Thursday 30 April 2020

నువ్వు దొంగ కృష్ణుడివి.. రామ్ చరణ్‌పై నానమ్మ కామెంట్స్.. వీడియో వైరల్!!

ఎప్పుడూ వెండితెరపై హుందాగా కనిపించే సెలబ్రిటీలు తమ తమ రియల్ లైఫ్‌లో ఎలా ఉంటారు? తమ తమ ఖాళీ సమయాన్ని ఇంట్లో ఎలా గడుపుతారు? ఈ విషయాలు తెలుసుకోవడం కోసం సగటు ప్రేక్షకుడు ఎప్పుడూ ఆరాటపడుతూనే ఉంటాడు. అయితే ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు సెలబ్రిటీల హోమ్ క్వారంటైన్ సంగతులను, ఫ్యామిలీతో వాళ్ళు గడిపే క్షణాలను నేరుగా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా షేర్ చేసిన ఓ వీడియో క్లిప్ మెగా అభిమానులను కనువిందు చేస్తూ సోషల్ మీడియాలో వైరల్ అయింది. లాక్‌డౌన్ కారణంగా ఇంట్లోనే ఉంటూ కుటుంబ సభ్యులతో సరదాగా గడుపుతున్న రామ్ చరణ్.. తాజాగా కిచెన్ పాఠాలు నేర్చుకునే పనిలో పడ్డారు. నాన్నమ్మ అంజనా దేవి దగ్గర వెన్న తయారు చేసే విధానాన్ని తెలుసుకుంటూ ఆ వీడియోను ట్విట్టర్‌లో షేర్ చేశారు. ఈ వీడియోలో కోడలు సురేఖకు, మనవడు రామ్ చరణ్‌కు వెన్న చిలికే విధానాన్ని నేర్పిస్తూ కనిపించింది చిరంజీవి తల్లి అంజనా దేవి. ఇక రామ్ చరణ్‌ని ఆమె కృష్ణుడిలా ఉన్నావని కామెంట్ చేయడం వీడియోలో హైలైట్‌గా నిలిచింది. ఇలా రామ్ చరణ్, సురేఖ, అంజనా దేవి అంతా కలిసి ఆనందంగా కిచెన్‌లో ఎంజాయ్ చేస్తూ వెన్న చిలుకుతుండటం మెగా అభిమానులను కనువిందు చేస్తోంది. వీడియో చూసిన నెటిజన్స్ ‘‘సూపర్, నైస్ ఫ్యామిలీ’’ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. గతంలో 'బీ ది రియల్ మాన్' ఛాలెంజ్‌లో భాగంగా తాము చేసిన ఇంటిపనుల తాలూకు వీడియోలు షేర్ చేసిన రామ్ చరణ్, చిరంజీవి మెగా అభిమానుల్లో జోష్ నింపిన సంగతి తెలిసిందే. ఇకపోతే ప్రస్తుతం రామ్ చరణ్ సినిమా చేస్తున్నారు. రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మూవీ ఇప్పటికే 80 షూటింగ్ ఫినిష్ చేసుకొని కరోనా కారణంగా వాయిదా పడింది. ఈ చిత్రంలో చెర్రీతో పాటు యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్నారు. వచ్చే ఏడాది జనవరి 8న విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్న ఈ సినిమాపై మెగా, నందమూరి అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2YnvXIz
v

చిరంజీవిని కలిస్తే ఆ మాట అన్నారు.. ఆ సమయంలో నేను!! జబర్దస్త్ కమెడియన్ కామెంట్స్

ఇప్పుడిప్పుడిప్పుడే ఎదుగుతున్న నటీనటులు లాంటి టాప్ హీరోలని కలిస్తే ఆ ఆనందానికి అవధులు ఉంటాయా? చెప్పండి. అలాంటి ఆనందాన్నే పొందాడట జబర్దస్త్ కమెడియన్ . అంతేకాదు చిరంజీవి నుంచి ప్రశంసలు కూడా అందుకున్నానని, ఆ క్షణాలు జీవితంలో మరచిపోలేనని అన్నాడు ఈ కమెడియన్. తాజాగా జరిగిన ఓ ఆన్‌లైన్ ఇంటర్వ్యూలో ఈ సంగతులు తెలుపుతూ ఉబ్బితబ్బిబైపోయాడు అదిరే అభి. జబర్దస్త్ వేదికపై అలరించిన కమెడియన్స్ తమ కెరీర్‌లో చాలా ముందుకెళ్తున్నారు. పొట్ట చెక్కలయ్యే కామెడీ పండించి మంచి పాపులారిటీ తెచ్చుకుంటున్నారు. దీంతో వాళ్లకు సినిమా అవకాశాలు కూడా వెతుక్కుంటూ వస్తున్నాయి. సైడ్ క్యారెక్టర్స్, కమెడియన్ రోల్స్‌తో పాటు కథను బట్టి హీరోగా కూడా అవకాశమిస్తున్నారు నేటి దర్శకనిర్మాతలు. ఈ క్రమంలో ఇప్పటికే సుడిగాలి సుధీర్, చమ్మక్ చంద్ర లాంటి జబర్దస్త్ కమెడియన్స్ వెండితెరపై రాణిస్తున్నారు. అదే బాటలో ఇప్పుడు మరో ఫేమస్ జబర్దస్త్ కమెడియన్ అదిరే అభికి కూడా సినిమా అవకాశాలు వస్తున్నాయి. తాజా ఇంటర్వ్యూలో ఈ అంశం గురించి మాట్లాడిన అదిరే అభి తన కొత్త సినిమా సంగతులు చెప్పాడు. తాను 'పాయింట్ బ్లాంక్' అనే ఒక క్రైమ్ థ్రిల్లర్ సినిమాలో నటించానని, శరవేగంగా షూటింగ్ ఫినిష్ చేశామని అన్నారు. ఓ పెద్ద సెలబ్రిటీతో ఈ మూవీ టీజర్ రిలీజ్ చేయించాలని ప్లాన్ రెడీ చేశాక అనుకోకుండా కరోనా కాటేసిందని అన్నాడు అదిరే అభి. లాక్‌డౌన్ ఫినిష్ కాగానే అతిత్వరలో ఈ మూవీతో మీ ముందుకొస్తానని చెప్పాడు. అయితే ఈ మూవీ షూటింగ్ జరుగుతుండగా చిరంజీవి గారిని కలిసి తాను హీరోగా చేస్తున్నానని, పోలీస్ ఆఫీసర్ రోల్ అని చెప్పగానే ఆయన పాజిటివ్‌గా రియాక్ట్ అయ్యారని చెప్పాడు అభి. పోలీస్ పాత్రకి తగినట్టుగా నీలో ఫిట్‌నెస్ కనిపిస్తోందని ఆయన చెప్పడంతో.. ఆ సమయంలో తన ఆనందానికి అవధుల్లేవని చెప్పుకొచ్చాడు అదిరే అభి. Also Read:


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3bOzoM9
v

Happy BirthDay Ajith: లాక్‌డౌన్‌లో అజిత్ పుట్టిన రోజు.. ఆయన కోరినట్లుగానే!

తమ ఫేవరెట్ హీరో పుట్టిన రోజు వచ్చిందంటే అభిమానులకు అదో పండగ రోజు. భారీ కటౌట్స్, కేక్స్ కట్ చేస్తూ ఫుల్లుగా ఎంజాయ్ చేస్తుంటారు ఫ్యాన్స్. కానీ నేడు (మే 1) పుట్టినరోజున ఎలాంటి ఆడంబరాలు లేకుండానే ఆ కార్యక్రమం జరుగుతోంది. 1971 సంవత్సరం మే 1వ తేదీన తెలంగాణ రాష్ట్రం సికింద్రాబాద్‌లో జన్మించిన అజిత్.. ఈ రోజు 49వ ఏట అడుగిడుతున్నారు. ఈ నేపథ్యంలో తమ అభిమాన హీరో బర్త్ డేని ఘనంగా నిర్వహించాలని ప్లాన్ చేశారు ఫ్యాన్స్. అయితే కరోనా కట్టడిలో భాగంగా లాక్‌డౌన్ అమలులో ఉన్న ఈ టైమ్‌లో తన పుట్టినరోజు వేడుకలకు జరపకూడదని అజిత్ ఫ్యాన్స్‌కి తెలిపారు. దీంతో ఆయన కోరిక మేరకు ఎలాంటి ఆర్బాటం లేకుండా కేవలం సోషల్ మీడియా వేదికగా బర్త్ డే విషెస్ చెబుతోంది అభిమాన లోకం. మరోవైపు ఆయన నటిస్తున్న తాజా సినిమా 'వలిమై' నుంచి బర్త్ డే సర్‌ప్రైజ్ ఉంటుందని భావించిన ప్రేక్షకులకు అక్కడ కూడా నిరాశే ఎదురవుతోంది. ప్రస్తుత పరిస్థితుల్లో తమ సినిమా ప్రచార కార్యక్రమాలు నిర్వహించదలచుకోలేదని ఆ మూవీ యూనిట్ పేర్కొంది. సికింద్రాబాద్‌లో జన్మించిన అజిత్ తమిళ సినీ పరిశ్రమలో స్టార్ హీరోగా ఎదిగి అశేష పాపులారిటీ సంపాదించుకున్నారు. ప్రస్తుతం ఆయన దక్షిణాదిలోని బిగ్గెస్ట్ హీరోల్లో ఒకరిగా వెలుగొందుతుండటం విశేషం. కేవలం పదో తరగతి వరకే చదువుకున్నప్పటికీ తెలుగు, తమిళం, కన్నడం, మళయాళంతో పాటు ఇంగ్లీషు భాషల్లో మంచి పట్టు సాధించారు అజిత్. ఒకప్పటి టాప్ హీరోయిన్ షాలినిని 2000 సంవత్సరంలో ప్రేమించి పెళ్ళి చేసుకున్న ఆయన అన్యోన్య దాంపత్య జీవితం కొనసాగిస్తూ ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నారు. వీరికి ఇద్దరు సంతానం. ఒక బాబు ఓ పాప. బాబు పేరు ఆద్విక్ కుమార్ కాగా పాప పేరు అనుష్క. 1992లో ప్రేమపుస్తకం అనే తెలుగు సినిమాలో నటించి టాలెంటెడ్ యాక్టర్‌గా ప్రూవ్ చేసుకున్న అజిత్.. ఆ తర్వాత పలు తెలుగు, తమిళ సినిమాల్లో రాణించారు. మూడుసార్లు ఫిల్ం ఫేర్ బెస్ట్ యాక్టర్ అవార్డు దక్కించుకున్నారు. ఇక ఆయనలో దాగిఉన్న మరో టాలెంట్ బైక్ రేసర్. అంతేకాదు దేశంలోనే అత్యుత్తమ డ్రైవర్లలో ఒకరుగా గుర్తింపు పొందారు హీరో అజిత్. ఇదొక్కటే కాదు ఆపత్కాలంలో సాయం చేస్తూ గొప్ప మనసు చాటుకోవడంలోనూ ముందుంటారు అజిత్. తాజాగా నెలకొన్న కరోనా కల్లోల పరిస్థితుల్లో తన వంతుగా 1 కోటి 25 లక్షల రూపాయల విరాళాన్ని ప్రకటించారు. ఇందులో ప్రధాన మంత్రి సహాయనిధికి 50 లక్షలు, తమిళనాడు ముఖ్యమంత్రి సహాయనిధికి 50 లక్షలు, ఫిల్మ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఆఫ్ సౌత్ ఇండియాకు సంబంధించిన నిధికి 25 లక్షల రూపాయలు కేటాయించి తన ఔదార్యాన్ని చాటుకున్నారు అజిత్. మల్టీటాలెంటెడ్ యాక్టర్ గానే గాక బెస్ట్ డ్రైవర్‌గా, మంచి భర్తగా, సమాజ హితం కోరే వ్యక్తిగా జీవన ప్రయాణం సాగిస్తున్న అజిత్‌కి మీ,మా తెలుగు సమయం తరఫున ప్రత్యేకంగా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతున్నాం. హ్యాపీ బర్త్ డే అజిత్. Also Read:


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2YiSgix
v

సినీ ఇండస్ట్రీకి షాకింగ్ న్యూస్ .. ఆసుపత్రిలో మరో నటుడు! క్లారిటీ ఇచ్చిన తనయుడు

బాలీవుడ్‌లో చోటు చేసుకుంటున్న వరుస మరణాలు బీ టౌన్ మొత్తం విషాద ఛాయలు నింపేశాయి. మొన్న టాలెంటెడ్ యాక్టర్ ఇర్ఫాన్ ఖాన్ అనారోగ్యంతో మరణించగా, నిన్న మరో సీనియర్ నటుడు రిషి కపూర్ కన్నుమూయడం జీర్ణించుకోలేక పోయారు బీ టౌన్ పబ్లిక్. ఇండస్ట్రీ గొప్ప నటులను కోల్పోయిందని, బాలీవుడ్‌కి ఇది భయానక వారమని పలువురు సినీ ప్రముఖులు పేర్కొన్నారు. ఆ విషాదం నుంచి తేరుకోకముందే బాలీవుడ్ షాకయ్యేలా మరో న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. మరో బాలీవుడ్ సీనియర్ నటుడు ఆసుపత్రి పాలయ్యారని ఆ వార్త సారాంశం. ప్రస్తుతం 70 సంవత్సరాల వయసున్న నసీరుద్దీన్ షా హిందీ చిత్రసీమలో గొప్ప నటుడిగా, డైరెక్టర్‌గా గుర్తింపు పొందారు. ఎన్నో సూపర్ డూపర్ హిట్ సినిమాల్లో నటించి 1980 దశకంలో తన హవా కొనసాగించారు. అలాంటి దిగ్గజ నటుడు అనారోగ్యం పాలై ఆసుపత్రిలో చేరారనే వార్త చూసి బాలీవుడ్ లోకం ఉలిక్కిపడింది. దీంతో ఆయన ఆరోగ్యం కుదుటపడాలని కోరుకుంటూ సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్స్ పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు. ఇది గమనించిన నసీరుద్దీన్ షా తనయుడు వివాన్ షా వెంటనే స్పందిస్తూ అలాంటి వార్తలపై క్లారిటీ ఇచ్చారు. తన తండ్రి ఆసుపత్రి పాలయ్యారని చెక్కర్లు కొడుతున్న వార్తల్లో నిజం లేదని, దయచేసి అలాంటి వాటిని నమ్మొదంటూ అభిమానులను కోరారు వివాన్ షా. ఈ మేరకు ట్వీట్ చేసిన వివాన్ షా.. ''తన తండ్రి ఆరోగ్యం గురించి వస్తున్న వార్తలన్నీ ఫేక్. అతను బాగానే ఉన్నారు. ఇర్ఫాన్ భాయ్, చింటూజీల కోసం ప్రార్థనలు చేస్తున్నాం. వారిని బాగా మిస్ అవుతున్నాం. వారు లేని లోటు పూడ్చలేనిది. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాం'' అని పేర్కొన్నారు. దీంతో నసీరుద్దీన్ షా ఆరోగ్యంపై వస్తున్న రూమర్స్‌కి ఫుల్‌స్టాప్ పడింది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2xo79VH
v

బాలకృష్ణ కోసం లైన్ రెడీ.. చిరంజీవి కూడా దానికోసమే చూస్తున్నారు: అనిల్ రావిపూడి

ప్రస్తుతం ఉన్న దర్శకుల్లో కామెడీ ఎంటర్‌టైనర్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ అయ్యారు . పటాస్ సినిమాతో మెగాఫోన్ పట్టిన ఆయన ప్రేక్షకలోకాన్ని కడుపుబ్బా నవ్వించడంలో సక్సెస్ అయ్యారు. ఆ తర్వాత సుప్రీమ్, రాజా ది గ్రేట్ సినిమాలతో తన టాలెంట్ బయటపెట్టి గతేడాది F2 సినిమాతో భారీ హిట్ సాధించారు. ఈ సినిమాతోనే కామెడీ పండించే నెంబర్ వన్ డైరెక్టర్‌గా గుర్తింపు పొంది ఈ ఏడాది ఆరంభంలోనే 'సరిలేరు నీకెవ్వరు' రూపంలో ఇండస్ట్రీ హిట్ ఖాతాలో వేసుకున్నారు. దీంతో అనిల్ రావిపూడి సినిమాలకు డిమాండ్ పెరిగింది. ఆయన తదుపరి ప్రాజెక్ట్స్ ఏంటి? మళ్ళీ ఎప్పుడు కడుపుబ్బా నవ్వుకోవాలని ఆతృతగా ఎదురుచూడటం మొదలుపెట్టారు తెలుగు ప్రేక్షకులు. అయితే ఇప్పటికే F2 సీక్వల్ F3 స్క్రిప్ట్ రెడీ చేస్తున్న ఆయన తాజా ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలు చెప్పారు. తన ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ బాలకృష్ణ, చిరంజీవిలతో ఉండే అవకాశాలున్నాయని అన్నారు. లాక్‌డౌన్ కారణంగా ఇంటికే పరిమితమైన అనిల్ రావిపూడి.. తాజాగా ఓ మీడియాతో ఆన్‌లైన్‌లో ముచ్చటించారు. ఈ లాక్‌డౌన్ పీరియడ్‌లో తర్వాత, ఆ తర్వాత చేయబోయే సినిమాల లైన్స్ కూడా రాసుకుంటున్నానని చెప్పారు. ఈ క్రమంలో నందమూరి నటసింహం బాలకృష్ణ కోసం ఇప్పటికే లైన్ రెడీ చేశానని, అయితే మా ఇద్దరికీ డేట్స్ కుదరక ఇప్పటికి అది సాధ్యం కాలేదని, ఐడియా ఉంది బట్ ఎప్పుడు చేస్తామనేది చెప్పలేమని అన్నారు అనిల్. అంతేకాదు మెగాస్టార్ కూడా ఎంటర్‌టైనర్ జోనర్‌లో సినిమా చేయాలని చూస్తున్నారని, రెండు మూడు పార్టీల్లో ఆయన్ను కూడా కలిశానని చెప్పారు. స్లాట్ కుదిరితే చిరంజీవితో కూడా సినిమా చేస్తానని చెప్పారు అనిల్ రావిపూడి. చూద్దాం మరి బాలయ్య, చిరంజీవిలతో అనిల్ ఎప్పుడు నవ్వులు పండిస్తారో!. ‌ Also Read:


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3bV065E
v

కరోనా ఎఫెక్ట్: WHO ఆన్‌లైన్ కోర్స్‌లో చేరిన డైరెక్టర్ తేజ

కరోనా వైరస్ కారణంగా ప్రపంచం మొత్తం స్తంభించిపోయింది. ఈ మహమ్మారిని చూసి చాలా దేశాలు వణికిపోతున్నాయి. ఈ వైరస్‌ను అరికట్టడానికి లాక్‌డౌన్ ఒక్కటే మార్గమని ఎన్నో దేశాలు దీన్ని పాటిస్తున్నాయి. మన దేశంలోనూ 30 రోజులుగా పైగా ఈ లాక్‌డౌన్ కొనసాగుతోంది. అయితే, ఈ కరోనా డైరెక్టర్ తేజలో ఒక కొత్త ఆలోచనను పుట్టించింది. అదే WHO ఆన్‌లైన్ కోర్స్. శ్వాసకోశపై ప్రభావం చూపించే కరోనా లాంటి వైరస్‌లు భవిష్యత్తులో వస్తే వాటిని ఎలా ఎదుర్కోవాలో ఈ కోర్స్ ద్వారా తేజ నేర్చుకుంటున్నారు. ఈ కోర్సులో భాగంగా అంటువ్యాధులు, వేగంగా ప్రమాదానికి గురయ్యే శరీర భాగాలు వాటి గురించి తేజ తెలుసుకుంటున్నారు. ఈ కోర్స్ పూర్తయిన తరవాత తేజ ఆన్‌లైన్ టెస్ట్ కూడా రాయాల్సి ఉంటుందట. ఈ టెస్ట్‌లో పాసయితే WHO వాలంటీర్‌‌గా పనిచేసే అవకాశం కూడా కల్పిస్తారు. ఈ కోర్సు నేర్చుకుని అంటు వ్యాధులు, శ్వాసకోశ సంబంధిత వ్యాధులపై తన చుట్టూ ఉన్న వాళ్లకు తేజ అవగాహన కల్పించనున్నారు. లాక్‌డౌన్ కారణంగా చిత్ర పరిశ్రమలో ఉపాధి కోల్పోయిన రోజువారీ వేతన కార్మికులను ఆదుకోవడానికి ఇండస్ట్రీ పెద్దలు ఎంతో చేస్తు్న్నారు. అలాగే, తనవంతుగా ఈ వ్యాధులపై వారికి అవగాహన కల్పించాలని తేజ చూస్తున్నారట. Also Read: ఇక తేజ సినిమాల విషయానికి వస్తే.. కిందటేడాది ఆయన ‘సీత’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. కాజల్ అగర్వాల్, బెల్లంకొండ శ్రీనివాస్ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఆ సినిమా తరవాత మరే ప్రాజెక్ట్‌ను తేజ ప్రకటించలేదు. రామ్ గోపాల్ వర్మ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా, పలు హిందీ సినిమాలకు సినిమాటోగ్రాఫర్‌గా పనిచేసిన తేజ.. 20 ఏళ్ల క్రితం ‘చిత్రం’ సినిమా ద్వారా టాలీవుడ్‌కు డైరెక్టర్‌గా పరిచయమయ్యారు. తొలి సినిమాతో గుర్తింపు తెచ్చుకున్నారు. ‘నువ్వు నేను’, ‘జయం’ సినిమాలతో తేజ పేరు మారుమోగింది. అయితే, ఆ తరవాత తేజకు చెప్పుకోదగిన విజయం దక్కలేదు. వరసపెట్టి సినిమాలు చేసినా కలిసిరాలేదు. 2017లో ‘నేనే రాజు నేనే మంత్రి’ సినిమాతో తేజ మళ్లీ ఫామ్‌లోకి వచ్చారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2VQ4xsR
v

‘పవన్ కళ్యాణ్ తప్పిపోయాడు, దొరికితే పోలీస్ స్టేషన్‌లో అప్పజెప్పండి’.. ఔనా! ఏం పాపం చేశాడట!

జనసేన అధినేత పవర్ స్టార్ తప్పిపోవడం ఏంటి?? ఆయనేమైనా చిన్నపిల్లోడా.. తప్పిపోవడానికి..? తేడాలొస్తే.. ఆయన భాషలోనే చెప్పాలంటే తాట తీసే వ్యక్తి. పైగా ఆయన ఓ పార్టీకి అధినేత.. ఇండస్ట్రీలో బాక్సాఫీస్ కా బాప్. ఈ మధ్య ‘వకీల్ సాబ్’ అంటూ రీ ఎంట్రీ కూడా ఇచ్చారు. అటు సినిమాలు, ఇటు రాజకీయం అంటూ క్షణం తీరిక లేకుండా బిజీబిజీగా గడిపేస్తున్న పవన్ కళ్యాణ్ తప్పిపోయాడు అంటూ సంచలన పోస్ట్ పెట్టింది. ఏయ్.. ఎవరా కారు కూతులు కూసింది.. మా నాయకుడు పారిపోవడం ఏంటి?? అని జనసైనికులు కస్సున లేవడం ఖాయమే.. అయితే ఇలాంటి కామెంట్స్ చేసేది ఇంకెవరు శ్రీరెడ్డే. పవన్ కళ్యాణ్ పేరు చెప్పినా.. జనసైనికులు ఊసెత్తినా ఒత్తు వెలిగించి వదిలిన థౌజండ్ వాలాలా పటా పటా పేలిపోయే .. మరోమారు పవన్ కళ్యాణ్‌ను టార్గెట్ చేస్తూ వరుస పోస్ట్‌లను పెట్టింది. ‘పవన్ కళ్యాణ్ తప్పిపోయాడు.. దొరికితే దగ్గరల్లో ఉన్న పోలీస్ స్టేషన్‌లో అప్పజెప్పండి ప్లీజ్’ అంటూ తెగ బ్రతిమిలాడుతోంది శ్రీరెడ్డి. మరి ఆయన పారిపోతే ఈమె ఎందుకు ప్రాధేయపడుతుందో తెలియదు కాని జనసైనికులకు ఎప్పటిలాగే ఆగ్రహం తెప్పించే పోస్ట్‌లు పెట్టింది. ‘డొక్కా సీతమ్మ గారిని ఆదర్శంగా తీసుకుంటే కనీసం ఒక రోజైనా రోడ్ మీద వెళ్లే బాటసారులకు అన్నం పెట్టు పీకే’ అంటూ మరో పోస్ట్ పెట్టింది. లాక్ డౌన్ వల్ల రోడ్లు మొత్తం లాక్ చేసి పెడితే ఈ రోడ్లు మీద జనం ఎక్కడ తిరుగుతున్నారు.. శ్రీరెడ్డే!! వాళ్లకు అన్నం పెట్టడానికి..? సర్లే ఇళ్లలో ఉన్నోళ్ళకైనా పెట్టుచ్చుగా అని మళ్లీ అన్నా అంటావ్.. ఇప్పటిమే మా అధినాయకుడు తనకు చేతనైన సాయం చేశాడు. ఇక పార్టీ లీడర్లుకు కరోనా వ్యాప్తిని అరికట్టడంతో పాటు.. బాధితులకు అండగా నిలవమని పిలుపునిచ్చి మీరు చేసే సాయాన్ని ఫొటోతీసి పంపమని కూడా చెప్పారు. ఒక్కసారి మా జనసేన నియోజకవర్గ ఇన్ చార్జ్‌లు, నాయకులు, కార్యకర్తలు ఎంత మంది ఎన్ని విధాలుగా సాయం చేస్తున్నారో.. ఓ మారు మా జనసేన ఫేస్ బుక్ పేజ్‌లో ఓ క్లిక్ కొట్టి చూడు నీకే అర్థం అవుతుంది’ అంటూ జనసైనికులు స్పందిస్తున్నారు. మేం చేస్తే ఒకటి.. మా నాయకుడు చేస్తే ఒకటా..? మేం అంతా మా నాయకుడి అడుగుజాడల్లోనే కరోనా బాధితుల్ని ఆదుకుంటున్నాం కాస్త కళ్లు తెరచి చూడు శ్రీరెడ్డి అంటూ కామెంట్ల రూపంలో ఫైర్ అవుతున్నారు జనసైనికులు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3aOrKzV
v

రెండేళ్లలో మీరేంటో తెలుసుకున్నా.. లవ్‌ యూ రిషి అంకుల్: ఆలియా భట్ ఎమోషనల్ మెసేజ్

బాలీవుడ్ దిగ్గజ నటుడు రిషి కపూర్ మృతిని నటి ఆలియా భట్ జీర్ణించుకోలేకపోతున్నారు. ఆయనతో గడిపిన క్షణాలను గుర్తుచేసుకుంటూ చాలా భాదపడుతున్నారు. రిషి కపూర్ బుధవారం హాస్పిటల్‌లో చేరినప్పటి నుంచి ఆయన కుటుంబంతోనే ఉన్న ఆలియా.. గురువారం సాయంత్రం జరిగిన అంత్యక్రియల్లోనూ పాల్గొన్నారు. రిషి కపూర్ తనయుడు, బాలీవుడ్ హీరో రణ్‌బీర్ కపూర్‌తో ఆలియా భట్ ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. వీరిద్దరూ పెళ్లి కూడా చేసుకున్నానున్నారు. రణ్‌బీర్ ప్రేయసిగా కపూర్ ఫ్యామిలీకి పరిచయమైన ఆలియా.. ఆ తరవాత రిషి కపూర్‌కి బాగా దగ్గరయ్యారు. గడిచిన రెండేళ్లలో రిషి కపూర్ అంటే ఏంటో తెలుసుకున్నానని అన్నారు ఆలియా. ఈ మేరకు రిషి కపూర్‌తో అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ ఎమోషనల్ మెసేజ్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. Also Read: ‘‘నా జీవితంలోకి బోలెడంత ప్రేమను, ఆనందాన్ని తీసుకొచ్చిన ఈ అందమైన మనిషి గురించి నేను ఏం చెప్పగలను. రిషి కపూర్ అనే దిగ్గజం ఈరోజు ప్రతి ఒక్కరూ మాట్లాడుతున్నారు. నా కూడా ఆయన తెలుసు. నా గురించి నాకు ఎంత తెలుసో ఆయన గురించి కూడా అంత తెలుసు. గచిడిన రెండు సంవత్సరాల్లో ఆయన నాకు ఒక స్నేహితుడిగా, తోటి చైనీస్ ఫుడ్ లవర్‌గా, సినిమా ప్రేమికుడిగా, పోరాట యోధుడిగా, నాయకుడిగా, గొప్ప కథకుడిగా, ఒక ఉద్వేగభరితమైన ట్వీటర్‌గా, ఒక తండ్రిగా తెలుసు. ఈ రెండేళ్లలో ఆయన నుంచి నేను పొందిన ప్రేమ, ఆత్మీయ ఆలింగనాన్ని ఎప్పటికీ గుర్తుచేసుకుంటూనే ఉంటాను. ఆయన గురించి తెలుసుకోవడానికి ఈ విశ్వం నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిందని నేను భావిస్తున్నాను. ఈరోజు మనలో చాలా మంది ఆయన తమ కుటుంబ సభ్యుడు అని చెబుతారు. ఎందుకంటే ఆయన వల్ల పొందిన ఆనందం అలాంటిది. లవ్ యూ రిషి అంకుల్. మీరు లేని లోటు తీరనిది. మీతోపాటు ఉండే అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు’’ అని తన మెసేజ్‌లో ఆలియా పేర్కొన్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2VOgZcQ
v

చిరంజీవికీ తప్పలేదు.. ఇంత నీఛత్వమా? మీరు నన్నేం చేయలేరు.. మెగా వార్నింగ్

కరోనా వైరస్ వచ్చి కొన్నాళ్లే అవుతుంది కాని.. అంతకంటే ప్రమాదకరమైన వైరస్ వచ్చి చాలా ఏళ్లు అవుతుంది. అదే ట్రోలింగ్ వైరస్. సోషల్ మీడియా వేధికగా మనుషుల్ని మానసికంగా వేధించే ఈ వైరస్ బారిన పడని వారు ఉండరు. ఒకర్నొకరు దూషించుకోవడం, ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడం, స్థాయి భేదం లేకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం.. చేతిలో ఫోన్ ఉంది అందులో ఫేస్ బుక్, ట్విట్టర్, ఇన్ స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా సాధనాలు చేతిలో ఉండటంతో ఎవరితోనైనా ఏమైనా మాట్లాడగలుగుతున్నారు. ఇక సెలబ్రిటీలు సైతం ఈ సోషల్ మీడియా వేదికగా ప్రేక్షకులకు అందుబాటులో ఉండగలుగుతున్నారు. అసలే ముఖానికి రంగుపూసుకునే సెలబ్రిటీలంటే చిన్నచూపు ఉండనే ఉంది. ఇక వాళ్లు లైవ్‌లోకి వచ్చి మంచి చెడ్డలు మాట్లాడుతుంటే చెలరేగిపోతూ వాళ్లను ట్రోల్ చేస్తున్నారు కొంతమంది ట్రోలర్స్. ఇలాంటి వాళ్లకు గట్టి వార్నింగ్ ఇచ్చారు మెగాస్టార్ చిరంజీవి. ఉగాది రోజున మెగాస్టార్ ట్విట్టర్‌‌తో పాటు ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా చేరిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటే ‘మెగా’ట్వీట్స్‌తో హల్ చల్ చేస్తున్నారు చిరు. అయితే అందరిలాగే మెగాస్టార్‌ను ట్రోలర్స్ వదలడం లేదు. ఆయన చేసిన ట్వీట్లపైన, వీడియోలపై కామెంట్స్ చేస్తూ ట్రోల్స్ చేస్తుండటంతో స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. ట్రోల్ అనేది నవ్వుకునేలా ఉంటే ఓకే కానీ.. నవ్వుల పాలయ్యేలా మాత్రం ఉండకూడదని మొదట్లో కాస్త స్వీట్ వార్నింగ్ మాదిరే చెప్పిన మెగాస్టార్.. ఈసారి గట్టిగానే రియాక్ట్ అయ్యారు. ‘మీరు ఈ మధ్యనే సోషల్ మీడియాలోకి వచ్చారు.. అక్కడ ట్రోల్స్ చూస్తే చాలా బాధ పెట్టేవిగా ఉంటాయని నాకు మొదట్లోనే చెప్పారు. నేను ఏమంటా అంటే.. నా అనుమతి లేకుండా నన్ను ఎవరూ బాధించరు అనేది నా ఫిలాసఫీ. వాళ్లు ట్రోల్ చేసుకోనీయండి. అది వాళ్ల నీఛత్వం. అది వాళ్ల క్యారెక్టర్. వాళ్లు చేసే కామెంట్‌తో నా పీస్ ఆఫ్ మైండ్‌ని ప్రభావితం చేయలేరు. నన్ను షార్టర్ చేయలేరు. నా ద‌గ్గ‌ర‌కి కొన్ని ట్రోల్స్ వ‌చ్చాయి. వాటి గురించి ఆలోచించి స‌మ‌యం వేస్ట్ చేసుకోకూడ‌ద‌ని అనుకున్నాను. ట్రోల్ చేసే వారి నీచ బుద్ది ఎప్ప‌టికీ మార‌దు. అలాంటి వారిని వాళ్ల విజ్ఞ‌త‌కే వదిలేయాలి.. మనల్ని ఏదో చేయాలని ట్రోల్ చేసేవాళ్లకి తెలియదు.. మనం పట్టించుకోకుండా వదిలేస్తే వాళ్లే చేయలేరు అని’ అంటూ ట్రోలింగ్స్‌‌పై స్ట్రాంగ్‌గానే రియాక్ట్ అయ్యారు మెగాస్టార్.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2Yh4Bnj
v

నరేష్ కొడుకు ఇలా అయిపోయాడేంటి.. ఈ హీరోని గుర్తుపట్టారా?

సీనియర్ నటుడు 90ల్లో కామెడీ హీరోగా తనకంటూ ఒక గుర్తింపు ఏర్పరుచుకున్నారు. విజయనిర్మల కుమారుడిగా ఇండస్ట్రీకి పరిచయమైనా తనకంటూ ఒక ఇమేజ్‌ను ఏర్పరుచుకోగలిగారు. కొంతకాలం వెండితెరకు దూరమైన ఆయన క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టారు. ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీగా గడుపుతున్నారు. అయితే, నరేష్ కుమారుడు నవీన్ విజయ్‌కృష్ణ నాలుగేళ్ల క్రితం ‘నందిని నర్సింగ్ హోమ్’ సినిమాతో హీరోగా పరిచయమయ్యారు. నిజానికి ఆయన ఎడిటర్‌గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. కానీ, హీరోగా కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. అయితే, హీరోగా ఆయనకు కలిసిరాలేదు. దీంతో మళ్లీ తనకు ఇష్టమైన ఎడిటింగ్ వైపే వెళ్లిపోయారు. ‘నందిని నర్సింగ్ హోమ్’ సినిమాలో నవీన్ స్లిమ్‌గా, చాలా అందంగా కనిపించారు. అయితే, ఆయన్ని ఆ సినిమాలో చూసినవారు ఇప్పుడు చూస్తే.. ఎవరితను? అని కచ్చితంగా అంటారు. ఎందుకంటే, ఆయన అంతలా లావెక్కారు. Also Read: నరేష్ తాజాగా ట్విట్టర్‌ ద్వారా తన కొడుకు ఫొటోను షేర్ చేశారు. కొడుకుతో తీసుకున్న సెల్ఫీని ట్వీట్ చేశారు. ఈ ఫొటోలో నవీన్ చాలా లావుగా కనిపిస్తున్నారు. ఈ ఫొటోను చూసిన నెటిజన్లు.. ఏంటి ఇంత లావయ్యాడు? అని ఆశ్చర్యపోతున్నారు. ప్రస్తుతం లాక్‌డౌన్ అమలులో ఉండటంతో నరేష్ తన కుమారుడితో కలిసి సొంత ఫామ్ హౌస్‌లో ఉంటున్నారు. అక్కడ ప్రకృతిని ఆస్వాదిస్తున్నారు. అయితే, నరేష్ కుమారుడికి బీఎండబ్ల్యూ ఎస్1000ఆర్ఆర్ సూపర్ బైక్ ఉంది. 1000సీసీ బైక్ ఇది. ఈ బైక్‌ను నరేష్ తన ఫామ్ హౌస్‌లో నడిపారు. బైక్‌లపై తనకు ఉన్న మక్కువ తన కుమారుడికి కూడా వచ్చిందని నరేష్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు. ‘నాలుగు స్తంభాలాట’ సినిమాలో తాను హోండా సీబీ 125 వాడానని, అలాగే ‘ప్రేమ సంకెళ్లు’ సినిమాలో యమహా 125 స్క్రాంబ్లర్ నడిపానని.. కానీ, తన కొడుకు బైక్ మాత్రం అద్భుతమని నరేష్ వెల్లడించారు. ఈ సూపర్ బైక్‌ను తాను నడుపుతున్న వీడియోను కూడా నరేష్ ట్వీట్‌లో పొందుపరిచారు. బైక్‌ మీద స్టైల్‌గా కూర్చొని దిగిన ఫొటోను కూడా ట్వీట్ చేశారు. Also Read: నరేష్ మొదటి భార్య కుమారుడే ఈ నవీన్. నరేష్ మొత్తం మూడు పెళ్లిళ్లు చేసుకున్నారు. ప్రముఖ కొరియోగ్రాఫర్ శ్రీను మాస్టర్ కుమార్తెను టీనేజ్‌లో నరేష్ వివాహం చేసుకున్నారు. నవీన్ పుట్టిన తరవాత వీరిద్దరూ మనస్పర్థలతో విడిపోయారు. ఆ తరవాత దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి మనవరాలు, రచయిత రేఖా సుప్రియను రెండో పెళ్లి చేసుకున్నారు నరేష్. అయితే, ఆమెతో కూడా కొన్ని కారణాల వల్ల విడిపోయారు. వీరికి కుమారుడు తేజ ఉన్నాడు. 2010లో నరేష్ ముచ్చటగా మూడో పెళ్లి చేసుకున్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి రఘువీరారెడ్డి సోదరుడి కుమార్తె రమ్య రఘుపతిని నరేష్ పెళ్లాడారు. వీరికి ఒక బాబు ఉన్నాడు. మొత్తంగా నరేష్ సంతానం ముగ్గురు కుమారులు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2KNOAgQ
v

‘నాగేశ్వరరావు’ ఆగిపోలేదు.. చైతూ కెరీర్‌లోనే బెస్ట్ మూవీ: పరశురామ్

‘గీత గోవిందం’ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తరవాత డైరెక్టర్ పరశురామ్.. అక్కినేని హీరోగా సినిమాను ప్రకటించారు. 14 రీల్స్ బ్యానర్‌లో ఈ సినిమాను ప్రారంభించారు. ఇది నాగచైతన్యకు 20వ సినిమా. ఏప్రిల్‌లో ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్తుందని అప్పట్లో ప్రకటించారు. అయితే, - నాగచైతన్య సినిమా ఆగిపోయిందని కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది. మహేష్ బాబుతో సినిమాను పరశురామ్‌ అంగీకరించడంతో నాగచైతన్యతో చేయాల్సిన మూవీ నుంచి ఆయన తప్పుకున్నారని వదంతులు వచ్చాయి. పరశురామ్ తీసుకున్న నిర్ణయంతో నాగార్జున కూడా కోపంగా ఉన్నారని కూడా అన్నారు. అయితే, ఈ వదంతుల్లో నిజంలేదని పరశురామ్ స్పష్టం చేశారు. Also Read: ‘‘నాగచైతన్యతో సినిమా రద్దుకాలేదు. ‘నాగేశ్వరరావు’ అని టైటిల్ పెట్టాం. మేమిద్దరం ఆ సినిమా కచ్చితంగా చేస్తాం. చైతూ కెరీర్‌లోనే బెస్ట్ మూవీ అవుతుంది. ఆ సినిమా విషయంలో మేం వెనక్కి తగ్గం’’ అని పరశురామ్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు. అయితే, ఈ సినిమా బాలీవుడ్ హిట్ మూవీ ‘చిచోర్’కు రీమేక్ అనే ప్రచారం జరుగుతోంది. దీనిపై మాత్రం పరశురామ్ స్పందించలేదు. ఇదిలా ఉంటే, పరశురామ్‌తో సినిమా చేయడానికి ముందు నాగచైతన్య మరో రెండు సినిమాలు చేస్తారని రూమర్. 20వ సినిమాను డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణతో, 21వ సినిమాను విక్రమ్ కె. కుమార్‌తో చేస్తారని.. ఆ తరవాత 22వ సినిమాగా ‘నాగేశ్వరరావు’ చిత్రాన్ని చేస్తారని ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం నాగచైన్య.. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ‘లవ్ స్టోరీ’ సినిమాలో నటిస్తున్నారు. సాయి పల్లవి హీరోయిన్.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2xmt9QF
v

రిషి కపూర్ అంత్యక్రియలు పూర్తి.. కడచూపు దక్కించుకోని కూతురు

బాలీవుడ్ దిగ్గజ నటుడు అంత్యక్రియలు పూర్తయ్యాయి. ముంబైలోని చందన్‌వాడి శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించారు. దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ అమలులో ఉండటంతో హాస్పిటల్ నుంచి అంబులెన్స్‌లో శ్మశాన వాటికకు తీసకొచ్చి సాయంత్రం 4 గంటలకు అంత్యక్రియలు జరిపారు. రణ్‌బీర్ కపూర్ తన తండ్రికి తలకొరివి పెట్టారు. రిషి కపూర్ అంత్యక్రియలో కొంత మంది కుటుంబ సభ్యులు, ఆయన కుటుంబానికి సన్నిహితులైన కొందరు బాలీవుడ్ సెలబ్రిటీలు పాల్గొన్నారు. నిజానికి సాధారణ పరిస్థితులు ఉండుంటే రిషి కపూర్ అంత్యక్రియలు ఆడంబరంగా జరిగి ఉండేవి. ముంబైలోని ఆయన అభిమానులు ర్యాలీలు చేసుండేవారు. కానీ, లాక్‌డౌన్ కారణంగా కేవలం 20 మంది సన్నిహితుల సమక్షంలో రిషి కపూర్ అంత్యక్రియలు జరిగాయి. కపూర్ ఫ్యామిలీ నుంచి కొంత మందిని, సినీ పరిశ్రమకు చెందిన కొంత మంది స్నేహితులను మాత్రమే అంత్యక్రియలకు అనుమతించారు. రిషి కపూర్ భార్య నీతూ కపూర్, సోదరి రిమా జైన్, మనోజ్ జైన్, అర్మాన్ జైన్, ఆదర్ జైన్, అనిషా జైన్, రాజీవ్ కపూర్, రణ్‌ధీర్ కపూర్, సైఫ్ అలీ ఖాన్, కరీనా కపూర్, అభిషేక్ బచ్చన్, అలియా భట్, డాక్టర్ తరంగ్, అయాన్ ముఖర్జీ, జైరామ్, రోహిత్ ధావన్, రాహుల్ రావైల్ తదితరులు అంత్యక్రియల్లో పాల్గొన్నారు. Also Read: రిషి కపూర్ కుమార్తె రిధిమా కపూర్ సహ్ని అంత్యక్రియల్లో పాల్గొనలేకపోయారు. ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న ఆమె.. లాక్‌డౌన్ కారణంగా రాలేకపోయారు. రేపు ఆమె ముంబై చేరుకుంటారు. పోలీసులను ప్రత్యేక అనుమతి తీసుకున్న రిధిమా కారులో ఢిల్లీ నుంచి బయలుదేరారు. కాగా, రిషి కపూర్ ఈరోజు (ఏప్రిల్ 30న) ముంబైలోని హెచ్ఎన్ రిలయన్స్ హాస్పిటల్‌లో తుదిశ్వాస విడిచారు. రెండేళ్లుగా లుకేమియాతో బాధపడుతోన్న రిషి కపూర్.. తీవ్ర అస్వస్థతో బుధవారం ఉదయం హాస్పిటల్‌లో చేరారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2VRbVED
v

శ్రీరెడ్డి అరాచకానికి అద్దమే అదురుతోంది.. ‘కుక్కలు కుళ్లిన బొక్కలెతుకుతాయ్.. సింహం తాజా మేకనే’..

ఓరి సాంబో రాస్కోరా.. అన్నంత రేంజ్‌లో కొటేషన్ ఇచ్చి అద్దాన్ని హడలెత్తించే ఫొటో వదిలింది హాట్ బాంబ్ శ్రీరెడ్డి. అద్దం ఏంటి? హదలెత్తించడం ఏంటి అంటే ఆ ఫొటోపై లుక్కేస్తే ఈపాటికి మీకు సీన్ అర్థమైపోయే ఉంటుంది. ఫేస్ బుక్‌లో ఉన్న ఆరు మిలియన్ల మంది ఫాలోవర్స్‌ని ఆకర్షించాలి.. మరికొంతమందిని రాబట్టాలి అంటే తన ఫేస్ బుక్‌లో ఇలాంటి మాస్ మసాలా సరుకుని అద్దుతూనే ఉంటుంది శ్రీరెడ్డి. ప్రతిరోజు కూడా ఏదో విధంగా మినిమమ్ ఒక వివాదాస్పద మైన పోస్ట్ లేకుండా తన ఫేస్ బుక్‌ వాల్‌ని నిద్రపోనీయదు శ్రీరెడ్డి. ఇక తనకు తిక్క లేచిందంటే ఎవరో ఒకర్ని టార్గెట్ చేస్తూ బూతులు కురిపిస్తుంటుంది. లేదంటే మంచి మసాలా దట్టించి ఇదిగో ఇలాంటి హాట్ హాట్ ఫొటోలను వదులుతూ ఉంటుంది. తాజాగా అద్దంలో తన బ్యాక్ పార్ట్‌ను చూసికుని తెగ మురిపోతూ ఉన్న ఫొటోను వదిలింది శ్రీరెడ్డి. శ్రీరెడ్డి భారీ అందాలకు అద్దమే బెంబేలెత్తెపోయేట్టుగా ఉన్న ఈ ఫొటోకు ‘కుక్కలు కుళ్లిన బొక్కలెతుకాయ్.. సింహం తాజా మేకనే తింటుంది’.. అనే కొటేషన్‌ని కూడా పెట్టింది శ్రీరెడ్డి. ఇక భారీ దేహపు అందాన్ని చూసి కొంతమంది బాప్ రే శ్రీ.. ‘నా శ్రీ.. ఒక అందాల ప్రకృతి, నాకు చాలా ఇష్టం నీ శరీర ఆకృతి’ అంటూ కవితలు అందుకుని అని తెగ పొగిడేస్తున్నారు. ఇక‘కొంచెం అయినా బుద్ధి ఉండాలి’ అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. దీనికి రియాక్ట్ అయిన శ్రీరెడ్డి.. ‘బుద్ది ఉండాలా?? నీ దగ్గర ఉంటే ఓ మూడు కేజీలు ఇవ్వు.. ఇంతకీ ఎక్కడికొచ్చి తీసుకోమంటావ్? అంటూ కస్సుమంటోంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3f3D4vu
v

‘ఒక్కడు’ చూసి ఇండస్ట్రీకి వచ్చా.. నా కల నెరవేరుతోంది: పరశురామ్

‘యువత’ సినిమాతో టాలీవుడ్‌కి దర్శకుడిగా పరిచయమయ్యారు పరశురామ్. తొలి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తరవాత ‘ఆంజనేయులు’, ‘సోలో’ సినిమాలు దర్శకుడిగా పరశురామ్‌కు ఒక ప్రత్యేక శైలి ఉందనే గుర్తింపును ఇచ్చాయి. అయితే, ఎన్నో ఆశలతో రూపొందించిన ‘సారొచ్చారు’ సినిమా పరశురామ్‌కు షాక్ ఇచ్చింది. రవితేజ హీరోగా వచ్చిన ఈ సినిమా డిజాస్టర్ అయ్యింది. దీంతో స్పీడుకు ఒక్కసారిగా బ్రేకులు పడ్డాయి. ఈ సినిమా తరవాత పరశురామ్‌కు మరో అవకాశం దక్కడానికి నాలుగేళ్లు పట్టింది. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ఇచ్చిన అవకాశాన్ని పరశురామ్ అందిపుచ్చుకున్నారు. అల్లు శిరీష్, లావణ్య త్రిపాఠీలను హీరోహీరోయిన్లుగా పెట్టి ‘శ్రీరస్తు శుభమస్తు’ సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమాతో మళ్లీ ఫామ్‌లోకి వచ్చారు. ఆ వెంటనే ఇదే గీతా ఆర్ట్స్ సంస్థలో ‘గీత గోవిందం’ వంటి బ్లాక్ బస్టర్‌కు దర్శకత్వం వహించారు. ఈ ఒక్క సినిమాతో పరశురామ్ మరోసారి తెలుగు ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించారు. ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ బాబును డైరెక్ట్ చేయబోతున్నారు. మహేష్‌తో పరశురామ్ చేయనున్నట్టు చాలా రోజులుగా వార్తలు వస్తు్న్నాయి. వాటిని తాజాగా పరశురామ్ ఖరారు చేశారు. Also Read: గురించి, ఆయనతో చేయబోయే సినిమా గురించి తాజాగా ఒక ఇంటర్వ్యూలో పరశురామ్ మాట్లాడారు. ‘‘ఒక్కడు సినిమా చూసిన తరవాత ఇండస్ట్రీకి రావాలని నిర్ణయించుకున్నాను. మహేష్ సార్‌తో సినిమా చేయాలనదే నా బలమైన కోరిక. నా కల ఇప్పుడు నెరవేరబోతోంది. ఇది నా కెరీర్‌లో గుర్తుండిపోయే సినిమా అవుతుంది’’ అని పరుశురామ్ అన్నారు. ఫ్యాన్స్‌కు గూస్‌బంప్స్ వచ్చే సీన్లు, డైలాగులు రాయలేక కాదని.. ఇప్పటి వరకు తన సినిమాల్లో ఆ అవసరం పడలేదని పరశురామ్ చెప్పారు. ఇప్పుడు ఆ అవకాశం వచ్చిందని.. తనలోని మరో యాంగిల్‌ను చూస్తారని వెల్లడించారు. తన గత చిత్రాల మాదిరిగానే ఈ సినిమాలో మానవ సంబంధాలు, కుటుంబ భావోద్వేగాలు అన్నీ ఉంటాయని పరశురామ్ చెప్పారు. ప్రస్తుతం తన స్క్రిప్టులో ఇవన్నీ పొందుపరుస్తున్నానని తెలిపారు. ఇది మంచి సబ్జెక్ట్ అని, అందుకే వదలకుండా దాన్నే పట్టుకున్నానని.. అది తనను వదలకుండా పట్టుకుందని చెప్పారు పరశురామ్. ఇది చాలా మంచి సినిమా అవుతుందని, నవరసాలు ఉంటాయని వివరించారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3f4AwNM
v

అప్పుడు సురేఖావాణి ఇప్పుడు స్టార్ క్రికెటర్.. అది కూడా భార్యతో కలిసి! వైరల్ వీడియో

ప్రపంచమంతా కరోనా చేస్తున్న విలయతాండవం అందరినీ ఇంట్లోనే ఉంచేసింది. దేశవిదేశాల్లో లాక్‌డౌన్ అమలు చేయడంతో సాధారణ ప్రజలు మొదలుకొని సెలబ్రిటీల వరకూ అందరికీ ఒకేసారి ఖాళీ సమయం దొరికింది. దీంతో ఎవ్వరికి తోచినవిధంగా వారు ఎంజాయ్ చేస్తున్నారు. తమలో దాగిఉన్న టాలెంట్ బయటపెట్టేందుకు సరదా ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఆస్ట్రేలియన్ స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ తన భార్యతో కలిసి బుట్టబొమ్మ పాటకు స్టెప్పులేస్తూ ఎంజాయ్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. టిక్ టాక్ సెన్సేషన్‌గా మారిన బుట్టబొమ్మ పాటను ఇప్పటికే ఎంతోమంది సెలబ్రిటీలు ట్రయల్ చేశారు. నడుము, చేతులు తిప్పుతూ సిగ్నేచర్ స్టెప్ ఎంజాయ్ చేశారు. గతంలో టాలీవుడ్ నటి సురేఖావాణి, తన కూతురుతో కలిసి ఈ పాటకు స్టెప్పులేయడంతో అది సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేసింది. ఇప్పుడు అదే పాటకు లయబద్దంగా స్టెప్పులేసి డేవిడ్ వార్నర్, ఆయన భార్య ఇరగదీశారు. ఈ వీడియోను ట్విట్టర్ ఖాతా ద్వారా షేర్ చేసిన మ్యూజిక్ డైరెక్టర్ థమన్.. మన సంగీతం ఖండాలు దాటివెళ్లిందని, కొన్ని బిలియన్ల మంది ఈ పాటకు ఫిదా అయ్యారని పేర్కొన్నారు. డేవిడ్ వార్నర్, ఆయన భార్య బుట్టబొమ్మ అంటూ రింగరింగ నడుము తిప్పుతుంటే.. ఆ మధ్యలో బుడ్డోడు కూడా ఊగిపోతూ కనిపిస్తుండటం మరింత హుషారెత్తిస్తోంది. ఈ వీడియో చూసి అల్లు అర్జున్ అభిమానులు ఖుషీ అవుతున్నారు. తమ అభిమాన హీరో పాటకు ఈ రేంజ్ పాపులారిటీ రావడం, ప్రపంచం మొత్తం ఇలా మారుమోగిపోవడం గర్వంగా ఉందని అంటున్నారు. త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొంది భారీ సక్సెస్ సాధించిన 'అల.. వైకుంఠపురములో' సినిమాలో బుట్టబొమ్మ పాటకు విశిష్ట ఆదరణ లభించింది. ఈ పాటకు అల్లు అర్జున్, పూజా హెగ్డే వేసిన స్టెప్స్ ప్రేక్షకలోకాన్ని హుషారెత్తించాయి. యూట్యూబ్‌లో కూడా ఈ సాంగ్ రికార్డులు క్రియేట్ చేస్తూ మిలియన్లకొద్ది వ్యూస్ రాబట్టింది. ఇక టిక్ టాక్‌లో అయితే బుట్టబొమ్మ పాటకు స్టెప్పులేసినంతమంది మరే ఇతర పాటకు వేయలేదంటే ఆ క్రేజ్ ఎంత ఉందో అర్థం చేసుకోవచ్చు. Also Read:


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2SnZmOR
v

మనుషులు ఇంకా మారలేదా అనిపిస్తోంది.. మోహన్ బాబు సంచలన వ్యాఖ్యలు

ఏదైనా ముక్కుసూటిగా మాట్లాడటం, మనసులో ఉన్నది బయటపెట్టేయడం విలక్షణ నటుడు మంచు నైజం. అందుకే ఆయన మాట్లాడిన మాటలు కొన్ని సందర్భాల్లో వివాదాలకు కారణంగా మారుతుంటాయి. అయినప్పటికీ తాను చెప్పాలనుకున్నది నిర్మొహమాటంగా చెబుతుంటారు ఈ డైలాగ్ కింగ్. ఈ క్రమంలోనే కరోనా కల్లోలం సృష్టిస్తున్న ఈ లాక్‌డౌన్ సమయంలో ప్రజలు వ్యవహరిస్తున్న తీరు, పోలీసు చర్యల గురించి మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు మోహన్ బాబు. కరోనా మహమ్మారిని కట్టడి చేయడంలో భాగంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్‌‌డౌన్ ఆదేశాలు జారీ చేశాయి. ప్రజలు ఎవ్వరూ బయటకు రాకుండా పకడ్బందీ చర్యలు తీసుకుంటూ కరోనా బాధితులకు వైద్యసహకారం అందిస్తున్నాయి. పోలీసులు, డాక్టర్లు, పారిశుధ్య కార్మికులు ప్రతీ క్షణం శ్రమిస్తూ కరోనా కళ్లెం వేస్తున్నారు. అయితే కొన్ని ఏరియాల్లోని ప్రజలు ఏదో ఒక సాకుతో పోలీసులు, డాక్టర్లు చేస్తున్న కృషికి అడ్డుపడుతూ రోడ్లపై విచ్చలవిడిగా తిరుగుతున్నారు. డాక్టర్లపై చేయి చేసుకుంటున్నారు. తాజాగా ఇలాంటి ఇష్యూలపై స్పందించిన మోహన్ బాబు ప్రజలకు కాస్త ఘాటుగానే మాట్లాడారు. ''మనం దైవాలుగా భావించవల్సిన డాక్టర్లపై, నర్సులపై అక్కడక్కడా కొందరు దాడి చేయడం చూస్తుంటే మనుషులు ఇంకా మారలేదా అనిపిస్తోంది. వైద్యో నారాయణో హరి అన్నమాటను వేదవాక్కుగా భావించాలి. పోలీసులు మన రక్షణ కోసం వాళ్ళ రక్షణను వదిలేసి లాఠీ ఎత్తేది మన మీదకాదు.. కరోనా వైరస్ మనమీద పాకకుండా ఉండటం కోసమని గుర్తించండి. పోలీసులను, డాక్టర్లను గౌరవించండి. అన్నదమ్ముల కలిసి మెలసి ఉండండి. ఆ భగవంతున్ని ప్రార్థిస్తూ ప్రపంచం మొత్తం ఆరోగ్యంగా ఉండాలని కోరుకోండి'' అని మోహన్ బాబు అన్నారు. Also Read:


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2Yq4bv3
v

ఈ దు:ఖాన్ని భరించడం చాలా కష్టంగా ఉంది: రిషి కపూర్ మృతిపై లతా మంగేష్కర్

బాలీవుడ్ దిగ్గజ నటుడు ఈరోజు (ఏప్రిల్ 30న) కన్నుమూశారు. ఆయన వయసు 67 సంవత్సరాలు. గత రెండేళ్లుగా లుకేమియాతో బాధపడుతోన్న రిషి కపూర్‌.. నిన్న అర్ధరాత్రి తీవ్ర అస్వస్థతకు గురికావడంతో కుటుంబ సభ్యులు హాస్పిటల్‌లో చేర్చారు. అక్కడ చికిత్స పొందుతూ ఈరోజు ఉదయం ఆయన తుదిశ్వాస విడిచారు. రిషి కపూర్‌కు భార్య నీతూ సింగ్, కుమారుడు రణ్‌బీర్ సింగ్ ఉన్నారు. నీతూ సింగ్ ఒకప్పటి హీరోయిన్. రణ్‌బీర్ సింగ్ ప్రస్తుతం బాలీవుడ్‌లో స్టార్ హీరోగా రాణిస్తున్నారు. కాగా, రిషి కపూర్ మృతితో బాలీవుడ్‌ షాక్‌కు గురైంది. నిన్న ఇర్ఫాన్ ఖాన్.. ఆ వెంటనే ఈరోజు రిషి కపూర్ కన్నుమూయడంతో బాలీవుడ్ సెలబ్రిటీలు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. రిషి కపూర్ ఇకలేరన్న వార్త బయటికి రాగానే బాలీవుడ్ సెలబ్రిటీలు సోషల్ మీడియా ద్వారా ఆ దిగ్గజ నటుడికి సంతాపం ప్రకటించారు. ఆయన కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. దిగ్గజ గాయని లతా మంగేష్కర్ కూడా ట్విట్టర్ ద్వారా సంతాపాన్ని ప్రకటించారు. ఈ దు:ఖాన్ని భరించలేనంటూ ట్వీట్ చేశారు. చిన్నారి రిషి కపూర్‌ను తాను ఎత్తుకున్న అలనాటి ఫొటోను లతా మంగేష్కర్ షేర్ చేశారు. అప్పటికి రిషి కపూర్ వయసు 3 నెలలట. Also Read: ఈ ఫొటోను రిషి కపూర్ స్వయంగా లతా మంగేష్కర్‌కు కొన్ని రోజుల క్రితం పంపారట. తన చేతులతో ఎత్తుకున్న చిన్నారిని ఇప్పుడు తాను కోల్పోయానని ఆవేదన వ్యక్తం చేశారు. మాటలు రావడం లేదంటూ ట్వీట్‌లో పేర్కొన్నారు. అంతేకాదు.. ‘‘ఏమి చెప్పాలి? ఏం రాయాలో అర్థం కావడంలేదు. రిషి గారు మరణించారనే వార్త నన్ను చాలా బాధించింది. ఆయన నిష్క్రమణ వల్ల సినీ పరిశ్రమ చాలా నష్టపోయింది. ఈ దు:ఖాన్ని భరించడం నాకు చాలా కష్టంగా ఉంది. దేవుడు ఆయన ఆత్మకు శాంతి కలిగించాలి’’ అని లతా మంగేష్కర్ ట్వీట్ చేశారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2xkfrxG
v

అప్పటినుంచే ఆ హీరో అంటే క్రష్.. మనసులో మాట బయటపెట్టిన అనసూయ

న్యూస్ ప్రెజెంటర్‌గా కెమెరా ముందుకొచ్చిన ఆ తర్వాత బుల్లితెర, వెండితెర ప్రయాణాలు చేస్తూ ఫుల్ పాపులర్ అయింది. హీరోయిన్లతో సమానమైన క్రేజ్ కొట్టేసి జనం నోళ్ళలో నానుతూ ఉంది. అయితే ఆమె కెరీర్‌కి పునాది వేసి, టర్న్ చేసింది మాత్రం ఒక్క జబర్దస్త్ షో అనే చెప్పుకోవాలి. అందుకే అనసూయను అంతా జబర్దస్త్ బ్యూటీ అని ముద్దుగా పిలుచుకుంటారు. అలాగే ఆమెకు సంబంధించిన విషయాలు తెలుసుకోవడంలో ఆసక్తి చూపిస్తుంటారు. ఈ నేపథ్యంలోనే తాజాగా తన ఫేవరేట్ హీరో, ఆ హీరోతోనే క్రష్ అని అనసూయ స్వయంగా చెప్పడం హాట్ టాపిక్‌గా మారింది. లాక్‌డౌన్ కారణంగా ఇంట్లోనే ఉంటున్న అనసూయ భరద్వాజ్ రెగ్యలర్‌గా సోషల్ మీడియా ద్వారా అభిమానులకు టచ్‌లో ఉంటోంది. తన ట్విట్టర్, ఇన్స్‌స్టా ఖాతాల ద్వారా అభిమానులతో సరదాగా చిట్ చాట్ చేస్తూ తన కెరీర్, వ్యక్తిగత విషయాలను బయటపెడుతోంది. ఈ మేరకు తాజాగా జరిగిన చిట్‌చాట్‌లో మీకు నచ్చిన హీరో ఎవరు అనే ప్రశ్నపై బదులిచ్చిన అనసూయ.. తనకు హీరో అర్జున్ అంటే చాలా ఇష్టమని చెప్పింది. శంకర్ దర్శకత్వంలో వచ్చిన ‘జెంటిల్ మెన్’ మూవీ చూసిన తర్వాత ఆయన అభిమానిగా మారిపోయానని, ఒక్కమాటలో చెప్పాలంటే ఆ సినిమా చూడగానే ఆయనంటే క్రష్ ఏర్పడిందని చెప్పి షాకిచ్చింది అనసూయ. డైరెక్టర్ శంకర్ మొదటి చిత్రం 'జెంటిల్ మెన్'. హీరో అర్జున్‌తో ఈ సినిమా చేసిన ఆయన ఆ తర్వాత స్టార్ డైరెక్టర్‌గా ఎదిగారు. ఈ మూవీలో అర్జున్ రెండు విభిన్న తరహా పాత్రల్లో కనిపించి ఆకట్టుకున్నారు. అది చూసే అనసూయ అర్జున్ ఫ్యాన్ అయిపోయిందట. ఇకపోతే ఇటీవలే రంగస్థలంలో రంగమ్మతగా, అదేవిధంగా 'కథనం'లో హోల్ అండ్ సోల్‌గా అదరగొట్టిన అనసూయ.. ప్రస్తుతం కృష్ణ వంశీ దర్శకత్వంలో రూపొందుతున్న 'రంగమార్తాండ' చిత్రంలో ముఖ్యపాత్ర పోషిస్తోంది. అలాగే అల్లు అర్జున్ 'పుష్ప' సినిమాలోనూ ఆమె నటిస్తున్నట్లు టాక్. Also Read:


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3f6q60b
v

రిషి, ఇర్ఫాన్‌ల మృతిపై బాలకృష్ణ రియాక్షన్.. ఇది తీరని లోటు అంటూ ఆవేదన

వరుసగా బాలీవుడ్ సినీ ఇండస్ట్రీని కుదిపేసే సంఘటనలు చోటు చేసుకున్నాయి. దిగ్గజ నటులు ఇర్ఫాన్ ఖాన్, ఒక్క రోజు తేడాలో తిరిగిరాని లోకాలకు వెళ్లడం యావత్ సినీ లోకాన్ని షాక్‌కి గురిచేసింది. అనారోగ్యం కారణంగా ఏప్రిల్ 29న బాలీవుడ్ నటుడు మరణించగా, ఆ మరుసటి రోజే అనగా నేడు (ఏప్రిల్ 30) మరో విలక్షణ నటుడు రిషి కపూర్ కన్నుమూయడం జీర్ణించుకోలేక పోతున్నారు సినీ ప్రముఖులు. ఈ నమ్మలేని విషయాలపై రియాక్ట్ అవుతూ వారి ఆత్మలకు శాంతి చేకూరాలని పెద్ద ఎత్తున ట్వీట్స్ పెడుతున్నారు. ఇప్పటికే బిగ్ బీ అమితాబ్ బచ్చన్, సూపర్ స్టార్ రజినీకాంత్, మెగాస్టార్ చిరంజీవి, మోహన్ బాబు, మహేష్ బాబు, అల్లు అర్జున్, తమన్నా, అనసూయ, తాప్సి, నిధి అగర్వాల్ లాంటి ఎందరో తారలు రిషి మృతిపట్ల తమ తమ ప్రగాఢ సానుభూతి తెలపగా, తాజాగా నందమూరి రియాక్ట్ అవుతూ ఆవేదన చెందారు. ''రిషి కపూర్, ఇర్ఫాన్ ఖాన్ లాంటి ఇద్దరు నట దిగ్గజాలు మనకు దూరమవడం చాలా బాధాకరం. భారతీయ సినిమాకు ఇది తీరని లోటు.వారి చిత్రాల ద్వారా ఎప్పటికీ గుర్తుంటారు. వారి కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ వారి ఆత్మలకు శాంతి కలగాలని ఆ భగవంతుడిని ప్రార్ధిస్తున్నాను'' అని బాలకృష్ణ పేర్కొన్నారు. పలు హిందీ చిత్రాల్లో హీరోగా నటించిన రిషికపూర్ అనారోగ్యానికి గురికావడంతో అతన్ని బుధవారం రాత్రి ముంబైలోని హెచ్ ఎన్ రిలయెన్స్ ఆసుపత్రిలో చేర్చారు. చికిత్స అందిస్తుండగా ఈ రోజు ఉదయం 8 గంటల 45 నిమిషాలకు ఆయన మరణించినట్లు కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. రిషి మరణవార్త తెలియగానే అతని సన్నిహితులు, కుటుంబ సభ్యులు సహా పలువురు సినీ ప్రముఖులు తమ తమ సంతాపం తెలుపుతున్నారు. Also Read:


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2KJmRxt
v

Wednesday 29 April 2020

Rishi Kapoor Death: ట్రూ లెజెండ్.. రిషి కపూర్ మృతిపై చిరంజీవి, మోహన్ బాబు స్పందన

దివంగత దిగ్గజ నటుడు రాజ్ కపూర్ తనయుడు రిషి కపూర్ (67) మరణం యావత్ సినీ లోకాన్ని విషాదంలోకి నెట్టేసింది. నిన్న (బుధవారం) బాలీవుడ్ నటుడు ఇర్ఫాన్ ఖాన్ మరణం, ఆ వెంటనే నేడు (గురువారం) మరో నటుడు రిషి కపూర్ కన్నుమూయడం జీర్ణించుకోలేకపోతోంది సినీ లోకం. రిషి కపూర్ మరణవార్త తెలిసి మెగాస్టార్ చిరంజీవి, టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, డైలాగ్ కింగ్ మోహన్ బాబు తమ తమ సోషల్ మీడియా ఖాతాల ద్వారా రియాక్ట్ అయ్యారు. ''రిషి కపూర్ మరణించారనే వార్త వినగానే గుండె పగిలింది. సినిమా ప్రపంచంలో మరో పూడ్చలేని నష్టం జరిగింది. ట్రూ లెజెండ్, అత్యంత ప్రతిభావంతుడైన నటుడు రిషి కపూర్ మరణం కలచివేసింది. రణబీర్, అతని కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సంతాపం తెలుపుతూ రిషి కపూర్ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నా'' అని మహేష్ బాబు పేర్కొన్నారు. ''చిత్రసీమకు ఇది భయంకరమైన వారం. పూడ్చలేని నష్టం జరిగింది. లెజెండరీ రిషీ కపూర్, టాలెంటెడ్ యాక్టర్ ఇర్ఫాన్ ఖాన్ మరణాలు నష్టాన్ని మిగిల్చాయి. ఆ రెండు కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా'' అని మోహన్ బాబు ట్వీట్ చేశారు. గొప్ప యాక్టర్, మంచి స్నేహితుడు రిషి కపూర్ ఇక లేరనే వార్త తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. గొప్ప వారసత్వాన్ని మోస్తూ కొన్ని మిలియన్ల హృదయాలను కొల్లగొట్టిన రిషి.. అందరినీ బాధపెడుతూ తిరిగిరాని లోకాలకు వెళ్లారు. నా గుండె పగిలింది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నా. నా స్నేహితుడికి కన్నీటి వీడ్కోలు'' అని పేర్కొంటూ చిరంజీవి ట్వీట్ చేశారు. Also Read:


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2yX2SbY
v

రిషికపూర్ మృతి పట్ల టాలీవుడ్ ప్రముఖుల సంతాపం.. రజినీకాంత్, అనసూయ ట్వీట్స్

బాలీవుడ్ నటుడు రిషి కపూర్ (67) ఆకస్మిక మరణవార్త యావత్ సినీ లోకాన్ని షాక్‌కి గురి చేసింది. గత కొంతకాలంగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న ఆయనను గత రాత్రి ముంబైలోని హెచ్ ఎన్ రిలయెన్స్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా, కొద్దిసేపటి క్రితం తుది శ్వాస విడిచారు. రిషి కపూర్ మరణ వార్త తెలిసి బాలీవుడ్, టాలీవుడ్ లోని పలువురు సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలియజేస్తున్నారు. దేవుడా.. మీరు ఏం చేస్తున్నారు? భారతీయ సినిమా పరిశ్రమ ఓ రత్నాన్ని కోల్పోయింది. రిషి కపూర్ మరణించారనే భయంకరమైన వార్తతో మేల్కొన్నాను. భారత దేశమంతా అన్ని జెనెరేషన్స్ ఫాలోయింగ్ కూడగట్టుకున్న గొప్పనటుడు ఆయన. రిషి కపూర్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా- అనసూయ భరద్వాజ్. నా ప్రియ మిత్రుడు రిషి కపూర్ మరణించారని తెలిసి గుండె పగిలింది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నా- రజినీకాంత్. ఏదో వ్రాయడానికి ప్రయత్నిస్తున్నాను కానీ నా మనస్సు, చేతులు సహకరించడంలేదు. రిషికపూర్ లేరనే విషయాన్ని నా హృదయం అర్థం చేసుకోలేకపోతుంది. ఆ నవ్వు, ఆ హాస్యం, నిజాయితీ అన్నీ కోల్పోయాం. మీలాంటి మనిషి ఇంకెవరూ లేరు- తాప్సి రిషి కపూర్ లేరంటే నమ్మలేక పోతున్నా. రిషి గారు మరణించారనే షాకింగ్ న్యూస్ వింటూ నిద్రలేచా. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నా. మిమ్మల్ని మిస్ అయ్యాం రిషి కపూర్ గారు- తమన్నా 'మేరా నామ్ జోకర్' సినిమాతో బాలనటుడిగా తెరంగేట్రం చేశారు రిషి కపూర్. 1974 లో ఆయన నటించిన 'బాబీ' సినిమాకు గాను ఫిలిం ఫేర్ ఉత్తమ నటుడిగా అవార్డు అందుకున్నారు. ఇటీవల ముల్క్ అనే సినిమాలో నటించి మరోసారి అదరగొట్టారు. రీసెంట్‌గా ది బాడీ అనే సినిమాలో, ఓ వెబ్ సిరీస్‌లో కూడా నటించారు రిషి కపూర్.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3bPCcJ5
v

సినీ ఇండస్ట్రీలో విషాదం.. బాలీవుడ్ నటుడు రిషీ కపూర్ మృతి

బాలీవుడ్‌లో వరుస మరణాలు చోటు చేసుకోవడం సినీ వర్గాలను షాకింగ్‌కి గురిచేస్తోంది. నిన్న (బుధవారం) ఇర్ఫాన్ ఖాన్ మరణించగా.. కొద్దిసేపటి క్రితం ఈ రోజు (గురువారం) సీనియర్ నటుడు, రాజ్ కపూర్ తనయుడు రిషి కపూర్ (67) మరణించడం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. గత కొంతకాలంగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న ఆయనను గత రాత్రి ముంబైలోని హెచ్ ఎన్ రిలయెన్స్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా, కొద్దిసేపటి క్రితం తుది శ్వాస విడిచారు. 1952 వ సంవత్సరం సెప్టెంబర్ 4న జన్మించిన రిషికపూర్.. నటుడిగా, నిర్మాతగా, దర్శకుడిగా రాణించారు. 1980లో హీరోయిన్ నీతూ సింగ్‌ని పెళ్లాడాడు. రిషికపూర్ కుమారుడే ప్రముఖ బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్. రిషి కపూర్ మరణ వార్త తెలిసి బాలీవుడ్ ఇండస్ట్రీ షాక్ అయింది. ఆయన మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. బిగ్ బీ అమితాబ్ తన ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు. 'మేరా నామ్ జోకర్' సినిమాతో బాలనటుడిగా తెరంగేట్రం చేశారు రిషి కపూర్. 1974 లో ఆయన నటించిన 'బాబీ' సినిమాకు గాను ఫిలిం ఫేర్ ఉత్తమ నటుడిగా అవార్డు అందుకున్నారు. ఇటీవల ముల్క్ అనే సినిమాలో నటించి మరోసారి అదరగొట్టారు. రీసెంట్ గా ది బాడీ అనే సినిమాలో, ఓ వెబ్ సిరీస్ లో కూడా నటించారు రిషి కపూర్. 2018లోనే రిషి కపూర్‌కు క్యాన్సర్ ఉన్నట్లు నిర్ధారణ అయింది. దీంతో ఆయన న్యూయార్క్‌ నగరంలో చికిత్స తీసుకొని ఇండియా వచ్చారు. ఇటీవలే ఆయన యోగా చేస్తున్న వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది రిషి భార్య నీతూ సింగ్. ఇంతలోనే ఆయన మరణించారనే వార్త బాలీవుడ్ ఇండస్ట్రీని శోక సంద్రంలో నెట్టేసింది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2Yfd3n7
v

మరణానికి కొన్నిక్షణాల ముందు ఇర్ఫాన్ ఏమన్నాడంటే.. గుండెలు పిండేసే మాటలు!!

బాలీవుడ్ నటుడు (53) మరణం యావత్ సినీ లోకాన్ని శోకసంద్రంలో నెట్టేసింది. చాలా కాలంగా క్యానర్స్‌తో పోరాడిన ఆయన ఏప్రిల్ 29వ తేదీన ముంబైలోని కోకిలా బెన్ హాస్పిటల్‌లో తుదిశ్వాస విడిచారు. ఇర్ఫాన్ మరణ వార్త తెలిసి బాలీవుడ్‌లో విషాద ఛాయలు కమ్ముకున్నాయి. బాలీవుడ్, టాలీవుడ్ సహా ఇతరభాషా నటీనటులు ఆయన మృతిపట్ల సంతాపం తెలియజేశారు. అయితే మరణానికి కొన్నిక్షణాల ముందు ఇర్ఫాన్ మాట్లాడిన మాటలు మరింత కంటతడి పెట్టిస్తున్నాయి. కెరీర్‌లో ఎంతో కష్టపడి పైకొచ్చిన ఇర్ఫాన్ ఖాన్‌కి తన తల్లి అంటే ఎంతో ప్రేమ ఉండేదట. అయితే మూడు రోజుల క్రితమే అంటే శనివారం (ఏప్రిల్ 25న) ఇర్ఫాన్ ఖాన్ తల్లి సయీద బేగం (95) మరణించడం ఆయన్ను మరింత కలిచి వేసిందని, రాజస్థాన్‌లోని జైపూర్‌లో జరిగిన తన తల్లి అంత్యక్రియలకు వెళ్లలేకపోవడం ఆయన జీర్ణించుకోలేక పోయారని అంటున్నారు ఇర్ఫాన్ బంధువులు. లాక్‌డౌన్ కారణంగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తల్లి అంత్యక్రియలను చూసి ఇర్ఫాన్ చాలా బాధపడినట్టు సన్నిహితులు వెల్లడించారు. గతంలో న్యూరోఎండోక్రైన్ ట్యూమర్ (క్యాన్సర్) వ్యాధితో బాధపడిన ఆయన, తల్లి మరణం తర్వాత మరింత డిప్రెషన్ లోకి వెళ్లిపోయారని, హాస్పిటల్‌లో చేరాక కూడా ఎక్కువగా తల్లినే గుర్తుచేసుకున్నారని చెప్పారు. ఇక చివరకు తన మరణానికి కొన్నిక్షణాల ముందు 'నన్ను తీసుకెళ్లేందుకు మా అమ్మ వచ్చింది' అని ఇర్ఫాన్ అనడం జీర్ణించుకోలేక పోయామని ఆ సమయంలో ఇర్ఫాన్ పక్కన ఉన్న బంధువులు పేర్కొన్నారు. ఇర్ఫాన్ ఖాన్ మృతిచెందిన కొద్దిసేపట్లోనే అంత్యక్రియలు నిర్వహించారు. బుధవారం మధ్యాహ్నం 3 గంటలకు ముంబైలోని వెర్సోవా ముస్లిం శ్మశాన వాటికలో కేవలం కొంతమంది కుటుంబ సభ్యుల సమక్షంలో ఇర్ఫాన్ పార్థివదేహాన్ని ఖననం చేశారు. ఆయన మరణించారనే విషయాన్ని ఇప్పటికీ నమ్మలేక పోతోంది ప్రేక్షకలోకం.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2SlUBVV
v

పవన్ జోలికొస్తే చెప్పుతో కొడతాం.. శ్రీ రెడ్డి టాపిక్ తీస్తూ తమన్నా సంచలన వ్యాఖ్యలు

సినీ రంగానికి, రాజకీయ రంగానికి ఎంతో తారతమ్యం ఉంటుంది. సినిమా అనేదే ఎంటర్‌టైనింగ్ రంగం కాబట్టి ఓ సినిమా పోతే మరో సినిమా కోసం ఎదురుచూస్తుంటారు. కానీ రాజకీయం అలా కాదు.. ఎన్ని పనులు చేస్తూ వెళ్లినా, జనంతో మమేకమవుతూ ప్రజా సమస్యల పరిష్కారంలో పాలు పంచుకుంటున్నా కూడా ఏదో ఒక మూల నుంచి విమర్శలు వస్తూనే ఉంటాయి. ఈ క్రమంలోనే తనపై ఎన్ని విమర్శలొచ్చినా ఏ మాత్రం జంకకుండా పార్టీని ముందుకు నడిపిస్తూ కార్యకర్తలకు భరోసా ఇస్తున్నారు జనసేన అధినేత . ఈ క్రమంలో పవన్ కళ్యాణ్‌ని విమర్శించే వారికి వార్నింగ్ ఇచ్చింది ట్రాన్స్‌జెండర్ . ఓ మీడియాతో ఆన్‌‌లైన్ ఇంటర్వ్యూలో పాల్గొన్న తమన్నా.. జనసేనకు మద్దతుగా మాట్లాడింది. పవన్ కళ్యాణ్ వెంట తామున్నామని, ఆయనను విమర్శిస్తూ ఎవ్వరైనా పవన్ జోలికొస్తే తాట తీస్తామని చెప్పింది. కొందరు తమ పేరును పాపులర్ చేసుకునేందుకు పవన్ కళ్యాణ్‌పై విమర్శలు చేస్తున్నారని, అలాంటి కుక్కలకు సమాధానం చెబుతామని అంటూ ఘాటు వ్యాఖ్యలు చేసింది తమన్నా. రాకేష్ మాస్టర్, శ్రీరెడ్డి లాంటి వారితో పాటు ఇంకొందరు తమ పాపులారిటీ కోసమే విమర్శలు చేస్తున్నారని ఆమె పేర్కొంది. పవన్ తిట్టి వార్తల్లో నిలవాలని, అలా తమ పేరు ప్రజల నోళ్ళలో నానాలని కొన్ని పిచ్చికుక్కలు ప్రయత్నిస్తున్నాయని తమన్నా ఫైర్ అయింది. ఎవడో తిట్టాడని, వాళ్లందరికీ పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని, అలాంటి వారిని చెప్పుతో కొట్టేందుకు మేమున్నాం అంటూ రెచ్చిపోయింది తమన్నా. మహిళ కాబట్టి వదిలేశామని, ఈ లాక్‌డౌన్ పూర్తికాగానే పవన్‌ని విమర్శించే వాళ్లను చెప్పుతో కొడతాం అనేసింది తమన్నా. జనసేన పార్టీని ముందుకు తీసుకెళ్లడానికి పవన్ చాలా శ్రమిస్తున్నారని ఆమె చెప్పింది. గెలుపోటములతో సంబంధం లేకుండా ప్రజా సమస్యలపై పోరాడుతూ సొంత డబ్బుతో పార్టీని నడుపుతున్నారని చెప్పుకొచ్చింది. గత ఎన్నికల్లో జనసేన పార్టీ నుంచి టికెట్ వస్తుందని అనుకున్నా, కానీ రాకపోవడంతో ఏ పార్టీలో చేరకుండా ఇండిపెండెంట్‌గా పోటీ చేశానని తెలిపింది. అప్పుడు.. ఇప్పుడు తనది జనసేన పార్టీయే అని, ఎప్పుడూ పవన్ కళ్యాణ్ అభిమానినే అని చెప్పింది తమన్నా సింహాద్రి. Also Read:


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/35fWQzo
v

ఆస్పత్రిలో చేరిన బాలీవుడ్ ప్రముఖ నటుడు రిషికపూర్

బాలీవుడ్ ప్రముఖ నటుడు రిషికపూర్ అనారోగ్యం పాలయ్యారు. దీంతో ఆయనను బుధవారం రాత్రి ముంబైలోని ఆసుపత్రికి తరలించినట్లు అతని సోదరుడు రణధీర్ కపూర్ తెలిపారు. రిషికపూర్ నిన్నరాత్రి అనారోగ్యానికి గురికావడంతో హుటాహుటిన ముంబైలోని హెచ్ఎన్ రిలయెన్స్ ఆసుపత్రిలో చేర్పించారు. ఆసుపత్రిలో రిషికపూర్ వెంట అతని భార్య నీతూకపూర్ కూడా ఉన్నారు. రిషికపూర్ ఆసుపత్రిలో చేరడంతో ఆయన కుమారుడు ప్రముఖహీరో రణబీర్ కపూర్ బుధవారం రాత్రి ఆసుపత్రికి చేరుకున్నారు. ప్రస్తుతం ఆయనకు డాక్టర్లు చికిత్స అందిస్తున్నారు. రిషికపూర్ శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. రిషికపూర్ కు 2018లో కేన్సర్ రావడంతో న్యూయార్క్ లో చికిత్స పొందారు. చికిత్స అనంతరం కోలుకున్న రిషికపూర్ తో కలిసి భోజనం చేస్తున్న చిత్రాన్ని అతని సతీమణి ఈ ఏడాది మార్చిలో సోషల్ మీడియాలో పోస్టు చేశారు. లాక్ డౌన్ సందర్భంగా యోగా చేస్తున్న రిషికపూర్ ఫోటో కూడా అతని భార్య పెట్టారు. ఉన్నట్టుండి అనారోగ్యానికి గురవడంతో రిషికపూర్ ను ఆసుపత్రికి తరలించారు. బాబీతో పాటు పలు ప్రజాదరణ పొందిన చిత్రాల్లో నటించిన రిషికపూర్ తాజాగా వెబ్ సిరీస్ లో కూడా కనిపించారు. రిషికపూర్ వయసు ప్రస్తుతం 68 ఏళ్లు. బాలీవుడ్‌లో ఒకప్పుడు రొమాంటిక్ హీరోగా రిషికపూర్ వెలుగు వెలిగారు. పలు సూపర్ హిట్ చిత్రాల్లో హీరోగా నటించారు. రిషికపూర్‌ రాజ్‌కపూర్‌ రెండవ కుమారుడు. సెప్టెంబరు 4, 1952న ముంబైలో జన్మించాడు. వారిది పంజాబీ కుటుంబం. అన్న రణధీర్, తమ్ముడు రాజీవ్‌తో కలిసి ముంబైలోని కూపరేజ్‌ రోడ్డులో వున్న క్యామ్పియన్‌ పాఠశాలలో చదివాడు. అజ్మీర్‌ లోని చారిత్రాత్మక మేయో కళాశాలలో డిగ్రీ పట్టా అందుకున్నాడు. ప్రముఖ బాలీవుడ్ అలనాటి హీరోలు షమ్మికపూర్, శశికపూర్‌ ఇద్దరూ రిషికి బాబాయిలు. ఇక క్యారక్టర్‌ నటుడు ప్రేమనాథ్, హాస్యనటుడు రాజేంద్రనాథ్‌ రిషి కపూర్‌కు మేనమామలు. రీతు నందా, రీమా జైన్‌ ఇద్దరూ రిషికపూర్‌కు అక్క చెల్లెళ్లు. పద్దెనిమిదేళ్ల వయసులో తొలిసారి ‘మేరా నామ్‌ జోకర్‌’ సినిమాలో రిషి కపూర్‌ చిన్ననాటి రాజ్‌కపూర్‌గా నటించాడు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2SiN3mS
v

Be The Real Man: ప్రత్యేకత చాటుకున్న దేవిశ్రీ.. బన్నీ సహా ఐదుగురికి ఛాలెంజ్

ప్రస్తుతం టాలీవుడ్‌లో ‘బి ద రియల్ మ్యాన్’ ఛాలెంజ్ నడుస్తోన్న సంగతి తెలిసిందే. దర్శకుడు సందీప్ రెడ్డి వంగ ప్రారంభించిన ఈ ఛాలెంజ్.. రాజమౌళి లాంటి దర్శకధీరుడు ద్వారా పాపులర్ అయ్యింది. జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, చిరంజీవి, వెంకటేష్ లాంటి స్టార్ హీరోలు ఈ ఛాలెంజ్‌లో పాలుపంచుకోవడంతో ఈ లాక్‌డౌన్ సమయంలో ఈ ఛాలెంజ్ తెలుగు ప్రేక్షకులకు మంచి వినోదాన్ని పంచుతోంది. ఇన్ని రోజులూ తెరపైన, తెర వెనుక ఉంటూ ప్రేక్షకులకు వినోదాన్ని పంచిన టాలీవుడ్ స్టార్లు.. ఇప్పుడు ఇళ్లలో పనులు చేస్తూ అలరిస్తున్నారు. ఈ ‘బి ద రియల్ మ్యాన్’ ఛాలెంజ్‌లో భాగంగా ప్రముఖ దర్శకుడు సుకుమార్.. తనకు ఎంతో ఇష్టమైన సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్‌ను నామినేట్ చేశారు. సుకుమార్ ఛాలెంజ్‌ను స్వీకరించిన దేవి.. బుధవారం తన వీడియోను ట్వీట్ చేశారు. అయితే, ఈ వీడియో కాస్త వెరైటీగా ఉంది. దేవిశ్రీ స్టైల్‌లో చాలా ఎనర్జిటిక్‌గా ఉంది. వీడియో బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అదిరిపోయింది. అన్నిటికీ మించి ఈ వీడియోలో దేవి తన మేనల్లుడిని భాగం చేయడం ఆసక్తికరం. నిద్రపోతున్న మావయ్యను లేపి మరీ పనులు చేయించాడు దేవి మేనల్లుడు తనవ్ సత్య. Also Read: దేవిశ్రీ చీపురుతో ఇల్లు ఊడ్చారు.. మాప్‌తో ఫ్లోర్ శుభ్రం చేశారు.. టీవీ, స్పీకర్స్, సోఫాలు అన్నీ క్లీన్ చేసేశారు.. తల్లికి ఆమ్లెట్ వేసి పెట్టారు.. ప్లేట్ కడిగేశారు.. డైనింగ్ టేబుల్, వాల్ మిర్రర్ క్లీన్ చేశారు.. చివరిగా తన తండ్రి సత్యమూర్తి గారి ఫొటోలను శుభ్రం చేసి దండం పెట్టకున్నారు. అమ్మకు కాఫీ కూడా పెట్టి ఇచ్చారు. ఈ వీడియో మొత్తం చాలా ఎనర్జిటిక్‌గా అనిపిస్తోంది. అయితే, ఈ ఛాలెంజ్‌లో భాగంగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, తమిళ హీరో కార్తి, కన్నడ రాక్‌స్టార్ యష్, డైరెక్టర్ హరీష్ శంకర్, మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్‌లను నామినేట్ చేశారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2xi6rJq
v

వంద మిలియన్ల ఉస్తాద్.. ఆ ఫీట్ అందుకున్న ఏకైక సౌత్ హీరో రామ్

డిజిటల్ ప్లాట్‌ఫాం వచ్చిన తరవాత తెలుగు సినిమా సరిహద్దులు పెరిగాయి. ఒకప్పుడు తెలుగు ప్రేక్షకులకు మాత్రమే పరిమితమైన టాలీవుడ్ మూవీస్.. ఇప్పుడు వేరే భాషల ప్రేక్షకులను కూడా మెప్పిస్తున్నాయి. హిందీలో సౌత్ ఇండియన్ స్టార్స్‌కు పెరుగుతున్న క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకుని ఇక్కడి సినిమాలను హిందీలోకి అనువాదం చేసి యూట్యూబ్‌లో విడుదల చేస్తున్నారు. వీటిలో తెలుగు సినిమాలు కూడా చాలా ఉన్నాయి. మన తెలుగు సినిమాలకు హిందీ ప్రేక్షకుల నుంచి విపరీతమైన స్పందన వస్తోంది. ముఖ్యంగా ఎనర్జిటిక్ స్టార్ రామ్ సినిమాలను హిందీ ప్రేక్షకులు విపరీతంగా చూస్తున్నారు. దీంతో యూట్యూబ్‌లో విడుదలైన దక్షిణాది సినిమాల్లో రామ్ మూవీస్ అత్యధిక వ్యూస్ రాబట్టాయి. రామ్‌కు కొత్త రికార్డును తెచ్చిపెట్టాయి. వరుసగా నాలుగు సినిమాలకు యూట్యూబ్‌లో 100 మిలియన్ వ్యూస్ రాబట్టిన ఏకైక దక్షిణాది హీరోగా రామ్ రికార్డ్ సృష్టించారు. ‘ద సూపర్ ఖిలాడి - 3’ (నేను శైలజ), ‘దూమ్‌దార్ ఖిలాడి’ (హలో గురు ప్రేమకోసమే), ‘నెం.1 దిల్వాల’ (ఉన్నది ఒకటే జిందగీ), ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాలు 100 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించాయి. అత్యధికంగా ‘ద సూపర్ ఖిలాడి - 3’ ఇప్పటి వరకు 189 మిలియన్ వ్యూస్ రాబట్టింది. ‘దూమ్‌దార్ ఖిలాడి’కి 184 మిలియన్, ‘నెం.1 దిల్వాల’కు 157 మిలియన్, ‘ఇస్మార్ట్ శంకర్’కు 100 మిలియన్ వ్యూస్ వచ్చాయి. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో కిందటేడాది వచ్చిన ‘ఇస్మార్ట్ శంకర్’ బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. రామ్‌ను మళ్లీ ఫామ్‌లోకి తీసుకొచ్చింది. ఈ సినిమా హిందీ ప్రేక్షకులనూ విశేషంగా ఆకట్టుకుంది. Also Read: ఆదిత్య మూవీస్ సంస్థ ‘ఇస్మార్ట్ శంకర్’ను హిందీలోని అనువాదం చేసి ఈ ఏడాది ఫిబ్రవరిలో యూట్యూబ్‌లో విడుదల చేసింది. సుమారు రెండు నెలల్లోనే 100 మిలియన్ వ్యూస్‌ను ఈ సినిమా సొంతం చేసుకుంది. రామ్ నాలుగు అనువాద చిత్రాలు యూట్యూబ్‌లో 100 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించిన విషయాన్ని శ్రీ స్రవంతి మూవీస్ సంస్థ ట్విట్టర్ ద్వారా అభిమానులతో పంచుకుంది. ‘‘వరుసగా తన నాలుగు సినిమాలకు 100 మిలియన్లకు పైగా వ్యూస్, 1.1 మిలియన్లకు పైగా లైక్స్ సొంతం చేసుకున్న ఏకైక సౌత్ ఇండియన్ స్టార్ ఉస్తాద్ రామ్. ఈ నాలుగు సినిమాల్లో రెండు మేం నిర్మించినవే. ఈ జాబితాలో ‘రెడ్’ కూడా చేరుతుందని ఆశిస్తున్నాం. మీరు కురిపిస్తోన్న ప్రేమకు ధన్యవాదాలు’’ అని ట్వీట్‌లో పేర్కొంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3aMuz4O
v

ఆయన స్థానాన్ని ఎవ్వరూ భర్తీ చేయలేరు.. ఇర్ఫాన్ మృతిపై చిరంజీవి

బాలీవుడ్ ప్రముఖ నటుడు ఇర్ఫాన్ ఖాన్ మృతి చెందిన విషయం తెలిసిందే. గత కొంతకాలంగా క్యాన్సర్‌తో బాధపడిన ఆయన బుధవారం మధ్యాహ్నం ముంబైలోని కోకిలాబెన్ హాస్పిటల్‌లో తుదిశ్వాస విడిచారు. ఆయన వయసు 53 సంవత్సరాలు. ఇర్ఫాన్‌కు భార్య సుతాప, ఇద్దరు కుమారులు బబిల్, అయాన్ ఉన్నారు. ఇర్ఫాన్ మృతితో చిత్ర సీమలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కేవలం బాలీవుడ్ ప్రముఖులే కాకుండా అన్ని సినీ పరిశ్రమల ప్రముఖులు ఇర్ఫాన్ మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తున్నారు. తెలుగు సినీ పరిశ్రమ నుంచి ఇప్పటికే మహేష్ బాబు ట్విట్టర్ ద్వారా సంతాపాన్ని వ్యక్తపరిచారు. ఇర్ఫాన్ ఖాన్‌తో కలిసి ‘సైనికుడు’ సినిమాలో మహేష్ నటించారు. అయితే, తాజాగా మెగాస్టార్ చిరంజీవి.. ఆయన తనయుడు రామ్ చరణ్ కూడా ఇర్ఫాన్ మృతికి సంతాపం వ్యక్తం చేశారు. ఈ మేరకు ట్వీట్లు చేశారు. Also Read: ‘‘ఇర్ఫాన్ ఖాన్ మృతిచెందారనే ఘోరమైన వార్త విని చాలా బాధపడ్డాను. అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన గొప్ప నటుడు ఆయన. ఆయన స్థానాన్ని ఎవ్వరూ భర్తీ చేయలేరు. ఆయన మంచి ప్రవర్తన మన హృదయాల్లో చెరగని ముద్ర వేస్తుంది. ప్రియమైన ఇర్ఫాన్, మేం మిమ్మల్ని కోల్పోతున్నాం. మిమ్మల్ని ఎప్పటికీ మరిచిపోలేం’’ అని చిరంజీవి తన ట్వీట్‌లో పేర్కొన్నారు. ఇక రామ్ చరణ్ ట్వీట్ చేస్తూ.. ‘‘సినిమా ప్రపంచం కిరీటాన్ని కోల్పోయింది. అత్యంత అసాధారణ నటుల్లో ఆయనొకరు. సినీ పరిశ్రమ కచ్చితంగా ఒక దిగ్గజాన్ని కోల్పోయింది. మీ ఆత్మకు శాంతి చేకూరాలి ఇర్ఫాన్ ఖాన్ గారు’’ అని రామ్ చరణ్ పేర్కొన్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2KKWVBO
v

లాక్‌డౌన్ ప్రభావం.. ఇర్ఫాన్ ఖాన్ అంత్యక్రియలు పూర్తి

బాలీవుడ్ విలక్షణ నటుడు కన్నుమూశారు. చాలా కాలంగా క్యానర్స్‌తో పోరాడిన ఇర్ఫాన్ ఏప్రిల్ 29న ముంబైలోని కోకిలా బెన్ హాస్పిటల్‌లో తుదిశ్వాస విడిచారు. ఆయన వయసు ప్రస్తుతం 53 సంవత్సరాలు. అయితే, ఇర్ఫాన్ ఖాన్ మృతిచెందిన కాసేపటికే కుటుంబ సభ్యులు అంత్యక్రియలు నిర్వహించారు. బుధవారం మధ్యాహ్నం 3 గంటలకు ముంబైలోని వెర్సోవా ముస్లిం శ్మశాన వాటికలో ఇర్ఫాన్ పార్థివదేహాన్ని ఖననం చేశారు. ఈ మేరకు ఇర్ఫాన్ కుటుంబం ప్రకటనను విడుదల చేసింది. Also Read: ‘‘ఇర్ఫాన్ కన్నుమూసినట్టు ప్రకటించిన కొద్దిసేపటికే మధ్యాహ్నం 3 గంటలకు ముంబైలోని వెర్సోవా కర్బస్తాన్‌లో ఖననం చేశాం. అంత్యక్రియల్లో ఆయన కుటుంబ సభ్యులు, సమీప బంధువులు, స్నేహితులు మాత్రమే పాల్గొన్నారు. అందరూ ఇర్ఫాన్‌కు అంతిమ నివాళులు అర్పించి, ఆయన మృతి పట్ల తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆ దేవుడిని మేం ప్రార్థిస్తున్నాం’’ అని ప్రకటనలో ఇర్ఫాన్ కుటుంబం పేర్కొంది. కాగా, ఇర్ఫాన్ అంత్యక్రియల్లో నటులు విశాల్ భరద్వాజ్, కపిల్ శర్మ, మికా సింగ్ పాల్గొన్నారు. పోలీసు బందోబస్తు మధ్య అంత్యక్రియలు నిర్వహించారు. ఇర్ఫాన్ ఖాన్ 2018లో న్యూరోఎండోక్రైన్ ట్యూమర్ (క్యాన్సర్) బారిన పడ్డారు. దీనికి ఆయన లండన్‌లో చికిత్స తీసుకున్నారు. చికిత్స నిమిత్తం చాలా కాలం అక్కడే ఉన్నారు. క్యాన్సర్ నుంచి కోలుకుని 2019 సెప్టెంబర్‌లో ఇండియాకు తిరిగి వచ్చారు. అప్పటి నుంచి ముంబైలో నిరంతర చికిత్స పొందుతున్నారు. అయితే, లాక్‌డౌన్ కారణంగా ఆయన నిరంతర చికిత్సకు కాస్త ఆటంకం కలిగినట్టు తెలుస్తోంది. మంగళవారం అకస్మాత్తుగా ఆయన తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో కుటుంబ సభ్యులు హాస్పిటల్‌లో చేర్పించారు. చికిత్స పొందుతూ ఇర్ఫాన్ కన్నుమూశారు. ఇర్ఫాన్ తల్లి సయీద బేగం నాలుగు రోజుల క్రితం అంటే ఈనెల 25న మరణించారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2KLtmjo
v

అమ్మ మరణం.. నాలుగురోజుల్లోనే ఇర్ఫాన్ ఖాన్ అమ్మ చెంతకు.. కన్నీళ్లు పెట్టించే విషాద ఘటన

విలక్షణ నటుడు మరణ వార్తతో బాలీవుడ్ పరిశ్రమ శోకసంద్రంలో ఉంది. ఆయనకు టాలీవుడ్ పరిశ్రమతోనూ మంచి అనుబంధం ఉంది. 2006లో గుణశేఖర్ దర్శకత్వంలో వచ్చిన ‘సైనికుడు’ చిత్రంలో ప్రతి నాయకుడిగా నటించారు ఇర్పాన్ ఖాన్. మినిస్టర్ పప్పు యాదవ్‌గా ఆయన చూపించిన విలక్షణ నటన తెలుగు ప్రేక్షకులకు గుర్తుండే ఉంటుంది. గత కొంత కాలంగా న్యూరోఎండోక్రైన్ ట్యూమర్ (క్యాన్సర్) తో పోరాడుతున్న ఇర్ఫాన్ ఖాన్ బుధవారం నాడు ముంబైలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. అయితే సరిగ్గా నాలుగురోజుల క్రితం అంటే శనివారం నాడు ఇర్పాన్ ఖాన్ తల్లి సయిదా బేగం.. రాజస్థాన్లోని జైపుర్లో క‌న్నుమూశారు. అప్పటికి ఆరోగ్యంగానే ఉన్న ఇర్ఫాన్ ఖాన్.. లాక్ డౌన్ నిబంధనల వల్ల ముంబై నుంచి జైపూర్ వెళ్లలేకపోయారు. తన తల్లి కడచూపుకు దూరమయ్యారు. తల్లి సయిదా బేగం అంత్యక్రియలను వీడియో కాల్ ద్వారానే ఇర్ఫాన్ చుశారని అతని సన్నిహితులు తెలియజేస్తున్నారు. అయితే తల్లి చనిపోయిన నాలుగురోజుల్లోనే ఇర్ఫాన్ ఖాన్ కూడా ఈ లోకాన్ని విడవడం ఆ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. తల్లిని వదిలి నాలుగురోజులైనా ఉండలేకపోయావా? ఇర్ఫాన్ అంటూ ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని పలువురు సోషల్ మీడియా వేదికగా ప్రగాడ సానుభూతి తెలియజేస్తున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2ShLl57
v

ఇర్ఫాన్ మృతికి ప్రముఖుల సంతాపం.. తీరని లోటు అన్న రాహుల్ గాంధీ, అమితాబ్

బాలీవుడ్ విలక్షణ నటుడు ఇర్ఫాన్ ఖాన్ బుధవారం (ఏప్రిల్ 29న) కన్నుమూశారు. మంగళవారం ఆయన తీవ్ర అస్వస్థతకు గురికావడంతో కుటుంబ సభ్యులు ముంబైలోని కోకిలా బెన్ హాస్పిటల్‌లో చేర్చారు. అక్కడ ఐసీయూలో చికిత్స పొందుతూ బుధవారం మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు. ప్రస్తుతం ఆయన 53 సంవత్సరాలు. ఇర్ఫాన్ ఖాన్ మృతితో హిందీ సినీ పరిశ్రమ దిగ్భ్రాంతికి గురైంది. ఆయన మృతికి పలువురు సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఆయన కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నారు. బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్, కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్, రాహుల్ గాంధీ, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ ఠాక్రే, క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్, బాలీవుడ్ నటీనటులు ప్రియాంక చోప్రా, టైగర్ ష్రాఫ్, సంగీత దర్శకుడు అమిత్ త్రివేది, భారత మాజీ క్రికెటర్లు అనిల్ కుంబ్లే, మహమ్మద్ కైఫ్ సహా పలువురు ఇర్ఫాన్ మృతిపట్ల ట్విట్టర్ ద్వారా సంతాపం ప్రకటించారు. Also Read: ఇర్ఫాన్ ఖాన్ కన్నుమూశారనే వార్త విని చాలా బాధపడ్డాను. విలక్షణ, ప్రతిభావంతుడైన నటుడు. ప్రపంచ సిసినిమా, టీవీ రంగంలో భారత్‌కు ఆయన ప్రముఖ బ్రాండ్ అంబాసిడర్. ఆయన లేని లోటు తీరనిది. ఆయన కుటుంబం, స్నేహితులు, అభిమానులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. - రాహుల్ గాంధీ ఇర్ఫాన్ ఖాన్ విలక్షణ నటుడు. ఆయన మృతిచెందడం బాధాకరం. ఆయన కుటుంబానికి, సన్నిహితులకు, అభిమానులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. ఓం శాంతి. - కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ విమర్శకుల ప్రశంసలు అందుకున్న సినీ నటుడు ఇర్ఫాన్ ఖాన్ కన్నుమూయడం బాధాకరం. తరతరాలుగా వారసత్వంగా వస్తోన్న ఒక గొప్ప పనిని వదిలిపెట్టి ఆయన వెళ్లిపోయారు. కొన్నేళ్ల క్రితం ఆయన్ని కోల్‌కతాలో కలుసుకోవడాన్ని ఈ సందర్భంగా గుర్తుచేసుకుంటున్నాను. ఆయన కుటుంబానికి, సహచరులకు, అభిమానులకు, శ్రేయోభిలాసులకు నా సానుభూతిని తెలియజేస్తున్నాను. - బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఇర్ఫాన్ ఖాన్ మరణవార్త విని షాక్ అయ్యాను. ప్రస్తుతమున్న గొప్ప నటుల్లో ఆయన ఒకరు. ఆయన సేవలు ఎప్పటికీ గుర్తుండిపోవాలని, ఆయన ఆత్మకు శాంతి చేకూరాని కోరుకుంటున్నా. - ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఇర్ఫాన్ ఖాన్ మృతిచెందారని వార్తలు వస్తున్నాయి. కలిచివేసే అత్యంత బాధాకరమైన వార్త ఇది. అద్భుతమైన ప్రతిభ, దయాగుణం కలిగిన సహచరుడు, సినిమా ప్రపంచంలో ఫలవంతమైన నటుడు.. చాలా త్వరగా మనల్ని వదిలిపెట్టి వెళ్లిపోయారు. ఆయన మృతి తీరని లోటు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నా. - అమితాబ్ బచ్చన్ ఇర్ఫాన్ ఖాన్ మృతిచెందారనే వార్త విని చాలా బాధపడ్డాను. నాకు ఎంతో ఇష్టమైన నటుల్లో ఆయన ఒకరు. ఇంచుమించుగా ఆయన సినిమాలన్నింటినీ చూశాను. ఆఖరి సినిమా ‘అంగ్రేజి మీడియం’ సహా. నటన అనేది ఆయనకు అప్రయత్నంగా వచ్చింది. ఆయనో అద్భుతం. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నా. ఆయన ఆత్మీయులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నా. - సచిన్ టెండూల్కర్


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2YfrVBP
v

గొప్ప నటుడ్ని కోల్పోయాం.. ‘సైనికుడు’ నటుడి మరణంపై మహేష్ బాబు ఎమోషనల్ ట్వీట్

బాలీవుడ్ విలక్షణ నటుడు అకాల మరణంపై సూపర్ స్టార్ స్పందిస్తూ.. ఎమోషనల్ ట్వీట్ చేశారు. గత కొన్నాళ్లుగా న్యూరోఎండోక్రైన్ ట్యూమర్ (క్యాన్సర్) తో పోరాడుతున్న ఇర్ఫాన్ ఖాన్ బుధవారం నాడు తుదిశ్వాస విడిచారు. ఆయన అకాల మరణంపై మహేష్ బాబు స్పందిస్తూ.. ‘ఇంత బ్రిలియంట్ యాక్టర్‌ని ఇంత త్వరగా కోల్పోతాం అని ఊహించలేదని.. ఆయన అకాల మరణ వార్తతో చాలా బాధపడ్డా’ అన్నారు మహేష్ బాబు. అతన్ని మిస్ అయ్యాం ఇర్ఫాన్ ఖాన్ ఆత్మకు శాంతి చేకూరాలని ఆయన కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలియ చేస్తున్నా అన్నారు మహేష్ బాబు. బాలీవుడ్‌లో ‘సలామ్ బాంబే’, ‘కఖ్బూల్’, ‘పాన్ సింగ్ తోమార్’ వంటి చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న ఇర్ఫాన్ ఖాన్.. ‘స్లమ్‌డామ్ మిలియనీర్’, ‘ఇన్ఫెర్నో’, ‘లైఫ్ ఆఫ్ పై’ వంటి హాలీవుడ్ చిత్రాల్లో సైతం నటించారు. తెలుగులో ఆయన నటించిన ఒకే ఒక్క సినిమా మహేష్ బాబుతో కలిసి నటించిన ‘సైనికుడు’. ఈ చిత్రంలో పప్పు యాదవ్‌గా విలన్‌గా నటించి తన విలక్షణ నటనను చూపించారు. ఇర్ఫాన్ ఖాన్‌తో కలిసి నటించిన మహేష్ బాబుకి ఆయనతో మంచి అనుబంధం ఉండటంతో ట్విట్టర్‌లో స్పందించారు మహేష్ బాబు. మహేష్ బాబుతో పాటు సాయి పల్లవి, హన్సిక, కార్తికేయ తదితర టాలీవుడ్ సెలబ్రిటీలు సైతం ఇర్ఫాన్ ఖాన్‌ ఆత్మకు శాంతి చేకూరని కోరుతూ ఆయన కుటుంబానికి ట్విట్టర్ ద్వారా ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2W6Wnvo
v

Allu Arjun: ‘పుష్ప’లో ఐటెం పుష్పం.. అ అంటే అమలాపురం రేంజ్‌లో అల్లాడిస్తోందట!

సుకుమార్ సినిమా అంటే మాస్ మసాలా ఐటం సాంగ్ మస్ట్. ఇక ఈయన క్రియేటివిటీకి దేవి శ్రీ ట్యూన్, బన్నీ డాన్స్ తోడు అయ్యిందంటే మాస్ ఆడియన్స్ థియేటర్స్‌లో చిందులేయాల్సింది. సుకుమార్ చిత్రాల్లో ఒక్క ‘నాన్నకు ప్రేమతో’ మినహా మిగతా అన్ని చిత్రాల్లోనూ ఐటం సాంగ్ కంపల్సరీ. అ అంటే అమలాపురం (ఆర్య).., రింగ రింగా (ఆర్య 2).., అప్పూ.. అప్పూ బ్రేకప్పూ.. (కుమారి 21 F).., డియాలో.. డియాలా ( 100% లవ్).., లండన్ బాబూ.. లండన్ బాబూ (నేనొక్కడినే).., జిల్ జిల్ జిగేలు రాణి (రంగస్థలం)., లాంటి పాటలు సుక్కు సినిమాల్లో ఐటం బాంబ్‌లలా పేలాయి. మిలియన్ల వ్యూస్ కొల్లగొట్టాయి. ఇప్పుడు ఇదే ఐటం బాణాన్ని తన అప్ కమింగ్ మూవీలోనూ ప్రయోగిస్తున్నారు సుకుమార్. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌-సుక్కూ కాంబోలో వస్తున్న ‘పుష్ప’ సినిమాలో అదిరిపోయే మాస్ మసాలా ఐటం సాంగ్‌కి దేవి శ్రీ ట్యూన్స్ కట్టడం మొదలుపెట్టేశారట. అయితే ‘పుష్ప’ పక్కన ఆడిపాడే ఆ ఐటెం పుష్పం కోసం వెతుకులాట మొదలుపెట్టారట సుక్కూ. సుకుమార్ ఐటమ్ సాంగ్ చాలా స్పెషల్‌గా ఉంటాయి. ఐటం‌లోనే మంచి కంటెంట్‌ను మిక్స్ చేసి వదులుతుంటారు సుక్కూ. ఇందులో డాన్స్‌ స్కిల్స్‌తో పాటు పాపులర్ సెలబ్రిటీలనే ప్రయోగిస్తుంటారు. అయితే ‘పుష్ప’ సినిమాలో ఐటం సాంగ్ కోసం బాలీవుడ్ బ్యూటీలను రంగంలోకి దింపుతున్నారట సుకుమార్. ఆ మధ్య బాలీవుడ్ బ్యూటీ, భరత్ అనే నేను మూవీ హీరోయిన్ కియానా స్పెషల్ సాంగ్ చేయబోతుందని వార్తలు రాగా.. ఈ లిస్ట్‌లో మలైకా అరోరా, దిశా పటాని, జాక్విలిన్ వంటి టాప్ ఐటెం భామలు ఉన్నారు. ఈ నలుగురిలో ఒకరు కన్ఫామ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2VKv4b2
v

విలక్షణ నటుడు ఇర్ఫాన్ ఖాన్ కన్నుమూత

ప్రముఖ బాలీవుడు నటుడు ఇర్ఫాన్ కన్నుమూశారు. ముంబైలోని కోకిలా బెన్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు. ఆయన వయసు 53 సంవత్సరాలు. ఆయనకు భార్య సుతాప, ఇద్దరు కుమారులు బబిల్, అయాన్ ఉన్నారు. ఇర్ఫాన్‌ 2018లో న్యూరోఎండోక్రైన్ ట్యూమర్ (క్యాన్సర్) బారిన పడిన సంగతి తెలిసిందే. దీనికి ఆయన లండన్‌లో చికిత్స తీసుకున్నారు. క్యాన్సర్ నుంచి కోలుకుని 2019 సెప్టెంబర్‌లో ఇండియాకు తిరిగి వచ్చారు. అప్పటి నుంచి ముంబైలో చికిత్స పొందుతున్నారు. అయితే, మంగళవారం అకస్మాత్తుగా ఆయన తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో కుటుంబ సభ్యులు హాస్పిటల్‌లో చేర్పించారు. నిన్నటి నుంచి ఇర్ఫాన్‌ను ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. అయితే, బుధవారం ఆయన ఆరోగ్యం మరింత విషమించి మృతిచెందినట్టు ఇర్ఫాన్ కుటుంబ సభ్యులు తెలియజేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని దేవుడిని ప్రార్థిస్తున్నామని అన్నారు. కాగా, ఇర్ఫాన్ మృతిపట్ల బాలీవుడ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. పలువురు సినీ ప్రముఖులు ట్విట్టర్ ద్వారా సంతాపం తెలియజేస్తున్నారు. ఇర్ఫాన్ మృతిని ఖరారు చేస్తూ దర్శకుడు సుజిత్ సర్కార్ మొదటిగా ట్వీట్ చేశారు. ఇర్ఫాన్ కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2zAsUSM
v

Tuesday 28 April 2020

తెలుగు సినిమాలపై తనికెళ్ల భరణి షాకింగ్ కామెంట్స్.. చిరుతో సహా అందరూ చేస్తారు కాని!!

తెలుగు సినిమా స్థాయిపై షాకింగ్ కామెంట్స్ చేశారు ప్రముఖ రచయిత, నటుడు . మిగతా ఇండస్ట్రీలతో తెలుగు సినిమా పోటీపడలేకపోవడానికి ప్రధాన కారణం డబ్బులు పెట్టే నిర్మాతలే అన్నారాయన. ఓ మీడియా ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. చిరంజీవితో సహా అందరికీ కూడా మంచి క్లాసిక్ సినిమా చేయాలని ఉంటుంది.. కాని సమస్య ఎక్కడ వస్తుందంటే.. నిర్మాతల దగ్గరే. కొన్ని కోట్ల రూపాయల డబ్బు పెట్టి సినిమా తీస్తున్నప్పుడు ఆ డబ్బు నాకు వెనక్కి వస్తుందా? రాదా? అనే లెక్కల్లోనే తేడా వస్తుంది. ఇంకా మలయాళ సినిమాలో ఉన్న స్టాండర్డ్స్ తెలుగు సినిమాలో చూస్తారా లేదా అన్న భయం అందుకే ఆ స్థాయిలో సినిమాలు ఉండటం లేదు. మనకి కొలిమి కారం తినడం అలవాటు అయిపోయింది.. కొత్తిమీర పచ్చడి తింటే చప్పగా ఉంటుంది. ఈ మధ్య కాలంలో కొత్త వాళ్లు ఎంత మంచి కాన్సెప్ట్‌‌లు తీస్తున్నారు. ఈ వెబ్ సిరీస్ రావడం వల్ల మనం ఏదైనా తీయొచ్చు అనే స్వేచ్ఛ వచ్చింది.. దీని వల్ల క్రియేటివిటీ పొంగులు తొక్కుందనేది నా అభిప్రాయం. దీనివల్ల మంచి జరగొచ్చు. ఇప్పుడు పారసైట్ సినిమా చూశాం అబ్బా.. ఆహా అనుకున్నాం.. కాని ఈ సినిమా మన విరాట పర్వమే. కాని తెరకెక్కించిన తీరు ఎంత బాగుంది. కథలు మనకు లేక కాదు.. టాలెంట్ లేక కాదు.. కాకపోతే కమర్షియల్ అంశాలు, బడ్జెట్ తదితర అంశాల బేరీజు వేసుకోవడంతో సినిమా కళ తప్పుతుంది’ అంటూ ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు తనికెళ్ల భరణి.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2yP1FDI
v

సినిమాలు ఇవ్వకపోయినా పర్లేదు.. ఆ పని మాత్రం చేయనని వారికి చెప్పా: దిగంగన

ఇండస్ట్రీలో నటనతో దర్శక, నిర్మాతలకు ఆకట్టుకునే వారు కొందరైతే అందచందాలను పెట్టుబడిగా పెట్టి.. ఎంత ఆరబోస్తే అన్ని ఆఫర్స్ అన్నట్టుగా రెచ్చిపోతుంటారు. ఇలాంటి వాళ్లకు ఒకటి రెండు సినిమాలతోనే ఇంటికి పంపేస్తుంటారు తెలుగు ప్రేక్షకులు. నటనలో ఉన్న అందాన్నే చూస్తారు తప్ప.. పైపై మెరుగుల్ని మన ప్రేక్షకులు పెద్దగా పట్టించుకోరు. అయితే కొంతమందికి అందం, అభినయం రెండూ ఉన్నా లక్ కలిసిరాకపోవడంతో ఒకటి రెండు సినిమాలకే తెరమరుగుఅవుతున్నారు. హిప్పీ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అయిన సూర్యవన్షీకి ఆ చిత్రం ఫ్లాప్ కావడంతో ఎంట్రీలోనే నిరాశకు గురైంది. ఆ సినిమాలో మితిమీరి అందాలు ప్రదర్శించి.. లిప్ లాక్‌లతో రెచ్చిపోయిన దిగంగన ఇకపై అలాంటి సీన్లు చేయనంటోంది. హీరోయిన్ క్వాలిటీస్ ఆమెలో పుష్కలంగా ఉండటంతో తన అదృష్టాన్ని మరోసారి పరీక్షించుకుంటానంటోంది. ఆమె మాట్లాడుతూ.. ‘హిప్పీ’ సినిమా సక్సెస్ కాలేకపోయినప్పటికీ నా వరకూ నేను హ్యాపీగానే ఉన్నాను. ఆ చిత్రంలో నా పాత్రకు మంచి రివ్యూస్ వచ్చాయి. ఆడియన్స్ యాక్సెప్ట్ చేశారు. అయితే దర్శకుడు తెరకెక్కించిన విధానం ఒక్కటైతే.. ప్రేక్షకుడు చూసే కోణం మరోలా ఉండటంతో సినిమా క్లిక్ కాలేదు. ఒక్కోసారి ఎంత కష్టపడి పనిచేసినా ఫలితం దగ్గకపోవచ్చు. ఈ విషయంలో చాలా బాధపడ్డా. సినిమా హిట్ కావాలంటే మన పాత్ర ఒక్కటే కాదు మిగిలిన పాత్రలు కూడా బాగుండాలని తెలుసుకున్నా. అయితే హిప్పీ చిత్రం తరువాత నాకు మంచి అవకాశాలే వచ్చాయి. తమిళ్‌లో ఓ సినిమా చేశా. మళ్లీ తెలుగు చేయడానికి గ్యాప్ తీసుకున్నది మంచి పాత్ర కోసమే. హిప్పీలో గ్లామరస్ రోల్ కాబట్టి కథా బలం ఉన్న పాత్రను చేయాలని ‘వలయం’ సినిమాకి ఓకే చేశా. ఇందులో నా క్యారెక్టర్‌కి మంచి స్కోప్ ఉంటుంది. ఇక గోపీచంద్ సిటీమార్‌లో సెకండ్ హీరోయిన్‌గా మంచి పాత్ర వచ్చింది. ఇంతకు ముందు నా పాత్ర వరకే ఆలోచించేదాన్ని ఇప్పుడు సినిమా స్క్రిప్ట్‌‌ని తెలుసుకుంటున్నా. ఎందుకంటే నాకు స్క్రిప్ట్‌పై అవగాహన ఉంది.. నేను కూడా సినిమాలకు స్క్రిప్ట్ రాస్తుంటా.. రెండు స్క్రిప్ట్స్ రెడీగా ఉన్నాయి. కథలు కూడా రాస్తుంటా. ఎక్స్ పోజింగ్ విషయంలో నా పరిధిలు నాకు ఉన్నాయి. ఆ విషయంలో కాంప్రమైజ్ కాను. గ్లామర్‌గా కనిపించడం కోసం మితిమీరి అందాలు ఆరబోసి ఎక్స్ పోజింగ్ చేయడానికి నేను వ్యతిరేకం. కథతో సంబంధం లేకుండా కేవలం ఆరబోతకే పరిమయ్యే పాత్రలు చేయను. నాకు అవి ఇష్టం ఉండదు. నాకు ఆఫర్స్ ఇవ్వకపోయినా పర్లేదు.. కేవలం ఎక్స్ పోజింగ్ చేయడం కోసమే సినిమాలు చేయను అని దర్శక, నిర్మాతలకు ముందే చెప్పేస్తా. ఈ విషయంలో కాంప్రమైజ్ కాను. అందంగా నటించడం అంటే ఇష్టం.. అందాలను ఆరబోయడానికి నేను సిద్ధంగా లేను’ అంటూ తేల్చేసింది హిప్పీ బ్యూటీ .


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3cYc92p
v

నందమూరి Vs మెగా ఫ్యామిలీ వార్ ముగిసినట్టే.. చరణ్ నన్ను అనుసరిస్తున్నాడన్న చిరు

‘పెద్ద ఫ్యామిలీనా.. మాలాగా.. వాళ్లెంత బురద జాతి’ అంటూ సీన్ పండటం కోసం బాలయ్య బాబు డైలాగ్ చెప్పినా.. అది ఫ్యాన్స్ మధ్య వైరాన్ని పెంచింది. ఇప్పుడే కాదు సంక్రాంతి, దసరా, దీపావళి, క్రిస్మస్ లాంటి పెద్ద పండుగలకు ఈ హీరోల సినిమాలు వస్తున్నాయి అంటే ఫ్యాన్స్ మధ్య యుద్ధమే నడిచేది. అప్పట్లో అయితే సోషల్ మీడియా పెద్దగా అందుబాటులో లేకపోవడంతో ప్రత్యక్షంగానే ఫ్యాన్స్ వార్‌కి దిగేవారు. మా హీరో గొప్ప అంటే మా హీరో గొప్ప అని చొక్కాలు చించుకునే పిచ్చి ఫ్యాన్స్‌కి టాలీవుడ్‌లో కరువు లేకపోవడంతో హీరోల మధ్య మంచి అనుబంధమే ఉన్నా.. ఫ్యాన్స్ మాత్రం కొట్టుకుచచ్చేవారు. అయితే ఇప్పుడు పరిస్థితులు మారాయి.. యువ హీరోలు బాధ్యతతో వ్యవహరిస్తున్నారు. ఏం చేస్తే ఈ ఫ్యాన్స్ గోల తగ్గుతుందో మార్గదర్శకాలు వెతుకుతున్నారు. ఒక హీరో సినిమా ఫంక్షన్ మరో హీరో వెళ్లడం.. మల్టీస్టారర్ సినిమాల్లో నటించడం.. ఒక హీరో సినిమాను మరో హీరో ప్రమోట్ చేయడం ద్వారా ఈ ఫ్యాన్స్ మధ్య రగడను దాదాపు నివారించడం శుభపరిణామం. ఇంకా కొంతమంది హీరోల ఫ్యాన్స్ తమ హీరోనే గొప్ప అంటూ డబ్బాలు కొట్టుకుంటూనే ఉన్నారు కాని.. వాళ్లని సెపరేట్ క్యాటగిరీ కింద వదిలేసి హీరోలు మాత్రం తమ పని తాము చేసుకుంటూ పోతూ తామంత ఒక్కటే అనే మెసేజ్ ఇస్తున్నారు. యువ స్టార్ హీరోల మధ్య ఇలాంటి మంచి వాతావరణం ఉండటం శుభపరిణామం అంటున్నారు మెగాస్టార్ చిరంజీవి. చాలా కాలంగా టాలీవుడ్‌లో నందమూరి-మెగా ఫ్యాన్స్ మధ్య వైరం ఉండనే ఉంది. వీటికి చిత్రంతో పూర్తిగా ఫుల్ స్టాప్ పడినట్టే. ఈ రెండు ఫ్యామిలీలకు చెందిన స్టార్ హీరోలో ఒకే సినిమాలో నటిస్తుండటంతో ఈ ఇద్దరు హీరోల మధ్య ఉన్న సఖ్యతను ఫ్యాన్స్ కూడా పాటిస్తున్నారు. ఇంతకు హీరోను దెబ్బతీయాలనే ఉద్దేశంతో అతను నటించిన సినిమాను డీగ్రేట్ చేసేవారు. అయితే ఇప్పుడు అలాంటి పని చేస్తే నష్టం తమకు కూడా అనే సత్యాన్ని గ్రహించడంతో ఇండస్ట్రీలో స్నేహ పూర్వక వాతావరణం ఏర్పడింది. ఈ ఇష్యూపై చిరు మాట్లాడుతూ... హీరోల మధ్య సఖ్యత అనేది ఇండస్ట్రీకి చాలా అవసరం. ఇప్పుడు యువ హీరోలందరిలోనూ ఒకరిపట్ల ఒకరికి సఖ్యత ఉండటం మంచి పరిణామం. దాని వల్ల ఫ్యాన్స్‌లో కూడా స్నేహపూర్వక వాతావరణం ఏర్పడుతుంది. మా తరంలో కూడా మిగతా హీరోలను కలుపుకుని పోవాలని చూసేవాడిని. నా తోటి హీరోలతో స్నేహం చేయడానికి పరితపించేవాడిని ఇప్పుడు చరణ్ కూడా ఈ విషయంలో నన్ను అనుసరిస్తున్నారు. ముఖ్యంగా చరణ్-ఎన్టీఆర్‌ల మధ్య స్నేహం చూస్తే ముచ్చట వేస్తుంది. ఇలాంటి వాతావరణం ఎప్పుడూ ఉండాలని కోరుకుంటున్నా’ అని అన్నారు మెగాస్టార్. గతంలో చరణ్- అక్కినేని అఖిల్‌ ఫ్రెండ్ షిప్‌పై కూడా ఇదే విధమైన కామెంట్ చేశారు చిరు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2WaO2qf
v

‘మగధీర’ నా ఆల్‌టైమ్ ఫేవరేట్.. మహేష్‌కి పెద్ద ఫ్యాన్‌ని: విహారీతో తెలుగులో మాట్లాడిన అశ్విన్

వాళ్లిద్దరూ భారత్ తరఫున ఆడుతోన్న అంతర్జాతీయ క్రికెటర్లు. ఒకరకంగా చెప్పాలంటే ఇంటర్నేషనల్ స్టార్లు. అలాంటి క్రికెటర్లు తెలుగు సినిమాల గురించి చర్చించుకుంటే.. అందులోనూ తెలుగు భాషలోనే చర్చించుకుంటే విశేషమే కదా. తమిళనాడుకు చెందిన స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్.. హైదరాబాద్ క్రికెటర్ హనుమ విహారీతో తెలుగులో మాట్లాడారు. తెలుగు సినిమాల గురించి చర్చించారు. వీరిద్దరూ కలిసి ఓ ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌లో లైవ్ నిర్వహించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్న వీరిద్దరూ లైవ్‌లో కాసేపు వ్యక్తిగత విషయాలపై ముచ్చట్లు పెట్టారు. దీనిలో భాగంగా తెలుగు సినిమాల గురించి వీరిద్దరి మధ్య చర్చ వచ్చింది. అశ్విన్ చాలా చక్కగా తెలుగులో మాట్లాడారు. ‘‘లెట్స్ స్టార్ట్‌ అని తెలుగులో ఎలా అంటారు’’ అని విహారీని అశ్విన్ అడిగారు. దీనికి ‘మొదలుపెడదాం’ అని రిప్లై ఇచ్చారు విహారి. మొదట తెలుగు సినిమాల గురించి మాట్లాడదాం అని అశ్విన్ అన్నారు. ఇక అక్కడి నుంచి ఒకరినొకరు సినిమాల గురించి ప్రశ్నలు వేసుకున్నారు. Also Read: అశ్విన్: తెలుగులో మీ ఫేవరేట్ మూవీ ఏంటి? విహారి: నా ఫేవరేట్ మూవీ అంటే.. ఇటీవల ఒక మంచి కామెడీ సినిమా చూశాను. సినిమా పేరు ‘భీష్మ’. అశ్విన్: హీరో ఎవరు? విహారి: నితిన్. సినిమా చాలా బాగుంది. అశ్విన్: మా ఇంట్లో ప్రతి ఒక్కరూ అమెజాన్‌లో తెలుగు సినిమాలను ఆస్వాదిస్తున్నారు. నేను కూడా అద్భుతమైన తెలుగు సినిమాలు చూశాను. నేను తెలుగు సినిమాలకు పెద్ద ఫ్యాన్. విహారి: మీకు ఏ మూవీ ఇష్టం? అశ్విన్: నా ఆల్‌టైమ్ ఫేవరేట్ మూవీ ‘మగధీర’. రామ్ చరణ్ మూవీ. ఈ మధ్య తెలుగు సినిమాలు చాలానే చూశాను. ‘ఎవరు’ సినిమా చాలా బాగుంది. అలాగే, మహేష్ బాబు పాత సినిమా ఒకటి ఉంది. చాలా ఇష్టం. టైటిల్ గుర్తులేదు. ఆ సినిమాను తమిళ్‌లో ‘గిల్లి’ పేరుతో తీశారు. నేను మహేష్ బాబుకి పెద్ద ఫ్యాన్. విహారి: తమిళ్‌లో విజయ్ హీరో కదా. ఆ సినిమా ‘పోకిరి’. (నిజానికి ‘గిల్లి’ సినిమా ‘ఒక్కడు’ రీమేక్) అశ్విన్: మీరు చెన్నైలో క్రికెట్ ఆడారు కదా. తమిళం తెలుసా మీకు? విహారి: నాకు అర్థమవుతుంది. కానీ, నేను మాట్లాడలేను. అశ్విన్: తెలుగు సినిమాల గురించి మీరు ఏం చెబుతారు? అంటే, తెలుగు సినిమాలకు చాలా క్రేజ్ ఉంది. ఈ క్రేజ్ ప్రేక్షకుల వల్ల వచ్చిందా? హీరోల వల్లా? విహారి: నేను ప్రేక్షకులనే అనుకుంటున్నాను. ఇక్కడి ప్రజలు డైహార్డ్ ఫ్యాన్స్. అలాగే, టాలీవుడ్ చాలా పెద్ద పరిశ్రమ. Also Read: అశ్విన్: మహేష్ బాబు ఎంత పెద్ద హీరో? (నవ్వుతూ) విహారి: ఆయన సూపర్ స్టార్. మీరు మహేష్ బాబు ఫ్యాన్ అని అర్థమవుతోంది. అశ్విన్: అవును.. చాలా పెద్ద ఫ్యాన్‌ని. రీసెంట్‌గా అమెజాన్‌లో ఆయన సినిమా ఒకటి చూశాను. టైటిల్ నేను పలకలేకపోతున్నాను. ‘వైకుంఠపురములో’ చూసిన వెంటనే ఆ సినిమా కూడా చూశాను. విహారి: ఆ సినిమా పేరు ‘సరిలేరు నీకెవ్వరు’. అశ్విన్: అవును.. అదే. నీకెవ్వరు అంటే ఆయన నీకు ఏమవుతారు అనేగా? విహారి: ఆ టైటిల్‌కి అర్థం.. నీ కన్నా ఎవరూ ఎక్కువ కాదు అని. అశ్విన్: విజయ్ దేవరకొండ గురించి చెప్పండి. ఒక నటుడిగా మీరు ఆయనకి ఏం రేటింగ్ ఇస్తారు? విహారి: ఆయన డీసెంట్ యాక్టర్. ఆయన్ని యూత్ ఫేవరెట్‌గా చెప్పొచ్చు. అలాంటి పాత్రలే ఆయన చేస్తున్నారు. అశ్విన్: ‘గీత గోవిందం’ చూశారా? మీకు నచ్చిందా? విహారి: చూశాను.. నాకు నచ్చింది. మంచి సినిమా. ఇలా.. అశ్విన్, విహారి మధ్య సినిమాల గురించి సరదాగా సంభాషణ జరిగింది. అయితే, హనుమ విహారిని తాను విహారి అని పిలవలేనని.. హనుమ అని పిలుస్తానని అన్నారు అశ్విన్. ఇదిలా ఉంటే, విహారి ‘భీష్మ’ సినిమా గురించి మాట్లాడటం పట్ల ఆ చిత్ర దర్శకుడు వెంకీ కుడుముల ఆనందం వ్యక్తం చేశారు. ట్విట్టర్ ద్వారా విహారి, అశ్విన్‌కు థ్యాంక్స్ చెప్పారు. అశ్విన్, హనుమ విహారి చిట్ చాట్ వీడియో


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3aIW5jC
v

Mahesh Babu: జక్కన్న వస్తే వంశీ పైడిపల్లి ఔటేనా?? అంతలేదంటూ దర్శకుడు క్లారిటీ!

‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రం తరువాత రిలాక్స్ మోడ్‌లో ఉన్నారు. ఈ చిత్రం తరువాత సుకుమార్ దర్శకత్వంలో సినిమా ఉండబోతున్నట్టు అఫీషియల్‌గానే ప్రకటించారు. అయితే కారణాలు చెప్పకుండా అగ్రదర్శకుడితో సినిమా కట్ అంటూ క్లారిటీ ఇస్తూ.. సుక్కూ-బన్నీ కాంబో మూవీ ‘పుష్ప’ చిత్రానికి ఆల్ ది బెస్ట్ చెప్పేశారు. ఈ కథే మహేష్ బాబుతో చేయాల్సిఉండగా.. అనుకోని కారణాలతో చివరికి బన్నీతో ఫిక్స్ అయ్యారు సుక్కూ. ఇక సరిలేరు షూటింగ్ దశలో ఉండగానే తన నెక్స్ట్ మూవీ ‘మహర్షి’ దర్శకుడు వంశీ పైడిపల్లితో ఉంటుందని ప్రకటించారు మహేష్ బాబు. ఇక ‘గీతగోవిందం’ దర్శకుడు పరుశురామ్ కథను కూడా క్యూలోనే పెట్టారు మహేష్. ఇక అదీ ఇదీ కాదు సేఫ్‌గా కొరటాల అయితేనే బెటర్ అనుకుని.. ఆయన మెగాస్టార్‌తో చేస్తున్న ‘ఆచార్య’ ఎలాగూ చివరి దశకు వచ్చేయడంతో కొరటాలతో కలసి హ్యాట్రిక్ హిట్ కొట్టే ప్లాన్‌లో ఉన్నారనే వార్తలు వచ్చాయి. అయితే ఇంత మంది దర్శకుల్లో మహేష్ మూవీ ఎవరితో ఉండబోతుందనే సందిగ్థంలో దర్శకుడు రాజమౌళి.. తన నెక్స్ట్ ప్రాజెక్ట్ మహేష్ బాబుతో అంటూ బాంబు పేల్చారు. ప్రస్తుతం రాజమౌళి RRR సినిమా షూటింగ్ దశలోనే జక్కన్న మూవీ కాబట్టి ఎప్పుడు ముగుస్తుందో తెలియని పరిస్థితి. పైగా లాక్ డౌన్ అడ్డంకులు.. వచ్చే సంక్రాంతికి RRR రిలీజ్ చేస్తామని ప్రకటించినప్పటికీ జక్కన్న చెప్పారు కాబట్టి అది అంత నమ్మబుల్ కాదు. ఇక మహేష్‌తో సినిమా ఎప్పుడు ప్రారంభం అవుతుంది? ఎప్పుడు విడుదల అవుతుంది? అంటే అది ఏళ్లనాటి మాటే. ఇకపోతే జక్కన్నతో మహేష్ మూవీ ప్రకటించగానే.. అప్పటి వరకూ లైన్ ‌లో ఉన్న మహర్షి దర్శకుడు సైడ్ అయ్యారనే వార్తలు వచ్చాయి. దాదాపు మహేష్-వంశీ పైడిపల్లి మూవీ ఇక లేనట్టేనని తేల్చేశారు. అయితే మహేష్‌తో తన అప్ కమింగ్ మూవీ ఆగిపోలేదని ఈ సినిమాకు సంబంధించి ప్రీ ప్రొడక్షన్స్ పనులు జరుగుతున్నాయని క్లారిటీ ఇచ్చారు వంశీ పైడిపల్లి. అయితే ఈ సినిమా ఎప్పుడు ఉంటుందనే విషయంపై క్లారిటీ ఇవ్వలేదు కాని.. మహేష్‌తో మూవీ మాత్రం పక్కా అని అంటున్నారు ఈ దర్శకుడు. చూడాలి మరి మహేష్‌తో మెగా ఫోన్ పట్టే ఆ అగ్ర దర్శకుడు ఎవరో.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2yQjsdO
v

లైవ్‌లో శ్రియ యోగా సెగలు.. దారాళంగా ఆరబోస్తూ, భర్త ఎంట్రీతో మరింత చెమటలు

టాలీవుడ్ సీనియర్ బ్యూటీ 37 ఏళ్ల వయసులోనూ వన్నెతరగని అందంతో కవ్విస్తోంది. తన భర్త ఆండ్రూతో కలిసి ఇన్ స్టాగ్రామ్‌లో రచ్చ రచ్చ చేస్తున్న శ్రియ తరచూ హాట్ ఫొటోలను షేర్ చేస్తూ ఉంటుంది. వాటిల్లో తన భర్తను సైతం ఇన్వాల్వ్ చేస్తూ హాట్ టచ్ ఇవ్వడం ఆమె స్పెషాలిటీ. రీసెంట్‌గా ఆమె తన భర్తతో కలిసి లైవ్ నిర్వహిస్తుండగా.. ఓ నెటిజన్ ఆమె ఎద సంపదపై చేసిన కామెంట్ పెద్ద వైరల్ అయ్యింది. దీనికి ఆమె భర్త ఆండ్రు సైతం తెగ సంబర పడుతూ తన భార్య అందాలను మరింత పొగడమని ఓపెన్ స్టేట్ మెంట్ ఇచ్చేశాడు. తన వన్నెతరగని అందానికి అసలు రహస్యం యోగానే అంటూ తన ఆసనాలను లైవ్‌లోనే చూపించేసింది శ్రియ. ఫిట్నెస్, ఆరోగ్యం, వ‌ర్కౌట్స్‌, యోగాకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే శ్రియ.. తన బ్యూటీ సీక్రెట్ ఇదే అంటోంది. ప్రస్తుతం లాక్ డౌన్ నేపథ్యంలో ఇంటి నుంచి బయటకు వెళ్లే పరిస్థితి లేకపోవడంతో తన యోగా ట్రైనర్‌తో ఆన్ లైన్ యోగా చేస్తుంది శ్రియ. ట్రైనర్ ఎలా ఆసనాలు వేయాలి అన్న దానికి క్లాస్ చెప్తుండగా.. శ్రద్ధగా యోగాసనాలు మొదలుపెట్టింది. ఇక ఆమె ఆసనాల సంగతి పక్కన పెట్టి ఎద భాగాన్ని మొత్తం కనిపించేట్టుగా ఆసనాలు వేస్తూ హీట్ పెంచేసింది శ్రియ. మధ్యలో అతని భర్త ఎంట్రీ మరింది రెచ్చిపోతూ కొత్త రకం ఆసననాలు చూపించేశారు ఈ రొమాంటిక్ కపుల్. ప్రస్తుతం శ్రియ యోగాసనాల వీడియో వైరల్ అవుతోంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2KDtKR0
v

రానా చెప్పిన ‘వైజయంతి’ కథ: 21 ఏళ్ల కుర్రాడి కల.. ఎన్టీఆర్ హస్తవాసి

తెలుగు సినిమా పరిశ్రమలోని భారీ నిర్మాణ సంస్థల్లో వైజయంతీ మూవీస్ ఒకటి. నటరత్న నందమూరి తారక రామారావు హీరోగా ‘ఎదురులేని మనిషి’ సినిమాతో మొదలైన ఈ సంస్థ ప్రయాణం 45 ఏళ్లకు పైగా సుధీర్ఘంగా సాగుతూ వస్తోంది. ప్రస్తుతం ఇండస్ట్రీని ఏలుతోన్న సినీ వారసులను పరిచయం చేసిన ఘనత ఈ సంస్థ సొంతం. సినిమాలపై మక్కువతో 21 ఏళ్ల వయసులో అశ్వనీదత్ బెజవాడ నుంచి చెన్నపట్నం బయలుదేరారు. ఎన్టీఆర్‌తో ఎలాగైనా సినిమా చేయాలనే బలమైన కోరిక ఆయన్ని ఇండస్ట్రీ వైపు నడింపించింది. టాలీవుడ్‌ గర్వించదగిన నిర్మాతను చేసింది. Also Read: జేబులో కొంత డబ్బు, గుప్పిట్లో సినీ తెర కలలు, గుండెనిండా ధైర్యంతో బెజవాడలో 21 ఏళ్ల అశ్వనీదత్‌ రైలు ఎక్కుతుండగా ఆయనకు డాక్టర్ దగ్గుబాటి రామానాయుడు కనిపించారట. మళ్లీ ఊరికి తిరిగివస్తే ఆయనలా ఒక గొప్ప నిర్మాతనై రావాలని అశ్వనీదత్ నిర్ణయించుకున్నారట. ఆ ప్రయాణానికి ఒక చారిత్రాత్మిక నాంది ఎలా పడిందో రామానాయుడు మనవడు అయిన రానా దగ్గుబాటితో చెప్పించారు అశ్వనీదత్. వైజయంతీ మూవీస్ వెనకున్న అసలు కథను తెలియజేస్తూ ఆ సంస్థ ఒక వీడియోను మంగళవారం సాయంత్రం విడుదల చేసింది. ఈ వీడియోలో రానా.. వైజయంతీ మూవీస్ ప్రయాణం గురించి చెప్పారు. అసలు ఈ సంస్థకు ఆ పేరు ఎలా పెట్టారో వెల్లడించారు. Also Read: ‘‘గత ఐదు దశాబ్దాలుగా ప్రతీ జనరేషన్‌కు తగ్గట్టు బ్లాక్ బస్టర్లు ఇస్తూ వస్తోన్న సంస్థ వైజయంతీ మూవీస్. కానీ, ఈ సంస్థకు ఆ పేరు ఎలా వచ్చిందో, ఎవరు పెట్టారో తెలుసా? 1974లో చలసాని అశ్వనీదత్ 21 ఏళ్ల వయసులో కె.విశ్వనాథ్ గారి ‘ఓ సీత కథ’తో సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టారు. కానీ, ఆ కుర్రోడి స్వప్నం ఇంకెంతో పెద్దది. నటరత్న నందమూరి తారక రామారావు గారంత పెద్దది. ఎన్టీఆర్ గారితో సినిమా సాధ్యమేనా? పట్టు వదలని విక్రమార్కుడిలా.. మొండితనమో, పట్టుదలో కానీ చివరికి ఎన్టీఆర్ గారి అపాయింట్‌మెంట్ సాధించారు. తనతో ఎందుకు సినిమా తీయాలనుకుంటున్నారో వివరించమని ఎన్టీఆర్ అడిగి.. అతని మాటలకు ముచ్చటేసి ఒప్పుకున్నారు. అంతవరకు అశ్వనీదత్ గారు బ్యానర్ కూడా స్థాపించలేదు. ఎన్టీఆర్ గారు అడిగిన మొదటి ప్రశ్నే అది.. బ్యానర్ ఏమిటి అని. విజయ సంస్థ లాంటిది అయితే బాగుండు అని దత్ గారి మనసులో ఉంది. కానీ, బయట పెట్టలేదు. క్షణం ఆలోచనలో పడి.. ఆ మహనీయుడు ఎన్టీఆర్ మనసులో మరో అద్భుతమైన ఆలోచన గుప్పుమంది. అక్కడే ఉన్న కృష్ణుడి ఫొటోను చూపించి శ్రీకృష్ణుడి మెడలో ప్రతి క్షణం మరిమళాలను వెదజల్లుతూ ఎన్నటీ వాడిపోని ‘వైజయంతి’.. అదే నీ సంస్థ అని చెప్పారు. ఆ క్షణం తన సువర్ణ హస్తాలతో వైజయంతీ మూవీస్ అని తన అందమైన దస్తూరితో రాశారు. కేవలం రాయడమే కాదు.. వైజయంతీ ఎప్పటికీ వాడిపోని, వన్నెతరగని ఘన విజయాలను అందించే సూపర్ పవర్ అని ఆప్యాయంగా వివరించారు కూడా. ఆయన ఆ సంస్థలో చేసిన మొదటి సినిమా ‘ఎదురులేని మనిషి’. ఆ తారక రాముడి దివ్య సంకల్పంతో పెట్టిన ఆ పేరు.. ఏ వేళా విశేషమో, ఆ మహానుభావుడి హస్తవాసో.. ఆ నాటి నుంచి వైజయంతీ మూవీస్ ఈనాటి వరకు ఎదురులేని సంస్థగా నిలిచింది’’ అంటూ వీడియోలో రానా వివరించారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3f185jR
v

ఇర్ఫాన్ ఖాన్‌కు అస్వస్థత.. ఐసీయూలో చికిత్స.. తల్లి మృతిచెందిన బాధలోనేనా?

బాలీవుడ్ నటుడు ఇర్ఫాన్ ఖాన్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. మంగళవారం అకస్మాత్తుగా ఆయన ఆరోగ్యం క్షీణించడంతో కుటుంబ సభ్యులు ముంబైలోని కోకిలా బెన్ హాస్పిటల్‌లో చేర్పించారు. ప్రస్తుతం ఆయనకు ఐసీయూలో చికిత్స అందిస్తున్నట్టు న్యూస్ ఛానెల్ ఆజ్ తక్ వెల్లడించింది. ఇర్ఫాన్ ఖాన్ న్యూరోఎండోక్రైన్ ట్యూమర్ (క్యాన్సర్) బారిన పడిన సంగతి తెలిసిందే. దీనికి ఆయన లండన్‌లో చికిత్స తీసుకున్నారు. క్యాన్సర్ నుంచి కోలుకుని గత ఏడాది సెప్టెంబర్‌లో ముంబై చేరుకున్నారు. అప్పటి నుంచి ముంబైలో చికిత్స పొందుతున్నారు. అయితే, మంగళవారం అకస్మాత్తుగా ఆయన అస్వస్థతకు గురైనట్టు సమాచారం. ఇదిలా ఉంటే, మూడు రోజుల క్రితమే అంటే శనివారం (ఏప్రిల్ 25న) ఇర్ఫాన్ ఖాన్ తల్లి సయీద బేగం (95) కన్నుమూశారు. అయితే, రాజస్థాన్‌లోని జైపూర్‌లో జరిగిన తల్లి అంత్యక్రియలకు ఇర్ఫాన్ వెళ్లలేకపోయారు. ప్రస్తుతం లాక్‌డౌన్ అమల్లో ఉండటంతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తల్లి అంత్యక్రియలను చూడాల్సి వచ్చింది. దీంతో ఇర్ఫాన్ చాలా బాధపడినట్టు సన్నిహితులు వెల్లడించారు. తల్లి మరణంతో ఆయన డిప్రెషన్‌లోకి వెళ్లారట. దీని వల్లే ఆయన ఆరోగ్యం క్షీణించి ఉండొచ్చని అంటున్నారు. అయితే, ఆయన కుటుంబ సభ్యులు నుంచి కానీ.. హాస్పిటల్ వర్గాల నుంచి ఎలాంటి సమాచారం లేదు. అసలు ఇర్ఫాన్ హాస్పిటల్‌లో చేరడం వెనుక అసలు కారణం కూడా స్పష్టంగా తెలియడంలేదు. Also Read: ఇర్ఫాన్ ఖాన్ భార్య, ఆయన ఇద్దరు కుమారులు ప్రస్తుతం హాస్పిటల్‌లోనే ఉన్నారని తెలిసింది. అయితే, ఈ లాక్‌డౌన్ కారణంగా ఇర్ఫాన్ ఖాన్ రెగ్యులర్ ట్రీట్‌మెంట్‌కు ఇబ్బంది కలిగిందని, దీని వల్ల కూడా ఆయన అస్వస్థతకు గురై ఉండొచ్చని ఆయన సన్నిహితులు ‘నవభారత్ టైమ్స్‌’కు తెలిపారు. కాగా, లండన్‌ నుంచి తిరిగి వచ్చిన తరవాత ‘అంగేజి మీడియం’ చిత్రం ద్వారా ఇర్ఫాన్ ఖాన్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కరీనా కపూర్ ఖాన్, రాధికా మదన్, దీపికా దోబ్రియాల్ నటించిన ఈ చిత్రం మార్చి 13న విడుదలైంది. అయితే, లాక్‌డౌన్ కారణంగా ప్రదర్శనలు ఆగిపోవడంతో సినిమాకు నష్టాలు వచ్చాయి. దీంతో నిర్మాతలు డిజిటల్ ప్లాట్‌ఫాంలో విడుదల చేసేశారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/35bikgZ
v

‘పోకిరి’ 1000 డేస్.. సున్నాల్లో లెక్క తప్పులేదు.. చార్మి పోస్ట్‌కి మహేష్ ఫ్యాన్స్ విజిల్స్

పండుగాడు టాలీవుడ్ ఇండస్ట్రీ రికార్డుల్ని పగలగొట్టి నేటికి సరిగ్గా 14 ఏళ్ల. ఎవ్వడు కొడ్తే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోద్దో ఆడే పండుగాడు అంటూ ‘’ సినిమాతో గేమ్ ఛేంజర్ అనిపించారు సూపర్ స్టార్ . మూసధోరణికి ముగింపు పలుకుతూ దర్శకుడు పూరీ జగన్నాథ్ కలం నుంచి జాలువారిన ఆ పండుగాడి పిచ్చకొట్టుడికి బాక్సాఫీస్ బెంబేలెత్తింది. ఇంటర్వెల్‌లో ఆ క్రిష్ణమనోహర్ ఐపీఎస్ ఎంట్రీకి రోమాలు నిక్కబొడుచుకోని ప్రేక్షకుడు ఉండడు అంటే అతిశయోక్తి కాదు. ‘ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే వినను’, ‘ఎప్పుడు వచ్చాం అన్నది కాదన్నయ్యా.. బుల్లెట్ దిగిందా లేదా??’, ‘షెడ్డు బాగుంది.. కొట్టుకోవడానికి ఈ మాత్రం ఉండాలి.. కొంచెం తెరిచిపెట్టుకోమ్మా.. పారిపోవడానికి ఉంటాది’, ‘అన్నయ్యా ఈ తొక్కలో మీటింగ్‌లు ఏంటో నాకు అర్థం కావడంలేదు’,‘అన్నయ్యా బ్లడ్ పోతిందిక్కడా’, ‘సినిమాలు చూడట్లేదేటి’, ‘ఫ్యామిలీ మొత్తం ఉప్మా తిని బతికేస్తున్నారా.. నాన్నా’.. ‘అర్థ రూపాయ్ శాంపూలు వాడితే ఇలాగే ఉంటుంది’.. ‘గిల్లితే గిల్లించుకోవాలి అరవ కూడదు’.. లాంటి పూరీ మార్క్ డైలాగ్‌లకు మహేష్ బాబు మేనరిజం పర్ఫెక్ట్‌గా సూట్ కావడంతో థియేటర్స్‌లో దుమ్ములేచిపోయింది. ‘ఇప్పటికింకా నా వయసు నిండా పదహారే’ అంటూ ఆ ఇంటర్వెల్ ముందు ముమైత్ ఖాన్ ఊపు.. ఒంపుసొంపులకు థియేటర్ నుండి బయటకు రావడమే కష్టంగా మారింది ప్రేక్షకులకు. ఆ ఒక్కపాటే కాదు.. మణిశర్మ అందించిన ఆ బీట్స్‌లో ఒక్క పాట ఒక్కో మైమరపులాగే అనిపిస్తుంది. గలగలపారుతున్న గోదాలలా సాంగ్‌లో ఇలియానా నడుము అందాలు ఇప్పటికీ ఇంటర్నెట్ షేక్ చేస్తుంటాయి. ఇలా ఈ సినిమాకి సంబంధించి చెప్పుకుంటే పోతే చాలానే ఉంది. అయితే ఇండస్ట్రీ రికార్డ్స్‌లో ట్రెండ్ సెట్టర్‌గా నిలిచి ‘పోకిరి’ చిత్రంతో బాక్సాఫీస్‌కి గట్టిగానే బుల్లెట్ దింపేసిన ఈ చిత్రం నేటితో 14 ఏళ్లు పూర్తి చేసుకోవడంతో ‘పోకిరి’ చిత్రం సోషల్ మీడియాలో టాప్ ట్రెండింగ్‌లో ఉంది. ఈ సందర్భంగా పూరీ కనెక్ట్స్ పోరీ చార్మి ‘పోకిరి’ వెయ్యి రోజుల పోస్టర్‌ను ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది. ఈరోజుల్లో ఎంత పెద్ద సినిమా అయినా రెండు వారాలు ఆడటమే గగనంలా మారింది. అలాంటి 1000 పోస్టర్ చూసేసరికి.. బాబోయ్ ఒకటి పక్కన ఒక సినిమాకి అన్ని సున్నాలు చూసి ఎన్ని రోజులైందో అంటూ సంబరాలు చేసుకుంటున్నారు మహేష్ బాబు ఫ్యాన్స్.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2W5DEQD
v

చిరంజీవి బయటపెట్టిన వీడియోపై నాని రియాక్షన్.. అయ్యో! ఇలా అనేశాడేంటి?

ఇటీవలే సోషల్ మీడియాలో కాలుమోపిన కొద్దిరోజుల్లోనే తన స్టామినా ఏంటో నిరూపించారు. నేటితరం యువతను అట్రాక్ట్ చేసేలా పోస్టులు పెడుతూ అమాంతం ఫాలోయింగ్ పెంచేసుకుంటున్నారు. తన ట్విట్టర్ ఖాతా ద్వారా ఎప్పటికప్పుడు ప్రతీ విషయాన్నిషేర్ చేస్తూ సోషల్ మీడియా కింగ్ అనిపించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో నిన్న (ఏప్రిల్ 27) ఓ ట్వీట్ చేసి జనాల్లో క్యూరియాసిటీ పెంచేశారు చిరంజీవి. ఆ ట్వీట్‌లో పేర్కొన్నట్లు గానే ఈ రోజు (ఏప్రిల్ 28) ఉదయం 9 గంటలకు ఆ ట్వీట్ కొనసాగింపుగా తన సీక్రెట్ వీడియో బయటపెట్టారు చిరు. ఆ వీడియోలో తన మనవరాలు నవిష్క (కళ్యాణ్ దేవ్- శ్రీజ‌ల కూతురు)తో కలిసి చిన్న పిల్లాడిలా ఆడుకుంటూ కనిపించారు. ఖైదీ నెంబర్ 150 సినిమాలోని మిమ్మీ మిమ్మిమీ పాటకు స్టెప్పులేస్తూ మనవరాలిని ఆడించారు. సంవత్సరం వయసున్న చిన్నారిని కూడా సంగీతం ఎంతలా ఆకట్టుకుంటుందో చూడండి అని ఈ వీడియో ద్వారా చెప్పారు చిరంజీవి. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. అయితే ఈ వీడియో చూసిన హీరో దాన్ని తన ట్విట్టర్ ఖాతా ద్వారా షేర్ చేస్తూ ఆసక్తికర కామెంట్ జోడించారు. ''ఈ వీడియోలో నాకైతే ఇద్దరు చిన్న పిల్లలు కనిపిస్తున్నారు. మరి మీరు ఆ ఇద్దరిలో ఎవరి గురించి మాట్లాడుతున్నారు సార్'' అంటూ మెగాస్టార్‌నే ప్రశ్నించారు నాని. అంటే పరోక్షంగా చిరంజీవిని కూడా చిన్నపిల్లాడిని చేసేశారు మన నాచురల్ స్టార్. అంతేకాదు ట్విట్టర్ లోకి వెల్‌కమ్ చిరంజీవి సార్ అని ఈ సందర్బంగా పేర్కొన్నారు. దీంతో ఈ ట్వీట్ చూసిన నెటిజన్స్.. 'యూ ఆర్ టూ లేట్ నాని' అంటూ కామెంట్ చేస్తున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2SftdJr
v

ఓటీటీ భారీ ఆఫ‌ర్స్‌ను తిర‌స్కరించిన ‘83’.. థియేట‌ర్‌లో చూస్తేనే కిక్ అట

ఇండియన్ క్రికెట్‌ గ‌తిని మార్చిన సంవత్సరం 1983. క్రికెట్ ప్రపంచంలో రారాజుగా భారత్ అవ‌త‌రించిన ఏడాది అది. క‌పిల్ డేర్ డెవిల్స్ సాధించిన అపూర్వ విజ‌యంతో ఇండియాలో చాలా మందికి క్రికెట్ ఫేవ‌రేట్ గేమ్‌గా మారింది. ఈ అద్భుత‌మైన ప్రయాణాన్ని ‘83’ పేరుతో వెండితెర‌పై ఆవిష్కరించారు డైరెక్టర్ క‌బీర్‌ఖాన్‌. భారత్‌కు తొలి ప్రపంచ కప్ అందించిన టీమిండియా కెప్టెన్ కపిల్ దేవ్ పాత్రలో బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్ నటించారు. ప్రస్తుతం దేశంలో క‌రోనా ప్రభావంతో సినీ ప‌రిశ్రమ స్తంభించింది. ఈ కార‌ణంగా విడుద‌ల కావాల్సిన ‘83’ సినిమా వాయిదా ప‌డింది. ఈ క్రమంలో సినిమా డిజిట‌ల్ ఫ్లాట్‌ఫామ్‌లో విడుద‌ల‌కానుంద‌ని వార్తలు వినిపించాయి. నిజానికి ‘83’ చిత్రాన్ని డిజిటల్ ఫ్లాట్‌ఫామ్‌లో విడుద‌ల చేయ‌డానికి ప‌లు ఓటీటీ సంస్థలు భారీ ఆఫ‌ర్స్‌తో మేక‌ర్స్‌ను సంప్రదించాయట. అయితే నిర్మాత‌లు స‌ద‌రు భారీ ఆఫ‌ర్స్‌‌ను సున్నితంగా తిర‌స్కరించారు. ‘83’ చిత్రాన్ని థియేట‌ర్స్‌లోనే విడుద‌ల చేస్తున్నట్లు తెలిపారు. Also Read: ‘83’ విడుదల గురించి చిత్ర ద‌ర్శకుడు క‌బీర్‌ ఖాన్ మాట్లాడుతూ.. ‘‘83 వంటి అద్భుత‌మైన ప్రయాణాన్ని ఎన్నో క‌ష్టన‌ష్టాల‌కు ఓర్చి రూపొందించాం. ఈ దృశ్యకావ్యాన్ని థియేట‌ర్స్‌లో వీక్షిస్తే క‌లిగే అనుభూతే వేరుగా ఉంటుంది. ప్రస్తుతం దేశంలో నెల‌కొన్న ఇబ్బందిక‌ర ప‌రిస్థితులు తొల‌గి సాధార‌ణ ప‌రిస్థితులు నెల‌కొన్న త‌ర్వాతే సినిమాను విడుద‌ల చేయాల‌నుకుంటున్నాం’’ అని వెల్లడించారు. రిల‌య‌న్స్ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌, ఫాంటమ్ ఫిలిమ్స్ బ్యాన‌ర్స్ స‌మ‌ర్పణ‌లో క‌బీర్‌ ఖాన్ ఫిలిమ్స్ ప్రొడ‌క్షన్ ప‌తాకంపై దీపికా ప‌దుకొనె, క‌బీర్‌ ఖాన్‌, విష్ణు ఇందూరి, సాజిద్ న‌డియ‌డ్ వాలా, ఫాంట‌మ్ ఫిలిమ్స్‌, రిల‌య‌న్స్ ఎంట‌ర్‌టైన్‌మెంట్, 83 ఫిలిమ్ లిమిటెడ్ ఈ చిత్రాన్ని నిర్మించాయి. ఈ సినిమాను హిందీతో పాటు తెలుగు, తమిళ భాషల్లోనూ విడుదల చేస్తున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2VKTqS6
v

43 ఏళ్ల క్రితం చరిత్ర సృష్టించిన రోజు ఇది.. ‘బాహుబలి’కి ముడిపెట్టిన దర్శకేంద్రుడు

తన కెరీర్‌లో 100కు పైగా సినిమాలు చేసి దర్శకేంద్రుడిగా టాలీవుడ్ చరిత్రలో తనకంటూ ఒక అధ్యాయాన్ని రాసుకున్న దిగ్గజ దర్శకుడు కె.రాఘవేంద్రరావు. నటరత్న నందమూరి తారక రామారావుతో ఈయన 10కి పైగా సినిమాలు చేశారు. వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన తొలి చిత్రం ‘అడవి రాముడు’. అప్పట్లో ఈ సినిమా ఒక సెన్సేషన్. సరిగ్గా 43 ఏళ్ల క్రితం ఇదే రోజున అంటే 1977 ఏప్రిల్ 28న ‘అడవి రాముడు’ విడుదలైంది. ఈ సందర్భాన్ని గుర్తిచేసుకుంటూ దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు ఆసక్తికర ట్వీట్ చేశారు. అలాగే, తాను సమర్పించిన ‘బాహుబలి 2’ కూడా ఏప్రిల్ 28నే విడుదలకావడం ఆనందాన్ని కలిగిస్తోందని అన్నారు. Also Read: ‘‘ఏప్రిల్ 28 నా సినీ జీవితంలో ఓ మరుపురాని రోజు. విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు నందమూరి తారక రామారావు గారితో నా సినిమా ప్రస్థానం, మరో మెట్టు ఎక్కిన రోజు. సినీ ప్రపంచంలో ఉన్న రికార్డులను తిరగరాసి కొత్త రికార్డులకు శ్రీకారం చుట్టిన రోజు. ఒక్క మాటలో చెప్పాలంటే అది చరిత్ర సృష్టించిన రోజు, 43 ఏళ్ల క్రితం అడవి రాముడు విడుదలైన రోజు. ఆ నందమూరి అడవి రాముడిని మరోసారి గుర్తు చేసుకుంటూ.. ఆ సినిమా నిర్మాతలకు, నటీనటులకు, సాంకేతిక నిపుణులకు, డిస్ట్రిబ్యూటర్లకు, ఎగ్జిబిటర్లకు ఆ చిత్ర దర్శకుడిగా చట్టం ఆఫ్‌ ద షిప్‌‌గా.. నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ‘‘అడవి రాముడు’’ రికార్డుల రాముడిగా ఎలా మారిందో కొన్ని ఉదాహరణలు.. 4 సెంటర్లలో ఒక సంవత్సరం పాటు, 8 సెంటర్లలో 200 రోజులు, 35 సెంటర్లలో 100 రోజులు ప్రదర్శింపబడటమే కాకుండా నెల్లూరు కనక మహల్‌ థియేటర్‌‌లో ప్రతిరోజూ 5 షోష్‌‌తో 100 రోజులు ఆడటం మరో విశేషం. బంగారానికి తావి అద్దినట్టు ఏప్రిల్‌ 28 నాడే నా సమర్పణలో వచ్చిన బాహుబలి చిత్రం విడుదల కావడం నాకు మరింత ఆనందాన్ని కలిగిస్తోంది. అడవి రాముడు ఆహా అనిపిస్తే, బాహుబలి ప్రపంచవ్యాప్తంగా సాహో అనిపించిన సంగతి మీ అందరికీ తెలిసిందే. ఈ సందర్భంగా రాజమౌళి, కీరవాణి, శోభు యార్లగడ్డ, ప్రసాద్‌ దేవినేని తదితర నా కుటుంబ సభ్యులందరికీ నా ప్రత్యేక శుభాకాంక్షలు. రెండు పండుగలని ఒకేరోజు అందించిన ఏప్రిల్‌ 28, కరోనా మహమ్మారిని తుద ముట్టించడానికి వేదికగా మారాలని ఆశిస్తూ... అదే నిజమైన వేడుక అని భావిస్తూ.. ఈ మహాయజ్ఞంలో పాలు పంచుకుంటున్న వైద్య సిబ్బందికి, పోలీస్‌ విభాగానికి, పారిశుద్ధ్య కార్మికులకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఆ శ్రీనివాసుడి కరుణా కటాక్షాలతో భారతదేశం భవ్య దేశంగా విరాజిల్లాలని కోరుకుంటూ.. మీ కె.రాఘవేంద్రరావు’’ అని ట్వీట్‌లో పేర్కొన్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3eWX82A
v

స్టార్ హీరో గొప్పమనసు.. మొత్తంగా 30 కోట్లు.. ఇదీ పోలీసుల రియాక్షన్

కరోనా కల్లోలం సృష్టిస్తున్న ఈ సమయంలో మేమున్నాం అంటూ ముందుకొచ్చి సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు సినీ తారలు. ఈ మహమ్మారిని కట్టడిలో చేయడంలో భాగమవుతూ ప్రభుత్వానికి ఆర్ధిక సహకారం అందిస్తున్నారు. సీఎం, పీఎం సహాయనిధులకు తమకు తోచినంత సొమ్ము డొనేట్ చేస్తూ ఆపత్కాలంలో అండగా నిలుస్తున్నారు. ఇప్పటికే ఎందరో స్టార్స్ తమ వంతు సహకారం అందించగా, బాలీవుడ్ హీరో మాత్రం కోట్ల రూపాయలు సాయమందిస్తూ అందరి కృతజ్ఞతలు అందుకుంటున్నారు. కరోనా నివారణ చర్యలు చేపడుతున్న ప్రభుత్వానికి అండగా నిలుస్తూ ఇదివరకే 25 కోట్ల భారీ విరాళాన్ని పీఎం సహాయనిధికి అందించిన అక్షయ్.. అంతటితో ఆగక మరిన్ని సేవా కార్యక్రమాలు చేస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో మున్సిపల్ కార్మికుల శ్రమను, కరోనాపై చేసే పోరాటంలో వారి ఆవశ్యకతను గుర్తించిన ఆయన ముంబై మున్సిపల్ కార్పోరేషన్‌కు మరో 3 కోట్ల రూపాయల విరాళం అందించారు. తాజాగా పోలీసు కుటుంబాల సంక్షేమం కోసం కూడా నడుం బిగించారు అక్షయ్. ఈ మేరకు ముంబై పోలీస్ ఫౌండేషన్‌కు 2 కోట్ల రుపాయల విరాళం అందించారు. లాక్ డౌన్ పీరియడ్‌లో పోలీసులు చేస్తున్న సేవలు, విధి నిర్వహణలో భాగంగా కొందరు పోలీసులు కరోనా బారిన పడటం గుర్తించి వారి సంక్షేమం కోసం ప్రత్యేకంగా ఈ 2 కోట్లు కేటాయించారు అక్షయ్. ఈ విషయమై రియాక్ట్ అయిన ముంబై పోలీస్ శాఖ.. అక్షయ్‌కి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసింది. టోటల్‌గా చూస్తే ఇప్పటిదాకా కరోనా కల్లోలంలో చిక్కుకుపోతున్న వారి సహాయార్థం అక్షయ్ కేటాయించిన మొత్తం 30 కోట్లు అయింది. ఒక హీరో ఇంత మొత్తం విరాళం అందించడం గ్రేట్ అంటూ అక్షయ్‌పై పలువురు ప్రముఖులు ప్రశంసలు గుప్పిస్తున్నారు. మరోవైపు ప్రపంచవ్యాప్తంగా 30 లక్షల కరోనా కేసులు నమోదుకాగా, ఇండియాలో 30 వేల మంది కరోనా బారిన పడ్డారు. వీరందరికీ వైద్యం అందిస్తూ ప్రభుత్వ వర్గాలు కఠోరంగా శ్రమిస్తున్నాయి. Also Read:


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2Se2w7S
v

ఆ అమ్మాయిని చాలా ఇష్టపడ్డా.. కానీ చివరికి: కార్తికేయ రియల్ లవ్‌స్టోరీలు

‘RX 100’ సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న హీరో కార్తికేయ. చాలా మంది ఇదే ఆయన తొలి సినిమా అనుకుంటారు. కానీ, ‘ప్రేమతో మీ కార్తీక్’ ఆయన ఫస్ట్ సినిమా. అయితే, ఈ సినిమా ఎప్పుడొచ్చిందో కూడా ఎవ్వరికీ తెలీదు. ‘RX 100’ సినిమాతోనే ఆయన హీరోగా ఇమేజ్‌ను ఏర్పరుచుకున్నారు. తన సొంత బ్యానర్‌లోనే, తన తండ్రి నిర్మించిన సినిమాతోనే కార్తికేయ తానేంటో నిరూపించుకున్నారు. ప్రేమలో విఫలమైన యువకుడిగా మంచి నటనను కనబరిచారు. అయితే, రియల్ లైఫ్‌లో కూడా తనకు లవ్ ఫెయిల్యూర్ ఉందని చెప్పారు కార్తీక్. ఆ మధ్య కార్తికేయ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కాలేజ్ లవ్‌స్టోరీ గురించి చెప్పారు. కార్తికేయ హైదరాబాద్‌లోనే పుట్టి పెరిగారు. ఆయ స్కూల్ ఎడ్యుకేషన్, ఇంటర్ ఇక్కడే పూర్తయింది. ఆ తరవాత నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్) వరంగల్‌లో బీటెక్ చేశారు. అయితే, హైదరాబాద్‌లో ఇంటర్ చదువుతున్న సమయంలో తన కాలేజీలో చదివే ఒక పంజాబీ అమ్మాయిని కార్తికేయ ఇష్టపడ్డారట. కాలేజీలో ఆ అమ్మాయిని బాగా ఫాలో అయ్యేవారట. ఆ అమ్మాయి బాగా చదివేదని.. తాను మాత్రం యావరేజ్ స్టూడెంట్‌నని చెప్పారు. అయితే, ఆ అమ్మాయికి తన ప్రేమ గురించి చెప్పలేదని, అప్పట్లో ప్రపోజ్ చేసేంత సీన్ కూడా ఉండేది కాదని వెల్లడించారు. తానొక అజ్ఞాత ప్రేమికుడిలా ఉండిపోయానన్నారు. Also Read: కాలేజ్ అయిపోయి ఆ అమ్మాయి వెళ్లిపోయిందని.. తన ప్రేమ అలా ముగిసిపోయిందని అన్నారు. ఆ అమ్మాయి ఫోన్ నంబర్ తీసుకున్నానని, కానీ కాల్ చేయడానికి ధైర్యం సరిపోలేదన్నారు. ఇప్పుడైతే ఆ నంబర్ తన వద్ద లేదని.. అప్పట్లో అమ్మ ఫోన్ వాడేవాడినని, దానిలో ఆ నంబర్ సేవ్ చేసుకున్నానని చెప్పారు. అలాగే, వరంగల్ నిట్‌లో బీటెక్ చేసేటప్పుడు కూడా ఒక అమ్మాయిని ప్రేమించానని కార్తికేయ చెప్పుకొచ్చారు. ఆ అమ్మాయి కూడా తనను ప్రేమించిందని, కానీ బీటెక్ పూర్తయ్యేసరికి తాము విడిపోయామని అన్నారు. ప్రస్తుతం ఆమెకు పెళ్లి కూడా అయిపోయిందని చెప్పారు. ప్రస్తుతానికి అయితే అమ్మాయిలను లవ్ చేసేంత ఖాళీ తనకు లేదని కుండ బద్దలుకొట్టారు. కాగా, ‘RX 100’ సినిమాతో వచ్చిన క్రేజ్‌తో కార్తికేయకు వరుసపెట్టి అవకాశాలు వచ్చాయి. అయితే, ఆ తరవాత వచ్చిన ఏ సినిమా ‘RX 100’ అంత విజయం సాధించలేకపోయింది. కిందటేడాది కార్తికేయ హీరోగా ‘హిప్పి’, ‘గుణ 369’, ‘90 ఎంఎల్’ సినిమాలు వచ్చాయి. వీటిలో ఏ సినిమా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. అయితే, నాని హీరోగా వచ్చిన ‘గ్యాంగ్ లీడర్’లో కార్తికేయ విలన్‌గా చేశారు. ఈ పాత్రకు ఆయనకు మంచి గుర్తింపు వచ్చింది. కార్తికేయ ఏ పాత్ర అయినా చేయగలడు అనే నమ్మకాన్ని కలిగించింది. ప్రస్తుతం కార్తికేయ హీరోగా ‘చావుకబురు చల్లగా’ అనే సినిమా రూపొందుతోంది. అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 బ్యానర్‌పై బన్నీ వాస్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. కౌశిక్ పెగళ్లపాటి దర్శకుడిగా పరిచయమవుతున్నారు. లావ‌ణ్య త్రిపాఠి హీరోయిన్.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2YawM7c
v

చిరంజీవి అలా మోహన్ బాబు ఇలా.. తాతల సరదా భలే ఉందే! వీడియో వైరల్

కరోనా వైరస్ నివారణలో భాగంగా షూటింగ్స్ అన్నీ నిలిపివేసి ఇంటికే పరిమితమైన సినీ తారలు సరికొత్తగా ప్రేక్షకులను అలరిస్తున్నారు. యంగ్ హీరోహీరోయిన్లు ఎప్పటికప్పుడు తమ హోమ్ క్వారంటైన్ విశేషాలు చెబుతూ అందరినీ పలకరిస్తుంటే.. సీనియర్ హీరోలైన చిరంజీవి, తమ తమ మానవరాళ్లతో కలిసి వీడియోలు చేస్తూ లాక్‌డౌన్ స్పెషల్ ఎంటర్‌టైన్‌మెంట్ ఇస్తున్నారు. దీంతో ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరోవైపు సోషల్ మీడియా ఛాలెంజ్‌ల హవా నడుస్తోంది. ఇప్పటికే 'బీ ది రియల్ మెన్' అంటూ స్టార్ హీరోలు, దర్శకులు తమ తమ వీడియోలతో హంగామా చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే తన మనవారిని పక్కనే కుర్చోబెట్టుకొని వంట గదిలో రుచికరమైన వంటలు చేస్తూ మరో ఛాలెంజ్ పరిచయం చేశారు డైలాగ్ కింగ్ మోహన్ బాబు. టి. సుబ్బిరామిరెడ్డి కూతురు పింకీ తనకు ‘వంట సవాల్’ విసిరిందని చెబుతూ తాను స్వయంగా శనిగపప్పు మసాలా వడలు చేస్తున్న తాలూకు వీడియో షేర్ చేశారు. తాను చేసిన ఆ వడలను మనవరాలు విద్య నిర్వాణకు చూపించి నేను టేస్ట్ చేయాలా? నువ్వు టేస్ట్ చేస్తావా? అని అడిగిన మోహన్ బాబు.. చివరకు ఆయనే నోట్లో వేసుకొని ఆహా ఏమి రుచి అన్నారు. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇదిలాఉంటే మరోవైపు తన మనవరాలు నవిష్కతో కలిసి ఖైదీ నెంబర్ 150 సినిమాలోని 'మిమ్మీ మిమ్మిమ్మీ' వీడియో సాంగ్ ప్లే చేస్తూ ఎంజాయ్ చేస్తున్న వీడియో కూడా సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. దీంతో ఈ రెండు వీడియోలు చూసి తాతల సరదా భలే ఉందే! అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. Also Read:


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2y5IR34
v

అమెజాన్‌తో తేజ భారీ డీల్! సిచ్యుయేషన్ క్యాచ్ చేసుకుంటూ పక్కా ప్లాన్

రోజురోజుకూ టెక్నాలజీ విస్తృతం అవుతుండటంతో క్రమంగా ఆన్‌లైన్ ప్లాట్‌ఫార్మ్స్‌కి డిమాండ్ పెరుగుతూ వస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఆన్‌లైన్ ప్లాట్‌ఫార్మ్స్ (OTT)‌ వృద్ధి చెందుతూ అందరికీ చేరువవుతున్నాయి. కరోనా కట్టడిలో భాగంగా విధించిన ఈ లాక్‌డౌన్ ఆన్‌లైన్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫార్మ్స్‌కి మరింత బూస్టింగ్ ఇచ్చి అమెజాన్, ఆహా లాంటి ఓటీటీ వేదికలకు కస్టమర్లను పెంచేసింది. లాక్‌డౌన్ కారణంగా ఇంట్లోనే ఉంటున్న జనం ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌లో సినిమాలు చూడటం అలవాటుగా మార్చుకున్నారు. దీంతో ఫ్యూచర్‌లో కూడా వీటికే డిమాండ్ పెరిగే అవకాశాలున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే తెలుగు ద‌ర్శ‌క నిర్మాత‌లు ఓటీటీ వైపు అడుగులేస్తున్నారు. సరిగ్గా ఇదే అంశాన్ని గ్రహించిన డైరెక్టర్ తేజ.. ఇప్పటి సిచ్యుయేషన్ క్యాచ్ చేసుకునేలా ఆన్‌లైన్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫార్మ్ అమెజాన్ ప్రైమ్‌తో భారీ డీల్ కుదుర్చుకున్నారని తెలుస్తోంది. అమెజాన్ ప్రైమ్‌లో మూడు వెబ్ సిరీస్‌లు, రెండు సినిమాలు నిర్మించేలా డీల్ కుదుర్చుకున్నాడ‌ని ఇన్‌సైడ్ టాక్. నేటితరం ప్రేక్షకులకు మరింత చేరువవుతూ ఇకపై డిజిటల్ రంగంలో రాణించాలని ఆయన ఫిక్స్ అయ్యారని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇటీవలే 'సీత' సినిమాతో డిసాస్టర్ ఖాతాలో వేసుకున్న తేజ.. ఇకపై పకడ్బందీ అడుగులేయబోతున్నారని తెలిసింది. ఈ మేరకు ఆయన ఇప్పటికే రాక్షస రాజు రావణాసురుడు సినిమాను దగ్గుబాటి రానాతో, అలాగే అలిమేలు మంగ వెంకట రమణ సినిమాను గోపీచంద్‌తో చేయనున్నట్లు ప్రకటించారు. దీంతో తేజ- అమెజాన్ ప్రైమ్ మధ్య డీల్ జరిగిందన్న వార్త ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ రెండు సినిమాలనే డైరెక్ట్‌గా అమెజాన్‌లో రిలీజ్ చేయనున్నారా? లేక డిజిటల్ వేదిక కోసం ఆయన వేరే కథలు సిద్ధం చేస్తున్నారా? అనేది తెలియాల్సి ఉంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2ztKbNp
v

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...