Friday 31 July 2020

బ్రేకింగ్: ప్రముఖ దర్శకులు శేఖర్ కమ్ములకు పితృ వియోగం

ప్రముఖ టాలీవుడ్ డైరెక్టర్ ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. ఆయన తండ్రి కమ్ముల శేషయ్య (89) కన్నుమూశారు. ఈ రోజు (శనివారం) ఉదయం 6 గంటలకు ఆయన మరణించినట్లు సమాచారం. వయసు పైబడటంతో గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్న ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈ రోజు సాయంత్రం బన్సీలాల్ పేట స్మశాన వాటికలో ఆయన అంత్యక్రియలు జరపనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ వార్త తెలిసి పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగ‌చైత‌న్య‌, సాయిప‌ల్ల‌వి హీరోహీరోయిన్లుగా 'లవ్ స్టోరీ' సినిమా రూపొందుతోంది. ఈ మూవీ షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి వచ్చిన అప్‌డేట్స్ అన్నీ సినిమాపై భారీ అంచనాలు క్రియేట్ చేశాయి. అతిత్వరలో ఈ 'లవ్ స్టోరీ' చిత్రాన్ని విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2DkR2e6
v

నాగచైతన్య అంటే ఇష్టం ఆ కోరిక తీరితే చాలు.. సమంత ఫీలైతే నాకేంటి? జబర్దస్త్ బ్యూటీ షాకింగ్ కామెంట్స్

బుల్లితెర ఖతర్నాక్ కామెడీ షో ఎంతోమంది కళాకారులకు లైఫ్ ఇచ్చి వారిని ఫేమస్ చేసేసింది. జబర్దస్త్ పంచులతో రెచ్చిపోతున్న కమెడియన్స్ బుల్లితెర ప్రేక్షకులకు ఇస్తున్న వినోదాల విందు అంతకంతకూ రెట్టింపవుతోంది. సరికొత్త గెటప్స్, స్కిట్స్ వేస్తూ జనాలను ఆకట్టుకుంటున్నారు. ముఖ్యంగా జబర్దస్త్ పార్టిసిపెంట్స్‌లో లేడీ గెటప్స్ వేసుకొని ఆడవాళ్ళుగా అలరించిన కమెడియన్స్ అమితంగా పాపులారిటీ కూడగట్టుకున్నారు. ఈ క్రమంలోనే జబర్దస్త్ లేడీ కమెడియన్ వినోదిని పలువురు కమెడియన్స్‌తో ఇంటర్వ్యూలు చేస్తూ ఆసక్తికర విషయాలు రాబడుతోంది. ఇందులో భాగంగా తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో కమెడియన్ (ప్రియాంక) తన మనసులో ఉన్న విషయాలు, సీక్రెట్స్ వెల్లడిస్తూ తెగ సిగ్గుపడింది. లేడీ గెటప్పులో బుల్లితెరపై వినోదాలు పంచిన సాయి తేజ.. ఇప్పుడు ప్రియాంకగా మారి పోయాడు. అంటే ఆడవారిగా మారేందుకు గాను సర్జరీ చేయించుకొని పూర్తి ఆడదానిగా రూపాంతరం చెందాడు. అప్పట్లో ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించాడు. ఈ క్రమంలో లేటెస్ట్ ఇంటర్వ్యూలో యంగ్ హీరో నాగచైతన్యపై ఆమె చూపిన ఇంట్రెస్ట్ జనాలను ఆశ్చర్యంలో ముంచెత్తింది. త్వరలోనే తనను జీరో సైజ్‌లో చూస్తారని చెప్పిన ప్రియాంక.. గుడ్ మోడల్‌లా ఎదగాలనేదే తన డ్రీమ్ అని చెప్పింది. తనకు కన్నడ చిత్రసీమలో ఉన్న పరిచయాలతో తెలుగు, హిందీ, కన్నడ భాషల్లో సినిమా ఛాన్సుల కోసం ప్రయత్నిస్తున్నాని తెలిపింది. ప్రస్తుతం ట్రయల్స్‌లో ఉన్నానని, ఎప్పుడు.. ఎలా.. ఏ రూపంలో అదృష్టం తలుపుతడుతుందో తెలియదని చెప్పింది. Also Read: అయితే.. 'మీకు హీరోయిన్‌గా అవకాశం వస్తే మీ పక్కన ఏ హీరోని సెలెక్ట్ చేసుకుంటారు?' అని వినోదిని ప్రశ్నించగా.. సిగ్గు మొగ్గలేస్తూ నాగచైతన్య, నాని అని చెప్పింది ప్రియాంక. అంతటితో ఆగక తనకు అంటే చాలా ఇష్టమంటూ మెలికలు తిరిగిపోయింది. మరి ఫీల్ కాదా? అని వినోదిని ప్రశ్నించగా.. కానీ నాకేంటి? నేను చేసేది మూవీనే కదా! అని చెప్పింది ప్రియాంక. సో.. చూడాలి మరి ఈ జబర్దస్త్ బ్యూటీ ప్రియాంక (పింకీ) కోరిక ఎప్పుడు నెరవేరుతుందో!.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/39LvQtL
v

అనుష్కకు అస్సలు ఇష్టం లేదట.. అందుకే నో అనేసింది! స్వీటీ భయం అదే..

సౌత్ ఇండియన్ స్టార్ హీరోయిన్ భారీ రెమ్మ్యూనరేషన్ ఆఫర్ కూడా తిరస్కరించిందనే వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కరోనా కారణంగా థియేటర్స్ బంద్ కావడం, ప్రజలంతా ఇంటికే పరిమితం కావడంతో డిజిటల్ వేదికలకు డిమాండ్ పెరిగింది. దీంతో స్టార్ హీరోహీరోయిన్లు, స్టార్ డైరెక్టర్లు సైతం వెబ్ సిరీస్‌లు రూపొందించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఓ భారీ వెబ్ సిరీస్ కోసమై అనుష్కను సంప్రదించగా ఆమె సున్నితంగా 'నో' అనేసిందని తెలుస్తోంది. ప్రస్తుతం ఎంటర్టైన్‌మెంట్ రంగం కొత్త పుంతలు తొక్కుతోంది. ఓటీటీ, డిజిటల్ ప్లాట్‌ఫామ్స్ మాంచి ఫామ్‌లో ఉన్నాయి. ఇప్పటికే పలు చిత్రాలు ఓటీటీ ద్వారా విడుదలై సక్సెస్ అయ్యాయి. అగ్ర తారలు సైతం ఓటీటీ వైపు చూస్తుండటంతో సౌత్ ఇండియన్ క్రేజీ హీరోయిన్ అనుష్కతో భారీ వెబ్ సిరీస్ చేసేలా ప్లాన్ చేసిందట ఓ ఇంటర్నేషనల్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్. వివిధ భాషల్లో ఏకకాలంలో నిర్మితమయ్యే ఈ సిరీస్ కోసం అనుష్క అయితేనే బెటర్ అని భావించిన నిర్మాతలు ఆమెను సంప్రదించి పెద్ద మొత్తంలో రెమ్యునరేషన్ కూడా ఆఫర్ చేశారట. అయినప్పటికీ దానిని ఆమె సున్నితంగా తిరస్కరించినట్లు సమాచారం. Also Read: అయితే అనుష్క ఈ భారీ వెబ్ సిరీస్‌పై ఆసక్తి కనబర్చకపోవడానికి ఆమె భయమే కారణం అనే టాక్ వినిపిస్తోంది. ఓటీటీల్లో విడుదలయ్యే సినిమాల రీచ్ తక్కువగా ఉంటుందని, అలాగే వెబ్ సిరీస్‌ల్లో నటిస్తే పాపులారిటీ తగ్గిపోయే అవకాశం ఉంటుందని ఆమె భావిస్తోందట. ఆ కారణంగానే అనుష్క నో చెప్పిందని అంటున్నారు. కాగా అనుష్క లేటెస్ట్ మూవీ 'నిశ్శబ్దం' ఓటీటీలోనే విడుదల కానుంది. అయితే దీనికి కూడా తప్పని పరిస్థితుల్లో అయిష్టంగానే అనుష్క ఒప్పుకున్నట్లు సమాచారం.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/39ImJKy
v

అదో వ్యసనం.. విరాట్ కోహ్లీ, తమన్నాలను వెంటనే అరెస్ట్ చేయాలి.. హైకోర్టులో పిటిషన్

టీమ్ ఇండియా కెప్టెన్ , టాలీవుడ్ హీరోయిన్ తమన్నాలు వెంటనే అరెస్ట్ చేయాలంటూ మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు కావడం సంచలనంగా మారింది. ఆన్‌లైన్ గ్యాంబ్లింగ్ (జూదం)ను ప్రోత్సహించే ప్రకటనల్లో నటిస్తున్నందుకు గాను వీరిపై పిటిషన్ వేశాడు చెన్నైకి చెందిన ఓ న్యాయవాది. మోసపూరితమైన ఆన్‌లైన్ గేమ్‌లకు ప్రచారం చేస్తూ యువతను వీరు పెడదోవ పట్టిస్తున్నారని తన పిటిషన్‌లో పేర్కొన్నారు. ఆన్‌లైన్ గేమ్ అనేది యువతలో ఓ వ్యసనంగా మారుతోందని, ఆన్‌లైన్ గేముల నిర్వాహకులు భారీగా నగదు, బోనస్‌లు ప్రకటిస్తుండడంతో యువత దీనికి అలవాటు పడి ప్రాణాలు తీసుకుంటోందని ఆవేదన వ్యక్తం చేస్తూ వెంటనే ఆ ఆన్‌లైన్ గ్యాంబ్లింగ్ యాప్స్ అన్నింటినీ నిషేధించాలని సదరు న్యాయవాది కోరారు. అంతేకాదు బాధ్యతారహితంగా వాటిని ప్రమోట్ చేస్తున్న కోహ్లి,తమన్నాలను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. Also Read: ఇటీవల ఓ యువకుడు ఆన్‌లైన్ గేముల కోసం అప్పులు చేసి.. తిరిగి చెల్లించలేక ఆత్మహత్యకు పాల్పడినట్లు తన పిటిషన్‌లో పేర్కొన్నారు. ఇటీవల తమిళనాడులో ఈ తరహా ఆత్మహత్యలు చాలా ఎక్కువైపోయాయని తెలిపారు. అయితే ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన మద్రాస్ హైకోర్టు దీనిపై వచ్చే మంగళవారం విచారణ జరపనున్నట్లు తెలిసింది. కాగా తమపై దాఖలైన ఈ పిటిషన్‌పై కోహ్లి, తమన్నాలు ఇంకా స్పందించలేదు. సో.. చూడాలి మరి వీరిద్దరి విషయంలో హైకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది!.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2EFbDKQ
v

నాకు కరోనా వస్తే.. ఇదే చేస్తా, ప్లాస్మా దాతలకు విజయ్ దేవరకొండ సన్మానం

కరోనా వ్యక్తి నుంచి వ్యక్తి సోకుతుంటే.. కరోనా సోకిన వ్యక్తి కోలుకున్న తరువాత ప్లాస్మా దానం ద్వారా అదే వ్యక్తి ఊపిరిపోసుకుంటున్నాడు. దేశంలో కరోనా కేసులు పెరుగుతున్నప్పటికీ, రికవరీ రేటు ఎక్కువగా ఉండటం ఊరట కలిగించే అంశమే.. ఇక కరోనా వారియర్స్ ప్లాస్మా దానం చేయాలని ప్రభుత్వాలు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్న విషయం తెలిసిందే. దీనిలో భాగంగా.. సెలబ్రిటీలు రంగంలోకి దిగి ప్లాస్మా దానం చేయాలని కోరుతున్నారు. తాజాగా కరోనా ను జయించి కోవిడ్ పేషంట్లకు ప్లాస్మా డొనేట్ చేసిన వారిని హీరో ,సీపీ సజ్జనార్ సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ ఆఫీస్‌లో సన్మానించారు. ఈ సందర్భంగా పోస్టర్‌ను హీరో విజయ్ దేవర కొండ లాంచ్ చేసారు. ఈ మీడియా సమావేశంలో సీపీ సజ్జనార్ మాట్లాడుతూ.. "ప్లాస్మా డొనేట్ చేసిన వారిని అభినందిస్తున్నాను.. ఎన్నో అపోహల మధ్య ఎందరో ప్లాస్మా డొనేట్ చేస్తున్నారు. కరోనా విషయంలో ప్రపంచం మొత్తం ఏకం అవుతుంది.ఒక్క కోవిడ్ పేషెంట్ 500 ఎంఎల్ ప్లాస్మా దానం చేస్తే ఇద్దరు కోవిడ్ పేషేంట్ లను కాపాడ వచ్చు. ఈ రోజు 120 మంది ప్లాస్మా దానం చేశారు. 200 మంది పేషెంట్‌ను కాపాడాము.. ప్లాస్మా దానం చేసిన వారు కారోనా యోధులు.. వాళ్ళు దేవుడితో సమానం. సామాజిక బాధ్యతలో భాగంగా ప్రతి ఒక్కరూ ప్లాస్మా దానం చేయాలి" అన్నారు . చీఫ్ గెస్ట్‌గా హాజరైన హీరో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ.. ‘పోయిన నెల మాకు తెలిసిన వ్యక్తులకు కారోనా వచ్చింది. వారికి ప్లాస్మా అవసరం వచ్చింది.. కానీ ఎక్కడా ప్లాస్మా దాతలు దొరకలేదు. అప్పుడు ప్లాస్మా ప్రాధాన్యత తెలిసింది. ఇంతకు ముందు ప్లాస్మా డొనేట్ చేయాలంటే కన్ఫుజ్ ఉండేది. కానీ ఇప్పుడు donateplasma.scsc.in అనే వెబ్ సైట్ లో లాగిన్ అయితే చాలు. ప్లాస్మా దానం చేస్తే ఇద్దరిని కాపాడిన వారు అవుతారు. రికవరీ అయిన ప్రతి ఒక్కరు ముందుకు వచ్చి ప్లాస్మా దానం చేయాలని కోరుకుంటున్నా. వాక్సిన్ ఎప్పుడోస్తుందో తెలియదు కాబట్టి ఇప్పుడు మన దగ్గరున్న ఆయుధం ఇదొక్కటే. ఒకవేళ నాకు కారోనా వస్తే తప్పకుండా ప్లాస్మా దానం చేస్తా’ అన్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/313PvkJ
v

‘సుశాంత్ ఫ్యూచర్ ప్లాన్లు ఇవీ.. జూన్ 29 నుంచి ఈ పనులు చేద్దామనుకున్నాడు’

బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య చేసుకోవడాన్ని ఆయన కుటుంబ సభ్యులు జీర్ణించుకోలేకపోతున్నారు. సుశాంత్ చనిపోవడానికి అతడి ప్రేయసి రియా చక్రవర్తే కారణమని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. బాలీవుడ్‌లో అతణ్ని ఎదగనీయకుండా కొందరు తొక్కేశారనే ప్రచారమూ జరుగుతోంది. కానీ చదువులో టాపర్, పని పట్ల నిబద్ధత ఉండి.. ఎంతో భవిష్యత్తు ఉన్న సుశాంత్ అనూహ్యం అందర్నీ వదిలి వెళ్లడంతో ఆయన ఫ్యాన్స్ ఇప్పటికీ షాక్‌లోనే ఉన్నారు. సుశాంత్ మరణం, ఆపై పరిణామాలు సుప్రీం కోర్టుకు చేరాయి. రియాపై ఈడీ మనీలాండరింగ్ కేసు నమోదు చేసింది. ఆమెను సుశాంత్ ఫ్యాన్స్ విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. సుశాంత్‌ ప్లాన్స్ గురించి అతడి సోదరి ఓ విజన్ బోర్డును షేర్ చేసింది. జూన్ 29 నుంచి తాను చేయాలనుకున్న పనుల వివరాలను సుశాంత్ వైట్ బోర్డు మీద మార్కర్‌తో రాసి పెట్టుకున్న వివరాలను ఆమె అభిమానులతో పంచుకుంది. ‘‘త్వరగా నిద్రలేవాలి.. పుస్తకాలు చదవాలి, గిటార్ నేర్చుకోవాలి.. మంచి కంటెంట్ ఉన్న సినిమాలు చూడాలి.. జూన్ 29 నుంచి రోజూ వర్కౌట్లు (కసరత్తులు) చేయాలి, ట్రాన్స్‌డెంటల్ మెడిటేషన్ చేయాలి.. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి..’’ అంటూ తను చేయాలనుకున్న పనుల వివరాలను సుశాంత్ రాసుకొచ్చాడు. సుశాంత్ ప్లానింగ్‌లో ఎంతో ముందున్నాడు.. అతడికి న్యాయం చేకూరాలి అని శుక్రవారం రాత్రి శ్వేత సింగ్ కీర్తి ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఈ ఫొటోకు గంట వ్యవధిలోనే 56 వేల లైకులు వచ్చాయి. సుశాంత్ జూన్ 14న ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/30i5Ovb
v

సోనూసూద్ బాటలో తాప్సీ.. ఇంటర్‌లో 94 శాతం మార్కులొచ్చిన అమ్మాయికి సర్‌ప్రైజ్ గిఫ్ట్

ఎవరికైనా ఆపద వస్తే దేవుణ్ని తలుచుకుంటారు. కానీ లాక్‌డౌన్ మొదలైనప్పటి నుంచి మాత్రం వలస కార్మికులు, పేదలు, విదేశాల్లో చిక్కుకుపోయిన వారు సోనూసూద్‌ను అంత కంటే ఎక్కువగా తలుచుకుంటున్నారు. మదనపల్లె రైతుకు ట్రాక్టర్ పంపడం, కూరగాయలు అమ్ముకుంటున్న సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌కు ఉద్యోగం ఇప్పించడం.. ఇలాంటి మంచి పనులు చేస్తూ.. రియల్ హీరో అనిపించుకుంటున్నారు. సోనూసూద్‌ చూపిన మార్గంలో నడవడానికి సెలబ్రిటీలు ఒక్కొక్కరుగా ముందుకొస్తున్నారు. హీరోయిన్ కూడా ఓ మంచి పని చేసి వార్తల్లో నిలిచారు. పీయూసీ పరీక్షల్లో 94 శాతం మార్కులు తెచ్చుకున్న ఓ స్టూడెంట్‌కు పై చదువుల కోసం స్మార్ట్ ఫోన్ అవసరమైంది. ‘నా కూతురికి 94 శాతం మార్కులొచ్చాయి.. కరోనా కారణంగా చదువుకోవాలంటే స్మార్ట్ ఫోన్ అవసరం. సాయం చేయండి ప్లీజ్’ అని అమ్మాయి తండ్రి అభ్యర్థించాడు. ఈ విషయం తెలుసుకున్న ఆమెకు ఐఫోన్ కొనిచ్చారు. అనంతరం తాప్సీ మాట్లాడుతూ.. ‘మరింత మంది అమ్మాయిలు చదువుకోవాలి. ప్రతి చిన్నారి చదువుకోవాలి. మనకు మరింత మంది డాక్టర్లు కావాలి. రేపటి భారతాన్ని మరింత మెరుగైన దేశంగా మార్చడానికి నేను అందించే చిరు సాయం ఇది’ అని వ్యాఖ్యానించారు. కర్ణాటకకు చెందిన ఆ అమ్మాయికి గురువారం ఫోన్ అందింది. కర్ణాటకలోని ప్రొఫెషనల్ కాలేజీల్లో ప్రవేశం కోసం ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసిన ఆమె.. ఇంటికి తిరిగొచ్చే సరికి తాప్సీ కొనిచ్చిన ఫోన్ కనిపించింది. నీట్‌లో మంచి ర్యాంక్ సాధించి ఎంబీబీఎస్ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్న ఆ అమ్మాయి.. తనకు ఐఫోన్ వచ్చిందనే విషయాన్ని నమ్మలేకపోయింది. తాప్సీ మేడం దగ్గర్నుంచి నాకు ఐఫోన్ వచ్చింది.. నమ్మలేకపోతున్నానంటూ ఆనందం వ్యక్తం చేసింది. నీట్‌లో మంచి ర్యాంక్ సాధించడానికి మరింత కష్టపడతాను. మీ ఆశీస్సులు నాకుండాలని కోరుకుంది. తాప్సీ పబ్లిసిటీ కోసమే ఫోన్ కొనిచ్చిందని ఓ వ్యక్తి కామెంట్ చేయగా.. అయితే మీరు కూడా ట్రై చేయండంటూ ఆమె ఘాటైన రిప్లయ్ ఇచ్చారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3gi9KS7
v

నిఖిల్ 20: పెళ్లి తర్వాత బిజీ అవుతున్న నిఖిల్! మరో సినిమా ఫిక్స్

ఇటీవలే తన ఇష్ట సఖి పల్లవిని పెళ్ళాడి ఓ ఇంటివాడైన టాలీవుడ్‌ యంగ్ హీరో సినిమాల పరంగా వేగం పెంచేశాడు. ఈ మ‌ధ్యే ‘అర్జున్ సుర‌వ‌రం’ సినిమాతో హిట్ అందుకొని హుషారుగా ఉన్న ఆయన తన 20వ సినిమా ఫిక్స్ చేశారు. ఈ విషయాన్ని తెలుపుతూ ట్విట్టర్ వేదికగా పోస్ట్ పెట్టారు నిఖిల్. ఎల్ఎల్‌పీ (ఏషియ‌న్ గ్రూప్ యూనిట్‌) బ్యాన‌ర్‌పై నారాయణ్‌దాస్ కె. నారంగ్‌, పుస్కూర్ రామ్మోహ‌న్‌రావు సంయుక్త నిర్మాణంలో ఈ మూవీ రూపొందనుంది. Also Read: సోనాలీ నారంగ్ సమర్పణలో తెరకెక్కనున్న ఈ మూవీ డైరెక్టర్, ఇతర నటీనటుల వివరాలు అతి త్వరలో ప్రకటించనున్నారు. ప్రొడ‌క్ష‌న్ వ్య‌వ‌హారాల‌ను రెయిన్‌బో రీల్స్ చూసుకోనుంది. భారీ బ‌డ్జెట్‌ కేటాయించి ఈ సినిమా నిర్మించనున్నారట. అయితే ఈ మూవీకి సైన్ చేయడం పట్ల తన ఆనందాన్ని వ్యక్తం చేసిన నిఖిల్.. ఈ బ్యానర్‌లో బిగ్ హిట్స్ సాధిస్తామనే నమ్మకముందని తెలిపారు. కాగా ఇప్పటికే చందు మొండేటి ద‌ర్శ‌క‌త్వంలో ‘కార్తికేయ 2’, ప‌ల్నాటి సూర్య‌ప్ర‌తాప్ డైరెక్ష‌న్‌లో '18 పేజెస్' సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. దీంతో పెళ్లి తర్వాత ఒకేసారి మూడు సినిమాలతో నిఖిల్ ప్రేక్షకుల ముందుకు రానుండటం ఆసక్తికరంగా మారింది. ‌


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3hQEEBB
v

మౌనం వీడిన సుశాంత్ ప్రియురాలు.. కీలక వ్యాఖ్యలు చేసిన రియా చక్రవర్తి

బాలీవుడ్ నటుడు ఆత్మహత్య చేసుకొని నెలన్నర దాటినప్పటికీ బాలీవుడ్‌‌లో ఇప్పటికీ చర్చ జరుగుతోంది. సుశాంత్ సూసైడ్ వ్యవహారంలో మనీలాండరింగ్ కేసు నమోదు చేసింది. బిహార్‌లో నమోదైన ఫిర్యాదు ఆధారంగా ఎన్‌పోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఈ కేసు ఫైల్ చేసింది. సుశాంత్ ఖాతా నుంచి అతడి ప్రేయసి రియా చక్రవర్తితోపాటు మరికొందరి బ్యాంకు ఖాతాల్లోకి భారీ మొత్తంలో నగదు బదిలీ అయ్యిందని ఆయన తండ్రి ఆరోపించారు. తన కొడుకును మోసం చేసిందంటూ.. రియా, ఆమె కుటుంబ సభ్యులతోపాటు మరో ఆరుగురిపై బిహార్లో కేసు నమోదు చేశారు. సుశాంత్ కుటుంబ సభ్యులు పలు సెక్షన్ల కింద తనపై బిహార్‌లో పెట్టిన కేసులను ముంబైకి బదిలీ చేయాలని కోరుతూ రియా సుప్రీం కోర్టును ఆశ్రయించారు. తనపై సుశాంత్ కుటుంబం తీవ్ర ఆరోపణలు చేస్తున్న వేళ స్పందించారు. వీడియో స్టేట్‌మెంట్ ద్వారా ద్వారా తన అభిప్రాయాలను వెల్లడించారు. ‘‘నాకు దేవుడి పట్ల, న్యాయ వ్యవస్థ పట్ల అపారమైన నమ్మకం ఉంది. నాకు న్యాయం జరుగుతుందని నమ్ముతున్నా. ఎలక్ట్రానిక్ మీడియాలో నా గురించి భయంకరమైన అంశాలను ప్రసారం చేశారు. కానీ న్యాయ వ్యవస్థ పరిధిలో ఉండటం వల్ల.. లాయర్ల సలహాతో నేనే మాట్లాడదల్చుకోలేదు. సత్యమేవ జయతే’’ అని రియా చక్రవర్తి మాట్లాడారు. బిహార్ నుంచి కేసులను ముంబైకి మార్చాలని సుప్రీం కోర్టులో రియా దాఖలు చేసిన పిటిషన్‌ను అత్యున్నత న్యాయస్థానం ఆగష్టు 5న విచారణకు స్వీకరించే అవకాశం ఉంది. ఎం.ఎస్. ధోనీ ఆటోబయోగ్రఫీ చిత్రంలో నటించిన సుశాంత్.. ధోనీ హావభావాలను అచ్చుగుద్దినట్లుగా దింపేశాడు. క్రికెట్ అభిమానులను సైతం తన ఫ్యాన్స్‌గా మార్చుకున్న సుశాంత్ అనూహ్య రీతిలో జూన్ 14న ముంబైలోని బాంద్రాలో ఉన్న తన అపార్ట్‌మెంట్‌లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2PbXtmn
v

Nandini Rai: తేజ బోల్డ్‌ వెబ్‌ సిరీస్‌! రంగంలోకి బిగ్ బాస్ బ్యూటీ.. ట్విస్టులే ట్విస్టులు

ప్రస్తుతం సిల్వ‌ర్ స్క్రీన్‌కు పోటీగా డిజిట‌ల్ రంగం డెవ‌ల‌ప్ అవుతున్న సంగతి తెలిసిందే. కరోనా కారణంగా థియేటర్స్ మూతపడటంతో ప్రధాన ఎంటర్‌టైన్‌మెంట్ సాధనాలుగా ఓటీటీ వేదికలు ఊపందుకున్నాయి. ఇంట్లోనే కూర్చొని సొంత హోమ్ థియేటర్‌లో ఆన్‌లైన్ తెరపై సినిమాలు చూసేందుకు మక్కువ చూపుతున్నారు ఆడియన్స్. ఈ నేపథ్యంలో వెబ్ సిరీస్‌లకు డిమాండ్ పెరగడం, స్టార్ హీరోహీరోయిన్లు సైతం వెబ్ సిరీస్‌లు చేసేందుకు ఆసక్తి కనబర్చడం లాంటి పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ క్రమంలోనే డైరెక్టర్ చూపు ఈ డిజిటల్ మాద్యమంపై పడిందట. డిజిటల్‌ ఫ్లాట్‌ఫామ్‌ల హవా నడుస్తుండటం చూసిన ఆయన తన క్రియేటివిటీకి పదును పెడుతూ యూత్ ఆడియన్స్ టార్గెట్‌గా ఓ బోల్డ్ వెబ్ సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకు రావాలని ప్లాన్ చేస్తున్నారట. ఈ మేరకు స్క్రిప్ట్ రెడీ చేసుకున్న ఆయన ఏకంగా హాట్ బ్యూటీ, బిగ్ బాస్ ఫేమ్ నందినీ రాయ్‌‌ని రంగంలోకి దించుతున్నట్లు సమాచారం. Also Read: ఆయన రెడీ చేస్తున్న ఈ బోల్డ్ వెబ్ సిరీస్‌లో శృంగార సన్నివేశాలతో పాటు ట్విస్టుల మీద ట్విస్టులు ఉండేలా చేసుకుంటున్నారట. గతంలో ''నువ్వునేను, జయం'' లాంటి సినిమాలతో వెండితెర ప్రేక్షకులకు కొత్త టేస్ట్ చూపించిన తేజ.. ఇప్పుడు ఓటీటీ ట్రెండ్ కూడా క్యాచ్ చేసుకొని తన మార్క్ వేసుకోవాలని బలంగా ఫిక్సయినట్లు ఇన్‌సైడ్ టాక్. మరోవైపు ఇప్పటికే హీరో గోపిచంద్‌తో ‘అలివేలుమంగ వేంకటరమణ’, దగ్గుబాటి రానాతో ‘రాక్షసరాజు రావణాసురుడు’ చిత్రాలను తేజ ప్రకటించారు. సో.. చూడాలి మరి ఆ రెండు సినిమాల కంటే ముందే ఈ వెబ్ సిరీస్ చేస్తారా? లేక వాటితో పాటే సెట్స్ మీదకు వస్తారా? అనేది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3hSdY3m
v

Jersey Movie: నానికి అరుదైన గుర్తింపు.. అంతర్జాతీయ చిత్రోత్సవానికి ‘జెర్సీ’

నేచురల్ స్టార్ నానికి అంతర్జాతీయ గుర్తింపు లభించింది. అంతర్జాతీయ చిత్రోత్సవానికి నటించిన 'జెర్సీ' చిత్రం ఎంపికైంది. నాని నటనా ప్రతిభకు నిదర్శనంగా నిలిచిన చిత్రం ఇంటర్నేషనల్ ఇండియన్ టొరంటో ఫిలిం ఫెస్టివల్‌లో ప్రదర్శనకు ఎంపికైంది. ఆగష్టు 9 నుంచి 15 వరకూ జరిగే ఈ అంతర్జాతీయ చలనచిత్రోత్సవాల్లో ‘జెర్సీ’ చిత్రం ప్రదర్శన కానుంది. 2019 ఏప్రిల్ 19 విడుదలైన జెర్సీ చిత్రం.. నానిని నటుడిగా మరో మెట్టు ఎక్కించింది. నాని, శ్రద్ధా శ్రీనాథ్ హీరో హీరోయిన్లుగా నటించారు. తన తండ్రిని హీరోగా చూడాలని కోరుకున్న ఓ కొడుకు చెప్పే కథే ‘జెర్సీ’. ‘జెర్సీ’ కథ వందలో సక్సెస్ అయిన ఒక్కడిది కాదు. సక్సెస్ అవ్వకపోయినా ప్రయత్నిస్తూ మిగిలిపోయిన 99 మందిది. ఈ చిత్రంలో నాని కొడుకుగా రోనిత్ అద్భుతమైన పాత్రను పోషించారు. సత్యరాజ్, రావు రమేష్, ప్రవీణ్ తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు. ‘మళ్లీ రావా’ వంటి ఫీల్ గుడ్ మూవీతో దర్శకుడిగా ప్రశంసలు దక్కించుకున్న గౌతమ్ తిన్ననూరి క్రికెట్ నేపథ్యంలో జర్నీని ‘జెర్సీ’గా ప్రేక్షకులకు అందించారు. సితార ఎంటర్ టైన్మెంట్స్‌లో సూర్యదేవర నాగ వంశీ ఈ చిత్రాన్ని నిర్మించారు. సోనూ జాన్ సినిమాటోగ్రఫీ అందించగా.. అనిరుధ్ మ్యూజిక్ ఈ సినిమాకి ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఇక ఈ ఇంటర్నేషనల్ ఇండియన్ టొరంటో ఫిలిం ఫెస్టివల్‌లో నాని ‘జెర్సీ’తో పాటు.. కార్తీ నటించిన ‘ఖైదీ’, సూపర్ 30 సినిమాలు ఎంపికయ్యాయి.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/313AhfM
v

అల్లు అర్జున్ 21: బన్నీ అభిమానులను హుషారెత్తించే అప్‌డేట్.. ఆ డైరెక్టర్‌తో కన్ఫర్మ్

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, టాలెంటెడ్ డైరెక్టర్ కాంబోలో ఓ మూవీ రాబోతున్నట్లు ఎప్పటినుంచో వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ విషయాన్ని కన్ఫర్మ్ చేస్తూ అభిమానులను హుషారెత్తించే అప్‌డేట్ ఇచ్చారు మేకర్స్. బన్నీ కెరీర్‌లో 21వ సినిమాగా ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుందని తెలుపుతూ అఫీషియల్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్‌లో ఇద్దరు వ్యక్తులు నది ఒడ్డున నిలబడి అవతల ఒడ్డున ఉన్న ఊరిని చూస్తూ కనిపిస్తున్నారు. ఈ మేరకు తన తదుపరి సినిమా విశేషాలు తెలుపుతూ ఎక్జైట్ అయ్యారు అల్లు అర్జున్. ''నా తదుపరి చిత్రం కొరటాల శివ గారితో చేస్తుండటం చాలా ఆనందంగా ఉంది. కొంతకాలంగా దీని కోసమే ఎదురుచూస్తున్నాను. సుధాకర్‌ గారి మొదటి ప్రాజెక్టుకు నా శుభాకాంక్షలు. శాండి, స్వాతి, నట్టి ఇది మీ పట్ల నాకున్న ప్రేమను చూపించే మార్గం'' అని పేర్కొంటూ ట్వీట్ చేశారు. ఈ చిత్రంతో సుధాకర్‌ మిక్కిలినేని నిర్మాతగా సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇస్తుండటం విశేషం. Also Read: యువ సుధా ఆర్ట్స్‌, జీఏ2 పిక్చ‌ర్స్ ప‌తాకాల‌పై రూపొందనున్న ఈ చిత్రానికి శాండీ, స్వాతి, నట్టీలు సహ నిర్మాతలుగా వ్యవహరించనున్నారు. సామాజిక అంశాలతో భారీ యాక్షన్ ఎంటర్టైనర్‌గా ప్యాన్ ఇండియా లెవల్లో ఈ మూవీ రూపొందనుందని టాక్. ఈ సినిమాను 2022 ప్రథమార్థంలో విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు. కాగా ప్రస్తుతం అల్లు అర్జున్ తన 20వ మూవీ 'పుష్ప' చేస్తుండగా, డైరెక్టర్ కొరటాల శివ.. చిరంజీవి హీరోగా 'ఆచార్య' సినిమా రూపొందిస్తున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/315YvGc
v

Allu Arjun: మేమంతా ఈ స్థాయిలో ఉన్నామంటే కారణం ఆయనే.. అల్లు అర్జున్ ఎమోషనల్ పోస్ట్

తెలుగు చిత్ర పరిశ్రమలో తిరుగులేని ప్రస్థానం దివంగత అల్లు రామలింగయ్యది. దాదాపు పన్నెండు వందల సినిమాలలో నటించిన ఘనత ఆయన సొంతం. ఆ రోజుల్లో వెండితెరపై నవ్వులు పూయించడంలో అల్లు రామలింగయ్యను మించిన యాక్టర్ లేడని చెప్పడంలో అతిశయోక్తి లేదు. రొటీన్ కామెడీని తన మార్క్ హాస్యం జోడిస్తూ తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారాయన. దాదాపు 50 ఏళ్ల పాటు తన నటనతో కితకితలు పెట్టించి నవ్వించిన ఆయన 1990లో భారత ప్రభుత్వం నుంచి పద్మశ్రీ అందుకున్నారు. 1929 అక్టోబర్ 1వ తేదీన పాలకొల్లులో జన్మించిన 2004 సంవత్సరంలో సరిగ్గా ఇదే తేదీ (జులై 31వ తేదీ) ఈ లోకం విడిచి వెళ్లారు. అయితే ఈ రోజు సందర్భంగా తన తాతయ్యను గుర్తుచేసుకుంటూ ఎమోషనల్ పోస్ట్ పెట్టారు స్టైలిష్ స్టార్ . ''తాతయ్య మమ్మల్ని వదిలివెళ్లిన ఈ రోజు నాకు గుర్తుంది. ఆయన గురించి అప్పటి కంటే ఇప్పుడు చాలా తెలుసుకున్నాను. నాకు అనుభవం వచ్చేకొద్దీ ఆయన పడిన కష్టాలు, కృషి, పట్టుదల ప్రయాణం ఏంటనే విషయం అర్థమైంది. ఓ పేద రైతు కుటుంబం నుంచి వచ్చిన ఆయనకు సినిమాపై ఉన్న మక్కువ కారణంగానే మేమంతా ఈ రోజు ఈ స్థానంలో ఉన్నాం'' అని పేర్కొన్నారు అల్లు అర్జున్. ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న 'పుష్ప' సినిమాలో నటిస్తున్నారు అల్లు అర్జున్. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ మూవీలో బన్నీ సరసన రష్మిక మందన హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ మూవీపై ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3jZrhRx
v

Rashmi Gautam: ఆ గదిలో రష్మీ, సుడిగాలి సుధీర్ రొమాంటిక్ డోస్.. అందరూ చూస్తుండగానే స్టెప్పులతో రచ్చ రచ్చ!

రష్మీ- ఈ జోడీ పేరు వింటేనే జనం ఎక్కడికో వెళ్లిపోతుంటారు. వెంటనే వారి రొమాంటిక్ విషయాలు గుర్తు చేసుకుంటూ ఊహల్లో తేలిపోతుంటారు. ఏ యూట్యూబ్ ఛానెల్‌లో చూసినా రష్మీ- సుధీర్ రొమాంటిక్ సంగతులకు యమ డిమాండ్ ఉంటుంది. ఇక ఆన్‌స్క్రీన్ రొమాన్స్‌ లోనూ రష్మీ-సుధీర్ పర్‌ఫార్‌మెన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గతంలో ఎన్నోసార్లు ఆన్‌స్క్రీన్ రొమాన్స్‌ చేసి పిచ్చెక్కించిన ఈ జోడీ తాజాగా మరోసారి తమ స్టెప్పులతో రచ్చ రచ్చ చేసింది. రష్మీ-సుధీర్ పర్‌ఫార్‌మెన్స్‌కి ఉన్న డిమాండ్ దృష్ట్యా పలు కార్యక్రమాల్లో వారిద్దరితో డాన్స్ చేయించి ప్రేక్షకులను హుషారెత్తిస్తుంటారు షో నిర్వాహకులు. ఈ క్రమంలోనే తాజాగా విడుదల చేసిన వీడియోలో 'బుట్టబొమ్మ' సాంగ్‌కి స్టెప్పులేస్తూ అందరూ చూస్తుండగానే ఫుల్లుగా రెచ్చిపోయారు రష్మీ-సుధీర్. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. 'అల.. వైకుంఠపురములో' సినిమాలో పాటపై అల్లు అర్జున్, పూజా హెగ్డే వేసిన స్టెప్పులు ఖండాలు దాటిపోయాయి. ఎందరో సెలబ్రిటీలు ఈ పాటపై స్టెప్పులేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. తాజాగా రష్మీ-సుధీర్ జోడీ ఇదే పాటపై డాన్స్ చేస్తూ తమ రొమాంటిక్ యాంగిల్ బయటపెట్టారు. వీరి రొమాంటిక్ ఫీల్‌కి తగ్గట్టుగా పూల గది అరేంజ్ చేసి బుల్లితెర ఆడియన్స్‌కి స్పెషల్ కిక్ ఇచ్చారు ఢీ షో నిర్వాహకులు. అప్పట్లో ఓ కార్యక్రమంలో వేదికపై , సుధీర్ పెళ్లి కూడా చేసేసిన సంగతి తెలిసిందే. ఆ వీడియో నెట్టింట సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇక అప్పటినుంచి రష్మీ-సుధీర్ రొమాంటిక్ ట్రాక్, పెళ్లి సంగతులు ప్రేక్షకులను ఫుల్లుగా ఎంటర్‌టైన్ చేస్తున్నాయి. అయితే తమ ప్రేమ సంగతులపై వచ్చే వార్తలపై ఇటీవలే స్పందించిన రష్మీ, సుధీర్.. అలాంటి వాటిని పట్టించుకోమని, వారు కూడా బతకాలి కదా అనడం గమనార్హం.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2X9IE8g
v

షాకింగ్.. వనిత విజయ్ కుమార్‌పై మరో కేసు.. మూడో పెళ్లి తర్వాత వరుస వివాదాల్లో హీరోయిన్!

సీనియర్ నటులు మంజుల, విజయ్ కుమార్ దంపతుల పెద్ద కూతురు ముచ్చటగా మూడో పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఇటీవలే వనిత మూడో భర్తగా పీటర్ పాల్ అనే వ్యక్తి ఆమె జీవితంలోకి ఎంటర్ అయ్యాడు. అయితే వీరి వివాహం జరిగిన మరునాడే ఈ కొత్త జంటపై నమోదు కావడంతో అంతా షాకయ్యారు. తనకు విడాకులు ఇవ్వకుండానే తన భర్త పీటర్ పాల్.. వనితను పెళ్లి చేసుకున్నాడంటూ పీటర్ మొదటి భార్య ఎలిజిబెత్ హెలెన్ కేసు పెట్టింది. అయితే ఈ వ్యవహారం ఇంతటితో ఆగకుండా వనిత విజయ్ కుమార్‌పై వరుసపెట్టి పోలీస్ కేసులు నమోదవుతుండటం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. వనిత మూడో పెళ్లి చేసుకోవడం సినీ వర్గాల్లో హాట్ టాపిక్ కావడంతో పలు మీడియా ఛానెల్స్ ఆమెతో చర్చా వేదికలు నిర్వహించాయి. ఈ క్రమంలో ఓ టీవీ ఛానల్ చర్చా కార్యక్రమంలో పాల్గొన్న వనిత.. సినీ నటి,దర్శకురాలు లక్ష్మీ రామకృష్ణన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసింద. నీకు ఒక్క భర్త ఉంటే మాత్రం ఏమన్నా పతివ్రతావా అంటూ ఆమెపై రెచ్చిపోయింది. దీంతో వనితపై పోలీస్ కేసు పెట్టింది లక్ష్మీ రామకృష్ణన్. Also Read: ఇలా ఇప్పటికే వనితపై రెండు పోలీస్ కేసులు నమోదు కాగా.. తాజాగా ఆమె నివాసం ఉంటున్న అపార్ట్‌మెంట్ ప్రెసిడెంట్ కూడా పోలీసులకు ఫిర్యాదు చేయడం హాట్ ఇష్యూగా మారింది. కరోనా సమయంలో ఎక్కువమంది జనాలను పిలిచి వేడుక చేసుకోవడంతో పాటు అడిగితే దురుసుగా వ్యవహరిస్తోందంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారాయన. దీంతో మూడో పెళ్లి తర్వాత వనిత విజయ్ కుమార్ వ్యవరిస్తున్న తీరుపై జనాల్లో చర్చలు ముదిరాయి. మరోవైపు వనిత విజయ్ కుమార్- లక్ష్మీ రామకృష్ణన్‌ల మధ్య చెలరేగిన వివాదం మరింత ముదిరింది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3hRxNYp
v

Thursday 30 July 2020

టాలీవుడ్‌లో కూడా ఉంది.. ఇండస్ట్రీపై ఇలియానా సంచలన వ్యాఖ్యలు.. ఇష్యూ వైరల్

బాలీవుడ్ యువ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య తర్వాత సినీ ఇండీస్ట్రీలో నెపోటిజంపై వాదనలు తీవ్రమయ్యాయి. ఎందరో సినీ నటులు ఇండస్ట్రీలో బంధు ప్రీతి ఉందని, ఆ కారణంగా తమకు అవకాశాలు దక్కడం లేదని వాపోతున్నారు. ముఖ్యంగా బాలీవుడ్‌ యాక్టర్స్ ఎక్కువగా ఈ అంశాన్ని లేవనెత్తుతున్నారు. ఈ నేపథ్యంలో గోవా బ్యూటీ టాలీవుడ్ లోనూ నెపోటిజం ఉందంటూ సంచలన కామెంట్స్ చేయడం ఫిలిం నగర్ సర్కిల్స్‌లో చర్చనీయాంశంగా మారింది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఇలియానా.. టాలీవుడ్ మొత్తాన్ని నెపోటిజం నడిపిస్తోందంటూ సంచలన ఆరోపణలు చేసింది. కొత్త నటీనటులను, బయటనుంచి వచ్చిన వాళ్ళను ఇక్కడ ఎదగనీయరని ఈ గోవా బ్యూటీ చెప్పడం జనాల్లో హాట్ ఇష్యూగా మారింది. దీంతో ఇలియానాపై ఒక్కసారిగా సోషల్ మీడియాలో ట్రోల్స్ మొదలయ్యాయి. ఆమె చేసిన ఈ వ్యాఖ్యలపై టాలీవుడ్ ప్రేక్షకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 'నిజంగానే టాలీవుడ్‌లో కొత్తవారిని ఎదగనీయకపోతే మరి నువ్వు ఎలా స్టార్ హీరోయిన్ అయ్యావు?' అని ప్రశ్నిస్తూ ఆమెపై ఫైర్ అవుతున్నారు నెటిజన్లు. Also Read: పలు సూపర్ డూపర్ హిట్స్ ఖాతాలో వేసుకొని టాలీవుడ్‌లో స్టార్ స్టేటస్ పట్టేశాక బాలీవుడ్ బాట పట్టిన ఇల్లీ బేబీ అక్కడ కొన్ని సినిమాలు చేసి.. తిరిగి టాలీవుడ్ వంక చూస్తోంది. ఈ మేరకు ఇటీవలే రవితేజ సరసన 'అమర్ అక్బర్ ఆంటోనీ' సినిమాలో నటించి అందాలు ఆరబోసింది. ప్రస్తుతం ఈ అమ్మడికి నాగార్జున సరసన నటించే మరో అవకాశం దక్కిందని తెలుస్తోంది. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో నాగార్జున హీరోగా రాబోతున్న కొత్త సినిమాలో ఇలియానాకు ఛాన్స్ ఇచ్చారని టాక్. ఇలాంటి పరిస్థితుల్లో టాలీవుడ్‌లో నెపోటిజం ఉందంటూ ఇలియానా కామెంట్ చేయడం ఎంతవరకు సబబో ఆమెకే తెలియాలి!.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2D4EuI2
v

భయం భయంగా బ్రతకాల్సిన పరిస్థితి.. భవిష్యత్తులో ఇంకెన్ని చూడాలో! రకుల్ ప్రీత్ సింగ్ ఆవేదన

కరోనా ఉదృతి నేపథ్యంలో ప్రస్తుతం దేశంలో ఉన్న పరిస్థితులు తీవ్ర భయాందోళనలకు గురి చేస్తున్నాయి. 2020 ఆరంభం నుంచే కరోనా విజృంభణ కొనసాగుతుండటంతో ప్రజల ఆర్ధిక స్థితిగతులు ఛిద్రమయ్యాయి. నేటికీ కరోనా కల్లోలానికి బ్రేకులు పడకపోతుండటంతో జనం వణికిపోతున్నారు. ఈ నేపథ్యంలో యంగ్ హీరోయిన్ తాజా పరిస్థితులపై స్పందిస్తూ ప్రతి రోజూ భయం భయంగా బ్రతకాల్సిన సిచువేషన్ నెలకొందని పేర్కొంది. 2020 సంవత్సరమంతా ఇబ్బందులతోనే కొనసాగుతోందని తెలుపుతూ ఆవేదన వ్యక్తం చేసింది. కాగా ఈ కరోనా వైరస్ మనకు ఎన్నో పాఠాలను నేర్పిందని చెప్పిన రకుల్.. అందరం కూడా స్వీయ రక్షణను, కోవిడ్ నిబంధనలను పాటిస్తూ కరోనాను ఎదుర్కొనే ప్రయత్నం చేద్దామని సూచించింది. అంతేకాకుండా భవిష్యత్తులో మరిన్ని విపత్తులు, రోగాలు, యుద్దాలను చూసే అవకాశాలున్నాయని, అయినా కూడా ఎలాంటి ఆపదలు మన దరికి చేరవనే నమ్మకంతో, ధైర్యంతో జీవిద్దామని ఆమె తెలిపింది. అందరూ ఇంటి వద్దనే ఉండి తగు జాగ్రత్తలు తీసుకుంటూ కరోనాను తరిమి కొట్టాలని ఆమె కోరింది. Also Read: గత కొంతకాలంగా టాలీవుడ్‌లో రకుల్ హంగామా తగ్గిపోయిన సంగతి తెలిసిందే. గతేడాది 'మన్మథుడు 2' సినిమాలో కనిపించిన ఈ అమ్మడు ఆ తర్వాత మరే సినిమా చేయలేదు. ప్రస్తుతం చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో నితిన్ సరసన ఓ సినిమాలో నటిస్తున్న ఆమె.. తాజాగా దర్శకత్వంలో ఓ వెబ్ సిరీస్ ఓకే చేసిందనే వార్తలు వస్తున్నాయి. ఫీమేల్ ఓరియెంటెడ్ సబ్జెక్ట్ కావడంతో కథ వినగానే ఆమె రెడీ అనేసిందట. ఆహా ఓటీటీ వేదికపై ఈ వెబ్ సిరీస్ విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారట క్రిష్.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3jVhdZC
v

హీరో పేరు వాడేస్తూ నయా మోసం.. పోలీసులను ఆశ్రయించిన శరత్ కుమార్

పెరుగుతున్న టెక్నాలజీని తమకు అనువుగా వాడుకుంటూ నయా మోసాలకు పాల్పడుతున్నారు సైబర్ నేరగాళ్లు. సామాజిక మాధ్యమాలు, ఆన్ లైన్ వేదికలు ఉపయోగిస్తూ ఎదుటి వ్యక్తిని బురిడీ కొట్టించి లక్షలు, కోట్లలో సొమ్ము కాజేస్తున్నారు. ఈ మధ్యకాలంలో ఇలాంటి సంఘటనలు ఎక్కువగా చూస్తున్నాం. జనం వీక్‌నెస్ క్యాష్ చేసుకుంటూ సినీ ఇండస్ట్రీ, సెలెబ్రిటీల పేర్లతో భారీ సొమ్ము వసూలు చేస్తున్నారు. ఇటీవలే సింగర్ సునీత పేరుతో ఓ వ్యక్తి మోసాలకు పాల్పడుతున్నట్లు వెలుగులోకి రాగా.. తాజాగా కోలీవుడ్ నటుడు పేరు వాడుతూ ఓ వ్యక్తి అక్రమంగా వసూళ్లకు పాల్పడుతున్నట్లు తెలిసింది. శ‌ర‌త్ కుమార్ ‘అఖిల భార‌త స‌మ‌త్తుల మక్కల్ క‌ట్చి’ పేరుతో ఓ పార్టీని స్థాపించిన సంగ‌తి తెలిసిందే. ఈ పార్టీ పేరు చెప్పి ఓ సాఫ్ట్‌వేర్ ఇంజ‌నీర్ ఆన్‌లైన్ మోసాలకు పాల్పడుతున్నారట. ఈ విషయం శరత్ కుమార్ దృష్టికి రావడంతో వెంటనే అలర్ట్ అయిన ఆయన, స్వయంగా తానే రంగంలోకి దిగి ఆ వ్య‌క్తి వివరాలు ఆరాదీసి అతనితో ఫోన్‌లో మాట్లాడి హెచ్చరించారు. అతను కోవైకి చెందిన సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ అని తెలిసి.. అనంతరం పోలీసులను ఆశ్రయించారు శరత్ కుమార్. ఈ మేరకు చెన్నై పోలీస్‌కమిషనర్‌‌కు తన ఫిర్యాదు అందించారు. Also Read: ఈ మధ్యకాలంలో సామాజిక మాధ్యమాలు విస్తృతం కావడంతో సెల‌బ్రిటీల పేరు చెప్పి మోసం చేస్తున్న ఉదంతాలు ఎక్కువగా బయటపడుతున్నాయి. ఈ నేపథ్యంలో పోలీసులు అవ‌గాహ‌న కార్య‌క్ర‌మాలు చేప‌డుతున్నారు. ప్ర‌జ‌లు కూడా త‌మ వంతు బాధ్య‌త‌గా జాగ్ర‌త్త ప‌డాల్సిన అవ‌స‌రం ఉందని చెబుతున్నారు. ఏ మాత్రం అనుమానం వచ్చినా పోలీసులను ఆశ్రయించాలని అంటున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2BIgeuu
v

Aadhi Pinisetty: హీరోయిన్‌తో ఆది పినిశెట్టి డేటింగ్.. సీక్రెట్‌గా పెళ్లికి రెడీ అయిన యువ జోడీ!!

తెలుగు చిత్రసీమలో ఈ ఏడాది నటీనటుల పెళ్లి వార్తలు ఎక్కువగానే చూస్తున్నాం. ఇప్పటికే యంగ్ హీరోలు నిఖిల్, నితిన్ పెళ్లి చేసుకొని ఇంటి వాళ్ళు కాగా దగ్గుబాటి రానా, కొణిదెల నిహారిక పెళ్ళికి సిద్ధంగా ఉన్నారు. అయితే తాజాగా ఫిలింనగర్ సర్కిల్స్‌లో వినిపిస్తున్న సమాచారం మేరకు వారి బాటలోనే మరో యంగ్ హీరో కూడా నడుస్తున్నారని తెలుస్తోంది. ఇంతకాలం తాను డేటింగ్ చేసిన హీరోయిన్‌నే తన సతీమణిగా పొందేందుకు సిద్ధమయ్యారని సమాచారం. Also Read: కోలీవుడ్, టాలీవుడ్ ఇండస్ట్రీలో విల‌క్ష‌ణ నటుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు ఆది పినిశెట్టి. గ‌త కొంతకాలంగా హీరోయిన్ నిక్కీ గ‌ల్రానితో ఆయన డేటింగ్‌లో ఉన్నట్లు కోలీవుడ్‌లో వార్త‌లు వినిపించాయి. కానీ ఆ వార్త‌ల‌పై ఆది స్పందించలేదు. ఈ క్రమంలో లేటెస్ట్ సమాచారం ప్రకారం ఆమెనే వివాహం చేసుకునేందుకు ఆయన రెడీ అయ్యారని తెలుస్తోంది. ప్ర‌ముఖ హీరోయిన్ సంజ‌న సోద‌రినే నిక్కీ గ‌ల్రానీ. ఆమె తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో పలు సినిమాల్లో నటించి గుర్తింపు పొందింది. ఆది పినిశెట్టి, నిక్కీ గ‌ల్రానీ కలిసి `మలుపు`, `మరకతమణి` చిత్రాల్లో నటించారు. ఈ క్రమంలోనే వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించి కొంతకాలం డేటింగ్ చేసినట్లు చెప్పుకుంటున్నారు. ఇటీవల ఆది పినిశెట్టి తండ్రి రవిరాజా పినిశెట్టి బర్త్‌డే వేడుకల్లో కూడా నిక్కీ కనిపించడంతో వీరిద్దరి మధ్య రిలేషన్ నడుస్తుందనే వార్తలకు బలం చేకూరింది. ఇకపోతే తమ ప్రేమ వ్యవహారాన్ని ఇన్నాళ్లు సీక్రెట్‌గా ఉంచిన ఈ జోడీ లాక్‌డౌన్ ఫినిష్ కాగానే పెళ్లి బంధంతో అఫీషియల్‌ చేయాలని చూస్తున్నట్లు కోలీవుడ్ టాక్.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2Etj9Iu
v

రియల్ ఎస్టేట్ స్కామ్: కోట్లు కోల్పోయిన నయనతార, రమ్యకృష్ణ?

ఒక అక్రమ రియల్ ఎస్టేట్ కంపెనీ చేతిలో ప్రముఖ నటీమణులు , మోసపోయినట్టు సమాచారం. అలాగే, భారత దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ భార్య అంజలీ టెండూల్కర్ కూడా అదే కంపెనీ చేతిలో మోసపోయారట. ఈ రియల్ ఎస్టేట్ కంపెనీ చేసిన స్కామ్ వల్ల ఈ ముగ్గురు సెలబ్రిటీలతో పాటు మరికొంత మంది ప్రముఖులు కోట్ల రూపాయలు కోల్పోయినట్టు తెలిసింది. ఒక ప్రముఖ రియల్ ఎస్టేట్ కంపెనీ దేశ వ్యాప్తంగా ఉన్న వీవీఐపీలకు కొన్ని ఎకరాల స్థలాన్ని విక్రయించిందని ఆరోపణలు వస్తున్నాయి. మంచి వ్యవసాయ భూములను ఈ రియల్ ఎస్టేట్ కంపెనీ అక్రమంగా సొంతంగా చేసుకుని విక్రయించిందని సమాచారం. Also Read: ఆ రియల్ ఎస్టేట్ కంపెనీ సేకరించిన భూముల్లో బహుళ అంతస్తుల భవనాలు, గేటెడ్ కమ్యూనిటీస్ నిర్మించడానికి ప్లాన్ చేశారట. అయితే, వ్యాపార భాగస్వాముల మధ్య విభేదాలు రావడంతో ఈ నిర్మాణాలను ఆపేశారని సమాచారం. ఈ గొడవల్లో అసలు ఆ కంపెనీ సేకరించిన స్థలం వ్యవసాయ భూమి అని బయటపడింది. ఈ స్థలంలో భవనాలు నిర్మించడానికి ఆ కంపెనీ ఎలాంటి అనుమతులు తీసుకోలేదని అధికారుల దృష్టికి వచ్చింది. ఈ భూములను ఎకరం లక్ష రూపాయలకు కొనుగోలు చేసిన సదరు కంపెనీ సెలబ్రిటీలకు రూ. 10 కోట్లకు విక్రయించిందని ఆరోపణలు వస్తున్నాయి. Also Read: రమ్యకృష్ణ, నయనతార కోట్ల రూపాయలు నష్టపోయారనే వార్త ప్రస్తుతం తమిళ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. రెవెన్యూ అధికారులు ఇప్పటికే సదరు రియల్ ఎస్టేట్ కంపెనీకి లీగల్ నోటీస్ పంపినట్టు తెలిసింది. అయితే, ఈ కంపెనీ చేతిలో తాము మోసపోయినట్టు నయనతార, రమ్యకృష్ణ ఇంకా అధికారికంగా వెల్లడించలేదు. వీళ్ల డబ్బులను ఆ కంపెనీ తిరిగి ఇచ్చిందా అనే విషయంలోనూ క్లారిటీ లేదు. దీనిపై త్వరలోనే స్పష్టత వస్తుందని సమాచారం.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2Xeruqd
v

నాని హీరోయిన్ హాట్ పిక్: షర్ట్ ఓకే.. ప్యాంట్ ఏది బేబీ!!

హీరోయిన్ అను ఇమ్మానుయేలు గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరంలేదు. నేచురల్ స్టార్ నాని ‘మజ్ను’ సినిమా ద్వారా టాలీవుడ్‌కు పరిచయమైన ఈ ఎన్‌ఆర్ఐ బ్యూటీ.. తొలి చిత్రంతోనే ప్రేక్షకులను ఆకట్టుకుంది. క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌తో కట్టిపడేసింది. ఆ తరవాత ‘కిట్టు ఉన్నాడు జాగ్రత్త’, ‘ఆక్సిజన్’, ‘అజ్ఞాతవాసి’, ‘నా పేరు సూర్య’ చిత్రాల్లో నటించింది. అను చివరిగా 2018లో వచ్చిన ‘శైలజారెడ్డి అల్లుడు’ చిత్రంలో అక్కినేని నాగచైతన్య సరసన కనిపించింది. ప్రస్తుతం ‘అల్లు అదుర్స్’ సినిమాలో బెల్లంకొండ శ్రీనివాస్‌కు జంటగా నటిస్తోంది. Also Read: వెండితెరపై తన అందం, అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకునే అను ఇమ్మానియేలు.. సోషల్ మీడియాలో కూడా అందాలు ఆరబోస్తూ ఉంటుంది. ముఖ్యంగా ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో టచ్‌లో ఉంటూ ఎప్పటికప్పుడు హాట్ ఫొటోలు షేర్ చూస్తూ ఉంటుంది. ఆమెకు ఇన్‌స్టాగ్రామ్‌లో 1.3 మిలియన్ ఫాలోవర్లు ఉన్నారు. వీరితో ఎప్పటికప్పుడు అప్‌డేటెడ్‌గా ఉంటుంది అను. ఈ క్రమంలో తాజాగా ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో హాట్ ఫొటో ఒకటి పోస్ట్ చేసింది. ఈ ఫొటోలో ఆమె కేవలం షర్ట్ మాత్రమే ధరించింది. కింద ప్యాంట్ లేదు. నిజానికి ఇదొక ఫ్యాషన్. దీన్ని వోవెన్ షర్ట్ డ్రెస్ అంటారట. అయితే, ఈ డ్రెస్‌లో అను చాలా హాట్‌గా కనిపిస్తోంది. కిచెన్‌లో చేతిలో టీ కప్పు పట్టుకుని హాట్ పోజులో ఈ ఫొటో దిగింది అను. ఈ పోస్టుకు ‘2 ఏఎం టీ టైమ్’ అని క్యాప్షన్ పెట్టింది. అంటే, ఉదయం రెండు గంటలకు టీ తాగుతుందన్న మాట. కాగా, ఈ ఫొటోకు ఫాలోవర్ల నుంచి విపరీతమైన స్పందన వస్తోంది. ఇప్పటికే 2 లక్షలకు పైగా లైక్స్ వచ్చాయి. ఇక కామెంట్ల గురించి అయితే చెప్పాల్సిన అవసరం లేదు. మొత్తానికి అను ఈ హాట్ ఫొటోతో ఇన్‌స్టాగ్రామ్ టెంపరేచర్ పెంచేసింది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/30ePpYp
v

మహేష్ బాబుకి ఇష్టమైన గుత్తి వంకాయ్ పలావ్.. ప్రతిరోజూ ఈ రెస్టారెంట్‌ నుంచే!

సూపర్ స్టార్ వయసు చెప్తే నమ్మరు కాని... ఆయన మరో ఐదేళ్లలో హాఫ్ సెంచరీకి చేరువవుతున్నారు. 1975 ఆగష్టు 9న పుట్టిన మహేష్ బాబు 45 ఏళ్లు పూర్తి చేసుకోబోతున్నారు. ఊరికోండి బాస్.. ఈమధ్య ఆయన కొడుకు గౌతమ్‌తో కలిసి దిగిన ఫొటోలు చూస్తే ఎవరైనా ఆయనకు 45 ఏళ్లు అంటే నమ్ముతారా?? గౌతమ్ అన్నయ్యో.. కుదిరితే తమ్ముడన్నా నమ్మేస్తారు అంత యంగ్‌గా ఉన్నారు మహేష్ బాబు. పైగా ఈ లాక్ డౌన్‌లో పూర్తి విరామం దొరకడంతో ఫిట్ నెస్‌పై ఫుల్ టైం కేటాయించారు మహేష్ బాబు. ఈ వీడియోలను మహేష్ బాబు సతీమణి నమ్రత షేర్ చూస్తుంటుంది కూడా. అయితే మహేష్ బాబు ఇంత యంగ్‌గా కనిపించడానికి ఏం తింటారు అనే ప్రశ్న అందరిలోనూ ఉంది. ఆయన ఫుడ్ విషయంలో చాలా కేర్ తీసుకుంటారని.. షూటింగ్ సమయంలో ప్రత్యేకించి ఇంటి నుంచి భోజనం వస్తుందని.. కుదరకపోతే ప్రత్యేకించి డైట్ కోసం ఆయన వెంట కుక్ ఉంటారని చాలా వార్తలు చూస్తూ ఉంటాము. అయితే మహేష్ బాబు ఏమి తింటారో తెలియదు కాని.. ఓ రెస్టారెంట్ నుంచి మాత్రం ప్రతిరోజు ఆయనకు ఇష్టమైన గుత్తివంకాయ పలావ్ వెళ్తూ ఉంటుందట. ఆ హోటల్ పేరే ‘ఉలవచారు’. హా!! ఆ రెస్టారెంట్ పేరు ఉలవచారే.. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 45లో... అదే మన బాలయ్య బాబుగారి ఇంటి పక్కనే ఉంటుంది ఈ రెస్టారెంట్. ఈ హోటల్ నుంచి మహేష్ బాబుకి ప్రతి రోజు ‘గుత్తి వంకాయ పలావ్’ పంపిస్తూ ఉంటామని అంటున్నారు హోటల్ నిర్వాహకులు. రాయలసీమ నుంచి వచ్చిన ఇద్దరు అన్నదమ్ములు (విజయ్ రెడ్డి, వినయ్ రెడ్డి) కలిసి పెట్టిన .. ప్రారంభించిన కొద్దిరోజుల్లేనే భోజన ప్రియులకు ఇష్టమైన రెస్టారెంట్‌గా మారింది. గత ఏడేళ్లుగా హైదరాబాద్‌ జూబ్లీహిల్స్ (మెయిన్ బ్రాంచ్)‌లో నడిస్తున్న ఉలవచారు రెస్టారెంట్‌కి ఎక్కువగా ధనికులు, సెలబ్రిటీలు వస్తుంటారు. గతంలో అక్కినేని కోడలు సమంత ఈ హోటల్‌లో వంటకాలను రుచిచూసి వహ్ వా.. ఉలవచారు అని ట్వీట్ పెట్టింది. అయితే తమ రెస్టారెంట్ ప్రమోషన్స్ కోసం పెద్దగా కష్టపడమని.. క్వాలిటీ ఫుడ్ అందించడమే తమ ప్రమోషన్ అంటున్నారు ఈ ఉలవచారు బ్రదర్స్. చాలా మంది సెలబ్రిటీలు వస్తుంటారని.. మహేష్ బాబుకి గుత్తివంకాయ పలావ్ అంటే చాలా ఇష్టం అని.. ఉలవచారు రెస్టారెంట్‌ నుంచి ప్రతి రోజు పంపిస్తాం అంటున్నారు. మహేష్ కొంచెం టేస్ట్ చేస్తారట.. అంతేకాదు మహేష్ బాబు ఇంట్లో ఏ ఫంక్షన్ జరిగినా.. కేటరింగ్ మేమే చేస్తాం అంటున్నారు ‘ఉలవచారు’ రెస్టారెంట్ నిర్వాహకులు విజయ్ రెడ్డి, వినయ్ రెడ్డి. మహేష్ బాబుతో పాటు నమ్రత కూడా ‘ఉలవచారు’ ఫుడ్‌ని ఇష్టపడతారంటున్నారు వీరు. నిజంగానే మహేష్‌కి గుత్తి వంకాయ్ పలావ్ ప్రతిరోజు పంపిస్తారా.. లేదంటే ఇది వాళ్ల మార్కెట్ స్ట్రాటజీనో తెలియదు కాని.. ఉలవచారు రెస్టారెంట్ ఓనర్స్ విజయ్ రెడ్డి, వినయ్ రెడ్డిలు మాత్రం మహేష్ బాబుకి ఇష్టమైన డిష్ ఇదే అంటున్నారు. మరి నిజంగానే ఉలవచారు ఫుడ్ అంత బాగుంటుందా?? మహేష్ బాబు ప్రతిరోజు టేస్ట్ చేసే ‘గుత్తి వంకాయ పలావ్’లో ఉన్న స్పెషాలిటీ ఏంటి?? తెలియాలంటే ఓసారి ఉలవచారుకి వెళ్లాల్సిందే.. అన్నట్టు చెప్పడం మర్చిపోయాం.. వెళ్లేటప్పుడు కాస్త డబ్బులు ఎక్కువే తీసుకుని వెళ్లండి.. టేస్ట్‌తో పాటు రేటు కూడా అదే రేంజ్‌లో ఉంటుంది మరి.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2XdSAh3
v

రానా విడుదల చేసిన హర్భజన్ సింగ్ ‘ఫ్రెండ్‌షిప్’ గ్లింప్స్.. ఇంట్రస్టింగ్!

‘ఫ్రెండ్‌షిప్’ మూవీ ద్వారా ప్రముఖ క్రికెటర్ హీరోగా పరిచయమవుతోన్న సంగతి తెలిసిందే. తమిళం, తెలుగు, హిందీ భాషల్లో రూపొందుతోన్న ఈ సినిమాలో త‌మిళ బిగ్ బాస్ ఫేమ్ లోస్లియా మ‌రియ‌నేస‌న్ హీరోయిన్‌గా నటిస్తోంది. యాక్షన్ కింగ్ అర్జున్, సతీష్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. జాన్‌పాల్ రాజ్‌, శ్యామ్ సూర్య ద‌ర్శక‌త్వం వ‌హిస్తున్నారు. సీన్‌టొ స్టూడియోస్‌, సినీ మాస్ స్టూడియోస్ ప‌తాకాల‌పై జేపీఆర్, స్టాలిన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్, మోషన్ పోస్టర్, రజినీకాంత్ ఆంథమ్ ఆకట్టుకున్నాయి. Also Read: కాగా, నేడు వరల్డ్ ఫ్రెండ్‌షిప్ డేను పురష్కరించుకుని ‘గ్లింప్స్ ఆఫ్ ఫ్రెండ్‌షిప్’ పేరిట వీడియోను వదిలారు. ఈ వీడియోను హీరో రానా దగ్గుబాటి ట్విట్టర్ ద్వారా విడుదల చేశారు. ఈ వీడియో ఆసక్తికరంగా ఉంది. సుమారు ఒక నిమిషం నిడివి ఉన్న ఈ వీడియో ద్వారా సినిమాలోని పాత్రలను పరిచయం చేశారు. హర్భజన్, సతీష్ స్నేహితులుగా కనిపించారు. భజ్జీ పోలీసు వాహనం నుంచి స్నేహితులతో దిగుతూ కనిపించారు. అంటే, ఇది క్రైమ్ థ్రిల్లర్‌లా అనిపిస్తోంది. అర్జున్ పాత్ర స్టైలిష్‌గా ఉంది. ఇక ఈ వీడియో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అదిరిపోయింది. మొత్తం ఈ వీడియో సినిమాపై క్యూరియాసిటీని కలుగజేస్తోంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/39N7q39
v

RGV Missing: తనపైనే సినిమా.. వాళ్లందరినీ వాడేస్తోన్న వర్మ.. సరికొత్త జోనర్‌లో!

వివాదాస్పద దర్శకుడు మరో సంచలనానికి తెర తీశారు. తన మీదే ఒక సినిమాను తీస్తున్నారు. కాకపోతే, ఈ సినిమా కోసం తెలుగు రాష్ట్రాల్లో ఎంతో పాపులర్ అయిన రియల్ క్యారెక్టర్లను ఆయన వాడేస్తున్నారు. అంతేకాదు, ఈ సినిమాతో ఒక జోనర్‌ను పరిచయం చేస్తున్నారు. ఇంతకీ ఆ సినిమా పేరు ‘ఆర్జీవీ మిస్సింగ్’. ఈ సినిమాతో ఫిక్షనల్ రియాలిటీ (FR) అనే జోనర్‌ను ఆర్జీవీ వరల్డ్ థియేటర్ ద్వారా వర్మ తొలిసారి ప్రవేశపెడుతున్నారు. ఈ జోనర్‌లో సినిమాలు కల్పితాలైనా అయ్యుండొచ్చు, జరిగిన కథలైనా అయ్యుండొచ్చు, నిజ ఘటనల ఆధారంగా అయినా అయ్యుండొచ్చు అని వర్మ వెల్లడించారు. అసలు వ్యక్తులపై రూపొందించిన పాత్రలను వర్ణించడానికి, ఫిక్షనల్ స్టోరీలో నిజ ఘటనలు చూపించడానికి ఈ జోనర్‌ను వాడతానని వర్మ వివరించారు. ఈ మేరకు ట్విట్టర్ ద్వారా ఈ సినిమాకు సంబంధించి వర్మ వరుస ప్రకటనలు చేశారు. ‘ఆర్జీవీ మిస్సింగ్’ స్టోరీ లైన్‌ను కూడా వెల్లడించారు. Also Read: ‘‘ఆర్జీవీ వరల్డ్ థియేటర్‌లో విడుదలయ్యే నా ఎఫ్ఆర్ ఫిల్మ్ టైటిల్ ‘ఆర్జీవీ మిస్సింగ్’. స్టోరీ ఐడియా: ఆర్జీవీ తప్పిపోవడంతో ఆర్జీవీ కంపెనీ స్టాఫ్ షాక్ అవుతారు. పోలీసులకు ఫిర్యాదు చేస్తారు. ఆ వివాదాస్పద దర్శకుడు ఇది ప్రచారం కోసం చేస్తోన్న పని అని పోలీసులు మొదట భావిస్తారు. కానీ, ఆ తరవాత మేల్కొని నిజంగా జరిగిందని నిర్ధారిస్తారు. ఆర్జీవీ మిస్సింగ్ కేసులో ముగ్గురిని ప్రధాన నిందితులుగా గుర్తిస్తారు. 1. వెరీ పవర్‌ఫుల్ స్టార్ అభిమానులు 2. ముంబై అండర్‌వరల్డ్‌కు ఒక మెగా ఫ్యామిలీ కాంట్రాక్ట్ ఇస్తుంది 2. ఒక మాజీ ముఖ్యమంత్రి, ఆయన కుమారుడు ఫ్యాక్షనిస్టుల సహాయంతో ఆర్జీవీని ఎత్తుకెళ్లారు’’ అని వర్మ తన ట్వీట్‌లో పేర్కొన్నారు. పోలీసుల దర్యాప్తులో షాకింగ్‌కు గురిచేసే చాలా నిజాలు బయటపడతాయని వర్మ తెలిపారు. అంతేకాదు, ఈ సినిమాలో పాత్రలను కూడా వర్మ పరిచయం చేశారు. ఈ పేర్లను తెలుగులో చెప్పేకంటే వర్మ స్టైల్లో ఇంగ్లిష్‌లో చెపితేనే బాగుంటుంది. Prawan Kalyan, Omega Star, CBEN, LAKESH, WHY S Jagan, KCAR, KTAR.. ఇవి ప్రధాన పాత్రలు. వీరితో పాటు పోలీసులు, గ్యాంగ్‌స్టర్స్, ఫ్యాక్షనిస్టులు కూడా ఉంటారని వర్మ వెల్లడించారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/337WOui
v

ఓ ఇంటివాడైన ‘నేను లోకల్’ రచయిత.. వివాహ వేడుకకు హాజరైన ‘జబర్దస్త్’ స్టార్స్

కరోనా సమయంలోనూ తెలుగు చిత్ర పరిశ్రమలో వరుసపెట్టి శుభకార్యాలు జరుగుతున్నాయి. కరోనా మహమ్మారి నేపథ్యంలో ప్రభుత్వం నిబంధనలను పాటిస్తూ శుభకార్యాలు జరుపుకుంటున్నారు మన తారలు. మే నెలలో హీరో నిఖిల్ సిద్ధార్థ వివాహం చేసుకున్నారు. డాక్టర్ పల్లవి వర్మను నిఖిల్ పెళ్లాడారు. చాలా తక్కువ మంది కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య వీరి వివాహం జరిగింది. ఆ తరవాత రానా దగ్గుబాటి పెళ్లి నిశ్చయమైంది. రానా, మిహీకా బజాజ్ పెళ్లిని ఖరారు చేస్తూ ఇరుకుటుంబాలు రోకా ఫంక్షన్ కూడా చేసుకున్నాయి. తాజాగా హీరో నితిన్ కూడా పెళ్లి చేసుకున్నారు. తాను ప్రేమించిన అమ్మాయి షాలిని కందుకూరిని హైదరాబాద్‌లోని ఫలక్‌నుమా ప్యాలెస్‌లో పెళ్లాడారు. ఈ వివాహ వేడుక పలువురు రాజకీయ, సినీ ప్రముఖుల సమక్షంలో వైభవంగా జరిగింది. అయితే, తాజాగా సినీ పరిశ్రమ నుంచి మరో సెలబ్రిటీ ఓ ఇంటివాడయ్యారు. యువ రచయిత ప్రసన్న కుమార్, మౌనికల వివాహం బుధవారం జరిగింది. రాత్రి 8.45 గంటలకు మచిలీపట్నంలోని రెవెన్యూ కళ్యాణ మండపంలో కొద్దిమంది బంధువుల సమక్షంలో ఘనంగా జరిగింది. ఈ వివాహానికి దర్శకుడు త్రినాథ్‌రావు నక్కిన, హీరో అశ్విన్, జబర్దస్త్ రామ్ ప్రసాద్, హైపర్ ఆది, అవినాష్ తదితరులు హాజరయ్యారు. కాగా, ‘సినిమా చూపిస్తా మావ’, ‘నేను లోకల్’, ‘హలో గురు ప్రేమకోసమే’ సినిమాల ద్వారా రచయితగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ప్రసన్న కుమార్.. త్వరలోనే రవితేజ హీరోగా తెరకెక్కనున్న సినిమాకు కథ, మాటలు అందించనున్నారు. అలాగే వాలీబాల్ ప్లేయర్ అరికపూడి రమణారావు జీవిత చరిత్ర ఆధారంగా మరో కథను సిద్ధం చేస్తున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/30fcytT
v

కంటతడి పెట్టుకున్న సోనూ సూద్.. టీవీ షోలో భావోద్వేగం

ప్రస్తుతం దేశవ్యాప్తంగా వినిపిస్తోన్న పేరు ఒకటే . ఊరువాడ ఇప్పుడు ఈ రియల్ హీరో గొప్పతనం గురించే చెప్పుకుంటున్నారు. ఎక్కడ చూసిన సోనూ పేరు మారు మోగిపోతుంది. కరోనా లాక్ డౌన్‌తో రోడ్డున పడ్డ వలస కార్మికులకు ఇళ్లను చేర్చడంతో మొదలైన సోనూ సాయం.. నేటికి కూడా కొనసాగుతూనే ఉంది. కష్టం ఎక్కడ ఉంటే అక్కడ సూపర్ మేన్‌లా వాలిపోతూ కష్టాల్లో ఉన్నవారికి అండగా నిలుస్తున్నాడు. కరోనా సంక్షోభ సమయంలో రీల్ విలన్‌..రియల్ లైఫ్‌లో హీరోగా మారాడు. దీంతో ఎందరో ప్రజలు ఆయనపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో సోనూ కపిల్ శర్మ టీవీ షోకు హాజరయ్యాడు. లాక్ డౌన్ తర్వాతా తాజాగా మొదలైన ఈ షోకు సోనూ హాజరయ్యాడు. దీంతో ఆ షోలో సోనూ చేసిన సాయానికి కృతజ్ఞతలు చెబుతూ ఓ వీడియోను ప్రసారం చేశారు. దీంతో ఆ వీడియో చూసిన సోనూ కన్నీళ్లు పెట్టుకున్నారు. సోనీ టీవీ ది కపిల్ శర్మ షోకి సంబంధించిన ప్రోమో రిలీజ్ చేయగా, ఇందులో ఆ సన్నివేశాలు కనిపించాయి. ఆగస్ట్ 1న సోనూ షోకు హాజరైన ఎపిసోడ్ ప్రసారం కానున్నట్టు పేర్కొన్నారు. కాగా, చిరంజీవి నటిస్తున్న చిత్రంలో కూడా సోనూ సూద్ ప్రధాన పాత్ర పోషించనున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. Read More: తాజాగా సోనూ ఓ రైతు కుటుంబానికి సాయం చేసిన విషయం తెలిసిందే. చిత్తూరు జిల్లా రైతు ఇంటికి ట్రాక్టర్ పంపాడు. ఆ తర్వాత తెలంగాణలో కరోనా కారణంగా ఉద్యోగం కోల్పోయిన సాఫ్ట్ వేర్ శారదకు జాబ్ లెటర్ అందించాడు. తాజాగా టీవీ నటుడు అనుపమ్ శ్యామ్‌కి సాయం చేస్తానని సోనూ సూద్ భరోసా ఇచ్చాడు. దీంతో సోనూపై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది. తాజాగా ఆయన 48వ పుట్టిన రోజు సందర్భంగా మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు ఇవాళ తన పుట్టిన రోజు కార్యక్రమాన్ని పురస్కరించుకొని దేశ వ్యాప్తంగా పలు చోట్ల వైద్యశిబిరాలను ఏర్పాటు చేశారు. పలు గ్రామాల్లో వీటిని ఏర్పాటు చేసి వైద్యులతో చికిత్స, పరీక్షలు చేయిస్తున్నారు. సొంత ఖర్చులతో వైద్యం చేయించుకోలేని వారికి ఈ విధంగా అండగా నిలుస్తున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2DgQBkY
v

షాకింగ్.. అదృశ్యమైన సుశాంత్ గర్ల్‌ఫ్రెండ్! యువ నటుడి సూసైడ్ కేసులో ఊహించని ట్విస్ట్

యువ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య సినీ ఇండస్ట్రీలో సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. టాలెంటెడ్ యాక్టర్ ఇలా బలవన్మరణానికి పాల్పడటం ఏ ఒక్కరూ జీర్ణించుకోలేక పోతున్నారు. అతనిది హత్య కాదు ఆత్మహత్యే అని పోస్ట్‌మార్టం రిపోర్టులో తేలినప్పటికీ.. ఈ ఆత్మహత్య వెనుక కారణాలేంటి? ఎవరైనా ప్రేరేపించారా? అనే కోణంలో పోలీసుల దర్యాప్తు సాగుతోంది. అయితే ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయన మాజీ ప్రియురాలు సడెన్‌గా అదృశ్యం కావడం చర్చనీయాంశంగా మారింది. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్యకు ముందు రోజు రాత్రి.. ఆయన పలుమార్లు రియాకు ఫోన్ చేసినట్లు ఆధారాలు లభించడంతో ఈ కేసులో ఆమెను కీలకమైన వ్యక్తిగా తీసుకొని పలుమార్లు విచారిస్తున్నారు పోలీసులు. కాగా సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌ను గర్ల్‌ఫ్రెండ్ రియా చక్రవర్తి మోసం చేసిందని బిహార్‌‌లోని పాట్నాలో ఉంటోన్న ఆయన కుటుంబ సభ్యులు ఆరోపిస్తుండటం మరిన్ని అనుమానాలకు తావిస్తోంది. ఆర్థికంగా సుశాంత్‌ను రియా వాడుకుందని, మానసిక క్షోభకు గురిచేసిందని ఆరోపిస్తూ పాట్నా పోలీసులకు సుశాంత్ తండ్రి ఫిర్యాదు చేశారు. గతేడాది ఓ అజ్ఞాత వ్యక్తికి రూ. 15 కోట్లు ట్రాన్స్ ఫర్ అయ్యాయని, ఇందులో రియా పాత్ర కూడా ఉన్నట్టు అనుమానంగా ఉందని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు పాట్నా పోలీసులు రియా చక్రవర్తిపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. Also Read: ఈ నేపథ్యంలో రియాను నేరుగా విచారించేందుకు బీహార్ పోలీసులు ముంబైలో దిగారట. ముంబైలో ఉన్న ఆమె నివాసానికి వెళ్లగా, ఆమె అక్కడ కనిపించలేదట. పోలీసులు రావడానికి ముందే ఆమె తన ఇంటి నుంచి అదృశ్యమైట్లు సమాచారం. దీంతో పోలీసులు ఆమె కోసం లుక్ అవుట్ నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. దీంతో సుశాంత్ సూసైడ్ కేసులో రియా పాత్రపై మరిన్ని అనుమానాలు నెలకొన్నాయి. జూన్ 14న సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌ ముంబైలోని తన ఇంట్లో ఆత్మహత్య చేసుకున్న విషయం తెలసిందే. సుశాంత్ ఆత్మహత్యపై సమగ్ర విచారణ చేపట్టాలని మహారాష్ట్ర ప్రభుత్వం పోలీసు శాఖను ఆదేశించింది. దీంతో ఇప్పటి వరకు 40 మందిని ముంబై పోలీసులు విచారించారు. కాగా, సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతిపై సీబీఐ విచారణ చేపట్టాలని కోరుతూ రెండు వారాల క్రితం ఇన్‌స్టాగ్రామ్ ద్వారా కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాను రియా చక్రవర్తి అభ్యర్థించింది. అదేవిధంగా తనపై పాట్నాలో నమోదైన కేసును ముంబైకి బదిలీ చేయాలని కోరుతూ ఆమె సుప్రీం కోర్టును ఆశ్రయించింది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2XcPSs2
v

మహేష్ ఫస్ట్ మూవీకి 21 ఏళ్లు: ఆశ్చర్యపోయిన ప్రిన్స్.. ఎన్నో మధుర జ్ఞాపకాలన్న దర్శకేంద్రుడు

సూపర్ స్టార్ కృష్ణ నట వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన .. ‘రాజకుమారుడు’ సినిమాతో సోలో హీరోగా పరిచయమయ్యారు. దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై సి.అశ్వినీదత్ ప్రతిష్టాత్మకంగా నిర్మించిన చిత్రమిది. మెలోడి బ్రహ్మ మణిశర్మ సంగీతం సమకూర్చారు. అజయన్ విన్సెంట్ సినిమాటోగ్రఫీ అందించారు. పరుచూరి బ్రదర్స్ పవర్‌ఫుల్ డైలాగులు రాశారు. కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటర్. బాలీవుడ్ బ్యూటీ ప్రీతి జింటా హీరోయిన్‌గా నటించిన ఈ బ్లాక్ బస్టర్ మూవీ నేటికి సరిగ్గా 21 ఏళ్ల క్రితం 1999 జులై 30న విడుదలైంది. Also Read: ‘రాజకుమారుడు’ సినిమా 21 వసంతాలు పూర్తిచేసుకున్న సందర్భంగా ఈ సినిమాకు పనిచేసిన ప్రతి ఒక్కరూ ఆనాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటున్నారు. చిత్ర నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ 21 ఇయర్స్ స్పెషల్ పోస్టర్‌ను ట్వీట్ చేసింది. అలాగే, సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా ట్వీట్ చేశారు. ‘‘21 ఏళ్లా.. ఎలా. నా తొలి సినిమాను ఎంతో ప్రత్యేకంగా మలిచిన రాఘవేంద్రరావుకు కృతజ్ఞతలు. అనుభవం నుంచి నేను నేర్చుకున్న విషయం నాకెప్పుడూ గుర్తుంటుంది. మీతో, మన అద్భుతమైన టీమ్‌తో పనిచేయడం నా అదృష్టం’’ అని మహేష్ ట్వీట్‌లో పేర్కొన్నారు. రాఘవేంద్రరావు, ప్రీతి జింటాతో కలిసి ఉన్న వర్కింగ్ స్టిల్‌ను మహేష్ తన ట్వీట్‌లో పొందుపరిచారు. అలాగే, దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు కూడా ‘రాజకుమారుడు’ సినిమాను గుర్తుచేసుకున్నారు. ‘‘రాజకుమారుడుకి 21 వసంతాలు.. ఎన్నో మధుర జ్ఞాపకాలు.. మా అశ్వినీదత్‌కి, చిత్ర బృందానికి శుభాకాంక్షలు. మా మహేష్ బాబు ఇంకెన్నో విజయాలు సాధించాలని ఆశీర్వదిస్తున్నాను’’ అని ట్వీట్ చేశారు రాఘవేంద్రరావు. అంతేకాదు.. తనతో, సూపర్ స్టార్ కృష్ణతో, అశ్వనీదత్‌తో, ప్రీతి జింటాతో మహేష్ కలిసి ఉన్న ఫొటోలను ట్వీట్‌లో పొందుపరిచారు రాఘవేంద్రరావు. కాగా, ‘రాజకుమారుడు’ ఎంత పెద్ద విజయం సాధించిందో ఆ సినిమా ఆల్బమ్ అంత కన్నా పెద్ద హిట్ అయ్యింది. ఈ చిత్రంలోని ప్రతి పాట అద్భుతంగా ఉంటుంది. అయితే, తొలిరోజు షూటింగ్ ‘గోదారి గట్టు పైన చిన్నారి చిలక ఉంది’ పాటతో మొదలైంది. ఈ పాటలోని ఒక షాట్‌ను తొలిరోజు మహేష్ బాబు, ప్రీతీ జింటాలపై జూబ్లీహిల్స్‌లోని రామానాయుడు స్టూడియోలో వేసిన సెట్‌లో తీశారు. తొలిరోజు షూటింగ్‌కు సూపర్ స్టార్ కృష్ణ సెట్‌కి విచ్చేశారు. రాజు సుందరం ఈ పాటను కొరియోగ్రఫీ చేశారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/338TsHJ
v

Rgv: బావ రాజ్యం.. ఏంటి! వర్మ కన్ను అక్కడ కూడా పడిందా? మెగా ఫ్యామిలీని వదలని ఆర్జీవీ

సంచలన దర్శకుడు రామ్ ‌గోపాల్ వర్మ వరుస కాంట్రవర్సీ సినిమాలతో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న సంగతి తెలిసిందే. సినీ లోకమంతా ఈ లాక్‌డౌన్ కారణంగా షూటింగ్స్ నిలిపివేసి ఇంటికే పరిమితం కాగా.. వర్మ మాత్రం తన క్రియేటివిటీకి పదును పెడుతూ సినిమాలు రూపొందిస్తున్నారు. అడల్ట్ సినిమాలతో యూత్ ఆడియన్స్‌ని ఆకర్షిస్తూనే పొలిటికల్, సెటైరికల్ మూవీస్‌తో నిత్యం సినీ, రాజకీయ వర్గాల చర్చల్లో నిలుస్తున్నారు. తన సినిమాలకు థియేటర్స్‌తో పని లేదన్నట్లుగా దూసుకుపోతున్న ఆర్జీవీ.. సొంతంగా ఓ డిజిటల్ ప్లాట్‌ఫామ్ RGV World Theatre ప్రారంభించారు. దీనిపై ఇటీవలే పవన్ కళ్యాణ్ టార్గెట్‌గా 'పవర్ స్టార్' సినిమాను విడుదల చేసి సంచలనాలకు కేంద్ర బిందువుగా నిలిచారు. ఈ క్రమంలో వర్మ ఆఫీసుపై పవన్ ఫ్యాన్స్ దాడి.. 'పవర్ స్టార్'కు పోటీగా ఆర్జీవీ రియల్ క్యారెక్టర్ చూపిస్తూ మరో సినిమా విడుదల కావడం లాంటి పరిణామాలు చోటుచేసుకున్నాయి. అయినప్పటికీ ఏ మాత్రం వెనక్కితగ్గని వర్మ.. తాజాగా మరో సంచలనానికి తెరలేపనున్నట్లు తెలుస్తోంది. Also Read: మెగా ఫ్యామిలీని వదలేదే లేదన్నట్లుగా ఈ సారి బడా నిర్మాత అల్లు అరవింద్‌పై మూవీ ప్లాన్ చేస్తున్నారనే సమాచారాలు షికారు చేస్తున్నాయి. అప్పట్లో చిరంజీవి పెట్టిన ప్రజారాజ్యం పార్టీ నేపథ్యంలో ఆ సంగతులన్నీ చూపిస్తూ అల్లు అరవింద్‌ని హైలైట్ చేసేలా ఈ మూవీ ఉండనుందని తెలుస్తోంది. అంతేకాదు ఈ సినిమాకు '' అనే టైటిల్ కూడా వర్మ కన్ఫర్మ్ చేసి పెట్టుకున్నారనే న్యూస్ ఫిలిం నగర్ సర్కిల్స్‌లో వైరల్ అవుతోంది. సో.. చూడాలి మరి దీనిపై మెగా ఫ్యాన్స్ ఎలా రియాక్ట్ అవుతారనేది!.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3geWXzN
v

పాలు పట్టిస్తున్న మెగా కోడలు.. ఉపాసన ఒడిలో..!! వైరల్ అవుతున్న షాకింగ్ పిక్

రామ్ చరణ్ సతీమణిగా, మెగా కోడలిగా అందరికీ సుపరిచితం . సోషల్ మీడియాలో యాక్టివ్ రోల్ పోషిస్తూ మెగా ఫ్యామిలీ విశేషాలను అందరి ముందుంచే ఆమె.. తాజాగా ఓ షాకింగ్ పిక్ షేర్ చేసింది. తన ఒడిలో పులిని కూర్చోబెట్టుకొని స్వయంగా పాలు పట్టిస్తున్న పిక్ షేర్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. దీంతో ఈ పిక్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ ప్రకృతి, అందులోని జీవాలంటే ఎంతో ప్రేమ చూపే మెగా కోడలు సందర్భంగా ఇలా చేసింది. అంతర్జాతీయ పులుల దినోత్సవం (జులై 29) సందర్భంగా పులులపై ప్రేమను చాటుకుంటూ పులికి పాలు పట్టించింది ఉపాసన. ''పులి పిల్లకు పాలు పట్టడం ఎంతో ఎగ్జైటింగ్‌గా ఉంది.. కానీ మళ్ళీ ఇలాంటి పని ఎప్పుడూ చేయను. అడవుల్లో కంటే జూ ల్లోనే పులుల సంఖ్య ఎక్కువగా ఉన్నాయని లెక్కలు చెబుతున్నాయి. హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో పులుల సంచారం ఎక్కువగా ఉంటోంది. మీరంతా జాగ్రత్తగా ఉండాలి. అంతేకాదు వాటికి రక్షణ కల్పించాలి'' అని పేర్కొంటూ సందేశమిచ్చింది. Also Read: ఉపాసన షేర్ చేసిన ఈ ట్వీట్ క్షణాల్లో వైరల్ అయింది. ఇక రామ్ చరణ్ వారసత్వం కోసం ఎంతగానో ఎదురుచూస్తున్న మెగా అభిమానలోకం.. ‘ఆ పులిలా మీ చేతిలో మెగా వారసుడు ఎప్పుడు ఉంటారని’ ఈ పిక్‌పై కామెంట్స్ పెడుతుండటం విశేషం. మరోవైపు కొందరు నెటిజన్లు 'ఇది చాలా ప్రమాదం మేడం, కాస్త జాగ్రత్త' అని కామెంట్ చేస్తున్నారు. సినిమాల్లో నటించకపోయినా సోషల్ మీడియాలో ఉపాసనకు మంచి ఫాలోయింగ్ ఉంటుంది. రామ్ చరణ్, మెగా ఫ్యామిలీకి సంబంధించిన విశేషాలను పంచుకుంటూనే సమజానికి ఉపయోగపడే పనులు చేస్తుంటుంది ఈ మెగా కోడలు. అంతేకాదు ఆరోగ్య చిట్కాలు, సంప్రదాయ పద్దతుల గురించి అందరికీ చెప్పడం ఆమె ప్రత్యేకత.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/33bwVtE
v

పవన్ 3 పెళ్లిళ్లే చేసుకుంటా.. రేప్‌లు చేయలేదు, మీలా ఏడుగుర్ని మార్చలేదు: ఆమె ఫైర్ అయ్యింది!

‘‘ఎందుకో తెలీదు.. నిను చూస్తున్న ప్రతీక్షణం నేను కారణం చెప్పలేని భావాలలో విలవిల్లాడిపోతాను. దానికి అర్థం ఏంటి? నేను ఎందుకిలా అవుతున్నాను? ఇది ఆకర్షణా? ప్రేమ అనే వ్యామోహమా?’’.. పవన్‌పై రాసిన ఈ ప్రేమ కవిత చూస్తే ఆయనంటే ఎంత ప్రేమో.. ఆరాధనో.. పిచ్చో.. ఇట్టే అర్థమైపోతుంది ఆమె ఫాలోవర్స్‌కి. సందర్భం వచ్చిన ప్రతిసారి అనలేం కాని.. సందర్భం వచ్చినా రాకపోయినా.. పవన్‌పై ఉన్న భక్తిని చాటుకుంటూనే ఉంది ఈ ‘నచ్చావులే’ నటి. నిజానికి జనసేనలో ఉండాల్సిన ఆమె మొదట్లో ఆపార్టీ తరుపున ర్యాలీలు కూడా చేసింది. అయితే ఏమైందో ఏమోకాని బీజేపీ కండువా కప్పుకుంది. అయితే పవన్ కళ్యాణ్ బీజేపీతో దోస్తీ కట్టడంతో ఫుల్ ఖుషీలో ఉంది మాధవీలత. ‘మీరు వస్తారని నాకు ముందే తెలుసు పవన్ కళ్యాణ్ గారూ.. ఐ లవ్డ్ ఇట్’ అంటూ పవన్ బీజేపీతో దోస్తీ కట్టిన తరుణంలో ఘనంగా స్వాగతం పలికిన మాధవీలత.. ఈ మధ్య కాలంలో ఆయనపై ఈగవాలినా తట్టుకోవడం లేదు. ఇటీవల రామ్ గోపాల్ వర్మ పవన్‌ని కించపరిచేలా ‘పవర్ స్టార్’ సినిమా తీసినందుకు వర్మను ఓ రేంజ్‌లో ఏకిపారేసింది మాధవీలత. ఫర్ ఎవర్ పీకే లవ్స్ అంటూ.. వర్మా.. ఏంటి నీకీ కర్మ?? పీకేని ఏం పీకలేక పనికిమాలిన సినిమాలు. నీకు పర్శనల్‌గా ఆయనపై పగ ఉంటే.. అతనితో తేల్చుకో. చేతకాని కహానీ ఎందుకు? అయినా ఆయన్ని ఏమీ పీకలేని వాళ్లు ఆయన వ్యక్తిగత జీవితం మీద పడి ఏడుస్తున్నారు’ అంటూ ఫైర్ అయిన విషయం తెలిసిందే. అయితే మాధవీలత పవన్ గురించే కాదు.. సోషల్ ఇష్యూస్‌పై తనకు తెలిసిన పరిధిలో పోస్ట్‌లు పెడుతూ విమర్శల పాలు కావడం తరుచూస్తున్నాం. ఈమెకు నెటిజన్లకు మధ్య సోషల్ మీడియా వార్ ఓ రేంజ్‌లో జరుగుతూ ఉంటుంది. ఈమె ఏ పోస్ట్ పెట్టినా.. దానిపై వర్గర్ కామెంట్స్ రావడం.. దానిపై ఈమె సీరియస్ అవ్వడం.. బండ బూతులు తిట్టడం షరా మామూలే. రీసెంట్‌గా ఆమె మహిళలపై జరుగుతున్న అకృత్యాలపై స్పందిస్తూ.. ఓ ఫార్వర్డ్ మెసేజ్‌ను ఫేస్ బుక్‌లో పోస్ట్ చేశారు. ‘కామాంధుల చూపులు నన్ను కాల్చి బూడిద చేస్తూంటే.. నొప్పిని చెప్పుకోలేను.. బాధని బయట పెట్టుకోలేను.. అన్యాయం చేసినోళ్లు ఆబోతుల్లా కామంతో రంకేలు వేస్తుంటే.. పాపం నాకోసం REST IN PEACE అని స్టేస్టేటస్సుల్లో ట్విట్టర్లో ఫేసు బుక్కుల్లో రాసుకుంటూ నన్ను గోడలపై పోస్టర్లా అతికిస్తారు’ అంటూ కళ్లు చెమ్మగిల్లేలా ఉన్న మెసేజ్‌ను తన ఫేస్ బుక్‌లో షేర్ చేసింది మాధవీలత. మాటలు లేవు...ఆ పదాలకు... కన్నీటి ధారలే....సమాధానాలు అంటూ మాధవీలత పోస్ట్‌పై కొంతమంది నెటిజన్లు స్పందిస్తుండగా.. ఈ ఇష్యూలోకి మాధవీలత ఆరాధించే పవన్ కళ్యాణ్‌ని తీసుకుని వచ్చాడు ఓ నెటిజన్. మూడు పెళ్లిళ్లు చేసుకుని.. నాలుగో ఆమెగా పూనమ్ కౌర్‌తో ఎఫైర్ నడుపుతున్న పవన్ కళ్యాణ్‌కి ఎప్పుడూ సపోర్ట్ చేస్తుంటావు.. నువ్వ ఆడవాళ్ల రక్షణ గురించి మాట్లాడటం.. చాలా వింతగా ఉందని షేక్ జకీర్ అనే నెటిజన్ వివాదాస్పద కామెంట్ చేయడంతో ఓ రేంజ్‌లో ఫైర్ అవుతూ ఘాటు రిప్లై ఇచ్చింది మాధవీలత. షేక్ జకీర్.. అతను వాళ్లను రేప్ చేశాడా?? హింసించాడా?? ఇష్టపడి చేసే అమ్మాయిలకి స్వేచ్ఛ ఉంది. ఈ సమాజంలో మగాడికి ఎంత హక్కు ఉందో ఆడవాళ్లకు అంతే హక్కు ఉంది. ఆమెకు నచ్చితే ఏమైనా చేయొచ్చు. ఆమెకు నచ్చకపోతే నేరం. అతను ఒకేసారి మూడు పెళ్లిళ్లు చేసుకోలేదు.. డైవర్స్ ఇచ్చిన తరువాత చట్టబద్ధంగా పెళ్లి చేసుకున్నారు. వాళ్లు ఆయన్ని ఇష్టపడి ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అతను వాళ్లనేం రేప్ చేయలేదు. మీ వాళ్ల లా ఏడు పెళ్లిళ్లు చేసుకుని మొన్నటి వరకూ తలాక్.. తలాక్.. అని వదిలించుకునే దుర్మార్గపు సాంప్రదాయం ఉన్న మీరు మాట్లాడటం జోక్’ అంటూ ఘాటుగా రియాక్ట్ అయ్యింది మాధవీలత. ‘స్వేచ్ఛపేరుతో పదిమందిని పెళ్ళిచేసుకుంటే కూడా కరెక్ట్ అనే కాన్సెప్ట్ బలే ఉంది.. భారతదేశంలో ఉన్నటువంటి సంస్కృతి ఒకటే భార్య భర్త.. విదేశీ సంస్కృతిని బీజేపీలో విలీనం చేస్తారా మరి..? మాధవి గారు కూడా ఒకటే పెళ్లి చేసుకోవాలని మనవి.... !!’ అంటూ ఆమెకు కౌంటర్ ఇచ్చాడు మరో నెటిజన్.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3faaLu3
v

Thriller Trailer: ఆయనతో ఒంటరిగా బంగ్లాలో ఆమె.. అప్సరా రాణి అందాలపై కెమెరా కన్ను! రొమాంటిక్ డోస్..

సినీ ఇండస్ట్రీ మొత్తం లాక్‌డౌన్ కారణంగా విలవిల్లాడిపోతున్న సమయంలో పోర్న్ భామ మియా మాల్కోవాతో 'క్లైమాక్స్' సినిమా అనౌన్స్ చేసి సంచలనాలకు తెరలేపిన వర్మ.. దాన్ని కంటిన్యూ చేస్తున్నారు. వరుసపెట్టి అడల్ట్ సినిమాలు రిలీజ్ చేస్తూ హంగామా చేస్తున్నారు. ఈ క్రమంలో ఇటీవలే 'నగ్నం' సినిమాతో శ్రీ రాపాక అందాలను కెమెరాలో బంధించిన ఆయన, ఈ సారి గ్లామర్‌పై కన్నేశారు. అప్సరా రాణి ప్రధాన పాత్రలో థ్రిల్లర్ మూవీ రూపొందిస్తూ వరుస అప్‌డేట్స్‌తో కిక్కిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా 'థ్రిల్లర్' ట్రైలర్ రిలీజ్ చేసి సినిమాపై హైప్ క్రియేట్ చేశారు . 2 నిమిషాల 36 సెకనుల నిడివితో కట్ చేయబడిన ఈ థ్రిల్లర్ ట్రైలర్‌లో రొమాంటిక్ డోస్ దట్టించారు వర్మ. అప్సరా రాణి హాట్ అందాలను ఫోకస్ చేస్తూ మరోసారి కెమెరా ఎక్కడెక్కడో పెట్టేశారు. ఇది దెయ్యమా? లేక కిల్లరా? అని ప్రశ్నిస్తూ రామా.. కృష్ణా.. శివ శివ అంటూ బ్యాక్ గ్రౌండ్‌లో హోరెత్తించారు. చివరగా ఇది థ్రిల్లర్ అని తెలుపుతూ అంతా సిద్ధంగా ఉండండని పేర్కొన్నారు వర్మ. మొత్తానికి రొమాంటిక్ డోస్ పుష్కలంగా పెట్టేసి 'థ్రిల్లర్' సినిమాతో కాస్త వెరైటీగా థ్రిల్లింగ్ చేయబోతున్నట్లు ఈ ట్రైలర్ ద్వారా చెప్పేశారు. Also Read: ఇప్పటికే ఈ థిల్లర్ మూవీలో నటిస్తున్న అప్సరా రాణి, రాక్‌ ఇద్దరినీ పరిచయం చేస్తూ వారి వారి న్యూడ్ ఫొటోలతో ప్రేక్షకుల దృష్టిని లాగేసిన ఆర్జీవీ.. ఇప్పుడు ట్రైలర్‌తో అందరి కన్ను తన సినిమాపై పడేలా చేసుకున్నారు. ఏకంగా 9 భాషలు (తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం, మరాఠి, భోజ్‌పురి, గుజరాతి, ఒడియా భాషల్లో) ఈ ట్రైలర్ విడుదల చేసి సెన్సేషన్ క్రియేట్ చేశారు వర్మ. ఈ చిత్రాన్ని ఎప్పటిలాగే తన ఆర్జీవీ వరల్డ్ థియేటర్, శ్రేయాస్ ఈటీలో అతిత్వరలో విడుదల చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2D4lp8T
v

టీవీ నటుడికి సోనూ సూద్ సాయం... నెటిజన్ల ప్రశంసలు

అలుపెరగని సాయం చేస్తూనే పొతున్నాడు. అడిగినవారికి.. అడగనివారికి కూడా తెలియకుండా తనవంతు సాయం చేస్తూ పోతున్నాడు. కష్టంలో ఉన్నామనగానే... అక్కడ సోనూ వాలిపోతున్నాడు. బాధితులకు అండగా నిలుస్తున్నాడు. అయితే సోనూ సామాన్యులకే కాదు.. కొంతమంది సెలబ్రిటీలకు కూడా సాయం చేస్తున్నాడు. తాజాగా టీవీ నటుడు అనుపమ్ శ్యామ్‌కు అండగా నిలిచాడు సోనూ సూద్.గత కొన్నాళ్లుగా అనుపమ్ కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నారు. దీంతో ఆయన రెండు రోజుల క్రింత ఆస్పత్రిలో చేరారు. ఐసీయూలో చికిత్స పొందుతున్న అనుపమ్‌కి సాయం చేయడానికి దాతలు ముందుకు రావాలని అతని సోదరుడు అనురాగ్ విజ్ఞప్తి చేశాడు. దీంతో అనుపమ్ ఆరోగ్యానికి సంబంధించిన విషయాన్ని ఓ నెటిజన్ .. సోనూసూద్ దృష్టికి తీసుకెళ్లాడు. ఇంకేముంది తప్పక సాయం చేస్తానని సోనూ సూద్ తన ట్విట్టర్ ద్వారా స్పందించాడు. దీంతో సోనూసూద్ మంచి మనసుపై ప్రశంసలు కురిపిస్తున్నారు నెటిజన్స్‌. అనుపమ్ శ్యామ్ ప్రముఖ సీరియల్స్‌తో పాటు పలు బాలీవుడ్ సినిమాల్లో సైతం నటించారు. ఇక అనుపమ్ ‌కు సాయం చేసేందుకు ప్రముఖ నటుడు మనోజ్ వాజ్ పేయి సైతం ముందుకొచ్చారు. ఆయన కూడా అనుపమ్ కుటుంబసభ్యులకు ఫోన్ చేసి ఆరోగ్యం ఆరా తీశారు. Read More: ఇటీవల సోనూ సూద్ ఏపీలో ఓ రైతు కుటుంబానికి ట్రాక్టర్ సాయం చేసిన విషయం తెలిసిందే. చిత్తూరు జిల్లా మదనపల్లెకి చెందని నాగేశ్వరరావు అనే రైతు కుటుంబానికి సోనూ ట్రాక్టర్ పంపారు. అంతేకాకుండ కరోనా కారణంగా సాఫ్ట్ వేర్ ఉద్యోగం కోల్పోయిన సాఫ్ట్ వేర్ ఇంజినీర్ శారద అనే యువతికి కూడా సోనూ సాయం చేశారు. శారద ఇంటికి తన ప్రతినిధిని పంపి జాబ్ లెటర్ అందించారు. ఇలా ఒకటి కాదు... వలస కూలీలని ఇళ్లకి చేర్చడం దగ్గర నుండి నిసర్గ తుఫాను బాధితులకి అండగా నిలవడంతో పాటు ఉద్యోగం లేని వారికి జాబ్ ఇవ్వడం వరకు సోనూ సూద్ తనలోని మానవత్వం చాటుకుంటూ వస్తున్నాడు. ఈ రోజు సోనూసూద్ బర్త్ డే సందర్భంగా సోషల్ మీడియాలో ఆయనకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. రియల్ హీరో అంటూ.. నెటిజన్లు సోనూపై ప్రశంసలు కురిపిస్తున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3375z7X
v

Wednesday 29 July 2020

సుశాంత్‌ను రియా వేధించింది.. అంకిత లొఖండే కీలక ఆరోపణలు

బాలీవుడ్‌ యువ నటుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ ఆత్మహత్య కేసు రోజుకో మలుపు తిరుగుతుంది. ఈ కేసులో తాజాగా సుశాంత్ తండ్రి.. రియా చక్రవర్తిపై కేసు నమోదు చేశారు. ఈ కేసులో నటి, సుశాంత్‌ ప్రేయసిగా ప్రచారంలో ఉన్న రియా చక్రవర్తి పాత్రపై దర్యాప్తు చేయాల్సిందిగా అతడి తండ్రి కేకే సింగ్‌ పట్నా పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో విచారణ నిమిత్తం నలుగురు సభ్యులతో కూడిన ప్రత్యేక బృందం ముంబైకి చేరుకుంది. ఈ నేపథ్యంలో సుశాంత్‌ మాజీ ప్రేమికురాలు అంకితా లోఖండేను బుధవారం ఈ టీం ప్రశ్నించారు. దీంతో ఆమె సుశాంత్‌-రియా బంధం గురించి పలు కీలక విషయాలు పోలీసులకు తెలిపారు. 2019లో వచ్చిన ‘మణికర్ణిక’ సినిమాలో విడుదల సమయంలో తనను అభినందించేందుకు సుశాంత్‌ తనకు మెసేజ్‌ చేశాడని పేర్కొన్నారు. ఈ సందర్భంగా తను తీవ్ర భావోద్వేగానికి లోనయ్యానన్నారు. అయితే ఆ సమయంలో రియా తనను వేధిస్తోందని చెప్పాడని అంకిత పోలీసులకు తెలిపారు. అందుకే తనతో బంధాన్ని తెంచుకోవాలనుకుంటున్నట్లు సుశాంత్‌ వెల్లడించినట్లు పేర్కొన్నారు. ఇందులో భాగంగా ఇరువురి మధ్య జరిగిన సంభాషణకు సంబంధించిన వివరాలను బిహార్‌ పోలీసులకు అందించారు. సుశాంత్‌ బలవన్మరణం తర్వాత అతడి కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు అంకిత రెండుసార్లు పట్నాకు వెళ్లింది. అక్కడ సుశాంత్‌ సోదరి శ్వేత సింగ్‌ కీర్తితో అంకిత మాట్లాడినట్లు వెల్లడించింది. ఇక విచారణ అనంతరం.. ‘‘నిజమే గెలుస్తుంది’’అంటూ అంకిత తన సోషల్‌ మీడియా అకౌంట్‌లో పేర్కొన్న సంగతి తెలిసిందే. Read More: సుశాంత్ సినిమాల్లో రాకముందు.. అంకితతో కలిసి పవిత్ర రిష్తా అనే టీవీ సిరియల్‌లో కలిసి నటించాడు. అప్పుడు వీరిద్దరి మధ్య ప్రేమాయాణం సాగింది. దాదాపు ఆరేళ్ల పాటు వీరిద్దరూ ప్రేమించుకున్నారు. ఆ తర్వాత సినిమాల్లోకి వచ్చిన తర్వాత సుశాంత్.. అంకిత బ్రేకప్ చెప్పుకున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3fcYkxV
v

Rgv: రాజమౌళికి కరోనా పాజిటివ్.. రామ్ గోపాల్ వర్మ షాకింగ్ రియాక్షన్..! బాహుబలిని పిలవండి

వివాదాస్పద దర్శకుడు మరోసారి తన విలక్షణతను చాటుకున్నారు. ఏ విషయాన్నైనా ముక్కుసూటిగా మాట్లాడుతూ ముఖం ముందే తన అభిప్రాయం చెప్పేసే వర్మ.. తాజాగా దర్శకధీరుడు అని తెలిసి ఎవ్వరూ ఊహించని విధంగా రియాక్ట్ అయ్యారు. రాజమౌళికి కరోనా పాజిటివ్ అని తెలియగానే సినీ ప్రముఖులంతా ఆయన కోలుకోవాలని కోరుకుంటూ ట్వీట్స్ పెడుతుండగా.. వర్మ మాత్రం తనదైన స్టైల్‌లో స్పందిస్తూ బాగోగులు కోరుకున్నారు. బుధవారం (జులై 29) రాత్రి తనకు, తన కుటుంబ సభ్యులకు కరోనా పాజిటివ్ అని తేలినట్లుగా పేర్కొంటూ ట్వీట్ చేశారు రాజమౌళి. గత కొన్ని రోజులుగా జ్వరంతో బాధపడుతున్న తాము.. జ్వరం తగ్గిన తరువాత ఎలాంటి లక్షణాలు లేకపోయినా కూడా కరోనా పరీక్షలు చేయించుకోగా పాజిటివ్ వచ్చినట్లు రాజమౌళి తెలిపారు. దీంతో ఉలిక్కిపడ్డ టాలీవుడ్ సినీ లోకం ఆయన త్వరగా కోలుకోవాలంటూ ట్విట్టర్‌ని హోరెత్తించేసింది. ఇక రామ్ గోపాల్ వర్మ పెట్టిన వెరైటీ ట్వీట్ మాత్రం వైరల్ అయి వార్తల్లో నిలిచింది. Also Read: ''సర్.. మీ సైనికుడు బాహుబలిని పిలిచి కరోనాను ఓ తన్ను తన్నమనండి. జోక్స్ పక్కన పెడితే.. మీరు, మీ కుటుంబ సభ్యులు అతి త్వరలోనే కరోనా బారి నుంచి కోలుకుంటారు'' అని తన ట్వీట్‌లో పేర్కొన్నారు వర్మ. దీంతో ఈ ఫన్నీ రియాక్షన్ చూసి వర్మ తీరు పట్ల మిశ్రమంగా స్పందిస్తున్నారు నెటిజన్లు. ఇకపోతే ప్రస్తుతం రాజమౌళి RRR మూవీ చేస్తుండగా, వర్మ ఆన్‌లైన్ వేదికలపై పలు కాంట్రవర్షియల్ సినిమాలతో హంగామా చేస్తున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3goouPi
v

షాకింగ్: మరో యువ నటుడు ఆత్మహత్య.. ఇండస్ట్రీని వెంటాడుతున్న విషాదాలు

ఈ ఏడాది సినీ ఇండస్ట్రీని వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. ఓ విషాదం నుంచి కోలుకోకముందే మరో విషాద వార్త వినిపిస్తుండటం సినీ ఇండస్ట్రీని ఆందోళనకు గురి చేస్తోంది. సాధారణ మరణాలతో పాటు నటుల ఆత్మహత్యలు యావత్ సినీ లోకాన్ని కలవరపెడుతున్నాయి. ఇటీవలే యువ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ బలవన్మరణానికి పాల్పడటంతో ఉలిక్కిపడ్డ సినీ లోకం.. ఇంతలోనే మరో యువ నటుడి ఆత్మహత్య చూడాల్సి వచ్చింది. మరాఠీ నటుడు (32) ఆత్మహత్యకు పాల్పడ్డారు. మహారాష్ట్ర నాందెడ్‌లోని గణేష్ నగర్ ప్రాంతంలో ఉన్న తన ఇంట్లోనే ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు అశుతోష్ భక్రే. గత కొన్ని రోజులుగా ఆయన తీవ్ర ఒత్తిడిలో ఉన్నారని, అందుకే ఆయన ఈ ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని అశుతోష్ భక్రే సన్నిహితులు భావిస్తున్నారు. ఈ యువ నటుడి ఆత్మహత్యపై కేసు నమోదు చేసుకున్న మహారాష్ట్ర పోలీసులు అనుమానాస్పద మృతి కింద దర్యాప్తు చేపడుతున్నారు. అశుతోష్ భక్రే ''భకార్, ఇచర్ థార్లా'' లాంటి మరాఠీ సినిమాల్లో నటించి ఫేమ్ అయ్యారు. ఆయన భార్య మయూరి దేశ్ ముఖ్ కూడా సినీ పరిశ్రమకు చెందిన వారే. ‘ఖుల్తా కాళీ ఖులేనా’ అనే సీరియల్ ద్వారా ఆమె ఫేమస్ అయ్యారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3fboLUG
v

హ్యాపీ బర్త్ డే సోనూ సూద్: సినిమాల్లో విలన్.. రియల్ లైఫ్‌లో అసలు సిసలైన హీరో.. శుభాకాంక్షల వెల్లువ

కరోనా విలయతాండవం చేస్తున్న ఈ ఆపత్కాల సమయంలో మానవత్వం చాటుకుంటూ అందరికీ అండగా నేనున్నా అనే భరోసా కల్పిస్తున్నారు నటుడు . ఆయనను సినిమాల్లో విలన్ గానే చూశాం కానీ రియల్ లైఫ్‌లో మాత్రం అసలు సిసలైన హీరో అనిపించుకుంటున్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ప్రశంసలందుకుంటున్న ఈ రియల్ హీరో పుట్టిన రోజు ఈ రోజు (జులై 30). ఈ సందర్భంగా ఆయనకు సోషల్ మీడియా వేదికగా బర్త్ డే విషెస్ వెల్లువెత్తుతున్నాయి. 1973 సంవత్సరం జులై 30వ తేదీన జన్మించిన సోనూ సూద్ నేటితో 46 సంవత్సరాలు పూర్తిచేసుకొని 47వ యేట అడుగు పెడుతున్నారు. ఆపత్కాలంలో ఆదుకుంటున్న ఆపద్బాంధవుడిగా కీర్తించబడుతున్న ఆయన.. తన పుట్టిన రోజు సందర్భంగా మరో సేవా కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నారు. కొవిడ్-19 నిబంధనలకు కట్టుబడి ఉండేలా చర్యలు తీసుకుంటూ దేశ వ్యాప్తంగా ఉచిత వైద్య శిబిరాలను ప్రారంభిస్తున్నారు. ఈ వైద్య శిబిరాల ద్వారా 50 వేల మందికి సేవలు అందనున్నట్లు ఆయన పేర్కొన్నారు. Also Read: మరోవైపు కరోనా సంక్షోభ సమయంలో సోనూ సూద్ చేస్తున్న సామాజిక సేవ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కొన్ని వేల మంది వలస కూలీలను వారి వారి సొంత గూటికి చేర్చిన ఆయన పేదోడి దేవుడయ్యాడు. ఉపాధి లేక అల్లాడిపోతున్న వలస కూలీలకు అన్నంపెట్టి ఆదుకోవడమే గాక సొంత బస్సుల్లో వారి వారి గ్రామాలకు చేర్చారు. ఇక ఇటీవలే చిత్తూరు జిల్లాకు చెందిన పేద రైతుకు ట్రాక్టర్ కొనిచ్చారు. సాఫ్ట్‌వేర్ ఉద్యోగం కోల్పోయి కూరగాయలు అమ్ముకుంటోన్న వరంగల్ యువతి శారదకు ఉద్యోగం ఇప్పించారు. ఇలాంటి ఎన్నో మంచి పనులతో రియల్ లైఫ్‌లో హీరో అనిపించుకుంటున్న సోను సూద్‌కి మీ మా 'సమయం తెలుగు' తరఫున ప్రత్యేకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు అందిస్తున్నాం. హ్యాపీ బర్త్ డే సోనూ సూద్.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3fcMt2K
v

Bandla Ganesh: కోడి గుడ్లు తినండి సార్.. రాజమౌళికి బండ్ల గణేష్ భరోసా! ఏంటండీ ఇక్కడ కూడా!!

దేశంలో మహమ్మారి వీర విజృంభణ చేస్తోంది. సామాన్యుల నుంచి సెలబ్రిటీల దాకా అందరూ కరోనా బారిన పడుతుండటం చూస్తూనే ఉన్నాం. ముఖ్యంగా సినీ పరిశ్రమలో చాలామందికి సోకుతుండటం ఆందోళనకు గురి చేస్తోంది. ఈ క్రమంలోనే నిన్న (బుధవారం) దర్శకధీరుడు తనకు, తన కుటుంబ సభ్యులకు కరోనా నిర్ధారణ అయినట్లుగా పేర్కొంటూ ట్వీట్ చేయడంతో టాలీవుడ్ లోకం ఉలిక్కిపడింది. దాంతో పలువురు సినీ ప్రముఖులు రాజమౌళి త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తున్నారు. కాగా తనకు కరోనా పాజిటివ్ వచ్చిందని తెలిపిన రాజమౌళి.. ‘‘నా కుటుంబ సభ్యులకు, నాకు కొన్ని రోజులు క్రితం కాస్త జ్వరం వచ్చింది. దానికదే తగ్గిపోయింది. కానీ, మేం పరీక్ష చేయించుకున్నాం. ఈ రోజు వచ్చిన ఫలితాల్లో కొవిడ్ పాజిటివ్ అని తేలింది. డాక్టర్ల సూచన మేరకు మేమంతా హోం క్వారంటైన్‌లోకి వెళ్లిపోయాం. ప్రస్తుతం మాకు ఎలాంటి లక్షణాలు లేవు. అంతా బాగానే ఉన్నాం. అయినప్పటికీ అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం. డాక్టర్ల సూచనలు పాటిస్తున్నాం. రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి ప్రయత్నిస్తున్నాం. దీని వల్ల మేం ప్లాస్మా దానం చేయగలుగుతాం’’ అని పేర్కొన్నారు. Also Read: ఈ నేపథ్యంలో గతంలో కరోనాను జయించిన రాజమౌళికి ధైర్యం చెబుతూ ట్వీట్ పెట్టి అందరినీ ఆకర్షించారు. సార్.. కరోనా సోకిందని భయపడాల్సిన అవసరం లేదంటూ సింపుల్‌గా చెప్పేశారు. ఈ మేరకు.. ''ఏమీ కాదు.. సంతోషంగా, హాయిగా ఉండండి సార్. ప్రతి రోజు కోడి గుడ్లు తినండి. తగినంత విశ్రాంతి తీసుకోండి. ప్రశాంతంగా నిద్రపోండి'' అని ట్యాగ్ చేశారు బండ్ల గణేష్. ఆయన పెట్టిన ఈ ట్వీట్ చూసి డైరెక్టర్ రాజమౌళి కరోనాను జయించాలని కోరుకుంటూనే ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. ''ఏంటండీ.. ఇక్కడ కూడా పౌల్ట్రీ ఫామ్ ప్రమోషన్స్ చేస్తున్నారా?'' అనే కామెంట్సే ఎక్కువగా కనిపిస్తున్నాయి.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3feoUqh
v

సోనూ సూద్‌కు దర్శకుడు శ్రీను వైట్ల ఛాలెంజ్

రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన “గ్రీన్ ఇండియా ఛాలెంజ్” ప్రకృతి ప్రేమికులను కదిలస్తుంది. ఒక్కొక్కరుగా మొక్కలు నాటుతూ తమ సన్నిహితులను నామినేట్ చేస్తున్నారు. మరీ ముఖ్యంగా టాలీవుడ్ ఇండస్ట్రీ అంతా ఇప్పుడు “గ్రీన్ ఇండియా ఛాలెంజ్”ను గుండెల్లో పెట్టుకుంటోంది. ఈ మంచి కార్యక్రమంలో భాగంగా నిర్మాత, నటుడు బండ్ల గణేష్ విసిరిన ఛాలెంజ్‌ను స్వీకరించిన దర్శకుడు శ్రీను వైట్ల బుధవారం హైదరాబాద్, జర్నలిస్ట్ కాలనీలోని తన నివాసంలో మొక్కలు నాటారు. Also Read: అనంతరం శ్రీను వైట్ల మాట్లాడుతూ.. ‘‘గత మూడు దశాబ్దాల్లో రాజకీయ నాయకుల నుంచి సమాజానికి ఉపయోగపడే ఇంతమంచి మానవీయ కార్యక్రమాన్ని చూడలేదు. మొదటిసారిగా జోగినిపల్లి సంతోష్ గారు తన గొప్ప మనసుతో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమానికి రూపకల్పన చేసి నిరంతరం ముందుకు తీసుకుపోతూ సమాజానికి ఉపయోగపడే కార్యక్రమం చేస్తున్నారు. వారికి నా అభినందనలు తెలియజేస్తున్నాను. ఇంత మంచి కార్యక్రమంలో నేను భాగం కావడం అదృష్టంగా భావిస్తున్నాను’’ అని అన్నారు. ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోవడానికి తనవంతు బాధ్యతగా టాలీవుడ్ అందాల భామ కాజల్ అగర్వాల్, నటుడు - సమాజ సేవకుడు , టాలీవుడ్ యంగ్ హీరో విష్ణు మంచు, చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి, టీఎస్ఎండీసీ ఎండీ మల్సూర్, ప్రముఖ రచయిత గోపీ మోహన్‌ను గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌కు నామినేట్ చేస్తున్నట్టు శ్రీను వైట్ల తెలియజేసారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2BGRKSz
v

అక్షర హాసన్ మేకప్ ఆర్టిస్ట్ కరోనాతో మృతి.. భావోద్వేగానికి గురైన కమల్ కూతురు

కమల్ హాసన్ కుమార్తె, నటి అక్షర హాసన్‌ మేకప్ ఆర్టిస్ట్ సచిన్ దాదా కరోనా వైరస్‌తో ఇటీవల మృతిచెందారు. తనకెంతో ఇష్టమైన మేకప్ ఆర్టిస్ట్ అకాల మరణాన్ని అక్షర జీర్ణించుకోలేకపోతున్నారు. సచిన్‌ను గుర్తుచేసుకుంటూ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ఎమోషనల్ పోస్ట్ పెట్టారు అక్షర. సచిన్‌ను తన సోదరుడిగా అభివర్ణించారు. బాలీవుడ్‌లో తన తొలి చిత్రం ‘షమితాబ్’ నుంచి సచిన్ దాదా తనకు మేకప్ ఆర్టిస్ట్‌గా పనిచేస్తున్నారని చెప్పారు. ఆయన రాకతో తన జీవితంలో పాజిటివిటీ ఎలా పెరిగింది, ఆయనతో సరదాగా చేసిన ప్రాంక్స్ గురించి తన పోస్ట్‌లో అక్షర వివరించారు. Also Read: ‘‘ఈ మహమ్మారి వల్ల మనం చాలా మంది మంచి వ్యక్తులను కోల్పోయాం. ఈ బాధతో నా గుండె బరువెక్కింది. ఈరోజు బరువెక్కిన గుండెతో నేను ఈ పోస్ట్‌ను రాస్తున్నాను. ‘షమితాబ్’ నుంచి నాకు మేకప్ ఆర్టిస్ట్‌గా ఉన్న నా సోదరుడు సచిన్ దాదా కొవిడ్‌తో చనిపోయాడు. ఆయన ఎంతో సంతోషంగా, ఎప్పుడూ నవ్విస్తూ ఉండేవాడు. నేను ఎవరితో అయినా ప్రాంక్స్ చేశానంటే అది ఆయనే. ప్రతిభావంతుడు. వీటన్నింటి కన్నా ఆయన నాకు, ఆయన సహచరులకు గొప్ప స్నేహితుడు. ఇద్దరు కొడుకులకు అద్భుతమైన తండ్రి. ఒక భార్యకు గొప్ప భర్త. ఆయన కుటుంబం ఆరోగ్యంగా ఉండాలని, ఆయన ఎక్కడున్నా ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నా’’ అని అక్షర తన పోస్ట్‌లో పేర్కొన్నారు. కాగా, బాలీవుడ్ మూవీ ‘షమితాబ్’తో సినీ ప్రస్థానం మొదలైంది. ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, ధనుష్‌తో కలిసి అక్షర హాసన్ నటించారు. అక్షర పాండే పాత్రలో చక్కగా నటించి విమర్శకుల ప్రశంసల అందుకున్నారు. కానీ, అక్షరకు బాలీవుడ్‌లో అవకాశాలు మాత్రం రాలేదు. ఇక తమిళంలో అజిత్ హీరోగా వచ్చిన ‘వివేగం’ సినిమాలో అక్షర నటించారు. అక్షర చివరిగా చియాన్ విక్రమ్ హీరోగా నటించిన ‘కదరమ్ కొండాన్’ సినిమాలో కనిపించారు. ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన వచ్చింది. ప్రస్తుతం అక్షర ‘అగ్ని సిరగుగల్’ అనే తమిళ చిత్రంలో నటించారు. నవీన్ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమా షూటింగ్ తిరిగి ప్రారంభం కావాల్సి ఉంది. ఈ చిత్రంలో అరుణ్ విజయ్, విజయ్ ఆంటొని, ప్రకాష్, నాజర్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2DiUxl6
v

దర్శకధీరుడు రాజమౌళికి కరోనా పాజిటివ్

సినిమా ఇండస్ట్రీలో కరోనా బాధితులు పెరుగుతున్నారు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటికే బండ్ల గణేష్ కరోనా బారిన పడ్డారు. అలాగే, సమంత స్నేహితురాలు.. నటుడు సామ్రాట్ సోదరి శిల్పారెడ్డి కూడా కరోనా నుంచి కోలుకున్నారు. పలువురు టీవీ తారలకు కరోనా సోకింది. తాజాగా దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళికి కరోనా పాజిటివ్ వచ్చింది. ఈ విషయాన్ని ‘బాహుబలి’ దర్శకుడు స్వయంగా వెల్లడించారు. తనతో పాటు తన కుటుంబ సభ్యులకు కరోనా పాజిటివ్ వచ్చినట్టు రాజమౌళి ట్విట్టర్ ద్వారా పేర్కొన్నారు. Also Read: ‘‘నా కుటుంబ సభ్యులకు, నాకు కొన్ని రోజులు క్రితం కాస్త జ్వరం వచ్చింది. దానికదే తగ్గిపోయింది. కానీ, మేం పరీక్ష చేయించుకున్నాం. ఫలితాలు ఈరోజు వచ్చాయి. కొవిడ్ పాజిటివ్ వచ్చింది. డాక్టర్ల సూచన మేరకు మేమంతా హోం క్వారంటైన్‌లోకి వెళ్లిపోయాం. మాకు ఎలాంటి లక్షణాలు లేవు. అంతా బాగానే ఉన్నాం. అయినప్పటికీ అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం. డాక్టర్ల సూచనలు పాటిస్తున్నాం. రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి ప్రయత్నిస్తున్నాం. దీని వల్ల మేం ప్లాస్మా దానం చేయగలుగుతాం’’ అని రాజమౌళి పేర్కొన్నారు. ప్రస్తుతం రాజమౌళి ‘RRR’ సినిమాతో బిజీగా ఉన్నారు. పాన్ ఇండియా మూవీగా రూపొందుతోన్న ఈ భారీ చిత్రం షూటింగ్ లాక్‌డౌన్ వల్ల తాత్కాలికంగా ఆగిపోయింది. ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం షూటింగ్‌కు అనుమతులు ఇచ్చినా రాజమౌళి మాత్రం RRR షూటింగ్‌ను తిరిగి ప్రారంభించలేదు. దీనికి కారణం కరోనా మహమ్మారే. ఈ భయానక పరిస్థితుల్లో ఎన్టీఆర్, రామ్ చరణ్, అజయ్ దేవగణ్ వంటి స్టార్లతో పనిచేయడం కష్టమని భావించి ప్రస్తుతానికి షూటింగ్‌ను వాయిదా వేసుకున్నారు. ఇలాంటి సమయంలో రాజమౌళితోపాటు ఆయన కుటుంబానికి కరోనా సోకడం బాధాకరం. Also Read:


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3hOJcsc
v

పుట్టినరోజు నాడు మరో మంచి పని చేస్తున్న సోనూ సూద్

నటుడు తన పుట్టినరోజును సేవచేయడానికి మరో అవకాశంగా మార్చుకుంటున్నారు. కరోనా సంక్షోభంలో విశ్రాంతి లేకుండా పనిచేసిన సోనూ సూద్.. తన సేవలను కొనసాగిస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో రేపు (జులై 30న) తన పుట్టినరోజు సందర్భంగా దేశ వ్యాప్తంగా ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించనున్నట్టు సోనూ సూద్ వెల్లడించారు. ఈ వైద్య శిబిరాల ద్వారా 50 వేల మందికి సేవలు అందించనున్నట్టు చెప్పారు. ఈ వైద్య శిబిరాలను నిర్వహించేందుకు గ్రామ పంచాయతీలు, ముఖియాలతో సోనూ సూద్ సంప్రదింపులు జరుపుతున్నట్టు సమాచారం. భౌతిక దూరాన్ని పాటిస్తూ ఈ వైద్య శిబిరాలను నిర్వహించబోతున్నట్టు సోనూ సూద్ స్పష్టం చేశారు. ఉత్తర ప్రదేశ్, జార్ఖండ్, పంజాబ్, ఒడియా రాష్ట్రాల్లో ఉచిత మెడికల్ క్యాంప్‌లు నిర్వహించడానికి అక్కడి డాక్టర్లతో మాట్లాడుతున్నట్టు సోనూ సూద్ వెల్లడించారు. జులై 30న సోనూ సూద్ 47 ఏట అడుగుపెడుతున్నారు. ఈ రోజును తన జీవితంలో ఒక ప్రత్యేక రోజుగా మార్చుకోవాలని సోనూ సూద్ చూస్తున్నారు. ఇవి ఎప్పుడూ నిర్వహించే వైద్య శిబిరాల మాదిరిగా ఉండవని.. కొవిడ్-19 నిబంధనలు పాటిస్తూ నిర్వహించాలి కాబట్టి కాస్త ఇబ్బంది ఉండొచ్చని ఆయన తెలిపారు. Also Read: కరోనా సంక్షోభ సమయంలో సోనూ సూద్ చేసిన సామాజిక సేవ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కొన్ని వేల మంది వలస కూలీలను ఆయన ఆదుకున్నారు. ముంబైలో తిండిలేక ఇబ్బంది పడుతోన్న వలస కూలీల పొట్టలు నింపారు. ఉపాధి లేక ఆర్థికంగా ఇబ్బంది పడుతూ సొంతూళ్లకు ముంబై నుంచి వేల కిలోమీటర్లు నడిచి వెళ్తున్న వలస కూలీల పరిస్థితిని చూసి చలించిపోయి సొంతంగా బస్సులు ఏర్పాటుచేసి వారిని తరలించారు. అంతేనా, కేరళలోని కొచ్చి నుంచి ఒడిశాలోని భువనేశ్వర్‌కు ఒక ప్రత్యేక విమానం ఏర్పాటుచేసి వలస కూలీలను తరలించారు. తాజాగా, చిత్తూరు జిల్లాకు చెందిన రైతుకు ట్రాక్టర్ కొనిచ్చారు. సాఫ్ట్‌వేర్ ఉద్యోగం కోల్పోయి కూరగాయలు అమ్ముకుంటోన్న వరంగల్ యువతి శారదకు ఉద్యోగం ఇప్పించారు. ఆమెకు ఆఫర్ లెటర్ కూడా పంపించారు. సినిమాల్లో విలన్ పాత్రలు పోషించే సోనూ.. ఇలాంటి మంచి పనులతో రియల్ లైఫ్‌లో హీరోగా మారారు. ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో సినిమా తారలు తమ పుట్టినరోజు వేడుకలను రద్దు చేసుకుంటుంటే.. సోనూ సూద్ మాత్రం ఉచిత వైద్య శిబిరాల ద్వారా బర్త్‌డేను సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఎంతైనా సోనూ భయ్యా గ్రేట్.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2DcF32a
v

శివాజీ రాజా కుమారుడి కొత్త చిత్రం ప్రారంభం

నటుడు శివాజీ రాజా కుమారుడు విజయ్ రాజా హీరోగా పరిచయమైన సంగతి తెలిసిందే. ‘ఏదైనా జరగొచ్చు’ సినిమా ద్వారా కిందటేడాది విజయ్ రాజా హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఆ తరవాత ‘జెమ్’ అనే సినిమాను అంగీకరించాడు. ఇప్పుడు మరో సినిమాను ప్రారంభించాడు. జయ దుర్గాదేవి మల్టీమీడియా పతాకంపై విజయ్ రాజా, తమన్నా వ్యాస్ హీరో హీరోయిన్లుగా రామ్స్ రాథోడ్ దర్శకత్వంలో తూము నరసింహ పటేల్ నిర్మిస్తున్న చిత్రం ఈరోజు హైదరాబాద్‌లోని శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానంలో ఘనంగా ప్రారంభమైంది. హీరో ముఖ్య అతిథిగా విచ్చేసి ముహూర్తం షాట్‌‌కి క్లాప్ కొట్టారు. చిత్ర యూనిట్‌కి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ చిత్రంలో అయిదు పాటలు ఉంటాయని చిత్ర యూనిట్ వెల్లడించింది. హైదరాబాద్, వైజాగ్, చెన్నై, మున్నార్, గోవా లాంటి ప్రదేశాల్లో సినిమా చిత్రీకరణ జరుగుతుందన్నారు. చిత్ర ప్రారంభోత్సవం సందర్భంగా హీరో విజయ్ రాజా మాట్లాడుతూ.. ‘‘మా చిత్రం ప్రారంభోత్సవానికి విచ్చేసిన హీరో నాగశౌర్య అన్నకి ధన్యవాదాలు. నాకు హీరోగా అవకాశం ఇచ్చినందుకు మా దర్శకుడు, నిర్మాతకి ధన్యవాదాలు. కథ చాలా బాగుంది’’ అని తెలిపారు. దర్శకుడు రామ్స్ రాథోడ్ మాట్లాడుతూ.. ‘‘నాకు అవకాశం ఇచ్చిన నిర్మాత తూము నరసింహ పటేల్ గారికి నా ధన్యవాదాలు. నాకు మంచి నిర్మాత దొరికారు, ఎంతో ప్యాషన్ ఉన్న వ్యక్తి. ఓపెనింగ్‌కి వచ్చిన హీరో నాగశౌర్యకి నా ధన్యవాదాలు. మా హీరో విజయ్ రాజా ఈ చిత్రానికి పర్ఫెక్ట్. ఇది పూర్తి ఎంటర్‌టైనర్ చిత్రం. శివాజీ రాజా కథ విన్నారు. ఆయనికి కథ బాగా నచ్చింది. మా హీరో మాస్‌కి క్లాస్‌కి రెండిటికి సూట్ అవుతారు. అయన ఎనర్జీ లెవెల్ చాలా బాగుంది. హీరోయిన్ తమన్నా వ్యాస్ ఒడిశాలో టాప్ హీరోయిన్, మంచి నటి. నిర్మాత గారి తమ్ముడు ఇందులో చాలా ముఖ్యమైన క్యారెక్టర్ చేస్తున్నారు’’ అని తెలిపారు. Also Read: శివాజీ రాజా మాట్లాడుతూ.. ‘‘ఈరోజు నుంచి ఈ సినిమా షూటింగ్ మొదలైంది. కథ బాగుంది. నాగశౌర్యకి కృతజ్ఞతలు. ఈ చిత్రం మంచి విజయం సాదించాలి’’ అని అన్నారు. హీరోయిన్ తమన్నా వ్యాస్ మాట్లాడుతూ.. ‘‘ఇది నా మొదటి తెలుగు సినిమా. నాకు అవకాశం ఇచ్చిన దర్శకుడు, నిర్మాతకి ధన్యవాదాలు’’ అని తెలిపారు. నిర్మాత తూము నరసింహ పటేల్ మాట్లాడుతూ.. ‘‘ఇది మా మొదటి సినిమా. మా కార్యక్రమానికి వచ్చినందుకు హీరో నాగశౌర్యకి ధన్యవాదాలు. మంచి కథతో వస్తున్నాం, చాలా గ్రాండ్‌గా ఈ చిత్రాన్ని చిత్రీకరిస్తున్నాం. శివాజీ రాజా గారి అబ్బాయి విజయ్ రాజాతో చేయటం చాలా సంతోషంగా ఉంది. మీ అందరి ఆశీర్వాదం కావాలి’’ అని అన్నారు. కాగా, ఈ చిత్రంలో శివాజీ రాజా, సత్యం రాజేష్, జ్ఞాన ప్రియ, వెంకట్ నారాయణ, సన, అనంత్, చమ్మక్ చంద్ర, మిర్చి హేమంత్, రోహిణి, జబర్దస్త్ అప్పారావు, జబర్దస్త్ మురళి, రైజింగ్ రాజు, గడ్డి సుబ్బారావు, రాజేంద్ర కుమార్, కోట యశ్వంత్ తదితరులు నటిస్తున్నారు. శ్రీనాథ్ రెడ్డి కథ, మాటలు అందిస్తోన్న ఈ చిత్రానికి కె.బుజ్జి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. గ్యానీ సింగ్ సంగీతం సమకూరుస్తున్నారు. బి. జగన్ ఆర్ట్ డైరెక్టర్. వినోద్ ఎడిటర్.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3gbWDSm
v

ఐదేళ్ల సహజీవనం.. ప్రముఖ సింగర్‌‌తో గబ్బర్ ‘సింగ్’ విలన్ పెళ్లి

సర్దార్ గబ్బర్ సింగ్, కిక్, జిల్ చిత్రాల్లో ప్రతినాయకుడిగా మెప్పించి తెలుగు ప్రేక్షకులకు చేరువైన కబీర్ దుహాన్ సింగ్ పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడు. తెలుగుతో పాటు తమిళ్, హిందీ భాషల్లో విలన్‌గా మెప్పిస్తున్న గత కొన్నేళ్లేగా ప్రముఖ సింగర్ డాలీ సింధూతో సహజీవనం చేస్తున్నారు. స్నేహితురాలి ద్వారా పరిచయం అయిన డాలీ-కబీర్‌ల మధ్య స్నేహం చిగురించి అది ప్రేమగా మారింది. దీంతో పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకున్న వీరు.. గత ఐదేళ్లుగా సహజీవనం చేస్తున్నారు. జూన్‌లో ఎంగేజ్‌మెంట్ చేసుకున్న డాలీ-కబీర్ జంట త్వరలో పెళ్లిపీటలు ఎక్కేందుకు ముహూర్తం ఫిక్స్ చేసుకున్నారు. డిసెంబర్‌లో తాము పెళ్లి చేసుకోబోతున్నట్టు వెల్లడించారు కబీర్.. ముంబైలో సాంప్రదాయ పద్దతిలో పెళ్లి చేసుకుని ఢిల్లీలో రిసెప్షన్‌కి ప్లాన్ చేస్తున్నారట. కరోనా నేపథ్యంలో నిరాడంబరంగానే కొద్దిమంది సమక్షంలో ఈ వివాహం జరగబోతున్నట్టు తెలిపారు. నిజానికి ఈ నవంబర్‌లో గోవాలో డిస్టినేషన్ పద్దతిలో పెళ్లి చేసుకోవాలని అనుకున్నారని.. అయితే కరోనా పరిస్థితుల నేపథ్యంలో పెళ్లిని మరికొంతకాలం వాయిదా వేసినట్టు చెప్పుకొచ్చారు కబీర్ సింగ్.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/307xClK
v

మెగాస్టార్‌ కాంప్లిమెంట్‌తో ఆస్కార్‌ వచ్చినంత సంబరపడ్డా: దర్శకుడు శ్రీధర్ సీపాన

‘లౌక్యం’ తెలిసిన రచయిత శ్రీధర్‌ సీపాన. ఏకకాలంలో ఐదారు చిత్రాలకు పని చేయగల సమర్ధుడు. ఆయన మాటల ‘పూలరంగడు’. వినోదంతో పాటు విలువైన విషయాలను చక్కగా చెప్పగలడు. కమర్షియల్‌ కథలకు కత్తిలాంటి మాటలు రాసి, కామెడీతో ప్రేక్షకులను మెప్పించగల రైటర్‌. ‘లౌక్యం’, ‘పూలరంగడు’, ‘ఆహనా పెళ్ళంట’ తదితర విజయవంతమైన చిత్రాలకు ఆయన రచయితగా పని చేశారు. జూలై 29న శ్రీధర్‌ సీపాన పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయనతో ఇంటర్వ్యూ... బర్త్‌డేను ఎలా సెలబ్రేట్‌ చేసుకున్నారు? స్పెషల్‌ సెలబ్రేషన్స్‌ ఏమీ లేవు. ఫ్యామిలీ మెంబర్స్‌ మధ్య ఇంట్లో సెలబ్రేట్‌ చేసుకున్నా. ప్రజెంట్‌ కరోనా వల్ల అత్యవసరం అయితే తప్ప బయటకు వెళ్ళడం లేదు. ఇల్లు, ఆఫీసు, పని అంతే! రైటర్‌గా ఈ ఇయర్‌ ఎలా ఉంది? నేను అయితే ఎప్పటికీ మరువలేను. మెగాస్టార్‌ గారు, చక్కటి సందేశాత్మక కథలకు కమర్షియల్‌ విలువలు మేళవించి సినిమాలు రూపొందించే దర్శకుడు కొరటాల శివ గారి కాంబినేషన్‌లో ఫస్ట్‌టైమ్‌ వస్తున్న ‘ఆచార్య’ సినిమా స్ర్కిప్ట్‌ వర్క్‌లో పాలు పంచుకున్నా. వాళ్ళిద్దరితో మంచి రిలేషన్‌ ఏర్పడింది. అలాగే, దర్శకుడిగా నా మొదటి సినిమా స్ర్కిప్ట్‌ వర్క్‌ కంప్లీట్‌ చేశా. చిరంజీవి గారి అల్లుడు కళ్యాణ్‌ దేవ్‌ హీరోగా జీఏ2 పిక్చర్స్‌ సమర్పణలో పీపుల్స్‌ మీడియా ఫ్యాక్టరీ టీజీ విశ్వప్రసాద్‌ గారు, అభిషేక్‌ అగర్వాల్‌ ఆర్ట్స్‌ అభిషేక్‌ గారు నిర్మిస్తారు. Also Read: దర్శకులుగా మారుతున్న రచయితల జాబితాలో మీరు చేరుతున్నారన్నమాట! తన ఊహలకు అనుగుణంగా తన కథను తెరపై ఆవిష్కరించుకున్నప్పుడు రచయితలకు కిక్‌ వస్తుంది. సంతృప్తి దొరుకుతుంది. ఆ కిక్‌ కోసమే రచయితలందరూ దర్శకులు అవుతారు. నేనూ అలాగే ఆలోచించి మెగాఫోన్‌ పట్టాను. దర్శకుడు అవుతున్నారు. రచన పరంగా ఇతర దర్శకుల సినిమాలకు దూరంగా ఉంటారా? అటువంటిది ఏమీ లేదు. రచన, దర్శకత్వం.. రెండూ నాకు రెండు కళ్ళు వంటివి. ఓ కన్ను కోసం మరో కన్నును వదులుకోలేను. రచయితగా ఒక్కోసారి ఐదారు చిత్రాలకు పని చేసిన సందర్భాలు ఉన్నాయి. అందువల్ల, దర్శకత్వంతో పాటు అవకాశాలు వస్తే రచయితగా కూడా కొనసాగుతా. రైటింగ్‌కి దూరం కాను. కేవలం నా సినిమాలు మాత్రమే కాకుండా ఇతరుల సినిమాలకు కూడా రాస్తా. దర్శకుడినైనా రచయితగా నా ప్రయాణం కొనసాగుతూనే ఉంటుంది. కళ్యాణ్‌ దేవ్‌తో మీ సినిమా ఎలా ఉండబోతుంది? కంప్లీట్‌ ఎంటర్‌టైనర్‌ అది. ప్రేక్షకులను పూర్తిగా నవ్విస్తుంది. అలాగే, మధ్య మధ్యలో మంచి ఎమోషనల్‌ సీన్స్‌ కూడా ఉంటాయి. చిరంజీవి గారికి ఆ సినిమా కథ చెప్పారా? ‘ఆచార్య’ స్ర్కిప్ట్‌ వర్క్‌లో పాలు పంచుకున్నానని చెప్పాను కదా! అలా చిరంజీవి గారితో పరిచయం ఏర్పడింది. ఆయన దగ్గరకు కథ చెప్పడానికి కళ్యాణ్‌ దేవ్‌ నన్ను తీసుకువెళ్ళారు. కథంతా విన్నాక ‘సుదీర్ఘంగా కథ వింటున్నప్పుడు మధ్యలో రెప్పలు పడతాయి. నువ్వు కథ చెబుతుంటే రెప్ప వేయకుండా విన్నాను. ఆద్యంతం నవ్వుతూ విన్నాను’ అని చిరంజీవి గారు చెప్పారు. ఆ మాట ఆస్కార్‌ అవార్డు వచ్చినంత సంతృప్తినిచ్చింది. అలాగే, రాఘవేంద్రరావు గారు, కొరటాల శివ గారు విని బావుందని మెచ్చుకున్నారు. ప్రోత్సహించారు. Also Read: రచయితగా, దర్శకుడిగా మీ లక్ష్యం ఏంటి? ప్రతి సినిమాతో ప్రేక్షకులకు చక్కటి వినోదాన్ని అందించడమే నా లక్ష్యం. హెల్దీ కామెడీ అందిస్తా. మీ ఫ్యూచర్‌ ప్రాజెక్ట్స్‌? కళ్యాణ్‌ దేవ్‌ సినిమా చేస్తున్నా. అలాగే, రాఘవేంద్రరావు గారు దర్శకత్వం వహించనున్న ఓ సినిమాకి సంభాషణలు రాస్తున్నా. అనిల్‌ సుంకర నిర్మాణంలో మరో సినిమా చేయాలి. శ్రీనివాస్‌ వంగాల నిర్మాణంలో నేను దర్శకత్వం వహించిన ‘బృందావనమది అందరిదీ’ షూటింగ్‌ కంప్లీట్‌ చేశా. కళ్యాణ్‌ దేవ్‌ సినిమా తర్వాత ఓటీటీలో ఆ సినిమా రిలీజవుతుంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/310RrdV
v

సుప్రీం కోర్టును ఆశ్రయించిన సుశాంత్ సింగ్ గర్ల్‌ఫ్రెండ్

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ గర్ల్‌ఫ్రెండ్ రియా చక్రవర్తిపై ఆయన కుటుంబం కేసు పెట్టిన సంగతి తెలసిందే. సుశాంత్ తండ్రి కె.కె.సింగ్ ఫిర్యాదు మేరకు ఇండియన్ పీనల్ కోడ్‌లోని పలు సెక్షన్ల కింద మంగళవారం పాట్నా పోలీసులు రియాపై కేసు నమోదు చేశారు. రియాను విచారించేందుకు పాట్నా పోలీసులు ముంబైకి వెళ్లారు. అయితే, ఈ కేసును పాట్నా నుంచి ముంబైకి బదిలీ చేయాలని కోరుతూ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు రియా లాయర్ సతీష్ మనేషిండే సుప్రీం కోర్టులో బుధవారం పిటిషన్ వేశారు. కాగా, పాట్నాలో నమోదైన కేసుకు సంబంధించిన వివరాలను సెంట్రల్ రేంజ్ ఇన్‌స్పెక్టర్ జనరల్ సంజయ్ కుమార్ సింగ్ వెల్లడించారు. ‘‘రియా చక్రవర్తిపై రాజీవ్ నగర్ పోలీస్ స్టేషన్‌లో కేకే సింగ్ కేసు నమోదు చేశారు. ఆమెతో పాటు కుటుంబ సభ్యులు ఇంద్రజిత్ చక్రవర్తి, సంధ్య చక్రవర్తి, శృతి మోదీ, శోవిక్ చక్రవర్తి, మరికొంత మందిపై ఐపీసీ సెక్షన్లు 341, 342, 380, 406, 420, 306, 120 (బి) కింద కేసులు నమోదయ్యాయి. రియా చక్రవర్తి, ఆమె కుటుంబంపై కఠిన చర్యలు తీసుకోవాలని సుశాంత్ తండ్రి కోరారు. రియా తన స్వార్థం కోసం సుశాంత్‌ను తన ఫ్యామిలీకి పూర్తిగా దూరం చేసిందని ఆయన ఆరోపించారు. సుశాంత్ బ్యాంక్ ఖాతాను కూడా ఆమెనే ఆపరేట్ చేస్తోందని చెప్పారు. సుశాంత్ బ్యాంక్ ఖాతా నుంచి కొన్ని కోట్ల రూపాయలు విత్‌డ్రా అయ్యాయని ఇప్పటికే గుర్తించాం’’ అని సంజయ్ కుమార్ సింగ్ చెప్పారు. Also Read: సుశాంత్ బ్యాంక్ బ్యాలెన్స్ తరిగిపోతున్నట్టు జూన్ 8న రియా గుర్తించిందని.. ఆ తరవాత డబ్బు, ఆభరణాలు, ల్యాప్‌టాప్, క్రెడిట్ కార్డ్, దాని పిన్ నంబర్, పాస్‌వర్డ్, ముఖ్యమైన పత్రాలు, డాక్టర్లు ఇచ్చిన రిసిప్ట్‌లు తీసుకొని వెళ్లిపోయిందని సుశాంత్ తండ్రి తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇదిలా ఉంటే, సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ జూర్ 14న బాంద్రాలోని తన అపార్ట్‌మెంట్‌లో ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. అప్పటికి ఆయన వయసు 34 సంవత్సరాలు. ఈ కేసులో ఇప్పటికే ముంబైలో పోలీసులు 40 మందిని విచారించారు. వీరిలో రియా చక్రవర్తి కూడా ఉన్నారు. అయితే, సుశాంత్ ఆత్మహత్య కేసును సీబీఐకి అప్పగించాలని ఇప్పటికే రియా కోరారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3jSk9Gk
v

వైసీపీకి 130 సీట్లు, జనసేన ఓటమి, లోకేష్ గెలవడట: బండ్ల వారి లెక్కలు

నీ బండ బడా.. ఈ ఉన్నాడే.. రాజకీయాల్లో ఇప్పుడు లేడు కాని.. ఉన్నన్నాళ్లూ సినీ, రాజకీయ వర్గాల్లో కామెడీకి కొదువలేకుండా చేశారు. నిర్మాత, కమెడియన్ బండ్ల గణేష్ గత ఎన్నికల్లో పొలిటీషియన్ అవతారం ఎత్తాడు. ఎన్నికలు రాకముందే ‘బండ్ల గణేష్ అనే నేను’ అంటూ టీవీ ఇంటర్వ్యూలలో ప్రమాణస్వీకారం కూడా చేసేశారు. అంతేకాదు తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవకపోతే.. 7 Clock బ్లేడ్‌తో పీక కోసుకుంటా అని ఎన్నికల తరువాత రిపోర్టర్లు బ్లేడ్ పట్టుకుని తిరిగేలా చేశారు బండ్ల. ఆ తరువాత బుద్ది వచ్చింది బాబోయ్.. ఇక జన్మలో రాజకీయాలు జోలికి పోను.. ఇక సినిమాలే చేసుకుంటా అంటూ లెంపలు వేసుకున్నారు. ఇటీవల కరోనాను జయించిన బండ్ల గణేష్.. పాలిటిక్స్‌లో లేను అంటూ ఏపీ పాలిటిక్స్‌పై ఆసక్తికర కామెంట్స్ చేశారు. తన దేవుడు జనసేన అధినేత గురించి మాట్లాడుతూ.. పవన్ సినిమాలపై మాట్లాడగలను కాని.. ఆయన రాజకీయ ప్రస్థానం ఆయన ఇష్టం. జనసేన పార్టీకి ఒక్క సీటే రావడం.. పవన్ కళ్యాణ్ రెండు చోట్లా ఓడిపోవడం బాధగానే అనిపించింది. ఆయన గెలిస్తే బాగుండేదని అనుకున్నా.. అయితే పవన్ కళ్యాణ్ జనసేన పెట్టినప్పటికీ కూడా.. ఆ పార్టీ ఓడిపోతుందని నాకు ముందే తెలుసు. Also Read: అక్కడ వైఎస్ఆర్సీపీ ఖచ్చితంగా గెలుస్తుందని.. 130 సీట్లు పక్కాగా వస్తాయని నాకు ముందే తెలుసు. ఢిల్లీలో నాకు లగడపాటి మధు అని ఫ్రెండ్ ఉన్నారు.. ఆయనకు ఎన్నికల ఫలితాలపై బాగా అవగాహన ఉండేది.. ఆయనే చెప్పారు.. జగన్ 130 సీట్లకు పైగా గెలుస్తున్నాడు అని. అన్ని సీట్లు ఎందుకు వస్తాయి సార్ అనేవాడిని కాని.. లోకేష్ కూడా ఓడిపోతున్నాడని ఆయన ముందే చెప్పారు. అదేంటి సార్.. అంటే!! చూడు ఏం జరుగుతుందో అన్నారు. ఆయన అన్నట్టుగానే లోకేష్ ఓడిపోయాడు. Also Read: అలా లోకేష్ ఓడిపోతున్న విషయం నాకు ముందుగానే తెలుసు. లోకేష్ సీఎం అవుతాడో లేదో నాకు తెలియదు.. నాకు అవకాశం వస్తే నేనే అవుతా.. లేదంటే నా కొడుకుని చేస్తా కాని.. లోకేష్ సీఎం అవుతాడో లేదో నేను చెప్పలేను. ప్రస్తుతం నేను ఏ పార్టీలోనూ లేను.. పాలిటిక్స్ నాకు సంబంధం లేని విషయం’ అంటూ చెప్పుకొచ్చారు బండ్ల గణేష్.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2P7LSF4
v

వర్మ ‘థ్రిల్లర్’ ట్రైలర్: 9 భాషల్లో విడుదల.. డేట్, టైమ్ ఫిక్స్

సెన్సేషనల్ డైరెక్టర్ వరుస సినిమాలతో ఆడియన్స్‌కు ఎంటర్‌టైన్మెంట్‌ను అందిస్తున్నారు. ఈ లాక్‌డౌన్ సమయంలో సినిమా ఇండస్ట్రీ మొత్తం సంక్షోభంలో ఉంటే.. వర్మ మాత్రం వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. తక్కువ నిడివి గల సినిమాలు తీస్తూ వాటిని ఆన్‌లైన్‌లో విడుదల చేస్తూ డబ్బులు చేసుకుంటున్నారు. ఇప్పటికే ‘క్లైమాక్స్’, ‘నగ్నం’, ‘పవర్ స్టార్’ సినిమాలను వర్మ విడుదల చేశారు. ఇంకా చాలా సినిమాలు వర్మ దగ్గర ఉన్నాయి. వాటిలో ఒకటి ఇప్పుడు విడుదలకు సిద్ధమవుతోంది. అదే ‘థ్రిల్లర్’. Also Read: అప్సర రాణి, రాక్ కచ్చి జంటగా నటించిన ఈ రొమాంటిక్ మూవీకి ఇప్పటికే కావాల్సినంత ప్రచారం చేసేశారు వర్మ. హీరోహీరోయిన్లతో నగ్నంగా ఫొటోషూట్ చేసి సెన్సేషన్ క్రియేట్ చేశారు. ఈ మూవీ ట్రైలర్‌ను రేపు (జులై 30న) ఉదయం 11 గంటలకు వర్మ విడుదల చేస్తున్నారు. మొత్తం 9 భాషల్లో ఈ ట్రైలర్ విడుదలవుతోంది. తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళం, మరాఠి, భోజ్‌పురి, గుజరాతి, ఒడియా భాషల్లో విడుదల చేస్తున్నారు. త్వరలోనే సినిమాను కూడా విడుదల చేయనున్నట్టు వర్మ ట్వీట్ చేశారు. ఆర్జీవీ వరల్డ్ థియేటర్, శ్రేయాస్ ఈటీ ప్లాట్‌ఫాంలలో ఈ సినిమాను విడుదల చేస్తున్నారు. ఇదిలా ఉంటే, వర్మ మంగళవారం ‘మర్డర్’ ట్రైలర్‌ను విడుదల చేశారు. తెలుగు రాష్ట్రాల్లో సెన్సేషన్ క్రియేట్ చేసిన ప్రణయ్ హత్య కథతో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ‘మర్డర్’ ట్రైలర్‌కు మంచి స్పందన వస్తోంది. ఈ సినిమాను థియేటర్లలోనే విడుదల చేయనున్నట్టు నిర్మాతలు స్పష్టం చేశారు. ఆనంద్ చంద్ర దర్శకత్వంలో రూపొందుతోన్న ‘మర్డర్’ సినిమాను నట్టీస్ ఎంటర్‌టైన్మెంట్, క్విటీ ఎంటర్‌టైన్మెంట్ పతాకాలపై అనురాగ్ కంచర్ల సమర్పణలో నట్టి కరుణ, నట్టి క్రాంతి నిర్మిస్తున్నారు. శ్రీకాంత్ అయ్యంగార్, సాహితి, భార్గవి ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా విషయంలో ఇప్పటికే వైశ్యులు వర్మపై కేసులు పెడుతున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2CXS9AB
v

చిరంజీవిపై తప్పుడు ప్రచారం.. అసలు నిజం చెప్పిన వర్మ.. మెగా ఫ్యాన్స్ నమ్మాల్సిందే

వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మకి మెగా ఫ్యామిలీతో ఉన్న వివాదం ఏంటి?? అసలు ఆయన పదే పదే మెగా ఫ్యామిలీనే ఎందుకు టార్గెట్ చేస్తారు.. ఈయన తిట్టడమే కాకుండా శ్రీరెడ్డి లాంటి వివాదాస్పద నటితో తిట్టించేటంత కసి ఈయనలో ఎందుకు?? ఈయనతో సినిమా చేయలేదనే కారణంగా ఆ ఫ్యామిలీపై కసి పెంచుకున్నారా?? , పవన్ కళ్యాణ్ మాత్రమే కాదు.. ఆ కుటుంబం నుంచి వచ్చిన ఏ హీరో కూడా వర్మతో పనిచేయకపోవడానికి కారణం ఏమై ఉంటుంది.. వర్మతో మెగా ఫ్యామిలీకి నిజంగానే విభేధాలు ఉన్నాయా?.. ఈ ప్రశ్నలు మెగా అభిమానుల్లోనే కాదు.. సగటు ప్రేక్షకుడి మదిలో మెదులుతూ ఉంటాయి. అయితే వీటిపై ఎట్టకేలక క్లారిటీ ఇచ్చారు . అంతేకాదు గతంలో చిరంజీవి, పవన్ కళ్యాణ్‌లతో సినిమా ఎందుకు వదులు కోవాల్సి వచ్చిందో కూడా వివరించారు. పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతూ.. ‘ఇది పాతికేళ్ల నాటి విషయం.. అప్పటికి పవన్ కళ్యాణ్ హీరోగా ఎంట్రీ ఇవ్వాలేదు.. అరంగేట్రం కోసం ఎదురుచూస్తున్నారు. అప్పట్లో నేను ఆయనకు ఒక కథ వినిపించా.. ఆ కథలో ఆయన హీరో కాదు.. కీలకమైన రోల్. అయితే హీరోగా ఎంట్రీ ఇచ్చే ఆలోచన ఉన్న పవన్ కళ్యాణ్ ఆ పాత్ర చేయనన్నారు. అది ఆయన ఇష్టం.. నిజానికి పవన్ తీసుకున్న నిర్ణయం మంచిదే.. ఎందుకంటే పవన్ చేయనన్న పాత్ర నేను వేరే వాళ్లతో చేయించా.. ఆ సినిమా అట్టర్ ఫ్లాప్ అయ్యింది. ఆ తరువాత పవన్‌ని పలు సందర్భాల్లో మాట్లాడాను.. పార్టీ స్థాపించినప్పుడు కూడా ఫోన్ చేసి అభినందించా. నిజానికి పాతికేళ్ల క్రితం జరిగింది నాకే కాదు.. ఆయనకి కూడా గుర్తుండకపోవచ్చు. అప్పుడే అనిపించింది పవన్ కళ్యాణ్ జడ్జిమెంట్ రాంగ్ కాదు అని. ఇక చిరంజీవితో నాకు విభేదాలు.. మెగా ఫ్యామిలీతో పడదని అంటారు... వాళ్లంటే కోపం అని అంటారు. నిజానికి నేను నా లైఫ్‌లో నేను ఎవరిపైన కోప్పడను. ఎందుకంటే.. నేను అంత ఇంపార్టెన్స్ ఇవ్వను. కోపం అనేది వ్యాలిబుల్ ఎమోషన్. నాకు ఏ మాత్రం ఇంటరాక్షన్ లేకుండా ఒక మనిషిపై కోపం చూపించాల్సిన అవసరం నాకేం ఉంది.. నాకు చిరంజీవి ఫ్యామిలీపై కోపం లేదు.. పగ లేదు.. ఏం లేదు. చిరంజీవితో సినిమా చేయాలని అనుకున్నాను.. కథ ఆయనకు నచ్చింది.. అయితే నేను చేసిన మిస్టేక్స్ వల్ల ఆ సినిమా ఆగిపోయింది. ఆ సినిమా ఆగిపోయిన సందర్భంలో ఆయన చెప్పకుండానే.. నేనే పత్రికాముఖంగా అందులో నా తప్పే ఉందని ఎన్నోసార్లు చెప్పాను. అప్పట్లో ఊర్మిళ, చిరంజీవితో సినిమా తీయాలని అనుకున్నా.. నా మిస్టేక్స్ వల్ల ఆ సినిమా మధ్యలోనే ఆగిపోయింది. చిరంజీవి గారు చేసిన తప్పు లేదు.. ఆ ప్రాజెక్ట్ ఆగిపోవడానికి కారణం.. ఆయన నా డైరెక్షన్‌లో వేలు పెట్టారని రూమర్స్ వచ్చాయి. అవి నిజం కాదు. అదంతా తప్పుడు ప్రచారం.. చిరంజీవి ప్రొఫెషనల్ యాక్టర్. నా సినిమానే కాదు.. ఆయన ఎవరి సినిమాలోనూ వేలు పెట్టరు. నటుడిగా పూర్తి న్యాయం చేయడానికి చూస్తారు. సినిమా ఆగిపోవడానికి రీజన్ అది కాదు.. నా పర్శనల్ రీజన్. ఇందులో చిరంజీవి గారి తప్పు లేదు’ అంటూ అసలు విషయం చెప్పుకొచ్చారు రామ్ గోపాల్ వర్మ.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3fbeKqu
v

‘బిగ్ బాస్ 4’లో విష్ణుప్రియ: రిలాక్స్‌గా ఉండండి.. క్లారిటీ ఇచ్చిన యాంకర్

బిగ్ బాస్ తెలుగు సీజన్ 4కి రంగం సిద్ధమైంది. ఆగస్టు ఆఖరి వారంలో షో ప్రారంభమవుతుందని సమాచారం. ప్రస్తుతం అన్నపూర్ణ స్టూడియోలో సెట్ సిద్ధం చేస్తున్నారని ఇండస్ట్రీ వర్గాల ద్వారా తెలిసింది. ఇదిలా ఉంటే, బిగ్ బాస్ 4లో పాల్గొనే కంటెస్టెంట్లకు సంబంధించి ప్రస్తుతం సోషల్ మీడియాలో పలు జాబితాలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ జాబితాల్లో టీవీ వ్యాఖ్యాత, యాంకర్ పేరు కూడా ఉంది. ఈ జాబితాల్లో ఉన్న చాలా మంది సెలబ్రిటీలు ఇప్పటికే ఈ రూమర్లను కొట్టిపారేశారు. ఇప్పుడు విష్ణుప్రియ అదే పని చేశారు. రాబోయే బిగ్ బాస్ షోలో తాను పాల్గొనడం లేదని ఇన్‌స్టాగ్రామ్ ద్వారా విష్ణుప్రియ స్పష్టత ఇచ్చారు. ఈ ప్రకటనతో రూమర్స్‌కు చెక్ పెట్టారు. ఈ మేరకు తన రీసెంట్ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో పేర్కొన్నారు. ‘‘నేను ఎక్కడికీ వెళ్లడం లేదు.. ముఖ్యంగా బిగ్ బాస్‌కి. ఇప్పుడే కాదు ఎప్పుడూ వెళ్లను. ఈ విషయంలో నన్ను నమ్మండి. కాబట్టి, నన్ను ఇష్టపడేవాళ్లు అందరూ రిలాక్స్‌గా ఉండండి. అందరూ సంతోషంగా ఉండండి’’ అని తన ఇన్‌స్టా స్టోరీలో విష్ణుప్రియ పేర్కొన్నారు. బిగ్ బాస్ సీజన్ 4లో పాల్గొనే కంటెస్టెంట్లు వీళ్లే అంటూ తరుణ్, శ్రద్ధా దాస్, సునయన ఇలా చాలా మంది పేర్లు వినిపించాయి. విష్ణుప్రియ కూడా పాల్గొంటున్నారని రూమర్లు వచ్చాయి. ఇప్పటికే తరుణ్, శ్రద్ధా దాస్, సునయన స్పందించారు. ఈ రూమర్లను కొట్టిపాడేశారు. ఇప్పుడు విష్ణుప్రియ కూడా క్లారిటీ ఇచ్చేశారు. గత సీజన్‌లో యాంకర్ శ్రీముఖి పాల్గొన్న విషయం తెలిసిందే. ఆమె రన్నరప్‌గా నిలిచారు. శ్రీముఖికి విష్ణుప్రియ బెస్ట్ ఫ్రెండ్. అందుకే, ఈసారి ఆమె పేరును జాబితాలో చేర్చి వదంతులు వ్యాప్తి చేశారు. కానీ, ఈ షోకు చాలా దూరంగా ఉండాలనుకుంటున్నారు విష్ణుప్రియ. Also Read: ఇదిలా ఉంటే, ‘నువ్వా నేనా’ షో ద్వారా విష్ణుప్రియ పాపులారిటీ సంపాదించారు. ఈ షోను సుడిగాలి సుధీర్‌తో కలిసి విష్ణుప్రియ హోస్ట్ చేశారు. ఈ షోలో సుధీర్, విష్ణుప్రియ కెమిస్ట్రీకి సోషల్ మీడియాలో విపరీతంగా ఫాలోయింగ్ పెరిగింది. ముఖ్యంగా యంగ్ ఆడియన్స్ బాగా కనెక్ట్ అయ్యారు. ప్రస్తుత లాక్‌డౌన్ సమయంలో విష్ణుప్రియ ఫ్యామిలీతో సమయాన్ని గడుపుతున్నారు. తనకెంతో ఇష్టమైన డ్యాన్స్ చేస్తున్నారు. ఈ లాక్‌డౌన్ సమయంలోనే ఝాన్సీ నిర్వహించిన క్వారంటైన్ లైఫ్ చాట్ షో ‘లవ్ యు జిందగీ’లో శ్రీముఖితో కలిసి పాల్గొన్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2X9eRN7
v

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...