Sunday 31 January 2021

65వ పడిలోకి తెలుగువారి ఆనందం బ్రహ్మానందం.. హాస్య బ్రహ్మ సినీ జర్నీలో మైలురాళ్లు ఎన్నో ఎన్నెన్నో..!

బ్రహ్మానందం.. ఈ పేరు వినబడితే చాలు తెలుగు వారి మదిలో ఆనందం చిగురిస్తుంటుంది. తనదైన ఎక్స్‌ప్రెషన్స్, కడుపుబ్బా నవ్వించే డైలాగ్స్‌తో వెండితెరపై హాస్యం పండించడంలో తనకు సాటెవ్వరూ లేరని నిరూపించారు . కోట్లాదిమంది ప్రేక్షకులను ఇట్టే రిలాక్స్ చేసే ఓ కామెడీ టానిక్ ఆయన. మూడున్నర ద‌శాబ్ధాల కెరీర్‌లో దాదాపు 1000కి పైగా సినిమాల్లో నటించిన ఆయన.. స్టార్ హీరోలను మించిన పాపులారిటీ సంపాదించారని చెప్పడంలో అతిశయోక్తి లేదు. మరి అలాంటి కామెడీ కింగ్ పుట్టినరోజు అంటే మామూలుగా ఉంటుందా!. సోషల్ మీడియా హోరెత్తిపోవాల్సిందే.. ఈ రోజు (ఫిబ్రవరి 1) ఆయన పుట్టినరోజు. నేటితో 64 సంవత్సరాలు పూర్తిచేసుకొని 65వ పడిలోకి అడుగుపెడుతున్నారు బ్రహ్మానందం. దీంతో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో ఎక్కడ చూసినా ఆయన బర్త్ డే విషెస్ మాత్రమే దర్శనమిస్తున్నాయి, హాస్యానికి పెట్టింది పేరు మీరంటూ సాధారణ ప్రజలు మొదలుకొని సెలబ్రిటీల వరకు ఆయనపై ప్రశంసల వర్షం గుప్పిస్తూ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఫిబ్రవరి 1వ తేదీ 1956 సంవత్సరంలో గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో బ్రహ్మానందం జన్మించారు. ఆయన తండ్రి కన్నెగంటి నాగలింగాచారి, తల్లి పేరు కన్నెగంటి లక్ష్మీనరసమ్మ. చదువులో ముందంజలో ఉండే ఆయన మాస్టర్ ఆఫ్ డిగ్రీ తెలుగు చేసి అత్తిలిలో లెక్చరర్‌గా పనిచేశారు. ఆ సమయంలోనే మిమిక్రీ చేస్తూ పలు సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగమయ్యేవారు. స్టేజ్ షోలలో ప్రదర్శనలు ఇస్తూ భేష్ అనిపించుకునేవారు. ఈ క్రమంలోనే జంధ్యాల రూపొందించిన ‘ఆహా నా పెళ్లంట' సినిమాలో 'అరగుండు' అనే పాత్రతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు బ్రహ్మానందం. ఆ సినిమాలో బ్రహ్మానందం కామెడీ టైమింగ్ చూసి ఫిదా అయిన దర్శకనిర్మాతలు వరుస ఆఫర్స్ ఇవ్వడంతో ఇక తన సినీ కెరీర్‌లో వెనుతిరిగి చూడలేదు బ్రహ్మానందం. బ్రహ్మి అంటూ ప్రేక్షకుల చేత ముద్దుగా పిలిపించుకుంటూ ఉన్నత శిఖరాలను అధిరోహించారు. ఖాన్ దాదా, బద్దం భాస్కర్, కిల్ బిల్ పాండే, కత్తి రాందాసు, శంకర్ దాదా ఆర్ఎంపీ, చిత్రగుప్తుడిగా, నెల్లూరు పెద్దారెడ్డి, శాస్త్రి, చారి, హల్వారాజ్‌, ప్రణవ్‌, బాబీ, జిలేబీ ఇలా చెప్పుకుంటూ పోతే ఆయన పోషించిన విలక్షణ కామెడీ రోల్స్ ఎన్నో ఎన్నెన్నో. ఎన్టీఆర్, ఏఎన్నార్.. ఆ తర్వాత చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్.. ఇక నేటితరం హీరోలు నాగ చైతన్య, జూనియర్ ఎన్టీఆర్, మహేష్ బాబు ఇలా మూడు తరాల హీరోలతో నటించి ఎప్పటికప్పుడు ట్రెండ్‌కి తగ్గట్టు నవ్వుల పంట పండించారు బ్రహ్మానందం. నటుడిగా పరిచయం చేసిన 'అహ నా పెళ్లంట' చిత్రమే 1987లో ఈయనకి తొలి నంది పురస్కారాన్ని కూడా సాధించిపెట్టింది. ఆ తర్వాత ఆయన కెరీర్‌లో ఐదు నందులు, ఒక ఫిల్మ్ ఫేర్, సైమా, ‘మా' అవార్డులతో పాటు 2010లో పద్మ శ్రీ పురస్కారం దక్కింది. వివిధ భాషలలో వెయ్యికి పైగా సినిమాలలో నటించి 2010లో గిన్నిస్ రికార్డుల్లో కూడా తన పేరు లిఖించుకున్నారు బ్రహ్మి. తెలుగులో కామెడీ రారాజుగా కిరీటం దక్కించుకున్న బ్రహ్మానందం.. ఇటీవలి కాలంలో సినిమాలు తగ్గించేశారు. ఒకప్పుడు దూకుడుగా సినిమాలు చేసిన ఆయన, వయసు మీదపడటంతో తన సినీ ప్రస్థానాన్ని కాస్త నెమ్మది చేశారు. ఇక ఈ నవ్వుల మహారాజుతో దాగిఉన్న మరో టాలెంట్ చిత్రలేఖనం. అద్భుతమైన చిత్రకళ తనలో ఉందని ఇటీవలే ప్రేక్షకలోకానికి చూపించి మెప్పించారాయన. ప్రస్తుతం బ్రహ్మానందం కృష్ణవంశీ దర్శకత్వంలో రూపొందుతున్న ‘రంగమార్తాండ’ సినిమాలో నటిస్తున్నారు. సో.. నేడు బ్రహ్మానందం పుట్టినరోజు సందర్భంగా ఆయనకు ప్రత్యేకంగా 'సమయం తెలుగు' తరఫున శుభాకాంక్షలు తెలుపుతున్నాం.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3oBupnE
v

పవన్ కళ్యాణ్‌- క్రిష్ సినిమా టైటిల్‌పై కీలక నిర్ణయం.. విరూపాక్ష కాదని చివరకు ఈ టైటిల్ ఫిక్సయ్యారా?

రెండేళ్ల రాజకీయ ప్రయాణం చేశాక ఇటీవలే తిరిగి కెమెరా ముందుకొచ్చిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. వరుస సినిమాలకు కమిటైన సంగతి తెలిసిందే. ఏ మాత్రం గ్యాప్ ఇవ్వకుండా అటు రాజకీయాలు, ఇటు సినిమా షూటింగ్స్ బ్యాలెన్స్ చేస్తూ వస్తున్నారు పవన్. ఈ నేపథ్యంలో ఇటీవలే తన 'వకీల్ సాబ్' షూటింగ్ కంప్లీట్ చేసిన ఆయన తదుపరి సినిమాలపై ఫోకస్ పెట్టారు. 'వకీల్ సాబ్' షూటింగ్ ఫినిష్ కావడంతో మళయాళ సూపర్ హిట్ మూవీ ‘అయ్యప్పనుమ్ కోషియమ్’ సినిమా తెలుగు రీమేక్‌‌ సెట్స్ పైకి వచ్చేశారు పవన్ కళ్యాణ్. ఇటీవలే ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమైంది. అయితే ఈ మూవీతో పాటు ప్యారలల్‌గా సినిమాను పూర్తి చేయాలని ఫిక్సయ్యారట పవన్. ఇందులో పవన్ కళ్యాణ్ బందిపోటు దొంగ పాత్రలో కనిపించబోతున్నాడని, ఈ చిత్రానికి '' అనే టైటిల్ ఫిక్స్ చేశారని విన్నాం. అయితే తాజా సమాచారం మేరకు ఈ టైటిల్ ఇప్పటికే ఓ డైరెక్టర్ రిజిస్టర్ చేయించుకోవడంతో క్రిష్ వెనక్కి తగ్గారని తెలుస్తోంది. టైటిల్ విషయమై చిత్ర నిర్మాతలు, పవన్ కళ్యాణ్‌తో చర్చించి చివరకు '' అనే టైటిల్‌ ఫైనల్ చేశారని సమాచారం. పీరియాడికల్ డ్రామాగా రూపొందనున్న ఈ మూవీ పవన్ కళ్యాణ్ కెరీర్‌లో 27వ సినిమాగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఎ.ఎం.రత్నం నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమాలో పవన్ సరసన ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్, బాలీవుడ్ బ్యూటీ జాక్వలైన్‌ ఫెర్నాండెజ్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారని తెలిసింది. సో.. ఈ టైటిల్ విషయంలో అసలు నిజం ఏంటనేది తెలియాలంటే మరి కొద్ది రోజులు ఆగాల్సిందే మరి!.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3oAe7LP
v

స్టార్ డైరెక్టర్‌ శంకర్‌కు 'రోబో' తెచ్చిన కష్టాలు.. నాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌ జారీ

భారీ సినిమాలు రూపొందిస్తూ తనదంటూ ప్రత్యేక శైలి అని నిరూపించుకున్న స్టార్ డైరెక్టర్ శంకర్ చిక్కుల్లో పడ్డారు. అది కూడా ఆయన రూపొందించిన సినిమా కారణంగా. అప్పట్లో సెన్సేషనల్ హిట్‌గా నిలిచి రికార్డులు తిరగరాసిన 'రోబో' కథ తనదే అంటూ ఓ వ్యక్తి కోర్టును ఆశ్రయించడం, ఆ తర్వాత జరిగిన పరిణామాలతో డైరెక్టర్‌ శంకర్‌కు చెన్నై ఎగ్మోర్‌ మెట్రోపాలిటిన్‌ మేజిస్ట్రేట్‌ కోర్టు నాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌ జారీ చేసింది. 2010 సంవత్సరంలో సూపర్ స్టార్ రజినీకాంత్‌ హీరోగా రోబో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు శంకర్. సైన్స్‌ ఫిక్షన్‌ మూవీగా రూపొందిన ఈ సినిమా ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయింది. దీంతో అన్ని సెంటర్లలో భారీ ఆదరణ చూరగొని సూపర్ డూపర్ హిట్ సినిమాగా నిలిచింది. అయితే ఆ 'రోబో' కథపై అరుల్‌ తమిళ్‌ నందన్‌ అనే రైటర్‌, డైరెక్టర్ శంకర్‌పై పలు ఆరోపణలు చేస్తూ కోర్టుకెక్కాడు. తాను రాసిన 'జిగుబా' అనే కథను కాపీ కొట్టి శంకర్‌ రోబో చిత్రాన్ని తెరకెక్కించాడని కేసు వేశాడు. అయితే ఈ కేసు విషయమై విచారణకు హాజరు కావాలంటూ కోర్టు అనేక పర్యాయాలు ఆదేశించినప్పటికీ శంకర్‌ నుంచి ఎలాంటి స్సందన రాలేదు. దీంతో తాజాగా శంకర్‌కు నాన్‌ బెయిలబుల్‌ అరెస్ట్‌ వారెంట్‌ను జారీ చేస్తూ కేసును ఫిబ్రవరి 19కి వాయిదా వేసింది చెన్నై ఎగ్మోర్‌ మెట్రోపాలిటిన్‌ మేజిస్ట్రేట్‌ కోర్టు. 1996లో అరుర్‌ తమిళ్‌ నందన్‌ రాసిన 'జిగుబా' కథ ఓ తమిళ మ్యాగజైన్‌లో ప్రచురితమవడమే కాకుండా ఆ తర్వాత 2007లో ఈ కథను ఓ నవలగా ముద్రించారు. సో.. చూడాలి మరి 'రోబో'తో వచ్చిన చిక్కుల్లోంచి శంకర్ ఎలా బయటపడతారనేది!.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3apwQEE
v

మెగా హీరోను కలిసేందుకు సాహసం.. ఏకంగా 200 కి.మీ. నడిచిన వీరాభిమాని

సినిమా హీరోలపై వారి అభిమానులు చూపించే అభిమానం మామూలుగా ఉండదు. తాము ఎంతగానో ఇష్టపడే హీరోని చూడాలని ఉవ్విళ్లూరుతుంటారు. వారితో ఫోటో దిగాలని తాపత్రయపడుతుంటారు. ఇక సినిమాల విడుదలకు భారీ కటౌట్లు, వాటికి పూలదండలు, పాలాభిషేకాలు ఎప్పుడూ ఉండేవే. కానీ, ఇప్పుడు ఓ మెగా హీరోని కలిసేందుకు ఈ వీరాభిమాని ఏకంగా 200 కిలోమీటర్లు నడుచుకుంటూ వచ్చాడు. వివరాలివీ.. తెలంగాణలోని జిల్లా భిక్కనూరుకు చెందిన బాలు అనే వ్యక్తికి మెగా కుటుంబానికి వీరాభిమాని. అందులోనూ ముఖ్యంగా వరుణ్‌ తేజ్‌ అంటే బాగా పిచ్చి. ఆ అమితమైన అభిమానంతోనే అతను వరుణ్‌ తేజ్‌ను కలవాలని గత మూడు సంవత్సరాల నుంచి ప్రయత్నిస్తున్నాడు. ఈ క్రమంలోనే తాజాగా భిక్కనూరు నుంచి హైదరాబాద్‌ వరకూ 200 కిలో మీటర్లు నడుచుకుంటూ వచ్చాడు. తనని చూసేందుకు కోసం అంత దూరం నడిచి వచ్చిన ఈ సూపర్‌ అభిమానిని వరుణ్‌ తేజ్‌ ఆదరించారు. ఆ అభిమానిని తన ఆఫీసులో కలిశారు. తన అభిమాని ఇలా తన కోసం నడిచి వస్తున్న విషయం తెలుసుకున్న వరుణ్‌ తేజ్‌ నేరుగా తన కార్యాలయానికే పిలిపించారు. అతనితో కొద్ది సేపు మాట్లాడారు. తనపై చూపుతున్న అభిమానానికి వరుణ్‌ తేజ్ ఎంతో సంతోషించారు. ఆ అభిమానికి ధన్యవాదాలు తెలిపారు. అంతేకాకుండా అభిమానికి సంబంధించిన విషయాలను అడిగి తెలుసుకున్నారు. ఇలా తన అభిమానిని కలిసిన కొన్ని ఫొటోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3pBqBnL
v

షూటింగ్ సెట్‏లో సేఫ్‏గా అనిపించలేదు.. ప్రియాంక చోప్రా ఆసక్తికర వ్యాఖ్యలు

గ్లోబల్‌స్టార్‌ బాలీవుడ్‌తో పాటు హాలీవుడ్‌ సినిమాల్లోనూ సత్తా చాటుతున్నారు. తనకంటే పదేళ్లు చిన్నవాడైన ప్రియుడు నిక్ జోనాస్‌ని పెళ్లాడిన ఆమె, మ్యారేజ్ తర్వాత కూడా కెరీర్ పరంగా దూసుకుపోతున్నారు. ఈ క్రమంలోనే ఆమె నటించిన లేటెస్ట్ మూవీ '' ఇటీవలే విడుదలై సక్సెస్ సాధించింది. అయితే తాజాగా ఓ ఇంగ్లీష్ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ మూవీ షూటింగ్‌కి సంబంధించిన ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చారు ప్రియాంక. తాను పెద్ద చదువు చదివి ఇంజనీర్ కావాలని అనుకున్నానని, కానీ అనూహ్యంగా తన అడుగులు సినీ ఇండస్ట్రీ వైపు పడటంతో ఇలా సెట్టయ్యానని తెలిపారు. 2000 సంవత్సరం అందాల పోటీలో పాల్గొన్న తాను ప్రపంచ సుందరి కిరీటాన్ని సొంతం చేసుకున్నాక వరుసగా సినిమా అవకాశాలు వచ్చాయని ఆమె చెప్పారు. ఆ సమయంలో తనకు సినిమాల గురించి తనకు పెద్దగా అవగాహన కూడా లేదని పేర్కొన్న ప్రియాంక.. నటనకు సంబంధించిన ఎన్నో మెళకువలను షూటింగ్స్ జరుగుతుండగానే నేర్చుకున్నానని చెప్పుకొచ్చారు. అలా అలా సినీ ఇండస్ట్రీలో తాను నిలదొక్కుకొని స్టార్‌గా ఎదిగానని.. తనకు ఈ పరిశ్రమ బాగా సూట్ అయిందని ప్రియాంక అన్నారు. ఇక లాక్‌డౌన్ తర్వాత తిరిగి షూటింగ్స్‌లో పాల్గొనడంపై స్పందించిన ప్రియాంక చోప్రా.. లాక్ డౌన్ నిబంధనలు పాటిస్తూ షూటింగ్స్ జరిగే లొకేషన్స్‏లో చాలా జాగ్రత్తలు తీసుకున్నారని, అయినప్పటికీ షూటింగ్ సెట్‏లో సేఫ్‏గా ఫీల్ కాలేకపోయానని ప్రియాంక తెలిపారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3cqaWUz
v

మెగాస్టార్ అవతారమెత్తిన ఫేమస్ క్రికెటర్.. చిరంజీవిగా చించేశాడులే! వీడియో వైరల్

కరోనా విలయతాండవం చేస్తున్న వేళ ఇంట్లోనే ఉంటూ టిక్‌టాక్‌ వీడియోలతో అట్రాక్ట్ చేశాడు ఆస్ట్రేలియన్ క్రికెటర్ . తన భార్యతో కలిసి స్టెప్పులేస్తూ ఆ వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేసి చర్చల్లో నిలిచాడు. ఆ తర్వాత రూటు మార్చిన ఈ క్రికెటర్.. పేస్ ఆఫ్ యాప్‌ను ఉప‌యోగించి అమితాబ్, ప్ర‌భాస్‌, మహేష్ బాబు, ర‌జినీకాంత్ లాంటి స్టార్ హీరోల రీఫేస్ క్రియేట్ చేసి అభిమానుల‌ను ఎంట‌ర్‌టైన్ చేస్తున్నాడు. ఈ క్రమంలోనే చిరంజీవిపై దృష్టి పెట్టి ఓ వీడియోతో ఆసక్తి రేకెత్తించాడు డేవిడ్ వార్నర్. ప్రతిష్టాత్మక మూవీ ‘’ టీజర్‌ ఇటీవలే విడుదలైన సంగతి తెలిసిందే. ఈ టీజర్‌లోని సన్నివేశాన్ని రీఫేస్‌ యాప్‌తో ఛేంజ్‌ చేసి చిరంజీవి డైలాగ్స్‌ని తాను చెబుతున్నట్లు వీడియో తీశాడు డేవిడ్ వార్నర్. ఇక ఈ వీడియోను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయడంతో వెంటనే వైరల్ అయింది. ఈ మేరకు 'కమింగ్ సూన్' అంటూ ఆయన చేసిన కామెంట్ మెగా అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. చిరంజీవి 152వ సినిమాగా స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో ఈ 'ఆచార్య' మూవీ రూపొందుతోంది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీలో చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తోంది. 'సిద్ధ' పాత్రలో రామ్ చరణ్ ప్రత్యేక ఆకర్షణగా నిలువనున్నారు. శ్రీమతి సురేఖ కొణిదెల సమర్పణలో కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్‌టైన్మెంట్ బ్యానర్లపై నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమాకు మణిశర్మ బాణీలు కడుతున్నారు. గత రెండు రోజుల క్రితం విడుదలైన ఆచార్య టీజర్ సోషల్ మీడియాలో హవా నడిపిస్తోంది. ఇప్పటికే ఈ టీజర్ 10 మిలియన్ల వ్యూస్ క్రాస్ చేయడం విశేషం. ఇకపోతే ఈ 'ఆచార్య'ను మే 13వ తేదీన రంగంలోకి దించబోతున్నట్లు ప్రకటించారు చిత్ర దర్శకనిర్మాతలు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3j1CuAV
v

చావు కబురు చల్లగా: కార్తికేయ, లావణ్య త్రిపాఠి ప్రేమకు ముహూర్తం.. బ్యూటిఫుల్ రాక్షసి అంటూ హీరో ట్వీట్

RX 100 సినిమాతో ఎంట్రీ ఇచ్చి యూత్ ఆడియన్స్‌ని అట్రాక్ట్ చేశాడు యంగ్ హీరో కార్తికేయ. ఆ తర్వాత గుణ 369, 90 ML, హిప్పీ లాంటి డిఫరెంట్ మూవీస్ చేసిన ఆయన ఇప్పుడు '' అంటూ మరో విలక్షణ కథతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమాలో జంటగా నటిస్తోంది. ఇప్పటికే ఈ మూవీ మేజర్ పార్ట్ షూటింగ్ కంప్లీట్ కావడంతో తాజాగా చిత్ర రిలీజ్ డేట్ ప్రకటించారు మేకర్స్. మర్చి 19వ తేదీన ఈ సినిమా రిలీజ్ చేస్తున్నట్లు పేర్కొంటూ కొత్త పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్‌ని తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేస్తూ ఆసక్తికర కామెంట్స్ చేశాడు హీరో కార్తికేయ. ''ఈ మార్చి 19కి చావు కబురు చల్లగా చెప్పడానికి బాలరాజు గాడు, మల్లిక థియేటర్లలోకి వస్తున్నారు. బిగ్ బ్యానర్ గీత ఆర్ట్స్‌లో ఈ సినిమా చేయడం, బ్యూటిఫుల్ రాక్షసి లావణ్య త్రిపాఠితో కలిసి పని చేయడం చాలా ఆనందంగా ఉంది'' అని ట్వీట్‌లో పేర్కొన్నాడు. మరోవైపు ఇదే విషయాన్ని తెలుపుతూ లావణ్య తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ పెట్టింది. మీ అందరినీ మార్చి 19న మళ్ళీ థియేటర్స్‌లో కలవనుండటం చాలా థ్రిల్లింగ్‌గా ఉందని ఆమె పేర్కొంది. డిఫరెంట్ టైటిల్‌లో వస్తున్న ఈ సినిమాలో లావణ్య త్రిపాఠి నర్సుగా నటిస్తుండగా, బస్తీ బాలరాజు రోల్‌లో మార్చురీ వ్యాన్ నడిపే డ్రైవర్‌గా కార్తికేయ కనిపించనున్నాడు. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్‌పై యువదర్శకుడు కౌశిక్ పెగల్లపాటి‌ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. జాక్స్ బిజోయ్ బాణీలు కడుతున్నాడు. ఇక ఈ చిత్రంలో హాట్ యాంకర్ అనసూయ ఐటమ్ సాంగ్ చేస్తుందని సమాచారం.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2NGMvrt
v

బాలయ్య స్టైలిష్ లుక్ అదుర్స్.. ఎన్టీఆర్ జయంతి నాడే BB3 రిలీజ్

‘సింహా’, ‘లెజెండ్’ వంటి బ్లాక్ బస్టర్ హిట్స్ త‌ర్వాత‌ నటసింహ నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీనుల కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న హ్యాట్రిక్ మూవీ BB3 (వర్కింగ్ టైటిల్). మిర్యాల స‌త్యనారాయ‌ణ రెడ్డి స‌మ‌ర్పణ‌లో ద్వారకా క్రియేషన్స్ ప‌తాకంపై యువ నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. పుట్టిన‌రోజు కానుక‌గా విడుదల చేసిన ‘BB3 ఫస్ట్ రోర్’ టీజ‌ర్‌కి అద్భుతమైన స్పందన వ‌చ్చింది. ఈ సినిమాకు సంబంధించి ఒక ఎగ్జయిటింగ్ అప్‌డేట్‌ను ఆదివారం మధ్యాహ్నం 3:36 గంటలకు అందిస్తామని చిత్ర నిర్మాణ సంస్థ ఉదయం ప్రకటించింది. అన్నట్టుగానే విడుదల తేదీతో పాటు బాలకృష్ణ కొత్త పోస్టర్‌ను విడుదల చేసింది. ఇంకా టైటిల్ ఖరారు చేయని ఈ చిత్రాన్ని మే 28న ప్రపంచ‌వ్యాప్తంగా విడుద‌ల‌ చేస్తున్నట్టు అధికారికంగా ప్రక‌టించారు. టీజ‌ర్‌లో మాస్‌ లుక్‌లో అద‌ర‌గొట్టిన బాలయ్య.. ఇప్పుడు ఈ కొత్త పోస్టర్‌లో స్టైలిష్‌ లుక్‌లో ఫ్యాన్స్‌ని అల‌రిస్తున్నారు. జేబులో చేయిపెట్టుకుని న‌డిచివ‌స్తున్న బాల‌య్య స్టైలిష్‌ లుక్‌కి మంచి రెస్పాన్స్ వ‌స్తోంది. మే 28 విశ్వవిఖ్యాత న‌ట‌సార్వభౌమ, న‌ట‌ర‌త్న నందమూరి తారక రామారావు జ‌యంతి కావ‌డం విశేషం. విడుదల తేదీ ప్రకటన సందర్భంగా చిత్ర నిర్మాత మిర్యాల ర‌వీంద‌ర్‌రెడ్డి మాట్లాడుతూ.. ‘‘సింహా, లెజెండ్ సినిమాల త‌ర్వాత బాల‌కృష్ణ, బోయ‌పాటి శ్రీ‌ను కాంబినేష‌న్‌లో వ‌స్తోన్న మ‌రో సూప‌ర్‌ సెన్సేష‌న‌ల్ మూవీ ఇది. మా ద్వార‌కా క్రియేష‌న్స్ బేన‌ర్‌లో అత్యంత ప్రతిష్టాత్మకంగా, భారీ తారాగ‌ణంతో ఈ చిత్రం రూపొందుతోంది. ఫిబ్రవ‌రి సెకండ్ వీక్ నుండి ఫైన‌ల్ షెడ్యూల్ ప్రారంభం కానుంది. ఈ షెడ్యూల్‌తో షూటింగ్ పూర్తవుతుంది. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి స‌మ్మర్ స్పెష‌ల్‌గా మే28న ఈ చిత్రాన్ని ప్రపంచ‌వ్యాప్తంగా విడుద‌ల‌చేస్తున్నాం’’ అని అన్నారు. ఈ చిత్రంలో నందమూరి బాలకృష్ణ, ప్రగ్యా జైస్వాల్‌తో పాటు భారీ తారాగ‌ణం న‌టిస్తోంది. ఇతర నటీనటుల వివరాలను త్వరలోనే వెల్లడించనున్నారు. తమన్ సంగీతం సమకూరుస్తోన్న ఈ చిత్రానికి సి.రాంప్రసాద్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఎం.రత్నం మాటలు రాశారు. ఎ.ఎస్.ప్రకాష్ ఆర్ట్ డైరెక్టర్. కోటగిరి వెంకటేశ్వరరావు, తమ్మిరాజు ఎడిటర్లు. రామ్-లక్ష్మణ్ మాస్టర్లు ఫైట్స్ కంపోజ్ చేస్తున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3iZYX1e
v

గ్రాండ్‌గా 'నరుడి బ్రతుకు నటన' చిత్ర ప్రారంభం.. ముఖ్య అతిథిగా ఎస్. రాధాకృష్ణ

ప్రముఖ చలన చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్‌మెంట్స్ యువ కథానాయకుడు హీరోగా ఓ చిత్రాన్ని నిర్మించనున్న విషయం విదితమే. 'కృష్ణ అండ్ హిజ్ లీల' చిత్రానికి దర్శకత్వ శాఖలో పనిచేసిన ప్రతిభ గల యువకుడు విమల్ కృష్ణను ఈ చిత్రం ద్వారా దర్శకునిగా పరిచయం చేస్తున్నారు నిర్మాత సూర్యదేవర నాగవంశీ. ఇందులో హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రాన్ని నేడు అధికారికంగా ప్రారంభించారు. ఉదయం 9 గంటల 9 నిమిషాలకు సంస్థ కార్యాలయంలో పూజాకార్యక్రమాలు జరిగాయి. చిత్ర నాయకా, నాయికలు సిద్ధు జొన్నలగడ్డ, నేహాశెట్టిలపై చిత్రీకరించిన ముహూర్తపు దృశ్యానికి హారిక అండ్ హాసిని చిత్ర నిర్మాణ సంస్థ అధినేత నిర్మాత ఎస్. రాధాకృష్ణ పెద్ద కుమార్తె హారిక క్లాప్ నివ్వగా, చిన్న కుమార్తె హాసిని కెమెరా స్విచ్ ఆన్ చేశారు. హారిక అండ్ హాసిని చిత్ర నిర్మాణ సంస్థ అధినేత నిర్మాత ఎస్. రాధాకృష్ణ (చినబాబు) చిత్ర దర్శక,నిర్మాతలకు చిత్రం స్క్రిప్ట్‌ను అందచేశారు. పి.డి.వి.ప్రసాద్ సమర్పణలోనిర్మాత సూర్యదేవర నాగవంశి నిర్మిస్తున్న ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ఫిబ్రవరి 4 నుంచి ప్రారంభం కానుంది. కొత్త తరం రొమాంటిక్ ప్రేమకథా చిత్రంగా ఈ సినిమాను రూపొందిస్తున్నట్లు దర్శకుడు విమల్ కృష్ణ తెలిపారు. చిత్రానికి సంబంధించిన మరిన్ని విశేషాలు త్వరలోనే ప్రకటిస్తామని ఆయన అన్నారు. ఈ చిత్రంలో బ్రహ్మాజీ, నర్రా శ్రీనివాస్ ప్రధాన పాత్రల్లో నటించనున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2YtTdn5
v

బెండకాయ దొండకాయ నువ్వు నా గుండెకాయ: అల్లు అర్హ అల్లరి వీడియో.. బన్నీ ఎమోషనల్

గారాలపట్టి అల్లు అర్హ తండ్రితో కలిసి ఎంత అల్లరి చేస్తుందో చెప్పాల్సిన అవసరంలేదు. అర్హతో తీసుకున్న ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ మురిసిపోతూ ఉంటారు బన్నీ. అర్హ ముద్దు ముద్దు మాటలకు బన్నీ ఫ్యాన్స్ కూడా ఫిదా అయిపోతుంటారు. తాజాగా అర్హ వీడియో ఒకటి ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు అల్లు అర్జున్. ఈ వీడియోలో అర్హ చిలిపిగా చెప్తున్న డైలాగ్ అందరినీ ఆకట్టుకుంటోంది. ‘బెండకాయ దొండకాయ నువ్వు నా గుండెకాయ’ అని తన తండ్రిని ఉద్దేశించి వీడియోలో అర్హ అంటోంది. ఆమె చిలిపిగా ఆ డైలాగ్ చెప్పగానే వీడియో తీస్తున్న బన్నీ నవ్వు ఆపుకోలేకపోయారు. వాస్తవానికి ఇది గతేడాది మార్చి 1న తీసిన వీడియో అట. కానీ, బన్నీ ఇప్పుడు పోస్ట్ చేశారు. దీనికి కారణం ఉంది. అల్లు అర్జున్ మళ్లీ ‘పుష్ప’ షూటింగ్‌లో పాల్గొనడానికి వెళ్లారు. తన టీమ్‌తో కలిసి ఆయన కేరళ వెళ్లినట్టు సమాచారం. ఇది కాస్త పెద్ద షెడ్యూల్ అట. అందుకే, ఆ వీడియోను షేర్ చేసి దాని మీద ‘ఐ మిస్ యు అర్హ’ అని రాశారు బన్నీ. తన గారాలపట్టి అల్లరిని మిస్ అవుతున్నందుకు ఆయన కాస్త ఎమోషనల్ అయ్యారు. కానీ, అర్హ వీడియో చూసిన వాళ్లకు బన్నీ ఎమోషన్ కనబడదు.. ఆమె చిలిపితనం మాత్రమే కనిపిస్తుంది. ఇదిలా ఉంటే, ‘పుష్ప’ సినిమాకు సుకుమార్ దర్శకత్వం వహిస్తోన్న సంగతి తెలిసిందే. బన్నీ-సుక్కు కాంబినేషన్‌లో వస్తోన్న మూడో చిత్రమిది. దీంతో అంచనాలు భారీగా ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు అంచనాలను రెట్టింపు చేస్తున్నాయి. ఈ సినిమాను ఆగస్టు 13న విడుదల చేస్తున్నట్టు రెండు రోజుల క్రితమే చిత్ర నిర్మాణ సంస్థ ప్రకటించింది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తోన్న ఈ చిత్రాన్ని ముత్తంశెట్టి మీడియా సౌజన్యంతో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై.రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2NTDQCf
v

మహేష్ బాబు సినిమాలో మోనాల్ గజ్జర్ ఆటా పాటా!!

సూపర్ స్టార్ ‘సర్కారు వారి పాట’ను దుబాయ్‌లో మొదలుపెట్టిన విషయం తెలసిందే. పరుశురామ్ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ చిత్రం ప్రస్తుతం దుబాయ్‌లో నిర్విరామంగా షూటింగ్ జరుపుకుంటోంది. మహేష్ బాబు సరసన కీర్తి సురేష్ నటిస్తున్నారు. వీరిద్దరి కాంబినేషన్‌లో వస్తోన్న తొలి చిత్రమిది. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అయితే, ఈ సినిమాకు సంబంధించిన ఆసక్తికర వార్త ఒకటి ఇండస్ట్రీ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. బిగ్ బాస్ 4 తెలుగు కంటెస్టెంట్ ‘సర్కారు వారి పాట’లో ఒక ప్రత్యేక పాట చేయబోతున్నారని టాక్. బిగ్ బాస్ హౌస్ నుంచి బయటికి వచ్చిన తరవాత ‘అల్లుడు అదుర్స్’ సినిమాలో బెల్లంకొండ శ్రీనివాస్‌తో కలిసి మోనాల్ స్టెప్పులేశారు. ఈ పాటకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. దేవిశ్రీ ప్రసాద్ ఫాస్ట్ బీట్‌కు మోనాల్ స్టెప్పులు అదిరిపోయాయని అన్నారు. అలాగే, ఆమె గ్లామర్ కూడా ప్లస్ అయ్యిందని కొనియాడారు. అయితే, ఈ సినిమా యావరేట్ టాక్‌ను దక్కించుకుంది. ఇదిలా ఉంటే, ఇప్పుడు టాలీవుడ్ స్టార్ హీరో అయిన మహేష్ బాబుతో ‘సర్కారు వారి పాట’లో స్టెప్పులేయబోతున్నారట మోనాల్. ఈ వార్తలో నిజమెంతో తెలీదు కానీ.. ఇదే గనుక నిజమైతే మోనాల్ బంపరాఫర్ కొట్టేసినట్టే. కాగా, ఈ సినిమాకు తమన్ సంగీతం సమకూరుస్తున్నారు. మధి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. మార్తాండ్ కె. వెంకటేష్ ఎడిటర్. ఎ.ఎస్.ప్రకాష్ ఆర్ట్ డైరెక్టర్. మైత్రీ మూవీ మేకర్స్, జీఎంబీ ఎంటర్‌టైన్మెంట్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్లపై నవీన్ యెర్నేని, వై.రవిశంకర్, రామ్ ఆచంట, గోపీ ఆచంట నిర్మిస్తున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2Ml6agf
v

Pushpa: అల్లు అర్జున్ డ్యూయల్ రోల్ పోషిస్తున్నారా..? కన్ఫ్యూజన్ క్రియేట్ చేసిన సుకుమార్

స్టైలిష్ స్టార్ హీరోగా రూపొందుతున్న '' మూవీ రిలీజ్ డేట్ ప్రకటిస్తూ ఇటీవలే కొత్త పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. ప్రపంచవ్యాప్తంగా ఆగస్టు 13వ తేదీన ఈ మూవీ రిలీజ్ కానుందని ప్రకటించారు. అయితే ఇక్కడే వచ్చి పడింది అసలు కన్ఫ్యూజన్. తాజాగా విడుదల చేసిన ఈ రిలీజ్ డేట్ పోస్టర్‌లో బన్నీ కాలుకు ఐదు వేళ్లే కనిపించడంతో జనాల్లో చర్చలు మొదలయ్యాయి. గతంలో అల్లు అర్జున్ పోలీస్ స్టేషన్‌లో కూర్చుని ఉన్నట్లు ఫస్ట్‌లుక్ రిలీజ్ చేయగా.. అందులో అల్లు అర్జున్ ఎడమకాలికి ఆరు వేళ్లు కనిపించాయి. కానీ లేటెస్ట్ పోస్టర్‌ నిశితంగా గమనిస్తే ఆ కాలుకి ఐదు వేళ్లే కనిపిస్తున్నాయి. దీంతో ఈ పోస్ట‌ర్‌ చూసిన ఫ్యాన్స్ బ‌న్నీ ఇందులో డ్యూయ‌ల్ రోల్ చేస్తున్నాడా? అని చర్చించుకుంటున్నారు. ఇక సోషల్ మీడియాలో అయితే దీనిపై పెద్ద డిస్కషన్ మొదలైంది. చూడాలి మరి.. ఈ విషయంలో అసలు సీక్రెట్ ఏంటనేది సుకుమార్ చెబుతారా? లేక సస్పెన్సు లోనే ఉంచుతారా? అనేది. ప్ర‌స్తుతం ఈ సినిమా షూటింగ్ తూర్పు గోదావరి జిల్లా మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో జ‌రుగుతోంది. పాన్ ఇండియా మూవీగా రూపొందుతోన్న ఈ చిత్రంలో లారీ డ్రైవర్ పుష్పరాజ్ పాత్రలో బన్నీ నటిస్తుండగా.. ఆయన సరసన రష్మిక మందన హీరోయిన్‌గా నటిస్తోంది. ఎర్ర‌చంద‌నం స్మ‌గ్లింగ్ నేప‌థ్యంలో మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సినిమాపై అల్లు అర్జున్ ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3cE45XR
v

Pushpa: అల్లు అర్జున్ డ్యూయల్ రోల్ పోషిస్తున్నారా..? కన్ఫ్యూజన్ క్రియేట్ చేసిన సుకుమార్

స్టైలిష్ స్టార్ హీరోగా రూపొందుతున్న '' మూవీ రిలీజ్ డేట్ ప్రకటిస్తూ ఇటీవలే కొత్త పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. ప్రపంచవ్యాప్తంగా ఆగస్టు 13వ తేదీన ఈ మూవీ రిలీజ్ కానుందని ప్రకటించారు. అయితే ఇక్కడే వచ్చి పడింది అసలు కన్ఫ్యూజన్. తాజాగా విడుదల చేసిన ఈ రిలీజ్ డేట్ పోస్టర్‌లో బన్నీ కాలుకు ఐదు వేళ్లే కనిపించడంతో జనాల్లో చర్చలు మొదలయ్యాయి. గతంలో అల్లు అర్జున్ పోలీస్ స్టేషన్‌లో కూర్చుని ఉన్నట్లు ఫస్ట్‌లుక్ రిలీజ్ చేయగా.. అందులో అల్లు అర్జున్ ఎడమకాలికి ఆరు వేళ్లు కనిపించాయి. కానీ లేటెస్ట్ పోస్టర్‌ నిశితంగా గమనిస్తే ఆ కాలుకి ఐదు వేళ్లే కనిపిస్తున్నాయి. దీంతో ఈ పోస్ట‌ర్‌ చూసిన ఫ్యాన్స్ బ‌న్నీ ఇందులో డ్యూయ‌ల్ రోల్ చేస్తున్నాడా? అని చర్చించుకుంటున్నారు. ఇక సోషల్ మీడియాలో అయితే దీనిపై పెద్ద డిస్కషన్ మొదలైంది. చూడాలి మరి.. ఈ విషయంలో అసలు సీక్రెట్ ఏంటనేది సుకుమార్ చెబుతారా? లేక సస్పెన్సు లోనే ఉంచుతారా? అనేది. ప్ర‌స్తుతం ఈ సినిమా షూటింగ్ తూర్పు గోదావరి జిల్లా మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో జ‌రుగుతోంది. పాన్ ఇండియా మూవీగా రూపొందుతోన్న ఈ చిత్రంలో లారీ డ్రైవర్ పుష్పరాజ్ పాత్రలో బన్నీ నటిస్తుండగా.. ఆయన సరసన రష్మిక మందన హీరోయిన్‌గా నటిస్తోంది. ఎర్ర‌చంద‌నం స్మ‌గ్లింగ్ నేప‌థ్యంలో మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సినిమాపై అల్లు అర్జున్ ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3cE45XR
v

‘ఆహా’లో రవితేజ ‘క్రాక్’.. వరల్డ్ డిజిటల్ ప్రీమియర్‌కు డేట్ ఫిక్స్

మాస్ మహారాజా హీరోగా, శృతిహాసన్ హీరోయిన్‌గా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వచ్చిన మూవీ ‘క్రాక్’. బి.మధు నిర్మాత. భారీ అంచనాలతో సంక్రాంతి కానుకగా జనవరి 9న విడుదలైన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. బాక్సాఫీసు వద్ద కాసుల వర్షం కురిపించింది. విడుదలైన తొలి వారంలోనే లాభాల బాట పట్టింది. తొలి రోజు ఆర్థిక సమస్యలతో రాత్రి వరకు షోలు పడకపోయినా ఆ ప్రభావం సినిమా కలెక్షన్లపై పడలేదు. మొత్తానికి రవితేజ కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్‌గా ‘క్రాక్’ నిలిచింది. ఇంత సూపర్ హిట్ అయిన ‘క్రాక్’ సినిమాను ఇంకా థియేటర్లలో చూడని వారికి శుభవార్త. ప్రముఖ అచ్చ తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫాం ‘ఆహా’లో ‘క్రాక్’ మూవీ అందుబాటులోకి వస్తోంది. ఫిబ్రవరి 5 నుంచి ఈ మూవీ ఆహాలో స్ట్రీమింగ్ కానుంది. ఈ మేరకు ‘క్రాక్’ వరల్డ్ డిజిటల్ ప్రీమియర్‌కు డేట్ ఫిక్స్ చేస్తూ ‘ఆహా’ ట్వీట్ చేసింది. అంతేకాదు, కొత్త ట్రైలర్‌ను రేపు 11 గంటలకు విడుదల చేస్తోంది ‘ఆహా’. ‘క్రాక్’ డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్‌ను ‘ఆహా’ సొంతం చేసుకున్నట్టు ఇప్పటికే వార్తలు వచ్చాయి. ఈ రైట్స్‌ను ‘ఆహా’ రూ.6.5 కోట్లకు సొంతం చేసుకున్నట్టు మొదట ఇండస్ట్రీ వర్గాల నుంచి సమాచారం రాగా.. ఇప్పుడు, రూ.8 కోట్లని అంటున్నారు. నిజానికి రిపబ్లిక్ డేకు ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు ‘ఆహా’ ప్లాన్ చేసిందట. అయితే, డిస్ట్రిబ్యూటర్ల నుంచి నిర్మాత మధుపై ఒత్తిడి రావడం.. ఆయన అల్లు అరవింద్‌ను రిక్వెస్ట్ చేయడంతో ఫిబ్రవరి 5కు వాయిదా వేసుకున్నారని టాక్. ఏదేమైనా థియేటర్‌లో విడుదలైన 27 రోజుల్లోనే ‘క్రాక్’ ఓటీటీలో అందుబాటులోకి వచ్చేస్తుంది. ఇదిలా ఉంటే, ఈ చిత్రానికి తమన్ సంగీతం సమకూర్చారు. ఆయన అందించిన పాటలు, నేపథ్య సంగీతానికి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. అలాగే, సాయి మాధవ్ బుర్రా రాసిన డైలాగులకు థియేటర్లలో ప్రేక్షకులు ఈలలు వేశారు. గోపీచంద్ మలినేని టేకింగ్, పోలీస్ అధికారిగా రవితేజ నటన ప్రేక్షకుల్ని మెస్మరైజ్ చేశాయి. ఇప్పుడు వీటన్నింటినీ ప్రేక్షకులు ఇంట్లోనే మరో నాలుగు రోజుల్లో ఎంజాయ్ చేయొచ్చు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3pBHpe7
v

Khiladi: క్రాకింగ్ హిట్ తర్వాత మరో మాస్ జాతరకు ముహూర్తం ఫిక్స్.. 'ఖిలాడీ'గా రవితేజ రెడీ

ఈ మధ్య వరుస పరాజయాలతో సతమతమవుతున్న మాస్ మహారాజ్ ఇటీవలే 'క్రాక్' సినిమాతో మరోసారి సక్సెస్ ట్రాక్ ఎక్కారు. కొత్త ఏడాది ఆరంభంలోనే సంక్రాంతి బరిలో దిగి క్రాకింగ్ హిట్ ఖాతాలో వేసుకున్నారు. ప్రస్తుతం అదే జోష్‌లో తన లేటెస్ట్ మూవీ ''లో నటిస్తున్నారు. గత కొన్ని రోజులుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించారు మేకర్స్. డా.జయంతిలాల్‌ గడ సమర్పణలో ఏ స్టూడియోస్‌, పెన్‌ స్టూడియోస్‌ పతాకాలపై సత్యనారాయణ కోనేరు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. చిత్రానికి రమేశ్‌ వర్మ దర్శకత్వం వహిస్తుండగా.. రవితేజ సరసన మీనాక్షి చౌదరి, డింపుల్‌ హయతి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇటీవలే రిలీజ్ చేసిన ఈ మూవీ ఫస్ట్‌లుక్ పోస్టర్, రవితేజ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన గ్లింప్స్ ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ పొందాయి. ఈ క్రమంలో తాజాగా ఈ సినిమాను మే 28వ తేదీన విడుదల చేస్తున్నట్లు ప్రకటిస్తూ కొత్త పోస్టర్ విడుదల చేసి రవితేజ అభిమానుల్లో జోష్ నింపారు చిత్ర నిర్మాత సత్యనారాయణ కోనేరు. రాక్‌స్టార్‌ దేవి శ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో యాక్షన్ కింగ్ అర్జున్ కీలకపాత్రలో నటిస్తుండటం విశేషం. హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ సినిమాపై మాస్ మహారాజా ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఇప్పటికే రిలీజ్ చేసిన అప్‌డేట్స్ చూస్తుంటే.. క్రాకింగ్ హిట్ తర్వాత ఈ వేసవిలో 'ఖిలాడీ' రూపంలో మరో మాస్ జాతర ఖాయమే అని తెలుస్తోంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2YrOemG
v

నేను నిక్షేపంగా ఉన్నాను.. ఆ వార్తలు బాధించాయి: నటి ఆమని ఆవేదన

రెండు రోజుల క్రితం తెలంగాణలోని మంచిర్యాలలో ఓ సినిమా షూటింగ్‌లో పాల్గొన్న సీనియర్ నటి స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. స్థానికంగా ఉన్న ఓ ప్రైవేట్ హాస్పిటల్‌కు వెళ్లి వైద్యం తీసుకున్నారు. అక్కడి మెడికల్ స్టాఫ్ కోరిక మేరకు వాళ్లతో ఒక ఫొటో కూడా దిగారు. ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆమనికి అస్వస్థత అనే వార్త క్షణాల్లో వ్యాపించేసింది. డిజిటల్ మీడియాలో ఈ వార్త హైలైట్ అయ్యింది. కొంత మంది అత్యుత్సాహంతో ఆమని గుండె పోటు అని రాసేశారు. అయితే, ఈ వార్తలపై నటి ఆమని స్పందించారు. ఇలాంటి వదంతులు ఎందుకు పుడతాయో అర్థం కావడం లేదు అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తాను నిక్షేపంగా ఉన్నానని.. దయచేసి వదంతులు వ్యాప్తి చేయవద్దని కోరారు. ఈ మేరకు ఆదివారం ఆమె మీడియాలో మాట్లాడారు. ‘‘నేను నిక్షేపంగా షూటింగ్స్‌తో బిజీగా ఉన్నాను. ఫుడ్ పాయిజన్ వల్ల కొంచెం అస్వస్థతగా అనిపించడంతో యూనిట్ బలవంతం మీద ఆసుపత్రికి వెళ్లాను. దీన్ని హార్ట్ ఎటాక్‌గా చిత్రీకరించడం చాలా బాధాకరం’’ అని ఆమని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, మంచిర్యాల జిల్లాకు చెందిన గేయ రచయిత తైదల బాపు నిర్మాతగా వ్యవహరిస్తున్న ఓ చిత్రంలో ఆమని నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ నిమిత్తమే ఆమె మంచిర్యాల వెళ్లారు. మరోవైపు, ఆమని ముఖ్యపాత్ర పోషించిన ‘అమ్మ దీవెన’ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రస్తుతం ఆమని నటిస్తున్న ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’, ‘చావు కబురు చల్లగా’తో పాటు పలు చిత్రాలు వివిధ దశల్లో ఉన్నాయి.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3pDJTJg
v

నా కెరీర్‌లో పెద్ద అడుగు.. ఎన్నో రోజుల కల నెరవేరింది.. యాంకర్ ప్రదీప్ ఎమోషనల్ కామెంట్స్

బుల్లితెరపై మాటల తూటాలతో అలరించి తనకంటూ ప్రత్యేక అభిమాన వర్గాన్ని కూడగట్టుకున్న వెండితెరపై కూడా టాలెంటెడ్ యాక్టర్ అనిపించుకుంటున్నాడు. హీరోగా ఆరంగేట్రం చేసిన తొలి సినిమాతోనే పలువురి ప్రశంసలు పొందుతున్నాడు. ఆయన హీరోగా శుక్రవారం విడుదలైన '?' మూవీ తొలిరోజే సక్సెస్ టాక్ తెచ్చుకొని విజయవంతంగా ప్రదర్శించబడుతోంది. నిజానికి ఎప్పుడో విడుదల కావాల్సిన ఈ సినిమా థియేటర్స్ మూతబడటంతో వాయిదాపడి చివరకు ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ క్రమంలో చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా రిలీజ్ చేసిన ''నీలి నీలి ఆకాశం ఇద్దామ‌నుకున్నా..'' సాంగ్ సంగీత ప్రియులను ఎంతగానో ఆకట్టుకొని సినిమాపై హైప్ పెంచేసింది. దీంతో తొలిరోజే ఈ మూవీ రూ.4 కోట్ల గ్రాస్‌ కలెక్షన్స్ రాబట్టి సత్తా చాటింది. చిత్రంలో హీరోగా ప్రదీప్ నటన చాలా బాగుందనే టాక్ వచ్చింది. దీంతో ప్రేక్షకులందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతూ ఎమోషనల్ ట్వీట్ చేశాడు ప్రదీప్. ''ఒక చిన్న సినిమాకు విశేష స్పందన రావడం ఆనందంగా ఉంది. ఎన్నోరోజుల కల ఇది. మీ అందరి సహకారంతోనే ఈ రోజు సాధ్యమైంది. నీ కెరీర్‌లో పడిన అతిపెద్ద అడుగుకు ఇంతటి సపోర్ట్ అందడం చాలా సంతోషంగా అనిపిస్తోంది. ప్రేక్షకులందరికీ పేరు పేరునా ధన్యవాదాలు తెలుపుతున్నా. ఎప్పటికీ మిమ్మల్ని ఇలాగే ఎంటర్‌టైన్ చేస్తూనే ఉంటాను'' అని ప్రదీప్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు. ఈ '30 రోజుల్లో ప్రేమించటం ఎలా?' సినిమాతో సుకుమార్ వద్ద దర్శకత్వ శాఖలో పనిచేసిన మున్నా దర్శకుడిగా పరిచయమయ్యాడు. ఎస్‌.వి ప్రొడ‌క్షన్స్ బ్యాన‌ర్‌పై ఎస్‌.వి.బాబు నిర్మాతగా వ్యవహరించిన ఈ మూవీలో ప్రదీప్ సరసన అమృతా అయ్యర్ హీరోయిన్‌గా నటించింది. అనూప్ రూబెన్స్ సంగీతం అందించారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3crD7Cv
v

‘జల జల జలపాతం’ సాంగ్: దేవిశ్రీ సంగీతం.. శ్రేయా ఘోషల్ గానం.. జస్ట్ వావ్

సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ తమ్ముడు పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా ప‌రిచ‌య‌మ‌వుతున్న చిత్రం ‘ఉప్పెన‌’. కృతి శెట్టి హీరోయిన్‌గా న‌టించారు. సుకుమార్ వద్ద దర్శకత్వ శాఖలో పనిచేసిన బుచ్చిబాబు సానా ద‌ర్శకుడిగా ప‌రిచ‌య‌మ‌వుతున్నారు. సుకుమార్ రైటింగ్స్ సౌజన్యంతో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై.రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ మూవీని ఫిబ్రవ‌రి 12న విడుదల చేస్తున్నట్టు నిర్మాతలు ఇటీవల ప్రకటించారు. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చిన ఈ చిత్రం నుంచి ఇప్పటికే మూడు పాటలు విడుదలయ్యాయి. వీటిలో ‘నీ కన్ను నీలి సముద్రం’ సాంగ్ సూపర్ డూపర్ హిట్టయ్యింది. అలాగే ‘ధక్ ధక్’, ‘రంగులద్దుకున్న’ పాటలు కూడా ఆకట్టుకున్నాయి. ఇప్పుడు ఈ చిత్రం నుంచి మరో అందమైన పాట విడుదలైంది. ‘జల జల జలపాతం’ అంటూ సాగే ఈ మెలొడీ సంగీత ప్రియులను అలరిస్తోంది. ఈ పాటను సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ విడుదల చేయడం విశేషం. దేవిశ్రీ ప్రసాద్ మరో అద్భుతమైన మెలొడీని స్వరపరిచారు. శ్రీమణి సాహిత్యం, జస్ప్రీత్ జాజ్ - శ్రేయా ఘోషల్ గానం, దేవిశ్రీ సంగీతం కలిపి మరో గుర్తుండిపోయే పాటను తెలుగు ప్రేక్షకులకు అందించాయి. మరోవైపు, ఇప్పటికే విడుదలైన ‘ఉప్పెన’ టీజర్ సినిమాపై అంచనాలను భారీగా పెంచేసింది. ఈ టీజర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. ఈ సినిమాలో హీరో గంగపుత్రుడిగా కనిపించనున్నాడు. ఇక హీరోయిన్ కాలేజీకి వెళ్లే పెద్దింటి అమ్మాయి. వీరిద్దరి మధ్య ప్రేమకథే ‘ఉప్పెన’. బుచ్చిబాబు సానా ఈ సినిమాకు దర్శకత్వం వహించడంతో పాటు కథ, స్క్రీన్‌ప్లే, సంభాషణలు కూడా అందించారు. ఈ చిత్రానికి దేవిశ్రీ సంగీతంతో పాటు షామ్‌దత్ సైనుద్దీన్ సినిమాటోగ్రఫీ మరో ప్రధాన ఆకర్షణ కానుంది. అలాగే, తమిళ స్టార్ యాక్టర్ విజయ్ సేతుపతి పాత్ర కూడా మెస్మరైజ్ చేయనుంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2L2qTF0
v

ఇకపై థియేటర్లలో 'ఫుల్' ఆక్యుపెన్సీ.. సినీ ప్రియులకు శుభవార్త చెప్పిన కేంద్రం

కరోనా తెచ్చిన కష్టాల్లో థియేటర్ గేట్లు మూతపడటం ఒకటి. గతేడాది కోవిడ్ ప్రభావంతో సినిమా షూటింగ్స్, థియేటర్స్ అన్నీ క్లోజ్ కావడంతో సినీ పరిశ్రమ విలవిల్లాడింది. ఈ నేపథ్యంలో లాక్‌డౌన్ సడలింపుల్లో భాగంగా 50 శాతం ఆక్యుపెన్సీతో థియేటర్లు ఓపెన్ చేసుకోవచ్చని గతేడాది అక్టోబర్‌లో పర్మిషన్స్ ఇచ్చిన కేంద్రం.. తాజాగా మరో సడలింపు చేసింది. ఇకపై థియేటర్స్ 100 శాతం ఆక్యుపెన్సీతో నడిపించుకోవచ్చని అనుమతులిస్తూ ఇటు సినీ ప్రియులకు, అటు థియేటర్ యాజమాన్యాలకు శుభవార్త చెప్పింది కేంద్ర ప్రభుత్వం. క్రమంగా కరోనా వైరస్ ప్రభావం తగ్గుతుండటంతో పాటు వ్యాక్సినేషన్ ప్రక్రియ జోరందుకోవడంతో కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ప్రేక్షకులు కూడా ఇప్పుడిప్పుడే సినిమా హాళ్లలో అడుగుపెట్టేందుకు ఆసక్తి చూపుతుండటంతో ఇకపై థియేటర్లు 'ఫుల్' ఆక్యుపెన్సీతో సినిమాలు ప్రదర్శించుకోవచ్చని తెలిపింది. థియేటర్‌ యాజమాన్యాలు సంతోషించేలా 100 శాతం ఆక్యుపెన్సీకి కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ అనుమతులు జారీ చేసింది. జనవరి 31 నుంచే నుంచి ఇది అమలులోకి వస్తుందని కేంద్రం తెలిపింది. ఈ మేరకు థియేటర్ జయమాన్యాలకు కొన్ని మార్గదర్శకాలు జారీ చేసింది కేంద్ర ప్రభుత్వం. థియేటర్‌ సిబ్బంది, ప్రేక్షకులు తప్పనిసరిగా మాస్క్‌ ధరించాలని, థియేటర్ ప్రవేశ ద్వారం వద్ద శరీరా ఉష్ణోగ్రతను కొలిచే థర్మల్‌ స్క్రీనింగ్ ఏర్పాటు చేయాలని, అలాగే శానిటైజర్లు అందుబాటులో ఉంచుతూ సినిమా హాలు లోపల ఉష్ణోగ్రత 24-30 డిగ్రీల సెల్సియస్ ఉండేలా జాగ్రత్త పడాలని పేర్కొంది. అదేవిధంగా ‌థియేటర్లలో ఉమ్మి వేయడాన్ని నిషేదిస్తూ మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్‌కాస్టింగ్ అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3pzo2CD
v

Saturday 30 January 2021

వెంకటేష్‌కి ఫ్రస్ట్రేటెడ్ ఫాదర్.. మరోసారి కడుపుబ్బా నవ్వించనున్న గోపరాజు రమణ!!

ఆనంద్ దేవరకొండ హీరోగా వచ్చిన ‘మిడిల్ క్లాస్ మెలొడీస్’ సినిమాలో కొండలరావు పాత్ర గుర్తుందా. ఎప్పుడూ ఫ్రస్ట్రేషన్‌తో ఊగిపోయే, చిరాకుగా ఉండే తండ్రి పాత్ర అది. ఆ పాత్రలో అద్భుతంగా నటించి సినిమాకు మెయిన్ పిల్లర్‌గా నిలిచారు నటుడు గోపరాజు రమణ. ఈ సినిమాతో గోపరాజు రమణకు కచ్చితంగా అవకాశాలు పెరుగుతాయని అంతా ఊహించారు. ఇప్పుడు అది నిజమైంది అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు. గోపరాజు రమణకు విక్టరీ తండ్రిగా నటించే అవకాశం వచ్చిందని సమాచారం. అది కూడా ‘’ లాంటి నవ్వులు పంచే సినిమాలో అని అంటున్నారు. విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోలుగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో ‘ఎఫ్3’ రూపొందుతోన్న విషయం తెలిసిందే. తమన్నా, మెహ్రీన్ హీరోయిన్లు. ప్రస్తుతం హైదరాబాద్‌లో శరవేగంగా చిత్రీకరణ జరుగుతోంది. ఆగస్టు 23న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్టు నిర్మాత దిల్ రాజు ప్రకటించారు. కాగా, ఈ చిత్రంలో వెంకటేష్ తండ్రిగా గోపరాజు రమణ నటిస్తున్నారని ఇండస్ట్రీ వర్గాల సమాచారం. ఆయన పాత్రకు సినిమాలో మంచి స్కోప్ ఉందంటున్నారు. అనిల్ రావిపూడి కామెడీకి పెట్టింది పేరు. మరి అలాంటి దర్శకుడికి గోపరాజు రమణ లాంటి నటుడు దొరికితే ఇక నవ్వుల జాతరే. కడుపు చెక్కలైపోవడం ఖాయం. ఫన్, ఫ్రస్ట్రేషన్ కలగలిపిన ఇలాంటి సినిమాలో ఫ్రస్ట్రేటెడ్ ఫాదర్ ఉంటే ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాలా! ఇదిలా ఉంటే, 2019 సంక్రాంతికి వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ F2కి సీక్వెల్‌గా ఈ సినిమా రూపొందుతోన్న విషయం తెలిసిందే. దిల్ రాజు సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2NTe15h
v

అప్‌డేట్‌తో బాలకృష్ణ రెడీ.. ఫ్యాన్స్‌కు పూనకాలేనట!

డైరెక్టర్ బి.గోపాల్ తరవాత నందమూరి బాలకృష్ణలోని ఫైర్‌ను ఆ స్థాయిలో చూపించిన దర్శకుడు బోయపాటి శ్రీను. బాలకృష్ణ-బోయపాటి కాంబినేషన్ అనగానే అది కచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్ అనే అభిప్రాయానికి చాలా మంది వచ్చేస్తారు. దీనికి కారణం గతంలో వచ్చిన ‘సింహా’, ‘లెజెండ్’ సినిమాలు. ‘సింహా’ సినిమా ద్వారా కొత్త బాలకృష్ణను చూపించి తన ప్రత్యేకతను చాటుకున్నారు బోయపాటి శ్రీను. ఆ తరవాత ‘లెజెండ్’ సినిమాతో తమ కాంబో సూపర్ హిట్ అని నిరూపించారు. అందుకే, ఇప్పుడు వీరిద్దరి కలయికలో వస్తోన్న మూడో సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఇంకా టైటిల్ ఖరారు కాని ఈ సినిమా నుంచి ఇప్పటికే ఫస్ట్ లుక్, వీడియో గ్లింప్స్‌ను విడుదల చేశారు. ‘‘రాజు గారు మీ నాన్నగారు బాగున్నారా అనడానికి.. రాజు గారు నీ అమ్మ మొగుడు బాగున్నాడా అనడానికి చాలా తేడా ఉందిరా లమ్మిడీ కొడకా’’ అంటూ వీడియోలో బాలయ్య చెప్పిన డైలాగ్ అభిమానులను ఊపేసింది. అంతేకాకుండా న్యూ లుక్ ఫ్యాన్స్‌ను ఫిదా చేసింది. ఈ సినిమా టైటిల్‌ను ఎప్పుడు ప్రకటిస్తారా అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే, ‘మోనార్క్’ అనే టైటిల్ చాలా రోజులుగా ప్రచారంలో ఉంది. ప్రస్తుతానికి BB3 అని పిలుస్తున్నారు. ఈ నేపథ్యంలో చిత్ర నిర్మాణ సంస్థ తాజాగా సోషల్ మీడియా ద్వారా ఒక ప్రకటన చేసింది. ‘మీరు ఎప్పుటి నుంచో ఎదురు చూస్తోన్న #BB3 అప్‌డేట్ వచ్చేస్తుంది’ అని ప్రకటించింది. దీంతో నందమూరి అభిమానుల్లో కొత్త ఊపు వచ్చింది. సినిమా విడుదల తేదీని ప్రకటించబోతున్నారనే ప్రచారం మొదలైంది. ఇంకా టైటిల్ కూడా ప్రకటించలేదు కాబట్టి.. విడుదల తేదీతో కూడిన టైటిల్ పోస్టర్‌ను విడుదల చేస్తారేమోననే అనుమానాన్ని చాలా మంది వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా, విడుదల తేదీ మే 12 లేదంటే 13న ఫిక్స్ చేయాలని కోరుతున్నారు. అంటే, ‘ఆచార్య’కు పోటీగా విడుదల చేయాలంటున్నారు. ఇదే గనుక నిజమైతే ఫ్యాన్స్‌కు పూనకాలు రావడం ఖాయం.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3teQ74c
v

అది డిస్ట్రిబ్యూటర్ల నిర్ణయం: RRR విడుదల తేదీ వివాదంపై నిర్మాత దానయ్య

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతోన్న భారీ పాన్ ఇండియా మూవీ RRR. దసరా సందర్భంగా ఈ సినిమాను అక్టోబర్ 13న విడుదల చేస్తున్నట్టు చిత్ర నిర్మాణ సంస్థ డి.వి.వి. ఎంటర్‌టైన్మెంట్ ఇటీవల ప్రకటించింది. RRR టీమ్ కొత్త విడుదల తేదీని ప్రకటించడంతో ఇటు చరణ్, తారక్ ఫ్యాన్స్‌తో పాటు అటు రాజమౌళి అభిమానులు సోషల్ మీడియా ద్వారా ఆనందంగా వ్యక్తం చేశారు. అయితే, బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్ మాత్రం రాజమౌళిపై అసహనం వ్యక్తం చేశారు. బోనీ కపూర్ అసహనం వ్యక్తం చేయడానికి కారణం ‘మైదాన్’ సినిమా. ఫుట్ బాల్ నేపథ్యంలో రూపొందుతోన్న ఈ చిత్రానికి బోనీ కపూర్ ఒక నిర్మాత. అజయ్ దేవగణ్ ప్రధాన పాత్ర పోషించారు. ఈ సినిమాను అక్టోబర్ 15న విడుదల చేస్తున్నట్టు గతంలోనే ప్రకటించారు. అందుకే, బాక్సాఫీసు వద్ద RRR-మైదాన్ క్లాష్‌పై బోనీ కపూర్ అసహనం వ్యక్తం చేశారు. అంతేకాదు, ఇది అన్యాయమని అన్నారు. దీంతో, ఈ రెండు సినిమాల క్లాష్ గురించి సోషల్ మీడియాలో పెద్ద చర్చే జరిగింది. లాక్‌డౌన్ వల్ల ఇప్పటికే బాలీవుడ్ తీవ్రంగా నష్టపోయిందని.. ఈ క్లాష్ వల్ల ఏ సినిమాకు న్యాయం జరగదని కొంత మంది వాదిస్తే.. ‘మైదాన్’ ఒక క్లాసిక్ మూవీ అని దానికి వచ్చే నష్టం ఏమీ లేదని మరికొందరు అభిప్రాయపడ్డారు. మొత్తం మీద ఈ వివాదంపై RRR నిర్మాత వి.వి.వి.దానయ్య స్పందించారు. ఓ ఇంగ్లిష్ వార్తా పత్రికతో మాట్లాడిన దానయ్య.. ఈ విడుదల తేదీ డిస్ట్రిబ్యూటర్లు తీసుకున్న నిర్ణయం అని స్పష్టం చేశారు. నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్ల మధ్య పలుమార్లు చర్చలు జరిగిన తరవాతే ఈ విడుదల తేదీని ఖరారు చేశామన్నారు. RRR, మైదాన్ సినిమాల మధ్య ఈ క్లాష్ కావాలని చేసింది కాదన్నారు. కాబట్టి, ఈ విషయంలో RRR టీమ్‌ను నిందించడం సరికాదని సూచించారు. మరి, ఈ క్లాష్‌ ఉంటుందా? లేదంటే బోనీ కపూర్ వెనక్కి తగ్గి ‘మైదాన్’ విడుదల తేదీ మారుస్తారా? వంటి ప్రశ్నలకు కాలమే సమాధానం చెప్పాలి.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3pzLHCY
v

ప్రదీప్ హీరో ఏంటి.. థియేటర్‌కి ఎవడొస్తాడు అన్నారు.. దానికి సమాధానమే ఈ 4.17 కోట్లు: డైరెక్టర్ మున్నా

యాంకర్ ప్రదీప్‌కే కాదు.. దర్శకుడు మున్నా‌కి కూడా తొలి చిత్రం ఈ ‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా’?. యాంకర్‌గా బుల్లితెర ప్రేక్షకుల్ని అలరించిన ప్రదీప్ ఈ చిత్రంతో టాలీవుడ్ హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఈ చిత్రంలోని ‘నీలి నీలి ఆకాశం’ సాంగ్ 300 మిలియన్ల వ్యూస్ కొల్లగొట్టి సంచలనంగా మారడంతో ‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా’ చిత్రానికి మంచి హైప్ వచ్చింది. మంచి అంచనాలతో జనవరి 29న విడుదలైన ఈ చిత్రానికి మిక్స్డ్ టాక్‌ వచ్చినప్పటికీ తొలి రోజు మంచి ఓపెనింగ్స్ రాబట్టింది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ సక్సెస్ మీట్ నిర్వహించగా.. దర్శకుడు మున్నా ఎమోషనల్‌గా మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ.. ‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా? సినిమాకి ప్రాణం.. ఇందులోని నీలి నీలి ఆకాశం పాట. 300 మిలియన్ వ్యూస్ దాటి వెళ్తూనే ఉంది. ఈ సాంగ్ చూడటం కోసం చాలా మంది థియేటర్స్‌కి వస్తున్నారు. ఇండస్ట్రీలో ఈ కథ అనుకున్నప్పుడు ఒకే ఒక క్వచ్ఛన్ ఉండేది.. కథ చాలా బాగుంది.. డైలాగ్స్ చాలా బాగున్నాయ్.. దీనికి ప్రదీప్ హీరో ఏంటి అని ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్లు చాలామంది నన్ను క్వచ్ఛన్ వేశారు. చేతిలో రిమోట్ మార్చితే ప్రదీప్ కనిపిస్తాడు.. అతన్ని చూడటం కోసం థియేటర్‌కి వస్తారా? అని అడిగారు. వాళ్లందరి ప్రశ్నకి సమాధానమే రూ.4.17 కోట్ల తొలిరోజు కలెక్షన్స్. ఇంతమంది జనం ప్రదీప్‌ని చూడటం కోసం వచ్చారు. నాకైతే నమ్మకం ఉంది.. నవ్వించే వాడు ఏడిపిస్తే చాలా బాగుంటుంది అని.. ప్రదీప్ ఇన్నాళ్లూ నవ్వించాడు. ఇప్పుడు ఏడిపించాడు. అలాగే నవ్వించే హేమ కూడా ఈ సినిమాలో తల్లిగా అందర్నీ ఏడిపించింది. ఈ సినిమా టర్నింగ్ పాయింట్ హేమ క్యారెక్టర్. ఎన్ని ఫోర్లు కొట్టినా ధోనీ చివర్లో వచ్చి సిక్స్ కొడితే భలే కిక్ ఉంటుంది. ఈ సినిమాలో హేమ గారు సిక్స్ కొట్టారు. మా సినిమా గురించి పదిమందిని అడగండి.. తొమ్మిది మంది బాగుందనే అంటారు. ఒకడు బాలేదన్నా మా సినిమాకి వెళ్లొద్దు. పదిమంది బాగుందనే అంటున్నారు. బాగుందంటే పదిమందిని తీసుకుని వెళ్లండి. ప్రొడ్యుసర్ కథ చెప్పినప్పుడు ఎంత హ్యాపీగా ఉన్నారో ఇప్పుడు కూడా అంతే హ్యాపీగా ఉన్నారు. ఆయనకు డబ్బులు రావడం మాకు ఇంపార్టెంట్. మాకు పేరు ఎలాగూ వస్తుందనే నమ్మకం ఉంది. కొత్తదర్శకుడు సినిమా తీస్తున్నాడంటే.. లైట్ బాయ్ దగ్గర నుంచి సెట్స్‌లో అందరికీ చిన్న చూపు ఉంటుంది.. నా సినిమా కొత్త దర్శకులకు.. సినిమాలు తీయబోయే దర్శకులకు అంకితం చేస్తున్నా’ అంటూ ఎమోషనల్‌గా మాట్లాడారు దర్శకుడు మున్నా.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3tb8vLu
v

శర్వానంద్‌, సిద్ధార్థ్‌ ‘మహా సముద్రం’ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఇద్దరు హీరోల మధ్య యుద్ధం ఎప్పుడంటే

లాక్ డౌన్ ఎఫెక్ట్‌తో షూటింగ్ దశలో ఉన్న సినిమాలన్నీ ఆగిపోయాయి. అయితే ఇటీవల షూటింగ్‌లు తిరిగి ప్రారంభం కావడంతో వరుస సినిమాలు రిలీజ్‌కి రెడీ అవుతున్నాయి. పోటాపోటీగా విడుదల తేదీలను ప్రకటిస్తూ సినీ సందడిని తీసుకువస్తున్నారు మన హీరోలు. ‘సర్కారు వారి పాట’, ‘వకీల్ సాబ్’, ‘పుష్ప’, ‘ఎఫ్ 3’, ‘నారప్ప’, ‘వకీల్ సాబ్’, ‘కేజీఎఫ్’, ‘గని’ చిత్రాల విడుదల తేదీలను ఇప్పటికే ప్రకటించగా.. , సిద్దార్థ్ మల్టీస్టారర్ మూవీ ‘’ రిలీజ్ డేట్‌ను ప్రకటించింది చిత్ర యూనిట్. ‘ఎగసిపడే సముద్రపు అలల్లో, మీరు కొలవలేనంత ప్రేమని పరిచయం చేయడానికి వస్తున్నాం.’ అంటూ ‘మహా సముద్రం’ టీమ్‌ సినిమా రిలీజ్‌ డేట్‌ను ప్రకటించింది. RX 100 దర్శకుడు అజయ్ భూపతి దర్శకత్వంలో తెరకెక్కిన ‘మహా సముద్రం’ చిత్రం ఆగష్టు 19న గ్రాండ్‌గా విడుదల కానుంది. లవ్ అండ్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రంతో టాలీవుడ్‌లో రీ ఎంట్రీ ఇస్తున్నాడు హీరో సిద్ధార్థ్. దాదాపు ఏడేళ్ళ గ్యాప్ తరువాత మళ్లీ ‘మహా సముద్రం’ అంటూ పలకరించబోతున్నాడు సిద్ధార్థ్. అదితిరావు హైదరీ, అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై అనిల్‌ సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. చైతన్‌ భరద్వాజ్‌ సంగీతం అందిస్తున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3tkM3jc
v

‘వకీల్ సాబ్’ వచ్చేస్తున్నాడు.. అఫీషియల్ రిలీజ్ డేట్ ఇదిగో

జనసేన అధినేతగా కంటే.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌గా ఆయన్ని అభినించేవాళ్లు కోట్లాదిమంది ఉన్నారు. అప్పుడు ఇప్పుడు కాదు.. ఎప్పుడొచ్చినా బొమ్మ థియేటర్‌లో పడిందంటే రికార్డుల సునామీనే. అందరి లెక్కతేలుస్తూ.. బాక్సాఫీస్ వద్ద తిక్క చూపించే పవర్ స్టార్ పవర్ కళ్యాణ్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అప్డేట్ వచ్చేసింది. లాంగ్ గ్యాప్ తరువాత ‘’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న పవన్ కళ్యాణ్.. రీ ఎంట్రీ మూవీ రిలీజ్ డేట్‌ను అఫీషియల్‌గా ప్రకటించారు. ఏప్రియల్ 9న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్స్‌లో గ్రాండ్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు ‘వకీల్ సాబ్’. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తూ.. చిత్ర యూనిట్ పోస్టర్ విడుదల చేసింది. బాలీవుడ్ బ్లాక్ బస్టర్ చిత్రం ‘పింక్’‌ను తెలుగులో వకీల్ సాబ్‌గా రీమేక్ చేశారు పవర్ స్టార్. ఈ చిత్రానికి శ్రీరామ్ వేణు దర్శకత్వం వహించగా.. ప్ర‌ముఖ నిర్మాత బోనీ క‌పూర్ స‌మ‌ర్ప‌ణ‌లో శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్‌, బే వ్యూ ప్రాజెక్ట్స్ ప‌తాకాల‌పై దిల్‌రాజు, శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రంలో శ్రుతి హాస‌న్‌ హీరోయిన్‌గా నటించగా.. నివేదా థామ‌స్‌, అంజ‌లి, అన‌న్య నాగ‌ళ్ల కీలక పాత్రల్లో నటించారు. ఇటీవల విడుదలైన టీజర్‌కు మంచి రెస్పాన్స్ రావడంతో.. ఈ చిత్రం కోసం మెగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుండగా విడుదల తేదీని ప్రకటించింది చిత్ర యూనిట్. కాగా.. ఇప్పటికే అల్లు అర్జున్ పుష్ఫ, మహేష్ బాబు ‘సర్కారు వారి పాట’,.. వెంకటేష్ ‘నారప్ప’.. చిరంజీవి ‘ఆచార్య’.. వరుణ్ తేజ్ ‘గని’.. వెంకటేష్-వరుణ్ తేజ్ F3, యష్ ‘కేజీఎఫ్’ చిత్రాల విడుదల తేదీలను ప్రకటించగా.. పవర్ స్టార్ కూడా ‘వకీల్ సాబ్’ చిత్రం విడుదల తేదీని ప్రకటించడంతో మూవీ లవర్స్‌కి పండగలా మారింది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3awSQhd
v

అట్రాక్ట్ చేసే కథతో 'పీన‌ట్ డైమండ్'.. ఫస్ట్‌లుక్ పోస్టర్ రిలీజ్ చేసిన డైరెక్టర్ మారుతి

విభిన్న తరహా కథలకు ఎప్పుడూ ఆదరణ ఉంటూనే ఉంటుంది. అదే నమ్మకంతో సైన్స్ ఫిక్షన్ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న చిత్రం ''. ఎఎస్‌పి మీడియా హౌస్, జివి ఐడియాస్ ప‌తాకాల‌పై ప్రొడ‌క్ష‌న్ నెం.1గా ఈ మూవీ రూపొందుతోంది. అభిన‌వ్ స‌ర్ధార్‌, వెంక‌టేష్ త్రిప‌ర్ణ నిర్మాత‌లుగా వ్యవహరిస్తున్న ఈ చిత్రంలో అభిన‌వ్ స‌ర్ధార్‌, రామ్ కార్తిక్, చాందిని త‌మిళ్‌రాస‌న్‌, శాని సాల్మాన్‌‌ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. క‌థ‌, మాట‌లు, స్క్రీన్ ప్లే, ద‌ర్శ‌క‌త్వం అన్నీ తానై చూసుకుంటున్నారు వెంక‌టేష్ త్రిప‌ర్ణ. `బెంగాల్ టైగ‌ర్` ఫేమ్ భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు. ఇటీవలే షూటింగ్ పూర్తిచేసిన యూనిట్.. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు నిర్వహిస్తోంది. కాగా తాజాగా ఈ మూవీకి డైరెక్టర్ సపోర్ట్ లభించింది. చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా ఈ మూవీ ఫస్ట్‌లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు మారుతి. రెండు కాల‌మాణాల‌కు సంబంధించిన ఓ విభిన్న క‌థాంశంతో అన్నివ‌ర్గాల ప్రేక్షకులను థ్రిల్ చేసేలా ఈ మూవీ రూపొందిస్తున్నామని, 1989లో ఒక క‌థ‌ జ‌రుగుతూ ఉంటే దానికి ప్యార‌ల‌ల్‌గా 2020లో మ‌రోక క‌థ ర‌న్ అవుతుండటం ఆసక్తి రేకెత్తిస్తుందని నిర్మాత‌లు అభిన‌వ్ స‌ర్ధార్‌, వెంక‌టేష్ త్రిప‌ర్ణ తెలిపారు. ఫస్ట్‌లుక్ రిలీజ్ అనంతరం మారుతి మాట్లాడుతూ.. 'డైరెక్టర్ వెంకటేష్ పదేళ్లుగా తెలుసు. వెరీ టాలెంటెడ్ పర్సన్. ఎప్పుడూ కొత్తగా చేయాలని ఆలోచించే ఆయన, నాతోపాటు మా బ్యానర్‌లో చాలా సినిమాలకు వర్క్ చేశాడు. అతని ఆలోచనా విధానానికి తగ్గట్లుగానే డిఫరెంట్ స్టోరీతో ఈ 'పీన‌ట్ డైమండ్' సినిమా చేస్తున్నాడు. టైటిల్ చెప్పగానే చాలా కొత్తగా ఉందనిపించింది. పోస్టర్ చూడగానే ఇంట్రెస్టింగ్‌గా అనిపించింది. కథ లైన్ చెప్పారు. సైన్స్ ఫిక్షన్ యాక్షన్ డ్రామా అంటే చాలా జాగ్రత్తగా డీల్ చెయ్యాలి అప్పుడే మనం అనుకున్న ఔట్‌పుట్ వస్తుంది. తప్పకుండా ఈ చిత్రం సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను. టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్'' అన్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2NQNwxp
v

అఫీషియల్: రవితేజ సినిమాలో అర్జున్.. ఖిలాడీ క్లబ్‌లో చేరిపోయిన యాక్షన్ కింగ్

సౌత్ ఇండియన్ తెరపై అంటే ఓ స్పెషల్ ఇమేజ్ ఉంటుంది. ఎలాంటి పాత్రలో అయినా ఒదిగిపోగల సత్తా ఉండటంతో యాక్షన్ కింగ్ అని పిలిపించుకుంటూ ప్రేక్షకలోకాన్ని అలరిస్తున్నారు అర్జున్. పాత్ర పరిధి ఎంతనేది పక్కనబెట్టి ఆ రోల్ నచ్చితే చాలు వెంటనే ఓకే చెప్పేస్తున్న ఆయన.. రీసెంట్‌గా హీరోగా తెరకెక్కుతున్న '' మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. ఈ విషయాన్ని అఫీషియల్‌గా ప్రకటిస్తూ ఆయనకు స్వాగతం పలికింది 'ఖిలాడీ' యూనిట్. ఖిలాడీ క్లబ్‌కి స్వాగతం అని పేర్కొంటూ అర్జున్‌, ఈ మూవీ టైటిల్‌తో కూడిన ఓ స్పెషల్ పోస్టర్ షేర్ చేశారు డైరెక్టర్ రమేష్ వర్మ. దీంతో తమ అభిమాన హీరో మూవీలో అర్జున్ కూడా నటిస్తున్నారని తెలిసి మాస్ మహారాజ్ ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనున్న ఈ చిత్రంలో యాక్షన్ కింగ్ అర్జున్ భాగం కావడం ఆనందంగా ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు. కాగా అల్లు అర్జున్ హీరోగా వచ్చిన `నా పేరు సూర్య` తర్వాత మరోసారి ఈ 'ఖిలాడీ'తో తెలుగు ప్రేక్షకులను పలకరించబోతున్నారు అర్జున్. ఏ స్టూడియోస్‌, పెన్‌ స్టూడియోస్‌ పతాకాలపై జయంతి లాల్‌ గడ సమర్పణలో సత్యనారాయణ కోనేరు నిర్మిస్తున్న ఈ 'ఖిలాడీ' సినిమాలో రవితేజ రెండు డిఫరెంట్ గెటప్స్‌లో కనిపించనున్నారు. ఆయన సరసన మీనాక్షి చౌదరి, డింపుల్‌ హయతి హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. రాక్‌స్టార్‌ దేవి శ్రీ ప్రసాద్‌ బాణీలు కడుతున్నారు. ఇటీవలే రిలీజ్ చేసిన ఈ మూవీ ఫస్ట్‌లుక్, ఫస్ట్ గ్లింప్స్ సినిమాపై ఉన్న అంచనాలను రెట్టింపు చేశాయి. మాస్ మహారాజ్ కెరీర్‌లో 67వ సినిమాగా ఈ 'ఖిలాడీ' రూపుదిద్దుకుంటోంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/39xX4FT
v

'ఆచార్య' లొకేషన్స్‌లో చిరంజీవితో తెలంగాణ మంత్రి.. అందుకే అక్కడికెళ్లారట!

మెగాస్టార్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న సినిమా ''. గత కొన్ని నెలలుగా ఈ మూవీ షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ప్రస్తుతం ఈ సినిమా యూనిట్ హైదరాబాద్ శివారులోని కోకాపేటలో ఉన్నారు. అక్కడ సెలక్ట్ కొన్ని లొకేషన్స్‌లో చిరంజీవిపై కీలక సన్నివేశాల చిత్రీకరణ చేస్తున్నారు. అయితే తాజాగా ఈ షూటింగ్ లొకేషన్స్‌‌లో తెలంగాణ రాష్ట్ర మంత్రి కనిపించడంతో ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. 'ఆచార్య' సెట్స్ పైకి వెళ్లి చిరంజీవితో సరదాగా ముచ్చటించిన విషయాన్ని మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడిస్తూ కొన్ని ఫొటోలు పంచుకున్నారు. షూటింగ్ లొకేష‌న్‌కి వెళ్లి చిరంజీవితో పాటు ఆచార్య సినిమా దర్శకుడు కొరటాల శివను కలిసి కాసేపు ఆయన మాట్లాడారు. ఈ మేరకు 'ఆచార్య' సక్సెస్ కావాలని కోరుకుంటూ చిత్రయూనిట్ మొత్తానికి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు. ''ఆచార్య చిత్ర యూనిట్‌తో చిరు హాసం.. మెగాస్టార్ చిరంజీవి గారి చిత్రం ఆచార్య చిత్రం విజయవంతం కావాలని కోరుతూ..'' అంటూ ఆయ‌న ట్వీట్ చేశారు. కొణిదెల ప్రొడక్షన్స్‌, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై నిరంజన్‌ రెడ్డి, రామ్‌చరణ్‌ నిర్మాణంలో రూపొందుతున్న ఈ 'ఆచార్య' మూవీలో చిరంజీవి సరసన కాజల్‌ అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తోంది. మణిశర్మ సంగీత సారథ్యం వహిస్తున్నారు. ఇక, రామ్ చరణ్ కీలకపాత్రలో కనిపించనుండటం సినిమాపై ఆసక్తి రేపుతోంది. ఇప్పటికే మేజర్ పార్ట్ షూటింగ్ కంప్లీట్ చేసిన చిత్రయూనిట్.. మే 13వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నట్లు ప్రకటించింది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/39uc9bA
v

30 రోజుల్లో ప్రేమించటం ఎలా? కలెక్షన్ రిపోర్ట్.. తొలిరోజు యాంకర్ ప్రదీప్ హవా ఎలా ఉందంటే!!

బుల్లితెరపై తనదైన శైలి యాంకరింగ్ చేస్తూ సొంత అభిమానులను కూడగట్టుకున్న .. ? అంటూ వెండితెరపై హీరోగా ఆరంగేట్రం చేశాడు. ఈ సినిమాలో ప్రదీప్ సరసన అమృతా అయ్యర్ హీరోయిన్‌గా నటించింది. నిన్న (శుక్రవారం) ప్రపంచ వ్యాప్తంగా థియేటర్స్‌లో విడుదలైన ఈ సినిమాకు ఆశించిన మేర స్పందన వచ్చిందని తాజాగా వచ్చిన కలెక్షన్ రిపోర్ట్ చూస్తుంటే అర్థమవుతోంది. మరోవైపు ప్రదీప్ నటనపై అన్ని వర్గాల నుంచి ప్రశంసల వర్షం కురుస్తుండటం ఈ మూవీకి ప్లస్ అవుతోంది. ప్రపంచవ్యాప్తంగా తొలిరోజు కలెక్షన్ రిపోర్ట్ చూస్తే.. నైజాం- 64 లక్షలు సీడెడ్- 24 లక్షలు ఉత్తరాంధ్ర- 17 లక్షలు ఈస్ట్ గోదావరి- 14 లక్షలు వెస్ట్ గోదావరి- 12.5 లక్షలు కృష్ణా- 10 లక్షలు గుంటూరు- 19 లక్షలు నెల్లూరు- 8 లక్షలు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి టోటల్ కలెక్షన్స్ చూస్తే 2.73 కోట్ల గ్రాస్ వసూలు కాగా 1.69 కోట్ల రూపాయల షేర్ వచ్చింది. ఇక కేరళ, ఇతర రాష్ట్రాలు కలిపి మరో 8 లక్షలు, ఓవర్‌సీస్‌లో 6 లక్షలు వసూలయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా టోటల్‌గా చెప్పాలంటే 1.83 కోట్ల రూపాయల కలెక్షన్స్ నమోదయ్యాయి. వరల్డ్ వైడ్‌గా ఈ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ 2.97 కోట్లు. ఏరియా వైజ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ చూస్తే.. నైజాంలో 1.5 కోట్లు, సీడెడ్‌లో 55 లక్షలు, ఆంధ్రాలో 2.1 కోట్లు, మొత్తంగా చూస్తే రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 4.8 కోట్ల టార్గెట్‌తో ఈ 30 రోజుల్లో ప్రేమించటం ఎలా? మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సో.. చూడాలి మరి మొదటి రోజు వచ్చిన రెస్పాన్స్ రానున్న రోజుల్లో ఎలా ఉంటుందనేది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3oyDmy7
v

ఆ గిఫ్ట్ చూడగానే గంగవ్వ రియాక్షన్.. మై విలేజ్ షో టీమ్‌పై యాంకర్ ప్రదీప్ కామెంట్స్

మై విలేజ్ షో టీమ్.. దేశవ్యాప్తంగా పాపులర్ అయిన ఓ యూట్యూబ్ ఛానెల్ ఇది. మారుమూల గ్రామంలోని గల్లీలో ప్రారంభమైన వీరి ప్రయాణం సెలబ్రిటీల వరకూ వెళ్లింది. ఈ టీమ్ సభ్యుల్లో ముఖ్యంగా మాటతీరు తెలుగు ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయింది. తెలంగాణ యాస, భాషకు ఉండే ఆదరణే వేరని తనదైన మాటలతో నిరూపించింది గంగవ్వ. కూలీ పనులు చేసుకుంటూ, కనీసం ఊరు దాటి బయటికి వెళ్లడం తెలియని ఆమె యూట్యూబ్‌తో ఓ స్టార్ అయిపోయింది. దీంతో బిగ్ బాస్ ఛాన్స్ రావడం, సినిమా ప్రమోషన్స్ కోసం గంగవ్వను ఎంటర్ చేయడం.. అబ్బో ఒక్కటేమిటి ఇలా ఆమె క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. ఈ క్రమంలోనే తాను హీరోగా చేసిన '30 రోజుల్లో ప్రేమించటం ఎలా?' సినిమా ప్రమోషన్స్ కోసం 'మై విలేజ్ షో' టీమ్‌తో ఓ వీడియో చేశారు. ఇందులో గంగవ్వతో ప్రదీప్ ముచ్చట్లు ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటూ '30 రోజుల్లో ప్రేమించటం ఎలా?' సినిమాకు బెస్ట్ ప్రమోషన్ ఇస్తున్నాయి. అంతేకాదండోయ్.. ఈ వీడియో యూట్యూబ్‌ ట్రెండింగ్ లిస్ట్‌లో టాప్‌లో ఉంది. ఈ నేపథ్యంలో మూవీ రిలీజ్ తర్వాత తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో , గంగవ్వపై యాంకర్ ప్రదీప్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ''మై విలేజ్ షో టీమ్ మొత్తం నన్ను ఆహ్వానించడంతో వాళ్ళ ఉరికి వెళ్లి గొర్రెల కాపరి వేషం కట్టాను. వాళ్ళు వాడే భాష, ఆ యాసలో ఉన్న కమ్మనితనం ఆస్వాదించాను. అవన్నీ నేర్చుకొని అలా మాట్లాడటానికి ప్రయత్నించాను. గంగవ్వ మంచి పెరుగన్నం పెట్టింది. అలా పొలం గట్లపై వాళ్లతో భోజనం చేయడం చాలా ఆనందంగా అనిపించింది. నా సినిమా ప్రమోషన్స్ కోసం వాళ్లు ఇచ్చిన సపోర్ట్‌కి ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెబుతున్నాను. గంగవ్వ కెమెరా ముందు చేసే యాక్టింగ్ చూసి నాకు ధైర్యం వచ్చింది. గంగవ్వ దగ్గరకు నేను వెళ్తున్నా అని చెప్పగానే అమ్మ చీర ఇచ్చి పంపించింది. ఆ రోజు షూట్ అయిపోయాక ఆమెకు ఆ చీరను గిఫ్ట్‌గా ఇచ్చాను. ఏంది.. బిడ్డా ఇవన్నీ ఎందుకు? అన్న గంగవ్వ.. లెదవ్వా నాతో పనిచేశావు కాబట్టి నా గుర్తుగా ఈ చీర ఇస్తున్నా అనగానే ఆనందంగా స్వీకరించింది'' అని ప్రదీప్ చెప్పుకొచ్చారు. ఇక '30 రోజుల్లో ప్రేమించటం ఎలా?' సినిమా విషయానికొస్తే.. శుక్రవారం విడుదలైన ఈ సినిమా ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన తెచ్చుకుంటోంది. సుకుమార్ శిష్యుడైన మున్నా దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో ప్రదీప్ సరసన అమృతా అయ్యర్ హీరోయిన్‌గా నటించింది. బెన్స్ సంగీతం అందించారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3j4V3nF
v

Friday 29 January 2021

సమ్మర్ త్వరగా వస్తే ఎంత బాగుంటుందో..! ఆతృతగా ఉందంటున్న నిహారిక.. అసలు కారణమిదే

మెగా డాటర్ సమ్మర్ కోసం చాలా ఆతృతగా ఎదురుచూస్తోంది. ఇది మేం చెప్పడం కాదండోయ్.. స్వయంగా ఆమెనే ట్వీట్ చేసింది. మరి సమ్మర్‌లో ఏంటి ప్రత్యేకం..? నిహారిక ఆతృత దేనికి? ఇదేగా మీ సందేహం. ఇక అక్కడికే వచ్చేద్దాం.. నిహారిక పెదనాన్న (డాడీ) హీరోగా రాబోతున్న ప్రతిష్టాత్మక సినిమా 'ఆచార్య' మే నెల 13వ తేదీన విడుదల కానున్నట్లు అఫీషియల్ ప్రకటన రావడంతో నిహారిక చూపు వేసవిపై పడింది. ఇటీవలే జొన్నలగడ్డ వెంకట చైతన్యను పెళ్లాడి ఓ ఇంటిదైన నిహారిక.. పెళ్లికి ముందు లాగే తన సోషల్ మీడియా హంగామాను కంటిన్యూ చేస్తోంది. ఎప్పటికప్పుడు తన ఫ్యామిలీ ఫొటోస్, వెకేషన్ ట్రిప్స్ డీటెయిల్స్ లాంటి వివరాలు షేర్ చేస్తూనే రెగ్యులర్ అప్‌డేట్స్ కూడా మన ముందుకు తెస్తోంది. ఈ క్రమంలో తాజాగా మెగాస్టార్ చిరంజీవి 'ఆచార్య' టీజర్ చూసి ''అద్భుతం'' అని కామెంట్ చేసిన ఆమె.. సినిమా కోసం సమ్మర్ వరకూ ఆగాలా? ఈ సమ్మర్ త్వరగా వస్తే ఎంత బాగుంటుందో.. అని పేర్కొంది. దీంతో ఈ ట్వీట్ నెట్టింట వైరల్ అవుతోంది. మెగాస్టార్ 152వ సినిమాగా 'ఆచార్య' మన ముందుకు రాబోతోంది. సందేశాత్మక చిత్రాలను రూపొందించడంలో దిట్ట అని నిరూపించుకున్న కొరటాల శివ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీలో చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తోంది. 'సిద్ధ' పాత్రలో రామ్ చరణ్ ప్రత్యేక ఆకర్షణ కానున్నారు. శ్రీమతి సురేఖ కొణిదెల సమర్పణలో కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్‌టైన్మెంట్ బ్యానర్లపై నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమాకు మణిశర్మ బాణీలు కడుతున్నారు. ఈ 'ఆచార్య'పై ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/39vRbJ8
v

ఇందిరా గాంధీగా కంగనా.. బయోపిక్ కాదు పొలిటికల్ డ్రామా అంటూ ఆసక్తి రేపిన ఫైర్ బ్రాండ్

ఈ మధ్యకాలంలో వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా ఉంటూ సంచలనం సృష్టిస్తున్న బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ .. ఇందిరా గాంధీగా ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతోంది. హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలపై ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపుతున్న ఆమె, ఇటీవలే తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి దివంగత జయలలిత జీవితకథతో రూపొందిన 'తలైవి' సినిమాలో లీడ్ రోల్ పోషించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా మరో పవర్‌ఫుల్ పొలిటీషియన్, మాజీ ప్రధాని ఇందిరా గాంధీగా కనిపించబోతున్నట్లు కంగనా పేర్కొంది. పాత్ర పోషిస్తుండటం గురించి స్పందించిన కంగనా ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ప్రస్తుతం ఈ మూవీ స్క్రిప్ట్‌ తుది దశలో ఉందని, అయితే ఇది ఇందిరా గాంధీ బయోపిక్ మాత్రం కాదని ఆమె చెప్పింది. రాజకీయ చరిత్ర, పొలిటికల్ డ్రామాగా మీ ముందుకు రాబోతున్న ఈ సినిమాలో పవర్‌ఫుల్ లేడీ ఇందిరా గాంధీ పాత్రతో పాటు లాల్ బహదూర్ శాస్త్రి, సంజయ్ గాంధీల పాత్రలు కూడా కనిపిస్తాయని కంగనా చెప్పడంతో అందరి దృష్టి ఈ సినిమాపై పడింది. భారతీయ రాజకీయ చరిత్రలో కీలకమైన ఎమర్జెన్సీ, ఆపరేషన్ బ్లూస్టార్ లాంటి ఘటనలతో ఈ సినిమా రూపొందుతున్నట్లు తెలుస్తోంది. ఏదేమైనా ఇందిరా గాంధీ లాంటి పవర్‌ఫుల్ లేడీ పాత్రను ఫైర్ బ్రాండ్ కంగనా పోషిస్తుందని తెలియడంతో.. ఇంతకీ ఈ చిత్రంలో ఏం చూపించబోతున్నారు? అనే చర్చలు మొదలయ్యాయి. మరికొద్ది రోజుల్లో చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియనున్నాయి.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3r4isbQ
v

Live Telecast: లైవ్‌లో దెయ్యాన్ని చూపించాలనే వెరైటీ ఆలోచన.. పెళ్లయ్యాక కాజల్ డేరింగ్ స్టెప్

స్టార్ హీరోయిన్ ఇటీవలే తన ప్రియుడు గౌతమ్ కిచ్లూని పెళ్లాడిన సంగతి తెలిసిందే. పెళ్లి తర్వాత హనీమూన్ ట్రిప్ ఎంజాయ్ చేసి వచ్చిన ఈ అమ్మడు.. ప్రస్తుతం తాను కమిటైన సినిమాల షూటింగ్స్ పూర్తిచేస్తోంది. ఈ క్రమంలోనే ఆమె తొలి వెబ్ సిరీస్ '' విడుదలకు సిద్ధమైంది. హారర్ నేపథ్యంలో ఓ డిఫరెంట్ కథతో రూపొందిన ఈ వెబ్ సిరీస్ నుంచి తాజాగా ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. కేవలం ఒక నిమిషం 19 సెకనుల నిడివితో కట్ చేయబడిన ఈ ట్రైలర్ ఆధ్యంతం ఆసక్తికరంగా సాగిపోయింది. హారర్ సన్నివేశాలను చాలా డిఫరెంట్ వే లో షూట్ చేశారని తెలుస్తోంది. లైవ్‌లో దెయ్యాన్ని చూపించాలనే వెరైటీ ఆలోచన చేసి ఓ ఇంటికి వెళ్లిన కాజల్ బృందం ఎలాంటి అనుభవాలు ఎదుర్కొంది? నిజంగా వాళ్లకు దెయ్యం కనపడిందా? ఆ తర్వాత వాళ్లు ఎదుర్కొన్న ఇబ్బందులేంటి? అనే విషయాలను తెలియపర్చుతూ ట్రైలర్ విడుదల చేశారు. తమిళ దర్శకుడు వెంకట్ ప్రభు దర్శకత్వంలో రూపొందుతున్న ఈ వెబ్ సీరీస్ థ్రిల్లింగ్ కథగా ప్రేక్షకుల ముందుకు రానున్నట్టు క్లియర్‌గా అర్థమవుతోంది. ఈ మూవీలో టీవీ రిపోర్టర్‌గా కాజల్ కనిపించనుంది. టీఆర్పీ, సెన్సేషనలిజం కోసం దెయ్యాలను లైవ్‌లో కవర్ చేసి చూపిస్తామని కాజల్ చేసిన ప్రయత్నమే ఈ 'లైవ్ టెలికాస్ట్'. ఈ వెబ్ సిరీస్‌లో వైభవ్‌, ఆనంది కీలక పాత్రలు పోషించారు. ఫిబ్రవరి 12వ తేదీన డిస్నీ హాట్‌స్టార్‌లో అన్ని భాషల్లో ఈ వెబ్ సిరీస్ విడుదల కానుంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2MkX6Ih
v

Ram Charan: నిజంగా అది నా అదృష్టం.. 'ఆచార్య'పై ఫీలింగ్స్ బయటపెట్టిన రామ్ చరణ్

మెగాస్టార్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో భారీ రేంజ్‌లో '' మూవీ రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో సిద్ధ అనే ప్రత్యేక పాత్రలో సందడి చేయనున్నారు. కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్లపై ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. నిన్న (శుక్రవారం) సాయంత్రం ఈ చిత్ర టీజర్ రిలీజ్ చేయగా.. ఇది సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఈ సందర్భంగా తన ఆనందాన్ని వ్యక్తం చేసిన రామ్ చరణ్.. ఆచార్యలో సిద్ధ పాత్రలో నటించడం, తండ్రి చిరంజీవితో స్క్రీన్ షేర్ చేసుకోవడంపై రియాక్ట్ అయ్యారు. ఈ సినిమాలో తనది అతిథి పాత్ర కాదని చెప్పిన చెర్రీ తన తండ్రి, మెగాస్టార్‌ చిరంజీవితో కలిసి ఒకే తెరపై కనిపించనుండటం అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు. నాన్న సినిమాలో, నాన్నతో కలిసి నటించే అవకాశం కల్పించిన దర్శకుడు కొరటాల శివకు ప్రత్యేక ధన్యవాదాలు అని రామ్ చరణ్ తెలిపారు. గత కొన్నిరోజులుగా జరుగుతున్న 'ఆచార్య' రెగ్యులర్‌ షూట్‌లో రామ్ చరణ్ కూడా‌ పాల్గొంటున్నారు. ఇందులో చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్ నటిస్తుండగా.. చెర్రీ సరసన పూజా హెగ్డే కనిపించనుందట. వీళ్ళిద్దరితో ఓ డ్యూయట్ కూడా ప్లాన్ చేశారని తెలిసింది. దాదాపు 30 నిమిషాల పాటు ఉండే రామ్ చరణ్ రోల్ సినిమాకు మేజర్ అసెట్ కానుందని తెలుస్తుండటం మెగా అభిమానుల్లో ఉన్న ఆతృతను మరింత పెంచేసింది. ఇక ఈ సినిమాలో నటించడమే గాక, నిర్మాణ భాగస్వామిగా ఉన్న రామ్ చరణ్.. ‘ఆచార్య’ను వేసవి కానుకగా మే 13న విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. భారీ అంచనాల నడుమ చిరంజీవి 152వ సినిమాగా ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3rhnRfR
v

28 ఏళ్ల తర్వాత మళ్లీ మే నెలలో చిరంజీవి సినిమా.. నక్షత్రం కూడా బాగా కలిసొస్తుందట!

మెగాస్టార్ , డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్‌లో వస్తోన్న భారీ చిత్రం ‘ఆచార్య’ను వేసవి కానుకగా మే 13న విడుదల చేస్తున్నట్టు చిత్ర నిర్మాతలు నిరంజన్ రెడ్డి, రామ్ చరణ్ ప్రకటించిన విషయం తెలిసిందే. శుక్రవారం ‘ఆచార్య’ టీజర్‌ను విడుదల చేసిన గంటన్నర వ్యవధిలోనే చిత్ర విడుదల తేదీని కూడా ప్రకటించి అభిమానులకు సర్‌ప్రైజ్ ఇచ్చారు మెగాస్టార్. అయితే, ఈ విడుదల తేదీపై ఇప్పుడు ఆసక్తికర చర్చ జరుగుతోంది. మే నెల గతంలో చిరంజీవికి బాగా అచ్చొచ్చిందట. చిరంజీవి కెరీర్‌లో ఎవర్‌గ్రీన్ హిట్స్‌గా నిలిచిన ‘జగదేకవీరుడు అతిలోకసుందరి’, ‘గ్యాంగ్ లీడర్’ సినిమాలు మే నెలలోనే విడుదలయ్యాయి. అలా అని అన్నీ సూపర్ హిట్లే కాదు.. మే నెలలో విడుదలైన చిరంజీవి సినిమాల్లో ఫ్లాపులు ఉన్నాయి. ‘ఖైదీ’ సినిమాతో స్టార్ హీరో హోదాను సంపాదించిన చిరంజీవి.. ఆ తరవాత చాలా తక్కువ సినిమాలను మే నెలలో ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. చిరంజీవి 86వ చిత్రం ‘వేట’ 1986 మే 28న విడుదలైంది. కానీ, ఈ సినిమా డిజాస్టర్ అయ్యింది. ఆ తరవాత మళ్లీ 1990 మే 9న ‘జగదేకవీరుడు అతిలోకసుందరి’ విడుదలైంది. బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ‘వేట’, ‘జగదేకవీరుడు అతిలోకసుందరి’కి మధ్య 22 సినిమాలు వచ్చాయి. కానీ, ఏ సినిమా మే నెలలో విడుదల కాలేదు. ‘జగదేకవీరుడు అతిలోకసుందరి’ విడుదలైన తరవాత సంవత్సరమే అంటే 1991 మే 9న ‘గ్యాంగ్ లీడర్’ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇదో ట్రెండ్ సెట్టర్. ‘గ్యాంగ్ లీడర్’ తరవాత మళ్లీ మే నెలలో విడుదలైన సినిమా ‘మెకానిక్ అల్లుడు’. బి.గోపాల్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా 1993 మే 27న విడుదలైంది. చిరంజీవి, అక్కినేని నాగేశ్వరరావు కలిసి నటించిన ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆడలేదు. ఈ సినిమా తరవాత చిరంజీవి మరో సినిమా మే నెలలో రాలేదు. ఇప్పుడు సుమారు 28 ఏళ్ల తర్వాత మళ్లీ ‘ఆచార్య’ రూపంలో చిరంజీవి సినిమా మే నెలలో వస్తోంది. మే 13 గురువారం వచ్చింది. ‘గ్యాంగ్ లీడర్’ కూడా గురువారం నాడే విడులైందట. అంతేకాదు, మే 13న రోహిణి నక్షత్రమట. చాలా మంచిదట. ఇవన్నీ ‘ఆచార్య’కు కలిసొస్తాయని చర్చ. వీటికి తోడు మే 13న రంజాన్ కూడా వచ్చే అవకాశం ఉందంటున్నారు. మరి ఇవన్నీ కలిస్తే ‘ఆచార్య’ బాక్సాఫీసు వద్ద ప్రభంజనం సృష్టించడం ఖాయం.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3ag7EQX
v

అన్ని ఏరియాల్లోనూ మా సినిమాకి మంచి ఓపెనింగ్స్ వచ్చాయి: ప్రదీప్ మాచిరాజు

స్టార్ యాంకర్ హీరోగా అమృత అయ్యర్ హీరోయిన్‌గా రూపొందిన చిత్రం ‘30 రోజుల్లో ప్రేమించటం ఎలా?’. ఫణి ప్రదీప్ (మున్నా)ను దర్శకుడిగా పరిచయం చేస్తూ యస్వీ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మాత యస్వీ బాబు ఈ చిత్రాన్ని నిర్మించారు. యూవీ క్రియేషన్స్, జీఏ2 సంస్థల ద్వారా ఈ చిత్రం నేడు (జనవరి 29న) ప్రపంచ వ్యాప్తంగా విడుదలై మంచి ఓపెనింగ్స్‌ను రాబట్టింది. కాగా, శుక్రవారం హైదరాబాద్ ఆర్టీసి క్రాస్ రోడ్స్‌లో ఉన్న సుదర్శన్ 35ఎంఎం థియేటర్‌లో ఆడియెన్స్ మధ్య చిత్ర యూనిట్ సినిమాని వీక్షించింది. అనంతరం మీడియా సమావేశం నిర్వహించారు. హీరో ప్రదీప్ మాచిరాజు మాట్లాడుతూ.. ‘ఈరోజు కోసమే ఇంతకాలం వెయిట్ చేశాం. ఫైనల్‌గా మా సినిమా ఈరోజు రిలీజ్ అయింది. ఎన్నో సంవత్సరాల నుండి ఇదే థియేటర్‌లో సినిమాలు చూశాను. ఇప్పుడు నా సినిమా కూడా చూసుకోవడం చాలా థ్రిల్లింగ్‌గా ఉంది. సినిమాలో ప్రతీ సీన్, ప్రతీ పాటకు ఆడియెన్స్ నుండి అద్భుతమైన స్పందన వస్తోంది. విజిల్స్, క్లాప్స్‌తో ప్రతీ ఒక్కరూ సినిమాని ఎంజాయ్ చేస్తున్నారు. దర్శకుడు మున్నా అనుకున్న కథకి, సన్నివేశాలకు తగ్గట్లుగా అనూప్ బ్యూటిఫుల్ మ్యూజిక్ ఇచ్చారు. తన మ్యూజిక్‌తో సినిమాకి ప్రాణం పోసారు. అలాగే మా నిర్మాత బాబు గారు సినిమా మీద నమ్మకంతో ఇన్నిరోజులు వెయిట్ చేసి థియేటర్స్‌లోనే రిలీజ్ చేశారు. ఓవర్‌సీస్, ఆంధ్ర, తెలంగాణ ఏరియాల్లోనూ మా సినిమాకి మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. విడుదలైన అన్ని థియేటర్స్ ఫుల్ అవడం చాలా హ్యాపీగా ఉంది. ప్రతి ఒక్కరూ ఫోన్స్ చేసి సినిమా చాలా బాగుంది.. బాగా చేశారు.. అని చెప్తున్నారు. ఇంతలా నన్ను సపోర్ట్ చేసి ఆదరిస్తున్న ప్రేక్షకులకు, అభిమానులకు నా ధన్యవాదాలు’’ అని అన్నారు. దర్శకుడు మున్నా మాట్లాడుతూ.. ‘‘మేం పడ్డ కష్టానికి ప్రతిఫలం దక్కినందుకు చాలా హ్యాపీగా ఉంది. మా సినిమా భారీ ఓపెనింగ్స్‌తో సూపర్ హిట్ అయినందుకు చాలా హ్యాపీగా ఉంది. నాకు ఈ అవకాశం ఇచ్చిన మా నిర్మాత బాబు గారికి, ప్రదీప్‌కి చాలా థాంక్స్’’ అని వెల్లడించారు. నిర్మాత యస్వీ బాబు మాట్లాడుతూ.. ‘‘నేను ఇప్పటివరకూ 18 సినిమాలు తీశాను. కానీ ఈ చిత్రాన్ని డబ్బు ప్రధానంగా కాకుండా ఇష్టంతో చేశాను. ఈ సినిమాపై ప్రదీప్, మున్నా ఇద్దరి జీవితాలు ఆదరపడ్డాయి. వారికోసం నేను ఇన్ని రోజులు వెయిట్ చేసి థియేటర్స్‌లోనే రిలీజ్ చేశాను. అన్ని ఏరియాల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా ఈ చిత్రాన్ని మీడియా బాగా సపోర్ట్ చేసింది. వారికి నా ప్రత్యేక కృతజ్ఞతలు. అసలు ఇంత మంచి ఓపెనింగ్స్, రెస్పాన్స్ వస్తుందని అనుకోలేదు. పబ్లిక్ రెస్పాన్స్ బాగుంది. మేం ఊహించిన దానికంటే పెద్ద హిట్ చేసిన ప్రేక్షకులకు చాలా చాలా థాంక్స్’’ అని అన్నారు. సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్ మాట్లాడుతూ.. ‘‘నీలి నీలి ఆకాశం పాట ఎంత పెద్ద హిట్ అయిందో సినిమాని కూడా అంతే పెద్ద హిట్ చేసిన ఆడియన్స్ అందరికీ నా స్పెషల్ థాంక్స్. పాటలతో పాటు రీ-రికార్డింగ్ చాలా బాగుంది అంటున్నారు’’ అని తెలిపారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/36kTqgn
v

‘కె.జి.యఫ్ 2’ రిలీజ్ డేట్: జులైలో వస్తోన్న రాకీ భాయ్

‘తొంద‌ర‌ప‌డితే చ‌రిత్రను తిర‌గ రాయ‌లేం.. ఊరికే చ‌రిత్రను సృష్టించ‌లేం’. ఇది నిజ‌మ‌ని న‌మ్మించ‌డానికి సిద్ధమ‌వుతున్నాడు రాకీ భాయ్‌. ‘కె.జి.యఫ్: ఛాప్టర్ 1’తో న‌‌రాచీలో మొద‌లైన రాకీ భాయ్ దండ‌యాత్ర పాన్ ఇండియా రేంజ్‌లో బాక్సాఫీస్ దుమ్ముదులిపింది. ఇప్పుడు బాక్సాఫీస్ వ‌ద్ద ఈ దండ‌యాత్రను కొనసాగించడానికి రాకీ భాయ్ మ‌రోసారి సిద్ధమ‌వుతున్నాడు. మరింతగా థ్రిల్‌కు గురిచేసే అంశాలతో జులైలో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. రాకింగ్ స్టార్ య‌శ్ క‌థానాయ‌కుడిగా ప్రశాంత్ నీల్ ద‌ర్శక‌త్వంలో రూపొందుతోన్న హై-ఆక్టేన్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘కె.జి.యఫ్: ఛాప్టర్ ‌2’. ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్స్ సంజయ్ దత్, రవీనా టాండన్ సహా ప్రకాశ్‌ రాజ్, రావు రమేష్ వంటి ప్రతిభావంతులైన నటులు నటించారు. ఇటీవల విడుదలైన ఈ సినిమా టీజర్ 150 మిలియన్ వ్యూస్‌తో 7.5 మిలియన్ లైక్స్‌తో ఇండియన్ సినిమా ఇండస్ట్రీలోనే కనీవినీ ఎరుగని రీతిలో రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ రికార్డే చెబుతోంది సినిమా కోసం ప్రేక్షకులు ఎంత క్రేజీగా ఎదురుచూస్తున్నారో. ఆ అంచనాలకు ధీటుగా ‘కె.జి.యఫ్: ఛాప్టర్ ‌2’ ప్రేక్షకుల ముందుకు రానుంది. హోంబలే ఫిలింస్ బ్యానర్‌పై నిర్మాత విజయ్ కిరగందూర్ నిర్మిస్తోన్న ఈ భారీ యాక్షన్ మూవీ చిత్రీక‌ర‌ణ‌ను పూర్తి చేసుకుని శ‌ర‌వేగంగా పోస్ట్ ప్రొడ‌క్షన్ కార్యక్రమాల‌ను జ‌రుపుకుంటోంది. ఈ సినిమాను జులై 16న ప్రపంచ వ్యాప్తంగా విడుద‌ల చేస్తున్నట్లు నిర్మాత‌ అధికారికంగా ప్రక‌టించారు. ఈ మేరకు విడుదల తేదీతో కూడిన కొత్త పోస్టర్‌ను శుక్రవారం విడుదల చేశారు. ఒరిజినల్ లాంగ్వేజ్ కన్నడతో పాటు తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో ‘కె.జి.యఫ్: ఛాప్టర్ 2’ విడుదలవుతోంది. తెలుగులో వారాహి చ‌ల‌న చిత్రం విడుద‌ల చేస్తుంది. ఈ చిత్రానికి ర‌వి బ‌స్రూర్ సంగీతం సమకూర్చగా.. భువ‌న్ గౌడ సినిమాటోగ్రఫీ అందించారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/36kAxKv
v

జగన్‌తో మంచు విష్ణు లంచ్.. సీఎంలో కొత్త కోణం గురించి చెప్పిన హీరో!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ రెడ్డి, ఆయన సతీమణి వైఎస్ భారతిలను హీరో దంపతులు శుక్రవారం కలిశారు. భార్య విరానికాతో కలిసి తాడేపల్లిలోని క్యాంప్ ఆఫీసుకు వెళ్లిన విష్ణు.. సీఎం జగన్ దంపతులతో కాసేపు సరదాగా గడిపారు. వారితో మధ్యాహ్న భోజనం కూడా చేశారు. ఈ విషయాన్ని మంచు విష్ణు సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. జగన్ దంపతులతో కలిసి తీసుకున్న సెల్ఫీని ఇన్‌గ్రామ్‌లో షేర్ చేసిన విష్ణు.. సీఎం జగన్‌ మోహన్ రెడ్డిలోని కొత్త కోణం గురించి చెప్పారు. ‘జగన్ అన్న, భారతి అక్కను కలిశాం. లంచ్ చేశాం. విద్య పట్ల ఆయనకున్న విజన్ మరోస్థాయి. ఇంకో విషయం ఏంటంటే, ఆయనలోని హాస్య కోణాన్ని ప్రజలు మరింత తెలుసుకోవాలని కోరుకుంటున్నాను. మరిన్ని విషయాలు తర్వాత చెబుతా!’ అని మంచు విష్ణు తన పోస్ట్‌లో పేర్కొన్నారు. అయితే, ప్రస్తుతానికి లంచ్ కోసం మాత్రమే కలిశామని పేర్కొన్నా మంచు విష్ణు.. మరిన్ని విషయాలు తరవాత చెబుతా అని చిన్న మెలిక పెట్టారు. ఆ విషయాలేంటో త్వరలో తెలుస్తాయేమో చూడాలి. ఇదిలా ఉంటే, మంచు విష్ణు ప్రస్తుతం ‘మోసగాళ్ళు’ సినిమాతో బిజీగా ఉన్నారు. ఇది హాలీవుడ్‌-ఇండియ‌న్ సినిమా. దీనికి మంచు విష్ణే నిర్మాత. ఈ సినిమా కోసం ఆయన భారీగానే ఖర్చు చేస్తున్నారు. కూక‌ట్‌ప‌ల్లిలో సుమారు రూ. 3.5 కోట్ల వ్యయంతో ఒక భారీ ఐటీ ఆఫీస్ సెట్‌ వేశారు. ప్రంపంచలోనే అతిపెద్ద ఐటీ స్కాం నేపథ్యంతో ఈ సినిమా కథ సాగనుంది. 2019లో మొదలైన ఈ సినిమా ఎట్టకేలకు ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు వస్తోంది. మార్చి 11న ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్టు సమాచారం. హాలీవుడ్‌కు చెందిన జెఫ్రీ గీ చిన్ డైరెక్ట్ చేస్తున్న ‘మోస‌గాళ్ళు’ సినిమాలో మంచు విష్ణుకు చెల్లెలిగా కాజ‌ల్ అగ‌ర్వాల్‌ నటించారు. సునీల్ శెట్టి, న‌వ‌దీప్ ముఖ్య పాత్రలు పోషించారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/36npCA6
v

‘నారప్ప’కు ఒక్కరోజు ముందొస్తున్న ‘ఆచార్య’

‘ఆచార్య దేవో భవ’ అని మన అందరికీ తెలిసిందే.. కానీ ‘ఆచార్య రక్షోభవ’ అని అంటున్నారు మెగాస్టార్‌ చిరంజీవి. అసలు ‘ఆచార్య’ గురించి అంత బలంగా ఎందుకు చెబుతున్నారు అనే విషయం తెలియాలంటే సినిమా చూడాల్సిందేనని అంటోంది చిత్ర యూనిట్‌. మెగాస్టార్‌ టైటిల్‌ పాత్రలో నటిస్తోన్న చిత్రం ‘ఆచార్య’. స్టార్‌ డైరెక్టర్‌ కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ చిత్రాన్ని శ్రీమతి సురేఖ కొణిదెల సమర్పణలో కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకాలపై నిరంజన్‌ రెడ్డి, రామ్‌ చరణ్‌ నిర్మిస్తున్నారు. ‘ఆచార్య’ టీజర్‌ను కొణిదెల అంజనా దేవి పుట్టినరోజు సందర్భంగా శుక్రవారం విడుదల చేశారు. టీజర్‌కు మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ వాయిస్‌ ఓవర్‌ అందించారు. ఈ సినిమాలో సిద్ధ అనే మరో పవర్‌ఫుల్‌ పాత్రలో రామ్‌ చరణ్‌ నటిస్తున్నారు. వీరిద్దరూ కలిసి నటిస్తుండటంతో సినిమా ఎలా ఉంటుందోనని అందరిలో ఆసక్తి పెరిగింది. మొత్తానికి ఈ సినిమా ప్రేక్షకులకు ముందుకు ఎప్పుడొస్తుందో తెలిసిపోయింది. టీజర్‌ను విడుదల చేసిన గంటన్నర సమయంలోనే ‘ఆచార్య’ విడుదల తేదీని ప్రకటించారు. మే 13న ‘ఆచార్య’ సినిమాను విడదల చేస్తున్నట్టు నిర్మాతలు ప్రకటించారు. ఈ మేరకు కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. కాగా, ‘ఆచార్య’ విడుదలైన ఒక్కరోజు తరవాత అంటే మే 14న విక్టరీ వెంకటేష్ ‘నారప్ప’ విడుదలవుతోంది. ప్రస్తుతం ‘ఆచార్య’ సినిమా చిత్రీకరణ దశలో ఉంది. ఈ సినిమా కోసం హైదరాబాద్‌ శివారు ప్రాంతమైన కోకాపేటలో వేసిన భారీ టెంపుల్‌ సెట్‌ను టీజర్‌లో మనం చూడొచ్చు. ఇండియాలో అతి పెద్ద టెంపుల్‌ సిటీ సెట్ ఇది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3t9Eqfp
v

అమ్మ పుట్టినరోజు.. నాగబాబు భావోద్వేగ సందేశం

మెగా బ్రదర్ తన మాతృమూర్తి కొణిదెల అంజనా దేవి పుట్టినరోజు సందర్భంగా ట్విట్టర్‌ ద్వారా తల్లికి శుభాకాంక్షలు తెలిపారు. భావోద్వేగభరిత సందేశంతో తల్లిపై తనకున్న ప్రేమను చాటుకున్నారు. ఇంత గొప్ప జీవితాన్ని ఇచ్చినందుకు, సముద్రం లాంటి జీవితంలో తాను స్థిరంగా నిలబడానికి ఒక యాంకర్‌లా ఉన్నందుకు తల్లికి నాగబాబు కృతజ్ఞతలు తెలిపారు. నా ప్రియాతి ప్రియమైన అమ్మకు పుట్టినరోజు శుభాకాంక్షలు అంటూ భావోద్వేగ సందేశంతో ట్వీట్ చేశారు. ‘నా ప్రియాతి ప్రియమైన అమ్మకు పుట్టినరోజు శుభాకాంక్షలు. నా ప్రతి ప్రయత్నం వెనుక బలం అమ్మే. పాతాళానికి పడిపోయిన సమయాల్లో నా మార్గంలో వెలుగులు నింపిన కాంతి అమ్మ. నా బాధలన్నింటిని మటుమాయం చేసేలా నువ్వు వాత్సల్యంతో హత్తుకున్నందుకు కృతజ్ఞతలు చెబితే సరిపోదమ్మా! నీ ఓదార్పు మాటలు చిన్నవే కావొచ్చు కానీ, జీవితంలో పెద్ద పెద్ద సమస్యలు ఎదుర్కొనేంత శక్తినిస్తాయి. నేనివాళ ఎంతో దృఢమైన వ్యక్తిలా నిలబడ్డానంటే అందుకు కారణం నీలాంటి శక్తిమంతమైన తల్లి పెంపకం వల్లే. ఈ జీవితాన్నిచ్చినందుకు కృతజ్ఞతలు అమ్మా. సముద్రం లాంటి ఈ జీవితంలో నేను నిలబడటానికి యాంకర్‌లా ఉన్నందుకు కృతజ్ఞతలు’ అని నాగబాబు తన సందేశంలో పేర్కొన్నారు. మరోవైపు, మెగాస్టార్ ఒక వీడియోతో తల్లికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. తన తమ్ముళ్లు, చెల్లెళ్లు, ఇతర కుటుంబ సభ్యులతో కలిసి అమ్మతో దిగిన ఫొటోలతో ఈ వీడియోను రూపొందించారు. ‘డాడీ’లోని గుమ్మాడి గుమ్మాడి పాటను జోడించి తయారుచేశారు. ‘జన్మనిచ్చిన అమ్మకి జన్మ దిన శుభాకాంక్షలు!’ అంటూ ఈ ట్వీట్ చేశారు చిరు. అంతేకాదు, అమ్మ పుట్టినరోజు నాడే తన కొత్త సినిమా ‘ఆచార్య’ టీజర్‌ను కూడా విడుదల చేశారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3onOcqA
v

అమ్మ పుట్టినరోజు.. నాగబాబు భావోద్వేగ సందేశం

మెగా బ్రదర్ తన మాతృమూర్తి కొణిదెల అంజనా దేవి పుట్టినరోజు సందర్భంగా ట్విట్టర్‌ ద్వారా తల్లికి శుభాకాంక్షలు తెలిపారు. భావోద్వేగభరిత సందేశంతో తల్లిపై తనకున్న ప్రేమను చాటుకున్నారు. ఇంత గొప్ప జీవితాన్ని ఇచ్చినందుకు, సముద్రం లాంటి జీవితంలో తాను స్థిరంగా నిలబడానికి ఒక యాంకర్‌లా ఉన్నందుకు తల్లికి నాగబాబు కృతజ్ఞతలు తెలిపారు. నా ప్రియాతి ప్రియమైన అమ్మకు పుట్టినరోజు శుభాకాంక్షలు అంటూ భావోద్వేగ సందేశంతో ట్వీట్ చేశారు. ‘నా ప్రియాతి ప్రియమైన అమ్మకు పుట్టినరోజు శుభాకాంక్షలు. నా ప్రతి ప్రయత్నం వెనుక బలం అమ్మే. పాతాళానికి పడిపోయిన సమయాల్లో నా మార్గంలో వెలుగులు నింపిన కాంతి అమ్మ. నా బాధలన్నింటిని మటుమాయం చేసేలా నువ్వు వాత్సల్యంతో హత్తుకున్నందుకు కృతజ్ఞతలు చెబితే సరిపోదమ్మా! నీ ఓదార్పు మాటలు చిన్నవే కావొచ్చు కానీ, జీవితంలో పెద్ద పెద్ద సమస్యలు ఎదుర్కొనేంత శక్తినిస్తాయి. నేనివాళ ఎంతో దృఢమైన వ్యక్తిలా నిలబడ్డానంటే అందుకు కారణం నీలాంటి శక్తిమంతమైన తల్లి పెంపకం వల్లే. ఈ జీవితాన్నిచ్చినందుకు కృతజ్ఞతలు అమ్మా. సముద్రం లాంటి ఈ జీవితంలో నేను నిలబడటానికి యాంకర్‌లా ఉన్నందుకు కృతజ్ఞతలు’ అని నాగబాబు తన సందేశంలో పేర్కొన్నారు. మరోవైపు, మెగాస్టార్ ఒక వీడియోతో తల్లికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. తన తమ్ముళ్లు, చెల్లెళ్లు, ఇతర కుటుంబ సభ్యులతో కలిసి అమ్మతో దిగిన ఫొటోలతో ఈ వీడియోను రూపొందించారు. ‘డాడీ’లోని గుమ్మాడి గుమ్మాడి పాటను జోడించి తయారుచేశారు. ‘జన్మనిచ్చిన అమ్మకి జన్మ దిన శుభాకాంక్షలు!’ అంటూ ఈ ట్వీట్ చేశారు చిరు. అంతేకాదు, అమ్మ పుట్టినరోజు నాడే తన కొత్త సినిమా ‘ఆచార్య’ టీజర్‌ను కూడా విడుదల చేశారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3onOcqA
v

టీజర్: గుణపాఠాలు చెప్పే ‘ఆచార్య’ ఏం స్టైలిష్‌గా ఉన్నాడబ్బా!

మెగా అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తోన్న సమయం వచ్చేసింది. ‘ఆచార్య’ టీజర్‌తో మెగా అభిమానులకు కనువిందు తీసుకొచ్చారు మెగాస్టార్ చిరంజీవి. సోషల్ మెసేజ్‌తో కూడిన కమర్షియల్ సినిమాలు తీయడంతో సిద్ధహస్తుడిగా మారిన కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ హీరోగా రూపొందుతోన్న ఈ ‘ఆచార్య’ టీజర్‌ను శుక్రవారం సాయంత్రం 4:05 గంటలకు విడుదల చేశారు. చిరంజీవి తల్లి అంజనా దేవి పుట్టినరోజు సందర్భంగా ఈ టీజర్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ప్రస్తుతం ఈ టీజర్ ట్రెండింగ్‌లో ఉంది. ‘ఇతరుల కోసం జీవించే వారు దైవంతో సమానం. అలాంటి వారి జీవితాలే ప్రమాదంలో పడితే.. ఆ దైవమే వచ్చి కాపాడాల్సిన పనిలేదు’ అనే రామ్ చరణ్ వాయిస్ ఓవర్‌తో ఈ టీజర్ మొదలైంది. అదే వాయిస్ ఓవర్‌తో ‘ఆచార్య’గా చిరంజీవి వైలెంట్ ఇంట్రడక్షన్ కూడా జరిగింది. టీజర్ చూస్తుంటే చిరంజీవి హీరోయిజాన్ని కొరటాల శివ ఏ రేంజ్‌లో ఎలివేట్ చేశారో అర్థమవుతోంది. చిరంజీవి సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన తరవాత ‘ఖైదీ నంబర్ 150’, ‘సైరా’ సినిమాలు వచ్చినా.. ఎందుకో ఈ ‘ఆచార్య’ ఆయనకు కరెక్ట్ ఫిలిం అని టీజర్ చూస్తుంటే అనిపిస్తోంది. టీజర్‌లో చిరంజీవి స్టైల్, హీరోయిజం చూసి మెగా అభిమానులకు సంబరాలు చేసుకోవడం ఖాయం. అంత అందంగా, స్టైలిష్‌గా ఉన్నారు మెగాస్టార్. ఫైట్స్ కూడా వేరే స్థాయిలో ఉన్నాయి. ఇక్కడ కూడా చిరంజీవి స్టైలే హైలైట్. ‘‘పాఠాలు చెప్పే అలవాటు లేకపోయినా అందరూ ఎందుకో ఆచార్య అంటుంటారు. బహుశా గుణపాఠాలు చెప్తాననేమో’’ అంటూ చిరంజీవి చెప్పే డైలాగ్ టీజర్‌కి మరో హైలైట్. ఈ టీజర్‌లో ప్రత్యేకంగా చెప్పాల్సింది మణిశర్మ నేపథ్య సంగీతం, తిరు సినిమాటోగ్రఫీ గురించి. ఈ రెండూ అద్భుతంగా ఉన్నాయి. Also Read: వేసవిలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాలో చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. అలాగే, ‘సిద్ధ’ అనే కీలక పాత్రలో రామ్ చరణ్ మెరవనున్నారు. శ్రీమతి సురేఖ కొణిదెల సమర్పణలో మ్యాట్నీ ఎంటర్‌టైన్మెంట్స్, కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్లపై నిరంజన్ రెడ్డి, రామ్ చరణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/39vgZ8c
v

వేసవిలో వస్తోన్న ‘నారప్ప’.. విడుదల తేదీ ఖరారు

విక్టరీ చాలా కాలం తరవాత చేస్తున్న పక్కా మాస్ ఎంటర్‌టైనర్ ‘నారప్ప’. గతంలో వెంకటేష్‌తో ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ చిత్రానికి పనిచేసిన శ్రీకాంత్ అడ్డాల ‘నారప్ప’కు దర్శకత్వం వహిస్తున్నారు. సురుష్ ప్రొడక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్, వి క్రియేషన్స్ బ్యానర్లపై డి.సురేష్ బాబు, కలైపులి ఎస్. థాను నిర్మిస్తున్నారు. విభిన్న తరహా పాత్రలు చేయడంలో మొదటి నుండీ ముందుండే జాతీయ ఉత్తమ నటి ప్రియమణి ఈ మూవీలో సుందరమ్మగా గుర్తుండిపోయే పాత్ర చేస్తున్నారు. ఈ సినిమా విడుదల తేదీని చిత్ర నిర్మాణ సంస్థలు ఖరారు చేశాయి. మే 14న విడుదల చేస్తున్నట్టు ప్రకటించాయి. ఈ మేరకు రిలీజ్ డేట్ పోస్టర్లను విడుదల చేశాయి. గతంలో విడుదల చేసిన వెంకటేష్ నారప్ప లుక్‌నే ఈ పోస్టర్లలో వాడారు. మొత్తానికి ఈ వేసవిలో ‘నారప్ప’ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. తమిళ సూపర్ హిట్ మూవీ ‘అసురన్’కు ‘నారప్ప’ రీమేక్ అన్న విషయం తెలిసిందే. తమిళంలో ధనుష్ పోషించిన పాత్రను వెంకటేష్ చేస్తుండగా.. మంజు వారియర్ చేసిన పాత్రలో ప్రియమణి నటిస్తున్నారు. వెంకటేష్ పెద్ద కుమారుడి పాత్రను ‘కేరాఫ్ కంచరపాలెం’ ఫేమ్ కార్తీక్ రత్నం పోషిస్తున్నారు. కాగా, ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుద‌లైన గ్లింప్స్, పోస్టర్లకు మంచి స్పంద‌న వ‌చ్చింది. అలాగే, సంక్రాంతికి శుభాకాంక్షలు తెలియ‌జేస్తూ కొత్త పోస్టర్‌ విడుద‌ల చేశారు. వెంకటేష్, ప్రియ‌మ‌ణి సహా ఫ్యామిలీ అంతా ఉన్న ఈ పోస్టర్ ఆక‌ట్టుకుంది. ఇక, ‘నారప్ప’ టీజర్ కోసం వెంకటేష్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రంలో ఇంకా కార్తిక్ ర‌త్నం, రావు ర‌మేష్‌, రాజీవ్ క‌న‌కాల ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. మణిశర్మ సంగీతం సమకూరుస్తోన్న ఈ చిత్రానికి శ్యామ్ కె. నాయుడు సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. మార్తాండ్ కె. వెంకటేష్ ఎడిటర్. పీటర్ హెయిన్, విజయ్ ఫైట్స్ కంపోజ్ చేస్తున్నారు. సిరివెన్నెల సీతారామశాస్త్రి, సుద్దాల అశోక్‌ తేజ, అనంత శ్రీరామ్‌, కృష్ణకాంత్‌, కాసర్ల శ్యాం సాహిత్యం అందిస్తున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3iXkoQi
v

మహేష్ చేతిలో తాళాల గుత్తి.. 'సర్కారు వారి పాట' విడుదలపై సర్‌ప్రైజింగ్ అప్‌డేట్

గతేడాది 'సరిలేరు నీకెవ్వరు' అనిపించుకుంటూ సంక్రాంతి సక్సెస్ అందుకున్న సూపర్ స్టార్ .. వచ్చే ఏడాది అదే సంక్రాంతిని టార్గెట్ చేశారు. ఆయన నటిస్తున్న లేటెస్ట్ మూవీ '' రిలీజ్ కోసం సంక్రాంతి సీజన్‌ను ఎంచుకున్నారు. నిజానికి ఈ సినిమా ప్రకటన వచ్చి నెలలు గడిచిపోతున్నా చివరకు ఇటీవలే షూటింగ్ ప్రారంభించారు మేకర్స్. ఈ క్రమంలోనే రిలీజ్‌పై ఓ అంచనాకు వచ్చి 2022 సంక్రాంతి రేస్‌లో నిలవబోతున్నట్లు తెలిపారు. ఇటీవలే షూటింగ్స్ రీ- ఓపెన్ కావడం, ఆపై సినిమా థియేటర్ల గేట్లు తెరుచుకోవడంతో స్టార్ హీరోలంతా ఒక్కొక్కరుగా తమ తమ సినిమా రిలీజ్ డేట్స్ అనౌన్స్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సూపర్ స్టార్ అభిమానులకు కూడా సర్‌ప్రైజింగ్ అప్‌డేట్ ఇచ్చారు 'సర్కారు వారి పాట' దర్శకనిర్మాతలు. సినిమా విడుదల తేదీ ప్రకటిస్తూ కొత్త పోస్టర్ ద్వారా ఇచ్చిన ఈ అప్‌డేట్‌ను మహేష్ బాబు తన అభిమానులతో పంచుకున్నారు. ఈ మేరకు షేర్ చేసిన కొత్త పోస్టర్‌లో మహేష్ తాళాల గుత్తి చేతిలో పట్టుకొని కనిపిస్తుండటం ఆసక్తి రేకెత్తిస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్, జీఎమ్‌బి ఎంటర్‌టైన్‌మెంట్స్ ,14 రీల్స్ ప్లస్ సంస్థలు‌ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు పరశురామ్ దర్శకత్వం వహిస్తున్నారు. చిత్రంలో మహేష్ బాబు సరసన హీరోయిన్‌గా నటిస్తోంది. జనవరి 25 నుంచి ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమైంది. దుబాయ్‌లో మొదలైన ఫస్ట్ షెడ్యూల్ షూటింగ్‌లో మహేష్ బాబుతో పాటు హీరోయిన్ కీర్తి సురేష్ భాగమవుతోంది. మహేష్ కెరీర్‌లో 27వ సినిమాగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3r1OvZY
v

‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా?’ రివ్యూ: ప్రదీప్ పాటే బాగుంది!

‘నీలి.. నీలి.. ఆకాశం’ పాట అంత బాగుంటుంది సినిమా అని ‘30 రోజుల్లో ప్రేమించటం ఎలా?’ థియేటర్స్‌కి రప్పించాడు యాంకర్ ప్రదీప్. ఆయన హీరోగా పరిచయం అయిన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా నేడు (జనవరి 29)న భారీగా విడుదలైంది. మరి ఈ సినిమా ఎలా ఉంది?? నిజంగానే ఈ సినిమా ‘నీలి నీలి ఆకాశం’ పాట అంత బాగుందా అన్నది రివ్యూలో చూద్దాం. టీజర్, ట్రైలర్.. అలాగే నీలి నీలి ఆకాశం సాంగ్‌లో రివీల్ చేసినట్టుగా ఈ సినిమా పునర్జన్మల కథ. బ్రిటీష్ కాలం నాటి పల్లెటూరి ప్రేమకథలో అమ్మాయి గారు (అమృతా అయ్యర్).. అబ్బాయిగారు (ప్రదీప్) ప్రేమికులు. ఒకరంటే ఒకరికి ప్రాణం. అయితే అబ్బాయిగారికి అమ్మాయిగారితో పాటు కుస్తీ పోటీలన్నా మహా ఇష్టం. తెల్లారితే పెళ్లి పెట్టుకుని బ్రిటీష్ వారితో కుస్తీ పోటీలకు వెళ్తాడు అబ్బాయి గారు. అయితే సీన్‌లోకి అమ్మాయి గారు వచ్చి నేను కావాలా కుస్తీ పోటీలు కావాలా? అని నిలదీస్తే.. అమ్మాయిగారు నన్ను విడిచి ఎక్కడికి పోతుందిలే.. కుస్తీలో గెలిస్తే 90 రూపాయిలు వస్తాయి.. ఆ డబ్బుతో అమ్మాయిగారికి పెళ్లి చీర నేస్తాను అనుకుని.. కుస్తీ పోటీనే ముఖ్యం అని అమ్మాయిగారికి తేల్చిచెప్పేస్తాడు. దీంతో అమ్మాయిగారికి వేరే పెళ్లి ఫిక్స్ చేస్తారు ఇంట్లో వాళ్లు. ఒకడ్ని ప్రేమించి వేరే వాడ్ని పెళ్లి చేసుకోలేక.. తనకంటే కుస్తీ పోటీ ఎక్కువనుకున్నాడన్న కోపంలో ఆత్మహత్య చేసుకుంటుంది అమ్మాయిగారు. అక్కడ అబ్బాయిగారు కుస్తీ పడుతుండగా.. అమ్మాయిగారి పెళ్లి అవుతుందనే వార్త చెవిన పడటంతో బ్రిటీష్ వాళ్ల చేతుల్లో తన్నులు తిని ప్రాణం విడిచేస్తాడు. సీన్ కట్ చేస్తే.. గత జన్మలో చనిపోయిన అమ్మాయి గారు అబ్బాయిగారు మళ్లీ.. అర్జున్, అక్షరగా పునర్జన్మ ఎత్తి వైజాగ్‌లో ఒకే ఇంజనీరింగ్ కాలేజ్‌లో దర్శనం ఇస్తారు. అయితే వీరిని గత జన్మ తాలుకా జ్ఞాపకాలు ఎలా వెంటాడాయి? అవి ఎలాంటి పరిణామాలకు దారి తీశాయి. అర్జున్, అక్షరలు 30 రోజుల్లో తిరిగి ఎలా ప్రేమలో పడ్డారు అన్నదే మిగిలిన కథ. ఈ సినిమా చూడాలనుకునేవారికి నోట్ ఏంటంటే.. ఓపెనింగ్ సెగ్మెంట్ మాత్రం మిస్ కాకూడదు. అసలు కథ ఓపెనింగ్‌లో మొదలౌతుంది. కథా నేపథ్యం కూడా ‘నీలి నీలి ఆకాశం’ పాటలోనే ఉండటంతో ప్రారంభం మిస్ కాకూడదు. థియేటర్ నుంచి బయటకు వెళ్లేటప్పుడు ప్రతి ప్రేక్షకుడి ముఖంపై చిరునవ్వు ఉంటుందని ప్రామిస్ చేస్తున్నా అని ఈ సినిమా విడుదల సందర్భంగా యాంకర్ ప్రదీప్ ప్రామిస్ చేశాడు. అయితే ఆ చిరునవ్వు ‘నీలి నీలి ఆకాశం’ సాంగ్ వరకే పరిమితం అనే ఫీలింగ్ కలుగుతుంది ఈ సినిమా చూసిన తరువాత. ప్రేక్షకులకు తెలియని కొత్త వ్యక్తిని హీరోగా పరిచయం చేయాలంటే పెద్ద టాస్క్. జనం రిసీవింగ్ ఎలా ఉంటుందనే భయం ఉంటుంది. కానీ యాంకర్ ప్రదీప్ హీరోగా కొత్తే కానీ.. అలాంటి భయాలు అవసరం లేదు. ఎందుకంటే ప్రదీప్ గత పదేళ్లుగా అటు బుల్లితెరకు, ఇటు వెండితెరకు పరిచయమే. అందుకే యాంకర్ ప్రదీప్ హీరోగా సినిమా అంటే చాలామందిలో ధీమా వచ్చింది. దీనికి తోడు ఈ సినిమాలోని ‘నీలి నీలి ఆకాశం’ పాట ప్రదీప్‌‌‌కి డెబ్యూలోనే బీభత్సమైన క్రేజ్‌ని తెచ్చిపెట్టింది. పాట అంత బావుంటుంది ఈ సినిమా అని ప్రచారం చేసినా.. పాటే బాగుంది అనేట్టుగా ఈ ‘30 రోజుల్లో ప్రేమించటం ఎలా?’ సినిమా ఉంది. సుకుమార్ దగ్గర శిష్యరికం చేసిన దర్శకుడు మున్నా (ఫణి ప్రదీప్)‌ సీరియస్ నోట్‌తో కథను మొదలుపెట్టాడు. పాత్రల ఎంపికలోనూ.. టేకింగ్‌లోనూ.. ప్రజెంటేషన్‌లోనూ కొత్త దర్శకుడు అనే ఫీలింగ్ కలగదు. పునర్జన్మల నేపథ్యంలో కథను డీసెంట్‌గానే రాసుకున్నాడు కానీ.. కన్వెన్సింగ్‌గా బ్యాలెన్స్ చేయలేకపోయాడనే అనిపిస్తుంది. ఈ సినిమా కథ మొదట అల్లు అర్జున్‌కి చెప్పినప్పుడు ఆయన అడిగిన ప్రశ్నలతో స్క్రిప్ట్‌లు మార్పులు చేశారట మున్నా.. అయితే సినిమా చూసిన తరవాత బన్నీ మరికొన్ని ప్రశ్నలు వేసుంటే కథ గజిబిజి లేకుండా ఉండేదేమో అనిపిస్తుంది. సీరియస్ నోట్‌తో కథ మొదలుపెట్టినా.. బ్రిటీష్ కాలం నాటి కథ.. కుస్తీలో 90 రూపాయల కోసం ప్రేయసి వద్దను కోవడం.. అప్పుడే అమ్మాయిగారి పెళ్లి.. వెంటనే అబ్బాయిగారు కూడా చనిపోవడం.. ఇదంతా కన్వెన్సింగ్‌గా అనిపించదు. వాళ్లు చనిపోవడానికి.. మరో జన్మ ఎత్తడానికి బలమైన కారణం చూపించలేదనిపిస్తుంది. గత జన్మలో చనిపోయిన ప్రేమజంట.. మళ్లీ పునర్జన్మ ఎత్తి కలుసుకునే కీలకమైన సీన్ సాదాసీదాగా అనిపిస్తుంది. ఇంటర్వెల్ ట్విస్ట్ కథలో కీలకం కాగా.. ‘జంబలకిడిపంబ’ను గుర్తుకు తెస్తుంది. వినోదాన్ని పంచడంలో భాగంగా ఈ ట్రాక్ రాసుకున్నా.. ఇక్కడే కథ ట్రాక్ తప్పిందేమో అనిపిస్తుంది. కీలకమైన సన్నివేశాలు.. ఫాదర్ అండ్ మదర్ సెంటిమెంట్‌ను చాలా బాగా చూపించినప్పటికీ.. కథలో కావాలని తీసుకొచ్చిపెట్టినట్టుగా అనిపిస్తాయి. కథను గాడిన పెట్టే కీలక సన్నివేశాలు మరీ సినిమాటిక్‌గా అనిపించడంతో పాటు.. ప్రేక్షకుల్ని కథలో ఇన్వాల్ చేయలేకపోయాయి. అయితే మదర్, ఫాదర్, సిస్టర్ సెంటిమెంట్ సీన్లు సినిమాకి హెల్ప్ అయ్యాయి. హీరోగా ప్రదీప్‌కి మొదటి చిత్రమే అయినప్పటికీ అనుభవం ఉన్న నటుడిలా చేశారు. రెండు షేడ్స్ ఉన్న పాత్రలో వేరియేషన్స్ చూపిస్తూ మెప్పించాడు ప్రదీప్. లుక్స్‌తో బాక్సర్‌గా మంచి ఫిజిక్‌లో కనిపించాడు. ఇక డాన్స్ పరంగా కూడా ఆకట్టుకున్నాడు. కామెడీ సీన్లు ప్రదీప్‌కి కొట్టినపిండే అన్నట్టుగానే చేశాడు. ఇక మదర్ సెంటిమెంట్.. పురుడు పోసే సీన్‌లో.. సెకండాఫ్‌లో లవ్ ప్రపోజ్ చేసే సీన్లలో మెప్పించాడు. ఇక ఈ సినిమాలో మెయిన్ హైలైట్ హీరోయిన్ అమృతా అయ్య‌ర్.. అమ్మాయిగారుగా చాలా క్యూట్‌గా కనిపించిన అమృత.. అక్షరగా తనలోని అన్ని షేడ్స్ చూపించింది. అమాయకంగా కనిపిస్తూనే.. మోడరన్ డ్రెస్‌లు వేసి మందు కొడుతూ క్యారెక్టర్‌లో చాలా వేరియేషన్స్ చూపించింది. ఒక రకంగా ఎమోషనల్ సీన్స్‌లో ప్రదీప్ డామినేట్ చేసింది. ఇక ప్రదీప్‌కి ఫ్రెండ్‌గా చేసిన హర్ష, భద్రంలు నవ్వులు పూయించారు. ఈ సినిమాలో హర్షకి అధిక ప్రాధాన్యత ఉంది. హీరోయిన్ కాంబినేషన్‌లో హర్ష బెడ్ రూం సీన్ బాగా పేలింది. ఇక ప్రదీప్‌కి తల్లిగా హేమ ప్రాధాన్యత ఉన్న పాత్రలో మెప్పించింది. హీరోయిన్ తండ్రిగా పోసాని క్రిష్ణమురళి తన వైవిధ్యమైన నటనతో ఆకట్టకున్నాడు. ప్రదీప్ కాంబినేషన్ సీన్లలో నవ్వులు పంచాడు పోసాని. శుభలేక సుధాకర్-రంగస్థలం మహేష్‌లతో ఈ సినిమా కథ ప్రారంభం కానుండగా.. స్వామిజీగా శుభలేక సుధాకర్.. అతని శిష్యుడిగా రంగస్థలం మహేష్ ఆకట్టుకున్నారు. ఈ సినిమాకి మేజర్ హైలైట్ సంగీతం.. అనూప్ రూబెన్స్ అద్భుతమైన సంగీతాన్ని అందించారు. నీలి నీలి ఆకాశం పాటతో పాటు.. ఇదేరా స్నేహం, మీకో దండం సాంగ్స్ ఆకట్టుకున్నాయి. ‘అమ్మా నన్ను మళ్లీ పెంచవా’ అనే మదర్ సెంటిమెంట్ సాంగ్ చాలా ఎమోషనల్‌గా అనిపిస్తుంది. బ్యాగ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగుంది. సినిమాటోగ్రఫీ ప్లస్ కాగా.. ఎడిటింగ్ మైనస్. సెకండాఫ్‌లో అక్కర్లేని సన్నివేశాలు స్లోగా సాగుతున్న కథకు అడ్డంగా తగులుతుంటాయి. రన్ టైం మరీ ఎక్కువగా అనిపిస్తుంది. మొత్తంగా.. ‘30 రోజుల్లో ప్రేమించటం ఎలా’? నీలి నీలి ఆకాశం పాట అంత అయితే బాలేదు. ప్రదీప్‌ని ఇష్టపడేవాళ్లైతే ఒకసారి చూడొచ్చు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3adt3tZ
v

‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా?’ రివ్యూ: ప్రదీప్ పాటే బాగుంది!

‘నీలి.. నీలి.. ఆకాశం’ పాట అంత బాగుంటుంది సినిమా అని ‘30 రోజుల్లో ప్రేమించటం ఎలా?’ థియేటర్స్‌కి రప్పించాడు యాంకర్ ప్రదీప్. ఆయన హీరోగా పరిచయం అయిన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా నేడు (జనవరి 29)న భారీగా విడుదలైంది. మరి ఈ సినిమా ఎలా ఉంది?? నిజంగానే ఈ సినిమా ‘నీలి నీలి ఆకాశం’ పాట అంత బాగుందా అన్నది రివ్యూలో చూద్దాం. టీజర్, ట్రైలర్.. అలాగే నీలి నీలి ఆకాశం సాంగ్‌లో రివీల్ చేసినట్టుగా ఈ సినిమా పునర్జన్మల కథ. బ్రిటీష్ కాలం నాటి పల్లెటూరి ప్రేమకథలో అమ్మాయి గారు (అమృతా అయ్యర్).. అబ్బాయిగారు (ప్రదీప్) ప్రేమికులు. ఒకరంటే ఒకరికి ప్రాణం. అయితే అబ్బాయిగారికి అమ్మాయిగారితో పాటు కుస్తీ పోటీలన్నా మహా ఇష్టం. తెల్లారితే పెళ్లి పెట్టుకుని బ్రిటీష్ వారితో కుస్తీ పోటీలకు వెళ్తాడు అబ్బాయి గారు. అయితే సీన్‌లోకి అమ్మాయి గారు వచ్చి నేను కావాలా కుస్తీ పోటీలు కావాలా? అని నిలదీస్తే.. అమ్మాయిగారు నన్ను విడిచి ఎక్కడికి పోతుందిలే.. కుస్తీలో గెలిస్తే 90 రూపాయిలు వస్తాయి.. ఆ డబ్బుతో అమ్మాయిగారికి పెళ్లి చీర నేస్తాను అనుకుని.. కుస్తీ పోటీనే ముఖ్యం అని అమ్మాయిగారికి తేల్చిచెప్పేస్తాడు. దీంతో అమ్మాయిగారికి వేరే పెళ్లి ఫిక్స్ చేస్తారు ఇంట్లో వాళ్లు. ఒకడ్ని ప్రేమించి వేరే వాడ్ని పెళ్లి చేసుకోలేక.. తనకంటే కుస్తీ పోటీ ఎక్కువనుకున్నాడన్న కోపంలో ఆత్మహత్య చేసుకుంటుంది అమ్మాయిగారు. అక్కడ అబ్బాయిగారు కుస్తీ పడుతుండగా.. అమ్మాయిగారి పెళ్లి అవుతుందనే వార్త చెవిన పడటంతో బ్రిటీష్ వాళ్ల చేతుల్లో తన్నులు తిని ప్రాణం విడిచేస్తాడు. సీన్ కట్ చేస్తే.. గత జన్మలో చనిపోయిన అమ్మాయి గారు అబ్బాయిగారు మళ్లీ.. అర్జున్, అక్షరగా పునర్జన్మ ఎత్తి వైజాగ్‌లో ఒకే ఇంజనీరింగ్ కాలేజ్‌లో దర్శనం ఇస్తారు. అయితే వీరిని గత జన్మ తాలుకా జ్ఞాపకాలు ఎలా వెంటాడాయి? అవి ఎలాంటి పరిణామాలకు దారి తీశాయి. అర్జున్, అక్షరలు 30 రోజుల్లో తిరిగి ఎలా ప్రేమలో పడ్డారు అన్నదే మిగిలిన కథ. ఈ సినిమా చూడాలనుకునేవారికి నోట్ ఏంటంటే.. ఓపెనింగ్ సెగ్మెంట్ మాత్రం మిస్ కాకూడదు. అసలు కథ ఓపెనింగ్‌లో మొదలౌతుంది. కథా నేపథ్యం కూడా ‘నీలి నీలి ఆకాశం’ పాటలోనే ఉండటంతో ప్రారంభం మిస్ కాకూడదు. థియేటర్ నుంచి బయటకు వెళ్లేటప్పుడు ప్రతి ప్రేక్షకుడి ముఖంపై చిరునవ్వు ఉంటుందని ప్రామిస్ చేస్తున్నా అని ఈ సినిమా విడుదల సందర్భంగా యాంకర్ ప్రదీప్ ప్రామిస్ చేశాడు. అయితే ఆ చిరునవ్వు ‘నీలి నీలి ఆకాశం’ సాంగ్ వరకే పరిమితం అనే ఫీలింగ్ కలుగుతుంది ఈ సినిమా చూసిన తరువాత. ప్రేక్షకులకు తెలియని కొత్త వ్యక్తిని హీరోగా పరిచయం చేయాలంటే పెద్ద టాస్క్. జనం రిసీవింగ్ ఎలా ఉంటుందనే భయం ఉంటుంది. కానీ యాంకర్ ప్రదీప్ హీరోగా కొత్తే కానీ.. అలాంటి భయాలు అవసరం లేదు. ఎందుకంటే ప్రదీప్ గత పదేళ్లుగా అటు బుల్లితెరకు, ఇటు వెండితెరకు పరిచయమే. అందుకే యాంకర్ ప్రదీప్ హీరోగా సినిమా అంటే చాలామందిలో ధీమా వచ్చింది. దీనికి తోడు ఈ సినిమాలోని ‘నీలి నీలి ఆకాశం’ పాట ప్రదీప్‌‌‌కి డెబ్యూలోనే బీభత్సమైన క్రేజ్‌ని తెచ్చిపెట్టింది. పాట అంత బావుంటుంది ఈ సినిమా అని ప్రచారం చేసినా.. పాటే బాగుంది అనేట్టుగా ఈ ‘30 రోజుల్లో ప్రేమించటం ఎలా?’ సినిమా ఉంది. సుకుమార్ దగ్గర శిష్యరికం చేసిన దర్శకుడు మున్నా (ఫణి ప్రదీప్)‌ సీరియస్ నోట్‌తో కథను మొదలుపెట్టాడు. పాత్రల ఎంపికలోనూ.. టేకింగ్‌లోనూ.. ప్రజెంటేషన్‌లోనూ కొత్త దర్శకుడు అనే ఫీలింగ్ కలగదు. పునర్జన్మల నేపథ్యంలో కథను డీసెంట్‌గానే రాసుకున్నాడు కానీ.. కన్వెన్సింగ్‌గా బ్యాలెన్స్ చేయలేకపోయాడనే అనిపిస్తుంది. ఈ సినిమా కథ మొదట అల్లు అర్జున్‌కి చెప్పినప్పుడు ఆయన అడిగిన ప్రశ్నలతో స్క్రిప్ట్‌లు మార్పులు చేశారట మున్నా.. అయితే సినిమా చూసిన తరవాత బన్నీ మరికొన్ని ప్రశ్నలు వేసుంటే కథ గజిబిజి లేకుండా ఉండేదేమో అనిపిస్తుంది. సీరియస్ నోట్‌తో కథ మొదలుపెట్టినా.. బ్రిటీష్ కాలం నాటి కథ.. కుస్తీలో 90 రూపాయల కోసం ప్రేయసి వద్దను కోవడం.. అప్పుడే అమ్మాయిగారి పెళ్లి.. వెంటనే అబ్బాయిగారు కూడా చనిపోవడం.. ఇదంతా కన్వెన్సింగ్‌గా అనిపించదు. వాళ్లు చనిపోవడానికి.. మరో జన్మ ఎత్తడానికి బలమైన కారణం చూపించలేదనిపిస్తుంది. గత జన్మలో చనిపోయిన ప్రేమజంట.. మళ్లీ పునర్జన్మ ఎత్తి కలుసుకునే కీలకమైన సీన్ సాదాసీదాగా అనిపిస్తుంది. ఇంటర్వెల్ ట్విస్ట్ కథలో కీలకం కాగా.. ‘జంబలకిడిపంబ’ను గుర్తుకు తెస్తుంది. వినోదాన్ని పంచడంలో భాగంగా ఈ ట్రాక్ రాసుకున్నా.. ఇక్కడే కథ ట్రాక్ తప్పిందేమో అనిపిస్తుంది. కీలకమైన సన్నివేశాలు.. ఫాదర్ అండ్ మదర్ సెంటిమెంట్‌ను చాలా బాగా చూపించినప్పటికీ.. కథలో కావాలని తీసుకొచ్చిపెట్టినట్టుగా అనిపిస్తాయి. కథను గాడిన పెట్టే కీలక సన్నివేశాలు మరీ సినిమాటిక్‌గా అనిపించడంతో పాటు.. ప్రేక్షకుల్ని కథలో ఇన్వాల్ చేయలేకపోయాయి. అయితే మదర్, ఫాదర్, సిస్టర్ సెంటిమెంట్ సీన్లు సినిమాకి హెల్ప్ అయ్యాయి. హీరోగా ప్రదీప్‌కి మొదటి చిత్రమే అయినప్పటికీ అనుభవం ఉన్న నటుడిలా చేశారు. రెండు షేడ్స్ ఉన్న పాత్రలో వేరియేషన్స్ చూపిస్తూ మెప్పించాడు ప్రదీప్. లుక్స్‌తో బాక్సర్‌గా మంచి ఫిజిక్‌లో కనిపించాడు. ఇక డాన్స్ పరంగా కూడా ఆకట్టుకున్నాడు. కామెడీ సీన్లు ప్రదీప్‌కి కొట్టినపిండే అన్నట్టుగానే చేశాడు. ఇక మదర్ సెంటిమెంట్.. పురుడు పోసే సీన్‌లో.. సెకండాఫ్‌లో లవ్ ప్రపోజ్ చేసే సీన్లలో మెప్పించాడు. ఇక ఈ సినిమాలో మెయిన్ హైలైట్ హీరోయిన్ అమృతా అయ్య‌ర్.. అమ్మాయిగారుగా చాలా క్యూట్‌గా కనిపించిన అమృత.. అక్షరగా తనలోని అన్ని షేడ్స్ చూపించింది. అమాయకంగా కనిపిస్తూనే.. మోడరన్ డ్రెస్‌లు వేసి మందు కొడుతూ క్యారెక్టర్‌లో చాలా వేరియేషన్స్ చూపించింది. ఒక రకంగా ఎమోషనల్ సీన్స్‌లో ప్రదీప్ డామినేట్ చేసింది. ఇక ప్రదీప్‌కి ఫ్రెండ్‌గా చేసిన హర్ష, భద్రంలు నవ్వులు పూయించారు. ఈ సినిమాలో హర్షకి అధిక ప్రాధాన్యత ఉంది. హీరోయిన్ కాంబినేషన్‌లో హర్ష బెడ్ రూం సీన్ బాగా పేలింది. ఇక ప్రదీప్‌కి తల్లిగా హేమ ప్రాధాన్యత ఉన్న పాత్రలో మెప్పించింది. హీరోయిన్ తండ్రిగా పోసాని క్రిష్ణమురళి తన వైవిధ్యమైన నటనతో ఆకట్టకున్నాడు. ప్రదీప్ కాంబినేషన్ సీన్లలో నవ్వులు పంచాడు పోసాని. శుభలేక సుధాకర్-రంగస్థలం మహేష్‌లతో ఈ సినిమా కథ ప్రారంభం కానుండగా.. స్వామిజీగా శుభలేక సుధాకర్.. అతని శిష్యుడిగా రంగస్థలం మహేష్ ఆకట్టుకున్నారు. ఈ సినిమాకి మేజర్ హైలైట్ సంగీతం.. అనూప్ రూబెన్స్ అద్భుతమైన సంగీతాన్ని అందించారు. నీలి నీలి ఆకాశం పాటతో పాటు.. ఇదేరా స్నేహం, మీకో దండం సాంగ్స్ ఆకట్టుకున్నాయి. ‘అమ్మా నన్ను మళ్లీ పెంచవా’ అనే మదర్ సెంటిమెంట్ సాంగ్ చాలా ఎమోషనల్‌గా అనిపిస్తుంది. బ్యాగ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగుంది. సినిమాటోగ్రఫీ ప్లస్ కాగా.. ఎడిటింగ్ మైనస్. సెకండాఫ్‌లో అక్కర్లేని సన్నివేశాలు స్లోగా సాగుతున్న కథకు అడ్డంగా తగులుతుంటాయి. రన్ టైం మరీ ఎక్కువగా అనిపిస్తుంది. మొత్తంగా.. ‘30 రోజుల్లో ప్రేమించటం ఎలా’? నీలి నీలి ఆకాశం పాట అంత అయితే బాలేదు. ప్రదీప్‌ని ఇష్టపడేవాళ్లైతే ఒకసారి చూడొచ్చు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3adt3tZ
v

RRR: డియర్ జెన్నిఫర్ అంటూ హాలీవుడ్ బ్యూటీపై ఎన్టీఆర్ స్వీట్ కామెంట్.. అమ్మడి క్యూట్ లుక్ అదుర్స్

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ హీరోలుగా దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న భారీ సినిమా . బడా నిర్మాత డీవీవీ దానయ్య సమర్పణలో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ సినిమాలో సరసన హాలీవుడ్ బ్యూటీ ఒలీవియా మోరిస్, రామ్ చరణ్ సరసన బాలీవుడ్ హీరోయిన్ ఆలియా భట్ నటిస్తున్నారు. ఈ నేపథ్యంలో నేడు (జనవరి 29) ఒలీవియా పుట్టినరోజు సందర్భంగా ఆమె క్యూట్ లుక్ షేర్ చేస్తూ స్వీట్ కామెంట్స్ చేశారు ఎన్టీఆర్. హ్యాపీ బర్త్ డే డియర్ 'జెన్నిఫర్' అంటూ RRR మూవీలో ఒలీవియా మోరిస్ పాత్ర పేరును పరిచయం చేశారు ఎన్టీఆర్. ఈ మేరకు ఆయన షేర్ చేసిన ఒలీవియా క్యూట్ లుక్ నెటిజన్లను ఫిదా చేసింది. ఈ లుక్ చూసిన వెంటనే సూపర్ అని పేర్కొంటూ వెండితెరపై ఒలీవియా- ఎన్టీఆర్ జోడీని చూడాలని కుతూహలంగా ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. RRR మూవీలో రామ్ చరణ్, ఎన్టీఆర్ ఇద్దరికీ సరిసమానమైన ప్రియార్టీ ఇస్తూ పాత్రలను రూపొందించారు జక్కన్న. చిత్రంలో అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్, కొమురం భీం పాత్రలో ఎన్టీఆర్ నటిస్తున్నారు. ఇప్పటికే 80 శాతం పైగా చిత్రీకరణ పూర్తయింది. కాగా తాజాగా ఈ చిత్రంలో ఎన్టీఆర్ ప్రేయసి (ఒలీవియా) పేరు జెన్నిఫర్ అని తెలపడం నందమూరి అభిమానులను హుషారెత్తించింది. 'రౌద్రం రణం రుధిరం' అనే పవర్‌ఫుల్ టైటిల్ పెట్టిన రాజమౌళి ఇప్పటికే రామ్ చరణ్ 'భీమ్ ఫర్ రామరాజు' వీడియో, ఎన్టీఆర్ 'రామరాజు ఫర్ భీమ్' వీడియోలు రిలీజ్ చేసి సినిమాపై ఉన్న అంచనాలను అమాంతం పెంచేశారు. నిజానికి ఈ ఏడాది జనవరి నెలలోనే ఈ మూవీ రిలీజ్ ఉంటుందని అంతా భావించారు కానీ, కరోనా కారణంగా చిత్ర షూటింగ్‌కి బ్రేక్ రావడంతో విడుదల వాయిదా వేశారు మేకర్స్. ఇటీవలే చిత్రాన్ని అక్టోబర్ 13న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నామని అఫీషియల్‌గా ప్రకటించారు రాజమౌళి.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2MASkWO
v

'మేజర్' డే అంటూ క్రేజీ అప్‌డేట్ ఇచ్చిన సూపర్ స్టార్ మహేష్ బాబు.. ఇదీ మ్యాటర్!!

'గూఢచారి' ఫేమ్ శశి కిరణ్ తిక్కా దర్శకత్వంలో రూపొందుతున్న మూవీ ''. సోనీ పిక్చర్స్, సూపర్ స్టార్ మహేష్ జీఎంబీ ఎంటర్టైన్మెంట్స్, ఏ ప్లస్ ఎస్ మూవీస్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో టాలెంటెడ్ హీరో హీరోగా నటిస్తున్నాడు. ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ చిత్ర నిర్మాణంలో సూపర్ స్టార్ భాగం కావడం సినిమాపై ఆతృతను పెంచేసింది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు మేకర్స్. 26/11 ముంబై తీవ్రవాద దాడుల్లో వీరమరణం పొందిన మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ జీవిత కథ ఆధారంగా ఈ సినిమా రూపొందుతోంది. చిత్రంలో అడవి శేష్ సరసన శోభితా ధూళిపాళ్ల, బాలీవుడ్ బ్యూటీ సయీ మంజ్రేకర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇందులో శోభితా ధూళిపాళ్ల రోల్ ప‌వ‌ర్‌‌ఫుల్‌‌గా, ఎమోష‌న‌ల్‌‌గా ప్రేక్షకులకు కనెక్ట్ కానుందని తెలుస్తోంది. అయితే తాజాగా ఈ సినిమా జులై 2వ తేదీన విడుదల కానుందని ప్రకటించిన మహేష్ బాబు.. ఆ రోజును 'మేజర్' డే అని తెలపడం గమనార్హం. ఓ వైపు 'మేజర్' సినిమా షూటింగ్ చేస్తూనే ప్రమోషన్స్‌పై దృష్టిపెట్టిన చిత్రయూనిట్.. ఇప్పటికే చిత్ర ఫస్ట్‌లుక్, పలు అప్‌డేట్స్ రిలీజ్ చేసి సినిమాపై హైప్ క్రియేట్ చేశారు. పైగా అడవిశేష్ కెరీర్‌లో ది బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చిన సినిమాల్లో 'మేజర్' ఒకటిగా నిలుస్తుందని రీసెంట్‌గా మహేష్ ఇచ్చిన స్టేట్‌మెంట్ ఈ సినిమాకు మంచి బూస్టింగ్ ఇచ్చింది. తెలుగు, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో ఈ సినిమాను రిలీజ్ చేయబోతున్నారట మేకర్స్.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3a6J2de
v

Thursday 28 January 2021

Sri Reddy: రేయ్ కలలు కనండి కానీ.. మరీ ఇలానా!! పవన్ కళ్యాణ్‌తో డ్యూయెట్.. బాల్స్ షేక్ అంటూ రచ్చ

శ్రీ రెడ్డి.. ఈ పేరు వింటేనే చాలు బోల్డ్ మాటలతో పాటు సంచలనాలు అలా మనసులో మెదులుతుంటాయి. తన సోషల్ మీడియా ఖాతాల్లో అందాల ఆరబోత చేస్తూనే బోల్డ్ కామెంట్స్‌తో పిచ్చెక్కించే ఈ బ్యూటీ.. ఎప్పుడు ఎలాంటి ఆటం బాంబ్ ఎవరిపై విసురుతుందో కూడా అర్థంకాకుండా అటాక్ చేస్తుంటుంది. ముఖ్యంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌పై తనదైన స్టైల్ కామెంట్స్ చేస్తూ వార్తల్లో నిలుస్తుంటుంది. ఈ క్రమంలోనే తాజాగా నెటిజన్లతో కాసేపు ముచ్చటించిన .. పవన్‌తో డ్యూయెట్ అంటూ బోల్డ్ మాటలతో రచ్చ చేసింది. సినిమాలతో దక్కని గుర్తింపు తరచూ వివాదాల్లో నిలుస్తూ సంచలన వ్యాఖ్యలు చేయడం మూలంగా శ్రీ రెడ్డి దక్కించుకుంది. సినీ పెద్దలపై లైంగిక ఆరోపణలు చేస్తూ హైదరాబాద్ ఫిలిం ఛాంబర్ ఎదుట అర్ధనగ్న ప్రదర్శన చేసి అప్పట్లో దేశవ్యాప్తంగా చర్చల్లో నిలిచింది శ్రీ రెడ్డి. క్యాస్టింగ్ కౌచ్ ఉద్యమంతో ఆమె చేసిన రచ్చ అంతాఇంతా అని చెప్పలేం. ఇక ఆ తర్వాత చెన్నైలో మకాం వేసి సోషల్ మీడియా వేదికగా తనలో ఉన్న ఫ్రస్ట్రేషన్ అంతా బయటపెడుతూ బూతు పురాణాలు వినిపిస్తోంది ఈ సంచలన తార. ఏ చిన్న సందర్భం దొరికినా బోల్డ్ ముచ్చట్లతో ప్రతి ఒక్కరి చూపు తనపై పడేలా చేసుకుంటోంది. ఈ మధ్యకాలంలో ఎక్కువగా తన బాడీ, ఎద భాగంపై ఫోకస్ పెడుతూ స్టార్ హీరోయిన్లతో పోల్చుకుంటున్న శ్రీ రెడ్డి.. తాజాగా అదే రిపీట్ చేస్తూ మరోసారి సంచలనం సృష్టించింది. బోల్డ్ లేడీ అంటూ నెటిజన్లు చేస్తున్న కామెంట్స్‌పై రియాక్ట్ అవుతూ.. కొన్ని సందర్భాల్లో బోల్డ్‌గా ఉంటా కానీ ఎప్పుడూ ఉండనని చెప్పింది. అలాగే ఇప్పుడైతే నా టీ షర్ట్ తీయలేనంటూ సెక్సీ కామెంట్ చేసి కాకరేపింది. ఇక పవన్ కళ్యాణ్- శ్రీ రెడ్డి కాంబో చూడాలని ఓ నెటిజన్ అడగడంతో మరింత రెచ్చిపోయింది శ్రీ రెడ్డి. ''రేయ్ కలలు కనండి కానీ.. మరీ ఇలాంటి దారుణమైన దెయ్యం కలలు కనకండి. నా నోట్లోంచి కాంట్రవర్సీ కామెంట్స్ రావాలనే కదా ఈ కామెంట్స్ చేస్తున్నారు. సరే.. ఫన్నీగా తీసుకుందాం. పవన్, నేను ఓ డ్యూయెట్ చేస్తే.. అప్పుడు పవన్ ఫ్యాన్స్ ఫీలింగ్స్..! శ్రీ.. యు ఆర్ సో బ్యూటిఫుల్. ఆగలేక పోతున్నాం.. బాల్స్ షేక్ ఆగం'' అంటూ బోల్డ్ సైగలతో పిచ్చెక్కించింది శ్రీ రెడ్డి. దీంతో శ్రీ రెడ్డి షేర్ చేసిన ఈ చిట్ చాట్ వీడియో నెట్టింట రచ్చరచ్చ చేస్తోంది. ఇక ఈ వీడియోపై వచ్చే కామెంట్స్ అంటారా.. అబ్బో! మాటల్లో చెప్పలేని పదాలు బాబోయ్!!.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3t64fNh
v

దేశభక్తి ప్రధానాంశంగా 'సన్ ఆఫ్ ఇండియా'.. మోహన్ బాబు ఫస్ట్‌లుక్‌ రిలీజ్

దాదాపు నలభై ఏళ్లుగా నటుడిగా, నిర్మాతగా, సమర్పకుడిగా తెలుగు సినీ ఇండస్ట్రీలో సత్తా చాటుతున్న మంచు ఈ మధ్యకాలంలో కాస్త సినిమాల జోరు తగ్గించిన సంగతి తెలిసిందే. కొన్ని నెలలపాటు విరామం తీసుకున్న ఆయన తిరిగి ఓ స్ట్రాంగ్ కథతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. దేశభక్తి ప్రధానాంశంగా రూపొందుతున్న '' మూవీ చేస్తున్నారు మోహన్ బాబు. తాజాగా ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ పోస్టర్ రిలీజ్ చేశారు. శ్రీ ల‌క్ష్మీప్ర‌స‌న్న పిక్చ‌ర్స్‌, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్ట‌రీ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి డైమండ్ ర‌త్న‌బాబు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. మోహన్‌బాబుకు స్టైలిస్ట్‌గా ఆయన కోడలు మంచు విరానికా వ్యవహరిస్తుండగా.. మంచు విష్ణు నిర్మాణ బాధ్యతలు చేపడుతున్నారు. ఇప్పటికే మేజర్ పార్ట్ షూటింగ్ కంప్లీట్ చేసిన చిత్రయూనిట్.. తాజాగా ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌తో ఆకట్టుకుంది. కాషాయం, తెలుపు, ఆకుపచ్చ రంగులతో కూడిన మువ్వన్నెల జెండాపై ఉన్న సినిమా టైటిల్ దేశ ప్రజల ఆదరణ చూరగొంటోంది. ఇక మోహన్ బాబు సీరియస్ లుక్‌లో కనిపిస్తుండటం ఈ సినిమాలో దేశభక్తికి సంబంధించి ఏదో కీలక పాయింట్ చూపించబోతున్నారనే ఫీలింగ్స్ తెప్పిస్తోంది. నిజానికి 'సన్ ఆఫ్ ఇండియా' ఫస్ట్ లుక్ పోస్టర్ గణతంత్ర దినోత్సవ కానుకగా జనవరి 26న విడుదల చేస్తారని అంతా భావించారు కానీ.. అందుకు ఓ మూడు రోజులు ఆలస్యమైనా ఈ పోస్టర్‌ రిలీజ్ చేసి సినిమాపై అంచనాలు పెంచేశారు. ఈ సినిమాకు గౌతంరాజు ఎడిటింగ్ బాధ్య‌త‌లు నిర్వ‌ర్తిస్తుండగా ఇళయరాజా సంగీతం అందిస్తున్నారు. ఇప్పటివరకు చూడని డిఫరెంట్ జానర్ ఇది అని, మోహన్ బాబు నటన అందరినీ ఆకట్టుకుంటూ మంచి మెసేజ్ ఇస్తుందని చెబుతున్నారు యూనిట్ సభ్యులు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3abmrwl
v

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...