Friday 31 January 2020

అలాంటి అమ్మాయిని ఎవరు పెళ్లి చేసుకుంటారు: బిగ్‌బాస్ మాజీ కంటెస్టెంట్ రచ్చ

నీళ్లల్లో దిగి ఇంటర్వ్యూలు చేసే అమ్మాయిని ఎవరు పెళ్లి చేసుకుంటారు అంటూ మీడియా ముందు వచ్చి రచ్చ చేశారు తమిళ నటుడు. బిగ్‌బాస్ మాజీ కంటెస్టెంట్ దర్శన్. తమిళ నటి , దర్శన్ చాలాకాలం పాటు డేటింగ్‌లో ఉన్నారు. ఇద్దరికీ నిశ్చితార్థం కూడా జరిగింది. కానీ దర్శన్ తనను మోసం చేశాడంటూ సనమ్ నిన్న పోలీసులను ఆశ్రయించారు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఇప్పుడు కాదంటున్నాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. దాంతో తన గురించి వస్తున్న ఆరోపణల్లో నిజం లేదంటూ ఇప్పుడు దర్శన్ మీడియా ముందుకు వచ్చారు. ‘‘నాకు సనమ్‌తో నిశ్చితార్థం అయిన విషయం నిజమే. కానీ మా ఇంట్లో వారికి ఈ విషయం గురించి తెలీదు. ఎక్కడ తెలిస్తే నా చెల్లికి ఎక్కడ పెళ్లి జరగదోనని చెప్పలేదు. ఓసారి సనమ్ అండర్‌వాటర్ ఇంటర్వ్యూ ఇచ్చింది. అది నాకు నచ్చలేదు. అలా ఎందుకు చేశావని అడిగితే నా కోసమే అని చెప్పింది. నేను బిగ్‌బాస్ షో నుంచి బయటికి రాగానే నాపై అధికారం చెలాయించడం మొదలుపెట్టింది. నా తోటి కంటెస్టెంట్స్‌తో మాట్లాడకూడదని షరతులు పెట్టింది. నేను వెళ్లే ప్రతీ ఈవెంట్‌కు తనను కూడా తీసుకెళ్లాలని పట్టుబట్టింది. నేను సంతకం చేసిన సినిమాలకు సంబంధించిన నిర్మాణ సంస్థలకు వెళ్లి నేను మంచివాడిని కానని చెప్పి లేనిపోని అబద్ధాలు చెప్పింది" READ ALSO: " నా చెల్లి పెళ్లి అయ్యాక నేను సనమ్‌ను పెళ్లి చేసుకోవచ్చని నా తల్లిదండ్రులు చెప్పారు. మాట్లాడితే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించేది. ఈ సమస్యలన్నీ నా కెరీర్‌పై ప్రభావం చూపుతున్నాయి. అందుకే తనతో బంధం తెంచుకోవాలని అనుకున్నాను. ఇంత జరిగాక నేను ఆమెను అస్సలు పెళ్లి చేసుకోలేను. నా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి. రేపు కమిషనర్ ఆఫీస్‌కి వెళ్లి ఈ ఆధారాలు చూపిస్తాను’ అని తెలిపాడు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2tml6Bw
v

PSPK28: కన్ఫర్మ్.. మరోసారి ‘గబ్బర్ సింగ్’ కాంబో

పవర్ స్టార్ ఫ్యాన్స్‌కి బ్రేకింగ్ న్యూస్. పవన్ కళ్యాణ్ 28వ సినిమాకు సంబంధించిన అప్‌డేట్ వచ్చేసింది. మరోసారి పవన్.. హరీష్ శంకర్‌తో కలిసి పనిచేయబోతున్నారు. ఈ విషయాన్ని మైత్రి మూవీ మేకర్స్ సంస్థ ట్విటర్ ద్వారా ప్రకటించింది. గతంలో పవన్, హరీష్ కాంబినేషన్‌లో ‘గబ్బర్ సింగ్’ సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద బ్లా్క్ బస్టర్ విజయం సాధించింది. త్వరలో ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు ప్రకటించనున్నారు. READ ALSO: పవన్ సినిమాల గురించి అప్డేట్ రాగానే ఫ్యాన్స్ ఆనందానికి అవధుల్లేకుండాపోయాయి. ‘అసలైన న్యూస్ అంటే ఇది కదా.. ’ అంటూ తెగ కామెంట్స్ పెట్టేస్తున్నారు. మరోపక్క పవన్.. ‘పింక్’ తెలుగు రీమేక్‌తో బిజీగా ఉన్నారు. ఈ సినిమాకు వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్నారు. సినిమాకు ‘లాయర్ సాబ్’ అనే పేరును పరిశీలిస్తున్నారు. ఇందులో కథానాయికగా రెజీనాను ఎంపిక చేసుకోబోతున్నట్లు ఎప్పటినుంచో వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే తొలి షెడ్యూల్ షూటింగ్‌ను చెప్పాపెట్టకుండా పూర్తి చేసేశారు. పవన్ సెట్స్‌లో నడుస్తున్న ఫొటోలు కూడా లీకయ్యాయి. దాంతో పవన్ సినిమాకు నిర్మాతలుగా వ్యవహరిస్తున్న దిల్ రాజు, బోనీ కపూర్‌లపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. పవన్ వరుసగా మూడు సినిమాలు చేయడానికి ఒప్పుకున్నారు. ఇందుకు కారణం తనపై కుటుంబాలు, పార్టీ భవిష్యత్తు ఆధారపడి ఉండటమేనిన క్లారిటీ కూడా ఇచ్చారు. ‘పింక్’ తెలుగు రీమేక్‌ చేస్తుండగా 27వ సినిమాను క్రిష్ జాగర్లమూడితో చేయాలని నిర్ణయించేసుకున్నారు. ఇందులో పవన్ రెండు విభిన్న అవతారాల్లో కనిపిస్తారని తెలుస్తోంది. ఇంకా సినిమాకు ఏ టైటిల్ అనుకోలేదు. ఫిబ్రవరి 4 నుంచి షూటింగ్ జరుగుతుందట.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2GLdagi
v

ఇప్పటివరకు నాకు ఎవ్వరూ ప్రపోజ్ చేయలేదు: దిశా పటానీ

కుర్ర హీరోయిన్ దిశా పటానీకి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగే వేరు. ఆమెకు అభిమానుల్లో ఎంత క్రేజ్ ఉందంటే.. దిశా బర్త్‌డేను నేషనల్ క్రష్ డే‌గా మార్చి, ఆ ఒక్క రోజుల సెలవు ప్రకటించాలని ఓ సారి అభిమానులు నిరసన కూడా చేశారు. దిశకు ఉన్న హాట్ ఫిగర్‌కి ఈ పాటికి లక్షల్లో ప్రపోజల్స్ వచ్చి ఉంటాయని అనుకుంటాం. కానీ అలాంటిదేమీ లేదట. ఇప్పటివరకు తనకు ఒక్క ప్రపోజల్ కూడా రాలేదని దిశ అంటున్నారు. ఈ విషయాన్ని ఆమె ఓ సందర్భంలో వెల్లడించారు. ‘‘ఇప్పటివరకు నాకు ఎవ్వరూ ప్రపోజ్ చేసింది లేదు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి నేను టామ్ బాయ్‌లా ఉండేదాన్ని. మా నాన్న పోలీస్. దాంతో అబ్బాయిలకు నన్ను చూడాలంటేనే భయం వేసేది. ఆ తర్వాత సినిమా కెరీర్ కోసం ముంబయి వచ్చాక అసలు ప్రైవసీ లేకుండాపోయింది. ఫ్రెండ్స్‌తో కలిసి పార్టీలకు వెళ్లలేను. ఎక్కువ మందితో కలవలేను. అలాంటప్పుడు ఇక నాకు ప్రేమలో పడే అవకాశం ఎక్కడుంటుంది. త్వరలో నాకు ఎవరో ఒకరు ప్రపోజ్ చేస్తారని అనుకుంటున్నాను. ఎందుకంటే జీవితంలో ప్రేమ లేకపోతే ఎలా? మనం బతికేదే దాని కోసం కదా. నేను ప్రేమలో పడితేనే నేనూ ఓ అమ్మాయినే అని తెలిసొస్తుంది. లేకపోతే నేను ఎప్పుడూ అబ్బాయిలా బాక్సర్స్ వేసుకుని జిమ్‌లో తెగ వర్కవుట్స్ చేస్తుంటా. ఒక అబ్బాయిని చూడగానే నాకు చెక్కిలిగింతలు కలగాలి. అప్పుడే అతనిపై నాకు ప్రేమ కలిగినట్లు. అలా జరగకపోతే అసలు ప్రేమే లేనట్లు’ అని తెలిపారు. READ ALSO: బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌తో దిశ డేటింగ్‌లో ఉన్నట్లు ఎప్పటినుంచో వార్తలు వెలువడుతున్నాయి. దీని గురించి పలు మీడియా వర్గాలు ప్రశ్నించగా.. వర్కవుట్ అవ్వడంలేదని చెప్పారు. దాంతో ఇక దిశ తన ఫోకస్‌ను కేవలం సినిమాలపైనే పెట్టాలని అనుకుంటున్నారు. ప్రస్తుతం ఆమె ‘మలంగ్’ సినిమాలో నటిస్తున్నారు. త్వరలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2GJgRmI
v

Allu Arjun: నా రికార్డ్ మరోకరు బీట్ చేయాలని కోరుకుంటున్నా

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌కి జీవితంలో మర్చిపోలేని హిట్ ఇచ్చింది ‘అల వైకుంఠపురములో’. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ సినిమాను తెరకెక్కించారు. పూజా హెగ్డే కథానాయికగా నటించారు. నివేదా పేతురాజ్, సుశాంత్, టబు, మురళీ శర్మ, బ్రహ్మాజీ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమా ఇండస్ట్రీ హిట్‌గా రికార్డు సాధించింది. ముఖ్యంగా తమన్ ఇచ్చిన సంగీతం చార్ట్ బస్టర్‌గా నిలిచింది. ఇటీవల సక్సెస్ మీట్ ఏర్పాటు చేసిన సినిమా టీం నిన్న థ్యాంక్స్ మీట్ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ సందర్భంగా తన అభిప్రాయాలను చాలా చక్కగా అభిమానులతో పంచుకున్నారు. ‘ముందుగా సినిమాను బ్లాక్ బస్టర్ హిట్ చేసిన ప్రేక్షకులకు మీడియాకు ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. ఈ థ్యాంక్స్ మీట్ ఎందుకు పెట్టామంటే.. మా దగ్గర ప్రొడక్షన్ కంపెనీ కాకుండా డిస్ట్రిబ్యూషన్ కంపెనీ కూడా ఉంది. డిస్ట్రిబ్యూషన్ కంపెనీలో పనిచేసేవాళ్లు ఎప్పుడూ నన్ను ఓ మాట అడుగుతూ ఉంటారు. ఏంటండీ ఎప్పుడు సినిమా హిట్ అయినా మీరు మీ టీం మాత్రమే సక్సెస్ మీట్స్ నిర్వహిస్తుంటారు. మా గురించి పట్టించుకోరా, మాకు షీల్డ్ ఇచ్చి సత్కరించరా అని అడుగుతూ ఉంటారు. అప్పుడు వారికి ఓ మాట చెప్పాను. డిస్ట్రిబ్యూటర్స్‌కి షీల్డ్స్ ఇచ్చి సత్కరించేంత గొప్పగా నా సినిమా ఆడినప్పుడు తప్పకుండా ఫంక్షన్ చేస్తాను అని’’ READ ALSO: ‘‘ఆ కోరిక ‘అల వైకుంఠపురములో’ సినిమాతో తీరింది. నాకు ఈ సినిమా ఇండస్ట్రీ రికార్డ్ ఇచ్చింది. ఈ రికార్డును మరో సినిమా బ్రేక్ చేస్తే అప్పుడే సినీ పరిశ్రమ మరో మెట్టు ముందుకు వెళ్లినట్లు. కాబట్టి నా రికార్డును మరెవరైనా బ్రేక్ చేయాలని ఆశిస్తున్నాను. సందర్భం వచ్చింది కాబట్టి ప్రేక్షకులకు ఓ విషయం చెప్పాలని అనుకుంటున్నాను. నేను ఈ సినిమాలోని ‘సిత్తరాల సిరపడు’ పాటలో సిగరెట్ తాగుతూ కనిపిస్తాను. కానీ దయచేసి మీరు మాత్రం నన్ను ఫాలో అయి సిగరెట్ కాల్చడం వంటివి చేయకండి. నేను సినిమాలో ఆ పాత్ర వరకు సిగరెట్ తాగాను. నాకు నిజ జీవితంలో అసలు ఆ అలవాటే లేదు. అది మంచిది కాదు కూడా’’ అని తెలిపారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3baOXOq
v

‘అశ్వద్థామ’ కలెక్షన్స్.. నాగ శౌర్య గట్టిగా కొట్టాడు

నటుడిగా, నిర్మాతగా, రచయితగా ఇలా అన్ని రంగాల్లో తానేంటో నిరూపించుకున్న యువ కథానాయకుడు నాగ శౌర్య. ఎప్పటికప్పుడు కొత్త కంటెంట్‌తో ప్రేక్షకుల ముందుకు రావడానికి ప్రయత్నిస్తుంటారు. అలా నిన్న ‘అశ్వద్థామ’ సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చారు. ముంబయిలో తన స్నేహితుడి సోదరికి ఎదురైన అనుభవాన్ని కథలా రాసుకున్నానని చెప్పారు. సమాజంలో ఆడవాళ్లపై ఎంతటి ఘోరమైన సంఘటనలు జరుగుతున్నాయో ఈ సినిమాలో కళ్లకు కట్టినట్లు చూపించారు. తొలిరోజే సినిమాకు మంచి రెస్పా్న్స్ వచ్చింది. ఇక ఈ సినిమా తొలి రోజు కలెక్షన్స్ విషయానికొస్తే.. నాగశౌర్య ఈసారి గట్టిగా కొట్టాడనే చెప్పాలి. సినిమాను పది కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో రూ.4 కోట్లు రాబట్టినట్లు సమాచారం. ఇక అమెరికాలో రూ.35 లక్షలు రాబట్టిందట. ఓవర్‌సీస్‌లో రూ.75 లక్షలు వసూళ్లు రాబట్టినట్లు చిత్ర వర్గాల సమాచారం. మొత్తానికి సినిమా తొలిరోజు ఐదు కోట్లు రాబట్టేసినట్లు సినీ విశ్లేషకులు చెబుతున్నారు. READ ALSO: పెట్టిన బడ్జెట్‌కు సగం లాభం వచ్చిందంటే.. సినిమా ఏ స్థాయిలో ఆడిందో ఊహించవచ్చు. తన కెరీర్‌లో ఇదే బెస్ట్ సినిమా అని నాగశౌర్య చెబుతూ వచ్చారు. ఏ సినిమాకు కూడా ఇంతటి ఓపెనింగ్స్ ఎప్పుడూ రాలేదని అన్నారు. ఈ సినిమాలో మెహ్రీన్ హీరోయిన్‌గా నటించారు. రమణ తేజ దర్శకత్వం వహించారు. శ్రీచరణ్ పాకాల అందించిన మ్యూజిక్‌కు మంచి స్పందన వచ్చింది. చాలా చోట్లు సినిమా కంటెంట్‌ని బాగా ఎలివేట్ చేసిందని ప్రేక్షకుల టాక్. మొత్తానికి నాగశౌర్య చాలా కాలం తర్వాత ఓ మంచి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2GMq4dC
v

జిమ్‌లో పునర్నవి వర్కౌట్స్.. బిగ్ బాస్ పాప చెమటలు పట్టిస్తోందిగా!

‘ఉయ్యాల జంపాలా’, ‘మళ్లీ మళ్లీ ఇది రాని రోజు’, ‘పిట్టగోడ’, ‘ఎందుకో ఏమో’ ఇలాంటి చిత్రాల్లో నటించినా రాని గుర్తింపు ‘బిగ్ బాస్’ షోతో దక్కించుకుంది భూపాలం. గ్లామర్ డాల్‌గా హౌస్‌లోకి అడుగుపెట్టి 11 వారాలు పాటు కలర్ ఫుల్ లుక్స్‌తో బిగ్ బాస్ హౌస్‌తో పాటు ఆడియన్స్‌కి హాట్‌నెస్ అందించిన ప్రస్తుతం క్రేజీగా మారింది. బిగ్ బాస్ సీజన్‌ 3లో తనకు టైటిల్ రాలేకపోయినప్పటికీ తనతో లవ్ ట్రాక్ నడిపిన రాహుల్‌కి సపోర్ట్ చేసి తన విజయంలో కీలకం అయ్యింది పునర్నవి భూపాలం. ఈ విషయాన్ని బిగ్ బాస్ విన్నర్ రాహుల్ పలు సందర్భాల్లో చెప్పి.. తన విజయంలో పునర్నవికి భాగం ఇచ్చారు. ఇక ఈ ఇద్దరి మధ్య లవ్ రూమర్స్ సంగతి పక్కనపెట్టేస్తే.. బిగ్ బాస్ తరువాత పునర్నవి భూపాలం తనలోని గ్లామరసానికి పదునుపెట్టింది. చూడ్డానికి బబ్లీగా మంచి ఫిజిక్‌తో ఉండే పునర్నవి భూపాలం హాట్ హాట్ ఫొటోలను షేర్ చేసి సోషల్ మీడియాను హీటెక్కిస్తోంది. ఈ మధ్యకాలంలో ఆమె షేర్ చేసిన హాట్ పిక్స్ సోషల్ మీడియాను షేక్ చేశాయి. తాజాగా జిమ్‌లో పునర్నవి వర్కౌట్ చేస్తున్న వీడియో వైరల్ అవుతోంది. కాస్త బొద్దుగా ముద్దుగా ఉండే ఈ బిగ్ బాస్ భామ.. స్లిమ్ అయ్యేందుకు వర్కౌట్స్ చేస్తూ చెమటలు చిందిస్తోంది. గ్లామర్ ఫీల్డ్‌లో రాణించాలంటే ఫిట్ నెస్ తప్పనిసరైన పరిస్థితుల్లో ఒళ్లు ఒంచక తప్పదు మరి. అన్నట్టు పునర్నవి భూపాలం నటించిన సైకిల్, ఒక చిన్న విరామం చిత్రాలు త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2RJgmz2
v

నయనతార అసిస్టెంట్లకు అంత జీతాలా: షాకింగ్ విషయాలు బయటపెట్టిన నిర్మాత

తమిళ చిత్ర పరిశ్రమలో నయనతార‌కు ఎంతో విలువ, పేరు ప్రతిష్ఠలు ఉన్నాయి. రజినీకాంత్, కమల్ హాసన్‌లకున్న హోదా నయనతారకు కూడా ఉంది. అయితే కోసం సెట్స్‌లో పెట్టే ఖర్చులు అంతా ఇంతా కాదు అంటూ ప్రముఖ తమిళ నిర్మాత రాజన్ షాకింగ్ విషయాలను బయటపెట్టారు. నయనతార ఏదన్నా సెట్‌కు వెళితే ఆమెతో పాటు ఏడుగురు అసిస్టెంట్స్ కూడా ఉండి తీరాల్సిందేనట. వారికి ఒక్కొక్కరికి రోజుకి ఏడు నుంచి ఎనిమిది వేల రూపాలయ వరకు జీతం సమర్పించుకోవాలట. ‘‘నయనతారతో పాటు మరో ఆరు, ఏడుగురు అసిస్టెంట్స్ కూడా ఉంటారు. వారికి రోజుకు ఏడు నుంచి పన్నెండు వేల వరకు జీతాలు ఇవ్వాలి. నాకు తెలిసిన వారు ఈ విషయాలు చెప్పారు. కాబట్టి వారు చెప్పేది నిజమే అయివుంటుంది. ఈ రకంగా చూసుకుంటే నయన్ అసిస్టెంట్స్‌కు రోజుకు 75 నుంచి 80 వేల రూపాయల వరకు ఇవ్వాలి. ఒకవేళ నయన్ 50 రోజుల పాటు సెట్స్‌కు వస్తే పరిస్థితేంటో ఆలోచించండి. నిర్మాత సినిమా కోసం తెచ్చిన డబ్బును నయనతార అసిస్టెంట్స్ పైనే ఖర్చు అయిపోతుంది. దీనికి తోడు నయనతార డ్రైవర్స్‌కి, డీజిల్ ఖర్చులు ఎంత ఉంటాయో ఆలోచించండి’’ READ ALSO: ‘‘ వీటికి తోడు కారవ్యాన్ల కోసం కూడా నిర్మాతలు భారీగా ఖర్చు చేస్తారు. ఒక్కో కారవ్యాన్‌ను మెయింటైన్ చేయాలంటే దాదాపు కోటి రూపాయలు అవుతుంది. ఓ భారీ సినిమా తీయాలంటే రోజూ తొమ్మిది కారవ్యాన్లు కావాల్సి వస్తుంది. ఒక్కో కారవ్యాన్‌ను మెయింటైన్ చేయాలంటే తొమ్మిది నుంచి పదివేల వరకు ఖర్చు అవుతుంది. అంటే నిర్మాత ఒక్క రోజు కారవ్యాన్‌కే లక్ష నుంచి కోటి రూపాయల వరకు ఖర్చు చేయాలి. ఎంజీఆర్, శివాజీ గణేశణ్‌లు అయితే అసలు ఎప్పుడూ కారవ్యాన్‌ను వాడలేదు. షూటింగ్‌కి వాళ్ల వాహనాల్లోనే వచ్చేవారు’’ అంటూ అసహనం వ్యక్తం చేశారు. READ ALSO:


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2vyXMB6
v

Pawan Kalyan: పింక్ రీమేక్‌లో పవన్ మాజీ భార్య.. తల్లిగానా?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ మూవీ కోసం పవన్ ఫ్యాన్స్ ఎంత ఆసక్తిగా చూస్తున్నారో.. పొలిటికల్ సర్కిల్స్‌లోనూ ఆయన మూవీపై అమితాసక్తి కనపరుస్తున్నారు. జనసేన పార్టీ స్థాపన తరువాత ఫుల్ టైం పొలిటికల్ లీడర్‌గా ఉండబోతున్నానంటూ సినిమాలకు స్వస్తి చెప్పిన పవన్ కళ్యాణ్.. అదే పార్టీని నడిపేందుకు సినిమాలనే ఆర్ధిక వనరుగా మలుచుకుని మళ్లీ యూటర్న్ తీసుకున్నారు. బాలీవుడ్‌లో సూపర్ హిట్ అయిన ‘పింక్’ మూవీని తెలుగులో రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే. హిందీలో అమితాబ్ బచ్చన్ పోషించిన లాయర్ పాత్రను తెలుగులో పవన్ కళ్యాణ్ చేస్తున్నారు. వేణు శ్రీరామ్‌ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమాకు దిల్ రాజు నిర్మాణ భాగస్వామిగా వ్యవహరించనున్నాడు. ప్రస్తుతం రాజకీయాల్లో బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ ఎలాంటి హడావుడి లేకుండా ‘పింక్’ రీమేక్‌ షూటింగ్‌లో పాల్గొన్న ఫొటోలు ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇదిలా ఉండగా.. పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ మూవీపై రకరకాల వార్తలు సినీ సర్కిల్స్‌లో చక్కర్లు కొడుతున్నాయి. ఇందులో ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. పింక్ మూవీలో పవన్ మాజీ భార్య రేణు దేశాయ్ కీలకపాత్ర చేయబోతోందట. బద్రి, జానీ సినిమాలతో జోడీ కట్టిన పవన్-రేణు దేశాయ్‌లు ఆ తరువాత రియల్ లైఫ్ పార్టనర్స్‌గా మారి.. వ్యక్తిగత కారణాలతో విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. కాగా ఈ ఇద్దరి కాంబోకు మంచి క్రేజ్ ఉండటంతో పవన్-రేణు దేశాయ్‌లను ఒకే ఫ్రేమ్‌లోకి తీసుకువచ్చేందుకు దర్శకుడు వేణు శ్రీరామ్‌ ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. పింక్ రీమేక్‌లో చైల్డ్ బ్యాక్ డ్రాప్ సన్నివేశాలు ఉండబోతున్నాయని.. అందులో ఓ చైల్డ్ ఆర్టిస్ట్‌కి తల్లిగా రేణు దేశాయ్‌ని అడిగినట్టు తెలుస్తోంది. మరోవైపు ఈ సినిమాలో కీలకమైన ముగ్గురు యువతుల్లో ఒకరికి తల్లిగా చేయబోతుందనే వార్తలు వస్తున్నాయి. See Photo Story: అయితే హీరోయిన్‌గా మూవీ కెరియర్‌కి స్వస్తి చెప్పిన రేణు దేశాయ్.. ప్రస్తుతం ఓ చిత్రాన్ని డైరెక్ట్ చేసే పనిలో ఉన్నారు. మరోవైపు తెలుగులో మంచి పాత్రలు వస్తే చేస్తానని ప్రకటించిన రేణు దేశాయ్.. శుక్రవారం నాడు విడుదలైన ‘చూసీ చూడంగానే’ చిత్రంలో తల్లి క్యారెక్టర్‌ చేసే అవకాశం వచ్చినప్పటికీ హెల్త్ బాలేక వదలుకున్నట్టు చెప్పారామె. మరి ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న పవన్ రీ ఎంట్రీ మూవీలో రేణు చేస్తుందా లేదా? అనేది తేలాల్సి ఉంది. దీనిపై చిత్ర యూనిట్ నుండి ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. ఇటీవల షూటింగ్ లొకేషన్ పిక్స్ లీక్ కావడంతో పవన్ సీరియస్ అయ్యారని.. అందుకే ఎలాంటి లీక్‌లు భయటకు వెళ్లకుండా చిత్ర యూనిట్ జాగ్రత్తలు వహిస్తోంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2GE56xx
v

Whattey Beauty Promo: వామ్మో రష్మిక డ్యాన్స్‌లు ఇరగదీసిందిగా..

‘ఛలో’ నుంచి ‘సరిలేరు నీకెవ్వరు’ వరకు రష్మిక మందనలో అల్లరి పిల్లను అందమైన పిల్లను మాత్రమే చూశాం. కానీ ఆమెలో అద్భుతమైన డ్యాన్సర్ ఉందన్న విషయం ‘’ సినిమా ద్వారా ప్రేక్షకులకు తెలిసొచ్చింది. నితిన్, రష్మిక మందన జంటగా నటిస్తున్న సినిమా ‘భీష్మ’. వెంకీ కుడుముల దర్శకత్వం వహిస్తు్న్నారు. ఈ సినిమాలోని ‘వాట్టే బ్యూటీ’ అనే పాట ప్రోమోను తాజాగా విడుదల చేశారు. ‘వాట్టే వాట్టే వాట్టే బ్యూటీ.. నువ్వు యాడా ఉంటే ఆడే ఊటీ’ అంటూ సాగుతున్న ఈ పాట చాలా కలర్‌ఫుల్‌గా ఉంది. ముఖ్యంగా రష్మిక డ్యాన్స్‌లు ఈ పాటకే హైలైట్ అని చెప్పాలి. కింద కూర్చుని రెండు కాళ్లు బొమ్మలా ఊపే స్టెప్‌ను చాలా బాగా వేసింది. అయితే ఇందులో రష్మిక వేసిన స్టెప్పులు హీరోయిన్‌కు చాలా కష్టంగా ఉంటాయి. హీరోలైతే అవలీలగా వేసేస్తారు. అయినా కూడా ఈ పాటకు కొరియోగ్రాఫర్‌గా వ్యవహరించిన జానీ మాస్టర్ పట్టుబట్టి రష్మిక చేత స్టెప్ వేయించారట. ఈ విషయాన్ని రష్మిక ట్విటర్ ద్వారా వెల్లడించారు. ఈ పాటకు తాను, నితిన్ చాలా కష్టపడ్డామని తెలిపారు. పాటలో రష్మిక వేసిన దుస్తులు చాలా అందంగా ఉన్నాయి. ఆమెను ఓ బార్బీ బొమ్మలా చూపించారు. ముఖ్యంగా గ్రీన్ రంగు చీరకట్టులో అదిరిపోయారు. READ ALSO: మహతి స్వర సాగర్ సినిమాకు సంగీతం అందించారు. సితార ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై సూర్య దేవర నాగవంశీ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఫిబ్రవరి 21న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/38R6ZTC
v

Neeli Neeli Aakasam Full Video Song - 30 Rojullo Preminchadam Ela


Neeli Neeli Aakasam Full Video Song - 30 Rojullo Preminchadam Ela

from BharatStudent - Telugu - Actor Actress|Photo,Picture Galleries|Wallpapers|Screensavers|Movie Trailers|Film News and Gossips https://ift.tt/3b8M94m

‘చూసీ చూడంగానే’

అంతా కొత్తవాళ్లతో చేసిన ఈ సినిమాలో యూత్‌కి కనెక్ట్ అయ్యే కొత్త పాయింట్ ఉంది. హీరో హీరోయిన్లు కొత్తవాళ్లే అయినప్పటికీ అనుభవం ఉన్నట్టుగాా నటించారు. అయితే కొత్త పాయింట్‌ను కన్వెన్సింగ్‌గా చెప్పడంలో కథ గాడితప్పింది.

from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/36GVcWM
v

చచ్చిపోతాను, నా వల్ల కావడంలేదు: మాధవీలత షాకింగ్ పోస్ట్

నటి, బీజేపీ నేత నిన్న సోషల్ మీడియాలో షాకింగ్ పోస్ట్ పెట్టింది. ఉన్నట్టుండి నాకు చనిపోవాలని ఉంది అంటూ ఫేస్‌బుక్‌లో పోస్ట్ పెట్టడంతో ఫ్యాన్స్ షాక్‌కు గురయ్యారు. అయితే తాను ఆ పోస్ట్ ఎందుకు పెట్టాల్సి వచ్చిందో తాజాగా వివరించారు. ‘నేనెప్పుడూ నా ఫ్రెండ్స్‌తో చెప్తూ ఉంటాను.. ఏదో ఒక రోజు ‘ప్రేమ’ సినిమాలో రేవతిలా చచ్చిపోతా అని ఫేస్‌బుక్‌లో పేర్కొంది. అందులోలాగే తాను కూడా ఎప్పుడూ ఏదో ఒక అనారోగ్య సమస్యతో ఏదో ఒక మెడిసిన్ వేసుకుంటున్నా అని.. చివరికి ఎలాంటి మెడిసిన్స్ పని చేయవేమో.. అని ఎప్పుడూ ఇదే విషయాన్ని తన ఫ్రెండ్స్‌కి కూడా చెబుతూ ఉంటానని పేర్కొంది. తను మైగ్రేన్, జ్వరం, తలనొప్పి, నిద్రలేమి సమస్యలతో సఫర్ అవుతున్నానని.. దీంతో రోజూ ఏదో ఒక ట్యాబ్లెట్ వేసుకోవాల్సి వస్తుందని’ ఆమె ఫేస్‌బుక్ పోస్ట్‌లో తెలిపింది. అయితే ఈ పోస్ట్‌‌ని చూడగానే ఫ్యాన్స్, ఫాలోవర్స్ కంగుతిన్నారు. అసలు మాధవీలత ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకుంటోంది అంటూ కామెంట్ల వర్షం కురిపించారు. దీనిపై మాధవిలత క్లారిటీ ఇచ్చారు. ‘ఈ రకంగా క్లారిటీ ఇస్తానని నేను ఎప్పుడూ అనుకోలేదు. నేను సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ వైరల్ అయింది. నాకున్న సమస్యల గురించి ఆ పోస్ట్‌లో వివరించాను కానీ చచ్చిపోవాలని అనుకుంటున్నట్లు మాత్రం ఎక్కడా ప్రస్తావించలేదు. నాకు మైగ్రేన్ ఉంది. దాని వల్ల రోజూ మెడిసిన్స్ తీసుకుంటున్నాను. మెడిసిన్స్ ఎక్కువగా వాడితే ఆయుష్షు తగ్గిపోతుంది. నాకే కాదు ఎవరికైనా అంతే’’ READ ALSO: ‘‘నేను మైగ్రేన్ వల్ల ఇన్ని ట్యాబ్లెట్స్ వాడుతున్నాను కాబట్టి నేను కూడా ‘ప్రేమ’ సినిమాలో రేవతిలా చనిపోతానేమోనని అన్నాను కానీ చనిపోవాలని అనుకుంటున్నట్లు మాత్రం ఎక్కడా చెప్పలేదు. తప్పుగా ప్రచారం చేయకండి. నాకు ఒంట్లో బాలేదు. మెడిసిన్స్ ఎక్కువగా వాడటం వల్ల విరక్తి కలిగి ఆ పోస్ట్ పెట్టాను. నేను అన్నీ ఫేస్‌బుక్‌లోనే పంచుకుంటాను. దీని ద్వారా ఫ్యాన్స్, ఫాలోవర్స్‌తో టచ్‌లో ఉంటాను. ఇలా జరుగుతుందని నేను అనుకోలేదు. ఏదో కాజ్యువల్‌గా నా అనారోగ్య సమస్యల గురించి షేర్ చేసుకున్నాను. మీడియా వర్గాలు దయచేసి ఇలా ప్రచారం చేయొద్దు’ అని వివరణ ఇచ్చారు. See Photo Story:


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/319O6cd
v

ఒక్క చెంప దెబ్బ, ఒకే ఒక్క చెంప దెబ్బ.. ఏం చేసిందో తెలుసా?

భార్యాభర్తలు.. అందమైన జీవితం.. భర్తంటే భార్యకు, భార్యకే భర్తకు ప్రాణం. భర్తే సర్వస్వం అనుకునే భార్య. భార్యతో పాటు బిజినెస్ కూడా ముఖ్యమే అనుకునే భర్త. అంతా సవ్యంగా సాగిపోతోంది అనుకుంటున్న సమయంలో ఒక్క చెంప దెబ్బ. జీవితాన్నే చిన్నాభిన్నం చేసేసింది. ప్రముఖ నటి ప్రధాన పాత్రలో నటించిన ‘థప్పడ్’ సినిమా కథ ఇది. అనుభవ్ సిన్హా డైరెక్ట్ చేసిన ఈ సినిమా ట్రైలర్ విడుదలైంది. ఇందులో తాప్సి గృహిణి పాత్రలో నటించారు. తన భర్త, ఇల్లే సర్వస్వం అనుకుని బతికే మహిళ. కానీ తన భర్త వర్క్ టెన్షన్‌లో పడి ఆవేశంలో భార్య చెంపపై కొడతాడు. దాంతో ఆమె విడాకులు కావాలని కోర్టు మెట్లు ఎక్కుతుంది. కేవలం ఒకే ఒక్క చెంప దెబ్బ వల్ల విడాకులు తీసుకోవాలని అనుకుంటున్న తాప్సి నిర్ణయానికి న్యాయస్థానం కూడా షాక్ అవుతుంది. ‘కేవలం ఒక్క చెంప దెబ్బకే విడాకులా?’ అని న్యాయవాది తాప్సిని అడిగిన ప్రశ్నకు తాప్సి సమాధానం చెబుతూ.. ‘ఆయన నన్ను తొలిసారి కొట్టారు. కొట్టింది ఒక్కసారే అయినా కొట్టాల్సిన అవసరం లేదు కదా. నాపై నిజంగా అంత ప్రేమ ఉంటే కొట్టాల్సిన అసవరం నిజంగా రాదు కదా’ అని తిరిగి ప్రశ్నించిన తీరు ఆలోచింపజేస్తోంది. READ ALSO: ‘అర్జున్ రెడ్డి’, ‘కబీర్ సింగ్’ సినిమాలతో బ్లాక్ బస్టర్ విజయాలు అందుకున్న దర్శకుడు సందీప్ రెడ్డి వంగాకు ఈ సినిమాతో దిమ్మతిరిగే ఆన్సర్ ఇచ్చారు అనుభవ్ సిన్హా. ‘కబీర్ సింగ్’లో హీరో హీరోయిన్‌పై చేయి చేసుకోవడం వివాదాస్పదమైంది. ఈ సన్నివేశాన్ని సమర్ధించుకుంటూ సందీప్ ఓ మాటన్నారు. ‘మనం ఎవరినైనా నిజంగా ప్రేమిస్తే వారిని ముట్టుకోలేనప్పుడు, కొట్టలేనప్పుడు ఆ బంధంలో ఎమోషన్ కనిపించదు’ అన్నారు. ఇదే డైలాగ్‌ను ‘థప్పడ్’ ట్రైలర్‌లో వాడారు. ఫిబ్రవరి 28న సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2GDQdLP
v

Thursday 30 January 2020

‘అశ్వథ్థామ’

రియల్ ఇన్సిడెంట్ ఆధారంగా హీరో రాసుకున్న కథ.. సమాజాన్ని మేలుకొలిపే విధంగా ఉంది. సొసైటీలో జరుగుతున్న అన్యాాయాలు.. ఆడవాళ్లపై అఘాయిత్యాలపై ఓ సోషల్ మెసేజ్ ఇచ్చారు.

from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3190RDP
v

భార్య కంటే భర్త 25 ఏళ్లు పెద్దవాడు అయివుండాలి: సినీ విమర్శకుడి సలహాలు

సాధారణంగా పెద్దలు పెళ్లి చేస్తే వధువు కంటే వరుడు రెండు, మూడేళ్లు పెద్దవాడు అయివుండాలి అనుకుంటారు. ఇది మన భారతదేశ సంప్రదాయం. అంతకంటే మరీ పెద్దవాడిని చేసుకున్నా, లేదా వయసు ఎక్కువున్న అమ్మాయిని చేసుకున్నా అదేదో నేరంలా భావించేవారూ ఉన్నారు. అయితే ప్రముఖ బాలీవుడ్ సినీ విమర్శకుడు కమాల్ ఆర్ ఖాన్ మాత్రం పెళ్లి విషయంలో ఓ కొత్త సలహా ఇస్తున్నారు. భార్య కంటే భర్త 25 ఏళ్లు పెద్దవాడు అయితేనే ఆ సంసారం నిండునూరేళ్లు నిలుస్తుందని అంటున్నారు. READ ALSO: ఇంతకీ ఈ పెళ్లి చర్చ ఎందుకు వచ్చిందంటే.. సల్మాన్ ఖాన్ హోస్ట్ చేస్తున్న సెలబ్రిటీ రియాల్టీ షో బిగ్ బాస్‌లో ఓ జంట పెళ్లి చేసుకోవాలని అనుకుంటోంది. వాళ్లే బుల్లి తెర నటులు హిమాన్షి ఖురానా, ఆసిమ్. అయితే ఆసిమ్ కంటే హిమాన్షి నాలుగేళ్లు పెద్ద. ఈ విషయం గురించి కమాల్ ట్విటర్ ద్వారా తన అభిప్రాయాలను వెల్లడించారు. ‘‘హిమాన్షి ఖురానా వయసు 28. ఆసిమ్ వయసు 24. వాళ్లిద్దరూ పెళ్లి చేసుకోలేరని నేను వెయ్యి శాతం గ్యారెంటీతో చెప్పగలను. అయినా తనకంటే వయసులో నాలుగేళ్లు పెద్దదైన అమ్మాయిని ఆసిమ్ ఎందుకు పెళ్లి చేసుకుంటాడు. నేను ఇప్పటివరకు హిమాన్షిలో గమనించిన అంశాలు ఏంటంటే.. ఆమెకు పబ్లిసిటీ మాత్రమే కావాలి. ఆసిమ్‌ని నిజంగా ప్రేమించడంలేదు. కెరీర్‌పైనే ఆమె ఆశలన్నీ. బాలీవుడ్‌లోకి ఎలాగైనా వెళ్లాలని అనుకుంటోంది. పెళ్లి సక్సెస్ అవ్వాలంటే వధువు కంటే వరుడు 25 ఏళ్లు పెద్దవాడు అయివుండాలి’ అని పేర్కొన్నారు. కమాల్ చెప్పింది కూడా కరెక్టే కదా అని నెటిజన్లు కూడా ఆయనకు వత్తాసు పలుకుతున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/37KUnNP
v

HIT Teaser: కళ్లార్పలేనంత థ్రిల్.. నాని ఖాతాలో మరో ‘హిట్’

నేచురల్ స్టార్ నిర్మాతగా తొలి సినిమా ‘అ’తోనే మంచి విజయం అందుకున్నారు. ఇప్పుడు ‘హిట్’ అనే సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ‘ఫలక్‌నుమా దాస్’తో బ్లాక్ బస్టర్ విజయం అందుకున్న మాస్ హీరో విశ్వక్‌సేన్ ఇందులో కథానాయకుడిగా నటించారు. ‘చిలసౌ’తో హీరోయిన్‌గా పరిచయం అయిన రుహానీ శర్మ ఇందులో కథానాయికగా నటిస్తున్నారు. ‘హిట్’ సినిమా టీజర్‌ను నాని ఈరోజు రిలీజ్ చేశారు. ఓ మిస్సింగ్ కేసును విచారణ చేసే అధికారి విక్రమ్ పాత్రలో విశ్వక్ సేన్ నటించారు. ‘ఈ జాబ్ నిన్ను రిస్క్‌లో పెడుతుంది విక్రమ్. నువ్వు ఈ డిపార్ట్‌మెంట్ వదిలి వెళ్లిపోవాలి’ అని ఓ యువతి విశ్వక్‌సేన్‌తో చెబుతుంది. ‘ఈ డిపార్ట్‌మెంట్‌ని మాత్రం వదిలేది లేదు’ అని విశ్వక్ సేన్ అంటారు. ఈ నేపథ్యంలో విశ్వక్‌సేన్‌కు బాగా కావాల్సిన వారిని కళ్లముందే కత్తితో పొడిచి చంపేస్తారు. ఇలాంటి థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో టీజర్ రసవత్తరంగా సాగింది. విశ్వక్ సేన్, రుహానీ శర్మ లిప్ కిస్ టీజర్‌కు హైలైట్‌గా నిలిచింది. ఈ టీజర్ రిలీజ్ చేస్తూ.. ‘సీట్లను అతుక్కుని సినిమా చూస్తారు’ అని నాని క్యాప్షన్ ఇచ్చారు. READ ALSO: టీజర్‌తోనే అంచనాలను పెంచేశారు ‘హిట్’ టీం. మరి సినిమా ఎలా ఉండోబోతందో తెలియాలంటే ఫిబ్రవరి చివరి వారం వరకు ఎదురుచూడాలి. కొలను శైలేష్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. See Photo Story:


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/36EJiwp
v

స్టార్ హీరోకి లిప్ కిస్ ఇచ్చిన నటుడు.. లైవ్‌లో భార్య!

బాలీవుడ్ నటుడు రణ్‌వీర్ సింగ్‌కి తన భార్య దీపిక పదుకొణె అంటే ఎంత ప్రాణమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎన్నో పబ్లిక్ ఈవెంట్స్‌లో దీపిక అంటే ఎంత ఇష్టమో రణ్‌వీర్ కళ్లకు కట్టినట్లు చూపించేవారు. అయితే భార్యను అంతగా ప్రేమించే రణ్‌వీర్ ఇప్పుడు మగాడితో రొమాన్స్ చేస్తూ కనిపించారు. ఆ మగాడు ఎవరో కాదు సినీ నటుడు జతిన్ సర్ని. రణ్‌వీర్ నటించిన ‘’ సినిమాలో యశ్‌పాల్ శర్మ అనే క్రికెటర్ పాత్రలో జతిన్ నటించారు. రణ్‌వీర్ తన ‘83’ టీంతో కలిసి ఓ విమానంలో ప్రయాణిస్తున్నప్పుడు జతిన్.. రణ్‌వీర్‌కు కొన్ని సెకన్ల పాటు లిప్ కిస్ ఇచ్చారు. అతను లిప్ కిస్ ఇస్తున్నప్పుడు రణ్‌వీర్ తెగ కంగారుపడిపోయారు. ఆ సందర్భంలో వెనకే ఉన్న వ్యక్తి తీసిన వీడియో కాస్తా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. జతిన్ ముద్దుపెట్టిన తర్వాత రణ్‌వీర్ రియాక్షన్ హైలైట్‌గా నిలిచింది. ‘నేనంటే ఇంత ఇష్టమా? మీ వదిన దీపిక లైవ్‌లో ఉంది. దీపికా చూస్తున్నావా ఏం జరుగుతోందో..’ అన్నారు. READ ALSO: ఇంతకీ ఈ ముద్దు గొడవ ఏంటంటే.. బాలీవుడ్ నటుడు ఆయుష్మాన్ ఖురానా ప్రధాన పాత్రలో నటించిన సినిమా ‘శుభ్ మంగళ్ జ్యాదా సావధాన్’. ఈ సినిమాలో ఆయుష్మాన్‌ స్వలింగ సంపర్కుడు. మరో హీరోతో ప్రేమలో పడతాడు. అప్పుడు ఆయుష్మాన్‌కి తాను ప్రేమించిన యువకుడికి లిప్ కిస్ ఇస్తాడు. ఆ సినిమాను ప్రమోట్ చేయడం కోసం, సేమ్ సెక్స్ ప్రేమలు, పెళ్లిళ్లు తప్పు కాదు అని చెప్పడం కోసం టీం ఈ రకంగా సినిమాను ప్రమోట్ చేసిందన్నమాట.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/36JWDnf
v

నాగశౌర్య ‘అశ్వథ్థామ’ ట్విట్టర్ రివ్యూ

‘ఛలో’ సినిమాతో యూత్‌లో మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్నారు యంగ్ హీరో నాగశౌర్య. ఈ సినిమా తరువాత సరైన హిట్ కోసం ఎదురు చూస్తున్న నాగశౌర్య.. తన లవర్ బాయ్ ఇమేజ్‌ను పక్కనపెట్టి యాక్షన్, సస్పెన్స్ థ్రిల్లర్ కథతో ‘అశ్వథ్థామ’గా నేడు (జనవరి 31) ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అమ్మాయిల మీద జరుగుతున్న ఆరాచకా ఎదురొడ్డే కుర్రాడే కథే ‘అశ్వథ్థామ’. ఓ యూనిక్ సబ్జెక్ట్‌తో తెరకెక్కిన ఈ మూవీకి కథ అందించింది నాగశౌర్యనే కావడం విశేషం. యువ దర్శకుడు రమణతేజ ఈ చిత్రంతో ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నారు. శంకర్ ప్రసాద్ ముల్పూరి సమర్పణలో ఐరా క్రియేషన్స్ పతాకంపై ఉషా ముల్పూరి ఈ చిత్రాన్ని నిర్మించారు. మెహ్రీన్ ఈ చిత్రంలో హీరోయిన్ నటించింది. టైటిల్, ఫస్ట్ లుక్, ట్రైలర్‌లతో ఈ సినిమా అంచనాలను పెంచేసిన ‘అశ్వథ్థామ’ మూవీ ఇప్పటికే యుఎస్‌లో ప్రీమియర్ షోలు పడటంతో ట్విట్టర్ ద్వారా తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు నెటిజన్లు. నాగశౌర్య ఫస్ట్ టైమ్ మాస్ అండ్ రగ్డ్ డ్ లుక్‌లో ఆకట్టుకునేలా కనిపిస్తున్నాడని.. ఆయన ఎంటైర్ కెరియల్‌లో గత చిత్రాలన్నీ ఒక ఎత్తు అయితే ఈ చిత్రంలో మరో ఎత్తు అని శ్రీ చరణ్ పాకాల మ్యూజిక్ .. గిబ్రాన్ బ్యాగ్రౌండ్ స్కోర్ సినిమాలో హైలైట్‌గా ఉన్నాయి అంటున్నారు నెటిజన్లు. ఫస్టాఫ్ మొత్తం సస్పెన్స్ రైడ్‌గా సాగిందని, హీరో సిస్టర్‌కి జరిగిన పెయిన్‌ఫుల్ ఇన్సిడెంట్‌తో ‘అశ్వథ్థామ’ ఎమోషనల్‌గా ఉందంటున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2vBtAFD
v

జనం ఫిక్స్.. చంద్రబాబే మళ్లీ సీఎం: హీరోగారు మళ్లీ వచ్చారండోయ్

గత ఎన్నికల్లో వైసీపీకి 151 స్థానాలల్లో గెలిపించి జగన్‌కు తిరుగులేని విజయాన్ని అందించారు ఆంధ్రప్రదేశ్ ఓటర్లు. అయితే ఎన్నికల ముందు ఖచ్చితంగా తిరిగి ముఖ్యమంత్రి అవుతారని చాలామందే భావించారు. రాసిపెట్టుకోండి అని ఒకరంటే.. తొడకొట్టి చెబుతున్నా బాబే సీఎం అంటూ బుద్దా వెంకన్న లాంటి టీడీపీ వీరవిధేయులు తొడలు వాచిపోయేలే కొట్టుకున్నా.. ఓటర్లు మాత్రం జగన్‌కే జై కొట్టారు. అయితే వచ్చే ఎన్నికల్లో మాత్రం బాబే సీఎం అంటున్నారు ఆపరేషన్ గరుడ శివాజీ. గత ఎన్నికల్లో చంద్రబాబు విజయానికి శక్తిమేర కష్టపడ్డ ఈ హీరో గారు ఈసారి మాత్రం గురి తప్పుదు అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. Read Also ఆయన మాట్లాడుతూ.. ‘ఎవరు ఏంటన్నది ప్రజలు నిర్ణయిస్తారు. నా దృష్టిలో చంద్రబాబు నాయుడు ఉన్నంతకాలం రాష్ట్రాన్ని ఎవరూ ఏం చేయలేరు. చంద్రబాబు తరువాత వాళ్ల కుటుంబం నుండి ఎవరు వస్తారన్నది వాళ్లకు సంబంధించిన విషయం. ప్రజలు కోరుకున్నవాళ్లే లీడర్ అవుతారు. నేతలు ప్రజల్లో నుండే పుడతారు. జగన్ మోహన్ రెడ్డి లేకపోతే ఆ ప్లేస్‌లో ఇంకొకరు వస్తారు. చంద్రబాబు లేకపోతే ఇంకొకరు వస్తారు. అప్పట్లో ఇందిరా గాంధీ చనిపోతే రాజీవ్ గాంధీ రాలేదా?.. ఆయన చనిపోయిన తరువాత సోనియా గాంధీ వచ్చారు. వ్యవస్థ నిరంతర ప్రక్రియ.. వ్యక్తులే తాత్కాలికం. వ్యవస్థకు ఎవరు ఏం చేశారన్నదే ముఖ్యం. నా దృష్టిలో చంద్రబాబు గారు ఆంధ్రప్రదేశ్‌కి అవసరం. దీన్ని ప్రజలు కూడా గుర్తించారనే అనుకుంటున్నా. ఒకవేళ ఇంతకన్నా టాలెంట్ ఉన్న వాళ్లను గుర్తిస్తే నేను ఆశ్చర్యపోను. నా అభిప్రాయం ప్రకారం వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా మళ్లీ చంద్రబాబు గారే వస్తారు. జనం ఆల్రెడీ ఫిక్స్ అయిపోయారు.. మీరు ఏం చేసినా చంద్రబాబే ముఖ్యమంత్రి కావాలనుకుంటున్నారనేది నా అభిప్రాయం. దీన్ని మీరు గౌరవించాల్సిన అవసరం లేదు.. ఒకవేళ నా అభిప్రాయాన్ని వ్యతిరేకించినా.. ఆ హక్కు మీకు ఉంది. నేను దాన్ని గౌరవించాలి’ అంటూ మరోమారు బాబుపై విధేయతను ప్రదర్శించారు .


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2uQsFR5
v

Nani ‘టక్ జగదీష్’ లాంచ్.. హిట్ కాంబినేషన్ రిపీట్

‘మిడిల్ క్లాస్ అబ్బాయి’ టచ్ చేయడం మొదలుపెట్టారు. శివ నిర్వాణ దర్శకత్వంలో '' సినిమా చేస్తున్నారు నాని. 'నిన్నుకోరి' వంటి సూపర్ హిట్ మూవీ తర్వాత ఆ ఇద్దరి కాంబినేషన్‌లో 'టక్ జగదీష్' వస్తుండటంతో ఈ చిత్రంపై మంచి అంచనాలు ఉన్నాయి. షైన్ స్రీన్స్ పతాకంపై సాహు గారపాటి, హరీష్ పెద్ది సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇది నానికి 26వ చిత్రం. గురువారం ఉదయం పూజా కార్యక్రమాలతో 'టక్ జగదీష్' మూవీ లాంఛనంగా ప్రారంభమైంది. ముందుగా స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శక నిర్మాతలకు స్క్రిప్టును అందజేశారు. ఆ తర్వాత చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు క్లాప్ కొట్టగా, సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ నవీన్ యెర్నేని కెమెరా స్విచ్చాన్ చేశారు. నానితో ఇదివరకు 'ఎవడే సుబ్రమణ్యం' సినిమాలో నటించిన రీతు వర్మ, 'కౌసల్యా కృష్ణమూర్తి' ఫేమ్ ఐశ్వర్యా రాజేష్ ఈ మూవీలో హీరోయిన్లుగా నటిస్తున్నారు. సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్. తమన్ సంగీతం సమకూరుస్తున్న ఈ చిత్రానికి ప్రసాద్ మూరెళ్ల సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నారు. జగపతిబాబు కీలకపాత్రలో నటిస్తుండగా.. నాజర్, రావు రమేష్, నరేష్, మురళీశర్మ ఇతర పాత్రల్లో నటిస్తున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3aXb4HO
v

Full Daang Daang Video Song | Sarileru Neekevvaru


Full Daang Daang Video Song | Sarileru Neekevvaru

from BharatStudent - Telugu - Actor Actress|Photo,Picture Galleries|Wallpapers|Screensavers|Movie Trailers|Film News and Gossips https://ift.tt/36GHOlc

ఆ బూతు డైలాగంటే ఇష్టం, డిలీట్ చేయొద్దు: హీరోయిన్ ఏడుపు

చిన్న చిన్న క్యారెక్టర్స్ చేస్తూ ఇండస్ట్రీలో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నారు నందు. ఇప్పుడు ఆయన హీరోగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఆయన కథానాయకుడిగా నటించిన సినిమా ‘సవారి’. సాహిత్ మోత్కూరి సినిమాను డైరెక్ట్ చేశారు. కథానాయికగా నటించారు. అయితే ఈ సినిమాలో ఓ బూతు పదం వాడుతూ ప్రియాంక చెప్పే డైలాగ్ ఒకటి ఉంది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ప్రియాంక ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఆ డైలాగ్ చెప్పింది. ‘ఓ గాడ్. ఐ డోన్ట్ వాంట్ టు లివ్ ఇన్ దిస్ ఫకింగ్ వరల్డ్’ అనేది డైలాగ్. అయితే ఈ సినిమాకు ఇంకా సెన్సా్ర్ సర్టిఫికేట్ రాలేదు. ఒకవేళ సినిమా సెన్సార్‌కు వెళ్తే డైలాగ్‌లోని ‘ఫక్’ అనే పదం తీసేస్తారేమోనని ప్రియాంక భయపడుతున్నారు. ‘‘ఈ సినిమాలో ఇదే నా ఫేవరేట్ డైలాగ్. దేవుడా దయచేసి ఈ డైలాగ్‌ను సెన్సార్ బోర్డు వాళ్లు తీసేయకుండా చూడు’ అని వేడుకుంటున్నారు. ఈ సినిమా మొత్తం నందు, గుర్రం చుట్టూ తిరుగుతుందట. ఇటీవల విడుదలైన పాటలకు మంచి స్పందన వచ్చింది. శేఖర్ చంద్ర అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. READ ALSO:

టీజర్, ట్రైలర్‌కు కూడా మంచి స్పందన వచ్చింది. పాటలు, టీజర్, ట్రైలర్‌తో కలిపి దాదాపు అరగంట నిడివి ఉన్న సినిమా చూపించామని మిగతా రెండు గంటల సినిమాను కూడా కచ్చితంగా ఎంజాయ్ చేస్తారని నందు కాన్ఫిడెంట్‌గా ఉన్నారు. ఈ సినిమా ట్రైలర్ గురించి నందు భార్య, గాయని గీతామాధురి సోషల్ మీడియాలో స్పందించారు. ట్రైలర్‌లో భర్తను డ్రాయర్‌లో చూసి ఆశ్చర్యపోయారు. ట్రైలర్ చూస్తూ నోరెళ్లబెట్టారు. ‘‘లాస్ట్ లో నేను ఎందుకు అంత షాక్ అయ్యానో తెలియాలి అంటే పక్కాగా ఈ లింక్‌ను క్లిక్ చేయాలి. వామ్మో’’ అని ట్రైలర్ లింక్‌ను ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశారు. ఫిబ్రవరి 7న సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. READ ALSO:


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3aTorJ9
v

ఎన్టీఆర్ తండ్రిగా బాలయ్య? అభిమానులకు పండగే..!

ఫ్యాన్స్ కలను మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ నెరవేర్చబోతున్నారా? ఇప్పటివరకు ఏ దర్శకుడు సాధించలేకపోయింది.. త్రివిక్రమ్ సాధించగలరా? దేని గురించి అనుకుంటున్నారా. యంగ్ టైగర్ ఎన్టీఆర్, నటసింహ నందమూరి బాలకృష్ణ కాంబినేషన్ గురించి. తారక్ మరోసారి త్రివిక్రమ్‌తో కలిసి పనిచేయబోతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాలో ఎన్టీఆర్ తండ్రి పాత్రలో బాలయ్యను ఎంపికచేసుకోవాలని త్రివిక్రమ్ అనుకుంటున్నారట. ఇప్పటివరకు వీరిద్దరూ కలిసి ఏ సినిమాలో నటించలేదు. అలాంటిది త్రివిక్రమ్ సినిమా కోసం బాలయ్య వస్తారన్న ఆశలు కూడా ఫ్యాన్స్‌లో లేవు. దాంతో కనీసం ఎన్టీఆర్‌తో కలిసి నటించే అవకాశం లేకపోయినా బ్యాక్‌డ్రాప్ సన్నివేశాల్లో బాలయ్య కనిపించినా చాలని త్రివిక్రమ్ అనుకుంటున్నారట. అంటే ఎన్టీఆర్ చిన్నప్పటి క్యారెక్టర్‌కు బాలయ్య తండ్రిగా వ్యవహరించే అవకాశాలు ఉన్నాయన్నమాట. ఒకవేళ ఇది నిజం అయితే.. ఫ్యాన్స్ చాలా డిసప్పాయింట్ అవుతారు. READ ALSO: ఎందుకంటే బాలయ్య, ఎన్టీఆర్‌ను స్క్రీన్‌పై చూడాలని అభిమానుల ఆశ. వాళ్లిద్దరూ కలిసి నటించే సీన్స్ లేనప్పుడు బాలయ్య సినిమాలో నటించడం కూడా వృథా అని పలువురి అభిప్రాయం. అయితే ఈ రూమర్స్‌లో ఎంత నిజం ఉందనేది తెలీదు. ప్రస్తుతం తారక్ ‘ఆర్ ఆర్ ఆర్’ సినిమాతో బిజీగా ఉన్నారు. వేసవిలో త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమా షూటింగ్ మొదలుపెడతారు. READ ALSO:


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2GBToni
v

Wednesday 29 January 2020

NTR: ఆ హీరోలకూ తారక్ లాంటి ఫ్యాన్స్ ఉంటే.. చలపతిరావు కామెంట్స్

అభిమానుల యందు యంగ్ టైగర్‌ ఎన్టీఆర్‌ ఉన్న అభిమానులు వేరనే చెప్పాలి. తారక్ కోసం ఎంత దాకానైనా వెళ్తారు. ఎన్ని మంచి కార్యక్రమాలైనా చేపడతారు. తారక్ పేరుతో ఆయన ఫ్యాన్స్, ఫాలోవర్స్ ‘తారక్ టీం ట్రస్ట్ ఛారిటీ’ అనే సంస్థను ఏర్పాటుచేశారు. తెలుగు రాష్ట్రాలతో పాటు కొన్ని ఇతర రాష్ట్రాల్లోని జిల్లాల్లో ఫ్యా్న్స్ అంతా ఏకమై అనాథాశ్రమాలకు, వృద్ధాశ్రమాలకు, పేదలకు అన్నదాన కార్యక్రమాలు ఏర్పాటుచేయడం, వారికి అనారోగ్య సమస్యలు ఉంటే చందాలు వసూలు చేసి చికిత్సలు నిర్వహించడం వంటివి చేస్తుంటారు. ఈ ట్రస్ట్ పెట్టి నేటికి ఏడాది కావొస్తోంది. ఈ ఏడాదిలో తారక్ ఫ్యాన్స్ 33 ఈవెంట్స్ చేశారు. ఈ సందర్భంగా ప్రముఖ నటుడు చలపతిరావు తారక్ ఫ్యాన్స్ చేస్తున్న మంచి పనిని ఉద్దేశిస్తూ.. ‘‘నాకు చాలా సంతోషంగా ఉంది. ఎక్కడెక్కడో ఉద్యోగాలు చేస్తూ, చదువుకుంటూ మా తారక్ గాడి పేరు మీద ఓ టీంగా ఏర్పడి సేవా కార్యక్రమాలు చేస్తూ ఇప్పటివరకు 33 ఈవెంట్స్ చేశారంటే చాలా ఆనందమేసింది. నా కళ్లు చెమర్చాయి. వృద్ధులు, నడవలేని వారికి భోజనాలు పెట్టడం, దుప్పట్లు పంచడం, అసవరమైన వస్తువులు కల్పించడం.. ఇవన్నీ చూస్తుంటే మా తారక్ గాడి జన్మ ధన్యమైంది. ఆర్టిస్ట్ అవ్వడం గొప్ప కాదు. ఆ ఆర్టిస్ట్ పేరుతో ఇన్ని సేవా కార్యక్రమాలు చేసే ఫ్యాన్స్ ఉండటం గొప్ప. మా తారక్ తరఫున ఈ యూనిట్ అందరికీ పేరు పేరునా ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నాను’’ READ ALSO: ‘‘ ప్రపంచంలో ఎవ్వరికీ భయపడని వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది పెద్ద గారు. ఆయన ఎవ్వరికీ భయపడలేదు. ఆయన అడుగుజాడల్లో మేం నడుస్తున్నాం. ఆయన చేసిన గుప్తదానాలు ఎవ్వరికీ తెలీదు. నాకు మాత్రమే తెలుసు. ఎందుకంటే అప్పట్లో సోషల్ మీడియా ఉండేది కాదు. కానీ ఈ తరానికి పెద్దన్న జూనియర్ ఎన్టీఆర్ రూపంలో వచ్చారు. తారక్ కూడా ధైర్యవంతుడు. ఎవరు ఎన్ని ఫోన్లు చేసి బెదిరించినా వాడు భయపడడు. ధైర్యంగా తారక్ అభిమానులు ముందుకొచ్చి 33 ఈవెంట్స్ చేశారంటే చాలా గొప్ప విషయం. తారక్ అభిమానులంతా సైనికులులాంటివారు. ఎవ్వరికీ భయపడరు. వారంతా తారక్ అడుగుజాడల్లో నడుస్తున్నారు. తారక్ ఎంత గెట్టోడో వీళ్లూ అంతే గెట్టోళ్లు. తారక్ యంగ్ టైగర్. తాతగారి ఆశయాలను అమలు చేస్తున్నాడు. ఏదన్నా ఉన్నా ధైర్యంగా ఎదుర్కోగలడు. అనుకున్నది చేస్తాడు. ఇదే అందరి హీరోల శిష్యులు చేయగలిగితే బాగుంటుంది. కానీ ఆ మాట నేను అనకూడదు. ఎవరి ఇష్టం వారిది’’ అని తెలిపారు. READ ALSO:


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/36JHna8
v

అశ్లీల వీడియోలు పంపుతున్నారు: పోలీసులకు ఫిర్యాదు చేసిన కరాటే కళ్యాణి

అసభ్య పదజాలంతో వ్యాఖ్యలు, అశ్లీల వీడియోలతో పంపుతూ తనను చిత్రహింసలు పెడుతున్నారని వాపోయారు సినీ నటి . దాంతో ఆమె సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. ఉదయాన్నే ఫోన్‌ చూడాలంటేనే భయం వేస్తోందని తెలిపారు. కొద్దిరోజులుగా గుర్తు తెలియని వ్యక్తులు ఈ పనులు చేస్తున్నారని, కొన్ని నంబర్లను బ్లాక్‌ చేసినా వేరే ఫోన్‌ నంబర్ల ద్వారా వీడియోలు పంపుతున్నారని ఆమె వివరించారు. తన వ్యక్తిగత జీవితానికి భంగం కలిగేలా ప్రవరిస్తున్నారని, కొన్నింటిలో తన ఫొటోలను మార్ఫింగ్‌ చేసి సామాజిక మాధ్యమాల్లో అప్‌లోడ్‌ చేస్తున్నారంటూ తెలిపారు. వీరిపై చర్యలు తీసుకోవాలని పోలీస్‌ అధికారులను అభ్యర్థించారు. క్రైస్తవ సంఘాల ప్రతినిధుల పేరుతో కొద్దిరోజుల నుంచి పలువురు హిందువుల మనోభావాలను రెచ్చగొట్టే విధంగా యూట్యూబ్‌, ఫేస్‌బుక్‌లలో కథనాలు, వీడియోలను అప్‌లోడ్‌ చేస్తున్నారని కరాటే కళ్యాణి పోలీసులకు వివరించారు. READ ALSO: ఓ యూట్యూబ్ ఛానెల్ నిర్వాహకులతో కలిసి కొన్ని రోజుల క్రితం కరాటే కళ్యాణి ఓ డిబేట్‌లో పాల్గొన్నారు. హిందువులు పవిత్రంగా భావించే కొన్ని పేర్లను వాడుకుని బూతు చేష్టలు చేస్తున్నారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. హిందువుల మనోభావాలు దెబ్బతినేలా పేర్లు పెట్టకూడదని, కావాలంటే ముస్లిం, క్రైస్తవ పేర్లు పెట్టుకోండి అంటూ యూట్యూబ్ ఛానెల్ నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో కరాటే కళ్యాణికి సైబర్ వేధింపులు ఎదురైనట్లు తెలుస్తోంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3aTwGFe
v

నడుం పట్టుకోవాలని చూశాడు వేలు విరిచేసా: తాప్సి

సినీ నటి తాప్సికి ఓ ఆకతాయి నుంచి చేదు అనుభవం ఎదురైందట. పబ్లిక్ ప్లేసెస్‌లో ఇలాంటి ఆకతాయి చేష్టలు సర్వ సాధారణమే. కానీ తాప్సికి మాత్రం పవిత్రమైన పుణ్యస్థలంలో వేధింపులు ఎదురయ్యాయట. ఈ విషయాన్ని ఆమె ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ‘‘గురునానక్ జయంతి రోజున నేను ఫ్యామిలీతో కలిసి కచ్చితంగా గురుద్వారకు వెళ్తాను. గతేడాది కూడా వెళ్లాను. అక్కడ భక్తులకు భోజనాలు వడ్డిస్తుంటాం. ఆ సమయంలో ఇసుకేస్తే రాలనంత జనం వస్తాను. దాంతో ఒకర్నొకరు ఢీకొట్టుకుంటూ ఉంటారు. ఓసారి నాకు చేదు అనుభవం ఎదురైంది. నేను ఆ గుంపులో నడుచుకుంటూ వెళ్తుంటే ఓ ఆకతాయి నా నడుం పట్టుకోవాలని చూశాడు. అతని ఉద్దేశం నాకు అర్థమైంది. ఎలా బుద్ధిచెప్పాలో ముందే ఆలోచించి పెట్టుకున్నాను. అతని వేలు పట్టుకుని విరిచేశాను. దాంతో వాడు విలవిలలాడుతూ పక్కకు వెళ్లిపోయాడు. నేను కూడా అక్కడి నుంచి వేగంగా వెళ్లిపోయాను’ అని తెలిపారు. READ ALSO: ప్రస్తుతం చేతిలో చాలా ఆసక్తికరమైన ప్రాజెక్ట్స్. టీమిండియా మహిళా కెప్టెన్ మిథాలీ రాజ్ బయోపిక్‌లో తాప్సి నటిస్తున్నారు. నిన్న ఈ సినిమా ఫస్ట్‌లుక్ విడుదలైంది. మిథాలీగా తాప్సి చాలా బాగా కనిపించారు. దీంతో పాటు ఆమె ‘తప్పడ్’, ‘రాకెట్ రష్మి’ సినిమాలతోనూ బిజీగా ఉన్నారు. మంచి మెసేజ్ ఉన్న సినిమాల్లో నటిస్తున్న అతి కొద్ది మంది హీరోయిన్లలో తాప్సి ఒకరు. ఆమె సినిమా రంగానికి చేస్తున్న సేవకు గానూ త్వరలో పద్మశ్రీ అందుకున్నా కూడా ఆశ్చర్యపోనక్కర్లేదు. READ ALSO:


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2REgOyC
v

Coronavirus Effect: ఎయిర్‌పోర్ట్‌లో ఫ్యాన్స్‌ని చూసి భయపడిన సన్నీ లియోనీ

బాలీవుడ్ బ్యూటీ తన ఫ్యాన్స్‌ని ఎప్పుడూ నిరుత్సాహపరచదు. ఎయిర్‌పోర్ట్‌లలో, ఈవెంట్స్‌లో, సినిమా ప్రమోషన్స్ సమయంలో ఇలా సన్నీ ఎక్కడికి వెళ్లినా ఫ్యాన్స్ సెల్ఫీల కోసం ఎగబడుతుంటారు. వారి ప్రేమను అర్థం చేసుకుని సన్నీ కూడా సెల్ఫీలు ఇచ్చేందుకు వెనుకాడరు. అయితే నిన్న మాత్రం సన్నీ ఫ్యాన్స్‌కి వింత అనుభవం ఎదురైంది. విహారయాత్ర నుంచి తన భర్త డేనియల్ వెబర్‌తో కలిసి సన్నీ ముంబయిలో అడుగుపెట్టారు. అక్కడ ఫ్యాన్స్ సన్నీతో సెల్ఫీ దిగాలని ఎదురుచూస్తున్నారు. ఎప్పుడూ ఫ్యాన్స్‌ని ఆప్యాయంగా పలకరించే సన్నీ ఈసారి మాత్రం వారిని దూరంపెడుతున్నట్లు ప్రవర్తించారు. ఇందుకు కారణం ప్రపంచాన్ని హడలుకొడుతున్న కరోనా వైరసే. అవును, అసలే చైనాలో ఈ వైరస్ బారిన పడి దాదాపు వంద మందికి పైగా చనిపోయారు. ఈ వైరస్ భారత్‌లోనూ వ్యాపించే ప్రమాదం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. అదీ కాకుండా వివిధ దేశాల నుంచి వచ్చే ప్రజలంతా ఎయిర్‌పోర్ట్‌లోనే తిరుగుతుంటారు. అందుకే సన్నీ ఫ్యాన్స్ సెల్ఫీ కావాలని అడిగినప్పుడు కాస్త వెనుకడుగు వేశారు. అయినా కూడా ఓ యువతి సెల్ఫీ కోసం సన్నీ వద్దకు వెళ్లగానే సన్నీ వెంటనే తన వద్ద ఉన్న మాస్క్‌తో ముక్కు, నోరు మూసేసుకున్నారు. దాంతో పక్కనే ఉన్న మరో మహిళ కోపంతో సెల్ఫీ దిగకుండానే వెళ్లిపోయారు. READ ALSO: అయితే తాను ఫ్యాన్స్‌తో అలా ప్రవర్తించినందుకు ఏమాత్రం బాధపడటంలేదని సన్నీ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా వెల్లడించారు. ‘‘చుట్టుపక్కల జరుగుతున్న విషయాలపై అవగాహన పెంచుకోండి. తగిన జాగ్రత్తలు తీసుకోండి. కొరోనా వైరస్ మనకు ఎందుక వస్తుంది అని మాత్రం అనుకోకండి. స్మార్ట్‌గా ఉండండి, సేఫ్‌గా ఉండండి’ అని పేర్కొంటూ తన భర్తతో కలిసి దిగిన ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2U8vMic
v

Racha Racha | Street Dancer 3D


Racha Racha | Street Dancer 3D

from BharatStudent - Telugu - Actor Actress|Photo,Picture Galleries|Wallpapers|Screensavers|Movie Trailers|Film News and Gossips https://ift.tt/2Gy9cr7

సీనియర్ నటికి యాక్సిడెంట్.. చనిపోతే బాగుండు అంటూ పోస్ట్

ప్రముఖ బాలీవుడ్ నటి వారం రోజుల క్రితం రోడ్డు ప్రమాదంలో గాయపడిన సంగతి తెలిసిందే. పుణె- ముంబై హైవేపై వేగంగా వెళుతున్న ఆమె కారు ముందున్న ట్రక్కును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో షాబానాకు, డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే అక్కడి స్థానికులు వారిని హుటాహుటిన నవీ ముంబైలోని ఎంజీఎం హాస్పిటల్‌కు తరలించారు. ఆ తర్వాత మెరుగైన ట్రీట్మెంట్ కోసం కోకిలా బెన్ హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. కొన్ని రోజుల పాటు షబానా ఐసీయూలో ఉన్నారు. ఎందరో సినీ ప్రముఖులు షబానాను పరామర్శించేందుకు హాస్పిటల్‌కు వెళ్లారు. READ ALSO: షబానా త్వరగా కోలుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ కూడా ట్విటర్ ద్వారా వెల్లడించారు. అయితే ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన ఓ ప్రభుత్వ పాఠశాల టీచర్ షబానాపై ఫేస్‌బుక్‌లో అభ్యంతకర పోస్ట్ పెట్టారు. ‘షబానా చస్తే బాగుండు’ అన్నది ఓ పోస్ట్ సారాంశం. షబానాకు ఆ టీచర్‌కు మధ్య ఏం విభేదాలు ఉన్నాయో తెలీదు కానీ ఈ విషయం అధికారుల దృష్టికి వచ్చింది. దాంతో ఆ టీచర్‌ను వెంటనే సస్పెండ్ చేసేశారు. ఎందుకు షబానా చావు కోరుకోవాలని అనుకుంటోందో తెలుసుకునేందుకు యత్నిస్తున్నట్లు ఉత్తర్‌ప్రదేశ్ పోలీసులు తెలిపారు. ప్రస్తుతం షబానా కోలుకుంటున్నారు. ఆమె ఐసీయూలోనే ఉన్నారు కానీ ఆరోగ్యం బాగానే ఉందని షబానా భర్త జావేద్ అక్తర్ తెలిపారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/37FF0Gj
v

సమంతకు స్టూడెంట్ లవ్ లెటర్, ‘మీ అమ్మ తిడుతుంది’ అంటూ సామ్..

అక్కినేని కోడలు సోషల్ మీడియాలో యమా యాక్టివ్ అన్న విషయం తెలిసిందే. తన సినిమా అప్డేట్స్‌తో పాటు పర్సనల్ విషయాలను షేర్ చేసుకుంటూ అభిమానులకు ఎప్పుడూ టచ్‌లో ఉంటుంది. పలు సందర్భాల్లో అభిమానులు అడిగే వివిధ ప్రశ్నలకు చమత్కారంగా సమాధానాలు ఇస్తూ వైరల్ అవుతూ ఉంటుంది. అభిమానులతో తరచూ ఇంట్రాక్ట్ అయ్యే అక్కినేని కోడలికి లవ్ ప్రపోజ్‌లు చాలానే వస్తుంటాయి. అయితే వాటిని లైట్ తీసుకున్న సమంతకు తాజాగా ఓ స్టూడెంట్‌ నుండి లవ్ ప్రపోజ్ వచ్చింది. అలాంటి ఇలాంటి లవ్ ప్రపోజ్ కాదు.. అదిరిపోయే లవ్ ప్రపోజ్.. కావడంతో సమంత రియాక్ట్ అయ్యింది. తాజాగా సమంత తమిళ బ్లాక్ బస్టర్ హిట్ మూవీ ‘96’ రీమేక్‌లో నటిస్తోంది. ఈ చిత్రాన్ని తెలుగులో ‘జాను’ పేరుతో రూపొందిస్తున్నారు. ఈ చిత్రంలో సమంతకు జోడీగా శర్వానంద్ నటించారు. ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా బుధవారం నాడు ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా ‘జాను’ విపరీతంగా నచ్చేయడంతో ఓ అభిమాని ‘సామ్ ఐ లవ్ యు.. జాను ఐ లవ్ యు’ అంటూ.. ఏకంగా మూడు గంటల పాటు పుస్తకంలో ప్రేమలేఖ రాసేశాడు. దాన్ని వీడియో తీసి సమంతకు చేరేలా ట్యాగ్ చేసి ట్విట్టర్‌లో వదిలిపెట్టాడు. ఆ ప్రేమలేఖ సోషల్ మీడియా పుణ్యాన సమంతకు చేరడంతో ఆ అమర ప్రేమికుడికి తిరిగి తన సందేశాన్ని పంపించింది. ‘హో.. ఖచ్చితంగా మీ మమ్మీ నన్ను తిడుతుంది.. నీ అభిమానానికి థాంక్స్‌.. ముందు చదువుకోమ్మా’ అంటూ ఆ విద్యార్ధికి ఫన్నీ ఆన్సర్ ఇస్తూ లవ్ సింబల్ ఎమోజీని షేర్ చేసింది సమంత. ఇంతకీ ఆ ప్రేమికుడు ట్విట్టర్ పేజ్‌ కూడా సృసామ్ అనే పెట్టుకోవడం విశేషం. మొత్తానికి ఎలాగైతే నేం.. మనోడి ప్రేమలేఖ సమంతకు చేరింది.. అక్కడికే సంతోషపడు బ్రో.. అంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2O8Uo6i
v

Chiranjeevi: అమ్మపుట్టినరోజు.. ‘అంజనీ’పుత్రుడు సెల్ఫీ

తల్లి అంజనీదేవి అంటే ఈ అంజనీ పుత్రుడు చిరంజీవికి అమితమైన ప్రేమ. తెలుగు సినిమా ఇండస్ట్రీకి మకుటం లేని మహరాజుని అందించిన ఈ అంజనీదేవి పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా తన తల్లితో కలిసి బర్త్ డే వేడుకలను నిర్వహించుకున్నారు మెగాస్టార్ . తన తల్లితో కేక్ కట్ చేయించి.. సెల్ఫీ దిగి కుటుంబంతో కలిసి ఆనందగా గడిపారు మెగాస్టార్ చిరంజీవి. ఈ ఫొటోలను మెగాడాటర్ నిహారిక తన ఇన్ స్టాగ్రామ్ ద్వారా మెగా అభిమానులకు షేర్ చేసి ఆనందాన్ని పంచుకున్నారు. ఈ ఫొటోలలో చిరంజీవి, ఆయన భార్య సురేఖ, పెద్ద కూతురు సుస్మితతో పాటు మెగా సిస్టర్స్ కూడా కనిపించారు. కాగా ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి కొరటాల దర్శకత్వంలో ఓ భారీ బడ్జెట్ మూవీ చేస్తున్నారు. ఈ చిత్రానికి రామ్ చరణ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/315TE7C
v

Jaanu: 96 రీమేక్ అంటే భయపడి దిల్ రాజుకి నో చెప్పేశా.. కాని!!: సమంత

శర్వానంద్, హీరో హీరోయిన్లుగా నటించిన ‘జాను’ మూవీ ట్రైలర్‌ను బుధవారం నాడు విడుదల చేసింది చిత్ర యూనిట్. తమిళ్‌లో సంచలన విజయాన్ని నమోదు చేసిన విజయ్ సేతుపతి, త్రిష కాంబో మూవీ ‘96’ను తెలుగులో ‘జాను’ పేరుతో రీమేక్ చేశారు. ఈ మూవీ ట్రైలర్‌ను లాంఛ్ ఈవెంట్‌ను బుధవారం నాడు హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ ట్రైలర్ లాంచ్‌లో , సమంత, దిల్ రాజు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సమంత మాట్లాడుతూ.. ‘దిల్ రాజుగారు 96 సినిమాను రీమేక్ చేస్తున్నారని తెలియక ముందే తమిళ్‌లో చూశాను. అయితే దిల్ రాజు గారు మా మేనేజర్‌ని కలిసినప్పుడు నేను ఆలోచనలో పడ్డాను. బ్లాక్ బస్టర్ క్లాసిక్‌ని రీమేక్ చేయాలి అంటే.. తమిళ్‌లో త్రిష, విజయ్ సేతుపతిలు అద్భుతమైన పెర్ఫామెన్స్ ఇచ్చారు.. వాళ్లను దృష్టిలో పెట్టుకుని నేను ఈ సినిమా చేయడానికి చాలా భయపడ్డా. కాని నాకు తెలుసు.. నేను దిల్ రాజు గారిని కలిస్తే ఓకే చెప్పేస్తాను అని.. అందుకే చాలా రోజుల వరకూ ఆయన్ని కలవకుండా నో.. నో అంటూ వచ్చా. దిల్ రాజుతో మాట్లాడితే కాన్ఫిడెంట్ వచ్చేస్తోంది. ఎందుకంటే నేను హైదరాబాద్‌లో అడుగుపెట్టిందే శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ ఆఫీస్‌లో. నా ప్రయాణం అక్కడ నుండే ప్రారంభమైంది. ఈ విషయంలో నేను దిల్ రాజు గారికి థాంక్స్ చెప్పాలి. ఈ సినిమాలో నాతో పాటు శర్వానంద్ చేస్తున్నారన్నప్పుడు ఇంకా కాన్ఫిడెంట్ పెరిగింది. షూటింగ్ ప్రారంభమైన తరువాత ఒక్కరోజు కూడా కష్టపడకుండా లేము. ఎందుకంటే.. ప్రతి సీన్‌లోనూ మ్యాజిక్ జరిగాలి అన్నట్టుగానే పనిచేశాం. పాత్రలో పరకాయ ప్రవేశం చేయడానికి చాలా కష్టపడ్డాం. ఈ సినిమాతో నాకు మంచి పేరు వస్తుంది అంటే.. అది కేవలం శర్వానంద్‌తో నా రిలేషన్ షిప్ ఆన్ స్క్రీన్‌పైనే కాకుండా ఆఫ్ స్క్రీన్‌లోనూ బాగా వర్కౌట్ కావడమే. ప్రతి సీన్ గురించి ఇద్దరం బాగా డిస్కస్ చేసేవాళ్లం. నేను అందరికీ ఎందుకు థాంక్స్ చెప్తున్నానంటే ఆల్రెడీ నా సెన్స్ చెప్తుంది ఈ సినిమా మంచి విజయం సాధిస్తుందని. తప్పకుండా మ్యాజిక్ జరిగిందనే నమ్ముతున్నాం’ అంటూ చెప్పుకొచ్చారు సమంత.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2U55NYT
v

96 Remeke ‘జాను’ ట్రైలర్ టాక్: రేయ్.. అసలేం జరుగుతోందిరా అక్కడా?

‘‘ఎగిసిపడే కిరటాల్లో ఎదురుచూసే సముద్ర తీరాన్ని నేను. పిల్లగాలి కోసం ఎదురుచూసే నల్లమబ్బులా.. ఓర చూపు కోసం.. నీ దోర నవ్వు కోసం.. రాత్రంతా చుక్కలు లెక్కపెడుతుంది నా హృదయం. నా వైపు నీ చూపు అప్పు ఈయలేవా” అంటూ ఎమోషనల్ టచ్‌తో శర్వానంద్, సమంతల ‘జాను’ ట్రైలర్ విడుదలైంది. విజయ్ సేతుపతి, త్రిష హీరో హీరోయిన్లుగా నటించిన తమిళ బ్లాక్ బస్టర్ మూవీ ‘96’ను తెలుగులో జాను పేరుతో రీమేక్ చేస్తున్నారు. దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా.. ఒరిజినల్ వెర్షన్‌ను డైరెక్ట్ చేసిన సి. ప్రేమ్ కుమార్ తెలుగులోనూ దర్శకత్వం వహిస్తున్నారు. ఇక ఈ ట్రైలర్ విషయానికి వస్తే.. మంచి ఎమోషనల్ ఫీల్తో ఒరిజినల్ ఫ్లేవర్‌కు ఏమాత్రం తగ్గకుండా శర్వానంద్, సమంతలు జీవించేస్తున్నారు. టీనేజ్ లవ్ స్టోరీతో మొదలైన ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకునే విధంగా ఉంది. ‘నువ్ వర్జినేనా అని సమంత అడగడం.. ఛీ ఛీ ఏం మాట్లాడుతున్నావ్ జాను’ శర్వానంద్ తెగ సిగ్గుపడిపోవడం యూత్‌కి కనెక్ట్ అయ్యే విధంగా ఉంది. “ఒక్కోసారి జీవితంలో ఏమీ జరగకపోయినా.. ఏదో జరగపోతుందని మనసుకి మాత్రం ముందే తెలుస్తుంది” అంటూ సమంత చెప్పే డైలాగ్.. ‘పదినెలలు మోసి కన్న మీ అమ్మకు నువ్ సొంతం అయితే.. ఇన్నాళ్లుగా మనసులో మోస్తున్న నాకు కూడా సొంతమే’ అని శర్వానంద్ చెప్పే డైలాగ్ ఎమోషనల్‌గా కనెక్ట్ అయ్యే విధంగా ఉంది. ఊహలే ఊహలే నినువీడవులే అంటూ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ ట్రైలర్‌కు హైప్ ఇచ్చే విధంగా ఉంది. గోపీ సుందర్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్, మహేందరన్ జయరాజు సినిమాటోగ్రఫీ బాగుంది. ఓవరాల్‌గా ‘96’ చిత్రానికి రీమేక్ కాబట్టి.. ఆ సినిమాతో పోలిక తప్పనిసరి అయితే.. సమంత, శర్వానంద్‌లు నటనలో విజయ్ సేతుపతి, త్రిషలను బీట్ చేయలేకపోయారనే ఫీల్ అయితే కలుగుతుంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2U7cB8c
v

Freak Out Song - Making | Disco Raja


Freak Out Song - Making | Disco Raja

from BharatStudent - Telugu - Actor Actress|Photo,Picture Galleries|Wallpapers|Screensavers|Movie Trailers|Film News and Gossips https://ift.tt/36uwIzS

Jaanu Trailer


Jaanu Trailer

from BharatStudent - Telugu - Actor Actress|Photo,Picture Galleries|Wallpapers|Screensavers|Movie Trailers|Film News and Gossips https://ift.tt/2tR5kim

World Famous Lover: ‘బొగ్గుగనిలో’.. విజయ్, కేథరిన్ ప్రేమపాట

‘’ టీజర్, పోస్టర్స్‌తో సినిమాపై అంచనాలు పెంచేశారు టాలీవుడ్ సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ. క్రాంతి మాధవ్‌ దర్శకత్వంలో వస్తున్న ఈ మూవీలో విజయ్‌కి జోడిగా రాశీ ఖన్నా, ఐశ్వర్యా రాజేష్‌, కేథరిన్‌ థ్రెస్సా, ఇసాబెల్లాలు హీరోయిన్లుగా నటించారు. ఈ మూవీ ప్రమోషన్స్‌ను వేగవంతం చేస్తూ ఈ చిత్రం నుండి బుధవారం నాడు ‘బొగ్గుగనిలో’ అనే సాంగ్‌ను విడుదల చేశారు. నిరాంజ్ సురేష్ ఈ పాటను ఆలపించగా.. రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించారు. తెల్లతోలురా.. అందగత్తెరా ఏసెయ్ కత్తెరా’ అంటూ బొగ్గుశీను మేడమ్ స్మితను ప్రేమ ముగ్గులోకి దించుతున్నట్టుగా సాంగ్‌లో చూపించారు. నలుగురు లవర్స్ లుక్స్‌ను ఒక్కొక్కటిగా విడుదల చేసి సినిమాపై హైప్ తీసుకురాగా.. ఈ చిత్రంలో విజయ్‌కి మూడో లవర్‌గా హీరోయిన్ కేథరిన్ నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో స్మిత పాత్రలో బొగ్గుగని శీను(విజయ్)‌కి మేడమ్‌గా నటిస్తోంది కేథరిన్. బొగ్గుగని యూనియన్ లీడర్ శీను పాత్రలో విజయ్ దేవరకొండ నటిస్తోంది. ఈ ఇద్దరి మధ్య ‘బొగ్గుగనిలో రంగుమణిరా’ అంటూ బ్యూటిఫుల్ రొమాంటిక్ బీట్ అందించారు గోపీ సుందర్. క్రియేటివ్‌ కమర్షియల్స్‌ బ్యానర్‌పై సీనియర్‌ నిర్మాత కేయస్ రామారావు సమర్పణలో ఏ వల్లభ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ప్రేమికుల దినోత్సవం కానుకగా ఫిబ్రవరి 14న ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు ‘వరల్డ్ ఫేమస్ లవర్’.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/37Epfzx
v

ఇప్పుడున్న పరిస్థితిలో చిరు అన్నయ్య టైటిల్ వాడుకుంటున్నా: శ్రీకాంత్

1991లో కెరీర్‌ను ప్రారంభించి ఇప్పటికీ తన సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్నారు సినీ నటుడు శ్రీకాంత్. ఇండస్ట్రీలో ఎందరో హీరోలు కాస్త బ్రేక్ తీసుకుని సెకెండ్ ఇన్నింగ్స్ మొదలుపెడుతున్నారు కానీ మాత్రం బ్రేక్ తీసుకోకుండా ఏడాదికో సినిమా చేస్తూ వస్తున్నారు. 2019లో ‘మార్షల్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన శ్రీకాంత్ ఇప్పుడు మరో థ్రిల్లింగ్ మూవీలో నటిస్తున్నారు. ఈ సినిమాకు మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘మరణ మృదంగం’ అనే టైటిల్‌నే పెట్టారు. సినిమా త్వరలో విడుదల కాబోతోందని తాజాగా శ్రీకాంత్ ప్రెస్ మీట్ పెట్టి వెల్లడించారు. READ ALSO: ‘‘మల్టీ కలర్ ఫ్రేమ్స్ బ్యానర్‌పై ‘మరణ మృదంగం’ అనే సినిమా చేశాను. ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో అన్నయ్య చిరు టైటిల్‌నే వాడుకున్నాను. అన్నయ్య నటించిన ఈ సినిమాను చాలా సార్లు చూశాను. నాకు చాలా ఇష్టమైన టైటిల్. అదీకాక సినిమా కాన్సెప్ట్‌కు ఈ టైటిల్ యాప్ట్‌గా ఉంటుందని దర్శకుడు, నిర్మాత అనుకున్నారు. వెంకటేష్ అనే కొత్త దర్శకుడు ఈ సినిమాను తీశాడు. అతను చెప్పిన కథ నాకు చాలా నచ్చింది. నేను కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏ కథ చేస్తే బాగుంటుందని అని ఆలోచించి ఒకటికి రెండుసార్లు కథ విని ఓకే చేశాను. మాఫియా, క్రైమ్, థ్రిల్లింగ్ అంశాలు అన్నీ ఉంటాయి. దీంతో రెండు డ్యుయల్ రోల్స్ చేస్తున్నాను. సినిమా ఓపెనింగ్‌కి వచ్చిన అనిల్ రావిపూడి, కోదండరామిరెడ్డికి ధన్యవాదాలు. మాకు ప్రేక్షకుల ఆశీర్వాదాలు కావాలి’ అని తెలిపారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2RWIXzX
v

Tuesday 28 January 2020

ఆయనతో ఉంటే నేను సేఫ్‌గా ఉంటాను: రేణు దేశాయ్

చాలాకాలంగా సినిమాలకు దూరంగా ఉన్నారు సినీ నటి రేణూ దేశాయ్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో విడిపోయాక తన ఇద్దరు పిల్లలను తీసుకుని పుణెలో స్థిరపడిపోయారు. ఆ తర్వాత పలు డ్యాన్స్ రియాల్టీ షోలకు జడ్జ్‌గా వ్యవహరించారు. ఇటీవల రేణు మెగా ఫోన్ పట్టారు. రైతుల నేపథ్యంలో ఓ సినిమాను డైరెక్ట్ చేయబోతున్నట్లు వెల్లడించారు. అయితే ప్రముఖ నిర్మాత రాజ్ కందుకూరి కుమారుడు శివ కందుకూరి ‘చూసి చూడంగానే’ సినిమాతో హీరోగా పరిచయం కాబోతున్నారు. త్వరలో ఈ సినిమా విడుదల కానుంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకను నిన్న ఘనంగా నిర్వహించారు. వేడుకకు రేణు అతిథిగా వెళ్లారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ‘‘ఈ సినిమాలోని ఓ పాటను నా చేత విడుదల చేయించినందుకు చాలా సంతోషంగా ఉంది. నాకు ఎంతో ఇష్టమైన అనంత్ శ్రీరామ్, చిన్మయి ఈ పాటకు కలిసి పనిచేశారు. రాజ్ కందుకూరి సినిమాను నిర్మించారు. ఇంకా మాట్లాడొచ్చా. బహుశా సుమ గారి అనుమతి తీసుకుని మాట్లాడాలేమో. మున్ముందు అన్ని చిత్ర పరిశ్రమల్లో మహిళా దర్శకులు, టెక్నీషియన్లు రావాలి. వారికి సినిమా పరిశ్రమలో ఎలాంటి చేదు అనుభవాలు ఎదురుకాకుండా చూసుకోవాలి. ఏ ఫీమేల్ టెక్నీషియన్ అయినా రాజ్ కందుకూరితో కలిసి పనిచేస్తే ఆమె చాలా సేఫ్‌గా ఉంటారు అని నేను గర్వంగా చెప్పగలను’’ READ ALSO: "‘చూసి చూడంగానే’ సినిమాలో రాజు గారు నాకు తల్లి పాత్రలో నటించే అవకాశం ఇచ్చారు. కానీ ఆ సమయంలో నాకు ఒంట్లో బాగోలేదు. దాంతో సినిమా చేయలేకపోయాను. నేను అసలు పాత్ర ఏంటి అని కూడా అడగలేదు. రాజు గారు నిర్మాత అనగానే ఓకే చెప్పేద్దామని అనుకున్నాను. ఆయనతో ఉన్నప్పుడు నేను సేఫ్‌గా ఉంటాను. అలాంటి నిర్మాతలు మన ఇండస్ట్రీకి చాలా అవసరం. ఈ సినిమా మంచి మ్యూజికల్ హిట్ అవుతుందని నేను కచ్చితంగా చెప్పగలను. టీంకి ఆల్ ది బెస్ట్’ అన్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3aQ8xix
v

వర్మ లాజిక్ బెడిసికొట్టింది.. గట్టిగా క్లాస్ పీకిన అధికారి

వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు ఓ అధికారి క్లాస్ పీకారు. మంగళవారం రాత్రి వర్మ తన ట్విటర్‌ ఖాతాలో ఓ వీడియో పోస్ట్ చేశారు. ఓ వ్యక్తి తన ఇంటి పెరడులో ఉన్న జంతువులను గన్నుతో కాలుస్తున్న వీడియో అది. ఈ వీడియోను పోస్ట్ చేస్తూ.. వర్మ దేశ న్యాయవ్యవస్థను ప్రశ్నించారు. ‘ఓ అడవిలో జింకను చంపినందుకు సల్మాన్‌ని పోలీసులు, న్యాయస్థానాలు తరుముతున్నాయి. సల్మాన్‌కు వర్తించిన రూల్స్ ఈ వీడియోలో కనిపిస్తున్న వ్యక్తికి వర్తించవా? అతను తన ఇంటి ముందు భాగంలో ఉన్న జంతువులనే గన్నుతో చంపాలని చూస్తున్నాడు. ఒకవేళ దేశంలో ఇంకా న్యాయం బతికే ఉన్నప్పుడు నా ప్రశ్నకు పోలీసులు, న్యాయస్థానాలు సమాధానాలు చెప్పాలి. సల్మాన్ చేసిన ఒకే ఒక తప్పు ఏంటంటే.. అతను సెలబ్రిటీ అవ్వడం. అందుకే పోలీసులు ఆయన్ను శిక్షించాలని అనుకుంటున్నారు’’ అని పేర్కొన్నారు. READ ALSO: అయితే ఈ వీడియోను చూసిన పర్వీన్ కస్వాన్ అనే ఐఎఫ్‌ఎస్ అధికారి స్పందిస్తూ వర్మకు గట్టిగా క్లాస్ పీకారు. ఆ వీడియో ఇక్కడికి కాదని తెలిపారు. ‘మీరు ఈ ప్రశ్న బంగ్లాదేశ్ పోలీసులను అడగాలి. ఎందుకంటే మీరు పోస్ట్ చేసిన వీడియో ఇండియాలోది కాదు బంగ్లాదేశ్‌ది. కచ్చితంగా చెప్పలంటే చిట్టగాంగ్‌లోని వ్యక్తికి సంబంధించినది’ అని ఏకిపారేశారు. 1990లో ‘హమ్ సాథ్ సాథ్ హై’ సినిమా షూటింగ్ సమయంలో సల్మాన్ రాజస్థాన్‌లోని జోధ్‌పూర్ అడవుల్లో కృష్ణజింకలను వేటాడారు. ఆ సమయంలో అతనితో పాటు సోనాలి బింద్రే, సైఫ్ అలీ ఖాన్, టబు కూడా ఉన్నారు. అయితే జోధ్‌పూర్ న్యాయస్థానం సల్మాన్‌ను దోషిగా తేల్చి మిగిలినవారిని నిర్దోషులుగా తీర్పు వెలువరించింది. సల్మాన్‌కు ఏడేళ్లు కారాగార శిక్ష విధించింది. దాంతో రెండు రాత్రులు సల్మాన్ జోధ్‌పూర్ సెంట్రల్‌ జైల్లో గడిపారు. ఆ తర్వాత ఆయన్ను బెయిల్‌పై విడిపించారు. అయితే తన కేసును మరోసారి పరిశీలించాలని సల్మాన్ జోధ్‌పూర్‌కు చెందిన సెషన్స్ కోర్టులో మరో పిటిషన్ దాఖలు చేసుకున్నారు. కానీ ఆయన ఇప్పటివరకు ఏ ఒక్క వాదనకు హాజరైంది లేదు. READ ALSO:


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/37B2PiN
v

Kangana Ranaut: ‘‘నీ చెత్త స్క్రిప్ట్స్‌‌తో నా చెల్లి సినిమాలు చేయదు.. మాకు దూరంగా ఉండు’’

బాలీవుడ్ నటి సోదరి రంగోలీ మరోసారి నిర్మాత కరణ్ జోహార్‌పై కామెంట్స్ చేశారు. కరణ్ జోహార్‌కు, కంగనకు ఇటీవల భారత ప్రభుత్వం పద్మశ్రీ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కంగనకు శుభాకాంక్షలు చెబుతూ కరణ్ ఓ మాటన్నారు. ‘‘కంగన తాను నటించిన సినిమాలతో తన సత్తాను నిరూపించుకున్నారు. ఆమె పద్మశ్రీకి అర్హురాలే. ఓ ఆర్టిస్ట్‌గా ఆమె ప్రాణం పెట్టి పనిచేస్తారు. ఆ గుణం నాకు చాలా నచ్చుతుంది. కంగనకు సరిపోయే కథ నా వద్ద ఉంటే కచ్చితంగా ఆమెకు ఫోన్ చేయడానికి ఏమాత్రం వెనుకాడను. నాకు, కంగనకు మధ్య శత్రుత్వం ఉంది చాలా మీడియా వర్గాలు రాశాయి. కానీ మేం ఏ ఈవెంట్‌లో కలుసుకున్నా కూడా చక్కగా పలకరించుకుంటాం. ఓ నిర్మాతగా కంగన టాలెంట్ అంటే నాకు గౌరవం. మా గురించి ఎవరు ఎన్ని రకాలుగా రాసినా కంగనతో కలిసి పనిచేయడానికి నేను ఏమాత్రం మొహమాటపడను’’ అని తెలిపారు. READ ALSO: ఈ వ్యాఖ్యలపై రంగోలీ ట్విటర్ ద్వారా స్పందించారు. ‘‘కరణ్ జోహార్ ఎలా మాట్లాడుతున్నారంటే.. ఆయన ఫోన్ చేయగానే కంగన పరిగెత్తుకుంటూ వచ్చేస్తుందన్నట్లు ఫీలవుతున్నారు. మీరు నేను అనుకుంటే అయిపోదు కదా సర్. కంగనకు కూడా స్క్రిప్ట్ నచ్చాలి కదా. కంగనను మెప్పించేంత స్క్రిప్ట్ మీ దగ్గర ఉందా? మీరు తెరకెక్కించిన ‘ఏ దిల్ హై ముష్కిల్’ సినిమాను కంగన చూసింది. అందులో క్యాన్సర్‌తో బాధపడుతున్న అనుష్క శర్మను రణ్‌బీర్ కపూర్ వెంటపడుతుంటాడు. నీకు ఇప్పుడు ఎటూ క్యాన్సర్ ఉంది ఇక నువ్వు నాతోనే ఉండాలి అంటాడు. ఈ సన్నివేశం చూశాక కంగన చాలా సేపటి వరకు షాక్‌లో ఉంది. మీరు ఇలాంటి చెత్త స్క్రిప్ట్స్ తీసుకుని కంగన వద్దకు వస్తే మిమ్మల్ని ఆ భగవంతుడు కూడా కాపాడలేడు. కాబట్టి దయచేసి కంగనకు దూరంగా ఉండండి. అప్పుడే అందరికీ మంచిది’ అని ఏకిపారేశారు. READ ALSO:


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2uJSkew
v

ముళ్లు గుచ్చుకున్నాయంతే.. కంగారేమీలేదు: రజినీకాంత్

సూపర్‌స్టార్ ‘మ్యాన్ వర్సెస్ వైల్డ్’ అనే అడ్వెంచరస్ షూట్‌లో పాల్గొన్నారు. కర్ణాటకలోని బందిపూర్ అడవిలో ప్రముఖ బ్రిటిష్ అడ్వెంచరర్ బేర్ గ్రిల్స్‌తో కలిసి ఈ షోలో పాల్గొన్నారు. అయితే షో షూట్ చేస్తుండగా రజినీకాంత్‌కు గాయాలైనట్లు వార్తలు వచ్చాయి. దాంతో ఫ్యాన్స్ ఆందోళన చెందారు. దీనిపై తాజాగా రజినీ సోషల్ మీడియా ద్వారా క్లారిటీ ఇచ్చారు. ‘మ్యాన్ వర్సెస్ వైల్డ్ ఎపిసోడ్‌ షూటింగ్‌ను పూర్తి చేశాను. నాకు గాయాలేమీ అవ్వలేదు. అడవి కాబట్టి ముళ్లు గుచ్చుకుని గీతలు పడ్డాయంతే. నేను బాగానే ఉన్నాను’ అని చెన్నై విమానాశ్రయం వద్ద మీడియా వర్గాలతో రజినీ మాట్లాడారు. త్వరలో ఈ షో డిస్కవరీ ఛానెల్‌లో ప్రసారం అవుతుంది. గతేడాది ఈ ఎపిసోడ్‌లో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ఆ ఎపిసోడ్‌ను డిస్కవరీ ఛానెల్‌లో ప్రసారం చేయగానే 6.1 మిలియన్ మంది వీక్షించారు. ఆ ఛానెల్‌లో ప్రసారం అయిన ఏ ఎపిసోడ్‌ను అంతమంది వీక్షించలేదట. అయితే రజినీకాంత్ షూట్ చేసిన ఎపిసోడ్‌లో హాలీవుడ్ సెలబ్రిటీలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఇకపోతే ప్రస్తుతం రజినీ తన 168వ సినిమాతో బిజీగా ఉన్నారు. సిరుతాయ్ శివ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఖుష్బు, మీన కథానాయికలుగా నటిస్తున్నారు. కీర్తి సురేష్ కలక పాత్ర పోషిస్తున్నారు. సినిమాకు ‘అన్నాత’ అనేే టైటిల్‌ను అనుకుంటున్నట్లు తెలుస్తోంది. తమిళంలో అన్నాత అంటే పెద్దన్న అని అర్థమట.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3aPRNYJ
v

Balakrishna: బాలయ్యకు విలన్‌గా సునీలా? ఏంది బోయపాటి ఇది?

‘రూలర్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన నట సింహ నందమూరి ఇప్పుడు తన తదుపరి సినిమా షూటింగ్‌ను మొదలుపెట్టేశారు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలయ్య ఓ సినిమాలో నటిస్తున్నారు. షూటింగ్ మొదలైపోయింది కూడా. అయితే ఈ సినిమాకు సంబంధించి ఓ ఆసక్తికరమైన టాపిక్ సోషల్ మీడియాలో హల్‌చల్ అవుతోంది. బాలయ్య సినిమాలో విలన్ పాత్ర చాలా కీలకం. బాలయ్యకు సమానంగా ఆ పాత్రను తీర్చిదిద్దుతారు దర్శకులు. అయితే బోయపాటి మాత్రం ఈసారి తప్పులో కాలేస్తున్నారేమో అనిపిస్తోంది. ఎందుకంటే.. ఈ సినిమాలో విలన్‌గా ప్రముఖ కమెడియన్ సునీల్‌ను ఎంపికచేసుకున్నారట. ఇటీవల విడులదైన ‘డిస్కో రాజా’ సినిమాలో సునీల్ ఓరకంగా విలన్ పాత్రనే పోషించారని చెప్పాలి. ఆయనలోని మరో కొత్త కోణాన్ని ప్రేక్షకులకు పరిచయం చేశారు దర్శకుడు వీఐ ఆనంద్. అందుకే విలన్‌గా ఈసారి సునీల్‌ను ఎంపిక చేసుకుంటే ఎలా ఉంటుంది అని బోయపాటి అనుకుంటున్నారట. అదీకాక మొన్న జరిగిన ‘డిస్కోరాజా’ సక్సెస్ మీట్‌లో సునీల్ ఓ మాటన్నారు. ఇకనుంచి తాను కండలుపెంచిన తెలుగు విలన్‌గా తెలుగులోనే కాకుండా ఇతర భాషల్లోనూ పేరు తెచ్చుకోవాలని అనుకుంటున్నట్లు తెలిపారు. కానీ బాలయ్యకు సునీల్ విలన్‌గా సరిపోతారా అనేది టాక్ ఇక్కడ. ఒకవేళ ఏమాత్రం తేడా వచ్చినా మొదటికే మోసం వచ్చేస్తుంది. READ ALSO: మరి బోయపాటి వ్యూహం ఏంటో ఆయనకే తెలియాలి. సినిమాలోని హీరో, విలన్ పాత్రలను బోయపాటి సరికొత్తగా డిజైన్ చేసినట్లు టాలీవుడ్ వర్గాల సమాచారం. బాలయ్యను అఘోరా బాబాగా చూపించనున్నట్లు ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి. బాలయ్య 106వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఏఫ్రిల్‌లో షూటింగ్ కంప్లీట్ చేసి మేలో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్‌లో ‘సింహా’, ‘లెజెండ్‌’ సినిమాలు వచ్చాయి. ఈ రెండూ మంచి విజయం సాధించాయి. READ ALSO:


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2O6YHPI
v

Sivaji: జగన్ గారికి ఆ ఆలోచనలు ఎలా వస్తున్నాయో అర్థంకావట్లేదు

మరోసారి నటుడు ఆపరేషన్ గరుడ అంటూ మీడియా ముందుకు వచ్చారు. ఇప్పటివరకు ఆపరేషన్ గరుడ గురించి తాను చెప్పినవన్నీ చెప్పినట్లే జరుగుతున్నాయని, మున్ముందు కూడా అలాగే జరుగుతుందని తేల్చి చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌కు ముఖ్యమంత్రి అయ్యాక జగన్ గారికి రాజధానిని మార్చాలన్న ఆలోచనలు ఎందుకు వస్తున్నాయో తనకు అర్థం కావడంలేదని వ్యాఖ్యలు చేసారు. ‘నాకు గరుడ పురాణం శివాజీ అనే పేరు ఎందుకు వచ్చిందో నాకే తెలీదు. ఆ పేరు పెట్టిన వారిని అడగాలి. ప్రతీ వ్యక్తికి భావప్రకటనా స్వేచ్ఛ ఉంది. మనకు రాజకీయాలపై మంచి పట్టు ఉంటే మనపై విభిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతుంటాయి. నేను మీడియా ముందుకు వచ్చి సినిమా కథను పంచుకుని ఉంటే అది వేరే విషయం. నాకు వచ్చిన సమాచారాన్నే చెప్పాను. కొమ్మినేని శ్రీనివాస్ నాకు గరుడ పురాణ శివాజీ అని పేరు పెట్టానని నేను అనుకుంటున్నాను. అతనికి ఫోబియా ఉందేమో. ఎవరి అభిప్రాయాలతో ఆయన అంత సులువుగా ఏకీభవించకపోవచ్చు. నేను చెప్పిన గరుడ కథ అంతా చెప్పినట్లుగానే జరుగుతూ ఉంది. ఇప్పుడు సగం జరిగాయి. మిగితా సగం జరిగి తీరుతుంది. ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు నాయుడుగారి పతనం అనేదే లక్ష్యం.’ READ ALSO: ‘చంద్రబాబు నాయుడిని ఈరోజు ఆంధ్రప్రదేశ్ కోల్పోయింది అంటే అది భావితరాల కర్మ. అలాగని నేను చంద్రబాబు రైట్ అనట్లేదు. ఆయన పరిపాలనలోనూ చాలా తప్పులు జరిగాయి. ఒక ప్రభుత్వం ఉన్నప్పుడు తప్పులు జరగకుండా ఎలా ఉంటుంది. తప్పులు జరిగినప్పటికీ అవన్నీ కొందరు వ్యక్తులు చేసినవే. అంతేకానీ చంద్రబాబు తప్పు చేశారంటే నేను ఒప్పుకోను. కానీ జగన్ గారు అవినీతి పరుడు అని నేను ఏ రోజూ చెప్పలేదు. ఆయన తప్పులు రుజువు కానంతవరకు ఆయన నిర్దోషే. చంద్రబాబు నాయుడుగారి పాలనలో మంత్రులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు తప్పులు చేసిన మాట వాస్తవం. అందువల్లే మొన్న ఎన్నికల్లో చంద్రబాబు ఓడిపోయారు అంటే నేను నమ్మను’ ‘ఇప్పుడు జగన్ నాయకత్వంలో, మోదీ, ట్రంప్ నాయకత్వంలో అద్భుతమైన పాలన ఏమైనా నడుస్తోందా? ఇప్పుడు ప్రపంచంలో నడుస్తున్న ఫోబియా ఏంటంటే.. ఎవరు అధికారంలో ఉంటే వాడు తోపు. అలాంటివాళ్లు మీడియాను నాశనం చేస్తారు. వ్యవస్థలను తమకు అనుకూలంగా మార్చుకుంటారు. కేవలం తెలుగు రాష్ట్రాల గురించి మాట్లాడటం లేదు. మొత్తం ప్రపంచం గురించి మాట్లాడుతున్నా. మొత్తానికి ఇక్కడ బలైపోతోంది మాత్రం ప్రజలు. ఏపీలో చంద్రబాబును ఓ పద్ధతి ప్రకారం అధికారం నుంచి లేపేశారు. ఇది నిజం. చాలా నీచమైన స్థితిలో నేడు ప్రజాస్వామ్యం ఉంది. ఇది మారకపోతే భవిష్యత్తు తరాలు నాశనమైపోతాయి. నేను చెప్తున్నా రాసిపెట్టుకోండి’ READ ALSO: ‘ఓసారి బాలీవుడ్ నటుడు ఆమిర్ ఖాన్ దేశంలో అసహనం పెరిగిపోయింది అంటే అన్ని మీడియా వర్గాలు, పార్టీలు తెగ బాధపడిపోయి ఆయన్ను అనరాని మాటలు అన్నాయి. కానీ ఆయన చెప్పిందే నిజం. అత్యంత దృఢమైన బ్యాంకింగ్ వ్యవస్థ ఉన్న దేశం మనది. దాన్ని కూడా తూట్లు పొడుస్తు్న్నారు. దేశంలో మీడియా గొంతు నొక్కేస్తున్నారు. రాజకీయం అంటే ఏంటో తెలీనప్పుడు ఇంట్లో కూర్చోండి. అధికారంలోకి రాగానే జగన్‌ గారికి రకరకాల ఆలోచనలు వస్తున్నాయి. ఆ రాజధాని విషయం ఏంటో నాకు ఇప్పటికీ అర్థంకావడంలేదు. మోదీ తెచ్చిన వ్యవస్థను కూడా జగన్ మార్చేస్తున్నారు. పోనీ జగన్ అనుకున్నదే కరెక్ట్ అనుకుంటే రెఫరెండమ్ ప్రవేశపెట్టచ్చు కదా’’ అని తెలిపారు శివాజీ.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2RVEuxy
v

నిన్నటి బద్ధ శత్రువులు.. నేడు తెగ పొగిడేసుకుంటున్నారుగా!

బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్‌కు, ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్‌కు గణతంత్ర దినోత్సవం రోజున భారత ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ విషయం అటుంచితే.. కంగన, కరణ్ ఇండస్ట్రీలో బద్ధ శత్రువులు అన్న సంగతి కూడా ప్రేక్షకులకు తెలుసు. కరణ్ బంధుప్రీతికి పెట్టింది పేరు అని ఆయన షోలోనే కంగన అవమానించడం సంచలనం రేపింది. అప్పటినుంచి వీరిద్దరి మధ్య మాటల యుద్ధం జరుగుతూనే ఉంది. కంగన సోదరి రంగోలీ కూడా కరణ్ జోహార్‌పై నోటికొచ్చిన కామెంట్స్ చేశారు. అయితే ఇప్పుడు వీరిద్దరికీ పద్మశ్రీ రావడంతో పాత విషయాలన్నీ మర్చిపోయి ఒకరిపై ఒకరు ప్రశంసలు కురిపించుకుంటున్నారు. కరణ్‌కు పద్మశ్రీ రావడంపై కంగన ఏమంటుందో అని బాలీవుడ్ మీడియా ప్రతినిధులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూశారు. కచ్చితంగా అతను పద్మశ్రీకి అర్హుడు కాదు అని అంటుందేమో, మళ్లీ ఈ వార్తల ద్వారా కాస్త టీఆర్పీలు పెంచుకుందామని అనుకున్నారు. కానీ కథ అడ్డం తిరిగింది. కంగన కరణ్‌ను ప్రశంసించారు. READ ALSO: ‘‘కరణ్‌కు నిర్మాతగా దారి చూపించింది అతని తండ్రి యశ్ జోహార్. ఆ తర్వాత కరణే ఇంతటి స్థాయికి చేరుకోగలిగాడు. ఆయనకు పద్మశ్రీ వరించినందుకు శుభాకాంక్షలు’ అని తెలిపారు. ఇప్పుడు కరణ్ జోహార్ వంతు వచ్చింది. కంగన తనను పొగడగానే ఆయన కూడా ఆమెను పొగడ్తలతో ముంచెత్తారు. ‘‘కంగన తాను నటించిన సినిమాలతో తన సత్తాను నిరూపించుకున్నారు. ఆమె పద్మశ్రీకి అర్హురాలే. ఓ ఆర్టిస్ట్‌గా ఆమె ప్రాణం పెట్టి పనిచేస్తారు. ఆ గుణం నాకు చాలా నచ్చుతుంది. కంగనకు సరిపోయే కథ నా వద్ద ఉంటే కచ్చితంగా ఆమెకు ఫోన్ చేయడానికి ఏమాత్రం వెనుకాడను. నాకు, కంగనకు మధ్య శత్రుత్వం ఉంది చాలా మీడియా వర్గాలు రాశాయి. కానీ మేం ఏ ఈవెంట్‌లో కలుసుకున్నా కూడా చక్కగా పలకరించుకుంటాం. ఓ నిర్మాతగా కంగన టాలెంట్ అంటే నాకు గౌరవం. మా గురించి ఎవరు ఎన్ని రకాలుగా రాసినా కంగనతో కలిసి పనిచేయడానికి నేను ఏమాత్రం మొహమాటపడను’ అని తెలిపారు. READ ALSO:


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2RV1TiB
v

Esha Rebba: మంత్రిగారి బైక్‌పై ఈషా రెబ్బా రై రై.. వైరల్ అవుతున్న ఫొటోలు

తెలంగాణ రవాణా శాఖా మంత్రి , తెలుగు బ్యూటీ బైక్ రైడ్ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రవాణా శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన రోడ్డు భద్రత వారోత్సవాలు సోమవారం 27వ తేదీ నుండి ఫిబ్రవరి 2వ తేదీ వరకు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. దీనిలో భాగంగా సోమవారం హెచ్ఎమ్‌డీఏ మైదానంలో వారోత్సవాలను ప్రారంభించారు. ఈ వారోత్సవాల్లో భాగంగా.. రోడ్డు ప్రమాదాల నివారణ కోసం వాహనదారులు భద్రతా నిబంధనలను పాటించాలని వారిలో అవగాహన కల్పించడంలో భాగంగా స్వయంగా మంత్రి పువ్వాడ అజయ్ హెల్మెట్ పెట్టుకుని బైక్ డ్రైవింగ్ చేశారు.. వెనుక సీట్లో హీరోయిన్ ఈషా రెబ్బా కూర్చోవడం విశేషం. రోడ్డు భద్రత అవగాహన ర్యాలీలో అజయ్ కుమార్ మాట్లాడుతూ.. ‘సమాజంలో వాహనాలు, జనాభా సంఖ్య పెరగడంతో విపరీతంగా రోడ్డు యాక్సిడెంట్‌‌లు పెరిగిపోతున్నాయి. వాహనాలు నడిపేటప్పుడు రోడ్డు భద్రత జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల చాలా మంది ప్రమాదాలకు గురవుతున్నారు. ద్విచక్ర వాహన నడిపేటప్పుడు తప్పనిసరిగా హెల్మెంట్‌ను ధరించాలి. కారు తదితర భారీ వాహనాలు నడిపేటప్పుడు సీట్‌ బెల్టులు పెట్టుకొని ప్రయాణం చేయాలి.. మద్యం సేవించి వాహనాలు నడిపితే నడిపేవారితో పాటు ఎదుటివారికి సైతం ప్రమాదాలు సంభవిస్తాయి.. ట్రాఫ్డిక్ రూల్స్ ను పాటిస్తూ ప్రయాణాల్లో అందరికి ఆమోదయోగ్యంగా ఉండే విధంగా వ్యవహరించాలి’ అని సూచించారు. ఈ కార్యక్రమంలో హీరోయిన్ ఈషా రిబ్బా ప్రత్యేక ఆకర్షణ కాగా.. ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ సోమేశ్ కుమార్, ప్రిన్సిపాల్ సెక్రటరీ సునీల్ శర్మ, రవాణా శాఖ కమీషనర్ సందీప్ కుమార్ సుల్తానీయ, హైద్రాబాద్ సిటీ పోలీస్ కమీషనర్ అంజనీ కుమార్ తదితర ఉన్నత అధికారులు పాల్గొన్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3aUECWP
v

Man vs Wild: రజినీకాంత్‌కు గాయాలు.. ఆందోళనలో ఫ్యాన్స్

సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ గాయపడ్డారు. ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ అయిన అడ్వెంచరస్ షో ‘మ్యాన్ వర్సెస్ వైల్డ్’ షూటింగ్‌లో పాల్గొన్న ఆయన అదుపుతప్పి కిందపడటంతో చేతికి గాయమైనట్టు తెలుస్తోంది. కర్ణాటకలోని బందిపూర్ టైగర్ రిజర్వ్‌లో ఈ ప్రోగ్రామ్ షూట్ జరుగుతుండగా.. ఈ ప్రమాదం చోటు చేసుకుంది. దీంతో షూటింగ్‌ను నిలిపివేశారు. బ్రిటన్‌కు చెందిన ప్రముఖ అడ్వెంచరర్ బేర్ గ్రిల్స్‌తో కలిసి రజినీ ఈ ప్రాజెక్ట్ చేస్తుండగా.. రజినీకాంత్ సోమవారమే కర్ణాటక బందిపూర్‌కి చేరుకుని షూట్‌లో పాల్గొన్నారు. ఒప్పందం ప్రకారం మంగళవారం సాయంత్రం 6 గంటల వరకే కర్ణాటక అటవీ శాఖ అధికారులనుండి షూటింగ్‌కి పర్మిషన్ ఉండగా.. రజినీకాంత్ ఈలోపే గాయాలపాలయ్యారు. అయితే రజినీకాంత్ చేతికి మాత్రమే గాయమైందని.. ఫ్యాన్స్ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని డాక్టర్లు చెబుతున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2O5TJ5D
v

Actor John Kottoly: టాలీవుడ్ నటుడు జాన్ కొట్టోలీ ఆకస్మిక మరణం

టాలీవుడ్‌లో తీవ్ర విషాదం నెలకొంది. నటుడు ఆకస్మికంగా కన్నుమూశారు. మను, ఫలక్‌నుమా దాస్ తదితర చిత్రాల్లో నటుడిగా మంచి గుర్తింపు సంపాదించిన జాన్ కొట్టాలీ తీవ్ర గుండెనొప్పితో మంగళవారం నాడు మరణించారు. ఈ దిగ్బ్రాంతికర విషయాన్ని ప్రముఖ దర్శకుడు సాయి రాజేష్ ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. ‘మిస్టర్ అమాయకుడు’, ‘కళాకారుడు’ వంటి లఘు చిత్రాల్లో మంచి నటుడిగా పేరు సంపాదించి సినిమాల్లో తన సత్తా చాటారు. ఇక ఇండస్ట్రీకి సంబంధించిన చాలామంది వ్యక్తులతో జాన్ కొట్టాలీకి మంచి అనుబంధం ఉంది. ఆయన మరణం పట్ల టాలీవుడ్ ప్రముఖులు తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. దర్శకుడు సాయి రాజేశ్‌తో పాటు నటుడు సత్యదేవ్, నటి గాయత్రి గుప్తా తదితరులు తీవ్ర సంతాపాన్ని తెలియజేశారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2U1wptK
v

నాలాంటి అనర్హుడికి పద్మశ్రీ ఎందుకిస్తారండీ: సీనియర్ నటుడి ఏడుపు

బాలీవుడ్‌లో ఎన్నో అద్భుతమైన పాత్రల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు సీనియర్ నటుడు . ఎన్నో ఏళ్లుగా చిత్రపరిశ్రమలో కొనసాగుతున్నప్పటికీ ఆయనకు ఇప్పటివరకు భారత ప్రభుత్వం నుంచి ఎలాంటి గౌరవం దక్కలేదు. కనీసం ఈసారైనా పద్మ పురస్కారం వస్తుందేమో అనుకున్నారు. కానీ రాలేదు. పైగా పాకిస్థాన్‌లో పుట్టి ఇక్కడ సెటిల్ అయ్యి, ఇక్కడి పౌరసత్వం దక్కించుకున్న సింగర్ అద్నాన్ సమీకి పద్మశ్రీకి పురస్కారం వరించింది. ఇప్పటికే దీనిపై చాలా మంది అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఓ నెటిజన్ అన్ను కపూర్ గురించి సోషల్ మీడియాలో ప్రస్తావించారు. ఆయనకు పురస్కారం ఎందుకు ఇవ్వలేదు అని ప్రశ్నించారు. ‘సినిమాల్లో సుప్రసిద్ధులు అయిన గొప్ప హాస్యనటుడు, రేడియో హోస్ట్, ఎందరికో రోల్ మోడల్ అయిన అన్నూ కపూర్ పద్మ పురస్కారానికి అర్హులు కారా? దయచేసి అన్ను కపూర్ అభిమానులు ఆయనకు ఓటెయ్యండి’’ అని పోస్ట్ చేశాడు. దీనిపై అన్ను కపూర్ స్పందించారు. READ ALSO: ‘‘ధన్యవాదాలు. పద్మ పురస్కారాలు అర్హులకే వస్తాయి. నాలాంటి అనర్హుడికి కాదు. ఏదేమైనా మీలాంటి వారు గుర్తుచేసుకున్నారు. నాకు అదే చాలు’ అని పేర్కొ్న్నారు. సాధారణంగా అన్ను కపూర్ ఇలాంటి వివాదాలకు దూరంగా ఉంటారు. కానీ అసలే తనకు పద్మ పురస్కారం రాలేదని బాధలో ఉన్నారు అన్నూ. అదే సమయంలో నెటిజన్ ఈ ట్వీట్ చేయడంతో పుండుపై కారం చల్లినట్లైంది. అందుకే మనసులోని బాధను వెళగక్కారు. బాలీవుడ్ నటి కంగనా రనౌత్, నిర్మాతలు ఏక్తా కపూర్, కరణ్ జోహార్‌లకు కూడా పద్మశ్రీ వరించింది. అయితే ఎప్పుడో ఇవ్వాల్సిన పద్మశ్రీ అవార్డును కాస్త ఆలస్యంగా ఇచ్చినందుకు పలువురు సెలబ్రిటీలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. READ ALSO:


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2RZeUrv
v

వారిద్దరే ఆ హీరోల కెరీర్ నాశనం చేశారు: మళ్లీ పుల్ల పెట్టేశాడయ్యో...

తెలుగు చిత్రపరిశ్రమలో ఎవరినైనా గెలికే ధైర్యం ఉన్న ఏకైక వ్యక్తి వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. అదే విధంగా హిందీ చిత్ర పరిశ్రమకూ ఓ వర్మ ఉన్నాడు. ఆయనే ప్రముఖ సినీ విశ్లేషకుడు . ఎప్పటికప్పుడు రివ్యూలు ఇస్తూ, రియాల్టీ షోలలో పాల్గొంటున్న కంటెస్టెంట్లపై, నటీనటులపై కామెంట్స్ చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేస్తుంటారు. తెలుగులో వర్మ మాటలను ఎలాగైతే పెద్దగా పట్టించుకోరో బాలీవుడ్‌లోనూ కమాల్ చేసే కామెంట్స్‌ను ఎవరూ కేర్ చేయరు. అందుకే ఆయన మితిమీరిన ఆవేశంతో రెచ్చిపోతుంటారు. తాజాగా ఆయన బాలీవుడ్ స్టార్ హీరో వరుణ్ ధావన్‌పై షాకింగ్ వ్యాఖ్యలు చేశారు. ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు డేవిడ్ ధావన్ కుమారుడైన వరుణ్ వరుస సినిమాలతో దూసుకెళ్తున్నాడు. అయితే ఎలాంటి సినిమా బ్యాగ్రౌండ్ లేనివారు వరుణ్‌కి గట్టి పోటీనిస్తున్నారు. వారే కుర్ర హీరోలు ఆయుష్మాన్ ఖురానా, కార్తిక్ ఆర్యన్. వీరిద్దరికీ ఎలాంటి సినిమా బ్యాగ్రౌండ్ లేదు. సొంత టాలెంట్‌ను నమ్ముకుని ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. వీరు నటించే సినిమాలు బాక్సాఫీస్ వద్ద కోట్లు కొల్లగొడుతున్నాయి. READ ALSO: ఈ విషయం గురించి కమాల్ ట్వీట్ చేస్తూ ఏమన్నారంటే... ‘‘వరుణ్ ధావన్ ఓ ఫ్లాప్ నటుడు. వరుసగా ఆరు ఫ్లాప్స్ ఇచ్చాడు. ఇప్పుడు ఆయన ‘మిస్టర్ లేలే’ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా కూడా ఫ్లాప్ అవుతుంది అని మీరు కూడా అనుకుంటున్నారా? మరో విషయం ఏంటంటే... పాపం వరుణ్ ధావన్‌కు ఇద్దరు హీరోల వల్లే కష్టాలు ఎదురయ్యాయి. వారెవరో కాదు. ఆయుష్మాన్ ఖురానా, కార్తిక్ ఆర్యన్. వీరిద్దరూ వరుణ్‌కు చుక్కలు చూపిస్తున్నారు. వరుణ్ ధావన్, సిద్ధార్థ్ మల్హోత్రాల కెరీర్లు నాశనం అవ్వడానికి ఈ ఇద్దరే కారణం’ అని బాంబు పేల్చాడు. అయినా ఏం ఫర్వాలేదు లెండి. ఎందుకంటే ఇతను చేసే ట్వీట్స్‌ను ఆయన ఫ్యాన్స్, ఫాలోవర్స్ తప్ప ఎవ్వరూ సీరియస్‌గా తీసుకోరు. READ ALSO:


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3aHBX2m
v

నయనతారకు పేరు పెట్టింది నేను: లేడీ సూపర్‌స్టార్ కోసం కొట్టుకుంటున్న దర్శకులు

లేడీ సూపర్‌స్టార్ అసలు పేరు డయానా మరియం కురియన్ అని దాదాపుగా అందరికీ తెలిసిందే. 2003లో ఆమె ‘మనస్సినక్కరే’ అనే మలయాళ సినిమాతో సినీ కెరీర్‌ను ప్రారంభించారు. ఈ సినిమాకు సత్యన్ అంతికాడ్ దర్శకుడు. సినిమా టైటిల్స్ వేసేటప్పుడు నయన్ పేరును డయానా కాకుండా నయనతార అని వేశారట. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవడంతో ఆమె పేరు నయనతార అని ఫిక్స్ అయిపోయింది. ఇక అక్కడి నుంచి వరుసగా సినిమాలు చేస్తూ తానేంటో అన్ని భాషల్లో నిరూపించుకుంది. అయితే ఇప్పుడు నయనతారకు ఈ పేరు ఎవరు పెట్టారు అని ఇద్దరు దర్శకులు కొట్టుకుంటున్నారు. ఆ పేరు నేను పెట్టానంటే నేను పెట్టానంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేసుకుంటున్నారు. నయనతారకు ఆపేరు పెట్టింది నేనే అంటూ ఇటీవల డిట్టో జాన్ అనే దర్శకుడు అన్నారట. దాంతో సత్యన్‌కు మండింది. సోషల్ మీడియా ద్వారా తన బాధను వెళగక్కారు. ‘నేను, నా స్నేహితుడైన డైరెక్టర్ రంజన్ ప్రమోద్ నయనతారకు ఆ పేరు పెట్టాం. నాకు జాన్ డిట్టో ఎవరో కూడా తెలీదు. అసలు ఈ విషయంపై ఇంత చర్చ జరపాల్సి వస్తుంది నేను అనుకోలేదు. ‘మనస్సినక్కరే’ షూటింగ్ జరుగుతున్నప్పుడు ఓ రోజు ఉదయం నేను, దర్శకుడు రంజన్ కలిసి నయనతారకు ఏం పేరు పెడితే బాగుంటుంది అని ఆలోచించుకున్నాం. అప్పుడు నయనతార అన్న పేరు తట్టింది. మేం తయారు చేసిన పేర్ల జాబితాలో నయనతార పేరును యాడ్ చేసి నయన్‌కు ఇచ్చాం. తనకు కూడా ఆ పేరే నచ్చింది. అదే తన స్క్రీన్ నేమ్ అయిపోయింది’ అని ఫేస్‌బుక్‌లో ఓ పోస్ట్ పెట్టారు. READ ALSO: మొత్తానికి తన పేరును ఎంచుకుంది నయనతారేనని క్లియర్‌గా అర్థమైపోయింది. అయితే ఎప్పుడూ లేనిది ఇప్పుడు ఈ చర్చ ఎందుకు వచ్చిందో అర్థంకావడంలేదు. ‘దర్బార్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన నయన్ ప్రస్తుతం తన ప్రియుడు విఘ్నేష్ శివన్ నిర్మిస్తున్న ‘మూకుట్టి అమ్మన్’, ‘నెట్రికన్’ సినిమాలతో బిజీగా ఉన్నారు. READ ALSO:


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/36wEoS7
v

Prabhas: బాక్సాఫీస్ వద్ద ప్రభాస్, రాజమౌళి ఢీ?

ఇద్దరూ కలిసి తెలుగు చిత్ర పరిశ్రమ చరిత్రలో నిలిచిపోయే బ్లాక్ బస్టర్ సినిమా ఇచ్చారు. ఇప్పుడు ఆ ఇద్దరే బాక్సాఫీస్ వద్ద ఢీకొనబోతున్నారట. వారెవరో కాదు.. యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్, దర్శకధీరుడు ఎస్.ఎస్ రాజమౌళి. ప్రస్తుతం ‘జాన్’ (వర్కింగ్ టైటిల్) సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. రాధాక్రిష్ణ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. పూజా హెగ్డే కథానాయికగా నటిస్తున్నారు. మరోపక్క జక్కన్న ‘ఆర్ ఆర్ ఆర్’ సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ సినిమా షూటింగ్ కూడా ఫాస్ట్‌గా జరిగిపోతోంది. అయితే ‘ఆర్ ఆర్ ఆర్’ రిలీజ్ డేట్ మారే అవకాశం ఉందని ఎప్పటినుంచో వార్తలు వినిపిస్తున్నాయి. షూటింగ్ ఎంత త్వరగా పూర్తి చేసినా పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఆలస్యమయ్యే ఛాన్సెస్ ఉన్నాయని అంటున్నారు. అందుకే ముందుగా అనుకున్న జులై 30న కాకుండా సినిమాను అక్టోబర్‌లో విడుదల చేయాలని రాజమౌళి అనుకుంటున్నారట. మరోపక్క ‘జాన్’ సినిమాను కూడా అక్టోబర్‌లో దసరా సందర్భంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చిత్రవర్గాలు అనుకుంటున్నాయట. అలా ఈ రెండు పెద్ద సినిమాలు ఒకే నెలలో బాక్సాఫీస్ వద్ద ఢీకొనే అవకాశం ఉందని టాలీవుడ్ వర్గాల సమాచారం. పైగా రెండూ ప్యాన్ ఇండియా సినిమాలుగా తెరకెక్కుతున్నాయి. READ ALSO: ‘ఆర్ ఆర్ ఆర్’లో రామ్ చరణ్‌ తన పాత్రకు సంబంధించిన సన్నివేశాలు అనుకున్న సమయానికే షూట్ చేసేసి ఉంటే సినిమా అనుకున్న తేదీనే విడుదల చేసేవారు. కానీ చరణ్ ‘సైరా’ ప్రమోషన్స్‌లో పడి బిజీ అవడంతో షూట్ కాస్త ఆలస్యం అయింది. మరోపక్క ప్రభాస్ సినిమా కూడా కొన్ని రోజులు వాయిదా పడింది. దాంతో ఇంకా డిలే చేసుకుంటూపోతే కుదరదు అనుకుని ఎంత త్వరగా వీలైతే సినిమాను రిలీజ్ చేయాలని అనుకున్నారు. ఏదేమైనా ప్రభాస్, రాజమౌళికి బాక్సాఫీస్ క్లాష్ గురించి చెప్పాల్సిన పనిలేదు. ఎందుకంటే ఇవన్నీ వారికి వెన్నతో పెట్టిన విద్య. చిత్రపరిశ్రమలో టాప్ స్థానాల్లో ఉన్న వీరికి ఎప్పుడు సినిమా విడుదల చేయాలో తెలీదా ఏంటి...! READ ALSO:


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2tKHyo9
v

నాడు మోదీ నేడు రజినీ.. షరతులు వర్తిస్తాయ్ అంటున్న అధికారులు

సూపర్‌స్టార్ అభిమానులకు శుభవార్త. త్వరలో ఆయన్ను అంతర్జాతీయ టీవీ ఛానెల్‌లో చూసే అవకాశం రాబోతోంది. అదెలా అంటారా.. త్వరలో రజినీ ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ అయిన అడ్వెంచరస్ షో ‘మ్యాన్ వర్సెస్ వైల్డ్’లో కనిపించబోతున్నారు. బ్రిటన్‌కు చెందిన ప్రముఖ అడ్వెంచరర్ బేర్ గ్రిల్స్‌తో కలిసి రజినీ ఈ ప్రాజెక్ట్ చేయబోతున్నారు. కర్ణాటకలోని బందిపూర్ టైగర్ రిజర్వ్‌లో ఈ ప్రోగ్రామ్ షూట్ చేయబోతున్నారు. ఈ కార్యక్రమం కోసం రజినీకాంత్ సోమవారమే బందిపూర్‌కి చేరుకున్నట్లు టైగర్ రిజర్వ్ డైరెక్టర్ బాలచంద్ర తెలిపారు. మంగళవారం రాత్రిలోగా ఈ కార్యక్రమాన్ని ముగించుకుని వెళ్లిపోతారట. కేవలం అడవిలోకి కెమెరాలు మాత్రమే అనుమతించామని తెలిపారు. ఈ కార్యక్రమం కోసం 2019లోనే కర్ణాటక ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్‌తో బానిజే గ్రూప్, సెవెన్ టారస్ ఎంటర్‌టైన్మెంట్ స్టూడియో ఒప్పందం కుదుర్చుకున్నాయి. అయితే ఈ షో నేపథ్యంలో కర్ణాటక అటవీ శాఖ అధికారులు చాలా రూల్స్ పెట్టారు. ఉదయం 6 నుంచి సాయంత్రం 6 వరకే ఎలాంటి కార్యక్రమాలైనా షూట్ చేసుకోవచ్చు. READ ALSO: ఈ కార్యక్రమాన్ని చిత్రీకరిస్తున్నప్పుడు జంతువులకు కానీ చెట్లకు కానీ ఎలాంటి హాని తలపెట్టకూడదు. విద్యుత్తు, పేలుడు పదార్థాలు ఉపయోగించకూడదు. లైట్లు, సౌండ్ మెటీరియల్స్, జెనరేటర్లు తీసుకెళ్లకూడదు. ఈ నిబంధనలను అతిక్రమిస్తే స్పాట్‌లోనే కార్యక్రమాన్ని రద్దు చేస్తామని కాంట్రాక్ట్‌లో వివరించారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2uILAx9
v

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...