Tuesday 29 December 2020

Kushboo: రజినీ సర్ నిర్ణయం ఎంతోమంది తమిళుల హృదయాలను గాయపర్చింది.. కుష్బూ ఎమోషనల్ ట్వీట్

డిసెంబర్ 31న తన రాజకీయ పార్టీ ప్రకటిస్తానని కొద్దిరోజుల క్రితమే ప్రకటించిన ఊహించని విధంగా యూ టర్న్ తీసుకున్నారు. ఆరోగ్య సమస్యలు తలెత్తడంతో రజినీ వేసుకున్న ప్రణాళికలన్నీ తారుమారయ్యాయి. రజినీకాంత్ కుమార్తెలు ఐశ్వర్య, సౌందర్య కూడా ప్రస్తుతానికి రాజకీయాలకు దూరంగా ఉండాలని రజినీని కోరారట. ఈ పరిస్థితుల నడుమ రజినీకాంత్ అనూహ్యంగా వెనక్కి తగ్గారు. నా ఆరోగ్య సమస్యల వల్ల సన్ పిక్చర్స్ కళానిధి మారన్ చిత్రం షూటింగ్ క్యాన్సిల్ కావడంతో ఎంతో మంది ఉపాధి కోల్పోయారు. చాలా నష్టం వాటిల్లింది. ఇదంతా కేవలం నా ఆరోగ్యం వల్లే వచ్చింది. ఇది నాకు దేవుడి హెచ్చరికలా అనిపించిందని ఎమోషనల్ అవుతూ రజనీకాంత్ ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. తన వల్ల ఇతరులు సమస్యలు ఎదుర్కోవడం ఇష్టం లేదని, అందుకే పార్టీ పెట్టడం లేదు, రాజకీయాల్లోకి రావడం లేదని ఆయన పేర్కొన్నారు. ఈ క్రమంలో తాజాగా రజినీకాంత్ నిర్ణయంపై ఎమోషనల్ అవుతూ ట్వీట్ చేశారు. ''డియర్ రజనీ సర్.. మీరు తీసుకున్న ఈ నిర్ణయం ఎంతోమంది తమిళుల హృదయాలను గాయపరిచింది. కానీ మీ సమస్యను నేను పూర్తిగా అర్థం చేసుకున్నాను. ఎందుకంటే మన ఆరోగ్యం కంటే ఏదీ ముఖ్యం కాదు. మీ స్నేహితురాలిగా, శ్రేయోభిలాషిగా మీరు తీసుకున్న నిర్ణయాన్ని సమర్థిస్తున్నాను. నాకు మీరు అత్యంత విలువైన, ఎంతో ముఖ్యమైనవారు. జాగ్రత్తగా, సంతోషంగా ఉండండి'' అని కుష్బూ తన ట్వీట్‌లో రాసుకొచ్చారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3mXREHR
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...