Tuesday 28 January 2020

వారిద్దరే ఆ హీరోల కెరీర్ నాశనం చేశారు: మళ్లీ పుల్ల పెట్టేశాడయ్యో...

తెలుగు చిత్రపరిశ్రమలో ఎవరినైనా గెలికే ధైర్యం ఉన్న ఏకైక వ్యక్తి వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. అదే విధంగా హిందీ చిత్ర పరిశ్రమకూ ఓ వర్మ ఉన్నాడు. ఆయనే ప్రముఖ సినీ విశ్లేషకుడు . ఎప్పటికప్పుడు రివ్యూలు ఇస్తూ, రియాల్టీ షోలలో పాల్గొంటున్న కంటెస్టెంట్లపై, నటీనటులపై కామెంట్స్ చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేస్తుంటారు. తెలుగులో వర్మ మాటలను ఎలాగైతే పెద్దగా పట్టించుకోరో బాలీవుడ్‌లోనూ కమాల్ చేసే కామెంట్స్‌ను ఎవరూ కేర్ చేయరు. అందుకే ఆయన మితిమీరిన ఆవేశంతో రెచ్చిపోతుంటారు. తాజాగా ఆయన బాలీవుడ్ స్టార్ హీరో వరుణ్ ధావన్‌పై షాకింగ్ వ్యాఖ్యలు చేశారు. ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు డేవిడ్ ధావన్ కుమారుడైన వరుణ్ వరుస సినిమాలతో దూసుకెళ్తున్నాడు. అయితే ఎలాంటి సినిమా బ్యాగ్రౌండ్ లేనివారు వరుణ్‌కి గట్టి పోటీనిస్తున్నారు. వారే కుర్ర హీరోలు ఆయుష్మాన్ ఖురానా, కార్తిక్ ఆర్యన్. వీరిద్దరికీ ఎలాంటి సినిమా బ్యాగ్రౌండ్ లేదు. సొంత టాలెంట్‌ను నమ్ముకుని ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. వీరు నటించే సినిమాలు బాక్సాఫీస్ వద్ద కోట్లు కొల్లగొడుతున్నాయి. READ ALSO: ఈ విషయం గురించి కమాల్ ట్వీట్ చేస్తూ ఏమన్నారంటే... ‘‘వరుణ్ ధావన్ ఓ ఫ్లాప్ నటుడు. వరుసగా ఆరు ఫ్లాప్స్ ఇచ్చాడు. ఇప్పుడు ఆయన ‘మిస్టర్ లేలే’ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా కూడా ఫ్లాప్ అవుతుంది అని మీరు కూడా అనుకుంటున్నారా? మరో విషయం ఏంటంటే... పాపం వరుణ్ ధావన్‌కు ఇద్దరు హీరోల వల్లే కష్టాలు ఎదురయ్యాయి. వారెవరో కాదు. ఆయుష్మాన్ ఖురానా, కార్తిక్ ఆర్యన్. వీరిద్దరూ వరుణ్‌కు చుక్కలు చూపిస్తున్నారు. వరుణ్ ధావన్, సిద్ధార్థ్ మల్హోత్రాల కెరీర్లు నాశనం అవ్వడానికి ఈ ఇద్దరే కారణం’ అని బాంబు పేల్చాడు. అయినా ఏం ఫర్వాలేదు లెండి. ఎందుకంటే ఇతను చేసే ట్వీట్స్‌ను ఆయన ఫ్యాన్స్, ఫాలోవర్స్ తప్ప ఎవ్వరూ సీరియస్‌గా తీసుకోరు. READ ALSO:


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3aHBX2m
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...