Thursday 31 December 2020

రవితేజ న్యూ ఇయర్ సర్‌ప్రైజ్.. డబుల్ ఇంపాక్ట్ అంటూ రంగంలోకి మాస్ మహారాజ్

2020 సంవత్సరానికి గుడ్ బై చెబుతూ 2021 జనవరి 1వ తేదీ ఉదయం 9 గంటలకు సర్‌ప్రైజ్ ఉంటుందని ముందుగానే చెప్పిన రవితేజ.. తాజాగా తన లేటెస్ట్ మూవీ ''కి సంబంధించి స్పెషల్ అప్‌డేట్ ఇచ్చారు. న్యూ ఇయర్ కానుకగా సందర్భంగా ఈ సినిమాకు సంబంధించి ఓ పోస్టర్‌ను విడుదల చేసింది చిత్ర యూనిట్‌. ఇందులో రెండు డిఫరెంట్ షేడ్స్‌లో కనిపిస్తున్నారు. కళ్లజోడు పెట్టుకొని భయపడుతూ ఓ గెటప్‌లో కనిపించగా, చేతిలో గన్ పట్టుకొని మరో గెటప్‌లో అదరగొట్టేశాడు మాస్ మహారాజ్. రవితేజ డబుల్‌ యాక్షన్‌ చేస్తున్న ఈ సినిమా నుండి డబుల్‌ ఇంపాక్ట్‌ పక్కా అంటూ చిత్ర యూనిట్ ఈ పోస్టర్‌ విడుదల చేయడం గమనార్హం. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ రవితేజ కెరీర్‌లో 67వ సినిమాగా ప్రేక్షకుల ముందుకు రానుంది. డా.జయంతిలాల్‌ గడ సమర్పణలో ఏ స్టూడియోస్‌, పెన్‌ స్టూడియోస్‌ పతాకాలపై సత్యనారాయణ కోనేరు ఈ 'ఖిలాడీ' చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రమేశ్‌ వర్మ దర్శకత్వం వహిస్తున్నారు. రాక్‌స్టార్‌ దేవి శ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్నారు. చిత్రంలో రవితేజ సరసన మీనాక్షి చౌదరి, డింపుల్‌ హయతి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇటీవలే రిలీజ్ చేసిన ఈ మూవీ ఫస్ట్‌లుక్ పోస్టర్ అభిమానులను నుంచి భారీ స్పందన తెచ్చుకోవడంతో సినిమాపై ఓ రేంజ్ అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఈ ఏడాది వేసవిలో చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది ఖిలాడీ టీమ్.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2LeQMRC
v

రవితేజ ‘క్రాక్’ ట్రైలర్: ష్యూర్ షాట్.. నో డౌట్.. పుచ్చపేలిపోద్ది!

మాస్ మ‌హారాజా ర‌వితేజ‌ మళ్లీ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తున్నారు. ‘క్రాక్’ అంటూ తన రేంజ్ ఏంటో చూపించబోతున్నారు. ఆ రేంజ్ ఎలా ఉండబోతోందో మచ్చుకు ‘క్రాక్’ ట్రైలర్ ద్వారా ఈరోజు చూపించారు. అభిమానులతో పాటు, సినీ ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తోన్న ‘క్రాక్’ ట్రైలర్ వచ్చేసింది. నూతన సంవత్సరం ఆరంభం సందర్భంగా జనవరి 1న ‘క్రాక్’ ట్రైలర్‌ను విడుదల చేశారు. అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా అద్భుతంగా ఉంది ట్రైలర్. ‘‘చూశారా జేబులో ఉండాల్సిన నోటు, చెట్టుకు ఉండాల్సిన కాయ, గోడకు ఉండాల్సిన మేకు.. ఈ మూడు ముగ్గురు తోపుల్ని తొక్కి తాట తీశాయి. ఇక్కడ కామ్ పాయింట్ ఏంటంటే ఈ ముగ్గురితో ఆడుకుంది ఒకే పోలీసోడు’’ అంటూ విక్టరీ వెంకటేష్ వాయిస్ ఓవర్‌తో ట్రైలర్ మొదలైంది. ‘‘శంకర్.. పోతరాజు వీర శంకర్’’ అని మీసం దువ్వుతూ రవితేజ తనను తాను పరిచయం చేసుకున్నారు. ఇక అక్కడి నుంచి దరువు మొదలైంది. యాక్షన్, ఎంటర్‌టైన్మెంట్, రొమాన్స్ అన్నీ ఒకే ట్రైలర్‌లో చూపించేశారు దర్శకుడు గోపీచంద్ మలినేని. ఈ ట్రైలర్‌లో మరో హైలైట్ సాయిమాధవ్ బుర్రా డైలాగులు. ప్రతి డైలాగ్ వహ్వా అనిపించేలా ఉంది. ‘‘ఒంగోలు నడిరోడ్డు మీద నగ్నంగా నిలబెట్టి నవరంధ్రాల్లో సీసం పోస్తా నా కొడకా’’ అంటూ విలన్ సముద్రఖనితో రవితేజ చెప్పే డైలాగ్ మాస్ మహారాజా ఫ్యాన్స్‌తో ఈలలు వేయిస్తుంది. ఇక తమన్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కుమ్మిపడేశారు. ఇదిలా ఉంటే, ఈ చిత్రాన్ని సరస్వతి ఫిలింస్ డివిజన్ బ్యానర్‌పై బి.మధు నిర్మిస్తున్నారు. డైరెక్టర్ గోపీచంద్ మలినేని, రవితేజ కాంబినేషన్‌లో వస్తోన్న ఈ మూడో సినిమాకు ఎస్. త‌మ‌న్ సంగీతం సమకూరుస్తుండగా జి.కె. విష్ణు సినిమాటోగ్రఫీ అందించారు. శ్రుతి హాస‌న్‌ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రంలో స‌ముద్రఖని, వ‌ర‌ల‌క్ష్మీ శ‌ర‌త్‌కుమార్‌, దేవీప్రసాద్‌, చిర‌గ్ జాని, మౌర్యని, సుధాక‌ర్ కొమాకుల‌, వంశీ చాగంటి తదితరులు నటించారు. జనవరి 9న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తోంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3n1PwyB
v

FCUK Teaser: రసికరాజుగా జగపతిబాబు.. బండి ఇంకా కండిషన్‌లోనే ఉంది!

ప్రధాన పాత్రధారిగా రామ్ కార్తీక్, అమ్ము అభిరామి జంటగా శ్రీ రంజిత్ మూవీస్ నిర్మిస్తోన్న చిత్రం ‘ఫాదర్ చిట్టి ఉమా కార్తీక్’. టైటిల్‌లోని మ‌రో ప్రధాన పాత్ర చిట్టిగా బేబి స‌హ‌శ్రిత న‌టిస్తోంది. ఈ చిత్రానికి విద్యాసాగ‌ర్ రాజు ద‌ర్శక‌త్వం వ‌హిస్తున్నారు. షార్ట్‌క‌ట్‌లో ఈ సినిమా ‘FCUK’గా పాపుల‌ర్ అయ్యింది. ఇప్పటివ‌ర‌కూ నాలుగు ప్రధాన పాత్రల‌కు సంబంధించి విడుద‌ల చేసిన ఫ‌స్ట్ లుక్ పోస్టర్స్ విల‌క్షణంగా ఉన్నాయంటూ అన్ని వ‌ర్గాల నుంచీ ప్రశంస‌లు ల‌భించాయి. కాగా, నూత‌న సంవ‌త్సరారంభం సంద‌ర్భంగా శుక్రవారం (జ‌న‌వ‌రి 1న) ఉద‌యం 9 గంట‌ల‌కు పలువురు సెల‌బ్రిటీలు సోష‌ల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా సినిమా టీజ‌ర్‌ను విడుద‌ల చేశారు. ఈ టీజర్ చాలా ఆసక్తికరంగా ఉంది. ఈ టీజర్‌లో సినిమాకు ప్రధానమైన నాలుగు పోస్టర్లను పరిచయం చేశారు. రొమాంటిక్ కామెడీగా రూపొందుతోన్న ఈ చిత్రంలో జగపతిబాబు పాత్ర చాలా ఇంట్రస్టింగ్‌గా ఉంటుందని టీజర్ చూస్తే అర్థమవుతోంది. రొమాంటిక్ ఫాదర్‌గా ఆయన నటించారు. ‘‘ఈయన పేరు ఫణి భూపాల్. రాముడి బాణం వేగం గాలికి కూడా తెలియదంట. మనోడు అంత ఫాస్ట్‌గా అమ్మాయిల్ని పడేస్తాడు’’ అంటూ జగపతిబాబు పాత్రను పరిచయం చేశారు. ఫణి భూపాల్ కొడుకు కార్తీక్‌గా రామ్ కార్తీక్ నటించారు. ఈయనో పెద్ద బ్లఫ్ మాస్టర్. ఇక ఉమా చిన్న పిల్లల డాక్టర్. పెళ్లీడికి వచ్చిన కొడుకుని ఇంట్లో ఉంచుకుని ఒక ఆడబిడ్డకు తండ్రవుతాడు ఫణి భూపాల్. ఆ పాప పుట్టిన తరవాత ఫాద‌ర్‌, చిట్టి, ఉమ, కార్తీక్‌ మ‌ధ్య జరిగే వినోద‌భ‌రిత ప్రయాణమే ఈ సినిమా. కాగా, త్వర‌లో ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేయ‌నున్నట్లు నిర్మాత కె.ఎల్‌. దామోద‌ర్ ప్రసాద్‌, డైరెక్టర్ విద్యాసాగ‌ర్ రాజు తెలిపారు. ఈ చిత్రంలో అలీ, దగ్గుబాటి రాజా, కళ్యాణి నటరాజన్, బ్రహ్మాజీ, కృష్ణ భగవాన్, రజిత, జబర్దస్త్ రామ్ ప్రసాద్, నవీన్, వెంకీ, రాఘవ, భరత్‌ ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. భీమ్స్ సిసిరోలియో సంగీతం సమకూరుస్తున్న ఈ చిత్రానికి శివ జి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. కరుణాకర్, ఆదిత్య మాటలు రాశారు. కిషోర్ మద్దాలి ఎడిటర్. కథ, స్క్రీన్ ప్లే, కొరియోగ్రఫీ, దర్శకత్వం విద్యాసాగర్ రాజు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2Mo4ceW
v

‘వరుడు కావలెను‘ న్యూ ఇయర్ పోస్టర్.. చూడముచ్చటగా నాగశౌర్య, రీతువర్మ జంట

నాగశౌర్య, రీతువర్మ హీరోహీరోయిన్లుగా రూపొందుతోన్న చిత్రం ‘వరుడు కావలెను’. లక్ష్మీ సౌజన్య దర్శకురాలిగా పరిచయం అవుతున్నారు. పీడీవీ ప్రసాద్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్ర టైటిల్‌ను ప్రకటిస్తూ అందమైన వీడియోను ఇటీవల విడుదల చేశారు. ఈ వీడియోలో నాగశౌర్య, రీతువర్మ ఎంతో అందంగా కనిపించారు. ఈ చిన్న దృశ్యానికి విశాల్ చంద్రశేఖర్ అందించిన నేపథ్య సంగీతం మరింత వన్నె తేవటమే కాకుండా ప్రేక్షకుల నుంచి ప్రశంసలు కూడా లభించాయి. కాగా, 2021 నూతన సంవత్సర శుభాకాంక్షలు చెబుతూ ఓ ప్రచారచిత్రం విడుదల చేశారు. ఈ పోస్టర్‌లో నాగశౌర్య , రీతువర్మ జంట చూడముచ్చటగా కనిపిస్తుంది. హైదరాబాద్‌లో ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటోంది. హీరోహీరోయిన్లతో పాటు ప్రధాన తారాగణంపై సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోంది. ఈ ఏడాది వేసవిలో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ చిత్రంలో ఇంకా నదియా, మురళీశర్మ, వెన్నెలకిషార్, ప్రవీణ్, అనంత్, కిరీటి దామరాజు, ‘రంగస్థలం’ మహేష్, అర్జున్ కళ్యాణ్, వైష్ణవి చైతన్య, సిద్దిక్ష నటిస్తున్నారు. ఈ చిత్రానికి విశాల్ చంద్రశేఖర్ సంగీతం సమకూరుస్తుండగా వంశీ పచ్చిపులుసు సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. నవీన్ నూలి ఎడిటర్. గణేష్ కుమార్ రావూరి మాటలు రాస్తున్నారు. కథ- స్క్రీన్ ప్లే- దర్శకత్వం లక్ష్మీసౌజన్య.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2LeHp4o
v

‘వకీల్ సాబ్’ స్టన్నింగ్ పోస్టర్.. సంక్రాంతికి ఫ్యాన్స్‌కి సర్‌ప్రైజ్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ కొత్త ఏడాదిలో ప్రేక్షకులకు వినోదాన్ని పంచడానికి వచ్చేస్తున్నారు. మొదటిగా ‘వకీల్ సాబ్’తో ఆడియన్స్ ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. రెండేళ్ల విరామం తరవాత పవన్ కళ్యాణ్ నుంచి వస్తున్న సినిమా కావడంతో ‘వకీల్ సాబ్’పై భారీ అంచనాలున్నాయి. ఆ అంచనాలకు ఎక్కడా తగ్గకుండా సిద్ధమవుతున్నాడు ‘వకీల్ సాబ్’. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, వర్కింగ్ స్టిల్స్ ఫ్యాన్స్‌ను ఉత్తేజపరిచాయి. ఇప్పుడు మరో స్టన్నింగ్ పోస్టర్‌ను వదిలారు ‘వకీల్ సాబ్’. తెలుగు ఆడియన్స్‌కు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ‘వకీల్ సాబ్’ కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు నిర్మాతలు. ఈ పోస్టర్‌లో పవన్ కళ్యాణ్, శ్రుతిహాసన్ జావా బైక్‌పై దూసుకెళ్తున్నారు. పవన్ కళ్యాణ్ లుక్ అదిరింది. ఆయన వెనుకాల శ్రుతిహాసన్ కూడా చిరునవ్వులు ఒళికిస్తున్నారు. అంతేకాదు, ఈ పోస్టర్‌తో మరో సర్‌ప్రైజ్ కూడా ఇచ్చారు. ఈ సంక్రాంతికి ‘వకీల్ సాబ్’ టీజర్‌ను విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. కాగా, హిందీ సూపర్ హిట్ ఫిలిం ‘పింక్’కు రీమేక్‌గా వస్తోన్న ఈ సినిమాకు శ్రీరామ్ వేణు దర్శకత్వం వహించారు. మూడు రోజుల క్రితమే షూటింగ్‌ను పూర్తిచేసుకున్న ఈ చిత్రాన్ని బోనీ కపూర్ సమర్పణలో దిల్ రాజు, శిరీష్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తమన్ సంగీతం సమకూరుస్తున్నారు. పి.ఎస్. వినోద్ సినిమాటోగ్రఫీ అందించారు. ప్రవీణ్ పూడి ఎడిటర్. మామిడాల తిరుపతి మాటలు రాశారు. రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించారు. రవి వర్మ యాక్షన్ డైరెక్టర్.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2L8cWoX
v

రవితేజ ‘క్రాక్’కి వెంకటేష్ వాయిస్

మాస్ మ‌హారాజా ర‌వితేజ‌ హీరోగా గోపీచంద్ మ‌లినేని దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘క్రాక్’. రవితేజ-గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో వస్తోన్న మూడో చిత్రమిది. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటోన్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. అయితే, ఈ సినిమాకు సంబంధించి ఒక ఆసక్తికర అప్‌డేట్‌ను చిత్ర నిర్మాణ సంస్థ గురవారం వెల్లడించింది. అదేంటంటే.. ‘క్రాక్’ మూవీకి విక్టరీ వెంక‌టేష్ వాయిస్ ఓవ‌ర్ ఇస్తున్నారు. ఆయ‌న వాయిస్ ఓవ‌ర్ సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలుస్తుంద‌న‌డంలో ఎలాంటి సందేహం లేదు. నూతన సంవత్సరం ఆరంభం సందర్భంగా ఈ చిత్ర థియేట్రికల్ ట్రైలర్‌ను జనవరి 1న విడుదల చేస్తున్నారు. ఈ ట్రైలర్ విడుదలైతే ‘క్రాక్’పై అంచనాలు మరింత పెరగడం ఖాయం. కాగా, తెలుగు రాష్ట్రాల్లో జ‌రిగిన య‌థార్థ ఘ‌ట‌న‌ల ఆధారంగా ఈ సినిమా రూపొందుతోంది. ఇంటెన్స్ స్టోరీతో పాటు అన్ని వ‌ర్గాల‌ను ఆక‌ట్టుకొనే అంశాలు ఈ చిత్రంలో ఉన్నాయని చిత్ర యూనిట్ చెబుతోంది. స‌ర‌స్వతి ఫిలిమ్స్ డివిజ‌న్ బ్యాన‌ర్‌పై బి. మ‌ధు నిర్మిస్తోన్న ఈ చిత్రంలో స‌ముద్రఖని, వ‌ర‌ల‌క్ష్మీ శ‌ర‌త్‌కుమార్ కీలక పాత్రలు పోషించారు. ఎస్. త‌మ‌న్ సంగీతం సమకూరుస్తోన్న ఈ సినిమాకు జి.కె. విష్ణు సినిమాటోగ్రఫీ అందించారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/351hgNF
v

పూరి జగన్నాథ్ రివ్యూ: అన్నీ మూసుకుని కూర్చోవడం నేర్చుకున్నాం.. 2020 బెస్ట్ ఇయర్!

2020 అనగానే చాలా మంది మదిలో మెదిలే మాటలు దరిద్రం, చండాలం. ఇంత ఘోరమైన సంవత్సరాన్ని ఎప్పుడూ చూడలేదని జనాలు తిట్టుకుంటున్నారు. దీనికి కారణం ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా వైరస్. దీని వల్ల ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడ్డారు. ఆర్థికంగా చితికిపోయారు. అందుకే, ఈ ఏడాది వెళ్లిపోతుంటే సంతోషంగా వీడ్కోలు చెప్పడం లేదు. పోనీ దరిద్రపుగొట్టు సంవత్సరం.. వచ్చే ఏడాది అయినా బాగుండాలి అని ఆశ పడుతున్నారు. కానీ, 2020 చెత్త సంవత్సరం కాదని.. ఇది గొప్ప సంవత్సరమని అంటున్నారు ప్రముఖ సినీ దర్శకుడు పూరి జగన్నాథ్. 2020 గొప్పతనాన్ని వివరిస్తూ పూరి జగన్నాథ్ ఒక పాడ్‌కాస్ట్‌ను విడుదల చేశారు. ‘‘అందరూ 2020ని తిట్టుకుంటున్నారు. కానీ మన లైఫ్‌లో బెస్ట్ ఇయర్ 2020’’ అని పాడ్‌కాస్ట్‌ను మొదలుపెట్టారు పూరి. ఈ 2020 మనకు చాలా నేర్పిందని, ఆరోగ్యం ఎంత ముఖ్యమో అర్థమైందని, రోగనిరోధక శక్తి చాలా అవసరమని తెలిసిందని, మంచి ఆహారం విలువ తెలిసిందని పూరి అన్నారు. ఈ ఏడాదే ప్రజలు పరిశుభ్రత నేర్చుకున్నారని అన్నారాయన. పుట్టిన తరవాత ఇన్ని సార్లు ఎప్పుడూ మనం చేతులు కడుక్కోలేదని తెలిపారు. ‘‘పల్లెటూళ్లలో చదవుకోని వాళ్లకు కూడా చాలా విషయాలు తెలిశాయి. వైరస్, మ్యుటేషన్, శానిటైజర్, క్వారంటైన్, యాంటీబాడీస్, ప్లాస్మా.. ఇలా ఎన్నో విషయాలు తెలిసిపోయాయి. మొదట్లో నెల రోజులు లాక్‌డౌన్ అంటే మనకు పిచ్చి లేచింది. ఖాళీగా ఇంట్లో కూర్చోవాలంటే మెంటల్ హెల్త్ చాలా అవసరం అని తెలుసుకున్నాం. మనలో ఓపిక పెరిగింది. ఆత్మనిర్భర్.. ఆ తరవాత మెల్లగా కామ్ అయ్యాం. అన్నీ మూసుకుని కూర్చోవడం నేర్చుకున్నాం. 8 నెలలు ఎలా గడిచిపోయాయే మనకే తెలియలేదు. డబ్బు ఉన్నా లేకపోయినా ఎలా బతికామో మనకే తెలీదు. నిజమైన ఫ్రెండ్స్ ఎవరో ఇప్పుడే తెలిసింది. లైఫ్‌లో సేవింగ్స్ ఎంత అవసరమో తెలిసొచ్చింది. వర్క్ ఫ్రమ్ హోం నేర్చుకున్నాం. ఆడవాళ్లు బంగారం, కొత్త చీరలు లేకుండా బతకడం నేర్చుకున్నారు. అవసరమైనవి మాత్రమే కొంటున్నాం. అనవసరమైన షాపింగ్‌లు, చిరుతిండ్లు తగ్గాయి. నేచర్ చాలా పవర్‌ఫుల్ అని తెలిసింది. ఏ దేవుడు మనల్ని కాపాడలేడని తెలిసింది. ఎవరైనా చిన్న సహాయం చేస్తే దాని విలువ మనకు అర్థమైంది. రెండు నిమిషాలు ఊపిరి ఆగితే చాలు ప్రాణాలు పోతాయి.. చావు అనేది పెద్ద విషయం కాదు అనేది తెలిసింది. అనుక్షణం ఒళ్లు దగ్గర పెట్టుకుని బతికాం. జలుబు, జ్వరానికి కూడా మనం భయపడాల్సిన పరిస్థితి వచ్చేసింది. పసుపు, వెల్లుల్లి, తేనె కషాయం.. ఆవిరి పట్టడం లాంటివి మంచిదని తెలిసింది. ఆయుర్వేదం విలువ తెలిసింది. 2020 ఒక మహమ్మారి సంవత్సరం కాదు. ఇది మన కళ్లు తెరిపించిన ఏడాది. అందుకే 2020కి మనం గౌరవం ఇవ్వాలి. 2020 అనేది మన గురువు. ఏడాది పాటు ప్రపంచాన్ని స్తంభించి మనందరికీ పాఠం చెప్పింది’’ అంటూ పూరి తనదైన శైలిలో రివ్యూ ఇచ్చారు. ఇంకా పూరి ఏం చెప్పారో వినాలనుకుంటే కింది వీడియోను క్లిక్ చేయండి.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3hyXLBm
v

స్టార్ హీరో సినిమాలో కమెడియన్‌గా.. టిక్‌టాక్ దుర్గారావుకు బంపరాఫర్

సోషల్‌మీడియా యాప్ టిక్‌టాక్‌ ద్వారా ఎంతో మంది తమలోని టాలెంట్‌ను నిరూపించుకున్నారు. సినిమా పాటలకు స్పెప్పులు వేస్తూ, డైలాగులకు పేరడీ చేస్తే చాలామంది ఫాలోవర్స్‌ను సొంతం చేసుకున్నారు. సామాన్యులను సైతం సెలబ్రెటీలను చేసేసింది టిక్‌టాక్. ఈ నేపథ్యంలో గోదావరి జిల్లాకు చెందిన దుర్గారావు తన భార్యతో కలిసి టిక్‌టాక్ చేసిన వీడియోలు చాలా ఫేమస్ అయ్యాయి. ఆ టాలెంట్‌తోనే వారు పలు టీవీ షోల్లో సందడి చేశారు. ముఖ్యంగా ‘పలాస’ సినిమాలోని ‘మీ బావగారు వచ్చేటి వేళ’అనే పాటకు దుర్గారావు వేసిన స్టెప్పులు చాలా పేరు తీసుకొచ్చాయి. Also Read: తాజాగా అందిన సమాచారం ప్రకారం దుర్గారావుకు సినిమాల్లో బంపరాఫర్ దక్కినట్లు తెలుస్తోంది. మాస్ మహరాజ్ రవితేజ, డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘’లో దుర్గారావు కనిపించనున్నాడట. దుర్గారావు టిక్‌టాక్ వీడియోలు చూసి ఇంప్రస్ అయిన గోపీచంద్.. అతడిని ఓ కామెడీ పాత్ర ఇచ్చాడట. తనకు దక్కిన ఈ అవకాశాన్ని దుర్గారావు ఎలా వినియోగించుకుంటాడో చూడాలి. ‘క్రాక్’ మూవీ సంక్రాంతి సందర్భంగా థియేటర్లలోకి రానుంది. Also Read:


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2WZOp8g
v

ప్రముఖ నటుడు నర్సింగ్ యాదవ్ కన్నుమూత

సీనియర్ నటుడు కన్నుమూశారు. కిడ్నీ సంబంధిత వ్యాధితో సోమాజీగూడ యశోద హాస్పిటల్‌లో చేరిన నర్సింగ్ యాదవ్.. అక్కడ చికిత్స పొందుతూ గురువారం రాత్రి తుదిశ్వాస విడిచారు. ఆయన వయసు 52 సంవత్సరాలు. నర్సింగ్ యాదవ్ గత ఏడాది కాలంగా కిడ్నీ సమస్యతో బాధపడుతున్నారు. ఆయనకు సోమాజీగూడ యశోద హాస్పిటల్‌లోనే డయాలసిస్ చేస్తున్నారు. ఈ ఏడాది ఏప్రిల్ 9న నర్సింగ్ అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. అప్పటి నుంచీ ఆయన కోమాలోనే ఉన్నట్టు సమాచారం. అంతేకాదు, అప్పటి నుంచీ ఆయన యశోద హాస్పిటల్‌లో కిడ్నీ సమస్యకు చికిత్స పొందుతున్నారు. కానీ, దాన్ని జయించలేకపోయారు. ఇదిలా ఉంటే, నర్సింగ్ యాదవ్ గత 25 ఏళ్లుగా సినిమాల్లో నటిస్తున్నారు. విలన్‌గా, కమెడియన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా తనదైన ముద్రవేశారు. రామ్ గోపాల్ వర్మ చిత్రాలతో నర్సింగ్ యాదవ్‌కు మంచి గుర్తింపు వచ్చింది. ‘క్షణం క్షణం’లో ఆయన చేసిన నర్సింగ్ పాత్ర ఆయనకు పాపులారిటీ తెచ్చిపెట్టింది. నర్సింగ్‌ను చిరంజీవి కూడా బాగా ప్రోత్సహించారు. చిరంజీవితో పాటు చాలా మంది స్టార్ హీరోల సినిమాల్లో నర్సింగ్ నటించారు. తెలంగాణ యాసలో మాట్లాడుతూ తన పాత్రలకు ప్రత్యేకత తీసుకొచ్చారు నర్సింగ్. ‘మాస్టర్’, ‘చంద్రలేఖ’, ‘ఇడియట్’, ‘జానీ’, ‘ఠాగూర్’, ‘వర్షం’, ‘సై’, ‘శంకర్ దాదా ఎంబీబీఎస్’, ‘మాస్’, ‘అడవి రాముడు’, ‘డార్లింగ్’ ఇలా ఎన్నో హిట్ సినిమాల్లో ఆయన నటించారు. చివరిగా ‘ఖైదీ నెం. 150’లో కనిపించారు. 400కు పైగా సినిమాల్లో నర్సింగ్ యాదవ్ నటించారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/34XNOIt
v

బోయపాటికి షాకిచ్చిన యంగ్ హీరో.. రోల్ గురించి చెప్పగానే బెంబేలెత్తిపోయాడట

మాస్ డైరెక్టర్ , నందమూరి బాలకృష్ణ కాంబినేషన్లో తెరకెక్కుతున్న హ్యాట్రిక్ మూవీ కోసం అభిమానులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. సింహా, లెజెండ్‌ వంటి సూపర్‌హిట్ల తర్వాత వీరి కాంబో రిపీట్ కావడమే దీనికి కారణం. ఈ సినిమాపై అంచనాలైతే భారీగా ఉన్నాయి గానీ.. నిర్మాతలు మాత్రం బడ్జెట్‌ విషయంలో పెద్దగా డేర్ చేయలేకపోతున్నారని కొంతకాలంగా టాక్ వినిపిస్తోంది. Also Read: ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రస్టింగ్ గాసిప్ ఒకటి అందరినీ షాక్‌కు గురిచేస్తోంది. ఈ సినిమాలో ఓ నెగిటివ్ రోల్ కోసం బోయపాటి శ్రీను ఓ యంగ్ హీరోను సంప్రదించారట. అయితే బోయపాటి సినిమాలో మితిమీరిన హింస ఉంటుందని, పైగా నెగిటివ్ రోల్ అంటే అది మరింత శ్రుతిమించుతుందన్న ఆందోళనతో రిస్క్ చేయలేక ఆ హీరో నో చెప్పేశాడట. ఇంతకీ ఆ హీరో ఎవరో తెలుసా.. నిఖిల్. ఈ ఏడాదే పెళ్లి చేసుకుని వివాహ జీవితంలోకి అడుగుపెట్టిన ప్రస్తుతం ‘కార్తికేయ-2’ సినిమా కోసం సిద్ధపడుతున్నాడు. Also Read:


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2KHNyXj
v

టీవీ, సినిమా షూటింగులకు జగన్ సర్కార్ బంపరాఫర్.. ఇకపై అలా చేయక్కర్లేదు

రాష్ట్రంలో టీవీ, సినిమా షూటింగుల అనుమతిని మరింత సులభతరం చేస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అనుమతుల కోసం ఇక కార్యాలయాలకు వెళ్లకుండానే ఆన్‌లైన్లోనే ఉచితంగా అనుమతులు ఇచ్చే విధానానికి శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలో ప్రభుత్వ ప్రాంగణాలు, ప్రదేశాల్లో ఇక షూటింగ్ జరుపుకోవాలి అనుకునే వారు www.apsftvtdc.in వెబ్ సైట్లో అనుమతికి అప్లై చేసుకోవచ్చు. అలా చేసుకున్న దరఖాస్తులను నిర్దిష్ట కాలపరిమితిలో అనుమతి ఇచ్చి దరఖాస్తుదారుడికి ఆన్‌లైన్లోనే సమాచారం ఇస్తారు. ఈ అనుమతి కాపీని సంబంధిత శాఖ ఇన్‌ఛార్జికి కూడా పంపిస్తారు. Also Read: సినిమా, టీవీ షూటింగులకు ఆన్‌లైన్లో అనుమతి ఇవ్వడం శుభ పరిణామమని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చలన చిత్ర, టీవీ మరియు నాటక రంగ అభివృద్ధి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ టి.విజయకుమార్ రెడ్డి తెలిపారు. ప్రభుత్వ విధానాలు సులభతరంగాను, అందరికి అందుబాటులో ఉండాలనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఓ ప్రకటనలో స్పష్టం చేశారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉన్న లొకేషన్లను ఎంపిక చేసుకుని ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకుంటే వెంటనే షూటింగ్‌కి అనుమతులు జారీ చేస్తామని ఆయన స్పష్టం చేశారు. Also Read: గతంలో షూటింగ్ లొకేషన్లకు అనుమతి ఇవ్వాలంటే ఆయా నిర్మాతలు నిర్దిష్ట రుసుము చెల్లించాల్సి ఉండేదని, ఇప్పుడు ఉచితంగా ఆన్‌లైన్లోనే షూటింగ్ లొకేషన్ అనుమతి పొందవచ్చని విజయకుమార్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు ప్రభుత్వం జీవో నెంబర్ 45 కూడా జారీ చేసిందని వెల్లడించారు. చలనచిత్ర, టీవీ రంగాలకు మరింత ప్రోత్సాహం ఇవ్వడానికే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని విజయకుమార్ రెడ్డి తెలిపారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3ogj2lT
v

ఎన్టీఆర్-త్రివిక్రమ్‌ ప్రాజెక్ట్‌కి నో చెప్పిన స్టార్ హీరోయిన్!

తెలుగు సినీ ఇండస్ట్రీని హీరోయిన్లు కొరత ఎప్పటి నుంచో వేధిస్తోంది. ఎంత మంది ముద్దుగుమ్మలు వచ్చినా ఆ లోటు కనపడుతూనే ఉంటుంది. రెండేళ్లుగా అగ్ర హీరోల సినిమాలను పూజా హెగ్డే, మాత్రమే భర్తీ చేస్తూ వస్తున్నారు. అనుష్క, కాజల్ అగర్వాల్ లాంటి ముదురు భామలు ఫేడౌట్ కావడంతో అగ్ర హీరోలకు వాళ్లిద్దరే ఆప్షన్‌గా మారిపోయారు. త్రివిక్రమ్‌ సైతం గత రెండు సినిమాల్లో పూజాతో వర్క్ చేశాడు. తాజాగా ఎన్టీఆర్‌తో ఆయన తీసే సినిమా కోసం టాప్ హీరోయిన్‌నే సెలక్ట్ చేయాలని అనుకుంటున్నాడట. దీంతో ఆయనకు ఇప్పుడు రష్మిక మాత్రమే ఛాయిస్‌గా మారింది. అయితే ఈ కన్నడ భామ మాత్రం మాటల మాంత్రికుడిగా షాకిచ్చిందని టాలీవుడ్‌లో టాక్ నడుస్తోంది. ఎన్నో ఆశలతో రష్మికను సంప్రదించగా కథ వినకుండానే రిజెక్ట్ చేసిందట. రష్మిక ప్రస్తుతం ‘పుష్ప’లాంటి పాన్ ఇండియా సినిమాతో పాటు రెండు బాలీవుడ్ చిత్రాల్లోనూ నటిస్తోంది. దీనికి తోడు కొన్ని కన్నడ సినిమాలను కూడా పూర్తి చేయాల్సి ఉంది. ఇంత బిజీ షెడ్యూల్‌ మధ్య కొత్త సినిమా అంగీకరిస్తే డేట్స్ అడ్జస్ట్ చేయలేనన్న కారణంగానే రష్మిక భారీ ఆఫర్‌ను సున్నితంగా తిరస్కరించిందని సమాచారం. Also Read:


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3n0vuo3
v

‘మెగాస్టార్’ వివాదం.. అభిమానులకు సారీ చెప్పిన ‘ఆహా’ టీమ్

ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్‌కు చెందిన ఓటీటీ యాప్‌ ‘’ ప్రేక్షకులను విశేషంగా అలరిస్తోన్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా హీరోయిన్ సమంత ‘సామ్ జామ్’ పేరుతో నిర్వహిస్తున్న టాక్‌ షోలో వారానికో సెలబ్రెటీ సందడి చేస్తున్నారు. వారు చెప్పే విశేషాల కోసం ప్రేక్షకులు ఆ షోను చూస్తుండటంతో ఆదరణ పెరుగుతోంది. ఇటీవలే చిరంజీవి ఈ షోకు హాజరై ఎన్నో సంగతులు పంచుకున్నారు. త్వరలోనే అల్లు అరవింద్, అల్లు అర్జున్ ఈ షోలో సందడి చేయనున్నారు. దీనికి సంబంధించి ఇటీవలే ప్రోమో కూడా విడుదల చేశారు. అయితే ఈ ప్రోమోలో అల్లు అర్జున్‌కి ముందు ‘మెగాస్టార్’ అనే బిరుదును చేర్చడం వివాదాస్పదమైంది. టాలీవుడ్‌లో మెగాస్టార్ అంటే ఒక్కరేనని, అల్లు అర్జున్ పేరు ముందర ఆ బిరుదును ఎందుకు చేర్చారంటూ మెగా అభిమానులు ‘ఆహా’ నిర్వాహకులపై మండిపడ్డారు. ఈ వివాదాన్ని వెంటనే గుర్తించిన ‘ఆహా’ టీమ్ తన తప్పును సరిదిద్దుకుంది. మెగాస్టార్ అభిమానులకు ట్విటర్ ద్వారా క్షమాపణలు చెప్పింది. సాంకేతిక తప్పిదం వల్లే అలా జరిగింది తప్ప ఎవరి మనోభావాలు దెబ్బతీయాలన్న ఉద్దేశం తమకు లేదన్నారు. ‘ఒకే ఒక్క మెగాస్టార్.. మనందరికీ ఇది తెలుసు’ అంటూ వివాదానికి చెక్ పెట్టింది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3aRdEBI
v

డైరెక్టర్ ప్రశాంత్ వర్మకు ప్రభాస్ సాయం.. మరింత క్రేజ్

‘ఆ!’, ‘కల్కి’ సినిమాలతో ప్రతిభావంతుడైన దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న ప్రశాంత్ వ‌ర్మ రూపొందిస్తోన్న మూడో చిత్రం ‘జాంబీ రెడ్డి’. ఈ సినిమా ద్వారా తేజ స‌జ్జా హీరోగా ప‌రిచ‌య‌మ‌వుతున్నారు. ఆనంది, ద‌క్ష హీరోయిన్లుగా న‌టించారు. ఇప్పటికే ప్రముఖ నటి సమంత విడుదల చేసిన ‘జాంబీ రెడ్డి’ ఫ‌స్ట్ బైట్‌ (టీజర్)కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన ల‌భించింది. జ‌న‌వ‌రి 2న ‘జాంబీ రెడ్డి’ బిగ్ బైట్ (ట్రైలర్) విడుద‌ల కానుంది. ఈ ట్రైలర్‌ను పాన్ ఇండియా స్టార్‌‌గా మారిన రెబ‌ల్ స్టార్ ఆవిష్కరించ‌నున్నారు. ఈ మేరకు చిత్ర యూనిట్ గురువారం ప్రకటించింది. ఈ మేరకు పోస్టర్ కూడా విడుదల చేసింది. టాలీవుడ్‌కు జాంబీ కాన్సెప్ట్‌ను ప‌రిచ‌యం చేస్తూ మ‌రో హై-కాన్సెప్ట్ ఫిల్మ్‌తో డైరెక్టర్ ప్రశాంత్ వ‌ర్మ ప్రేక్షకుల ముందుకు వ‌స్తున్నారు. క‌రోనా మ‌హ‌మ్మారి నేప‌థ్యంలో వ‌స్తున్న తొలి చిత్రం ‘జాంబీ రెడ్డి’ కావ‌డం విశేషం. ఈ చిత్రానికి సంబంధించి షూటింగ్ మొత్తం పూర్తయింది. పోస్ట్ ప్రొడ‌క్షన్ ప‌నులు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. త్వర‌లోనే సినిమాను విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు. కాగా, యాపిల్ ట్రీ స్టూడియోస్ బ్యానర్‌పై రాజశేఖర్ వర్మ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఆనంద్ పెనుమత్స, ప్రభ చింతలపాటి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్. స్క్రిప్ట్ విల్లే స్క్రీన్‌ప్లే అందించిన ఈ చిత్రానికి మార్క్ కె. రాబిన్ సంగీతం సమకూర్చారు. అనిత్ సినిమాటోగ్రఫీ అందించారు. సాయిబాబు ఎడిటర్. రచన, దర్శకత్వం ప్రశాంత్ వర్మ.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/38KpevI
v

రజినీకాంత్ రాజకీయాల్లోకి రాకపోవడమే మంచిది.. అన్నీ తెలిసిన వ్యక్తిగా చెబుతున్నా: మోహన్ బాబు

సూపర్‌స్టార్ రాజకీయాల్లో యూటర్న్ తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ నెల 31వ తేదీన రాజకీయ పార్టీకి అన్ని ఏర్పాట్లు చేసుకున్న సమయంలోనే రజినీ అనారోగ్యానికి గురయ్యారు. హైదరాబాద్‌లోని అపోలో ఆస్పత్రి నుంచి డిశ్చార్జయి చెన్నైలోని ఇంటికి చేరుకున్న ఆయన కుటుంబసభ్యులు, సన్నిహితుల సలహా మేరకు రాజకీయాల్లోకి రావడం లేదని ప్రకటించారు. రజినీ నిర్ణయంపై అభిమానులు తీవ్ర నిరాశకు గురికాగా.. కొందరేమో ఆయన నిర్ణయానికి మద్దతు పలుకుతున్నారు. ఈ నేపథ్యంలోనే రజినీకి అత్యంత సన్నిహితుడు, సీనియర్ నటుడు కూడా రజినీకి మద్దతుగా నిలిచారు. రజినీలాంటి ముక్కుసూటి మనిషి రాజకీయాల్లో రాణించలేరని అన్నారు. రాజకీయం లాంటి రొచ్చులోకి వెళ్లి బురద అంటించుకోకూడదని రజినీ సరైన నిర్ణయం తీసుకున్నారన్నారు. ఈ మేరకు మోహన్‌బాబు ఓ ప్రెస్‌నోట్ విడుదల చేశారు. ‘రజినీకాంత్ నాకు అత్యంత ఆత్మీయుడు అన్న సంగతి మీకందరికీ తెలుసు. తన ఆరోగ్య రీత్యా పాలిటిక్స్‌లోకి రావట్లేదు అని ప్రకటించాడు. ఒకరకంగా తను రాజకీయాల్లోకి రాకపోవడం మీకు, అభిమానులందరికీ బాధే అయినప్పటికీ, ఒక స్నేహితుడిగా తన ఆరోగ్యం గురించి పూర్తిగా తెలిసిన వ్యక్తిగా తాను రాజకీయాల్లోకి రాకపోవడం మంచిది అని నమ్ముతున్నాను. నా మిత్రుడితో ఎన్నో సందర్భాల్లో చెప్పాను. నువ్వు చాలా మంచివాడివి. చీమకు కూడా హాని చేయనివాడివి, నా దృష్టిలో వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ పర్సన్.. నీలాంటి వ్యక్తికి, నాలాంటి వ్యక్తికీ రాజకీయాలు పనికిరావు. ఎందుకంటే.. మనం ఉన్నది ఉన్నట్లు నిక్కచ్చిగా మాట్లాడతాం. ఎవరికి ద్రోహం చెయ్యం. డబ్బులిచ్చి ఓట్లు, సీట్లు కొనలేము... కొనము కూడా. ఇక్కడ ఎవరిని నమ్మాలో, ఎవరిని నమ్మకూడదో తెలియదు. రాజకీయాల్లోకి రానంత వరకు మంచివాడివి అన్న నోళ్లే.. రేపు వచ్చాక చెడ్డవాడిని అంటాయి. రాజకీయం ఒక రొచ్చు. ఒక బురద. ఆ బురద అంటుకోకుండా నువ్వు రాకపోవడమే మంచిది అయ్యింది. రజినీకాంత్ అభిమానులందరూ రజినీకాంత్ అంత మంచివాళ్లు. మీరందరూ సహృదయంతో నా మిత్రుడి నిర్ణయాన్ని అర్ధం చేసుకుంటారని ఆశిస్తూ... మీ మోహన్‌బాబు


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3o4VfF5
v

Naga Babu: నవ దంపతులు నిహారిక, చైతన్యలకు కరోనా.. క్లారిటీ ఇచ్చిన మెగా బ్రదర్ నాగబాబు

కరోనా క్రమంగా తగ్గిపోతుందనుకున్న తరుణంలో మెగా కుటుంబంలో కరోనా కలకలం రేగడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. RRR షూటింగ్‌లో పాల్గొంటున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తనకు కరోనా సోకిందంటూ స్వయంగా ప్రకటించారు. ఆ తర్వాతి రోజే వరుణ్ తేజ్ కూడా తనకు కరోనా పాజిటివ్ అని పేర్కొనడంతో మెగా అభిమానుల్లో ఆందోళన మొదలైంది. పైగా ఉపాస‌న సైతం త‌న‌కు క‌రోనా ప‌రీక్ష‌లో నెగెటివ్ వ‌చ్చిన‌ప్ప‌టికీ, వ‌చ్చే సూచ‌న‌లు క‌నిపిస్తున్నాయని తెలపడంతో అందరి కన్ను మెగా ఫ్యామిలీపై పడింది. రీసెంట్‌గా జొన్నలగడ్డ చైతన్యతో మ్యారేజ్ కావడం, అనంతరం నిహారిక బర్త్ డే, ఆ వెంటనే క్రిస్మస్ రావడంతో మెగా ఫ్యామిలీ అంతా ఒక్కచోట చేరి పార్టీలు చేసుకున్నారు. ఈ వేడుకల్లో వేడుక‌లో ప్ర‌తి ఒక్కరూ చాలా స‌న్నిహితంగా మెలిగినట్లు ఆ ఫొటోలు చూస్తే అర్థమైపోతుంది. దీంతో మరి నవదంతులు నిహారిక, చైతన్యలకు కూడా కరోనా సోకి ఉంటుందా అనే అనుమానాలు మొదలయ్యాయి. నిహారికకు కూడా కరోనా సోకి ఉంటుందనే పుకార్లు షికారు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఈ విషయమై క్లారిటీ ఇచ్చారు. హనీమూన్ కోసం మాల్దీవుల‌కు వెళ్లే ముందు డిసెంబ‌ర్ 26వ తేదీన ప్ర‌భుత్వ నిబంధ‌న‌ల ప్ర‌కారం నిహారిక‌, చైత‌న్య క‌రోనా పరీక్షలు చేయించుకున్నారని, అలాగే తిరిగి వచ్చేటప్పుడు డిసెంబ‌ర్ 29న ముంబై ఎయిర్ పోర్ట్‌లోనూ క‌రోనా టెస్టులు చేయించుకోగా నెగెటివ్ వచ్చినట్లు నాగబాబు తెలిపారు. దీంతో మెగా అభిమానులు కాస్త ఊపిరి పీల్చుకున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3mWSl40
v

మహేశ్‌ ఫ్యాన్స్‌కి కిక్కిచ్చిన వార్నర్.. ఈ వీడియో చూస్తే అవాక్కవ్వాల్సిందే

ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్ డేవిడ్ వార్నర్‌ తెలుగువారికి సుపరిచితుడే. ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ తరపున మెరుపులు మెరిపించడంతో పాటు తెలుగు సినీ పాటలకు డ్యాన్సులు వేస్తూ అలరిస్తుంటాడు. ఆయన టాప్ హీరోల పాటలు, డైలాగులకు తన మేనరిజాన్ని అప్లై చేసి ప్రేక్షకులను తరుచూ అలరిస్తుంటాడు. గతంలో పాటలకు స్పెప్పులు వేసి అదరగొట్టిన వార్నర్ న్యూ ఇయ్ వేళ సూపర్‌స్టార్ ఫ్యాన్స్‌ మరో సర్‌ప్రైజ్ ఇచ్చాడు. మహేశ్‌బాబు 25వ సినిమాగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కిన ‘మహర్షి’ ప్రేక్షకులను ఎంతగానో అలరించిన సంగతి తెలిసిందే. ఆ సినిమాలోని కొన్ని సన్నివేశాలను సెలక్ట్ చేసుకొని రీఫేస్ యాప్ సహాయంతో వార్నర్ ఓ వీడియోను రూపొందించాడు. అందులో మహేశ్ ఫేస్‌కి బదులుగా తన ఫేస్‌ని యాడ్ చేశాడు. కొన్ని డైలాగులకు ఎక్స్‌ప్రెషన్లు కూడా ఇచ్చాడు. ఈ వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేయడంతో సూపర్‌స్టార్ అభిమానులు ఖుషీ అవుతున్నారు. ఈ వీడియో నెటిజన్లతో పాటు మహేశ్‌ ఫ్యాన్స్‌ని విశేషంగా ఆకట్టుకుంటోంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3mWOOCM
v

గోవాలో ఎంజాయ్‌మెంట్ షురూ.. అప్పుడే ఫొటోలు వదిలిన సమంత.. వెరీవెరీ హాట్ గురూ!

న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసం గోవా టూర్ వేసిన .. ఎప్పటిలాగే తన హవా షురూ చేసేసింది. వెకేషన్ ట్రిప్స్ అంటే తెగ ఇష్టపడే ఈ బ్యూటీ ఎప్పుడు ఏ టూర్ వేసినా తన అందాలతో సోషల్ మీడియాను షేక్ చేయడం కామన్‌గా జరిగేదే. తాజాగా మళ్లీ అదే స్టార్ట్ చేసేసింది. 2021 కొత్త సంవత్సరానికి స్వాగతం పలకడానికి భర్త నాగ చైతన్యతో గోవా ఫ్లైట్ ఎక్కిన సామ్.. అక్కడి రిసార్ట్స్‌లో ఎంజాయ్‌మెంట్ షురూ చేసింది. తాజాగా అందుకు సంబంధించిన ఓ ఫొటోను తన ఇన్స్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయడంతో వెంటనే వైరల్ అయింది. చైసామ్ దంపతులకు గోవా అనేది ఎంతో ప్రత్యేకమైన ప్రదేశం. కొన్నేళ్లపాటు ప్రేమ ప్రయాణం సాగించిన ఈ రొమాంటిక్ జోడీ పెళ్లి బంధంతో ఒక్కటైంది కూడా గోవాలోనే. అందుకే ప్రతి ఏడాది న్యూ ఇయ‌ర్ వేడుక‌ల కోసం గోవా వెళ్తుంటారు చైసామ్ దంప‌తులు. ఈ సారి క‌రోనా మహమ్మారి భయం ఉన్నా కూడా గోవా టూర్ వేసి అక్కడి ఆహ్లాద‌క‌ర‌మైన వాతావర‌ణాన్ని ఎంజాయ్ చేస్తూ చిలౌట్ అవుతున్నారు అక్కినేని స్టార్స్. ఈ నేపథ్యంలో స‌మంత తాజాగా షేర్ చేసిన పిక్ చూస్తుంటే.. భ‌ర్త నాగ చైతన్యతో పాటు బెస్ట్ ఫ్రెండ్‌, డిజైన‌ర్ శిల్పారెడ్డితో క‌లిసి ఆమె ఈ టూర్ వేసిందని తెలుస్తోంది. అందరూ కలిసి గోవాలో పార్టీ చేసుకున్నాక దిగిన ఓ ఫొటోను సామ్ పోస్ట్ చేసింది. గత రాత్రి బెస్ట్ ఫ్రెండ్స్‌తో ఇలా.. అంటూ ఆమె క్యాప్షన్ పెట్టింది. అయితే ఈ ఫొటోలో సమంత పొట్టి దుస్తుల్లో కనిపించడంతో ''ఇక అందాల జాతర స్టార్ట్, బెస్ట్ రొమాంటిక్ జోడీ అంటే ఇదే, సూపర్ చైసామ్'' అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. ఓ వైపు సినిమాలు చేస్తూనే మరో వైపు వెబ్ సిరీస్‌లు చేస్తున్న సమంత.. వ్యాపారవేత్తగా కూడా సత్తా చాటుతోంది. ఏకమ్ పేరుతో చిల్డ్రన్స్ స్కూల్, సాకి పేరుతో ఫ్యాషన్ వరల్డ్ స్థాపించిన ఈ ముద్దుగుమ్మ.. మామ నాగార్జునతో కలిసి ఓటీటీ సంస్థ స్టార్ట్ చేయనుందని టాక్. సో.. చూస్తుంటే 2021లో సమంత జోష్ డబుల్ అవుతుందని తెలిసిపోతోంది కదూ!. చూడాలి మరి ఏం జరుగుతుందో.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3rIZkB1
v

‘జెర్సీ’ డైరెక్టర్‌తో మెగా పవర్‌స్టార్.. త్వరలోనే అనౌన్స్‌మెంట్!

దర్శక ధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి తెరకెక్కిస్తున్న ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలో నటిస్తు్న్నాడు మెగా పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్. దీంతో పాటు కొరటాల శివ డైరెక్షన్లో ‘ఆచార్య’లోనూ కీలక పాత్రలో కనిపించనున్నాడు. ఇవి తప్ప చరణ్‌ సినిమాలకు సంబంధించి ఇంకెలాంటి అప్‌డేట్స్ లేవు. దీంతో ఆయన నెక్ట్స్ మూవీ ఎవరితో చేస్తారన్నది సస్పెన్స్‌గా మారింది. లాక్‌డౌన్ సమయంలో చాలామంది దర్శకులు చరణ్‌కి కథలు వినిపించినా ఏ ఒక్కటీ ఫైనల్ చేయలేదు. తాజా సమాచారం ప్రకారం రామ్‌చరణ్‌ ఓ దర్శకుడికి ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. ‘జెర్సీ’ సినిమాతో విమర్శకుల ప్రశంసలు అందుకున్న గౌతమ్ తిన్ననూరితో ఓ సినిమా చేయబోతున్నాడని టాలీవుడ్ టాక్. గౌతమ్ చెప్పిన కథ చెర్రీకి బాగా నచ్చిందట. ఎమోషనల్ యాక్షన్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కబోతోందట. ప్రస్తుతం స్టోరీకి సంబంధించిన డిస్కషన్స్ జరుగుతున్నాయని, త్వరలోనే అధికారిక ప్రకటన రానుందని తెలుస్తోంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3hwNvcA
v

2020కి గుడ్ బై చెప్పేసిన ఖిలాడీ.. 2021 సర్‌ప్రైజ్‌తో రెడీగా ఉన్న రవితేజ.. ఇదీ విషయం

ఎన్నో అనుభవాలు.. మరెన్నో జ్ఞాపకాలు మిగిల్చిన 2020 సంవత్సరానికి గుడ్ బై చెబుతూ తన లేటెస్ట్ మూవీ '' అప్‌డేట్ ఇచ్చారు మాస్ మహారాజ్ . రమేష్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ నుంచి 2021 సర్‌ప్రైజ్ రెడీగా ఉందని తెలిపారు. రేపు అనగా 2021 జనవరి 1వ తేదీ ఉదయం 9 గంటలకు సిద్ధంగా ఉండండని తెలుపుతూ కొత్త పోస్టర్ రిలీజ్ చేశారు. రవితేజ కెరీర్‌లో 67వ సినిమాగా రాబోతున్న ఈ 'ఖిలాడీ' మూవీలో మీనాక్షి చౌదరి, డింపుల్‌ హయతి హీరోయిన్లుగా నటిస్తున్నారు. డా.జయంతిలాల్‌ గడ సమర్పణలో ఏ స్టూడియోస్‌, పెన్‌ స్టూడియోస్‌ పతాకాలపై సత్యనారాయణ కోనేరు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రాక్‌స్టార్‌ దేవి శ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్నారు. ఇటీవలే రిలీజ్ చేసిన ఈ మూవీ ఫస్ట్‌లుక్ పోస్టర్ మాస్ అభిమానులను యమ అట్రాక్ట్ చేస్తూ విశేష స్పందన తెచ్చుకుంది. Also Read: ప్రస్తుతం ‘ఖిలాడీ’ షూటింగ్‌లో బిజీగా ఉన్న రవితేజ.. ఇటీవలే సెట్స్ మీద దిగిన ఓ సెల్ఫీని సోషల్ మీడియాలో షేర్ చేశారు. దానికి 'ఇన్ యాక్షన్ మోడ్' అంటూ క్రేజీ క్యాప్షన్ పెట్టడంతో ఈ ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. ఖిలాడీ వెయిటింగ్ ఇక్కడ అంటూ కామెంట్ల వర్షం కురిపించారు రవితేజ ఫ్యాన్స్. మరోవైపు రవితేజ లేటెస్ట్ మూవీ 'క్రాక్' సంక్రాంతి కానుకగా విడుదలకు సిద్ధమైంది. సమ్మర్‌లో 'ఖిలాడీ' ప్రేక్షకుల ముందుకు రానుంది. సో.. రవితేజ స్పీడు చూస్తుంటే వచ్చే ఏడాది మాస్ మహారాజ్ అభిమానులకు కన్నుల పండగే అని తెలుస్తోంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/34YeMj9
v

Roja: అనసూయను చంపేస్తానంటూ జబర్దస్త్ కమెడియన్ వీరంగం.. రోజా పేరెత్తగానే ఊగిపోతూ రచ్చ రచ్చ

బీరు బాటిల్ చేతబట్టి అనసూయను చంపేస్తా అంటూ రచ్చ రచ్చ చేశాడు ఓ జబర్దస్త్ కమెడియన్. అంతేకాదు పేరెత్తగానే ఊగిపోతూ వీరంగం సృష్టించాడు. ఇది చూసి భయంతో వణికిపోయింది. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారింది. ఇంతకీ అనసూయను జబర్దస్త్ కమెడియన్ ఎందుకు టార్గెట్ చేశాడు? ఇంత రచ్చ ఎందుకు చేయాల్సి వచ్చిందనే విషయానికొస్తే.. న్యూ ఇయర్ సందర్భంగా ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేసేందుకే ఇదంతా. అదేనండీ.. కొత్త సంవత్సరం కానుకగా ఓ స్పెషల్ ఎపిసోడ్ ప్లాన్ చేసి ఢీ, జబర్దస్త్ కమెడియన్స్ అంతా కలిసి ఈ స్కిట్ చేశారు. ప్రతి పండగకు స్పెషల్ ప్రోగ్రామ్స్ ప్రసారం చేస్తూ బుల్లితెర ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తున్న ఈటీవీ యాజమాన్యం ఈ న్యూ ఇయర్ రోజున మరింత స్పెషల్‌గా అలరించబోతోంది. డిజే 2021 స్పెషల్ ఈవెంట్ అనే టైటిల్‌తో రోజా, అనసూయ సహా అటు జబర్దస్త్, ఇటు ఢీ కంటెస్టెంట్స్‌ ఒకే వేదికపై నవ్వుల హంగామా చేశారు. తాజాగా ఈ ఈవెంట్ ప్రోమో రిలీజ్ చేయగా అందులో జబర్దస్త్ కమెడియన్ అనసూయను టార్గెట్ చేయడం హైలైట్ అవుతోంది. మందుబాబు పాత్రలో కనిపించిన రాకెట్ రాఘవ తెగ హల్చల్ చేశాడు. స్క్రిప్టులో భాగంగానే తన స్కిట్ వచ్చేటప్పుడు ఎవరి యాక్షన్ ఎలా ఉంటుందో చేసి చూపించాడు. రోజా పేరు రాగానే ఏయ్ అంటూ ఊగిపోయిన రాఘవ.. రోజా గురించి నేను చెబుతా అంటూ తొడగొట్టి మరీ రోజా గారు తల్లి మాహాలక్ష్మి అంటూ దండం పెట్టేశాడు. ఈ వెంటనే యాంకర్ అనసూయ పేరు తీయగానే.. వీరంగం సృష్టించాడు. అన్ని స్కిట్లకు నవ్వుతుంది గానీ నా స్కిట్లకు నవ్వదేంటి? అంటూ బీరు బాటిల్ చేతబట్టి రెచ్చిపోయాడు రాఘవ. దీంతో నవ్వుతానండీ.. అంటూ భయపడుకుంటూ అనసూయ కనిపించడం ఈ ప్రోమోలో మరింత అట్రాక్షన్ అయింది. ఇక ఇదే వీడియోలో హైపర్ ఆది, ప్రదీప్, సుడిగాలి సుధీర్, రష్మీ ఒకరిపై ఒకరు వేసుకున్న పంచులు జనాలకు యమ కిక్కివ్వడమే గాక షోపై ఆసక్తి పెంచేశాయి.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2L5LcBk
v

Wednesday 30 December 2020

తిరుమల శ్రీవారి సేవలో సునీత.. పెళ్లి డేట్‌ని అఫీషియల్‌గా ప్రకటించిన ఫేమస్ సింగర్

టాలీవుడ్ ప్లే బ్యాక్ సింగర్ రెండో వివాహానికి సిద్దమైన సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ విషయాన్ని స్వయంగా ప్రకటిస్తూ తన నిశ్చితార్థపు ఫొటోలు షేర్ చేశారు సునీత. డిజిట‌ల్ మీడియా ప‌ర్స‌న్ రామ్ వీర‌ప‌నేనిని త‌ను వివాహం చేసుకోబోతున్నాన‌ని సోష‌ల్ మీడియా ద్వారా పేర్కొన్నారు. దీంతో సునీత రెండో వివాహం తాలూకు విషయాలు నెట్టింట ట్రెండింగ్‌గా మారాయి. ఈ నేపథ్యంలోనే తన పెళ్లి డేట్ కన్ఫర్మ్ చేసిన ఆమె.. పెళ్లికి ముందు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. దాదాపు 10 నెలల అనంతరం స్వామి వారిని వైకుంఠ ద్వారం ద్వారా దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని, జ‌న‌వ‌రి 9న త‌మ వివాహం జ‌ర‌గ‌నుంద‌ని సునీత పేర్కొన్నారు. త‌న‌కు మంచి జీవితాన్ని అందించాల‌ని స్వామి వారిని కోరుకున్నట్లు చెప్పారు. ఇక ఇప్పటికే ఇప్పటికే సునీత నిశ్చితార్థం, ప్రీ వెడ్డింగ్ పార్టీలు ఘనంగా జరిగాయి. శనివారం (డిసెంబర్ 26) సాయంత్రం జరిగిన సునీత ప్రీ వెడ్డింగ్ పార్టీకి పలువురు సెలబ్రిటీలు హాజరై ఆమెకు శుభాకాంక్షలు చెప్పారు. నిజానికి డిసెంబ‌ర్‌లో పెళ్లి చేసుకోవాల‌ని ఈ జంట భావించిన‌ప్ప‌టికీ ఇద్ద‌రి జాత‌కాల ప్ర‌కారం స‌రైన ముహూర్తాలు లేక‌పోవ‌డంతో జ‌న‌వ‌రి 9వ తేదీన ఈ మూడు మూళ్ళ బంధానికి ముహూర్తం ఫిక్స్ చేశారు. 19 ఏళ్ల వయసులోనే పెళ్లి చేసుకున్న సునీత.. కొన్నేళ్ల తర్వాత భర్తతో విడాకులు చేసుకున్నారు. అప్పటి నుంచి ఇద్దరు పిల్లల బాధ్యతను మోస్తూ ఒంటరిగానే ఉంటున్న ఆమె.. ఇన్నేళ్ల తర్వాత మరో కొత్త ప్రయాణం మొదలు పెడుతుండటం విశేషం. కరోనా నిబంధనలు పాటిస్తూ జరగనున్న వేడుకలో కేవలం ఆమె కుటుంబసభ్యులు, అత్యంత సన్నిహితులు మాత్రమే పాల్గొనబోతున్నారని సమాచారం.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3n6jLnX
v

Pushpa: సుకుమార్ ప్లాన్‌పై దెబ్బేసిన దిశా పటానీ! అమ్మడి డిమాండ్ చూస్తే.. ఇదీ మ్యాటర్

రంగస్థలం సినిమా తర్వాత క్రియేటివ్ డైరెక్టర్ చేస్తున్న మరో ప్రయోగాత్మక సినిమా 'పుష్ప' స్టైలిష్ స్టార్ హీరోగా ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ సినిమా నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా మూవీగా ఐదు భాషల్లో రూపొందుతున్న ఈ సినిమాపై సుక్కు స్పెషల్ కేర్ తీసుకుంటున్నారు. ఏ చిన్న పాయింట్ కూడా ప్రేక్షకులను డిజప్పాయింట్ చేయొద్దనే కోణంలో పక్కాగా ప్లాన్స్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోతన రెగ్యులర్ పంథాలోనే 'పుష్ప' కోసం సూపర్ డూపర్ ఐటెం సాంగ్ ప్లాన్ చేసి.. హీరోయిన్ దిశా పటానిని సంప్రదించగా ఆమె సుక్కుకే చుక్కలు కనబడే రెమ్మ్యూనరేషన్ డిమాండ్ చేసిందట. సుకుమార్ మూవీ అంటేనే ఐటెం సాంగ్‌తో థియేటర్లు హోరెత్తిపోవాల్సిందే. అందులో అల్లు అర్జున్- సుకుమార్ కలిస్తే ఎలా ఉంటుందో మీ అందరికీ తెలుసు. ఈ క్రమంలోనే దిశా పటానితో ఓ రేంజ్ ఐటెం నెంబర్ ప్లాన్ చేశారట సుక్కు. అయితే ఈ సాంగ్ చేసేందుకు గాను ఏకంగా కోటిన్నర అడిగిందట . దీంతో నాలుగు నిమిషాల పాట కోసం అంత ఖర్చు పెట్టడం ఎందుకని వేరే హీరోయిన్ వేట ప్రారంభించిన సుకుమార్.. బాలీవుడ్ బ్యూటీ ఊర్వశీ రౌతేలా పేరు పరిశీలనలో పెట్టారని టాక్. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బన్నీ డిఫరెంట్ గెటప్‌తో కనిపించనున్నారు. లారీ డ్రైవర్ పుష్పరాజ్ పాత్రలో అల్లు అర్జున్ నటిస్తుండగా ఆయన సరసన పల్లెటూరు పిల్లలా రష్మిక మందన కనిపించనుంది. ఇటీవలే ఈ చిత్ర షూటింగ్ సమయంలో ఆరుగురు యూనిట్ సభ్యులకు కరోనా సోకటంతో షూటింగ్ వాయిదా వేసిన సుక్కు.. అతి త్వరలో తిరిగి షూటింగ్ ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ మూవీపై అల్లు అర్జున్ అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2X4j9oh
v

ప్రియుడితో మాల్దీవుల్లో కియారా అద్వానీ సరదా.. బ్యాక్‌లెస్ పోజుతో మత్తెక్కించిన లస్ట్ భామ

న్యూ ఇయర్‌కి గ్రాండ్ వెల్కమ్ చెప్పేందుకు సినీ సెలబ్రిటీలు రెడీ అయ్యారు. ఎవరికి వారు తమ తమ ప్లాన్స్ వేసుకొని సిద్ధంగా ఉన్నారు. ఈ మేరకు కొన్ని సెలబ్రిటీ ప్రేమ పక్షులు ఈ వేడుకల కోసం మాల్దీవ్స్ లాంటి అందమైన ప్రదేశాలను ఎంచుకుంటున్నాయి. ఆ లిస్ట్‌లో మొదటగా చెప్పుకోవాల్సిన జోడీ కియారా అద్వానీ- . ఈ ఇద్దరూ కలిసి 2021 న్యూ ఇయర్ సంబరాల కోసం మాల్దీవ్స్ వెళ్లారు. దీంతో గత కొంతకాలంగా ఈ జోడీ డేటింగ్ చేస్తోందంటూ వస్తున్న వార్తలకు బలం చేకూరింది. నిన్న (బుధవారం) కియారా, సిద్దార్థ్ మల్హోత్రా ముంబై ఎయిర్‌పోర్టులో మీడియా కంటికి చిక్కడంతో వీరిద్దరి మాల్దీవ్స్ ట్రిప్ వ్యవహారం బయటపడింది. ఇకపోతే తాజాగా తన సోషల్ మీడియా ఖాతాలో కియారా పోస్ట్ చేసిన ఓ పిక్ నెట్టింట వైరల్ అవుతోంది. ప్రియుడితో కలిసి మాల్దీవుల్లో దిగగానే ఎంజాయ్ చేయడం ప్రారంభించింది కియారా. ఈ మేరకు సముద్ర తీరాన బ్యాక్‌లెస్ బికినీతో ఓ ఫొటోకు పోజిచ్చి ఆ పిక్‌ని అభిమానులతో పంచుకుంది. ''2021 కోసం ఎదురు చూస్తున్నా'' అంటూ దీనిపై ట్యాగ్ చేసింది. ఇది చూసి మరి సిద్దార్థ్ ఎక్కడ? అంటూ ప్రశ్నిస్తున్నారు నెటిజన్లు. తెలుగులో మహేష్ బాబు సరసన 'భరత్ అనే నేను' సినిమాలో, రామ్ చరణ్ సరసన 'వినయ విధేయ రామ' సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న .. హిందీలో 'కబీర్ సింగ్' సినిమాతో స్టార్ స్టేటస్ పట్టేసింది. అలాగే 'లస్ట్ స్టోరీస్' వెబ్ సిరీస్‌లో స్వయం తృప్తి పొందే మహిళగా బోల్డ్ క్యారెక్టర్ చేసి తన డేరింగ్‌నెస్ బయటపెట్టింది. ప్రస్తుతం ఈ బ్యూటీ.. ''షేర్షా, భూల్ భులయ్యా, జగ్ జగ్ జీయో'' చిత్రాల్లో నటిస్తోంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3o3ICKH
v

భర్త నాగ చైతన్యతో సమంత న్యూ ఇయర్ ట్రిప్.. గోవాలో చిల్ కాబోతున్న రొమాంటిక్ జోడీ

ప్రపంచానికే ఎన్నో అనుభవాలను నేర్పుతూ కష్ట సుఖాలంటే ఎలా ఉంటాయో తెలిపిన 2020కి నేటితో ముగింపు పలకబోతున్నాం. ఈ నేపథ్యంలో 2021 సంవత్సరానికి గ్రాండ్ వెల్కమ్ చెప్పేందుకు అంతా సిద్ధమయ్యారు. ఇప్పటిదాకా ఎన్నో సంవత్సరాలకు వీడ్కోలు చెబుతూ న్యూ ఇయర్ వేడుకలు జరుపుకున్నారు కానీ ఈ 2020కి వీడ్కోలు చెప్పడం ప్రత్యేకం అంటున్నారు జనం. ఇకపోతే నూతన సంవత్సర వేడుకలు జరుపుకునేందుకు ఒక్కొక్కరూ ఒక్కోలా ప్లాన్ చేసుకుంటున్నారు. సాధారణ ప్రజలతో పాటు సెలబ్రిటీలంతా వారి వారి కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి 2021 సంవత్సరానికి వెల్కమ్ సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో అక్కినేని తమ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసం గోవాను వేదికగా ఎంచుకున్నట్లు తెలిసింది. ఈ మేరకు భర్త నాగ చైతన్యతో కలిసి గోవా పయనమైంది సామ్. హైదరాబాద్‌లోని రాజీవ్‌ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో మంగళవారం చైసామ్ జోడీ కెమెరా కంటికి చిక్కింది. ఇద్దరూ ముఖానికి మాస్కులు ధరించి గోవా బయల్దేరారు. దీంతో ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌ అయ్యాయి. ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ సమయం దొరికినప్పుడల్లా అలా అలా షికార్లు కొట్టే ఈ అక్కినేని జోడీ గోవాలోని ప్లష్‌ రిసార్ట్‌లో న్యూ ఇయర్‌ వేడుకలను ప్లాన్ చేసుకున్నారు. ఇప్పటి నుంచి జనవరి మొదటి వారం ముగిసేవరకు ఈ ఇద్దరూ అక్కడే ఎంజాయ్ చేయనున్నారని తెలుస్తోంది. 2017 సంవత్సరంలో చైసామ్ గోవాలో ఒక్కటైన సంగతి తెలిసిందే. అందుకే వారిద్దరికీ గోవా ఎంతో ప్రత్యేకం. ఈ మేరకు న్యూ ఇయర్ వేడుకల కోసం గోవాలో సందడి చేయాలని ఫిక్స్ అయ్యారట అక్కినేని దంపతులు. సో.. చూస్తుంటే 2021 ఆరంభంలోనే ఈ జోడీ రొమాంటిక్ పిక్స్ మరోసారి సోషల్ మీడియాకు షేక్ చేయడం ఖాయమే అనిపిస్తోంది కదూ!.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/34X19kq
v

ఎన్టీఆర్‌కు విలన్‌గా ఆ స్టార్ నటుడు.. త్రివిక్రమ్ మాస్టర్ ప్లాన్!

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ త్వరలోనే నటించబోతున్న విషయం తెలిసిందే. షూటింగ్ పూర్తికాగానే త్రివిక్రమ్ సినిమాను ఎన్టీఆర్ మొదలుపెడతారు. ప్రస్తుతం త్రివిక్రమ్ ఈ చిత్ర ప్రీ-ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నారు. మరోవైపు ఎన్టీఆర్ RRR షూటింగ్‌ను పూర్తిచేసే పనిలో ఉన్నారు. ఇదిలా ఉంటే, త్రివిక్రమ్-ఎన్టీఆర్ సినిమాకు సంబంధించి ఒక క్రేజీ రూమర్ ప్రస్తుతం వినిపిస్తోంది. త్రివిక్రమ్ సినిమాలో ఎన్టీఆర్‌కు విలన్‌గా కన్నడ స్టార్ నటుడు ఉపేంద్ర నటించనున్నారని ప్రెజెంట్ టాక్. ప్రస్తుతం ఉపేంద్రతో త్రివిక్రమ్ సంప్రదింపులు జరుపుతున్నారట. త్రివిక్రమ్‌తో ఇప్పటికే ఉపేంద్ర పనిచేశారు. త్రివిక్రమ్-అల్లు అర్జున్ కాంబినేషన్‌లో వచ్చిన ‘సన్ ఆఫ్ సత్యమూర్తి’ సినిమాలో ఉపేంద్ర కీలక పాత్ర పోషించారు. దీంతో ఆయన్ని విలన్‌గా కూడా త్రివిక్రమ్‌ ఒప్పిస్తారనే టాక్ నడుస్తోంది. తనకు పాత్ర నచ్చితే తెలుగులో కూడా నటించడానికి సిద్ధమని ఆ మధ్య ఇంటర్వ్యూలో ఉపేంద్ర చెప్పారు. పాత్ర నచ్చడంతో వరుణ్ తేజ్ సినిమాలో నటించడానికి అంగీకరించారు. మరి ఎన్టీఆర్ సినిమాలో ఉపేంద్ర విలన్ అనే వార్త నిజ రూపం దాల్చుతుందో లేదో చూడాలి. కాగా, ఈ సినిమాకు ‘అయిననూ పోయిరావలె హస్తినకు’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్టు సమాచారం. హారిక అండ్ హాసిని క్రియేషన్స్, యన్.టి.ఆర్ ఆర్ట్స్ బ్యానర్లపై ఎస్. రాధాకృష్ణ, నందమూరి కళ్యాణ్‌రామ్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. తమన్ సంగీతం సమకూరుస్తున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2WWsv5B
v

రెండు సార్లు కొవిడ్ టెస్ట్ చేయించుకున్నా: అల్లు శిరీష్

మెగా ఫ్యామిలీని కరోనా వైరస్ ఇబ్బంది పెట్టిన సంగతి తెలిసిందే. మెగా హీరోలు రామ్ చరణ్, వరుణ్ తేజ్‌కు కొవిడ్-19 పాజిటివ్ వచ్చిన సంగతి తెలిసిందే. మెగా హీరోలంతా డిసెంబర్ 25న జరిగిన క్రిస్మస్ పార్టీలో పాల్గొన్నారు. ఇక్కడి నుంచే వైరస్ వ్యాప్తి చెంది ఉంటుందని చాలా మంది అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో హీరో కరోనా టెస్ట్ చేయించుకున్నారు. ఆయనకు నెగిటివ్ వచ్చింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీలో పోస్ట్ చేశారు. ‘‘నేను రెండు సార్లు కరోనా టెస్ట్ చేయించుకున్నాను. రెండు సార్లూ నెగెటివ్ అని తేలింది. ఈ సమయంలో కొవిడ్-19, ఆరోగ్యం గురించి కొన్ని విషయాలు పంచుకోవాలని అనుకుంటున్నాను. నేను ఒక పెళ్లి వేడుకలో పాల్గొన్నాను. ప్రయాణం చేశాను. అపరిచితులైన 100 మందితో రోజూ షూటింగ్‌లో పాల్గొంటాను. నేను మాస్క్ ధరిస్తాను, శానిటైజర్స్ వాడతాను, అన్ని జాగ్రత్తలూ తీసుకుంటాను. అయినప్పటికీ, కొవిడ్ సోకిన వ్యక్తిని కలవకుండా ఉండటం అనేది ప్రాక్టికల్‌గా కుదరదు. నేను సురక్షితంగా ఉండటానికి కారణం ఆయుర్వేదం, అదృష్టం అని నేను నమ్ముతాను. వందేళ్ల క్రితం వరకు మనిషి తన జీవితాన్ని పాములు, గబ్బిలాలు, ఎలుకల మధ్య గడిపాడు. వాటి ద్వారా వ్యాపించే వ్యాధుల నుంచి మనల్ని రక్షించుకోవడానికి మన పూర్వీకులు ఇప్పటికే ఔషధాలు కనుగొన్నారు. సురక్షితమైన టీకా వచ్చేంత వరకు మనం మాస్క్‌లు ధరించడం మాత్రమే కాదు ఆరోగ్యంగా ఉండటానికి సంప్రదాయబద్ధమైన ఔషధాలు వాడాలి. మన తాతలు వాడిన ఆయుష్ క్వాత్, మృత్యుంజయ రస, చ్యావన్‌ప్రాషా, ఇతర ఆయుర్వేద ఔషధాలు కాలం చెల్లిపోలేదు. సనాతన ధర్మ, ఆయుర్వేదం నుంచి ఈ ప్రపంచానికి అందిన కాలం చెల్లని బహుమతులు. సురక్షితంగా ఉండండి, ఆరోగ్యంగా ఉండండి. లవ్ యు ఆల్’’ అని అల్లు శిరీష్ పేర్కొన్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3n1lQBV
v

మహేష్ బాబు కూతురికి కరోనా టెస్ట్

కరోనా వైరస్ సెకండ్ వేవ్ మొదలైందని ఇప్పటికే వార్తలు వచ్చాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తగు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వ వైద్యాధికారులు, వైద్యులు సూచిస్తున్నారు. అయితే, ముందస్తు రక్షణా చర్యల్లో భాగంగా సూపర్ స్టార్ కుమార్తె సితార కొవిడ్-19 టెస్ట్ చేయించుకుంది. తన ఇంట్లోనే డాక్టర్‌కు స్వాబ్ శాంపిల్స్ ఇచ్చింది. తాను స్వాబ్ శాంపిల్స్ ఇస్తున్న వీడియోను సితార ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ఈ వీడియోలో కాస్త భయం భయంగానే శాంపిల్స్ ఇస్తున్నట్టు కనిపించింది సితార. అయితే, కొవిడ్ పరీక్ష చేయించుకోవడానికి అస్సలు భయపడవద్దని తన వయసు పిల్లలకు చెబుతోంది సితార పాప. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా మెసేజ్ ఇచ్చింది. ‘‘కొవిడ్ టెస్ట్ తొలిసారి చేయించుకున్నాను. దీని గురించి నా తోటి వయసున్న పిల్లలకు కాస్త సమాచారం ఇస్తున్నాను. ఈ పరీక్ష చేసుకోవడానికి ముందు నేను సంకోచించాను. కానీ, అమ్మ పక్కనే ఉండటంతో ధైర్యంగా చేయించుకున్నాను. అమ్మ నా చేయి పట్టుకుని ఉంది. మీరు కనుక స్నేహితుల్ని, కుటుంబ సభ్యుల్ని కలుస్తున్నట్టయితే కొవిడ్ టెస్ట్ చేయించుకోవడం మరిచిపోకండి. మీరు సురక్షితంగా ఉన్నారో లేదో కచ్చితంగా తెలుసుకోండి. నేను తెలుసుకున్నాను. నిజం చెప్పాలంటే ఈ కొవిడ్ టెస్ట్ ఇబ్బందిగా, కష్టంగా, నొప్పిగా ఏమీ లేదు. కాబట్టి, కొవిడ్ టెస్ట్ చేయించుకుని సురక్షితమైన సమాజాన్ని నిర్మించండి. సురక్షితంగా, సంతోషంగా కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టాలని కోరుకుంటున్నాను’’ అని సితార ఇన్‌స్టాగ్రామ్‌లో పేర్కొంది. గత నెల మహేష్ బాబు ఫ్యామిలీ విహారయాత్రకు వెళ్లిన సంగతి తెలిసిందే. లాక్‌డౌన్ తరవాత తొలిసారి ఫ్యామిలీతో విదేశీ యాత్రకు వెళ్లారు సూపర్ స్టార్. ఈ విహారయాత్ర తరవాత కూడా సితార కుటుంబ సభ్యులు, స్నేహితులతో ట్రావెల్ చేసిందట. బహుశా అందుకే సేఫ్టీ కోసం సితారకు కొవిడ్ టెస్ట్ చేయించినట్టున్నారు. మొత్తం ఈ టెస్ట్ ద్వారా ఒక మెసేజ్‌ కూడా ఇచ్చేసింది ఈ లిటిల్ స్టార్.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/34Vsfs4
v

నీ ప్రయాణం స్ఫూర్తిదాయకం.. సోనూ సూద్‌పై చిరంజీవి ప్రశంసలు

వెండితెరపై తన విలనిజంతో పాన్-ఇండియా స్థాయిలో ప్రేక్షకులను అలరించిన ప్రముఖ నటుడు లాక్‌డౌన్ సమయంలో మానవత్వాన్ని చాటుకున్నారు. కొన్ని వేల మంది వలస కార్మికులకు అండగా నిలబడ్డారు. ముంబైలో చిక్కుకుపోయిన వలస కార్మికులను తన సొంత ఖర్చులతో బస్సులు, ట్రైన్లు, విమానాలు ఏర్పాటు స్వస్థలాలకు చేర్చారు. కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తున్న సమయంలో పేద ప్రజలకు అండగా నిలబడి రియల్ హీరో అనిపించుకున్నారు. తన సేవను అక్కడితో ఆపకుండా పేద పిల్లలకు గుండె శస్త్ర చికిత్సలు చేయిస్తున్నారు. ఆపదలో ఉన్నాం ఆదుకోండి అని వేడుకుంటోన్న ప్రతి ఒక్కరికీ సాయం చేస్తున్నారు. అందుకే వారంతా సోనూ సూద్‌ను మనిషి రూపంలో ఉన్న దేవుడు అంటున్నారు. మహానుభావుడు అని పిలుస్తున్నారు. అయితే, తాను మహానుభావుడిని కాదని అంటున్నారు సోనూ సూద్. తన శక్తి మేర సాయం మాత్రం చేస్తున్నానని చెబుతున్నారు. అంతేకాదు, ‘’ అనే టైటిల్‌తో ఆటోబయోగ్రఫీ రాసుకున్నారు. అంటే ‘నేను మహానుభావుడిని కాదు’ అనే అర్థం వస్తుంది. రచయిత మీనా అయ్యర్‌తో కలిసి సోనూ సూద్ రచించిన ఈ పుస్తకాన్ని ఈ నెల మొదట్లో విడుదల చేశారు. ఈ పుస్తకం చదివిన మౌని రాయ్, తుషార్ కపూర్, అపర్‌శక్తి ఖురానా, రాజ్‌కుమార్ రావు లాంటి బాలీవుడ్ సెలబ్రిటీస్‌ సోనూ సూద్‌ను అభినందించారు. అయితే, ఈ పుస్తకాన్ని తాజాగా మెగాస్టార్ చిరంజీవికి అందజేశారు సోనూ సూద్. ప్రస్తుతం ‘ఆచార్య’ షూటింగ్‌లో పాల్గొంటున్న సోనూ సూద్.. ఆ సినిమా సెట్‌లోనే చిరంజీవికి తన పుస్తకాన్ని అందజేశారు సోనూ. ఈ విషయాన్ని స్వయంగా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. సోనూపై ప్రశంసల వర్షం కురిపించారు. ‘‘ఐ యామ్ నో మెస్సియా పుస్తకాన్ని అందించిన సోనూ సూద్‌కు అభినందనలు. హీరోలు పుట్టరు, తయారవుతారని మీరు మరోసారి నిరూపించారు. సరైన సమయంలో మీరు అద్భుతంగా స్పందించి కొన్ని వేల మంది ప్రజలను ఆదుకున్నారు. మీ ప్రయాణం కచ్చితంగా స్ఫూర్తిదాయకం’’ అని చిరంజీవి ట్విట్టర్‌లో పేర్కొన్నారు. చిరంజీవి ట్వీట్‌కు సోనూ సూద్ స్పందించారు. ‘‘నాకెంతో ఇష్టమైన వ్యక్తి నుంచి ఇంత ప్రేమను పొందడం చాలా సంతోషంగా ఉంది. మీకు కృతజ్ఞతలు ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు సార్. ‘యు ఆర్ ద బెస్ట్’ అని మాత్రం చెప్పగలను. మీరు ఈ పుస్తకం చదవడం పూర్తిచేసిన తరవాత మీరు ఇచ్చే ఫీడ్‌బ్యాక్ కోసం వేచి చూస్తున్నాను. హాయిగా చదవండి. లవ్ యు సార్’’ అని చిరంజీవిపై తన ప్రేమను చాటుకున్నారు సోనూ సూద్.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2X9pdMF
v

‘మెయిల్’ టీజర్: ప్రియదర్శి కంప్యూటర్ ట్రైనింగ్.. నవ్వు ఆపుకోలేరు.. ఆ రోజులు గుర్తొస్తాయి!

తెలుగు ప్రేక్షకుల‌ను ఈ ఏడాది ఎంట‌ర్‌టైన్మెంట్‌తో అల‌రించిన అచ్చ తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫాం ‘ఆహా’.. రానున్న కొత్త సంవత్సరం 2021కి సరికొత్తగా ఆహ్వానం పలుకుతుంది. అందులో భాగంగా వైజయంతీ మూవీస్ సంస్థలో భాగమైన స్వప్న సినిమా బ్యానర్‌పై ప్రియాంక ద‌త్, స్వప్న ద‌త్ నిర్మాత‌లుగా ఉద‌య్ గుర్రాల ద‌ర్శక‌త్వంలో రూపొందిన వెబ్ సిరీస్ ‘కంబాలపల్లి కథలు’లో మొదటి భాగంగా ‘మెయిల్‌’‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తోంది. సంక్రాంతి సందర్భంగా జనవరి 13న ఈ వెబ్ సిరీస్ ఛాప్టర్ 1 ‘మెయిల్’ను విడుదల చేస్తోంది. ఇంటర్నెట్ వచ్చిన కొత్తలో ప్రజలు దాని వాడకం తెలిసీ తెలియక ఎలా ప్రవర్తించారనే కథాంశంతో దర్శకుడు ఉదయ్ గుర్రాల హాస్య భరితంగా, మనసుకు హత్తుకునేలా ‘మెయిల్‌’ను తెర‌కెక్కించారని నిర్మాత స్వప్న దత్ తెలిపారు. బుధ‌వారం మెయిల్ టీజ‌ర్‌ను విడుద‌ల చేశారు. ప్రియ‌ద‌ర్శి ప్రధాన పాత్రలో న‌టించారు. ఈ టీజర్ చూసిన ప్రతి ఒక్కరూ ఆ పాత రోజుల్ని గుర్తుచేసుకోవడం ఖాయం. ఎందుకంటే ఇందులో ప్రియదర్శి కంప్యూటర్ ట్రైనర్. కానీ, కంప్యూటర్ భాగాలను సరిగా పలకడం కూడా రాదు. ‘2005.. అప్పుడప్పుడే ఊర్లళ్ళో కంప్యూటర్ పరిచయమవుతున్న రోజులు..’ అని ఈ టీజర్‌ను మొదలుపెట్టారు. ‘కంప్యూటర్.. సముద్రం.. బోలెడుంటాయి. మూజ్, కీబర్డ్, ఊపీఎస్, మాంటర్’ అంటూ తనదైన శైలిలో కామెడీ పండించారు ప్రియదర్శి. ఇలాంటి ట్రైనర్ ఊళ్లో అందరికీ కంప్యూటర్ శిక్షణ అందించడం ఎంత హిలేరియస్‌గా ఉంటుందో చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సిరీస్‌లో హ‌ర్షిత్ మాల్గి రెడ్డి, మ‌ణి అగెరుల‌, శ్రీ గౌరీ ప్రియారెడ్డి, శ్రీకాంత్ పల్లె, రవీందర్ బొమ్మకంటి, అనుషా నేత తదితరులు నటించారు. స్వీకార్ అగస్తి సంగీతం సమకూర్చారు. ఉదయ్ గుర్రాల, శ్యామ్ దుపాటి సినిమాటోగ్రఫి అందించారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/38Qge8a
v

రామ్ ‘రెడ్’ నుంచి ‘డించక్’ సాంగ్: మణిశర్మ మాస్ బీట్.. హెబ్బా హాట్

ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా తిరుమల కిశోర్ దర్శకత్వంలో రూపొందిన ‘రెడ్’ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవి కిషోర్ ఈ చిత్రాన్ని నిర్మించారు. నివేదా పేతురాజ్, మాళవికా శర్మ, అమృతా అయ్యర్ ఈ చిత్రంలో కథానాయికలు. ‘ఇస్మార్ట్ శంకర్’ వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత రామ్ చేసిన ఈ సినిమా ఇటు క్లాస్‌నీ అటు మాస్‌నీ ఆకట్టుకుంటుందని దర్శకుడు తిరుమల కిషోర్ చెబుతున్నారు. ఇదిలా ఉంటే, ఈ చిత్రం నుంచి మంచి మాస్ సాంగ్‌ను బుధవారం సాయంత్రం విడుదల చేశారు. రామ్, హెబ్బా పటేల్‌పై చిత్రీకరించిన ఈ స్పెషల్ మాస్ సాంగ్ లిరికల్ వీడియోను సోషల్ మీడియా ద్వారా ప్రేక్షకులతో పంచుకుంది చిత్ర నిర్మాణ సంస్థ. మెలోడి బ్రహ్మ మణిశర్మ స్వరపరిచిన ఈ మాస్ సాంగ్ అదిరిపోయింది. కాసర్ల శ్యామ్ మంచి క్యాచీ లిరిక్స్ అందించారు. సాకేత్, కీర్తనా శర్మ ఆలపించారు. జానీ మాస్టర్ ఈ పాటకు కొరియోగ్రఫీ అందించారు. అందుకే, రామ్ వేసిన స్టెప్పులు అదిరిపోయాయి. ఇక హెబ్బా అందచందాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పాటను విడుదల చేసిన సందర్బంగా నిర్మాత ‘స్రవంతి’ రవి కిషోర్ మాట్లాడుతూ.. ‘సినిమాలో వచ్చే ఫస్ట్ సాంగ్ ఇది. ప్రేక్షకుల అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఉంటుంది. రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రత్యేకంగా సెట్ వేసి ఆరు రోజులు కష్టపడి భారీ నిర్మాణ వ్యయంతో ఈ పాటను చిత్రీకరించాం. దీంతో పాటు ఈ సినిమాలో పాటలన్నీ చాలా బాగుంటాయి. మణిశర్మ సంగీతం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. జనవరి 14న సినిమాను గ్రాండ్‌గా రిలీజ్ చేస్తున్నాం’ అని తెలిపారు. నృత్య దర్శకుడు జానీ మాస్టర్ మాట్లాడుతూ.. ‘మార్చి నెలలో లాక్‌డౌన్‌కు ముందు చేసిన పాట ఇది. చాలా ఎనర్జిటిక్ సాంగ్ ఇది. ఈ పాట విషయంలో హీరో రామ్‌కి స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఈ పాట బాగా రావడానికి ఆయన ఇచ్చిన ఇన్‌పుట్స్ బాగా ఉపకరించాయి. పాట అద్భుతంగా వచ్చింది. రామ్ తన స్టెప్స్‌తో ఇరగ దీసేశారు. హెబ్బా పటేల్‌ స్పెషల్ సాంగ్ చేయడం ఇదే ఫస్ట్ టైమ్. తను కూడా చాలా బాగా చేసింది. ఈ పాట బాగా రావడానికి బడ్జెట్ పరంగా రవి కిషోర్ గారు ఫుల్ ఫ్రీడం ఇచ్చారు. మణిశర్మ ఎనర్జిటిక్ మ్యూజిక్ ఇచ్చారు. ముఖ్యంగా బీజీఎమ్స్ అదిరిపోయాయి. థియేటర్లలో ఈ పాట ప్రేక్షకుల్ని ఉర్రూతలూగిస్తుంది’ అని చెప్పారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3o2nioC
v

‘షకీలా’ అంటేనే సెన్సార్ ఇవ్వరు.. దీన్ని సినిమాలానే చూడండి: నటి షకీలా

అల‌నాటి శృంగార తార ష‌కీలా జీవిత కథ ఆధారంగా రూపొందిన చిత్రం ‘ష‌కీలా’. ఇంద్రజీత్ లంకేశ్ ర‌చ‌న, ద‌ర్శక‌త్వం వ‌హించ‌గా రీచా చెడ్డ, పంక‌జ్ త్రిపాటి, ఎస్తర్ నోర‌న్హ, రాజీవ్ పిళ్లై, శివ రానా, కాజోల్ చుగ్, సందీప్ మ‌లా‌ని కీల‌క పాత్రలు పోషించారు. జనవరి 1న యుఎఫ్‌ఓ మూవీస్ ద్వారా ఈ చిత్రం విడుద‌ల‌వుతుంది. చిత్ర ప్రచారంలో భాగంగా మంగళవారం సాయంత్రం హైదరాబాద్‌లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా హీరోయిన్ ఎస్తర్ మాట్లాడుతూ.. ‘చాలా రోజుల త‌ర్వాత ఒక మంచి సినిమాతో తెలుగు ప్రేక్షకుల‌ ముందుకు వ‌స్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. ఇంత మంచి సినిమాలో నన్ను భాగం చేసిన ప్రతి ఒక్కరికీ కృత‌జ్ఞతలు. ష‌కీలా గారి లైఫ్‌లో బ్యాక్‌గ్రౌండ్‌లో ఉన్న ఒక స్ట్రాంగ్ క్యారెక్టర్ ఈ సినిమాలో చేశాను. జ‌న‌వ‌రి 1 సినిమా విడుద‌ల‌వుతుంది. త‌ప్పకుండా చూడండి’ అని అన్నారు. సందీప్ మ‌లా‌ని మాట్లాడుతూ.. ‘నాకు ఏడు సంవ‌త్సరాల వ‌య‌సున్నప్పటి నుండి నేను శ్రీ‌దేవి గారికి వీరాభిమానిని. తెలుగులో చాలా సినిమాల‌కు వ‌ర్క్ చేశాను. ఇప్పుడు ‘ష‌కీలా’ సినిమా ద్వారా మిమ్మల్నంద‌రినీ క‌లుసుకోవ‌డం చాలా హ్యాపీగా ఉంది. ఈ సినిమా ఒక వండ‌ర్‌ఫుల్ ఎక్స్‌పీరియ‌న్స్. ఈ సినిమాను కర్ణాటకలోని తీర్థహల్లి, బెంగళూరులోని ఇన్నోవేటివ్ ఫిల్మ్‌సిటీలో చిత్రీకరించాం. సినిమా చాలా బాగా వ‌చ్చింది. మీ అంద‌రి స‌పోర్ట్ కావాలి’ అని అన్నారు. మ్యూజిక్ డైరెక్టర్ వీర్ మాట్లాడుతూ.. ‘మాది బీద‌ర్‌. నేను సినిమాలు చూడ‌డానికి హైద‌రాబాద్‌కి రెగ్యుల‌ర్‌గా వ‌స్తుంటాను. ఇప్పుడు నా సినిమా ప్రమోష‌న్‌ కోసం ఇక్కడికి రావ‌డం హ్యాపీగా ఉంది. ఈ సినిమాలో రెండు అద్భుత‌మైన పాట‌ల్ని కంపోజ్ చేశాను. త‌ప్పకుండా మీ అంద‌రికీ న‌చ్చుతాయ‌ని భావిస్తున్నాను’ అని తెలిపారు. న‌టి ష‌కీలా మాట్లాడుతూ.. ‘ఈ సినిమా గురించి అంద‌రూ చాలా బాగా మాట్లాడారు. నాకు చాలా స‌పోర్ట్‌గా ఉన్న సందీప్ మలాని గారికి, ఇక్కడున్న ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. జ‌న‌వ‌రి 1న సినిమా విడుద‌ల‌వుతుంది. ఇక్కడ ఒక చిన్న ప్రాబ్లం ఏంటంటే ష‌కీలా అంటేనే సెన్సార్ ఇవ్వరు. అలాంటిది నా ఆటోబ‌యోగ్రఫి ‘ష‌కీలా’ సినిమాకి ఎలా సెన్సార్ తీసుకుని ఉంటారో, ఎంత క‌ష్టప‌డి ఉంటారో నాకు తెలుసు. మొత్తం నా జీవితమే కాదు సినిమా ఎథిక్స్ కోసం కొంచెం మార్చారు. నా గురించి చాలా తెలిసిన వాళ్లకు ఇది ఈమె జీవితంలో జరగలేదే అని అనిపిస్తుంది. అలాంటి వాళ్లు తప్పుగా అనుకోకండి. నిర్మాతలు కూడా సంపాదించాలి కదా. కాబట్టి, కొన్ని సీన్స్ అటు ఇటు మార్చారు. సినిమా బాగా వచ్చింది. ఈ సినిమా ద్వారా ఎవరికీ ఏ మెసేజ్ ఇవ్వాలని కాదు. ఇప్పటికే చాలా ఇంటర్వ్యూలు ఇచ్చాను. అన్నింటిలోనూ మెసేజ్‌లే ఇచ్చాను. కాబట్టి ఈ సినిమాను ఒక ఎంటర్‌టైన్మెంట్‌గానే చూడండి’ అని అన్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3mU7qDq
v

Akhil 5: ముంబై మోడల్‌తో అక్కినేని అఖిల్ రొమాన్స్!

అక్కినేని నట వారసుడు అఖిల్ సినిమాలతో బిజీగా మారాడు. ప్రస్తుతం పూజా హెగ్డేతో కలిసి నటిస్తున్న ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ షూటింగ్ పూర్తి కావొస్తోంది. దీంతో తన ఐదో సినిమాపై ఫోకస్ పెట్టాడు. ‘అఖిల్ 5’ అనే టైటిల్‌తో తెరకెక్కతున్న ఈ సినిమాని ఏకే ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్‌పై సురేందర్ రెడ్డి డైరెక్ట్ చేయనున్నాడు. Also Read: తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రంలో ముంబయికి చెందిన అమ్మాయిని హీరోయిన్‌గా ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. ఆమె ఎవరో కాదు మోడల్ కమ్ హీరోయిన్ సాక్షి వైధ్య. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే ఫోటో షూట్ చేయడంతో పాటు.. టెస్ట్ షూటింగ్‏లో కూడా పాల్గొందంట ఈ బ్యూటీ. అఖిల్ పక్కన సాక్షి వైద్య పర్‌ఫెక్ట్‌గా సూటవుతుందని సురేందర్‌ ఫిక్స్ అయ్యారట. స్క్రిప్ట్ పక్కాగా రెడీ అయిన వెంటనే షూటింగ్ మొదలు పెట్టాలని యూనిట్ భావిస్తోందట. ఇందులో అఖిల్ స్పైగా కనిపించనున్నాడట.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2WTVHdF
v

Kinnerasani: అర్ధాంతరంగా ఆగిపోయిన మెగా అల్లుడి సినిమా!

మెగా కుటుంబం నుంచి టాలీవుడ్‌కి హీరోలు క్యూ కడుతున్న సంగతి తెలిసిందే. వారసులు అయిపోవడంతో మెగా అల్లుళ్లు కూడా వెండితెరపై తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఈ కోవలోనే మెగా బ్రదర్ నాగబాబు అల్లుడు జొన్నలగడ్డ చైతన్య కూడా హీరోగా రానున్నట్లు ఇటవలే వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. అంతకు ముందే చిరంజీవి చిన్నల్లుడు కళ్యాణ్‌దేవ్ ‘విజేత’ అనే సినిమాతో హీరోగా పరిచయమయ్యారు. అయితే ఆ సినిమా ఆశించిన విజయం సాధించలేకపోయింది. Also Read: కొంతకాలం క్రితమే ఆయన ‘సూపర్ మచ్చి’ అనే మరో సినిమాను ప్రారంభించారు. లాక్‌డౌన్ ముగిశాక షూటింగ్ కూడా మొదలైంది. ఈ క్రమంలోనే ‘అశ్వత్థామ’ దర్శకుడు రమణ తేజ దర్శకత్వంలో‘కిన్నెరసాని’ అనే మరో సినిమాకు ఆయన ఓకే చెప్పాడు. ఇటీవలే ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ మదనపల్లెలో పూర్తి చేశారు. అయితే రషెష్‌ చూసుకున్నాక సినిమా ఆపేయడమే బెటర్‌ అని యూనిట్ ఫీలైందట. దీనిపై యూనిట్ నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో ఈ వార్త నిజమా? కాదా? అన్నదానిపై క్లారిటీ లేదు. Also Read: తొలి సినిమా సరిగ్గా ఆడలేదు, రెండో సినిమా ఇంకా రిలీజ్ కాలేదు. మూడో సినిమా ఇలా అర్ధాంతరంగా నిలిచిపోవడంతో మెగా అల్లుడి కెరీర్‌కు ఏమాత్రం మంచిది కాదని సినీ విశ్లేషకులు చెబుతున్నారు. మరోవైపు సాయిధరమ్‌ తేజ్‌, వైష్ణవ్‌ తేజ్‌ విషయంలో మెగా కుటుంబం చూపిస్తున్న శ్రద్ధ.. కళ్యాణ్‌ దేవ్‌ విషయంలో చూపించడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరి మెగా అల్లుడి కెరీర్‌ను చక్కదిద్దే బాధ్యత ఎవరు తీసుకుంటారో చూడాలి మరి.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/37X6s52
v

కుటుంబ సభ్యుల ఒత్తిడి.. కీర్తి సురేష్ పెళ్లీ పీటలెక్కుతోందా?

‘నేను శైలజ’, ‘నేను లోకల్’ వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను అలరించింది . అలనాటి నటి సావిత్రి బయోపిక్‌గా తెరకెక్కిన ‘మహానటి’తో జాతీయ స్థాయి ఉత్తమ నటి పురస్కారం అందుకుని స్టార్ హీరోయిన్‌ స్టేటస్ సొంతం చేసుకుంది. ఈ చిత్రంలో ఆమె నటనకు ప్రేక్షకులతో పాటు విమర్శకులు ఫిదా అయిపోయారు. తెలుగుతో పాటు తమిళ, మలయాళ భాషల్లోనూ కీర్తి తన టాలెంట్‌ నిరూపించుకుని వరుస సినిమాలతో దూసుకుపోతోంది. తాజాగా కీర్తి సురేష్‌ పెళ్లిపై తీవ్ర చర్చ సాగుతోంది. లాక్‌డౌన్ సమయంలో చాలా మంది సినీ ప్రముఖులు వివాహాలు చేసుకున్న సంగతి తెలిసిందే. దీంతో కీర్తికి కూడా ఈ ఏడాదే పెళ్లి చేసెయ్యాలని తల్లిదండ్రులు అనుకున్నారట. కీర్తి సురేష్ ఓ బిజినెస్‌ని వివాహం చేసుకోనుందంటూ కొంతకాలం క్రితం వార్తలొచ్చాయి. అలాంటిదేమీ లేదని కీర్తి క్లారిటీ ఇచ్చినప్పటికీ పెళ్లిపై వార్తలు మాత్రం ఆగడం లేదు. కీర్తి సురేష్‌కి ఈ ఏడాది అక్టోబర్ 17తో 28 ఏళ్లు నిండాయి. దీంతో ఇంకెప్పుడు పెళ్లి చేసుకుంటావంటూ కుటుంబసభ్యులు ఒత్తిడి తెస్తున్నారట. 2021లో ఓ మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేసేస్తామని చెప్పారట. అయితే కెరీర్‌ పీక్స్ ఉన్న ఈ సమయంలో పెళ్లి చేసుకోవడం తనకిష్టం లేదని, కొన్నాళ్ల వరకు పెళ్లి ప్రస్తావన తీసుకురావొద్దని ఆమె తల్లిదండ్రులకు తెగేసి చెప్పిందట. కీర్తి ప్రస్తుతం తెలుగులో నితిన్ సరసన ‘రంగ్ దే’, మహేశ్‌బాబు ‘సర్కారు వారి పాట’లో నటిస్తోంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/38KHp4j
v

Tuesday 29 December 2020

‘వకీల్ సాబ్’ రిలీజ్ డేట్ ఫిక్స్.. మెగా ఫ్యాన్స్‌కి సమ్మర్ బొనాంజా!

కరోనా వైరస్ కారణంగా 2020లో ఎన్నో రంగాలు కుదేలైపోయాయి. ముఖ్యంగా సినీ పరిశ్రమను ఈ మహమ్మారి కోలేకోలేని దెబ్బతీసింది. దీంతో కొన్ని సినిమాలు షూటింగులు ఆగిపోగా, మరికొన్ని విడుదలకు నోచుకోలేదు. ఈ నేపథ్యంలోనే పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్‌ని 2020లో వెండితెరపై చూద్దామని ఎన్నో ఆశలు పెట్టుకున్న అభిమానులు సైతం నిరాశ చెందారు. దిల్ రాజు నిర్మాణంలో వేణు శ్రీరామ్ దర్శకత్వంలో పవన్ నటిస్తున్న `వకీల్‌ సాబ్` సినిమా ఈ ఏడాది వేసవిలో విడుదల కావాల్సింది. అయితే కరోనా కారణంగా షూటింగ్‌కు బ్రేకులు పడ్డాయి. Also Read: ఈ తర్వాత కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా తిరిగి ప్రారంభమైన షూటింగ్ మంగళవారంతో ముగిసింది. దీంతో యూనిట్ పోస్ట్ ప్రొడక్షన్ పనులు మొదలుపెట్టింది. ఈ క్రమంలోనే ‘’ రిలీజ్ డేట్ ఇదేనంటూ ప్రచారం జరుగుతోంది. వేసవి సందర్భంగా ఈ సినిమాను ఏప్రిల్ 9న గ్రాండ్‌గా రిలీజ్ చేసేందుకు నిర్మాత దిల్ రాజు ప్లాన్ చేస్తున్నారట. అయితే దీనిపై యూనిట్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. మరోవైపు సంక్రాంతి సందర్భంగా ‘వకీల్ సాబ్’ టీజర్‌ రిలీజ్ చేయనున్నారు. అప్పుడే రిలీజ్ డేట్‌ను అఫిషియల్‌గా అనౌన్స్ చేస్తారని తెలుస్తోంది. Also Read:


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2MkL4yr
v

2021లో అందరికీ మంచి జరగాలని శ్రీవారిని వేడుకున్నా: రాజేంద్రప్రసాద్

కరోనా వైరస్ మనుషుల్లో ఎంతగానో మార్పులు తీసుకు వచ్చిందని, అద్భుతమైన పాఠాన్ని నేర్పించిందని అన్నారు సినీనటుడు . బుధవారం ఉదయం వీఐపీ దర్శన సమయంలో శ్రీవారిని ఆయన దర్శించుకున్నారు. శ్రీవారి సన్నిధానంలో ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కరోనా వైరస్ వల్ల ఆరోగ్య పద్ధతులు, అలవాట్లలో కూడా చాలా మార్పులు వచ్చాయని, కరోనా సమయంలో టీటీడీ అధికారులు కోవిడ్ నిబంధనలతో భక్తులకు దర్శనం కల్పించడం ఎంతో ఆనందాన్ని కలిగిస్తోందన్నారు. లాక్‌డౌన్ సమయంలో ఎంతో మంది ప్రజలు ఇబ్బందులకు గురయ్యారని, 2021లో అయినా ప్రతి ఒక్కరూ అభివృద్ధిలోకి రావాలని శ్రీవారిని వేడుకున్నట్లు రాజేంద్రప్రసాద్ తెలిపారు. ప్రస్తుతం తాను వరుస సినిమాలో బిజీగా ఉన్నానని రాజేంద్రప్రసాద్ తెలిపారు. గాలి సంపత్, ఎఫ్3, రౌడీ బేబీ, లవ్ ఎట్ 65 తదితర చిత్రాల్లో నటిస్తున్నట్లు వెల్లడించారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3n0fG4X
v

రజినీ సర్.. నిస్వార్థమైన నిర్ణయం తీసుకున్నారు: లారెన్స్

అనారోగ్యం కారణంగా రాజకీయ పార్టీ స్థాపించడం లేదంటూ సూపర్‌స్టార్ చేసిన ప్రకటన ఆయన అభిమానులతో పాటు సెలబ్రెటీలను కూడా నిరాశపరిచింది. అయితే రజినీ నిర్ణయంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రజినీకాంత్ సరైన నిర్ణయం తీసుకున్నారని కొందరు అభిప్రాయపడుతుంటే, కొందరు మాత్రం ఆవేదన చెందుతున్నారు. Also Read: అయితే రజనీకాంత్ నిర్ణయాన్ని సమర్థిస్తూ ప్రముఖ నటుడు, దర్శకుడు, కొరియోగ్రాఫర్ ట్వీట్ చేశారు. ‘గురువా మీరు తీసుకున్న నిర్ణయం వంద శాతం కరెక్ట్. మాకు అన్నింటికంటే మీ ఆరోగ్యం చాలా ముఖ్యమైంది. మిమ్మల్ని న‌మ్ముకుని మీ క్షేమం కోరుకుంటున్న వారి కోసం నిస్వార్ధమైన నిర్ణయం తీసుకున్నారు. ఇత‌రుల ప‌ట్ల తీసుకునే శ్రద్ధే మిమ్మల్ని గొప్పవారిని చేసింది. మీరు ఎల్లప్పుడూ ఆయురారోగ్యాల‌తో ఉండాల‌ని రాఘ‌వేంద్ర స్వామిని ప్రార్థిస్తా’ అంటూ లారెన్స్ ట్వీట్ చేశారు. Also Read: ఈ నెల 31న రాజకీయ పార్టీ ప్రకటిస్తానంటూ రజినీకాంత్ గతంలోనే వెల్లడించిన సంగతి తెలిసిందే. అయితే హైదరాబాద్‌లో ‘అన్నాత్తై’ షూటింగులో ఉండగా ఆయనకు రక్తపోటు పెరిగిపోయి జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆస్పత్రిలో చేరారు. రెండ్రోజుల తర్వాత డాక్టర్లు డిశ్చార్జ్ చేయడంతో శనివారం చేరుకున్నారు. అయితే ఇలాంటి పరిస్థితుల్లో రాజకీయాల్లోకి వెళ్లడం సరైన నిర్ణయం కాదని, రాజకీయాలు మనకొద్దని కుటుంబసభ్యులు ఆయనపై ఒత్తిడి తెచ్చినట్లు వార్తలొచ్చాయి. ఈ క్రమంలో రజినీ నిర్ణయం మార్చుకున్నారు. ‘నేను ఏం మాట్లాడానో నాకు తెలుసు. కానీ నా వల్ల మిగిలిన వాళ్లు సమస్యలు ఎదుర్కోవడం నాకు ఇష్టం లేదు. అందుకే నేను పార్టీ పెట్టడం లేదు. రాజకీయాల్లోకి రావడం లేదు. ఈ ప్రెస్ నోట్ రాసేప్పుడు కలిగిన బాధ నాకు మాత్రమే తెలుసు’ అంటూ రజినీకాంత్ ఎమోషనల్ అయ్యారు. Also Read:


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3hqujNP
v

ప్రభాస్‌ సరసన హైబ్రిడ్ పిల్ల.. డార్లింగ్ ఇచ్చిన హింట్‌తో ఫ్యాన్స్ ఖుషీ!

టాలీవుడ్‌లో కొన్ని కాంబినేషన్లో ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తించడంతో పాటు వింతగానూ అనిపిస్తాయి. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‌కు సంబంధించి ఓ న్యూస్ టాలీవుడ్‌లో అలాంటి పరిస్థితినే క్రియేట్ చేస్తోంది. ఇంతకీ ఆ న్యూస్ ఏంటో తెలుసా.. ప్రభాస్‌ పక్కన హీరోయిన్‌గా నటిస్తోందట. నిజంగా ఈ కాంబినేషన్ సెట్ అవుతోందో లేదో తెలియదు గానీ ఫిల్మ్‌నగర్‌లో మాత్రం హాట్‌టాపిక్‌గా మారింది. హైట్ ప్రాబ్రమ్‌ లేకపోతే సాయిపల్లవి తన పక్కన పక్కాగా సూటవుతుందని చేసిన వ్యాఖ్యలే ఇప్పుడీ ప్రచారానికి నాంది పలికాయి. అయితే ప్రభాస్‌తో ‘సలార్’ తెరకెక్కించనున్న కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్.. సరిగ్గా ఈ పాయింట్ మీదే ఫోకస్ పెట్టాడట. ఈ సినిమాలో నటించబోయే ఇద్దరు హీరోయిన్లలో ఒకరిగా సాయిపల్లవిని తీసుకోనున్నట్లు తెలుస్తోంది. దీంతో సాయిపల్లవి నటించబోయే తొలి పాన్ ఇండియా సినిమా ఇదేనంటూ అప్పుడే ప్రచారం మొదలైంది. తెలుగులో వరుస సినిమాలతో బిజీగా ఉన్న సాయిపల్లవి ఇప్పడు హీరోలకు మోస్ట్ ఫేవరెట్‌గా మారింది. అందుకే ఈ అమ్మడు రెమ్యునరేషన్ కూడా భారీగా పెంచినట్లు ఇటీవలే వార్తలొచ్చాయి. పవన్ నటించబోయే మలయాళ రీమేక్ సినిమా కోసం సంప్రదిస్తే ఏకంగా రూ.2కోట్లు డిమాండ్ చేసిందట. టాలీవుడ్లో హైబ్రిడ్ పిల్ల హవా అలా నడుస్తోంది మరి.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/38K054h
v

నిర్మాతగా సోనూసూద్.. స్ఫూర్తి నింపే కథల కోసం వేట!

వెండితెరపై హీరోగా వెలిగిపోవాలని ఎన్నో ఆశలతో ముంబయిలో అడుగుపెట్టారు . అయితే హీరోలతో దెబ్బలు తినే విలన్ వేషాలే ఆయనకు స్వాగతం పలికాయి. అయినా నిరాశ పడకుండా బాలీవుడ్‌లోనే కాకుండా అనేక భాషల్లో విలన్ పాత్రలు వేస్తూ అనేక మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. అయితే సినిమాల్లో హీరో కాకపోయినా.. లాక్‌డౌన్ సమయంలో వేలాది మంది వలస కార్మికులు, నిరుపేదలకు ఆదుకుని నేషనల్ హీరో అంటూ అందరికీ ప్రశంసలు అందుకున్నారు. ఇన్నాళ్లూ ఆన్‌ స్క్రీన్‌పై కనిపించిన సోనూసూద్ నిర్మాతగా మారనున్నారట. ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు. ‘నేను నిర్మాతగా మారుతున్నాను. ప్రజల్లో స్ఫూర్తి నింపే కథలు, నేను చేయాలనుకున్న స్క్రిప్ట్స్‌ కోసం అన్వేషిస్తున్నాను. అన్నీ కుదిరితే త్వరలోనే నిర్మాతగా మీ ముందుకొస్తా’ అని సోనూసూద్ అన్నారు. సోనూసూద్‌కి ప్రస్తుతం ప్రజల్లో ఉన్న క్రేజ్‌ని బట్టి ఆయనతో విలన్ వేషాలు వేయించేందుకు దర్శక నిర్మాతలు ఆలోచిస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి ‘ఆచార్య’లోనూ నెగిటివ్ షేడ్స్ ఉండే ఆయన పాత్రకు కొన్ని మార్పులు చేశారట. చిరంజీవి సూచనల మేరకు దర్శకుడు ఆ మార్పులు చేసినట్లు ఇటీవలే సోనూసూద్ చెప్పుకొచ్చారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3rE6ZRi
v

పోలీసులపై గౌరవం చాటుకున్న పవన్ కళ్యాణ్.. ఆ పనికి అందరూ ఫిదా

పవర్ స్టార్ పవన్‌కల్యాణ్‌కి పోలీస్‌ శాఖ అంటే అపారమైన గౌరవం. ఆ విషయాన్ని ఆయన బహిరంగ వేదికలపైనే ఎప్పుడూ చెబుతుంటారు. ఆ గౌరవాన్ని ఆయన మరోసారి చాటుకుని అందరినీ ఫిదా చేశారు. మంగళవారం హైదరాబాద్‌లో ‘వకీల్‌సాబ్‌’ చిత్రీకరణ సందర్భంగా యాక్షన్‌ సన్నివేశాలు షూట్ చేశారు. దీనిలో భాగంగా పోలీసులకీ, విద్యార్థులకీ మధ్య ఘర్షణ సన్నివేశాల్ని తెరకెక్కించారు. Also Read: ఈ సందర్భంగా పోలీసులు అల్లర్ల సమయంలో రక్షణగా అడ్డు పెట్టుకునే కవచాల్ని వినియోగించారు. వాటిపై పోలీస్‌ అని రాసి ఉంది. విద్యార్థులు పోలీసులపై దాడి చేసే సన్నివేశంలో ఆ కవచాలను కొట్టాల్సి ఉంది. అయితే పోలీస్ అనే పేరుపై కొట్టడం ఇష్టం లేక పవన్ వాటిపై ఉన్న స్టిక్కర్లను స్వయంగా తొలగించారు. ఆ సమయంలో యూనిట్ సభ్యులు తీసిన ఓ ఫొటో సోషల్‌ మీడియాలో వైరల్ అవుతోంది. దాన్ని చూసిన వాళ్లు పవన్ సినిమాల్లోనే కాదు.. నిజ జీవితంలోనూ హీరోనే అంటూ పొగిడేస్తున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3o2WcOc
v

సినిమా టికెట్ ధర పెంచడం కరెక్ట్ కాదు.. కరోనా ప్రభావం ప్రేక్షకుడిపైనా ఉంది: ఆర్.నారాయణమూర్తి

కరోనా మహమ్మారి కారణంగా తీవ్రంగా నష్టపోయిన సినీ పరిశ్రమను ఆదుకోవడానికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆ మధ్య కొన్ని వరాలు కురిపించిన విషయం తెలిసిందే. దీంట్లో ఓ వరం టికెట్ ధరల సవరణ. పెద్ద సినిమాలు విడుదలైనప్పుడు టికెట్ ధరలు పెంచుకోవచ్చని కేసీఆర్ స్పష్టం చేశారు. ఈ నిర్ణయాన్ని కొందరు వ్యతిరేకించారు. దీని వల్ల సామాన్యుడిపై భారం పడుతుందని విమర్శలు వచ్చాయి. ఇప్పుడు పీపుల్స్ స్టార్ ఆర్.నారాయణమూర్తి కూడా అదే అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. టికెట్ ధరలు పెంచవద్దని సినీ నిర్మాతలను ఆయన విజ్ఞప్తి చేశారు. సాయి ధరమ్ తేజ్, నభా నటేష్ జంటగా నటించిన ‘సోలో బ్రతుకే సో బెటర్’ సినిమా డిసెంబర్ 25న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాను విజయవంతం చేసిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలపడానికి చిత్ర యూనిట్ థాంక్స్ మీట్‌ను మంగళవారం హైదరాబాద్‌లో నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ఆర్.నారాయణమూర్తి ముఖ్య అతిథిగా విచ్చేసి తనదైన శైలిలో మాట్లాడారు. ‘‘కరోనా సమయంలో మానవజాతి అల్లకల్లోలమైంది. ముఖ్యంగా సినీ పరిశ్రమ ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొంది. వలస కార్మికుల్లాగా సినీ కార్మికుల భవిష్యత్తు కూడా ఏంటి? అని అందరూ ఆలోచించుకుంటున్న దశలో.. థియేటర్‌కు మళ్లీ ప్రేక్షకులు వస్తారు, సినిమాను ఆదరిస్తారనే నమ్మకంతో ముందుకు వచ్చిన ‘సోలో బ్రతుకే సో బెటర్‌’ టీంను అభినందిస్తున్నాను. ముఖ్యంగా కేసీఆర్‌గారు, వైఎస్‌ జగన్‌ గారు థియేటర్స్‌ ఓపెన్‌ చేసుకోవడానికి అనుమతులు ఇవ్వడమే కాకుండా రాయితీలు కూడా ప్రకటించారు. ఇది చాలా ఆనందంగా ఉంది. అబ్దుల్ కలాం, వాజ్‌పేయి, మమతా బెనర్జీ, మదర్ థెరిస్సా వంటి మహామహుల మధ్య నా కటౌట్‌ పెట్టి దర్శకుడు సుబ్బు సినిమాను నడిపించాడు. అందులో నా అభిమానిగా నటించిన సాయి ధరమ్ తేజ్‌ గారికి థాంక్స్‌. సినిమా చాలా బావుందంటూ అనేక మంది ఫోన్‌ చేస్తున్నారు. ప్రకృతి ధర్మాన్ని పాటిస్తూ ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరగాలంటూ గొప్ప మెసేజ్‌ను ఎంటర్‌టైనింగ్‌గా దర్శకుడు సుబ్బు చూపించారు. ఈ సినిమాలో నాకు కూడా ప్రత్యక్షంగా, పరోక్షంగా పాత్ర ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు చెబుతున్నాను. ఈ సినిమాకు వస్తున్న ఆదరణను చూసిన తర్వాత మన తెలుగులోనే కాదు.. ఎంటైర్‌ సినీ ఇండస్ట్రీకి తమ సినిమాను విడుదల చేసుకోగలమనే ధైర్యం వచ్చింది. జనవరి 1న, సంక్రాంతి సందర్భంగా ఎన్నో సినిమాలు విడుదలవుతున్నాయి. ఈ సినిమాలన్నింటికీ ‘సోలో బ్రతుకే సో బెటర్‌’ మార్గదర్శిగా నిలిచింది. ఈ సమయంలో నేను ఇచ్చే సలహా ఒకటే. ఎవరూ టికెట్‌ ధర పెంచవద్దని నా మనవి. అది కరెక్ట్ కాదు. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీ కరోనా ప్రభావంతో ఇబ్బందులు పడుతున్న మాట నిజమే. కానీ.. సినీ ఇండస్ట్రీతో పాటు ప్రేక్షకుడు కూడా కరోనా ప్రభావంతో ఇబ్బందులు పడుతున్నాడు. కాబట్టి ఎంత పెద్ద బడ్జెట్‌ మూవీ అయినా టికెట్‌ రేటు పెంచవద్దని ఇండస్ట్రీని కోరుకుంటున్నాను. కోర్టులకు వెళ్లి టికెట్స్‌ రేట్స్‌ పెంచమని అడగడం కరెక్ట్‌ కాదు. ఇలా రేట్లు పెంచేస్తే సామాన్య ప్రేక్షకుడు సినిమాను ఏం చూస్తాడు. ప్రేక్షకులను ఇబ్బంది పెట్టి సినిమా టికెట్‌ రేట్స్‌ పెంచకండి. సీఎం కేసీఆర్‌ గారు, వైఎస్‌ జగన్‌ గార్లను టికెట్‌ రేట్లు పెంచడానికి ఒప్పుకోవద్దని కోరుతున్నాను’’ అని నారాయణమూర్తి అన్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3aT7Uay
v

రామ్ చరణ్‌తో క్వారంటైన్‌లో ఉపాసన: నాకూ పాజిటివ్ రావచ్చు.. మెగా కోడలు ఎమోషనల్ పోస్ట్

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌కు కరోనా వైరస్ సోకిన విషయం తెలిసిందే. తనకు కొవిడ్-19 పాజిటివ్ వచ్చినట్టు మంగళవారం ఉదయం స్వయంగా సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. తనకు ఎలాంటి లక్షణాలు లేవని.. ప్రస్తుతం హోం క్వారంటైన్‌లో ఉన్నానని ఆయన వెల్లడించారు. అంతేకాకుండా ఈ మధ్య కాలంలో తనను కలిసినవారంతా తక్షణమే కొవిడ్-19 పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. వీలైనంత త్వరగా కోలుకుని మళ్లీ ప్రేక్షకుల ముందుకు వస్తానని తెలిపారు. అయితే, రామ్ చరణ్‌కు కరోనా పాజిటివ్ వచ్చిన విషయం తెలియగానే మెగా అభిమానులు కంగారు పడ్డారు. దీనికి తోడు రామ్ చరణ్ సోదరుడు వరుణ్ తేజ్‌కు కూడా పాజిటివ్ రావడం మరింత కంగారు పెట్టింది. అయితే, భయపడాల్సిన అవసరం లేదని వీరిద్దరూ త్వరగా కోలుకుని తిరిగి షూటింగ్‌ల్లో పాల్గొంటారని మెగా కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే, రామ్ చరణ్‌కు కరోనా వైరస్ సోకడంపై ఆయన భార్య ఉపాసన సోషల్ మీడియా ద్వారా స్పందించారు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. ‘‘ఈ సంవత్సరం కూడా వెళ్లిపోతోంది. 2021 అయినా బాగుండాలని ఆశిస్తున్నాను. ఎలాంటి లక్షణాలు లేవు.. ఆయన చాలా దృఢంగా ఉన్నారు. నాకు నెగిటివ్ వచ్చింది. కానీ, నాకు కూడా కొవిడ్ పాజిటివ్ వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. ప్రస్తుతం నేను మిస్టర్ సి (చరణ్‌ను ముద్దుగా ఇలా పిలుస్తారు)తో హోం క్వారంటైన్‌లో ఉన్నాను. వేడి ద్రావణాలు తీసుకుంటున్నాం. ఆవిరి పడుతున్నాం. విశ్రాంతి తీసుకుంటున్నాం’’ అని ఉపాసన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో పేర్కొన్నారు. ఉపాసన పోస్ట్‌కి మెగా అభిమానులతో పాటు ప్రతి ఒక్కరూ పాజిటివ్‌గా స్పందిస్తున్నారు. ఇద్దరూ వీలైనంత త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారు. ‘‘మగధీరుడిలా వస్తాడు చరణ్.. ఇలాంటి వైరస్‌లు ఏం చేయలేవు’’ అని కొంత మంది మెగా అభిమానులు కామెంట్లు పెడుతున్నారు. ఇదిలా ఉంటే, డిసెంబర్ 25న మెగా ఫ్యామిలీలోని రెండో తరం సభ్యులంతా క్రిస్మస్ వేడుకలు జరుపుకున్నారు. ఈ వేడుకలో పాల్గొన్న రామ్ చరణ్‌కు, వరుణ్‌కు కొవిడ్ పాజిటివ్ వచ్చింది. దీంతో మెగా అభిమానులు ఆందోళనకు గురవుతున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3nXxEGD
v

అభిజీత్‌కు క్రేజీ ఆఫర్.. కామెడీ చేయడానికి రెడీ అవుతోన్న బిగ్ బాస్ విన్నర్!!

బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 విజేత సినీ నటుడు అనే సంగతి అందరికీ తెలిసిందే. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ సినిమా ద్వారా అభిజీత్ తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యారు. ఆ తరవాత రెండు మూడు సినిమాలు చేసినా వాటి గురించి పెద్దగా ఎవరికీ తెలీదు. చాలా కాలం పాటు వెండితెరకు దూరమైన అభిజీత్.. కరోనా సమయంలో బుల్లితెర ప్రేక్షకులకు వినోదాన్ని పంచిన బిగ్ బాస్ షో ద్వారా మరోసారి కనిపించారు. అంతేకాదు, ఈ షోలో స్టార్ కంటెస్టెంట్‌గా నిలబడి టైటిల్‌ను గెలుచుకున్నారు. ప్రస్తుతం అభిజీత్ ఇంటర్వ్యూలతో బిజీగా ఉన్నారు. అలాగే, తనకు సపోర్ట్ చేసిన విజయ్ దేవరకొండ లాంటి స్నేహితులను కలిసి వారికి కృత‌జ్ఞత‌లు తెలుపుతున్నారు. అయితే, రాబోయే రోజుల్లో సినిమా షూటింగ్‌తో బిజీ కాబోతున్నారట అభిజీత్. ఆయన సినిమా అవకాశం వచ్చిందని ప్రచారం జరుగుతోంది. అది కూడా ‘’ లాంటి క్రేజీ మల్టీస్టారర్‌లో అని టాక్. బిగ్ బాస్ సీజన్ 4 గ్రాండ్ ఫినాలేలో దర్శకుడు అనిల్ రావిపూడి పాల్గొన్న సంగతి తెలిసిందే. ఫైనలిస్ట్‌లు అభిజీత్, అఖిల్, సోహెల్ మేనరిజంలను చేసి చూపించి అందరినీ నవ్వించారు అనిల్. ఈ షోలో అభిజీత్‌ను స్వయంగా కలిసిన అనిల్ రావిపూడి ఆయనకు ఆఫర్ ఇవ్వాలని నిర్ణయించుకున్నారట. ‘F3’లో ఒక కీలక పాత్రకు అభిజీత్‌ను ఎంపిక చేశారని ప్రచారం జరుగుతోంది. బ్లాక్ బస్టర్ మూవీ ‘F2’కి సీక్వెల్‌గా వస్తోన్న ‘F3’లో వెంకటేష్, వరుణ్ తేజ్, తమన్నా, మెహ్రీన్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న సంగతి తెలిసిందే. దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3nX0tmh
v

Kushboo: రజినీ సర్ నిర్ణయం ఎంతోమంది తమిళుల హృదయాలను గాయపర్చింది.. కుష్బూ ఎమోషనల్ ట్వీట్

డిసెంబర్ 31న తన రాజకీయ పార్టీ ప్రకటిస్తానని కొద్దిరోజుల క్రితమే ప్రకటించిన ఊహించని విధంగా యూ టర్న్ తీసుకున్నారు. ఆరోగ్య సమస్యలు తలెత్తడంతో రజినీ వేసుకున్న ప్రణాళికలన్నీ తారుమారయ్యాయి. రజినీకాంత్ కుమార్తెలు ఐశ్వర్య, సౌందర్య కూడా ప్రస్తుతానికి రాజకీయాలకు దూరంగా ఉండాలని రజినీని కోరారట. ఈ పరిస్థితుల నడుమ రజినీకాంత్ అనూహ్యంగా వెనక్కి తగ్గారు. నా ఆరోగ్య సమస్యల వల్ల సన్ పిక్చర్స్ కళానిధి మారన్ చిత్రం షూటింగ్ క్యాన్సిల్ కావడంతో ఎంతో మంది ఉపాధి కోల్పోయారు. చాలా నష్టం వాటిల్లింది. ఇదంతా కేవలం నా ఆరోగ్యం వల్లే వచ్చింది. ఇది నాకు దేవుడి హెచ్చరికలా అనిపించిందని ఎమోషనల్ అవుతూ రజనీకాంత్ ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. తన వల్ల ఇతరులు సమస్యలు ఎదుర్కోవడం ఇష్టం లేదని, అందుకే పార్టీ పెట్టడం లేదు, రాజకీయాల్లోకి రావడం లేదని ఆయన పేర్కొన్నారు. ఈ క్రమంలో తాజాగా రజినీకాంత్ నిర్ణయంపై ఎమోషనల్ అవుతూ ట్వీట్ చేశారు. ''డియర్ రజనీ సర్.. మీరు తీసుకున్న ఈ నిర్ణయం ఎంతోమంది తమిళుల హృదయాలను గాయపరిచింది. కానీ మీ సమస్యను నేను పూర్తిగా అర్థం చేసుకున్నాను. ఎందుకంటే మన ఆరోగ్యం కంటే ఏదీ ముఖ్యం కాదు. మీ స్నేహితురాలిగా, శ్రేయోభిలాషిగా మీరు తీసుకున్న నిర్ణయాన్ని సమర్థిస్తున్నాను. నాకు మీరు అత్యంత విలువైన, ఎంతో ముఖ్యమైనవారు. జాగ్రత్తగా, సంతోషంగా ఉండండి'' అని కుష్బూ తన ట్వీట్‌లో రాసుకొచ్చారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3mXREHR
v

అక్కను ప్రభాస్‌తో చూడాలని ఉంది: మనసులో మాట బయటపెట్టిన రకుల్ తమ్ముడు

టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా ఎదిగి ప్రస్తుతం బాలీవుడ్‌పై కన్నేసిన తన తమ్ముడు అమన్‌ను హీరోగా పరిచయం చేస్తున్న సంగతి తెలిసిందే. ‘తెర వెనుక’ అనే చిత్రం ద్వారా అమన్ హీరోగా ఎంట్రీ ఇస్తున్నారు. నిజానికి ఈ సినిమా కన్నా ముందు ‘నిన్నే పెళ్లాడతా’ చిత్రాన్ని అమన్ అంగీకరించారు. ఈ సినిమా చిత్రీకరణ కూడా పూర్తయింది. ఒక పాట కూడా విడుదల చేశారు. కానీ, ఈ సినిమా విడుదల తేదీని ఇంకా ప్రకటించలేదు. ‘తెర వెనుక’ చిత్రం మాత్రం జనవరి 1న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ప్రస్తుతం అమన్ తన ‘తెర వెనుక’ చిత్ర ప్రచారంలో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలో ఒక యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన ఫ్యామిలీ గురించి మాట్లాడారు. తన తండ్రి ఆర్మీ రిటైర్డ్ కల్నల్ అని, తల్లి ఇంట్లోనే ఉంటారని చెప్పారు. తాను, అక్క సినిమా ఇండస్ట్రీలోకి వెళ్తామంటే నాన్న ఎలాంటి అభ్యంతరం చెప్పలేదని అమన్ అన్నారు. ‘‘మీరు చేసే పని కోసం బాగా కష్టపడండి.. 100 శాతం కృషి చేయండి అని నాన్న చెప్పారు. ఇప్పుడు ప్రతి ఫ్యామిలీలో ఇలానే ప్రోత్సహిస్తున్నారు. నాన్న ప్రోత్సహించారు కాబట్టే నేను ఇక్కడ ఉన్నాను’’ అని అమన్ చెప్పుకొచ్చారు. తన అక్క రకుల్ పెళ్లి గురించి మాట్లాడుతూ.. ‘‘ఈ విషయం గురించి నాకు ఏమీ తెలీదు. అసలు నేను ఏం ఆలోచించలేదు. ఆ ఛాన్స్ అక్కకే ఇచ్చేశాం. ముందు ఆమె ఒకరిని సెలెక్ట్ చేసుకోవాలి. ఆ తరవాత మేం నిర్ణయం తీసుకుంటాం’’ అని చెప్పారు. ప్రస్తుతం ఆమె ఎవరితో ప్రేమలో లేదని.. అస్సలు ఆమెకు అంత సమయం కూడా లేదని అమన్ వెల్లడించారు. తనకు కాబోయే బావ ఒక మంచి మనిషి అయితే చాలని అన్నారు. విలువలు, క్రమశిక్షణ, నిజాయతీ ఉంటే చాలన్నారు. సినిమా ఇండస్ట్రీలో తనకు బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరూ లేరని అన్నారు అమన్. అక్క రకుల్‌కు అయితే మంచు లక్ష్మి బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పారు. తనకు లక్ష్మి, మనోజ్ ఇండస్ట్రీలో బాగా క్లోజ్ అని వెల్లడించారు. ఇక హీరోలతో రకుల్ ఫ్రెండ్‌షిప్ గురించి తనకు తెలీదని అన్నారు. ఇక ‘సరైనోడు’, ‘నాన్నకు ప్రేమతో’ సినిమాల్లో రకుల్ నటన తనకు చాలా ఇష్టమని అమన్ చెప్పారు. ముఖ్యంగా ‘సరైనోడు’లో ఇంటర్వెల్ బ్యాంగ్‌లో వచ్చే సన్నివేశాల్లో రకుల్ నటన అద్భుతమన్నారు. అయితే, తన అక్కను పక్కన చూడాలని ఉందని అమన్ మనసులో కోరిక బయటపెట్టారు. ప్రభాస్ హైట్, పర్సనాలిటీకి రకుల్ బాగా సరిపోతుందని అమన్ అభిప్రాయపడ్డారు. ప్రభాస్ చాలా మంచి వ్యక్తని తాను విన్నానని.. అయితే, ఇప్పటి వరకు తాను ప్రభాస్‌ను కలవలేదని అమన్ చెప్పారు. తెలుగులో ఇంచుమించుగా స్టార్ హీరోలందరి సరసన రకుల్ నటించిందని.. ఇకపై ప్రభాస్‌కు జంటగా తెరపై ఆమెను చూడాలనుకుంటున్నానని అమన్ వెల్లడించారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2KXR9A5
v

క్రాక్ డబ్బింగ్ చెబుతున్న రవితేజ.. న్యూ ఇయర్ ఫన్ మామూలుగా ఉండదట!

మాస్ మహారాజ్ కొత్త సినిమా 'క్రాక్' ఇటీవలే షూటింగ్ ఫినిష్ చేసుకొని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటోంది. సంక్రాంతి కానుకగా జనవరి 14వ తేదీన థియేటర్లలోనే ఈ సినిమాను విడుదల చేయాలని ప్లాన్ చేస్తోంది చిత్రయూనిట్. ఈ నేపథ్యంలో తాజాగా తన పాత్రకు సంబంధించి డబ్బింగ్ థియేటర్‌లో డబ్బింగ్ చెబుతున్నారు హీరో రవితేజ. ఈ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసిన ఆయన.. డబ్బింగ్ పనులతో బిజీ అంటూ ట్వీట్ చేశారు. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను సరస్వతి ఫిలిమ్స్ డివిజన్ బ్యానర్‌పై ఠాగూర్ మధు నిర్మించారు. చిత్రంలో రవితేజ సరసన హీరోయిన్‌గా నటించగా.. సముద్రఖని, వరలక్ష్మి శరత్ కుమార్ కీలక పాత్రలు పోషించారు. తెలుగు రాష్ట్రాల్లో జ‌రిగిన య‌థార్థ ఘ‌ట‌న‌ల‌ను ఆధారంగా చేసుకుని ఈ సినిమా తెరకెక్కిందని సమాచారం. మాస్ ఆడియన్స్ ఉగిపోయేలా రవితేజ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన అన్ని అప్‌డేట్స్ సినిమాపై భారీ హైప్ క్రియేట్ చేశాయి. నూత‌న సంవ‌త్సరానికి కానుకగా జ‌న‌వ‌రి 1వ తేదీన క్రాక్ థియేట్రిక‌ల్‌ ట్రైల‌ర్‌ను రిలీజ్ చేయనున్నట్లు ఇటీవలే ప్రకటించింది చిత్రయూనిట్. ఈ మేరకు న్యూ ఇయర్ ఫన్ మామూలుగా ఉండదని తెలిపారు. గతంలో రవితేజ- గోపీచంద్ మ‌లినేని కాంబోలో వచ్చిన ''డాన్‌ శీను, బలుపు'' చిత్రాలు తెలుగు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకోవడంతో ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. థియేటర్స్‌లో మాస్ మహారాజ్ హంగామా చూడాలని ఆతృతగా ఉన్నారు ప్రేక్షకులు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2KIwkc9
v

వరుణ్ తేజ్‌కు కరోనా పాజిటివ్.. క్రిస్మస్ వేడుకలే కొంపముంచాయా?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌కు కొవిడ్-19 పాజిటివ్ అని నిర్ధారణ అయిన సంగతి తెలిసిందే. తనకు కరోనా పాజిటివ్ వచ్చిన విషయాన్ని స్వయంగా సోషల్ మీడియా ద్వారా మంగళవారం ఉదయం తెలియజేశారు. తనకు ఎలాంటి లక్షణాలు లేవని, ప్రస్తుతం హోం క్వారంటైన్‌లో ఉన్నానని ఆయన స్పష్టం చేశారు. త్వరలోనే కోలుకొని మళ్లీ సినిమా షూటింగ్‌లో పాల్గొంటానని పేర్కొన్నారు. ఈ రెండు మూడు రోజుల్లో తనను కలిసిన వారు కరోనా పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. రామ్ చరణ్‌కు పాజిటివ్ అని తెలిసిన వెంటనే మెగా అభిమానులు కాస్త కంగారు పడ్డారు. అయితే, ఇప్పుడు చరణ్ తమ్ముడు, నాగబాబు కుమారుడు, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్‌కు కూడా కొవిడ్-19 పాజిటివ్ అని రావడం మెగా ఫ్యాన్స్‌ను కంగారు పెడుతోంది. తనకు కూడా కొవిడ్-19 పాజిటివ్ వచ్చినట్టు ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ‘‘ఈరోజు ఉదయం కొవిడ్-19 పరీక్ష చేయించుకున్నాను. స్వల్ప లక్షణాలతో పాజిటివ్ అని తేలింది. ప్రస్తుతం నేను హోం క్వారంటైన్‌లో ఉన్నాను. అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాను. త్వరలోనే మళ్లీ మీ ముందుకు వస్తాను’’ అని వరుణ్ తేజ్ పేర్కొ్న్నారు. ఇదిలా ఉంటే, మెగా ఫ్యామిలీలోని రెండో తరం సభ్యులంతా డిసెంబర్ 25న క్రిస్మస్‌ను కలిసి సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ సెలబ్రేషన్స్‌లో అల్లు అర్జున్, రామ్ చరణ్, వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్, అల్లు శిరీష్, అల్లు బాబీ, కళ్యాణ్ దేవ్, ఉపాసన, స్నేహారెడ్డి, సుష్మిత, శ్రీజ, నిహారిక, చైతన్య జొన్నలగడ్డ, ఇంకా ఇతర కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ఈ పార్టీ వల్లే వీరి మధ్య వైరస్ వ్యాప్తి చెంది ఉంటుందని ఇండస్ట్రీకి చెందిన కొంత మంది అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనా రామ్ చరణ్, వరుణ్ తేజ్ వీలైనంత త్వరగా కోలుకుని మళ్లీ మన ముందుకు రావాలని ఆ దేవుడిని ప్రార్థిద్దాం.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3hxfkS7
v

బంపర్ ఆఫర్ కొట్టేసిన మెహబూబ్! చిరంజీవి సినిమాలో ఛాన్స్.. ఇక మనోడి పంట పండినట్లే..!!

బిగ్ బాస్ షోలో పాల్గొన్న కంటిస్టెంట్స్‌కి పెద్దగా ఉపయోగం లేదని, అనుకున్నట్లుగా ఎవ్వరూ సినిమా ఆఫర్స్ ఇవ్వడం లేదని ఎంతోమంది కామెంట్స్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ పరిస్థితుల్లో అందుకు భిన్నంగా ఇటీవలే బిగ్ బాస్ సీజన్- 4 ముగించుకొని బయటకొచ్చిన కంటిస్టెంట్స్ వరుసగా సినిమా ఛాన్సులు పట్టేసి ఆశ్చర్య పరుస్తున్నారు. ఇప్పటికే సోహైల్, దివిలు సినిమా అవకాశాలు కొట్టేయగా తాజాగా ఈ లిస్ట్‌లో కూడా చేరిపోయాడని తెలుస్తోంది. మెహబూబ్‌కి ఏకంగా లేటెస్ట్ మూవీ ''లో నటించే అవకాశం దక్కిందని సమాచారం. రామ్ చరణ్ నిర్మాణంలో రూపొందుతున్న ఈ సినిమాలో ఓ చిన్నపాత్ర కోసం ఆయన్ను ఎంపిక చేశారనే టాక్ నడుస్తోంది. పాత్ర చిన్నదే అయినా సినిమాలో కీలకమైనదని తెలుస్తుండటం ఆసక్తి రేకెత్తిస్తోంది. దీంతో ఇదే నిజమైతే ఇక మనోడి పంట పండినట్లే అని చెప్పుకుంటున్నారు జనం. ఇకపోతే బిగ్ బాస్ సీజన్ 4 మరో కంటిస్టెంట్ మోనాల్‌ని బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా రూపొందుతున్న 'అల్లుడు అదుర్స్' సినిమాలో ఓ ఐటెం సాంగ్ కోసం తీసుకున్నారనేది లేటెస్ట్ టాక్. ఇందుకోసం ఆమె డిమాండ్ చేసిన మేరకు రెమ్మ్యూనరేషన్ కూడా ఆఫర్ చేశారట మేకర్స్. అలాగే వెంకటేష్‌, వరుణ్‌ తేజ్‌ హీరోలుగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న 'F3' మూవీలో బిగ్ బాస్ విన్నర్ అభిజీత్‌ని తీసుకున్నారని సమాచారం. సో.. చూస్తుంటే ఈ సారి వెండితెరపై బిగ్ బాస్ కంటిస్టెంట్స్ జోష్ కనిపిస్తుందని అర్థమవుతోంది కదూ!.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/34RZUmo
v

విటమిన్ షి

స్మార్ట్ ఫోన్ చేతికి వచ్చాక ప్రపంచంతో పరిచయాలు ఏర్పడ్డాయి ప్రతి ఒక్కరికీ.. అదే సందర్భంలో భూటకపు ప్రపంచానికి దగ్గరయ్యారు కూడా.. ఏది నిజమో ఏది అబద్దమో తెలిసే లోపే.. చాలామంది బతుకులు బస్టాండ్ అయిపోతున్నాయి. జీవితం మొత్తాన్ని అరచేతిలో ఇమిడిపోయే స్మార్ట్ ఫోన్‌కి అప్పజెప్పేస్తూ.. టెక్నాలజీ మోజులో మనిషి బుర్రకి బూజుపట్టిస్తున్నారు. స్మార్ట్ ఫోన్ అనేది మనిషి జీవితంలో ఒక భాగమైంది.. ఫోన్ లేకపోతే పిచ్చిక్కిపోయే వాళ్లు మన కళ్ల ముందు కనిపిస్తూనే ఉంటారు. ఒకరకంగా చెప్పాలంటే.. మనిషికి సహాయకారిగా ఉంటుందనుకున్న స్మార్ట్ ఫోన్ మనిషినే డామినేట్ చేసే స్థితికి వచ్చేసింది. అయితే ఎంతైనా స్మార్ట్ ఫోన్ అనేది ఒక మెషిన్ లాంటిదే. మెషిన్స్ నూనెని మాత్రమే తయారు చేస్తాయి కానీ దీపం వెలిగించాలి అంటే చేతులే కావాలి కదా.. ఇలాంటి వినూత్న కథాంశంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది ‘విటమిన్ షి’ అనే వెబ్ ఫిల్మ్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నేపథ్యంలో ‘పేపర్ బాయ్’ చిత్రంతో దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న జయశంకర్ ‘విటమిన్ షి’ అనే చిత్రాన్ని రూపొందించారు. షార్ట్ ఫిలిమ్స్, ఇండిపెండెంట్ ఫిల్మ్స్‌తో యూట్యూబ్‌లో ప్రాచుర్యం పొందిన శ్రీకాంత్ గుఱ్ఱం ఇందులో హీరోగా నటించారు. ప్రాచీ టక్కర్ హీరోయిన్‌గా నటించగా.. రంజిత్ రెడ్డి, వికాస్, మొయిన్, సంజీవ్ జోషి, అశోక్ ఇతర పాత్రలు పోషించారు. లాక్ డౌన్ కాలంలో మంచి టెక్నికల్ వాల్యూస్‌తో ఈ సినిమాను కంప్లీట్ చేసి తాజాగా ఎంఎక్స్ ప్లేయర్ (MX Player)లో విడుదల చేశారు. ‘ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది మనుషుల జీవితాల్ని ఏ విధంగా ఆక్రమిస్తుందనేది ఈసినిమా మూల కథాంశం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఎంత టాప్ లెవెల్‌కి వెళ్లినా చివరకు మనుషుల్నే రీప్లేస్ చేసే స్థాయికి వచ్చినా కూడా మనుషుల ఎమోషన్స్‌ని రీప్లేస్ చేయడం మాత్రం వాటికి అసంభవం.. ఈ పరిస్థితుల్లో ఎలాంటి పరిణామాలు సంభవిస్తాయనేది సెటైరికల్‌గా ఈ సినిమాలో చూపించారు. ఈ సినిమాలో మొత్తం పన్నెండు పాత్రలు ఉండగా.. ప్రధానంగా నాలుగు పాత్రల చుట్టూ విటమిన్ షి కథను ఆసక్తికరంగా మలిచాడు దర్శకుడు జయశంకర్. ఈ చిత్ర కథ విషయానికి వస్తే.. లియో అలియాస్ లింగబాబు యోగానందం (శ్రీకాంత్ గుర్రం) ఫోన్‌కి బానిస. రికమండేషన్‌పై సాఫ్ట్ వేర్ కంపెనీలో జాబ్‌లో చేరిన ఒక చేతిలో ఫోన్.. మరో చేతిలో కాఫీ కప్ తప్పితే వేరే ప్రపంచం ఉండదు. అలాంటి లియో తన సహ ఉద్యోగి వైదేహి (ప్రాచీ టక్కర్) ప్రేమలో పడతాడు. ఆమెను ఫ్లర్ట్ చేసేందుకు చేయని ప్రయత్నాలు ఉండవు. ఎలాగైనా వేదేహి ప్రేమను పొందుకోవాలని తాపత్రాయ పడుతూ ఉంటాడు. స్మార్ట్ ఫోన్ లేకుండా క్షణం కూడా ఉండలేని లియో.. తన ఫోన్‌ని పోగొట్టుకుంటాడు. వెంటనే అత్యవరసర పరిస్థితుల్లో ‘విటమిన్ షి’ అనే అల్ట్రా మోడరన్ వాయిస్ అసిస్టెంట్‌ ఫోన్‌ని అప్పుచేసి మరీ కొంటాడు లియో. ఆ ఫోన్ వచ్చిన తరువాత తరువాత లియో జీవితం ఎలాంటి మలుపులు తిరిగింది? వైదేహి, లియోలు ‘విటమిన్ షి’ ఎలాంటి ఇబ్బందులు పడ్డారు? స్మార్ట్ ఫోన్ వినియోగం మనిషి జీవితంపై ఎలాంటి ప్రభావాలను చూపిస్తుంది? చివరికి లియో-వైదేహిలు ఒక్కటెలా అయ్యారన్నదే ‘విటమిన్ షి’ కథ. ఫోన్‌కి అడిక్ట్ అయ్యి.. బాధ్యత లేని సాఫ్ట్ వేర్ ఉద్యోగి పాత్రలో శ్రీకాంత్ తన పాత్రకు పూర్తి న్యాయం చేశాడు. అనుభవం ఉన్న నటుడిలా లియో పాత్రను మెప్పించాడు. అయితే ఈ చిత్ర కథకుడు లియో పాత్రకు ఎంత ప్రాధాన్యత ఉందో.. ‘విటమిన్ షి’ వాయిస్ అసిస్టెంట్ లైలా పాత్రకు అంతే ప్రాధాన్యత కల్పించాడు దర్శకుడు. 1.13 గంటల నిడివి ఉన్న ఈ చిత్రంలో లియో-లైలా మధ్య జరిగే సన్నివేశాలే ఎక్కువగా ఉంటాయి. వీరిద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు చాలా ఫన్నీగా అనిపిస్తాయి. సంభాషనలు ఆకట్టుకుంటాయి. లైలా మాటలు ప్రేక్షకుల్ని మెప్పిస్తాయి. కష్టం అంటే.. నీకు మాత్రమే ఉంది అనుకునేది, తప్పంటే.. నీ ఒక్కడికే ఒప్పు అనిపించేది లాంటి లైలా చెప్పే మాటలు బాగా కనెక్ట్ అవుతాయి. ‘మెషిన్స్ నూనెని మాత్రమే తయారు చేస్తాయి కానీ దీపం వెలిగించాలి అంటే చేతులే కావాలి’ అంటూ లైలా చెప్పే ఎమోషనల్ డైలాగ్స్ నిజమే కదా అనేట్టుగా ఉన్నాయి. అయితే లైలా-లియోల మధ్య సీన్లు మరీ లెంగ్తీగా ఉండటం బోర్ కొట్టిస్తాయి. ఇక హీరోయిన్ విషయానికి వస్తే.. అనీల్ రావిపూడి ‘పటాస్’ చిత్రం ద్వారా టాలీవుడ్‌కి పరిచయం అయ్యింది ప్రాచీ టక్కర్. గుజరాతీలో రెండు సినిమాల్లో కథానాయికగా నటించిన ప్రాచీ టక్కర్ ఇందులో హీరోయిన్‌గా చేశారు. స్మోకింగ్‌కి బానిస అయిన సాఫ్ట్ వేర్ ఉద్యోగిని వైదేహి పాత్రలో మెప్పిచింది ప్రాచీ. చాలా అందంగా కనిపించింది. వైదేహీ పాత్రకు మంచి నేపథ్యం ఉండటంతో కథలో భాగమైంది. వైదేహీ గతానికి సంబంధించి వచ్చి పెళ్లి ట్విస్ట్ ఆసక్తికరంగా ఉంది. అయితే హీరో హీరోయిన్ల మధ్య మరికొన్ని సీన్లు ఉంటే బాగుండనిపిస్తుంది. ఎక్కువగా లియో-లైలాల మధ్యనే ఎక్కువ సంభాషణలు ఉన్నాయి. ఈ చిత్రంలో దర్శకుడు జయ శంకర్ కరోనా వైరస్ అనే కరెంట్ ఇష్యూని టెక్నాలిజీతో లింక్ చేసి సెటారికల్‌గా చూపించడంతో సక్సెస్ అయ్యాడు. కరోనా వైరస్ వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని ఐర్లాండ్ శాస్త్రవేత్త వ్యాసాన్ని ఈ చిత్రంలో ప్రస్తావిస్తూ షాకింగ్ విషయాలను సున్నితమైన విమర్శలతో చెప్పగలిగాడు. కరోనా వైరస్ వెనుక కుట్ర దాగి ఉందని.. లాక్ డౌన్, సోషల్ డిస్టెన్స్ వెనుక కనిపించని పెద్ద కుట్ర దాగి ఉందని ఐర్లాండ్‌కి చెందిన శాస్త్రవేత్త వ్యాసం గూర్చి ప్రస్తావించారు దర్శకుడు జయశంకర్. మనిషిని టెక్నాలిజీని మరింత దగ్గర చేయడంలో భాగంగానే మల్టీనేషనల్ కంపెనీస్ పన్నిన కుట్రలో భాగమే ఈ కరోనా అని.. దీనిలో భాగంగానే కరోనా మొదలైన తరువాత ఇప్పటివరకూ అంటే ఈ 9 నెలలు కాలంలో మొబైల్, టెక్నాలజీ వాడకం ప్రపంచ వ్యాప్తంగా 10 వేల రెట్లు పెరిగిందని ఐర్లాండ్‌కి శాస్త్రవేత్త చెప్పిన షాకింగ్ విషయాలను కామెడీ సెన్స్‌లో చెప్పగలిగాడు దర్శకుడు. ఒకవైపు మొబైల్ ఉపయోగాన్ని తెలియజేస్తూనే.. వాటికి అడిక్ట్ అయితే ఎదురయ్యే దుష్పరిణామాలు ఎలా ఉంటాయన్నది చాలా సున్నితంగా ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యే విధానంలో చూపించగలిగాడు దర్శకుడు జయ శంకర్. యంత్రానికి కూడా ఎమోషన్స్ ఉంటాయని దర్శకుడు శంకర్ ‘రోబో’ చిత్రంలో చూపించారు. ఇందులో కూడా స్మార్ట్ ఫోన్ వినియోగదారుడి ప్రేమలో పడటం.. అతనికి సెక్స్ చేయాలని కోరుకోవడాన్ని ఫన్నీగా చూపించారు జయ శంకర్. టెక్నాలిజీపై సెటారికల్ మూవీగా వచ్చిన ఈ ‘విటమిన్ షి’లో టెక్నికల్ వాల్యూస్ సినిమాకు తగ్గట్టుగానే ఉన్నాయి. పాత్రలతో పాటు.. లొకేషన్లు కూడా పెద్దగా లేకపోవడంతో ఉన్నంతలోనే లొకేషన్స్‌ని చాలా రిచ్‌గా చూపించారు. శివ శంకర వర ప్రసాద్ సినిమాటోగ్రఫీ సినిమాకి హెల్ప్ అయ్యింది. పీవీఆర్ రాజు మ్యూజిక్‌తో మెప్పించారు. బ్యాగ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. అయితే 1.13 గంటల నిడివి మరికొంచెం తగ్గిస్తే మరింత క్రిస్పీగా ఉండేది. లియో-లైలాల మధ్య వచ్చే సన్నివేశాలకు ఎడిటర్ నాని లుక్కా కత్తెర వేస్తే బాగుండేది. చివరిగా.. రొటీన్ కథలా కాకుండా ఓ డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీ చూశామన్న ఫీల్ అయితే దొరుకుతుంది ‘విటమిన్ షి’ చిత్రం ద్వారా. టెక్నాలజీ, కామెడీ ప్రియులకు ఈ చిత్రం తప్పక నచ్చుతుంది. ఫోన్‌కి అడిక్ట్ అయ్యే వాళ్లైతే ఈ చిత్రంలో చూపించిన ‘నోమో’ ఫోబియా గురించి తప్పక తెలుసుకోవాల్సిందే.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2X5ygy9
v

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...