బాలీవుడ్లో ఎన్నో అద్భుతమైన పాత్రల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు సీనియర్ నటుడు . ఎన్నో ఏళ్లుగా చిత్రపరిశ్రమలో కొనసాగుతున్నప్పటికీ ఆయనకు ఇప్పటివరకు భారత ప్రభుత్వం నుంచి ఎలాంటి గౌరవం దక్కలేదు. కనీసం ఈసారైనా పద్మ పురస్కారం వస్తుందేమో అనుకున్నారు. కానీ రాలేదు. పైగా పాకిస్థాన్లో పుట్టి ఇక్కడ సెటిల్ అయ్యి, ఇక్కడి పౌరసత్వం దక్కించుకున్న సింగర్ అద్నాన్ సమీకి పద్మశ్రీకి పురస్కారం వరించింది. ఇప్పటికే దీనిపై చాలా మంది అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఓ నెటిజన్ అన్ను కపూర్ గురించి సోషల్ మీడియాలో ప్రస్తావించారు. ఆయనకు పురస్కారం ఎందుకు ఇవ్వలేదు అని ప్రశ్నించారు. ‘సినిమాల్లో సుప్రసిద్ధులు అయిన గొప్ప హాస్యనటుడు, రేడియో హోస్ట్, ఎందరికో రోల్ మోడల్ అయిన అన్నూ కపూర్ పద్మ పురస్కారానికి అర్హులు కారా? దయచేసి అన్ను కపూర్ అభిమానులు ఆయనకు ఓటెయ్యండి’’ అని పోస్ట్ చేశాడు. దీనిపై అన్ను కపూర్ స్పందించారు. READ ALSO: ‘‘ధన్యవాదాలు. పద్మ పురస్కారాలు అర్హులకే వస్తాయి. నాలాంటి అనర్హుడికి కాదు. ఏదేమైనా మీలాంటి వారు గుర్తుచేసుకున్నారు. నాకు అదే చాలు’ అని పేర్కొ్న్నారు. సాధారణంగా అన్ను కపూర్ ఇలాంటి వివాదాలకు దూరంగా ఉంటారు. కానీ అసలే తనకు పద్మ పురస్కారం రాలేదని బాధలో ఉన్నారు అన్నూ. అదే సమయంలో నెటిజన్ ఈ ట్వీట్ చేయడంతో పుండుపై కారం చల్లినట్లైంది. అందుకే మనసులోని బాధను వెళగక్కారు. బాలీవుడ్ నటి కంగనా రనౌత్, నిర్మాతలు ఏక్తా కపూర్, కరణ్ జోహార్లకు కూడా పద్మశ్రీ వరించింది. అయితే ఎప్పుడో ఇవ్వాల్సిన పద్మశ్రీ అవార్డును కాస్త ఆలస్యంగా ఇచ్చినందుకు పలువురు సెలబ్రిటీలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. READ ALSO:
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2RZeUrv
v
No comments:
Post a Comment