 30) విశేషాలేంటో చూద్దామా..


సినిమా రౌండప్: అల్లు అర్జున్ అభిమానులకు గుడ్ న్యూస్.. చిరంజీవితో పాటు ఆయన! రంగంలోకి సిమ్రాన్‌

ఎప్పటికప్పుడు సినిమాలకు సంబంధించిన విషయాలతో పాటు సెలబ్రిటీల క్రేజీ అప్‌డేట్స్ ఈ సినిమా రౌండప్ ద్వారా మీ ముందుకు తెస్తున్నాం. టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ ఇండస్ట్రీల్లోని ముఖ్య విషయాలను సంక్షిప్తంగా ఇలా ఒక్కచోట చేర్చి అందిస్తున్నాం. ఈ రోజు (జూన్ 30) సినిమా రౌండప్‌లో అల్లు అర్జున్ 'పుష్ప' ప్రమోషన్స్, బాబీ దర్శకత్వంలో చిరంజీవి చేయబోతున్న సినిమాపై ఇంట్రెస్టింగ్ అప్‌డేట్, కార్తీ సినిమాలో సిమ్రాన్‌, మరో బాలీవుడ్ ఆఫర్ దక్కించుకున్న రకుల్.. తదితర విషయాలను పొందుపరిచాం. మరి ఇంకెందుకు ఆలస్యం ఈ విషయాలపై ఓ లుక్కేయండి.



చిరంజీవితో న‌వాజుద్దీన్‌..
చిరంజీవితో న‌వాజుద్దీన్‌..

మెగాస్టార్ చిరంజీవి వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం 'ఆచార్య' మూవీ చేస్తున్న ఆయన.. డైరెక్టర్ బాబీతో ఓ సినిమాను లైన్‌లో పెట్టిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. నటీనటుల ఎంపిక విషయంలో బాబీ స్పెషల్ కేర్ తీసుకుంటున్నారట. మైత్రీ మూవీ మేక‌ర్స్ నిర్మించబోతున్న ఈ సినిమాలో ఓ కీల‌క పాత్ర కోసం న‌వాజుద్దీన్ సిద్ధిఖీని ఎంపిక చేశారని తెలుస్తోంది. ఆయన కూడా చిరంజీవితో తెర పంచుకోవడానికి ఆసక్తి కనబర్చారట. ఈ ఏడాది చివ‌ర్లో ఈ మూవీ పట్టాలెక్కనుంది.



బన్నీ ఫ్యాన్స్.. గెట్ రెడీ
బన్నీ ఫ్యాన్స్.. గెట్ రెడీ

అల్లు అర్జున్- సుకుమార్ క్రేజీ కాంబోలో రాబోతున్న 'పుష్ప' నుంచి స్పెషల్ ట్రీట్ రెడీ చేస్తున్నారట మేకర్స్. బన్నీ డాన్స్ అంటే ఫ్లోర్స్ దద్దరిల్లాల్సిందే. ఆయన తాజా సినిమా 'పుష్ప'లో కూడా అదే రేంజ్ డాన్స్ పర్‌ఫార్‌మెన్స్ చూడబోతున్నామని తెలుస్తోంది. మాస్ క్యారెక్టర్ అయినా బన్నీతో స్టెప్పుల విషయంలో సుకుమార్ వెనక్కి తగ్గలేదట. ఇప్పటికే మేజర్ పార్ట్ షూటింగ్ కంప్లీట్ చేసిన సుక్కు.. ఇక ప్రమోషన్స్‌పై స్పెషల్ కేర్ తీసుకోబోతున్నారట. ఇందులో భాగంగా 'పుష్ప' నుంచి త్వరలో ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట.



అర్జున్ ఆంజనేయ స్వామి ఆలయం
అర్జున్ ఆంజనేయ స్వామి ఆలయం

ఆంజనేయ స్వామిపై ఉన్న భక్తిని చాటుకుంటూ సీనియర్ హీరో అర్జున్ ఓ ఆలయం నిర్మించారు. చెన్నైలోని విమానాశ్రయానికి సమీపంలో ఉన్న తన సొంత స్థలంలో ఆంజనేయుడికి గుడి కట్టించారాయన. ఆలయ నిర్మాణ పనులు దాదాపు ఫినిష్ కావడంతో జులై 1న కుంభాభిషేకం చేయబోతున్నారు. అభిమానులతో పాటు తనకు తెలిసిన వాళ్లందరినీ ఈ కార్యక్రమానికి ఆహ్వానించాలని అనుకున్నాను కానీ కరోనా పరిస్థితుల కారణంగా అది కుదరలేదని అర్జున్ పేర్కొన్నారు.



అక్షయ్ సరసన రకుల్
అక్షయ్ సరసన రకుల్

తెలుగు తెరపై స్టార్ హీరోయిన్‌గా తన అందచందాలతో ఆకట్టుకున్న రకుల్ ప్రీత్ సింగ్.. బాలీవుడ్ తెరపై కూడా హవా నడిపిస్తోంది. తాజాగా ఆమెకు బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్‌కుమార్‌ సరసన ఓ చిత్రంలో నటించే అవకాశం దక్కిందని సమాచారం. ‘బెల్‌బాటమ్‌’ నిర్మాత జాకీ భగ్నానీ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌ వర్క్‌ జరుగుతున్న ఈ సినిమాను అతి త్వరలో సెట్స్ మీదకు తీసుకొచ్చేలా ప్లాన్ చేస్తున్నారు. దీంతో పాటు ''మేడే, థాంక్‌ గాడ్‌, ఇండియన్ 2'' సినిమాలు చేస్తోంది రకుల్.



ఆ హీరో కోసం రంగంలోకి సిమ్రాన్‌
ఆ హీరో కోసం రంగంలోకి సిమ్రాన్‌

సీనియర్ హీరోయిన్ సిమ్రాన్‌ సెకండ్ ఇన్నింగ్స్‌లో ఆచితూచి అడుగులేస్తోంది. సెలక్టెడ్‌గా సినిమాలు ఎంచుకుంటున్న ఆమె.. హీరో కార్తి కోసం రంగంలోకి దిగుతోందని సమాచారం. పీఎస్‌ మిత్రన్‌ దర్శకత్వంలో తెరకెక్కనున్న చిత్రం ‘సర్దార్‌’. విభిన్నమైన యాక్షన్‌ థ్రిల్లర్‌ కథాంశంతో రూపొందనుంది. ఈ సినిమాలో ప్రతినాయిక ఛాయలున్న పాత్రలో సిమ్రాన్‌ నటించనుందట. ఈ చిత్రంలో కార్తీ రెండు డిఫరెంట్ గెటప్స్‌లో నటిస్తున్నారు.





from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3y7NJhr
v

Bimbisara: ప్యాకప్ చెప్పే దిశగా నందమూరి హీరో.. త్వరలోనే అఫీషియల్ స్టేట్‌మెంట్!

హీరోగా, నిర్మాతగా తనదైన దారిలో వెళుతున్న '' రూపంలో మరో ప్రయోగాత్మక సినిమాను లైన్‌లో పెట్టిన సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ జయంతి రోజు ఈ సినిమా ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ రిలీజ్ చేసి నందమూరి అభిమానులను సర్‌ప్రైజ్ చేశారు. కళ్యాణ్ రామ్ 18వ సినిమా ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ శరవేగంగా షూటింగ్ జరుపుతున్నారు మేకర్స్. అయితే గత కొన్ని నెలలుగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ 90 శాతం షూటింగ్ పార్ట్ కంప్లీట్ చేసిందట. మరి కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తే ప్యాకప్ చెప్పేయడమే అని తెలుస్తోంది. స్వయంగా ఈ సినిమా నిర్మాణ బాధ్యతలు భుజాన వేసుకొని ఇందులో హీరోగా నటిస్తున్న కళ్యాణ్ రామ్ ఇప్పటిదాకా వచ్చిన అవుట్‌పుట్ చూసి పూర్తి సంతృత్తి వ్యక్తం చేశారట. అతి త్వరలో మిగిలిన పార్ట్ షూటింగ్ ఫినిష్ చేసి రిలీజ్ డేట్ అనౌన్స్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు టాక్. ఇటీవల విడుదల చేసిన 'బింబిసార' ఫస్ట్ లుక్ పోస్టర్ 'బాహుబలి' రేంజ్‌లో కనిపించడంతో ఈ మూవీ కళ్యాణ్ రామ్ కెరీర్‌కు గేమ్ చేంజర్ అవుతుందనే టాక్ నడుస్తోంది. ఇకపోతే కళ్యాణ్ రామ్ సొంత బ్యానర్‌పై రూపొందుతున్న ఈ చిత్రంలో ఆయన సరసన కేథరిన్‌, సమ్యుక్తా మేనన్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు. వశిష్ట్‌ దర్శకత్వం వహిస్తుండగా.. చిరంతన్‌ భట్‌ సంగీతం అందిస్తున్నారు. తనపై దండెత్తడానికి వచ్చిన శత్రుమూకలపై అలుపెరగని పోరాటం చేసిన యోధుడిగా కళ్యాణ్ రామ్‌ కనిపించబోతున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3w3acL7
v

నీలాంటి దాన్ని పెళ్లి చేసుకోవాలంటే ఉండాల్సిదేంటి?.. నెటిజన్ ప్రశ్నకు రష్మిక క్యూట్ రిప్లై

నేషనల్ క్రష్ సోషల్ మీడియాలో చేసే అల్లరి మామూలుగా ఉండదు. చిన్న పిల్లలా ఆమె చేసే చేష్టలు, పెట్టే క్యూట్ ఎక్స్ ప్రెషన్స్‌‌‌కు అందరూ ఫిదా అవుతుంటారు. అలా చేసే అల్లరికి ఎంతో మంది అభిమానులున్నారు.అందుకే సోషల్ మీడియాలో రష్మికకు అంతటి అభిమాన గణం ఉంది. అయితే తాజాగా రష్మిక తన అభిమానులతో కాసేపు ముచ్చట్లు పెట్టారు. ఈ క్రమంలో రష్మిక తన అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. ఇందులో ఎక్కువగా ప్రపోజల్స్ రావడం, ఫ్లర్టింగ్ కామెంట్లు రావడంతో రష్మిక ఉక్కిరి బిక్కిరి అయిపోయారు. ఒక్క బాలీవుడ్ సినిమాలో నటించకపోయినా కూడా రష్మికకు జాతీయ స్థాయిలో పేరు వచ్చింది. గీత గోవిందం, డియర్ కామ్రేడ్ సినిమాలతో ఉత్తరాదిన కూడా రష్మిక తన మార్క్ వేశారు.అలా మొత్తానికి నేషనల్ క్రష్ అనిపించుకుంటున్నారు. దానికి తగ్గట్టే ఆమె చేసే అల్లరికి తోడవుతుంటుంది. సోషల్ మీడియాలో రష్మిక రచ్చ వేరే లెవెల్‌లో ఉంటుంది. అయితే తాజాగా రష్మిక మందన్నా తన అభిమానులకు బంపర్ ఆఫర్ ఇచ్చారు. ఏదైనా అడగండి.. ఆన్సర్ చెబుతాను అని చిట్ చాట్ చేయడం మొదలుపెట్టేశారు. అందులో ఓ నెటిజన్.. నన్ను పెళ్లి చేసుకో అని నేరుగా అడిగేశారు. దానికి రష్మిక తెలివిగా సమాధానం ఇచ్చారు. కనీసం ప్రపోజల్ అయినా కూడా మంచిగా చేయొచ్చు కదా? అని మూతి వయ్యారంగా తిప్పుకున్నారు. ఇక మరో నెటిజన్ ఇంకాస్త ముందుకు అడుగు వేశారు. నీలాంటి దాన్ని పెళ్లి చేసుకోవాలంటే ఉండాల్సిందేమిటి? అని అడిగేశాడు. దానికి రష్మిక ఓ లిస్ట్ చెప్పేశారు. నైస్, క్యూట్, లో మెయింటెన్స్ అయి ఉండాలని చెప్పుకొచ్చారు. మొత్తానికి రష్మికకు ఎలాంటి వాడు కావాలో చెప్పకనే చెప్పేశారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/35ZUS7r
v

Daggubati Venkatesh : ‘నారప్ప’ సెన్సార్ అప్డేట్.. ఫ్యాన్స్‌లో అనుమానాలు!

ప్రస్తుతం టాలీవుడ్‌లో కొన్ని చిత్రాల మీద పదే పదే రూమర్లు పుట్టుకొస్తున్నాయి. సెట్స్ మీదున్న కొన్ని చిత్రాలు, షూటింగ్ పూర్తి చేసుకున్న మరికొన్ని సినిమాలను ఓటీటీలోనే విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారంటూ వార్తలు వస్తున్నాయి. అందులో మరీ ముఖ్యంగా చిత్రాల పేర్లే వినిపిస్తున్నాయి. అవి రెండూ కూడా పక్క భాషల నుంచి తీసుకుని రీమేక్ చేస్తున్న చిత్రాలే. తమిళం నుంచి అసురన్‌ను నారప్పగా.. మళయాలం నుంచి దృశ్యం 2ను అదే పేరుతో వెంకటేష్ రీమేక్ చేసిన సంగతి తెలిసిందే. ఇవి రెండూ కూడా ప్రస్తుతం షూటింగ్‌ను పూర్తి చేసుకున్నాయి. నారప్పను గత ఏడాది నుంచి చెక్కుతూనే ఉన్నారు. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో ప్రియమణి, కార్తీక్ రత్నం వంటి వారు ప్రధాన పాత్రలను పోషిస్తున్నారు. మణిశర్మ సంగీతమందిస్తున్నారు. అయితే , దృశ్యంను సురేష్ బాబు 70 కోట్లకు ఓటీటీ సంస్థకు అమ్మేశారంటూ వార్తలు వస్తున్నాయి. వాటిపై ఇంకా ఎటువంటి అధికారిక ప్రకటనా రాలేదు. అయితే నారప్ప నుంచి తాజాగా ఓ అప్డేట్ వచ్చింది. ఇటీవలె సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయని, యూ/ఏ సర్టిఫికేట్ వచ్చిందంటూ సురేష్ ప్రొడక్షన్స్ ట్వీట్ వేసింది. దీంతో అభిమానుల్లో అనుమానాలు మొదలయ్యాయి. నారప్ప సెన్సార్ పూర్తయింది.. త్వరలోనే మిమ్మల్ని కలుస్తాం అని చెప్పారు. కానీ అది ఓటీటీలోనా? థియేటర్లోనా? అనేది క్లారిటీ ఇవ్వలేదు. దీంతో వెంకీ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏదో ఒకటి తేల్చి చెప్పండంటూ ట్వీట్లు పెడుతున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/35XzrUy
v

RRR పోస్టర్‌పై సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసుల చురకలు.. రివర్స్ కౌంటర్ వేసిన చిత్రయూనిట్

తెలంగాణ ట్రాఫిక్ పోలీసులు ఈ మధ్య సోషల్ మీడియాను తెగ వాడేస్తున్నారు. అందులోనూ మరీ ముఖ్యంగా ట్రోల్స్, మీమ్స్ చేయడంలోనూ తమ టాలెంట్‌ను చూపిస్తున్నారు. అందులోనూ ప్రత్యేకంగా సినిమా వాళ్లను బాగానే వాడుకుంటున్నారు. సినిమాల నుంచి అప్డేట్లు అంటూ వచ్చే కొత్త కొత్త పోస్టర్లను తమ శైలిలో ఎడిట్ చేస్తుంటారు. సినిమాల్లో హీరోలు బైకులు రైడ్ చేసే పోస్టర్లు వస్తే తమ పనితనాన్ని చూపిస్తుంటారు. ఆ పోస్టర్లను ఎడిట్ చేసి వాటికి హెల్మెట్ పెట్టి ఓ మీమ్ వేస్తుంటారు. అలా తాజాగా ట్రాఫిక్ పోలీసుల దృష్టి మీద పడింది. నేటి ఉదయం ఆర్ఆర్ఆర్ నుంచి అదిరిపోయే పోస్టర్ ఒకటి వచ్చింది. మూవీ షూటింగ్ అప్డేట్ అంటూ టీం ఓ ట్వీట్ వేస్తూ సరికొత్త పోస్టర్‌ను వదిలింది. ఓ రెండు పాటలు మినహా షూటింగ్ పూర్తయిందని, ఇప్పటికే రెండు భాషలకు వీరు డబ్బింగ్ కూడా పూర్తి చేసేశారని , బుల్లెట్ మీద షికార్లు కొడుతున్న ఫోటోను ఆర్ఆర్ఆర్ టీం వదిలింది. ఇక అలాంటి ఫోటో దొరికితే ట్రాఫిక్ పోలీసులు వదులుతారా? తమ టాలెంట్‌ను చూపించారు. రామ్ చరణ్, ఎన్టీఆర్‌లకు గ్రాఫిక్స్‌ల్ హెల్మెట్ పెట్టేశారు.. ఇప్పుడు పర్ ఫెక్ట్‌గా ఉందని, హెల్మెట్ ధరించండి, సురక్షితంగా ఉండండి అని ట్వీట్ వేశారు. అయితే ఇలా ట్రాఫిక్ పోలీసులు తమ మీద కౌంటర్ వేయడంతో ఆర్ఆర్ఆర్ టీం రివర్స్ పంచ్ వేసింది. పర్ ఫెక్ట్ అని చెబుతున్నారు..కానీ ఇంకా పర్ ఫెక్ట్ కాలేదు.. ఎందుకంటే బండి నంబర్ మిస్ అయిందని ఆర్ఆర్ఆర్ టీం కన్ను కొట్టేసింది. ప్రస్తుతం ఈ ట్వీట్లు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. అయితే ఆర్ఆర్ఆర్ టీం నంబర్ ప్లేట్ మిస్ అయిందని చెప్పడంతో అభిమానలు నంబర్ ప్లేట్‌ను డిజైన్ చేసి పెట్టారు. రాజమౌళి 13వ సినిమా ఆర్ఆర్ఆర్ 2021 అంటూ అర్థం వచ్చేలా (SSR 13 RRR 2021) ఎడిట్ చేశారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3y47wOH
v

అమ్మ హిందూ, నాన్న ముస్లిం.. క్యాన్సర్ రావడంతో అలా.. హీరోయిన్ సదా కామెంట్స్

హీరోయన్ గురించి దక్షిణాది ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. జయం సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులను అందరినీ ఆకట్టుకున్నారు. అయితే జయం సినిమా అంత పెద్ద హిట్ అయినా కూడా వెంటనే ఆఫర్లు రాలేదట. ఇక తన ఫ్యామిలీ కూడా సినిమా పరిశ్రమకు ఏ మాత్రం సంబంధం లేదని, ఎక్కడి నుంచి వచ్చిన తాను ఇలా సినీ రంగంలోకి ఎంట్రీ ఇచ్చానని సదా చెప్పుకొచ్చారు.తాజాగా షోలోకి గెస్ట్‌గా వచ్చిన సదా ఎన్నో విషయాలను చెప్పుకొచ్చారు. మరీ ముఖ్యంగా తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విశేషాలను అందరి ముందు బయటపెట్టేశారు. ముంబై గోవా మధ్యలో ఉండే రత్నగిరి ప్రాంతానికి చెందిన వారమని తమ ఫ్యామిలీ గురించి సదా వివరించారు. అమ్మ ప్రభుత్వ ఉద్యోగి. నాన్న డాక్టర్ అని సదా తెలిపారు. సినీ పరిశ్రమకు ఎటువంటి సంబంధం లేదని అన్నారు. అయితే చిన్నప్పటి నుంచి మాత్రం డ్యాన్సులు చేయడం ఇష్టం. స్కూల్ యానివర్సరీ ఫంక్షన్‌లో ముందుండేదాన్ని. చదువుల్లో కూడా ఎప్పుడూ ఫస్టే. ఇంటర్‌లో 92 శాతం వచ్చింది. ఓసారి మా స్కూల్‌కు ఎమ్మేల్యే వచ్చారు. మా ప్రిన్సిపాల్‌తో నా గురించి మాట్లాడారు. సినిమా అవకాశాలు ఏమైనా కావాలంటే చెప్పండి అని అన్నారట. అదే విషయాన్ని మా పేరెంట్స్‌తో చెప్పారు. ఇప్పుడు చదువుతోంది.. చిన్న పిల్ల కదా ఇప్పుడే వద్దులేండి అని అన్నారట. అయితే సినిమాల్లోకి వెళ్తానంటే వద్దనరు.. వెళ్లే చాన్స్ ఉందని అప్పుడు ఫిక్స్ అయ్యానని సదా చెప్పుకొచ్చారు. రక్తం అంటే భయం ఉండటంతో మెడిసిన్ కాకుండా ఇంజనీరింగ్ కోసం బాంబే వెళ్లాను. నాతో పాటు అమ్మగారు వచ్చారు. అయితే అక్కడే యాక్టింగ్ స్కూల్‌లో జాయిన్ అయ్యాను. అలా కెరీర్ ప్రారంభమైందని సదా అన్నారు. అమ్మ హిందూ.. నాన్న ముస్లిం. వాళ్లది లవ్ మ్యారేజ్. పెళ్లి తరువాత ఇరు కుటుంబాలు దూరమయ్యాయి. వారిద్దరే తమ కాళ్ల తాము నిలబడ్డారు. ఒంటరిగానే బతికారు. అలా మేం ముగ్గురమే ఇంట్లో ఉండేవాళ్లం. 2015లో అమ్మకు క్యాన్సర్ అని తెలిసింది. ఆమె రిటైర్మెంట్‌కు ఇంకో పది రోజులు ఉందనే సరికి ఈ విషయం బయటపడింది. అలా ఆ సమయంలో నా సినిమా కెరీర్‌ను కూడా పక్కనపెట్టేశాను. అవతల ఫోన్ చేసింది ఎవరు అని కూడా కనుక్కోకుండానే.. నో చెప్పేదాన్ని అంటూ సదా తన పర్సనల్ విషయాలను బయటపెట్టేశారు. అపరిచితుడు సినిమాకు ఇచ్చిన డేట్స్ వల్ల.. చంద్రముఖిని వదులుకున్నాను అని, కొత్త డైరెక్టర్, కొత్త ప్రొడక్షన్ అని ఆనంద్ సినిమాను వదులుకున్నానని సదా తెలిపారు. అలా కొత్త డైరెక్టర్ అని ప్రాణం సినిమాను చేసిన ఎఫెక్ట్‌తోనే ఆనంద్ చిత్రాన్ని చేయలేదని అసలు విషయం బయటపెట్టేశారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3y72PE6
v

O Kalyan : గెలిపించే సత్తా ఉంది.. అది మాత్రం చేయలేరా?.. నాగబాబుపై ఓ కళ్యాణ్

మూవీ ఆర్టిస్టు అసోషియేషన్ (మా) ఎన్నికలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. మొదటగా త్రిముఖ పోటీ అనుకున్నారు. కానీ నాలుగో వ్యక్తి కూడా ఎంటరయ్యారు. అయితే ఇవన్నీ కూడా కావు.. చివరకు ఓ మహిళను ఏకగ్రీవం చేయనున్నారనే టాక్ బయటకు వచ్చింది. అలా మొత్తానికి మా ఎన్నికలు మాత్రం మంచి రంజు మీదున్నాయి. ఈ నేపథ్యంలో ఒకరి తరువాత ఒకరు మీడియా ముందుకు వస్తున్నారు. అందరూ మా ఎన్నికల మీద విమర్శలు సంధిస్తున్నారు. మరీ ముఖ్యంగా నాగబాబు వ్యాఖ్యలపై కామెంట్ చేస్తున్నారు. ప్రస్తుతం మా ఎన్నికల్లో అధ్యక్ష పదవీ కోసం సీనియర్ నటుడు ప్రకాష్ రాజ్, మంచు విష్ణు, జీవిత రాజశేఖర్, హేమ , సీవీఎల్ నరసింహా రావులు పోటీ చేసేందుకు సిద్దంగా ఉన్నారు. ఇప్పటికే ఎవరికి తగ్గట్టు వారు తమ తమ వ్యూహాలను రచించుకుంటున్నారు. అందరి కంటే ఎక్కువగా ప్రకాశ్ రాజ్, మంచు విష్ణులు దూసుకుపోతోన్నారు. ప్రకాశ్ రాజ్ ఏకంగా తన ప్యానెల్‌తో కలిసి మీడియా ముందుకు వచ్చేశారు. ఇక మంచు విష్ణు సైతం తాను రంగంలోకి దిగబోతోన్నట్టు ప్రెస్ నోట్ ద్వారా అధికారికంగా ప్రకటించేశారు.

మూవీ ఆర్టిస్టు అసోషియేషన్ (మా) ఎన్నికలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. మొదటగా త్రిముఖ పోటీ అనుకున్నారు. కానీ నాలుగో వ్యక్తి కూడా ఎంటరయ్యారు. అయితే ఇవన్నీ కూడా కావు.. చివరకు ఓ మహిళను ఏకగ్రీవం చేయనున్నారనే టాక్ బయటకు వచ్చింది.


O Kalyan : గెలిపించే సత్తా ఉంది.. అది మాత్రం చేయలేరా?.. నాగబాబుపై ఓ కళ్యాణ్

మూవీ ఆర్టిస్టు అసోషియేషన్ (మా) ఎన్నికలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. మొదటగా త్రిముఖ పోటీ అనుకున్నారు. కానీ నాలుగో వ్యక్తి కూడా ఎంటరయ్యారు. అయితే ఇవన్నీ కూడా కావు.. చివరకు ఓ మహిళను ఏకగ్రీవం చేయనున్నారనే టాక్ బయటకు వచ్చింది. అలా మొత్తానికి మా ఎన్నికలు మాత్రం మంచి రంజు మీదున్నాయి. ఈ నేపథ్యంలో ఒకరి తరువాత ఒకరు మీడియా ముందుకు వస్తున్నారు. అందరూ మా ఎన్నికల మీద విమర్శలు సంధిస్తున్నారు. మరీ ముఖ్యంగా నాగబాబు వ్యాఖ్యలపై కామెంట్ చేస్తున్నారు. ప్రస్తుతం మా ఎన్నికల్లో అధ్యక్ష పదవీ కోసం సీనియర్ నటుడు ప్రకాష్ రాజ్, మంచు విష్ణు, జీవిత రాజశేఖర్, హేమ , సీవీఎల్ నరసింహా రావులు పోటీ చేసేందుకు సిద్దంగా ఉన్నారు. ఇప్పటికే ఎవరికి తగ్గట్టు వారు తమ తమ వ్యూహాలను రచించుకుంటున్నారు. అందరి కంటే ఎక్కువగా ప్రకాశ్ రాజ్, మంచు విష్ణులు దూసుకుపోతోన్నారు. ప్రకాశ్ రాజ్ ఏకంగా తన ప్యానెల్‌తో కలిసి మీడియా ముందుకు వచ్చేశారు. ఇక మంచు విష్ణు సైతం తాను రంగంలోకి దిగబోతోన్నట్టు ప్రెస్ నోట్ ద్వారా అధికారికంగా ప్రకటించేశారు.



మీడియా ముందుకు..
మీడియా ముందుకు..

అయితే తాజాగా నటుడు ఓ కళ్యాణ్ మీడియా ముందుకు వచ్చారు. అతను కూడా అధ్యక్ష పదవికి పోటీ చేయబోతోన్నారనే వార్తలు వచ్చాయి. అయితే వీటిపై ఓ కళ్యాణ్ స్పందించారు. తన ఆవేదన, రూమర్లు, ‘మా’లో జరుగుతున్న వాటి గురించి మీడియా ముందు బహిర్గత పరిచారు. మీడియాతో మాట్లాడుతూ ఓ కళ్యాణ్ నాటి విషయాలను గుర్తు చేశారు. గతంలో ఎన్నికలు జరిగిన తీరు, కోర్టు మెట్లు ఎక్కిన సందర్భం, మా ఎన్నికల సరళి, పెద్దల తీరు ఇలా ప్రతీ ఒక్క అంశం మీద ఓ కళ్యాణ్ కుండ బద్దలు కొట్టేసినట్టు మాట్లాడారు.



నాగబాబు సపోర్ట్ చేశారు..
నాగబాబు సపోర్ట్ చేశారు..

ప్రస్తుతం ఉన్న మా సంఘం సభ్యుల తీరు ఎవరికి వారు యమునా తీరే అన్నట్టు అయ్యింది.. నాగబాబు అంటే నాకు గౌరవం. ఆయన్ను బాబు అని పిలుస్తాను. అయన భాధ్యత తీసుకొనే కదా గెలిపించింది.. మరి ఇంతగా పరిస్థితులు దిగజారితే మీరు ఇంట్లో కూర్చొని ఎలా కూర్చుని ఉన్నారు. గెలిపించే సత్తా ఉన్నప్పుడు అందరినీ ఒకే చోట కూర్చుని సమస్యలను పరిష్కరించలేరా?. ఇంతకు ముందు చేసిన అధ్యక్షులకు కూడా నాగబాబే మద్దతు తెలిపారు. ఈ సారి మళ్లీ ప్రకాష్ రాజ్ అంటున్నారు. ఆయన ప్లానింగ్ నచ్చిందని సపోర్ట్ చేస్తాను అని అంటున్నారు. ఇంతకు ముందు ముగ్గురు కూడా మీరు సపోర్ట్ చేసిన వాళ్లే. మళ్లీ అదే రిపీట్ కాదన్న గ్యారెంటీ ఏంటి అని ఓ కళ్యాణ్ ప్రశ్నించారు.



సీసీసీ కోసం అలా..
సీసీసీ కోసం అలా..

ఇండస్ట్రీలోని పెద్దలు చిరంజీవి అన్నయ్య, మోహన్ బాబు అన్నయ్య, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున ఇలా పెద్దవారంతా ముందుకు రావాలి. వారు కలగజేసుకుని ఈ ఎన్నికలను ఏకగ్రీవం చేయాలి..ఎవరిని ఏ స్థానంలో ఉంచాలో వారే నిర్ణయించాలి. ఈ పరిస్థితులను చక్కబెట్టాలి. సీసీసీ కోసం వారం రోజుల్లో పది కోట్లు తెచ్చిపెట్టిన హీరోలు.. ‘మా’ కోసం ఓ బిల్డింగ్ కట్టలేరా? ప్రభుత్వం సాయం చేయడం లేదనుకుందాం.. ఓ యాభై కోట్లు కలెక్ట్ చేసి బిల్డింగ్ కట్టేంత లేదా? అని ఓ కళ్యాణ్ తన ఆవేదనను బయటపెట్టేశారు.



నా స్థాయిని మించి..
నా స్థాయిని మించి..

ఇది నా స్థాయి కాకపోయినా.. నా స్థాయిని మించి నేను సాయం చేసేందుకు వస్తాను. నా మనవరాలి పేరు మీదున్న ఆస్తిని అమ్మి కోటిన్నర వరకు ‘మా’ బిల్డింగ్ కోసం సాయం చేస్తాను. ఎవరైనా సరే ముందుకు వచ్చి ఈ సమస్యలు పరిష్కరించి ఓ బిల్డింగ్ కట్టాలి. తమిళ, కన్నడ, మళయాలి వాళ్లకు ఓ బిల్డింగ్ ఉంది. కానీ మనకు ఇంత వరకు లేనేలేదు. పెద్దలు ఎవరైనా సరే కలగజేసుకుని వీటిని వెంటనే పరిష్కరించాలి.. నేను మీడియా ద్వారా నా బాధను చెబితే వారికి రీచ్ అవుతుందని ఇలా చెబుతున్నాను అని ఓ కళ్యాణ్ అన్నారు.





from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2Tlkj0q
v

'హర హర వీరమల్లు' హైలైట్ పాయింట్ అదే.. అందుకోసం భారీ మొత్తం ఖర్చు చేస్తున్న నిర్మాత!

'అజ్ఞాతవాసి' సినిమా తర్వాత రాజకీయాల్లోకి వెళ్లి 'వకీల్ సాబ్' రూపంలో తిరిగి కెమెరా ముందుకొచ్చారు పవర్ స్టార్ . రీ- ఎంట్రీ తర్వాత తొలి సినిమాతోనే భారీ సక్సెస్ ఖాతాలో వేసుకున్న ఆయన.. వరుసపెట్టి భారీ ప్రాజెక్టులను లైన్‌లో పెట్టారు. అందులో ఒకటే క్రిష్‌ జాగర్లమూడి దర్శకత్వంలో రూపొందుతున్న ''. శరవేగంగా షూటింగ్ జరిపి వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ మూవీ రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్న క్రిష్.. షూటింగ్ కోసం వేసే సెట్స్ విషయంలో ఎక్కడా వెనక్కి తగ్గడం లేదట. 17వ శతాబ్దం నేపథ్యంలో పీరియాడికల్‌ డ్రామాగా ఈ 'హరి హర వీరమల్లు' ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం 180 కోట్ల మేర బడ్జెట్ కేటాయించినట్లు సమాచారం. మొగల్ చక్రవర్తుల కాలం నాటి కథ కళ్ళకు కట్టినట్లుగా ఉండేలా భారీ సెట్స్ వేస్తున్నారట. కథపై ఉన్న నమ్మకంతో నిర్మాత ఎ.ఎం రత్నం కూడా ఖర్చు విషయంలో వెనకాడటం లేదని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ ఆసక్తికర విషయం బయటకొచ్చింది. 'హరిహర వీరమల్లు' మూవీ కోసం భారీ సెట్టింగ్స్ నిర్మిస్తున్నట్లు గతంలోనే ప్రకటించిన యూనిట్.. ఇప్పుడు ఓ ఫిల్మ్ స్టూడియోలో ఆగ్రా కోట సెట్టింగ్‌ చేస్తున్నారట. ఈ ఒక్క సెట్టింగ్ కోసం 10 కోట్లు వరకు ఖర్చు చేస్తున్నట్లు తెలుస్తోంది. అతిత్వరలో ప్రారంభం కాబోయే షూటింగ్‌కి ఈ భారీ సెట్ వేదిక కానుందని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇందులో పవన్ ఫైట్ సీక్వెన్స్‌లు చిత్రీకరించనున్నారట. ఇక్కడ షూట్ చేయబోయే సన్నివేశాలే సినిమాలో హైలైట్‌గా నిలుస్తాయని తెలుస్తోంది. పాన్‌ ఇండియా సినిమాగా రూపొందుతున్న ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తోంది. బాలీవుడ్‌ నటుడు అర్జున్‌ రాంపాల్‌ ఆరో మొఘల్‌ చక్రవర్తి ఔరంగజేబు పాత్రలో కనిపించబోతున్నారు. పిరియాడిక్ జానర్‌లో పవన్ కళ్యాణ్ నటిస్తోన్న మొట్టమొదటి సినిమా కావడంతో ఈ సినిమాపై జనాల్లో భారీ హైప్ క్రియేట్ అయింది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2Uc1Tj3
v

Vignesh Shivan : పెళ్లికి ముందే పిల్లల్ని కంటారా?.. నెటిజన్ ప్రశ్నకు విఘ్నేశ్ శివన్ అదిరిపోయే కౌంటర్!

ప్రియుడు సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటారు. అయితే నయన్ మాత్రం సోషల్ మీడియాకు ఆమడ దూరంలో ఉంటారు. ఆమెకు సోషల్ మీడియా ఖాతాలు కూడా ఉండవు. కానీ ఆమె అభిమానులు మాత్రం నయన్ గురించి తెలుసుకునేందుకు విఘ్నేశ్ శివన్‌ను ఫాలో అవుతుంటారు. అప్పుడప్పుడు నయన్‌కు సంబంధించిన విషయాలు విఘ్నేశ్ షేర్ చేస్తుంటారు. ఇక నయనతారతో దిగే రొమాంటిక్ ఫోటోలను విఘ్నేశ్ శివన్ షేర్ చేస్తే అవి తెగ వైరల్ అవుతుంటాయి. ఈ మధ్య విఘ్నేశ్ శివన్ తన ఫాలోవర్లతో చిట్ చాట్ చేస్తున్నారు. మొన్న ఆదివారం నాడు కూడా విఘ్నేశ్ తన ఫ్యాన్స్‌తో ముచ్చట్లు పెట్టారు. అలా విఘ్నేశ్‌కు రకరకాల ప్రశ్నలు ఎదురయ్యాయి. దాంట్లో ఎక్కువగా నయనతారకు సంబంధించిన విషయాలే ఉన్నాయి. అలా తనను నయనతారకు సంబంధించిన ప్రశ్నలే అడుగుతుంటే ఎలా అనిపిస్తోందని ఓ నెటిజన్ అడిగేశాడు. అలా అడుగుతుంటే ఎంతో గర్వంగా ఉందని విఘ్నేశ్ చెప్పుకొచ్చారు. అయితే కొందరు నెటిజన్‌లు మాత్రం కొంటె ప్రశ్నలను అడిగేశారు. నయనతారను ముద్దుపెట్టుకుంటున్న ఫోటోను షేర్ చేయండని ఓ నెటిజన్ అడిగాడు. ముద్దు పెట్టుకునే బిజీలో నేను ఉంటే.. ఫోటో తీయడానికి ఎవ్వరూ లేరు అని కౌంటర్ వేశారు. మరో నెటిజన్ ఇంకాస్త ముందుకువెళ్లి ఓ ప్రశ్నను సంధించారు. ఓ బిడ్డను మేం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చా? అని పర్సనల్ విషయాలను అడిగేశారు. అయితే దీనికి విఘ్నేశ్ శివన్ అదిరిపోయే కౌంటర్ వేశారు. అది మీ భాగస్వామి, మీ నిర్ణయం మీద ఆధారపడి ఉంటుందని ప్రశ్నను తిప్పి కొట్టేశారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3joGltX
v

భూ వివాదంలో టాలీవుడ్‌ బడా ప్రొడ్యూసర్.. సి కళ్యాణ్‌పై పోలీస్ కేసు నమోదు

టాలీవుడ్‌కి చెందిన ప్ర‌ముఖ నిర్మాత సి కళ్యాణ్‌పై నమోదైంది. భూ వివాదంలో ఆయన చిక్కుకోవడం సినీ వర్గాల్లో చర్చనీయాంశం అయింది. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు బంజారాహిల్స్ పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. షేక్‌పేట భూవివాదంపై వచ్చిన ఫిర్యాదు పరిశీలించి సి కళ్యాణ్‌తో పాటు మరో ముగ్గురిపై ఈ కేసు నమోదు చేయడం జరిగింది. అమెరికాలో వైద్యుడిగా ప‌నిచేస్తున్న స్వ‌రూప్ అనే వ్య‌క్తి 1985 సంవత్సరంలో షేక్‌పేటలో ఫిలింన‌గ‌ర్ హౌసింగ్ సొసైటీ నుంచి భూమి కొనుగోలు చేశాడు. ఈ స్థ‌లాన్ని 2015 సంవత్సరంలో నారాయణ మూర్తి అనే వ్య‌క్తికి లీజుకు ఇచ్చాడు. లీజుకు తీసుకున్న ఆ స్థలంలో అప్ప‌టి నుంచి నారాయణ మూర్తి ఓ ఆర్గానిక్‌ స్టోర్‌ నడుపుతున్నాడు. అయితే సోమ‌వారం సాయంత్రం సమయంలో ష‌రూఫ్‌, శ్రీకాంత్‌, తేజ‌స్వీ అనే ముగ్గురు వ్య‌క్తులు సదరు ఆర్గానిక్ స్టోర్‌కు వెళ్లి నిర్మాత సి. క‌ళ్యాణ్ పంపించాడ‌ని చెప్పి.. స్టోర్‌కు తాళం వేయడంతో ఈ ఇష్యూ పోలీస్ స్టేషన్ దాకా వెళ్ళింది. ఆర్గానిక్ స్టోర్ య‌జ‌మాని సి. క‌ళ్యాణ్‌తో పాటు ఆ ముగ్గురిపై బంజారాహిల్స్ పోలీసుల‌కు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు క‌ళ్యాణ్‌తో పాటు ఆ ముగ్గురిపై కూడా కేసు న‌మోదు చేసి విచార‌ణ చేప‌డుతున్నారు. ఈ కేసుకు సంబంధించి తదుపరి వివరాలు తెలియాల్సి ఉంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3y0yxmj
v

RRR: బుల్లెట్‌పై జెట్ స్పీడుతో ఎన్టీఆర్, రామ్ చరణ్.. మెగా, నందమూరి ఫ్యాన్స్ హుషారెత్తే అప్‌డేట్

దేశవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకలోకం ఎంతగానో ఎదురుచూస్తున్న పాన్ ఇండియా మూవీ . దర్శక ధీరుడు రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై అన్ని వర్గాల ప్రేక్షకుల్లో బోలెడన్ని అంచనాలున్నాయి. పైగా ఈ మూవీతో స్టార్ హీరోలు , తెర పంచుకోనుండటం మరింత ఆసక్తికరంగా మారింది. అయితే ఎప్పటికప్పుడు అనుకోని కారణాలతో ఈ మూవీ షూటింగ్ వాయిదా పడటంతో రిలీజ్ డేట్ మారుతూ వస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా మెగా, నందమూరి ఫ్యాన్స్ హుషారెత్తే అప్‌డేట్ ఇచ్చారు జక్కన్న. RRR సినిమాకు సంబంధించి రెండు పాటలు మినహా షూటింగ్‌ మొత్తం ఫినిష్ అయిందని పేర్కొంటూ సామాజిక మాధ్యమాల వేదికగా ప్రకటించారు. రామ్‌ చరణ్‌, ఎన్టీఆర్‌ ఇప్పటికే రెండు భాషల్లో డబ్బింగ్‌ పూర్తి చేశారు. ఇతర భాషలకి త్వరలోనే డబ్బింగ్‌ చెప్పనున్నారని తెలిపారు. ఈ మేరకు బుల్లెట్‌పై జెట్ స్పీడుతో వెళ్ళుతున్న ఎన్టీఆర్, రామ్ చరణ్ స్టిల్ రిలీజ్ చేశారు. దీంతో ఈ పిక్ క్షణాల్లో వైరల్ అయింది. ఈ న్యూస్ తెలియడంతో RRR ఈ ఏడాది అక్టోబర్ లోనే రిలీజ్ చేసే అవకాశం ఉందనే మ్యాటర్ మరోసారి తెరపైకి వచ్చింది. డీవీవీ దానయ్య సమర్పణలో భారీ బడ్జెట్ కేటాయించి హై టెక్నికల్ వాల్యూస్‌తో రూపొందుతున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరసన ఒలీవియా మోరిస్ నటిస్తుండగా.. రామ్ చరణ్ సరసన ఆలియా భట్ ఆడిపాడుతోంది. అజయ్‌ దేవగణ్‌, శ్రియ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన అన్ని అప్‌డేట్స్ ఓ రేంజ్ రెస్పాన్స్ తెచ్చుకొని మూవీ రిలీజ్‌కి ముందే రికార్డుల సునామీ సృష్టించాయి.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3hkKAEp
v

జబర్దస్త్ వర్ష పెళ్లి తంతు.. అలా రెచ్చిపోయిన హైపర్ ఆది! పోలీసులు ఎంటర్ కావడంతో..

అదేంటో.. ఈ మధ్యకాలంలో నటీనటుల లవ్ ఎఫైర్లకు, పెళ్లి డ్రామాలకు సోషల్ మీడియాలో మాంచి గిరాకీ ఉంటోంది. నటీనటుల మధ్య ఉండే సంబంధాలు తెలుసుకునేందుకు ప్రాధాన్యత ఇస్తున్నారు ఆడియన్స్. దీంతో బుల్లితెర ప్రోగ్రాం నిర్వాహకులు దీన్ని క్యాచ్ చేస్తూ ఇదే అంశాన్ని హైలైట్ చేస్తున్నారు. బుల్లితెర రొమాంటిక్ జోడీలను పెళ్లి పీటలపై కూర్చోబెట్టి టీఆర్ఫీ దక్కించుకునే ప్లాన్ చేస్తున్నారు. ఇలా ఇప్పటికే చాలాసార్లు రష్మీ- సుధీర్ పెళ్లి చేయడం చూసాం. ఇప్పుడు అదే సీన్ ఇమ్మానుయేల్- వర్షలతో కానిచ్చేశారు. జబర్దస్త్ జోడీల్లో ఇమ్మానుయేల్- జోడీకి భారీ డిమాండ్ నెలకొంది. నలుపు, తెలుపు కాంబినేషన్ కావడం, పైగా ఇద్దరూ కెమెరా ముందు పండించే కెమిస్ట్రీ హైలైట్ అవుతుండటంతో ఫుల్ పాపులారిటీ దక్కించుకున్నారు. దీంతో ఇదే పాయింట్ తీసుకొని 'శ్రీదేవి డ్రామా కంపెనీ' వారు ఇమ్మానుయేల్- వర్ష పెళ్లి డ్రామా వేసేశారు. ఇందులో హైపర్ ఆది, గెటప్ శీను, ఆటో రామ్ ప్రసాద్ కామెడీ పండించే ప్రయత్నం చేశారు. సరిగ్గా వర్ష మెడలో ఇమ్మానుయేల్ తాళి కట్టే సమయంలో పోలీసులు వచ్చి పెళ్లి ఆపడం, ఆ టైమ్‌లో వేసిన పంచ్ డైలాగ్ కాస్త నవ్వించాయి. ఆ తర్వాత వేదికపై హైపర్ ఆది, గెటప్ శీను, ఆటో రామ్ ప్రసాద్, ఇమ్మానుయేల్, వర్ష అందరూ కలిసి 'అనితా.. ఓ అనిత' పాట పాడారు. ఈ స్కిట్‌లో ఎప్పటిలాగే తనదైన ఎనర్జీతో హైపర్ ఆది రెచ్చిపోవడం చూడొచ్చు. కాగా, ఈ వీడియోను ప్రమోట్ చేయడంలో భాగంగా వర్ష తన సోషల్ మీడియా ఖాతాలో రీసెంట్‌గా తాళిబొట్టు ఫొటో చేసింది. దీంతో ఇలాంటి పెళ్లి ట్రిక్స్ ప్లే చేస్తూ చీఫ్ పబ్లిసిటీ చేయడమేంటని నెటిజన్స్ ట్రోల్ చేస్తున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/35YwZNB
v

Monday 28 June 2021

Rgv: అరియానాతో మరో బోల్డ్ వీడియో.. జస్ట్ చిల్ అంటూ హేటర్స్‌కి ఆర్జీవీ మెసేజ్! నేరుగా ఆ మాట చెబుతూ..

ఏది చేసినా అందులో ఓ కొత్తదనం ఉండేలా చూసుకుంటారు. విమర్శలు, ప్రశంసలు లాంటి వాటిని పెద్దగా పట్టించుకోని ఆయన.. నిత్యం ఏదో ఒక అంశంతో జనం నోళ్ళలో నానుతుంటారు. సోషల్ మీడియాలో హైలైట్ కావడం ఎలా? అనేది వర్మకు తెలిసినంతగా ఇంకెవ్వరికీ తెలియదేమో అనిపిస్తోంది రీసెంట్ పరిణామాలు చూస్తుంటే. సమాజంలోని ప్రతి అంశంపై ఫోకస్ పెట్టే వర్మ బోల్డ్ విషయాలను ఓపెన్ గానే మాట్లాడుతుండటం చూస్తున్నాం. ఈ క్రమంలోనే రీసెంట్‌గా ' బోల్డ్ ఇంటర్వ్యూ విత్ ' ఏ మేర చర్చల్లో నిలిచిందో తెలిసిందే. సాధారణమైన ఇంటర్వ్యూలకు బిన్నంగా బోల్డ్ అంశాలను జోడిస్తూ యంగ్ యాంకర్‌తో ఇంటర్వ్యూ ప్లాన్ చేశారు వర్మ. తనదైన కెమెరా యాంగిల్స్ ఉపయోగిస్తూ జిమ్ములో అరియానా అందాలపై ఫుల్ ఫోకస్ పెట్టారు. ఇక విడుదలకు ముందు ఈ ఇంటర్వ్యూను సినిమా రేంజ్‌లో పబ్లిసిటీ చేశారు. అయితే ఈ వీడియో రిలీజ్ అయ్యాక వర్మపై కొందరు నెగెటివ్ కామెంట్స్ చేయడమే గాక, కూతురు వయసున్న యంగ్ యాంకర్‌తో అలాంటి పనులేంటి? అంటూ విమర్శలు గుప్పించారు. ఈ నేపథ్యంలో ఎప్పటిలాగే అలాంటి విమర్శలను పెద్దగా లెక్కచేయని రామ్ గోపాల్ వర్మ.. ఎవరేమనుకుంటే నాకేంటి? అంటూ మరో అడుగు ముందుకేశారు. ఓ వీడియో ద్వారా 'జస్ట్ చిల్' అంటూ తనపై వస్తున్న విమర్శలను తిప్పికొట్టారు. నాతో అరియానా గ్లోరి చేసిన ఇంటర్వ్యూ ఫుల్ సక్సెస్ అయింది. దాదాపు 40 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. అందుకు నేను, అరియానా చాలా హ్యాపీగా ఉన్నాం. ఎవరెవరైతే ఆ ఇంటర్వ్యూ చూసి సంతోషంగా ఫీల్ కాలేదో వాళ్లందరికీ లవ్ యూ.. అప్పుడప్పుడూ కాస్త చిల్ అవడం నేర్చుకొని అని వర్మ అన్నారు. ''ఈ సందర్భంగా అరియానా మిక్స్ ఆర్జీవీ అంటూ అదే వీడియో చిన్న చిన్న గిమ్మిక్కులు చేసి మళ్ళీ రిలీజ్ చేస్తున్నాం. ఇది ఇంకో వర్షన్. చూడండి.. చూసి ఆనందించండి. దూషించడం లాంటివి కూడా చేయండి. దానివల్ల కూడా మాకు వ్యూస్ పెరుగుతాయి'' అని రామ్ గోపాల్ వర్మ పేర్కొన్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3jnWiAA
v

Vignesh Shivan: అది జరిగాకే నయనతారతో పెళ్లి.. అందుకే వెయిటింగ్! సీక్రెట్ ఫొటో బయటపెడుతూ ఓపెన్

సౌత్ ఇండియన్ లేడీ సూపర్ స్టార్ ప్రేమ సంగతులు, పెళ్లి ముచ్చట్లకు నిత్యం వార్తల్లో ఎంతో కొంత స్పేస్ ఉంటూనే ఉంటుంది. ఇప్పుడే కాదు ఎప్పటినుంచో నయన్ పెళ్లి మ్యాటర్ అనేది ఓ హాట్ టాపిక్. గతంలో కొరియోగ్రాఫర్ ప్రభుదేవాతో పెళ్లి పీటల దాకా వెళ్లిన లవ్ స్టోరీకి అనూహ్యంగా బ్రేకులు పడ్డాయి. ఆ తర్వాత తమిళ దర్శకుడు విగ్నేష్ శివన్‌తో ప్రేమాయణం నడిపిస్తోంది నయనతార. ఈ ఇద్దరిది కూడా చాలాకాలంగా కొనసాగుతున్న లవ్ ఎఫైర్. మొదటి సీక్రెట్‌గా నడిపించినా ఆ తర్వాత ఓపెన్ అయ్యారు. దీంతో మ్యాటర్ మరోసారి చర్చల్లో నిలిచింది. నయనతార- విగ్నేష్ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారంటూ గత కొన్నినెలలుగా వార్తల ప్రవాహం కొనసాగుతోంది. కానీ ఆ మూడు ముళ్ళ బంధానికి మాత్రం ముహూర్తం కుదరలేదు. దీంతో వాళ్లిద్దరు ఎక్కడ కనిపించినా ప్రేక్షకుల నుంచి ముందుగా వచ్చే ప్రశ్న 'మీ పెళ్లి ఎప్పుడు?'. ఈ నేపథ్యంలో తాజాగా విగ్నేష్ శివన్ సోషల్ మీడియా వేదికగా అభిమానులతో ముచ్చటించగా మళ్ళీ ఇదే ప్రశ్న ఎదురైంది. అయితే దీనిపై ఆయన చెప్పిన సమాధానం విని షాకయ్యారు నెటిజన్లు. ముందు డబ్బు సంపాదించాలి.. ఆ తర్వాతే పెళ్లి అని విగ్నేష్ పేర్కొనడం ఆశ్చర్యం కలిగించింది. నయనతారతో మీ సీక్రెట్ పిక్ అని అడిగితే.. వాళ్లిద్దరూ కలిసి ఉన్న ఓ పిక్ షేర్ చేశారు విగ్నేష్ శివన్. అంతేకాదు చీరలో నయన్ చాలా అందంగా ఉంటుందని, చీరకట్టు ఆమెకు బాగా సూట్ అవుతుందని అన్నారు. ఇక 'మీరు ఎందుకని నయన మేడమ్‌ను ఇంకా పెళ్లి చేసుకోవడం లేదు? దాని కోసం మేమంతా వేచి చూస్తున్నాం' అని ఓ నెటిజన్ ప్రశ్నించడంతో.. 'పెళ్లి దాని తర్వాత జరిగేవన్నీ చాలా ఖర్చుతో కూడుకుని ఉంటాయి బ్రదర్. అందుకే చాలా రోజులుగా డబ్బు పోగు చేస్తున్నాం' అంటూ షాకింగ్ ఆన్సర్ చేశారు విగ్నేష్. దీంతో ఈ ఇష్యూ సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇకపోతే ఇదే సెషన్‌లో నెటిజన్లు అడిగిన పలు ప్రశ్నలపై రియాక్ట్ అయిన విగ్నేష్.. సినీ ఇండస్ట్రీలో తనకు రజినీకాంత్ ప్రేరణ అని చెప్పారు. ఆయనతో సినిమా చేయాలనే కోరికను బయటపెట్టారు. అదే విధంగా ఒకవేళ బాలీవుడ్ సినిమా డైరెక్ట్ చేయాల్సివస్తే రణ్‌బీర్ కపూర్‌తో చేయాలనుందని అన్నారు. అలాగే తన ఫేవరెట్ క్రికెటర్ ధోనీ అని విగ్నేష్ చెప్పారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3hjtFSm
v

సినిమా రౌండప్: ఒకే ఒక జీవితం.. గతం గతః అంటూ అనుష్క ఎమోషనల్! అందుకే రంగంలోకి..

అనుష్క ఎమోషనల్ పోస్ట్ మనిషి జీవితం, మారుతున్న రోజుల్లో ఎలా బ్రతకాలి అనే దానిపై స్టార్ హీరోయిన్ అనుష్క పెట్టిన పోస్ట్ వైరల్ అవుతోంది. అందమైన ప్రతిరోజు మాయమైపోతోంది కాబట్టి పాజిటివ్ ఆలోచనలతో ముందుకు వెళ్లాలని ఆమె పేర్కొంది. జ‌రిగినదాన్ని త‌లుచుకుని బాధ పడొద్దని, అంద‌రిపై ప్రేమ‌ను చూపించండి అని తెలుపుతూ.. ప్ర‌తిదానిలో కూడా మంచిని వెతుకుతూ ముందుకు వెళ్లే ప్ర‌య‌త్నం చేయండి అని చెప్పింది. ఎప్పుడూ హాయిగా నవ్వుతూ ఉండాలని అనుష్క చెప్పింది. ఒకే ఒక జీవితం ప్రస్తుతం అజయ్ భూపతి దర్శకత్వంలో 'మహా సముద్రం' సినిమా చేస్తున్న శర్వానంద్.. తన 30వ సినిమాగా 'ఒకే ఒక జీవితం' సినిమాను ప్రకటించారు. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్ నిర్మిస్తున్న ఈ సినిమాకి శ్రీ కార్తీక్ దర్శకత్వం వహిస్తున్నాడు. రీతూ వర్మ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాలో అక్కినేని అమల, ప్రియదర్శి కీలక పాత్రలు పోషిస్తున్నారు. తాజాగా ఈ మూవీ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. అందుకే రంగంలోకి.. ఈ సారి మూవీ ఆర్టిస్ట్ ఎలక్షన్స్ మరింత రసవత్తరంగా మారాయి. అనూహ్యంగా తెలంగాణ వాదంతో సీవీఎల్‌ నరసింహారావు ఈ ఎన్నికల బరిలో దిగారు. అయితే తాను బరిలో నిలవడానికి ముఖ్య కారణం చెప్పారు నరసింహారావు. 'మా' అనేక అవకతవకలకు కేంద్రంగా మారిందని, మంచి చేద్దామని ఎవరైనా ప్రయత్నించినా వారికి ఇబ్బందులు ఎదురవుతున్నాయని.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పేద కళాకారులకు న్యాయం జరుగుతుందని భావించినా అలా జరగలేదు కాబట్టే తానే రంగంలోకి దిగాలని నిర్ణయించుకున్నానని అన్నారు. మరోసారి 'భీష్మ' కాంబో నితిన్ హీరోగా వెంకీ కుడుమల దర్శకత్వంలో రూపొందిన 'భీష్మ' సినిమా సూపర్ సక్సెస్ సాధించిన సంగతి తెలిసిందే. గతేడాది విడుదలైన ఈ సినిమా సాలీడ్ కలెక్షన్స్ రాబట్టి ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ సినిమాతో నితిన్ మళ్ళీ హిట్ ట్రాక్ ఎక్కేశారు. అదే స్పీడుతో 'మాస్ట్రో' పూర్తి చేసిన నితిన్.. మరోసారి వెంకీ కుడుమలతో సినిమా చేయబోతున్నారట. ఇటీవలే వెంకీ చెప్పిన కథ నచ్చి నితిన్ ఓకే చెప్పారని తెలుస్తోంది. మీనా కాదు నదియా 'దృశ్యం' సినిమాను తమిళంలో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీలో కమల్ భార్య పాత్ర కోసం మీనాను తీసుకోనున్నట్టుగా వార్తలు వచ్చాయి. అయితే మలయాళంలో పాటు తెలుగులో హీరో భార్య పాత్రలో మీనానే నటించింది కాబట్టి తమిళంలో కూడా ఆమెనే తీసుకుంటే కొత్తదనం ఉండదని భావించి నదియాను ఫైనల్ చేశారట మేకర్స్.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3jpi0o2
v

RRR: అదిరిపోయే అప్‌డేట్ బయటపడింది.. ఎన్టీఆర్ తండ్రి ఆయనే! ఆ విషయమై రాజమౌళి..

మెగా, నందమూరి ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సినిమా RRR. 'బాహుబలి' తర్వాత అదే రేంజ్‌లో ఈ మూవీ రూపొందిస్తున్నారు రాజమౌళి. చిత్రంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తెర పంచుకోనుండటం ఆసక్తికర అంశం. ఇక ఈ ఇద్దరి రోల్స్ ఎక్కడా హెచ్చుతగ్గులు లేకుండా బ్యాలెన్స్ చేస్తూ కథపై కసరత్తులు చేసిన జక్కన్న.. అంతా పక్కాగా ప్లాన్ చేసి రూపొందిస్తున్నారట. మరోవైపు గురించి బయటకొచ్చిన ప్రతి అప్‌డేట్ వైరల్ అయిన సంగతి మనందరికీ తెలుసు. ఈ నేపథ్యంలో తాజాగా మరో ఆసక్తికర విషయం బయటకొచ్చింది. భారీ బడ్జెట్ కేటాయించి డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ మూవీలో కొమురం భీమ్‌గా ఎన్టీఆర్‌, అల్లూరి సీతారామ‌ రాజుగా రామ్‌చ‌ర‌ణ్ కనిపించబోతున్నారు. ఇప్పటికే ఈ ఇద్దరికి సంబంధించిన లుక్స్ విడుదలై సినిమాపై ఓ రేంజ్ హైప్ క్రియేట్ చేశాయి. ఇక బాలీవుడ్ హీరో అజ‌య్ దేవ‌గ‌ణ్‌ ఇందులో ముఖ్యపాత్ర పోషిస్తున్నట్లు గతంలోనే అఫీషియల్ స్టేట్‌మెంట్ ఇచ్చారు. ఇప్పుడు ఆ రోల్ ఏంటనే దానిపై ఫిలిం నగర్‌లో గుసగుసలు మొదలయ్యాయి. కొమురం భీమ్ తండ్రి పాత్ర‌లో అంటే ఎన్టీఆర్ తండ్రి పాత్ర‌లో అజ‌య్ దేవ‌గ‌ణ్‌ నటిస్తున్నారని చెప్పుకుంటున్నారు. అజయ్ పాత్రపై కూడా సినిమాలో బాగా హైలైట్ కానుందట. అందుకే ఈ పాత్రపై జక్కన్న స్పెషల్ కేర్ తీసుకుంటున్నారట. ఇకపోతే ఈ ఫిక్ష‌నల్ పీరియాడిక‌ల్ డ్రామాలో ఎన్టీఆర్ సరసన ఒలివియా మోరిస్, రామ్ చరణ్ సరసన ఆలియా భ‌ట్‌ నటిస్తుండగా.. హాలీవుడ్ నుంచి రే స్టీవెన్ స‌న్‌, అలిస‌న్ డూడి లాంటి స్టార్స్ కూడా భాగమవుతున్నారు. ఇప్పటికే మేజర్ పార్ట్ షూటింగ్ కంప్లీట్ చేసిన రాజమౌళి.. మరికొద్ది రోజుల్లోనే ప్యాకప్ చెప్పి పోస్ట్ ప్రొడక్షన్ పనులు చేపట్టాలని సన్నాహాలు చేస్తున్నారట. అనేకసార్లు వాయిదా పడుతూ వచ్చిన RRR వచ్చే ఏడాది రిలీజ్ కావొచ్చని టాక్ నడుస్తోంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3jqdOV0
v

Shaakuntalam : ఇంకొంత కాలం ఎదురుచూపులు తప్పవు.. ‘శాకుంతలం’పై నీలిమ గుణ కామెంట్

దర్శకుడు గుణ శేఖర్, ఆయన కూతురు కలిసి ఓ అద్బుతాన్ని సృష్టించేందుకు రెడీ అవుతున్నారు. గుణ టీంతో కలిసిన దిల్ రాజు సినిమాను భారీ స్థాయిలో నిర్మించేందుకు సిద్దమయ్యారు. గత రెండు మూడు నెలల క్రితమే గ్రాండ్‌గా పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అంతకు ముందు నుంచే ప్రీ ప్రొడక్షన్ పనుల్లో గుణ టీం బిజీగా ఉంది. ఇక సైతం పూర్తి స్క్రిప్ట్‌ను అవపోసన పట్టేశారు. అయితే సమంత, గుణశేఖర్ టీం స్పీడుకు కరోనా అడ్డు కట్టవేసింది. మంచి ఫాంలో ఉండి షూటింగ్ చేస్తోన్న చిత్రయూనిట్‌పై సెకండ్ వేవ్ ప్రభావం చూపించింది. సెకండ్ వేవ్ కారణం సినిమా షూటింగ్‌లన్నీ కూడా వాయిదా పడ్డాయి. అయితే తాజాగా శాకుంతలం సినిమా మీద సమంత అభిమానులు రచ్చ రచ్చ చేస్తున్నారు. సమంత ఫస్ట్ లుక్ కావాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు గుణ టీంకు రిక్వెస్ట్‌ల మీద రిక్వెస్ట్‌లు పెడుతున్నారు. అయితే దీనిపై నీలిమ గుణ తాజాగా స్పందించారు. అభిమానులను కూల్ చేసేందుకు ప్రయత్నించారు. తాము ఇప్పుడే రెండో షెడ్యూల్‌ను ప్రారంభించాం.. ఇక ఫస్ట్ లుక్ రావాలంటే చాలా సమయం పడుతుందని నీలిమ గుణ చెప్పుకొచ్చారు. ఈ మేరకు ఆమె వేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. ‘శాకుంతలం నుంచి సమంత ఫస్ట్ లుక్ ఇవ్వండని చాలా మెసెజ్‌లు వస్తున్నాయ్.. మీరు చూపిస్తున్న ప్రేమకు ధన్యవాదాలు. కానీ మీరు ఇంకొంత కాలం ఎదురుచూడాల్సి వస్తుంది. ఈ రోజే సెకండ్ షెడ్యూల్ మొదలైంది. ఇలానే మాపై ప్రేమను కురిపిస్తూ సపోర్ట్ చేస్తూ ఉండండి’ అని అన్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3hbA4PD
v

RRR షూటింగ్‌లో రామ్ చరణ్.. అదిరిపోయే స్టైలీష్ పిక్స్

మెగా పవర్ స్టార్ ప్రస్తుతం షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. చాలా రోజుల తరువాత మళ్లీ ఈ మధ్యే షూటింగ్‌ను పున: ప్రారంభించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకోవాల్సిన టీం.. సెకండ్ వేవ్ వల్ల ఎన్నో తిప్పలు పడింది. మధ్యలో నటీనటులు, దర్శకుడికి కూడా కరోనా సోకింది. అలా సినిమా షూటింగ్ పలుమార్లు వాయిదా పడింది. అలా ఎప్పటికప్పుడు ఆర్ఆర్ఆర్ విషయంలో ఎదురుదెబ్బలు తగులుతూనే ఉన్నాయి.అయినా కూడా ఆర్ఆర్ఆర్ మీదున్న అంచనాలేమీ తగ్గడం లేదు. ఇప్పటికే సినిమాకు సంబంధించిన బిజినెస్ అంతా పూర్తయింది. శాటిలైట్, డిజిటల్ రైట్స్‌కు సంబంధించిన వ్యవహారాలన్ని కూడా పూర్తయ్యాయి. దాదాపు 350 కోట్లకు పైగా అమ్ముడుపోయాయనే టాక్ వినిపిస్తోంది. అలా సినిమా షూటింగ్ పూర్తి కాకముందే బడ్జెట్‌ను రికవరీ చేసినట్టైంది. అలా ఆర్ఆర్ఆర్ సినిమా విడుదలకు ముందే ఎన్నోరికార్డులను బద్దలు కొట్టేస్తోంది. అయితే గత వారంలోనే ఆర్ఆర్ఆర్ షూటింగ్ మళ్లీ మొదలైంది. ఈక్రమంలో రామ్ చరణ్ సెట్స్ మీదకు వెళ్లారు. దాని కోసం ముంబై నుంచి స్పెషల్‌గా హెయిర్ స్టైలీష్ట్‌ను తీసుకొచ్చారు. మొత్తానికి అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్ మారిపోయి.. సెట్స్ మీదకు అడుగుపెట్టేశారు. అయితే తాజాగా రామ్ చరణ్‌కు సంబంధించిన ఫోటోలు బయటకు వచ్చాయి.అందులో ఓ బుడ్డోడితో రామ్ చరణ్ ముచ్చట్లు పెడుతున్నారు. ఎంతో క్లాస్ అండ్ స్టైలీష్‌గా ఉన్న రామ్ చరణ్‌ను చూసి అభిమానులు మురిసిపోతోన్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు ట్విట్టర్‌లో నేషనల్ వైడ్‌గా ట్రెండ్ అవుతున్నాయి.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3x5Zbde
v

కత్తి మహేష్‌‌కి శస్త్ర చికిత్స పూర్తి.. అంతా సేఫ్, అవన్నీ పుకార్లే.. 3 వారాల్లో ఇంటికి

నెల్లూరు జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మూవీ క్రిటిక్ కత్తి మహేష్‌కి ఘోర రోడ్డు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. జూన్ 26 తెల్లవారుజామున ఆయన ప్రయాణిస్తున్న ఇన్నోవా కారు నెల్లూరు జిల్లా కొడవలూరు హైవే వద్ద లారీని ఢీకొట్టడంతో భారీ ప్రమాదం జరిగింది. ఈ యాక్సిడెంట్‌లో సీటు బెల్టు పెట్టుకోకపోవడం వల్ల తలతో పాటు కన్నుకి బలమైన గాయాలు అయ్యాయి. అయితే ఆయన్ని హుటాహుటిన దగ్గర్లోని హాస్పటల్‌కి తరలించగా.. ప్రాణాపాయం తప్పింది. అయితే మెరుగైన వైద్యం కోసం ఆయన్ని చెన్నై ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. అయితే ప్రస్తుతం కత్తి మహేష్ ప్రాణానికి ఎలాంటి ప్రమాదం లేదు.. ఆయన ఆరోగ్యం విషయంలో ఆందోళన చెందాల్సిన పనిలేదని ఆయన సన్నిహితులు తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ సీఐడీ అడిషనల్ డీజీపీ, ఐపీఎస్ పీవీ సునీల్ సునీల్ కుమార్ ఆదేశాల మేరకు.. కొంతమంది దళిత నాయకులు చెన్నై వెళ్లి కత్తి మహేష్ ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. వాళ్లు అందించిన వివరాల ప్రకారం.. కత్తి మహేష్ చాలా వరకూ కోలుకున్నారని.. ఆదివారం నాడు లిక్విడ్ ఫుడ్ కూడా తీసుకున్నట్టు తెలియజేశారు. అయితే కత్తి మహేష్ తల నుదిటి భాగంలో ఎముక విరిగిందని.. దానికి సోమవారం నాడు శస్త్ర చికిత్స జరిగిందన్నారు అయితే కంటికి బలమైన గాయం కావడంతో శంకర నేత్రాలయ వైద్యులు శస్త్ర చికిత్సకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సర్జరీలు పూర్తైన తరువాత మూడు వారాలు పాటు హాస్పటల్స్‌లో కత్తి మహేష్ ఉండాల్సి వస్తుందని వైద్యులు తెలిపినట్టు చెప్పారు. అయితే ఆయన కంటి చూపు పోయిందని.. ఇక కళ్లు రావని కొంతమంది పనికట్టుకుని ప్రచారం చేయడంతో వాటిని ఖండించారు కత్తి మహేష్ సన్నిహితులు. త్వరలో ఆయన కోలుకుని తిరిగి హైదరాబాద్‌కి రాబోతున్నట్టు తెలియజేశారు. కాగా ప్రమాదం జరిగి ప్రాణాపాయ స్థితిలో ఉన్న కత్తి మహేష్ పట్ల.. మానవత్వం చాటాల్సింది పోయి కొంతమంది పనికట్టుకుని ఆయన చనిపోయాడని.. చనిపోబోతున్నాడని.. కళ్లు పోయాయని ఇలా రకరకాల పుకార్లను సృష్టిస్తున్నారు. అయితే అవన్నీ కేవలం పుకార్లు మాత్రమే అని.. ఖండించారు ఆయన సన్నిహితులు. ఆదివారం నాడు కొంతమంది దళిత నాయకులు చెన్నై వెళ్లి కత్తి మహేష్‌ని పరామర్శించి.. ఆయన ఆరోగ్య విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలియజేశారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/35XGdK2
v

Chiru153 : లూసిఫర్ రీమేక్.. చిరు కోసం పనిలో నిమగ్నమైన తమన్

ప్రస్తుతం మెగాస్టార్ సినిమాలు లైన్‌లో ఉన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం కొరటాల శివతో ఆచార్య సినిమాతో బిజీగా ఉన్నారు. ఆ తరువాత రెండు రీమేక్లతో రెడీగా ఉన్నారు. వాటి తరువాత మరో ప్రాజెక్ట్‌ను కూడా లైన్‌లో పెట్టేశారు. ఆచార్య తరువాత చిరంజీవి మొదలుపెట్టనున్నారు. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించిన పూజా కార్యక్రమాలు కూడా పూర్తయ్యాయి. డైరెక్టర్ జయం మోహన్ రాజా స్క్రిప్ట్‌లో మార్పులు చేర్పులు చేస్తూ బిజీగా ఉన్నారు. అయితే తాజాగా ఓ ట్వీట్ వేశారు. లూసిఫర్ రీమేక్‌కు సంబంధించిన పోస్ట్ పెట్టేశారు. ఇందులో దర్శకులు, సంగీత దర్శకులు ఇద్దరూ కూడా ఉన్నారు. లూసిఫర్ రీమేక్ మ్యూజిక్ సిట్టింగ్స్ జరుగుతున్నట్టు చెప్పేశారు. మళయాలంలో మోహన్ లాల్‌కు ఇచ్చిన ఎలివేషన్స్ కంటే ఎక్కువగానే తెలుగులో ఉండబోతోన్నట్టు కనిపిస్తోంది. ఈ మేరకు తమన్ మంచి బ్యాక్ గ్రౌండ్ థీమ్‌ను సెట్ చేసినట్టు తెలుస్తోంది. అయితే ఇప్పుడు తమన్ వేసిన ట్వీట్ మెగా ఫ్యాన్స్ అలరిస్తోంది. అసలే ఇప్పుడు తమన్ మంచి ఫాంలో ఉన్నారు. మరీ ముఖ్యంగా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ విషయంలో తమన్ దుమ్ములేపుతున్నారు. చివరగా వకీల్ సాబ్ సినిమాకు తమన్ కొట్టిన నేపథ్యసంగీతం అదిరిపోయింది. అంతకు ముందు క్రాక్ సినిమా విషయంలోనూ తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ప్లస్ అయింది. ఈ సారి బాస్ మీద ప్రేమను చూపించే సమయం వచ్చిందంటూ తమన్ వేసిన ట్వీట్‌తో చిరు అభిమానులు సంబరపడిపోతోన్నారు. అసలే బ్రూస్‌లీ సినిమా చిరు కనిపించే ఐదు నిమిషాలకు ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇప్పటికీ చెవుల్లో మార్మోగిపోతోంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3622TIU
v

Oke Oka Jeevitham : Sharwa30.. ‘ఒకే ఒక జీవితం’ అంటోన్న శర్వానంద్

యంగ్ హీరో ప్రస్తుతం ఎంత బిజీగా ఉన్నారో అందరికీ తెలిసిందే. సరైన హిట్టు కోసం ఎంతో కాలం నుంచి ఎదురుచూస్తున్నారు. చివరగా వచ్చిన శ్రీకారం సైతం నిరాశపరిచింది. అయితే ఇప్పుడు శర్వానంద్ మంచి ఫాంలో ఉన్నారు. తాజాగా తన 30వ ప్రాజెక్ట్‌కు సంబంధించిన అప్డేట్‌ను ప్రకటించారు.. డ్రీమ్ వారియర్స్ పిక్చర్స్ నిర్మిస్తోన్న ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్ లుక్ అండ్ టైటిల్‌ను రివీల్ చేసేశారు. శర్వా 30 అంటూ ఇంతకాలం పిలుస్తూ వచ్చిన ప్రాజెక్ట్ టైటిల్ బయటకు వచ్చింది. అంటూ వదిలిన ఈ పోస్టర్ ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటోంది. ఉన్న ఈ ఒక్క జీవితంలో ప్రపంచాన్ని చుట్టి వచ్చేయాలనే కాన్సెప్ట్‌తో సినిమాను తెరకెక్కించినట్టు కనిపిస్తోంది. ప్రపంచంలోని చూడదగ్గ ప్రదేశాలన్నింటిని ఫస్ట్ లుక్‌లో పెట్టేశారు. ఇక వాటిని చూసేందుకు బయల్దేరినట్టు ఓ గిటార్‌ను వేసుకుని శర్వానంద్ దర్శనమిచ్చారు. కానీ ఇందులో శర్వానంద్ మొహాన్ని మాత్రం చూపించలేదు. శ్రీ కార్తిక్ దర్శకుడిగా పరిచయం కాబోతోన్న ఈ మూవీలో ప్రియదర్శి, అక్కినేని అమల, రీతూవర్మ నటించనున్నారు. లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ సినిమా తరువాత అమల ప్రత్యేక పాత్రలో నటిస్తున్న ఈ మూవీపై మంచి అంచనాలే ఉన్నాయి. అలా ఇప్పుడు శర్వానంద్ 30వ సినిమా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఇక ఇవే కాకుండా శర్వానంద్ మరో రెండు ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉన్నారు. త్వరలోనే ఆడాళ్లూ మీకు జోహార్లు కూడా మొదలుపెట్టనున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2Sv6b4m
v

Sadha : విక్రమ్-సదా రిలేషన్ తెలిసి షాక్.. అది లీకైతే సినిమా ఏం కావాలంటూ ఆవేదన చెందిన శంకర్!

విక్రమ్ శంకర్ కాంబినేషన్‌లో వచ్చిన అపరిచితుడు సినిమా ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. తమిళ, తెలుగు నాట ఈ సినిమా రికార్డులు ఎప్పటికీ చెక్కుచెదరవు. డబ్బింగ్ సినిమా అయినా కూడా తెలుగులో ఈ చిత్రం కాసుల వర్షాన్ని కురిపించింది. టేకింగ్, నటన, సదా అందాలు ఈ సినిమాను బ్లాక్ బస్టర్‌ను చేసేశాయి. అయితే తాజాగా ఈ మూవీ గురించి మాట్లాడుతూ సదా కొన్ని విషయాలను బయటపెట్టేశారు. అలీతో సరదాగా షోలో గెస్ట్‌గా రాబోతోన్న సదా ఎన్నో విషయాలను పంచుకున్నారు. మామూలుగానే కాంట్రవర్సీలకు ఎంతో దూరంగా ఉండే.. సదా సోషల్ మీడియాలోనూ ఎక్కువ యాక్టివ్‌గా ఉండరు. అలాంటి సదా తాజాగా తన పర్సనల్, ప్రొఫెషన్ విషయాల గురించి బయటపెట్టేశారు. అందులో భాగంగా జయం, అపరిచితుడు సినిమా విశేషాలను పంచుకున్నారు. ఈమేరకు వదిలిన ప్రోమో నెట్టింట్లో తెగ వైరల్ అయింది. ఇందులో అపరిచితుడు సినిమా షూటింగ్ సమయంలో జరిగిన వింత సంఘటన గురించి చెప్పుకొచ్చారు. మామూలుగా కొందరు హీరో హీరోయిన్లు స్క్రీన్ మీద ఎలా కనిపిస్తారో స్క్రీన్ వెనకాల అలానే ఉంటారు. అయితేకొందరు మాత్రం తెరపై హీరో హీరోయిన్లుగా నటించినా కూడా తెర వెనుక బ్రదర్ సిస్టర్ అని పిలుచుకుంటారు. అలా విక్రమ్ కూడా సదాను సోదరి అని అనేవారట. ఈ విషయం తెలుసుకున్న శంకర్ షాక్ అయ్యారట. నేను ఏదో మిమ్మల్ని సీతారాముడిలా చూపిద్దామని ప్రయత్నిస్తుంటే మీరేంటి ఇలా పిలుస్తున్నారు.. ఈ విషయం మీడియాకు లీకై బయటకు తెలిస్తే నా సినిమా ఎవరైనా చూస్తారా? అని శంకర్ ఆవేదన చెందారట. నాటి విషయాన్ని చెబుతూ సదా తెగ నవ్వేశారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3qwmV7R
v

చాలా బాధగా ఉంది.. ఏదో ఒక రోజు తప్పకుండా అతన్ని కలుస్తా.. రష్మిక మందన కామెంట్స్ వైరల్

'ఛలో' అంటూ టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన .. ఆ తర్వాత ''గీతగోవిందం, సరిలేరు నీకెవ్వరు, బీష్మ'' సినిమాలతో సూపర్ హిట్స్ ఖాతాలో వేసుకొని టాలీవుడ్‌ స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. అందం, అభినయంతో క్రేజీ బ్యూటీగా దర్శకనిర్మాతలకు బెటర్ ఛాయిస్ అవుతున్న ఈ ముద్దుగుమ్మ రెమ్మ్యూనరేషన్ కూడా భారీ గానే పుచ్చుకుంటోంది. మరోవైపు తన క్యూట్ లుక్స్‌తో భారీ ఫాన్ ఫాలోయింగ్ కూడగట్టుకుంది ఈ కన్నడ బ్యూటీ. నేషనల్‌ క్రష్‌గా ప్రతి ఒక్కరి గుండెల్లో పర్మినెంట్‌గా గూడు కట్టుకుంది. అయితే రష్మిక మందనపై ఉన్న అభిమానంతో ఆమెకు చూడడానికి ఇటీవల ఓ అభిమాని ఏకంగా 900 కి.మీ.లు ప్రయాణం చేసిన సంగతి తెలిసిందే. ఆమె స్వస్థలం కర్ణాటకలోని కొడగు సమీపంలోని విరాజ్‌పేట అని గూగుల్‌‌లో వెతికిమరీ తెలుసుకొని ఆమె స్వస్థలానికి చేరుకున్నాడు సదరు అభిమాని. రష్మిక ఇంటికి కూడా వెళ్ళాడు కానీ ఆ సమయంలో రష్మిక అక్కడ లేకపోవడంతో అతను తీవ్ర నిరాశతో వెనుదిరిగాడు. ఈ విషయం తెలుసుకొని ట్విట్టర్ వేదికగా రష్మిక స్పందించింది. ఓ అభిమాని తనను కలిసేందుకు చాలాదూరం ప్రయాణించి కర్ణాటక లోని మా ఇంటి వరకూ వచ్చాడని తెలిసిందని పేర్కొంటూ దయచేసి ఇలాంటి పనులు ఎవరూ చేయొద్దని ఆమె రిక్వెస్ట్ చేసింది. అయితే ఆ అభిమానిని కలవలేకపోయినందుకు చాలా బాధగా ఉందని, ఏదో ఒకరోజు తప్పకుండా అతన్ని కలుస్తాననే నమ్మకం ఉందని ఆమె తెలిపింది. రష్మిక సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం తెలుగులో 'పుష్ప' సినిమాలో నటిస్తోంది. సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ పాన్‌ ఇండియా సినిమాలో అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్నారు. దీంతో పాటు బాలీవుడ్‌లో మరో రెండు మూవీస్ చేస్తోంది రష్మిక మందన.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3djDIG8
v

MAAలో గొడవలకు ముఖ్య కారణం అదే.. గత విషయాలు తవ్వుతూ జీవిత షాకింగ్ కామెంట్స్

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ()లో లుకలుకలు.. ఈ మాట వినడం కొత్తేమీ కాదు. ఎన్నోసార్లు పతాక శీర్షికల్లో ఈ హెడ్‌లైన్ చూశాం. ఇందుకు ప్రధాన కారణం 'మా' వర్గాల్లో విభేదాలు రావడమే. ఇకపోతే ప్రతి ఎన్నికల సమయంలో ఒక వర్గంపై మరో వర్గం మాటల తూటాలతో రాజకీయ వేడిని తలపిస్తున్నాయి మా ఎలక్షన్స్. ఈ నేపథ్యంలో మరో రెండు మూడు నెలల్లో జరగబోతుండగా.. ఇప్పటికే ప్రకాష్ రాజ్, మంచు విష్ణు, హేమ, సీవీఎల్ నరసింహారావు తమ పోటీని కన్ఫర్మ్ చేశారు. సీనియర్ నటి రాజశేఖర్ కూడా బరిలో ఉన్నట్లు దాదాపు కన్ఫర్మ్ అయింది. ఈ నేపథ్యంలో ఇప్పటినుంచే వర్గ పోరు మొదలైనట్లు తాజా పరిస్థితులు చూస్తుంటే అర్థమవుతోంది. ప్రకాష్ రాజ్ తన ప్యానెల్‌ని ప్రకటించగా.. మంచు విష్ణు 'మా' కార్మికులకు అండగా నిలుస్తానని హామీ ఇస్తూ అఫీషియల్ స్టేట్‌మెంట్ ఇచ్చారు. మరోవైపు ప్రస్తుత 'మా' అధ్యక్షుడు నరేష్ ఇప్పుడే ఎన్నికల హడావిడి ప్రారంభించడంపై తన అసంతృత్తి తెలియ జేశారు. ప్రకాష్ రాజ్ వర్సెస్ వీకే నరేష్ ఎపిసోడ్స్ అనంతరం జీవిత రాజశేఖర్ కూడా మీడియా ముందుకొచ్చి చాలా విషయాలపై ఓపెన్ అయ్యారు. అసోసియేషన్‌లో గొడవలకు ముఖ్య కారణం ఈగోలేనని చెప్పిన జీవిత.. ఒక సమస్యపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేయడం ద్వారా సమస్యలు ఎప్పటికీ పరిష్కారం కావని అన్నారు. గతంలో రాజశేఖర్ రాజీనామా చేసినప్పుడు 'మా' వర్గాలు వ్యవహరించిన తీరు తనకు ఏ మాత్రం నచ్చలేదంటూ అప్పటి విషయాలను తవ్వారు. రాజశేఖర్ రాజీనామా చేశాక తాను కూడా తన ఆఫీస్ బేరర్ పదవికి రాజీనామా చేయాలనుకున్నానని, కానీ రాజశేఖర్ సర్ధి చెప్పారని అన్నారు. రాజశేఖర్ విషయంలో జరిగిన సంఘటనలు ఇంకా వెంటాడుతూనే ఉన్నాయని, ఆ విషయాలు నేటికీ మర్చిపోలేకపోతున్నానని ఆమె తెలిపారు. 950 మంది సభ్యులున్న మా అసోసియేషన్ లో 350 మంది మహిళలు ఉన్నారని, ఈ సారి ఓ మహిళను అధ్యక్షురాలిని చేస్తానని పెద్దలు అన్నారని.. దానికి సమయం వచ్చిందని ఆమె చెప్పారు. ఈ కామెంట్స్ చూసి 'మా' అధ్యక్ష పీఠంపై జీవిత తన ఇంట్రెస్ట్ వెల్లడించిందనే టాక్ మొదలైంది. ఏదేమైనా ఈ సారి 'మా' ఎలక్షన్స్ గతంలో కంటే మరింత రసవత్తరంగా సాగుతాయని మాత్రం స్పష్టమవుతోంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3dgZ4Uv
v

Anushka : కనెక్ట్ అయి ఉండండి.. అవన్నీ కనుమరుగవుతున్నాయ్.. అనుష్క శెట్టి పోస్ట్ వైరల్

స్వీటీ ఎంత మృధుస్వభావం కలదో అందరికీ తెలిసిందే. ఎక్కడా కూడా కాంట్రవర్సీలంటూ ఉండవు. తనకు ఉన్న స్టార్డంను కూడా ఉపయోగించుకోదు. ఎంతో సింపుల్‌గా జీవితాన్ని గడిపేస్తుంటారు. ఎక్కడికైనా వెళ్లినా సరే తన వీఐపీ స్టేటస్‌ను ఉపయోగించుకోరు. అలా ప్రవర్తన, స్వభావం, మంచిదనానికి ఎంతో మంది అభిమానులున్నారు. తెరపై ఆమె నటనను చూసి అభిమానించే వారి కంటే రియల్ లైఫ్‌లోని ఆమెను చూసి ఆరాధించే వారే ఎక్కువ ఉంటారు. సోషల్ మీడియాలోనూ అనుష్క హద్దుల్లోనే ఉంటారు. అవసరం మేరకు అనుష్క స్పందిస్తుంటారు. మంచి మాటలనే చెబుతూ అందరిలోనూ స్ఫూర్తి నింపుతుంటారు. తాజాగా ఆమె చేసిన ఓ పోస్ట్ అందరిలోనూ ఆలోచనలు రేకెత్తిస్తోంది. ‘అందరూ ప్రేమగా ఉండండి. మీరు వారిని ఎంతగా ప్రేమిస్తున్నారో చెప్పండి.. ఏమని ఫీల్ అవుతున్నారో తెలపండి. అతిగా స్పందిస్తున్నారని మీరేమీ బాధపడకండి.. అలా ఎక్కువగా చూపించండి. ఎక్కవ జాగ్రత్తగా చూసుకోండి. ప్రపంచంలో ఇంకా మంచిదనం ఉందని నిరూపించండి. మీరు ఫీల్ అయ్యేదాన్ని చెప్పేందుకు భయపడకండి. ప్రతీ విరహంలోనూ మంచిని, బ్యూటీని వెతకండి. ముందుకు వెళ్లేందుకు ప్రయత్నించండి. గతంలో జరిగిన దాని గురించి తలుచుకుంటూ బాధపడకండి.. కొత్త ఆరంభాలను స్వాగతించండి.. మీ స్నేహితుడిని ప్రేమగా హత్తుకోండి.. ప్రేమగా నుదుటి మీద ముద్దు పెట్టుకోండి.. బిగ్గరగా నవ్వండి.. ఎక్కువగా ఆశలు పెట్టుకోండి.. ఎక్కువగా బతికేందుకు ప్రయత్నించండి.. మీతో మీరు ఎక్కువగా గడపండి.. మీ బాధలను పొగొట్టేవారితో ఉండండి.. మీతో మీరు ప్రతీ అంశంతో కనెక్ట్ అయి ఉండండి.. బాధలను పోగొట్టే ప్రతీ అంశంతో కనెక్ట్ అవ్వండి.. మిమ్మల్ని ఎక్కువగా ఫీల్ అయ్యేలా చేసే వారితో కనెక్ట్ అవ్వండి.. కన్నీళ్లు తెప్పించే మూమెంట్స్‌తో కనెక్ట్ అవ్వండి.. మీలో ఎనర్జీ నింపి మీ చేతులు కాళ్లు కదిపేలా చేసే అంశాలను తలచుకుని మీ లైఫ్ ఎంత బాగుందో గుర్తు చేసుకోండి. దయచేసి కనెక్ట్ అయి ఉండండి.. ప్రపంచంలో అందమైనవన్నీ కూడా మాయమైపోతోన్నాయి.. మీ హృదయం కూడా అందులో ఓ భాగం అవ్వకుండా చూసుకోండ’ని చెప్పుకొచ్చారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3hf8CAq
v

Vignesh Shivan : నయన్‌తో ఎక్కడున్నా సరే.. అంతా బాత్రూంలోనే.. విఘ్నేశ్ శివన్ కామెంట్స్ వైరల్

దర్శకుడిగా, పాటల రచయితగా విఘ్నేశ్ శివన్‌కు ఎంత మంచి పేరు ఉన్నా కూడా ప్రస్తుతం ప్రియుడిగానే అందరూ గుర్తిస్తున్నారు. అని రాసేకంటే.. నయనతార ప్రియుడు అనే సంబోధిస్తుంటారు. అలా నయన్ క్రేజ్ మొత్తం విఘ్నేశ్ శివన్‌ను కమ్మేస్తుంటుంది. అయినా కూడా విఘ్నేశ్ శివన్ తన కంటూ ఓ గుర్తింపును సాధించుకున్నారు. నిర్మాత, దర్శకుడిగా మంచి విజయాలను అందుకున్నారు. మళ్లీ ఇప్పుడు సమంత, నయన తార, విజయ్ సేతుపతి వంటివారితో ప్రయోగం చేసేందుకు రెడీ అవుతున్నారు. అయితే తాజాగా విఘ్నేశ్ శివన్ తన అభిమానులతో ముచ్చట్లు పెట్టేశారు. లైవ్ చాట్‌లోకి రావడంతో ఒక్కొక్కరు ఒక్కో రకమైన ప్రశ్నలు సంధించారు. అయితే వీటిలో చాలా మంది నయనతారకు సంబంధించిన విషయాలనే అడిగేశారు. అందరూ నయనతారకు సంబంధించిన ప్రశ్నలే అడుగుతుంటే మీకు ఎలా అనిపిస్తోంది అని ఓ నెటిజన్ అడిగేశారు. చాలా గొప్పగా ఉందంటూ విఘ్నేశ్ శివన్ సమాధానమిచ్చేశారు. అయితే కొందరు దర్శకులు స్క్రిప్ట్ రాసేందుకు ఎక్కడెక్కడికో వెళ్తుంటారు. పాటలు రాసేందుకు కూడా వారికంటే కొన్ని ప్రదేశాలను ఎంచుకుంటారు. అక్కడికే వెళ్లి రాసుకుంటారు. అలా మీరు ఏ ప్లేస్‌లో ఉండి స్క్రిప్ట్, పాటలు రాసుకుంటారు? అని ఓ నెటిజన్ అడిగారు. అయితే ప్రతీ ఒక్కటీ మొదలయ్యేది బాత్రూంలోనే.. అంతా అక్కడే ప్రారంభం అవుతుందని తన సీక్రెట్ చెప్పారు. తానేమీ బాత్రూం సింగర్‌ను కాదు కానీ బాత్రూం లిరిక్ రైటర్ అని కౌంటర్ కూడా వేశారు. ఇక మీకు ఇష్టమైన ప్రదేశం ఏది? అని మరో నెటిజన్ అడిగాడు. నయనతార ఎక్కడున్నా సరే అది నాకు ఇష్టమైన ప్లేస్ అవుతుందని విఘ్నేశ్ శివన్ చెప్పుకొచ్చారు. అలా నయనతార మీదున్న ప్రేమను విఘ్నేశ్ శివన్ బయటపెట్టేశారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3y1I9wW
v

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...