Monday 28 February 2022

ఓటీటీలో 'రామారావు ఆన్ డ్యూటీ'.. రవితేజ టీమ్ ఫైనల్ డిసీజన్‌!

కరోనా ఎఫెక్ట్‌‌తో చాలా సినిమాలు వాయిదా పడ్డాయి. మరోవైపు థియేటర్స్ మూతపడటంతో ఓటీటీ వేదికలు ప్రేక్షకులకు దగ్గరయ్యాయి. క్రమంగా ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ డిమాండ్ పెరుగుతూ వస్తోంది. ఇప్పటికే కొన్ని మీడియం రేంజ్ సినిమాలను ఓటీటీ వేదికలపై రిలీజ్ చేసి సక్సెస్ సాధించారు మేకర్స్. ఈ బాటలో హీరోగా తెరకెక్కుతున్న '' వెళ్లబోతోందట. ఈ సినిమా రిలీజ్ విషయంలో కొన్ని అడ్డంకులు వస్తుండటంతో చివరకు రవితేజ టీమ్ ఫైనల్ డిసీజన్‌కి వచ్చారని తెలుస్తోంది. ఇప్పటికే షూటింగ్‌ను పూర్తి చేసుకున్న 'రామారావు ఆన్ డ్యూటీ' మూవీ మార్చి 25న విడుదల కావాల్సి ఉంది. కానీ అదే డేట్ RRR లాక్ చేసుకోవడంతో మేకర్స్ వెనక్కి తగ్గారు. ఆ తర్వాత ఏప్రీల్‌ 15న విడుదల చేయాలని ప్లాన్ చేసుకుంటే.. అప్పుడు కూడా పెద్ద సినిమాలు అడ్డు పడుతున్నాయి. కేజియఫ్ 2తో పాటు విజయ్ బీస్ట్ సినిమాలు ఏప్రీల్‌ 14న విడుదల కాబోతున్నాయి. దీంతో ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఈ 'రామారావు ఆన్ డ్యూటీ' సినిమాను ఓటీటీలో రిలీజ్ చేయాలని ఫిక్సయ్యారట మేకర్స్. విడుదలకు నోచుకోని పెద్ద సినిమాలు క్రమంగా థియేటర్స్ లోకి వస్తుండటంతో చిన్న, మీడియా బడ్జెట్ సినిమాలు వెనక్కి తగ్గాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో పలు ఓటీటీ సంస్థలు డిమాండ్ ఉన్న సినిమాలకు భారీ ఆఫర్స్ చేస్తున్నాయి. ఇలా 'రామారావు ఆన్ డ్యూటీ' సినిమాకు కూడా సోనీ లైవ్‌ మంచి ఆఫర్ ఇవ్వడంతో ఆ దిశగా ఆలోచనలు చేస్తున్నారట మేకర్స్. జూన్ వరకు సరైన డేట్స్ లేకపోవడం కూడా మరో కారణంగా భావించి ఓటీటీ దిశగా అడుగులేస్తున్నారని తెలుస్తోంది. కొత్త దర్శకుడు శరత్‌ మందవ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను ఎల్ఎల్‌పి బ్యానర్‌పై సుధాకర్‌ చేకూరి నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో దివ్యాంక కౌశిక్, రజిషా విజయన్ హీరోయిన్లుగా నటిస్తుండగా వేణు తొట్టెంపూడి కీలక పాత్రలో కనిపించనున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/8dFuMAo
v

‘భోళా శంకర్’ ఫస్ట్ లుక్ రిలీజ్.. మెగాస్టార్ మాస్ మేనియా

టాలీవుడ్ సీనియ‌ర్ అగ్ర కథానాయ‌కుడు మెగాస్టార్ టైటిల్ పాత్ర‌లో న‌టిస్తోన్న చిత్రం ‘భోళా శంకర్’. మెహ‌ర్ ర‌మేష్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థలు క్రియేటివ్ క‌మ‌ర్షియ‌ల్స్‌, ఏకే ఎంట‌ర్‌టైన్మెంట్స్ బ్యాన‌ర్స్ రూపొందిస్తున్నాయి. రామ బ్ర‌హ్మం సుంక‌ర నిర్మాత. ప్రముఖ నిర్మాత అనీల్ సుంక‌ర ఈ చిత్రాన్నినిర్మాణ బాధ్యతలను నిర్వహిస్తున్నారు. మహా శివ రాత్రి సందర్భంగా ఈ సినిమా ఫ‌స్ట్ లుక్‌, మోష‌న్ పోస్ట‌ర్‌ను చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది. మెగాస్టార్ చిరంజీవి త‌న ట్విట్ట‌ర్‌లో ఫ‌స్ట్ లుక్‌, మోష‌న్ పోస్ట‌ర్‌ను రిలీజ్ చేశారు. మెగాభిమానులు ఆయ‌న్ని ఎలా తెర‌పై చూడాల‌నుకుంటారో అంత మాస్ మేనియాను క్రియేట్ చేస్తార‌ని భోళా శంక‌ర్ ఫ‌స్ట్ లుక్ చూస్తేనే అర్థ‌మ‌వుతుంది. స్టైల్‌గా జీపు మీద కూర్చుని కీ చైన్‌ను తిప్పుతూ క‌నిపిస్తున్నారు చిరంజీవి. చాలా రోజుల త‌ర్వాత ప‌క్కా మాస్ లుక్‌, మాస్ పాత్ర‌లో చిరంజీవి క‌నిపించ‌బోతున్నారు. సిస్ట‌ర్ సెంటిమెంట్ ప్ర‌ధానంగా రూపొదుతోన్న ఈ చిత్రంలో స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్.. చిరంజీవి చెల్లెలుగా క‌నిపించ‌నున్నారు. అలాగే మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా చిరంజీవి జోడీగా న‌టిస్తున్నారు. భోళా శంక‌ర్‌.. అజిత్ హీరోగా చేసిన త‌మిళ చిత్రం వేదాళంకు రీమేక్‌గా తెర‌కెక్కుంది . డూడ్లే సినిమాటోగ్ర‌ఫీ అందిస్తోన్న ఈ చిత్రానికి మ‌హ‌తి స్వ‌ర సాగ‌ర్ సంగీతం అందిస్తున్నారు. అన్నీ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసి ఈ చిత్రాన్ని ఈ ఏడాదిలోనే విడుద‌ల చేయ‌డానికి మేక‌ర్స్ స‌న్నాహాలు చేస్తున్నారు. ఈ ఏడాది మెగా ఫ్యాన్స్‌కు పెద్ద ఫెస్టివ‌ల్ అనే చెప్పాలి. మెగా హీరోల సినిమాలు ఎలాగూ వారి ఫ్యాన్స్‌ను అల‌రిస్తాయి. అయితే ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి వ‌రుస సినిమాల‌తో థియేట‌ర్స్‌లో సంద‌డి చేయ‌బోతున్నారు. ఇప్ప‌టికే చిరంజీవి ఆచార్య సినిమాను రిలీజ్‌కి సిద్ధం చేశారు. ఇక సెట్స్ పై భోళా శంక‌ర్‌తో పాటు గాడ్ ఫాద‌ర్‌, డైరెక్ట‌ర్ బాబి చిత్రాలున్నాయి.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/Qx5S8dV
v

భీమ్లా నాయక్ సీక్రెట్: అందుకే అలా చేశామంటూ తమన్ ఓపెన్

కరోనా పరిస్థితుల తర్వాత థియేటర్ల వద్ద పండగ వాతావరణం తీసుకొచ్చాడు 'భీమ్లా నాయక్'. పవర్ స్టార్ స్టామినా ఏంటనేది ఈ సినిమాతో మరోసారి రుజువైంది. అన్ని సెంటర్లలో భారీ రెస్పాన్స్ తెచ్చుకుంటున్న ఈ సినిమా కలెక్షన్స్ పరంగా యమ స్పీడులో ఉంది. విడుదల రోజే పాజిటివ్ రివ్యూలు రావడంతో సినిమాకు సూపర్ బూస్ట్ దొరికింది. ఫిబ్రవరి 25న విడుదలైన ఈ సినిమా సక్సెస్‌ఫుల్ రన్ కొనసాగిస్తుండగా.. తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ విషయాన్ని బయటపెట్టారు మ్యూజిక్ డైరెక్టర్ . భీమ్లా నాయక్ సినిమాలో పవన్ కళ్యాణ్, పోటాపోటీ నటన ప్రేక్షకులకు మంచి కిక్ ఇచ్చింది. ముఖ్యంగా అభిమానులకు విజువల్ ట్రీట్ ఇచ్చేలా కొన్ని సీన్స్ కట్ చేశారు. ఇందంతా బాగానే ఉన్నా సినిమాలో ఒక పాట కనిపించకపోవడం మాత్రం ప్రేక్షక లోకాన్ని ఆశ్చర్యపరిచింది. పవన్ కళ్యాణ్- నిత్య మీనన్ నడుమ షూట్ చేసిన 'అంత ఇష్టం ఏందయ్యా' అనే మెలోడీ సాంగ్ సినిమా విడుదలకు ముందే భారీ రెస్పాన్స్ తెచ్చుకుంది. తీరా విడుదల తర్వాత సినిమాలో ఈ సాంగ్ లేకపోవడం ఒకరకంగా ఫ్యాన్స్‌ని నిరాశ పరిచిందనే చెప్పుకోవాలి. ఈ నేపథ్యంలో అసలు ఆ సాంగ్ ఎందుకు కట్ చేయాల్సి వచ్చిందనే విషయమై ఓపెన్ అయ్యారు తమన్. 'మంచి వేడి మీద ఉన్న స్టవ్ మీద నీళ్ళు పోస్తే బాగుండదు కదా' అంటూ ఆయన రియాక్ట్ అయ్యారు. మంచి వేడి మీద సాగుతున్న సన్నివేశాల నడుమ కూల్‌గా అనిపించే ఈ సాంగ్ ఉంటే బాగుండదనే కారణంతో ఫైనల్ అవుట్‌పుట్ నుంచి ఈ పాటను తొలగించినట్లు తెలిపారు. ఇకపోతే 108 కోట్ల టార్గెట్ పెట్టుకొని బరిలోకి దిగిన భీమ్లా నాయక్ బాక్సాఫీస్ షేక్ చేస్తున్నాడు. మొదటి మూడు రోజుల్లోనే 60 కోట్లకు పైగా షేర్ రాబట్టి సత్తా చాటాడు. ఈ సినిమా రెస్పాన్స్ చూస్తుంటే మరికొన్ని రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ క్రాస్ అయ్యేలా ఉందని చెబుతున్నారు ట్రేడ్ పండితులు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/7Dmr9Kq
v

Official: ప్రభాస్ బిగ్ అప్‌డేట్.. ఆదిపురుష్ రిలీజ్ డేట్ ఇచ్చేశారండోయ్

బాహుబలి సినిమాతో పాన్ ఇండియా క్రేజ్ కొట్టేసిన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్.. అదే ఫామ్‌లో బిగ్గెస్ట్ మూవీస్ చేస్తున్నారు. 'సాహో' తర్వాత కొంత గ్యాప్ తీసుకున్నా ప్రస్తుతం పలు బిగ్ ప్రాజెక్టుల్లో భాగమవుతున్నారు. అందులో ఒకటే 'ఆదిపురుష్'. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో భారీ రేంజ్‌లో ఈ సినిమా రూపొందుతోంది. ఈ నేపథ్యంలో శివరాత్రి కానుకగా ఫ్యాన్స్ హుషారెత్తే అప్‌డేట్ ఇచ్చారు మేకర్స్. ప్రభాస్ భారీ పాన్ ఇండియా సినిమా 'ఆదిపురుష్' వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు డైరెక్టర్ ఓం రౌత్. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమాను 2023 సంవత్సరం జనవరి 12వ తేదీన రిలీజ్ చేస్తున్నట్లు తెలిపారు. అంతేకాదు 3D వర్షన్‌లో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుంచబోతున్నట్లు ట్వీట్ పెట్టారు. దీంతో ఈ బిగ్ అప్‌డేట్ క్షణాల్లో వైరల్ అయింది. పౌరాణిక గాథ రామాయణం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో రాముడిగా ప్రభాస్.. సీతగా బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ నటిస్తున్నారు. ఈ భారీ మైథలాజికల్ వండర్‌‌లో రావణుడిగా సైఫ్ అలీఖాన్ నటిస్తున్నారు. లక్ష్మణుడి పాత్రలో బాలీవుడ్ నటుడు సన్నీ సింగ్ నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన సినిమా పోస్టర్స్, ఇతర అప్‌డేట్స్ సోషల్ మీడియాను షేక్ చేయడంతో ఈ మూవీ రిలీజ్‌పై ఆతృత నెలకొంది. ఈ పరిస్థితుల నడుమ మూవీ విడుదల తేదీ ప్రకటించి హూషారెత్తించారు. దాదాపు 300 కోట్ల బడ్జెట్ కేటాయించి టీ సిరీస్ బ్యానర్‌పై ఐదు భాషల్లో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తెస్తున్నారు. అబ్బురపరిచే విజువల్ ఎఫెక్ట్స్‌తో గతంలో ఎన్నడూ లేనంత థ్రిల్ ఇచ్చేలా ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుతున్నారట మేకర్స్.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/CxMFjkH
v

ఉక్రెయిన్‌పై రష్యా సైనిక చర్య.. సమంత ఎమోషనల్ పోస్ట్

ఉక్రెయిన్‌పై సైనిక చర్యపై స్పందించింది. ఇప్పటికే పలువురు సినీ తారలు ఈ చర్యను తప్పుబట్టారు. యుద్ధం అనేది ఏ కారణాలతో వచ్చినా అది మాత్రం పౌరుల, సైనికుల ప్రాణాలను పణంగా పెట్టడమేనని అన్నారు. ఇదే విషయంపై గత రెండు రోజుల క్రితం రియాక్ట్ అయిన స్టార్ హీరోయిన్ సమంత.. తాజాగా మరోసారి తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ పెడుతూ ఎమోషనల్ కామెంట్స్ చేసింది. ఉక్రెయిన్‌లోని ఓ ఆస్పత్రి ఐసీయూ నుంచి నవజాత శిశువులను బాంబ్‌ షెల్టర్‌లోకి తీసుకెళ్తున్న ఓ వీడియోను తన ఇన్స్‌స్టా స్టోరీలో షేర్‌ చేసిన సమంత.. అప్పుడే పుట్టిన బిడ్డకు ఎన్ని కష్టాలో అంటూ ఎమోషనల్ కామెంట్ చేసింది. అంతేకాదు యోధుడైన ఉక్రెయిన్ అధ్యక్షుడిని చరిత్ర కనుగొంది. అతని తెగువ, ధైర్యసాహసాలే అందుకు సాక్ష్యం అని పేర్కొన్న ఓ న్యూస్‌ ఆర్టికల్‌ని కూడా సామ్ షేర్ చేసింది. ప్రస్తుతం పరిస్థితులపై ఎంతోమంది సెలబ్రిటీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక సమంత సినిమాల విషయానికొస్తే.. ఇటీవలే గుణశేఖర్ దర్శకత్వంలో శాకుంతలం సినిమా కంప్లీట్ చేసింది. ఆమె కెరీర్‌లో రాబోతున్న తొలి పౌరాణిక సినిమా ఇది. దీంతో పాటు మరో ప్రయోగాత్మక సినిమా 'యశోద'లో భాగమవవుతోంది సమంత. ఈ సినిమాలో నర్స్ పాత్రలో సమంత రోల్ స్పెషల్ అట్రాక్షన్ కానుందని సమాచారం. విడాకుల తర్వాత కెరీర్ పైనే ఫుల్ ఫోకస్ పెట్టిన ఆమె.. బాలీవుడ్, హాలీవుడ్ ప్రాజెక్ట్స్ చేసేందుకు ఆసక్తి చూపుతోంది. మరోవైపు వెబ్ సిరీసుల్లో నటించేందుకు రెడీ అంటూ అన్ని కోణాల్లో కెరీర్ జర్నీ సాగించాలని ప్లాన్స్ చేసుకుంటోంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/xlsjCE6
v

బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న ‘భీమ్లా నాయక్’ ... 100 కోట్లు మార్క్ ట‌చ్ చేసిన‌ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. ఏరియా వైజ్ క‌లెక్ష‌న్స్‌

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ టైటిల్ పాత్ర‌లో న‌టించిన లేటెస్ట్ మూవీ ‘భీమ్లా నాయక్’. రానా దగ్గుబాటి ఇందులో మ‌రో హీరోగా న‌టించారు. ఫిబ్ర‌వ‌రి 25న విడుద‌లైన ఈ చిత్రం సూప‌ర్ హిట్ టాక్ సంపాదించుకోవ‌డంతో బాక్సాఫీస్ వ‌ద్ద క‌లెక్ష‌న్స్‌ను గ‌ట్టిగానే రాబ‌డుతుంది. మూడు రోజుల్లోనే ‘భీమ్లా నాయక్’ వంద కోట్లు మార్క్‌ను ట‌చ్ చేసింది. క‌రోనా థ‌ర్డ్ వేవ్ త‌ర్వాత సినిమా థియేట‌ర్స్‌కు ప్రేక్ష‌కులు వ‌స్తారా? రారా? అనే మీమాంస‌ను నిర్మాత‌లు ఎదుర్కొంటున్న స‌మ‌యంలో ప‌వ‌న్ క‌ళ్యాణ్ త‌న సత్తాను చూపించారు. ‘భీమ్లా నాయక్’ సినిమా వంద కోట్ల గ్రాస్‌ను రాబ‌ట్టుకోవ‌డంపై ఆయ‌న ఫ్యాన్స్ సంబ‌రాలు చేసుకుంటున్నారు. సినీ స‌ర్కిల్స్‌లో సైతం ‘భీమ్లా నాయక్’ స‌మ్మ‌ర్ సినిమాల‌కు గేట్‌లాగా వ్య‌వ‌హ‌రించింద‌ని.. ఓ న‌మ్మ‌కాన్ని క్రియేట్ చేసింద‌నే టాక్ బ‌లంగా వినిపిస్తోంది. 3వ రోజు ఏరియా వైజ్ షేర్ క‌లెక్ష‌న్స్ (కోట్ల‌లో..) నైజాం - రూ. 6.55 కోట్లుసీడెడ్ - రూ. 2.2 కోట్లుగుంటూరు - రూ. 0.72 కోట్లుకృష్ణా - రూ. 0.76 కోట్లునెల్లూరు - రూ. 0.41 కోట్లువెస్ట్ - రూ. 0.47 కోట్లుఈస్ట్ - రూ. 0.91 కోట్లుఉత్త‌రాంధ్ర - రూ. 1.5 మొత్తంగా చూస్తే రెండు తెలుగు రాష్ట్రాల్లో మూడో రోజున ‘భీమ్లా నాయక్’ చిత్రం రూ.13.15 కోట్ల రూపాయ‌ల షేర్ క‌లెక్ష‌న్స్‌ను సాధించింది. 3 రోజుల‌కు క‌లిపి షేర్ వ‌సూళ్ల ప‌రంగా సినిమా రూ.53.08 కోట్లు వ‌చ్చాయి. 3వ రోజు రాష్ట్రాల ప‌రంగా వ‌చ్చిన గ్రాస్ క‌లెక్ష‌న్స్ (కోట్ల‌లో..) ఆంధ్ర‌, తెలంగాణ - రూ.21.60 కోట్లుక‌ర్ణాట‌క - రూ. 1.45 కోట్లురెస్టాఫ్ ఇండియా - రూ. 0.55 కోట్లుమూడు రోజుల‌కు క‌లిపి రూ.89.40 కోట్లు వ‌చ్చాయి. ఓవ‌ర్ సీస్‌ వసూళ్లు.. ఓవర్ సీస్‌లో ‘భీమ్లా నాయక్’ రెండు మిలియ‌న్ డాల‌ర్స్‌ను దాటేసింది. మ‌న లెక్క‌ల్లో చూస్తే రూ.20.60 కోట్లు వ‌చ్చాయి. అంటే మొత్తంగా చూస్తే రూ.110 కోట్ల రూపాయ‌ల గ్రాస్ వ‌సూళ్ల‌ను ‘భీమ్లా నాయక్’ సాధించింది. ఇక కీల‌క‌మైన సోమ‌వారం ‘భీమ్లా నాయక్’ ఎంత మేర‌కు వ‌సూళ్ల‌ను సాధిస్తుందో చూడాలి.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/I9UJyGg
v

Sunday 27 February 2022

నా కల నిజమైన రోజు.. తమన్ ఎమోషనల్ కామెంట్స్

పవర్ స్టార్ రేంజ్ తెలిసేలా మోత మోగించారు మ్యూజిక్ సెన్సేషన్ తమన్. ఈ సినిమాలో బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ బాగా హైలైట్ అయిందని, బాణీలు పిచ్చెక్కించాయనే టాక్ బయటకొచ్చింది. ఈ నేపథ్యంలో తాజాగా పవన్ కళ్యాణ్‌తో కలిసి భీమ్లా నాయక్ సినిమా వీక్షించిన తమన్.. ఈ విషయాన్ని చెబుతూ ఎమోషనల్ కామెంట్స్ చేశారు. ప్రసాద్ లాబ్స్‌లో ప్రత్యేకంగా భీమ్లా నాయక్ సినిమాను ప్రదర్శించగా.. ఈ షోను పవన్ కళ్యాణ్‌తో పాటు త్రివిక్రమ్, చినబాబు, సంయుక్త మీనన్‌, తమన్ వీక్షించారు. అయితే ఈ షో చూసిన అనంతరం తమన్ తన సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ పవర్ స్టార్ అభిమానులను మరింత హుషారెత్తించింది. పవన్ కళ్యాణ్‌తో కలిసి ‘భీమ్లా నాయక్’ చూడడంతో ఇప్పటికి తన కల నెరవేరిందని తెలుపుతూ ట్వీట్ పెట్టారు తమన్. ఈ మేరకు పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్, చినబాబు, సంయుక్త మీనన్‌లతో దిగిన ఫోటోను అభిమానులతో పంచుకున్నారు. ఈ ఫొటో నెట్టింట వైరల్ అవుతోంది. పవన్ కళ్యాణ్, రానా హీరోలుగా రూపొందిన భీమ్లా నాయక్ సినిమాకు తొలి షోతోనే పాజిటివ్ టాక్ రావడంతో జనం థియేటర్స్ బాట పట్టారు. వెండితెరపై పవన్- రానా పోటాపోటీ నటన భారీ రెస్పాన్స్ తెచ్చుకుంటోంది. నిత్యామీనన్, సంయుక్త మీనన్ హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాని సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై సూర్య‌దేవ‌ర నాగ‌వంశీ నిర్మించారు. సాగ‌ర్ కె.చంద్ర దర్శకత్వం వహించగా త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ ఈ చిత్రానికి మాట‌లు, స్క్రీన్ ప్లే అందించారు. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకి సూపర్ రెస్పాన్ వచ్చినప్పటికీ ఏపీలో టికెట్ రేట్లు తక్కువగా ఉండటంతో చెప్పుకోదగ్గ వసూళ్లు నమోదు కావడం లేదు. తెలంగాణతో పాటు ఓవర్‌సీస్‌లో మాత్రం బాక్సాఫీస్ దుమ్ము దులుపుతున్నాడు భీమ్లా నాయక్.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/eB3y16T
v

భీమ్లా నాయక్ వసూళ్ల సునామీ.. పవన్ క్రేజ్ అంటే ఇదే మరి!!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాకు దేశ విదేశాల్లో ఎలాంటి క్రేజ్ ఉంటుందో ఇప్పటికే చాలా సార్లు చూశాం. తాజాగా మరోసారి అదే సీన్ రిపీట్ చేస్తోంది. ఫిబ్రవరి 25వ తేదీన విడుదలైన ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న జనం నీరాజనం పలుకుతున్నారు. కోవిడ్ పరిస్థితుల తర్వాత జనంతో థియేటర్స్‌లో జాతర వాతావరణం తీసుకొచ్చాడు భీమ్లా నాయక్. ఇక కలెక్షన్స్ పరంగా చూస్తే ఈ సినిమాకు అన్ని ఏరియాల్లో భారీగా వసూళ్లు నమోదవుతున్నాయి. క్లాస్, మాస్ సెంటర్స్ లా.. లా.. భీమ్లా సౌండ్‌తో మారు మోగుతున్నాయి. విడుదలకు ముందు నుంచే ఈ సినిమాపై నెలకొన్న అంచనాలు సినిమాకు భారీ స్థాయి వసూళ్లు తెచ్చిపెడుతున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ముఖ్యంగా ఓవర్‌సీస్‌లో భీమ్లా నాయక్ హవా నడుస్తోంది. విడుదలకు ఒకరోజు ముందే అనగా ఫిబ్ర‌వ‌రి 24నే యూఎస్‌లో ఈ సినిమా ప్రీమియ‌ర్స్ ప‌డ్డాయి. ప్రీమియ‌ర్ షోస్ ద్వారానే 875,292 డాల‌ర్స్‌ రాబట్టిన భీమ్లా నాయక్ అదే హంగామా కంటిన్యూ చేస్తున్నాడు. యూఎస్ మార్కెట్‌లో తొలి రోజుకు గాను 450,368 డాలర్స్ రాబట్టిన భీమ్లా నాయక్ మూవీ.. రెండు రోజుకు వచ్చేసరికి 470,128 డాలర్స్, మూడో రోజుకు గాను సుమారు 175,150 డాలర్స్ వసూలు చేశాడు. మొత్తంగా చూస్తే ఈ మూడు రోజుల్లోనే 2 మిలియన్ డాలర్ మార్క్ క్రాస్ చేసింది భీమ్లా నాయక్ మూవీ. మరోవైపు నైజాం ఏరియాలో భీమ్లా నాయక్ మేనియా కనిపిస్తోంది. ‘అయ్య‌ప్పనుమ్ కోశియమ్‌’కు రీమేక్‌గా రూపొందిన ఈ చిత్రాన్నితెలుగులో సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై సూర్య‌దేవ‌ర నాగ‌వంశీ నిర్మించారు. సాగ‌ర్ కె.చంద్ర దర్శకత్వం వహించగా త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ ఈ చిత్రానికి మాట‌లు, స్క్రీన్ ప్లే అందించారు. చిత్రంలో రానా ద‌గ్గుబాటి ఇందులో మ‌రో హీరోగా న‌టించారు. నిత్యామీన‌న్‌, సంయుక్తా మీన‌న్ హీరోయిన్లుగా న‌టించారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/adjYwC7
v

గ్యాంగ్ లీడర్ సమంత! ఆమె లేడీ పవన్ కళ్యాణ్ అంటూ సుకుమార్ ఓపెన్

యంగ్ హీరోహీరోయిన్లు శర్వానంద్, రష్మిక మందన జంటగా తెరకెక్కిన సినిమా 'ఆడవాళ్లు మీకు జోహార్లు'. మార్చి 4వ తేదీన ఈ సినిమా విడుదల కానున్న నేపథ్యంలో చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా నిన్న ఆదివారం (ఫిబ్రవరి 27) గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్‌కు కీర్తి సురేష్, , ముఖ్య అతిథులుగా విచ్చేశారు. అయితే వేదికపైకి వచ్చి మైక్ పట్టుకున్న సుకుమార్.. సమంతతో పాటు సాయి పల్లవి, రష్మిక, కీర్తి సురేష్‌లపై ఆసక్తికర కామెంట్స్ చేశారు. వేదికపై రాగానే యాంకర్ సుమకు థాంక్యూ చెప్పిన సుకుమార్.. టాపిక్ తీసుకొచ్చారు. గ్యాంగ్ లీడర్ సమంత మిస్ ఇక్కడ అంటూ అక్కడున్న కీర్తి సురేష్, రష్మిక మందన, సాయి పల్లవిలతో పాటు సమంతలను తెగ పొగిడేశారు. బ్యూటిఫుల్ బెస్ట్ పర్‌ఫార్‌మెన్స్ ఇస్తున్న హీరోయిన్స్ వీళ్ళు అంటూ కామెంట్ చేశారు. మై శ్రీవల్లి అంటూ అక్కడున్న రష్మిక అభిమానులను ఫిదా చేశారు. ఇక సాయి పల్లవి గురించి మాట్లాడుతూ ఆమెలో మంచి ఆరిస్ట్‌తో పాటు మంచి మనిషి దాగి ఉన్నారని అన్నారు. అంతేకాదు సాయి పల్లవి ఓ లేడీ పవన్ కళ్యాణ్ అంటూ వేదిక ప్రాంగణాన్ని హూషారెత్తించారు సుక్కు. ప్రకటనల ఆఫర్స్ వచ్చినా వాటిని రిజెక్ట్ చేసే విషయంలో సాయి పల్లవి అందరు ఆర్టిస్టులకు ఆదర్శం అని ఆయన అన్నారు. ఇకపోతే తనకు ఇష్టమైన డైరెక్టర్ కిషోర్ తిరుమల అని చెప్పిన సుక్కు.. ఈ సినిమా పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నా అన్నారు. తాను దేవి శ్రీ ప్రసాద్‌ని బాగా నమ్ముతానని, దేవీ ఈ సినిమా చూసి సూపర్ అని చెప్పారని అన్నారు. శర్వానంద్‌కి తాను పెద్ద అభిమానిని అని సుకుమార్ అన్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/hau5zTY
v

ఆమె గురించి చెప్పడానికి మాటలు చాలవు.. సమంత కామెంట్స్ వైరల్

సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించిన ‘’ మూవీ గత వారం విడుదలై సక్సెస్ టాక్ తెచ్చుకుంది. ప్రస్తుతం విజయవంతంగా ప్రదర్శింపబడుతున్న ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించింది. అజయ్ దేవగణ్, ఇమ్రాన్ హష్మి, హ్యూమా ఖురేషి తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషించారు. ఈ మూవీలో ఆలియా వేశ్యగా నటించడం చర్చల్లో నిలిచింది. ఈ నేపథ్యంలో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఈ సినిమాపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. ‘గంగూబాయి కతియావాడి’పై సోషల్ మీడియా వేదికగా స్పందించిన సమంత.. తన ఇన్‌స్టాగ్రామ్‌లో '#గంగూబాయి కతియావాడి ఒక కళాఖండం.. అలియా మీ నటన గురించి చెప్పాలంటే మాటలు సరిపోవు. సినిమాలోని ప్రతి ఒక్క డైలాగ్, ఎక్స్‌ప్రెషన్ నా మదిలో ఎప్పటికీ నిలిచిపోతాయి' అని కామెంట్ చేసింది. దీంతో ఈ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. మరోవైపు ‘గంగూబాయి కతియావాడి’పై పలువురు సెలబ్రిటీలు ప్రశంసలు గుప్పిస్తున్నారు. మరికొద్ది రోజుల్లోనే ఆలియా భట్ తెలుగు తెరపై కూడా అలరించబోతోంది. దర్శక ధీరుడు రాజమౌళి రూపొందించిన RRR సినిమాలో ఆలియా హీరోయిన్‌గా నటించింది. సీత పాత్రలో ఆమె నటన మెస్మరైజ్ చేయనుందని టాక్. అన్ని జాగ్రత్తలు తీసుకొని ఆలియా రోల్ మరింత ఆసక్తికరంగా మార్చారట జక్కన్న. ఆలియా నటన చూసి టాలీవుడ్‌ ఆడియన్స్ ఫిదా అయ్యేలా ఆ క్యారెక్టర్ తీర్చిదిద్దారట. డీవీవీ దానయ్య సమర్పణలో భారీ బడ్జెట్ కేటాయించి రూపొందించిన ఈ RRR మూవీని దాదాపు 12 భాషల్లో గ్రాండ్‌గా రిలీజ్ చేయబోతున్నారు. ఈ చిత్రంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా నటించారు. ఇప్పటికే విడుదల చేసిన అన్ని అప్‌డేట్స్ సినిమాపై భారీ హైప్ క్రియేట్ చేశాయి.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/ihNEIZ8
v

భీమ్లా నాయ‌క్‌పై పృథ్వీరాజ్ కామెంట్స్.. పవన్‌కి దిష్టి తగలొద్దంటూ!

ప్రస్తుతం థియేటర్స్‌లో 'భీమ్లా నాయక్' మోత మోగుతోంది. గత శుక్రవారం (ఫిబ్రవరి 25) విడుదలైన ఈ సినిమా అన్ని సెంటర్లలో రికార్డు స్థాయిలో వసూళ్లు రాబడుతోంది. అభిమానులకు ఇది విజువల్ ట్రీట్ అని, పవన్ యాక్టింగ్ అద్భుతంగా ఉందనే టాక్ బయటకు రావడంతో మెగా ఫ్యాన్స్ హుషారెత్తిపోతున్నారు. మరోవైపు భీమ్లా నాయక్ చూసిన పలువురు సినీ ప్రముఖులు పవన్ కళ్యాణ్ నటనను పొగిడేస్తుండటం ఫ్యాన్స్‌లో మరింత సంబరం నింపుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ మూవీపై పృథ్వీ రాజ్ రియాక్ట్ అయిన తీరు హాట్ టాపిక్ అయింది. భీమ్లా నాయక్ సినిమా చూసిన పృథ్వీ రాజ్ హీరో ప‌వ‌న్ కళ్యాణ్‌పై, ఆయన నటనపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆ రోజుల్లో సీనియ‌ర్ ఎన్టీఆర్ నటించిన అడ‌వి రాముడు సినిమా చూశాన‌ని అది త‌న‌ జీవితంలో ఎప్పటికీ గుర్తుండిపోయే సినిమా అని చెప్పిన పృథ్వీ రాజ్.. అప్ప‌ట్లో ఆ సినిమా చూసేందుకు తాడేపల్లి గూడెంలోని ఓ టాకీస్‌కు వెళ్లగా అక్కడికి భారీగా తరలివచ్చిన అభిమానానులు, వారిని నియంత్రించేందుకు పోలీసుల లాఠీచార్జ్‌ అన్నీ గుర్తున్నాయని, మళ్ళీ ఇప్పుడు అలాంటి సీన్ చూశానని చెప్పారు. సీనియ‌ర్ ఎన్టీఆర్‌ తర్వాత మ‌ళ్లీ అలాంటి క్రేజ్ ఒక్క పవన్ కళ్యాణ్‌కే ఉందని ఆయన అన్నారు. ఓ ప్రేక్షకుడిగా భీమ్లా నాయక్ సినిమా చూసి బాగా ఎంజాయ్ చేశానని పృథ్వీ రాజ్ తెలిపారు. క్లైమాక్స్‌తో పాటు రానా- పవ‌న్ కళ్యాణ్ పోటాపోటీ నటన, ఆ సీన్స్ చాలా బాగున్నాయని అన్నారు. కాకపోతే అద్భుతమైన సినిమాలో తాను భాగం కాలేకపోయాననే బాధ మాత్రమే ఉందని చెప్పిన ఆయన, పవన్ కళ్యాణ్‌కి దిష్టి తగలకూడదని కోరుకుంటున్నాన‌ని అనడం గమనార్హం. మలయాళ సూపర్ హిట్ మూవీ 'అయ్యప్పనుమ్ కోషియుమ్‌' తెలుగు రీమేక్‌గా సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై భారీ రేంజ్‌లో ఈ 'భీమ్లా నాయక్' మూవీ రూపొందింది. సాగర్ కే చంద్ర దర్శకత్వం వహించిన ఈ సినిమాకు త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వ పర్యవేక్షణ చేశాడు. తమన్ బాణీలు కట్టారు. నిత్య మీనన్, సంయుక్త మీనన్ హీరోయిన్లుగా నటించారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/7XcsyMA
v

క్షోభ పెడుతూ ప్రోత్సహిస్తున్నామంటే నమ్మాలా? : ప్రకాష్ రాజ్

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్, రానా ద‌గ్గుబాటి హీరోలుగా న‌టించిన చిత్రం ‘’. ఫిబ్ర‌వ‌రి 25న ఈ చిత్రం సూప‌ర్ డూప‌ర్ హిట్ టాక్‌తో చాలా మంచి క‌లెక్ష‌న్స్‌ను సాధిస్తూ దూసుకెళుతోంది. ఈ సినిమాకు తొలి రెండు రోజుల్లో ఓవ‌ర్ సీస్‌తో క‌లుసుకుని రూ.83 కోట్లు గ్రాస్ వ‌సూళ్లు వ‌చ్చాయి. ఆంధ్రప్ర‌దేశ్‌లో ఈ సినిమాకు మంచి వ‌సూళ్లు వ‌చ్చాయి. కానీ.. త‌గ్గించిన టికెట్స్ రేట్స్ విష‌యంలో, వాటిని పెంచుతూ ఏపీ ప్ర‌భుత్వం జీవోలు తీసుకుని ఉండుంటే.. ఇంకా భారీ వ‌సూళ్లు వ‌చ్చి ఉండేవి. భీమ్లా నాయ‌క్ సినిమా విష‌యంలో జీవోను విడుద‌ల చేయ‌కుండా ఏపీ ప్ర‌భుత్వం కావాల‌నే అడ్డుప‌డుతుంద‌ని ప‌వ‌న్ క‌ళ్యాణ్ అభిమానులు అంటున్నారు. ‘భీమ్లా నాయక్’ సినిమాను విష‌యంలో ఏపీ ప్ర‌భుత్వం కావాల‌నే రాజ‌కీయం చేస్తుంద‌ని ప్ర‌తి ప‌క్షాలు కూడా విమ‌ర్శలు చేస్తున్నాయి. దీనిపై ఏపీ ప్ర‌భుత్వ పెద్ద‌లు కూడా త‌మ‌దైన శైలిలో విమ‌ర్శ‌ల‌కు స‌మాధానాలు చెప్పారు. ఇలా విమ‌ర్శ‌లు, ప్ర‌తి విమ‌ర్శ‌లు సాగుతున్న నేప‌థ్యంలో ‘భీమ్లా నాయక్’ సినిమాకు మ‌ద్ద‌తుగా విల‌క్ష‌ణ న‌టుడు ప్ర‌కాష్ రాజ్ సోష‌ల్ మీడియా ద్వారా వ్యాఖ్య‌లు చేశారు. ‘‘సృజ‌న‌, సాంకేతిక‌త మేళ‌వించిన సినిమా రంగంపై అధికార దుర్వినియోగం, ఆధిప‌త్య దోర‌ణి ఏమిటి? చిత్ర ప‌రిశ్ర‌మ‌ను క్షోభ పెడుతూ మేమే ప్రోత్స‌హిస్తున్నామంటే న‌మ్మాలా? ఏమైనా ఉంటే రాజ‌కీయ క్షేత్రంలో చూసుకోవాలి. కక్ష సాధింపులు బాక్సాఫీస్ ద‌గ్గ‌ర ఎందుకు? ఎంత‌గా ఇబ్బంది పెట్టినా ప్రేక్ష‌కుల ఆద‌రాభిమానాల‌కు ఎవ‌రూ అడ్డుక‌ట్ట వేయ‌లేరు’’ అన్నారు. ‘భీమ్లా నాయక్’ సినిమాను సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై సాగ‌ర్ కె.చంద్ర ద‌ర్శ‌క‌త్వంలో సూర్య దేవ‌ర నాగ వంశీ ఈ చిత్రాన్ని నిర్మించారు. ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు, ర‌చ‌యిత అయిన త్రివిక్ర‌మ్ ఈ చిత్రానికి మాట‌లు, స్క్రీన్ ప్లే అందించారు. నిత్యా మీన‌న్‌, సంయుక్తా మీన‌న్ హీరోయిన్స్‌గా న‌టించారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/WuOgLFB
v

రెండో రోజు కూడా బాక్సాఫీస్ వ‌ద్ద ‘భీమ్లా నాయ‌క్’ జోరు..క‌లెక్ష‌న్స్ సునామీతో స‌త్తా చాటిన ప‌వ‌ర్ స్టార్‌

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ లేటెస్ట్ మూవీ ‘భీమ్లా నాయక్’. ఫిబ్ర‌వ‌రి 25న విడుద‌లైన ఈ చిత్రంలో భీమ్లా నాయ‌క్ పాత్ర‌ధారికి పోటీగా రానా ద‌గ్గుబాటి డానియ‌ల్ శేఖ‌ర్ పాత్ర‌ను పోషించారు. సినిమాకు హిట్ టాక్ రావ‌డంతో క‌లెక్ష‌న్స్ బ‌లంగా వ‌స్తున్నాయి. తొలిరోజునే రూ.26.40 కోట్ల షేర్ వ‌సూళ్ల‌ను రాబ‌ట్టిన ఈ చిత్రం రెండో రోజు కూడా మంచి ప్ర‌భావాన్నే చూపించింది. రూ.13.16 కోట్ల రూపాయ‌ల వ‌సూళ్ల వ‌చ్చాయి. మొత్తం చూస్తే ‘భీమ్లా నాయక్’ రెండు రోజుల్లో ఓవ‌ర్ సీస్‌ను క‌లుపుకుని రూ.80 కోట్ల మేర‌కు క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టింద‌ని ట్రేడ్ వ‌ర్గాలు అంటున్నాయి. రెండో రోజు ఏరియా వైజ్ షేర్ కలెక్షన్స్ (కోట్లలో)... నైజాం - రూ. 7.5సీడెడ్ - 1.56గుంటూరు - 0.64కృష్ణా - 0.64నెల్లూరు - 0.36వెస్ట్ - 0.42ఈస్ట్ - 0.74ఉత్త‌రాంధ్ర - 1.30 రెండు తెలుగు రాష్ట్రాల్లో రెండో రోజున ‘భీమ్లా నాయక్’ను వ‌చ్చిన షేర్ వ‌సూళ్ల రూ.13.16 కోట్లు. అలాగే తొలిరోజున వ‌చ్చిన షేర్ వ‌సూళ్లు రూ.26.40 కోట్లు అంటే మొత్తంగా చూస్తే రూ.39.56 కోట్లు షేర్ వ‌సూళ్లు వ‌చ్చాయి. గ్రాస్ వ‌సూళ్లు.. రెండు రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ 58.55 కోట్లు, క‌ర్ణాట‌క‌లో రూ.5.80 కోట్లు, రెస్టాఫ్ ఇండియాలో రూ.1.45 కోట్లు వచ్చాయి. అంటే రెండు రోజుల్లో వచ్చిన గ్రాస్ వసూళ్ల రూ.65.80 కోట్లు. ఓవర్ సీస్‌లో.. రెండు రోజుల‌కు క‌లిపి ఇప్ప‌టికే ‘భీమ్లా నాయ‌క్’ చిత్రానికి రూ.18 కోట్లు వసూళ్లు వచ్చాయి. అంటే మొత్తంగా చూస్తే గ్రాస్ వసూళ్లు రూ.83 కోట్లు వచ్చేశాయి. ఇదే ఊపును కొనసాగిస్తే ‘భీమ్లా నాయ‌క్’ ఆది, సోమ వారాల్లో రూ.100 కోట్ల మార్క్ రీచ్ కావడం పక్కా అని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/fFLa90V
v

కరోనా బారిన ప‌డ్డ శ్రుతి హాస‌న్‌

ప్ర‌ముఖ హీరోయిన్ శ్రుతి హాస‌న్‌కు పాజిటివ్‌గా నిర్దార‌ణ అయ్యింది. ఈ విష‌యాన్ని ఆమె త‌న సోష‌ల్ మీడియా మాధ్య‌మం ద్వారా తెలియ‌జేశారు. అన్నీ జాగ్ర‌త్త‌లు తీసుకున్న‌ప్ప‌టికీ కోవిడ్ పాజిటివ్ వ‌చ్చింది. ప్ర‌స్తుతం హోం ఐసోలేష‌న్‌లో ఉన్నాన‌ని, త్వ‌ర‌లోనే మిమ్మ‌ల్ని క‌లుసుకుంటాన‌ని చెబుతూ శ్రుతి హాస‌న్ మెసేజ్‌ను షేర్ చేశారు. క‌రోనా థ‌ర్డ్ వేవ్‌లో సినీసెల‌బ్రిటీలు చాలా మంది క‌రోనా బారిన ప‌డ్డారు. అందులో శ్రుతి హాస‌న్ తండ్రి క‌మ‌ల్ హాసన్ కూడా ఉన్నారు. క‌రోనా ప‌రిస్థితులు చ‌క్క‌బ‌డ్డాయి అని అనుకున్న త‌ర్వాత ఇప్పుడు మ‌ళ్లీ శ్రుతి హాస‌న్ క‌రోనా బారిన ప‌డ‌టం కాస్త ఇబ్బంది క‌ర‌మైన ప‌రిస్థితే. శ్రుతి హాస‌న్ అభిమానులు ఫాలోవ‌ర్స్ ఆమె త్వ‌ర‌గా కోలుకోవాల‌ని కోరుకుంటూ మెసేజ్‌లు చేస్తున్నారు. శ్రుతి హాస‌న్ ఈ మ‌ధ్య కాలంలో వ‌రుస సినిమాల‌తో బిజీగా మారింది. ప్ర‌స్తుతం ఈమె తెలుగులో నంద‌మూరి బాల‌కృష్ణ హీరోగా న‌టిస్తోన్న 107వ చిత్రంలో హీరోయిన్‌గా క‌నిపించ‌నుంది. ఇవి కాకుండా ప్ర‌భాస్ జోడీగా ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న స‌లార్ చిత్రంలోనూ క‌థానాయిక‌గా న‌టిస్తోంది. మైకేల్ కోర్స‌ల్‌తో ప్రేమాయ‌ణం న‌డిపిన శ్రుతి హాస‌న్‌..అత‌నితో ల‌వ్ బ్రేక‌ప్ త‌ర్వాత‌ కొన్నాళ్లు పాటు సినిమాల‌కు దూరంగా ఉంది. కాస్త గ్యాప్ తీసుకుని మ‌ళ్లీ కెరీర్‌ను స్టార్ట్ చేసింది. తెలుగులో క్రాక్ సినిమాతో ఎంట్రీ ఇచ్చి బ్లాక్ బ‌స్ట‌ర్ అందుకుంది. త‌ర్వాత ప‌వ‌న్ క‌ళ్యాణ్ వ‌కీల్ సాబ్ చిత్రంలో హీరోయిన్‌గా న‌టిస్తోంది. అదే స‌మ‌యంలో ప్ర‌భాస్ మూవీ స‌లార్ చిత్రంలో, బాల‌కృష్ణ 107వ‌చిత్రంలో అవ‌కాశాల‌ను అంది పుచ్చుకుంది. ఇప్పుడు డూడ‌ల్ ఆర్టిస్ట్ శాంత‌ను హాజ‌రికాతో ప్రేమాయ‌ణం న‌డుపుతుంది. ఒక‌వైపు ప్రేమ‌, మ‌రో వైపు సినిమాల‌ను బ్యాలెన్స్ చేస్తూ కెరీర్‌ను ముందుకు తీసుకెళుతుంది శ్రుతి హాస‌న్‌.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/MsXjTV5
v

Saturday 26 February 2022

‘భోళా శంకర్’ ఫస్ట్ లుక్ రిలీజ్ డేట్ ఖ‌రారు.. మెగా ఫ్యాన్స్‌కి పండ‌గే మ‌రి!

టాలీవుడ్ సీనియ‌ర్ అగ్ర కథానాయ‌కుడు మెగాస్టార్ టైటిల్ పాత్ర‌లో న‌టిస్తోన్న చిత్రం ‘’. మెహ‌ర్ ర‌మేష్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్న ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థలు క్రియేటివ్ క‌మ‌ర్షియ‌ల్స్‌, ఏకే ఎంట‌ర్‌టైన్మెంట్స్ బ్యాన‌ర్స్ రూపొందిస్తున్నాయి. రామ బ్ర‌హ్మం సుంక‌ర నిర్మాత. ప్రముఖ నిర్మాత అనీల్ సుంక‌ర ఈ చిత్రాన్నినిర్మాణపరమైన బాధ్యతలను పర్యవేక్షిస్తుంటారు. తాజాగా ఈ సినిమాను మెగా అప్‌డేట్‌ను చిత్ర యూనిట్ ఖ‌రారు చేసింది. బోళా శంక‌ర్ సినిమా ఫ‌స్ట్ లుక్‌ను మహా శివరాత్రి సందర్భంగా మార్చి 1న ఉద‌యం 9 గంట‌ల 5 నిమిషాల‌కు విడుద‌ల చేయ‌బోతున్న‌ట్లు మేక‌ర్స్ తెలిపారు. త‌మిళ చిత్రం వేదాళంకు రీమేక్‌గా తెర‌కెక్కుతోన్న ఈ చిత్రం సిస్ట‌ర్ సెంటిమెంట్ ప్ర‌ధానంగా ఉంటుంది. ఇందులో చిరంజీవి చెల్లెలు పాత్ర‌లో ప్ర‌ముఖ హీరోయిన్‌ న‌టిస్తున్నారు. చిరంజీవి మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా హీరోయిన్‌గా న‌టిస్తోంది. డూడ్లే సినిమాటోగ్ర‌ఫీ అందిస్తోన్న ఈ చిత్రానికి మ‌హ‌తి స్వ‌ర సాగ‌ర్ సంగీతం అందిస్తున్నారు. అన్నీ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసి ఈ చిత్రాన్ని ఈ ఏడాదిలోనే విడుద‌ల చేయ‌డానికి మేక‌ర్స్ స‌న్నాహాలు చేస్తున్నారు. ఈ ఏడాది మెగా ఫ్యాన్స్‌కు పెద్ద ఫెస్టివ‌ల్ అనే చెప్పాలి. మెగా హీరోల సినిమాలు ఎలాగూ వారి ఫ్యాన్స్‌ను అల‌రిస్తాయి. అయితే ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి వ‌రుస సినిమాల‌తో థియేట‌ర్స్‌లో సంద‌డి చేయ‌బోతున్నారు. మెగాస్టార్ చిరంజీవి స్పీడుతో కుర్ర హీరోల‌కు గ‌ట్టి పోటీనే ఇస్తున్నారు. ఇప్ప‌టికే ఆచార్య సినిమాను ఏప్రిల్ 29 రిలీజ్‌కి రెడీ చేసిన ఆయ‌న త‌న 153వ చిత్రం గాడ్‌ఫాద‌ర్ సినిమాను పూర్తి చేసే పనిలో బిజీగా ఉన్నారు. మ‌రో వైపు బోళాశంక‌ర్‌ను కూడా ఈ ఏడాదిలోనే విడుద‌ల చేస్తారు. మ‌రి చిరంజీవి స్పీడు చూస్తుంటే ఈ ఏడాది ద్వితీయార్థంలో బాబి దర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న సినిమాను కూడా విడుద‌ల చేసే అవ‌కాశం ఉంద‌ని అంటున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/ZzatEKC
v

భీమ్లా నాయక్ లొకేషన్‌లో స్టిల్ ఫొటోగ్రాఫర్ అవతారం ఎత్తిన పవన్ కళ్యాణ్.. ఫొటో వైరల్

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ టాలీవుడ్ అగ్ర క‌థానాయ‌కుల్లో ఒక‌ర‌నే సంగ‌తి అంద‌రికీ తెలిసిన విష‌య‌మే. అయితే ఆయ‌న మంచి టెక్నీషియ‌న్‌. జానీ సినిమాకు ఆయ‌నే డైరెక్ట‌ర్‌. సాధార‌ణంగా కెరీర్ ప్రారంభంలో ఆయ‌న సినిమాల‌కు ఆయ‌నే యాక్ష‌న్ స‌న్నివేశాల‌ను కూడా కంపోజ్ చేసుకునే వారు. ఇప్పుడు ఆయ‌న‌లోని టెక్నీషియ‌న్ గురించి ప్ర‌స్తావ‌న ఎందుకు వ‌చ్చిందంటే.. ఆయ‌న‌లోని సాంకేతిక‌మైన ఆస‌క్తి భీమ్లా నాయ‌క్ సినిమా షూటింగ్ స‌మ‌యంలో క‌నిపించింది. ఇంత‌కీ అదేంటంటారా!.. భీమ్లా నాయ‌క్ సినిమా షూటింగ్ స‌మ‌యంలో స్టిల్ ఫొటోగ్రాఫ‌ర్‌గా మారిపోయారు. వివ‌రాల్లోకి వెళితే, భీమ్లా నాయ‌క్ సినిమా క్లైమాక్స్‌ను చిత్రీక‌రించే స‌మ‌యంలో ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, రానా ద‌గ్గుబాటి, న‌ర్రా శీను, త్రివిక్ర‌మ్‌ల‌ను క‌లిసి డిస్క‌స్ చేసుకునే స‌మ‌యంలో ఏమ‌నిపించిందో ఏమో ప‌వ‌న్ క‌ళ్యాణ్ కెమెరా చేత ప‌ట్టుకున్నారు. త్రివిక్ర‌మ్‌, న‌ర్రా శీను, రానాల‌ను క‌లిపి ఓ ఫొటోను క్లిక్ మ‌నిపించారు. ఆ స‌న్నివేశాన్ని మ‌రొక‌రు త‌మ కెమెరాలో బంధించారు ఆ ఫొటో ఇప్పుడు నెట్టింట వైర‌ల్ అవుతుంది. లుంగీ క‌ట్టుకుని త్రివిక్ర‌మ్‌, న‌ర్రా శీను, రానాల‌ను ఫొటో తీస్తున్న ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఫొటో ఇప్పుడు సోష‌ల్ మీడియాలో హ‌ల్ చ‌ల్ చేస్తోంది. మ‌ల‌యాళ చిత్రం ‘అయ్యప్పనుమ్ కోశియమ్’ చిత్రానికి రీమేక్‌గా రూపొందిన చిత్రం ‘భీమ్లా నాయ‌క్‌’ ఫిబ్ర‌వ‌రి 25న రిలీజ్ అయ్యింది. సూప‌ర్ హిట్ టాక్‌తో బాక్సాఫీస్ వ‌ద్ద ఈ చిత్రం మంచి వసూళ్ల‌ను రాబ‌ట్టుకుంటోంది. ఇటు తెలుగు రాష్ట్రాల్లోనూ, అటు ఓవర్ సీస్‌లోనూ సినిమా కలెక్షన్స్ పరంగా రికార్డులను క్రియేట్ చేస్తోంది. కరోనా థర్డ్ వేవ్ తర్వాత భారీ హిట్ సాధించిన చిత్రమిదే. చిత్రానికి త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ మాట‌లు, స్క్రీన్ ప్లే అందించారు. సాగ‌ర్ కె.చంద్ర దర్శ‌క‌కుడు. సూర్య దేవ‌ర నాగ‌వంశీ చిత్రాన్ని సితార ఎంట‌ర్‌టైన్మెంట్స్ బ్యాన‌ర్‌పై నిర్మించారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/SfEUvAr
v

ఇండ‌స్ట్రీ పెద్ద‌పై హీరో శ్రీకాంత్ ఆస‌క్తిక‌ర‌మైన వ్యాఖ్య‌లు..!

తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌లో ఇప్పుడు పెద్ద ఎవ‌రు? అనే దానిపై చ‌ర్చ చాలా రోజులుగానే ఇండ‌స్ట్రీలో న‌డుస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇండ‌స్ట్రీ పెద్దరికంపై మెగాస్టార్ ఈ మ‌ధ్య కాలంలో స్పందిస్తూ.. తాను ఇండ‌స్ట్రీ బిడ్డ‌గా స‌మ‌స్య ఉన్న‌ప్పుడు ముందు ఉంటానే త‌ప్ప దుప్ప‌టి పంచాయతీలు చేయ‌న‌ని క్లారిటీ ఇచ్చేశారు. సీనియ‌ర్ న‌రేష్ వంటి వారైతే ‘మా’ ఎన్నిక‌లు జ‌రిగిన సంద‌ర్భంలో మోహన్ బాబు వంటివారే ఇండ‌స్ట్రీ పెద్ద కావాల‌న్నారు. ఇండ‌స్ట్రీ పెద్ద‌రికంపై కొన్ని రోజుల పాటు పెద్ద రేంజ్‌లో జ‌రిగినా ఎందుక‌నో త‌ర్వాత సైలెంట్‌గా మారిపోయింది. అయితే అడ‌పా ద‌డ‌పా కొంత మంది వ్య‌క్తులు మాత్రం సినీ ఇండస్ట్రీలో పెద్దరికం అనే ప్రశ్న వచ్చినప్పుడల్లా తమ అభిప్రాయాన్ని చెబుతూ వచ్చారు. తాజాగా ఈ లిస్టులో సీనియ‌ర్ నటుడు, హీరో శ్రీకాంత్ కూడా చేరారు. రీసెంట్‌గా ఆయ‌న సినీ ఇండ‌స్ట్రీలో పెద్ద రికం గురించి మాట్లాడుతూ ‘‘నాకు తెలిసినంత వరకు చిరంజీవిగారే ఇండ‌స్ట్రీ పెద్ద‌. చాలా కాలంగా ఆయ‌న ఎన్నో సేవా కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తున్నారు. ఇప్ప‌టి ప‌రిస్థితుల్లో ఎవ‌రికీ ఏ స‌మ‌స్య వ‌చ్చినా మెగాస్టార్‌గారే క‌నిపిస్తున్నారు. అందుక త‌గిన‌ట్లు ఆయ‌న కూడా ముందుండి స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించేలా చ‌ర్య‌లు తీసుకుంటున్నారు. ఇటీవ‌ల ఏపీ ప్ర‌భుత్వం కూడా సినిమా టికెట్స్ రేట్స్‌కు సంబంధించిన విష‌యం మాట్లాడేట‌ప్పుడు చిరంజీవిగారినే ఆహ్వానించింది. దాన్ని బ‌ట్టి ఇండ‌స్ట్రీలో ఆయ‌న స్థానం ఏంటో అర్థం చేసుకోవ‌చ్చు’’ అని తెలిపారు శ్రీకాంత్. ఇక సినిమాల విష‌యానికి వ‌స్తే.. రీసెంట్‌గా అఖండ చిత్రంలో ప‌వ‌ర్ ఫుల్ విల‌న్‌గా న‌టించి మెప్పించిన శ్రీకాంత్ ఇప్పుడు రామ్ చ‌ర‌ణ్‌, శంక‌ర్ కాంబినేష‌న్‌లో తెర‌కెక్కుతోన్న చిత్రంలోనూ న‌టిస్తున్నారు. ఒక‌వైపు హీరోగా, క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌గా, విల‌న్‌గా సినిమాలు చేస్తూ శ్రీకాంత్ రాణిస్తున్న సంగ‌తి తెలిసిందే.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/dXU0Zyl
v

పవ‌న్ క‌ళ్యాణ్ చేల‌రేగిపోయారు.. ‘భీమ్లా నాయ‌క్‌’పై సూపర్ స్టార్ ప్రశంసలు..!

పవర్ స్టార్ , వెర్సటైల్ హీరో రానా దగ్గుబాటిపై ప్రశంసల వర్షం కురుస్తోంది. సిన్సియర్ పోలీస్ ఆఫీస‌ర్ భీమ్లా నాయ‌క్‌గా ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. రిటైర్డ్ మిల‌ట‌రీ ఆఫీస‌ర్ డానియ‌ల్ శేఖ‌ర్‌గా రానా ద‌గ్గుబాటి పోటీ ప‌డి న‌టించారు. ఫిబ్ర‌వ‌రి 25న రిలీజ్ అయిన ఈ సినిమా సూప‌ర్ హిట్ టాక్‌ను తెచ్చుకుంది. బాక్సాఫీస్ వ‌ద్ద సూప‌ర్బ్ క‌లెక్ష‌న్స్‌ను రాబ‌ట్టుకుంటోందీ చిత్రం. ఇక ‘భీమ్లా నాయ‌క్‌’పై ఫ్యాన్స్‌తో పాటు సినీ సెల‌బ్రిటీలు ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపిస్తున్నారు. తాజాగా ఈ లిస్టులో సూప‌ర్ స్టార్ మ‌హేష్ చేరారు. ‘భీమ్లా నాయ‌క్‌’ హిట్‌ను ప్ర‌శంసిస్తూ ఆయ‌న ట్వీట్ చేశారు. ‘‘‘భీమ్లా నాయ‌క్‌’ అద్భుతంగా ఉంది. ప‌వన్ క‌ళ్యాణ్ స్క్రీన్‌పై చేల‌రేగి పోయారు. డానియ‌ల్ శేఖ‌ర్‌గా రానా ద‌గ్గుబాటి సెన్సేష‌న్ క్రియేట్ చేశారు. త్రివిక్ర‌మ్ త‌న‌దైన స్టైల్లో ఎప్ప‌టిలాగానే త‌న పెన్ ప‌వ‌ర్ చూపించారు. ఇక సినిమాటోగ్రాఫ‌ర్ కె.ర‌వి చంద్ర‌న్ విజువ‌ల్స్‌తో మాయ చేశారు. త‌మ‌న్ అద్భుత‌మైన సంగీతాన్ని అందించారు. ఆయ‌న బ్యాగ్రౌండ్ స్కోర్ థియేట‌ర్ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చిన వెంటాడుతుంది. ద‌ర్శ‌కుడు సాగ‌ర్ కె.చంద్ర‌, నిత్యా మీన‌న్‌, సంయుక్తా మీన‌న్‌, నిర్మాత సూర్య దేవ‌ర నాగ వంశీ స‌హా సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బృందానికి అభినంద‌న‌లు’’ అన్నారు. అడివి శేష్‌, గోపీ మోహ‌న్‌, సందీప్ కిష‌న్ స‌హా చాలా మంది ప్ర‌ముఖులు భీమ్లా నాయ‌క్ స‌క్సెస్‌పై త‌మ సంతోషాన్ని వ్య‌క్తం చేస్తూ చిత్ర యూనిట్‌కి అభినంద‌న‌లు తెలిపారు. మలయాళ చిత్రం ‘అయ్య‌ప్ప‌నుమ్ కోశియ‌మ్‌’కు ఇది రీమేక్‌. సితార ఎంట‌ర్‌టైన్మెంట్స్ బ్యాన‌ర్‌పై సూర్య దేవ‌ర నాగ‌వంశీ ఈ చిత్రాన్ని నిర్మించారు. సాగ‌ర్ కె.చంద్ర ద‌ర్శ‌కుడు. స్టార్ డైరెక్ట‌ర్ త్రివిక్ర‌మ్ ఈ చిత్రానికి మాట‌లు, స్క్రీన్ ప్లే అందించారు. నిత్యా మీన‌న్‌, సంయుక్తా మీన‌న్ హీరోయిన్స్‌గా న‌టించారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/0L3jPpV
v

డార్లింగ్ ప్రభాస్ కోసం రాజమౌళి ..‘రాధే శ్యామ్‌’కు జక్కన్న సాయం!

పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్‌, పూజా హెగ్డే జంట‌గా న‌టించిన చిత్రం ‘రాధే శ్యామ్‌’. ఈ పాన్ ఇండియా మూవీ మార్చి 11న వ‌ర‌ల్డ్ వైడ్‌గా గ్రాండ్ రిలీజ్ అవుతుంది. డార్లింగ్ ప్ర‌భాస్ ఫ్యాన్స్‌తో పాటు సినీ ప్రియులంద‌రూ ఈ సినిమా కోసం ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాకు ఇప్ప‌టికే ఉన్న క్రేజ్ చాలద‌న్న‌ట్లు ఇంకా హైప్‌ను ఒక్కో స్టెప్ పెంచుతూ వ‌స్తున్నారు మేక‌ర్స్‌. ఇప్ప‌టికే ఈ సినిమా హిందీ సినిమా నెరేష‌న్‌కు బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బ‌చ్చ‌న్ వాయిస్ ఓవ‌ర్ అందించారు. ఇప్పుడు ఇదే నెరేష‌న్‌ను తెలుగు వెర్ష‌న్‌కు ఎవ‌రు ఇస్తార‌నే దానిపై చిత్ర యూనిట్ క్లారిటీ ఇవ్వ‌లేదు. సినీ సర్కిల్స్‌లో వినిపిస్తోన్న స‌మాచారం మేర‌కు ‘రాధే శ్యామ్‌’ తెలుగు వెర్షన్ నెరేషన్‌కు రాజ‌మౌళి త‌న వాయిస్ ఓవ‌ర్‌ను అందించారు. రీసెంట్‌గానే రాజ‌మౌళికి సంబంధించిన వ‌ర్క్‌ను ‘రాధే శ్యామ్‌’ యూనిట్ పూర్తి చేసిందని టాక్‌. పూర్తి స్థాయి ప్ర‌మోష‌న్స్‌ను మార్చి మొద‌టి వారం నుంచి ప్రారంభించ‌బోతున్నార‌ట‌. ఇప్ప‌టికే విడుద‌లైన టీజ‌ర్‌, ట్రైల‌ర్‌, సాంగ్స్ సినిమాపై అంచనాల‌ను మ‌రో రేంజ్‌కు తీసుకెళ్లింది. అదే స‌మ‌యంలో ఈ సినిమా నుంచి మ‌రో ట్రైల‌ర్‌ను విడుద‌ల చేయ‌బోతున్నామ‌ని చిత్ర ద‌ర్శ‌కుడు రాధా కృష్ణ కుమార్ రీసెంట్ ఇంట‌ర్వ్యూలో తెలియ‌జేశారు. బాహుబ‌లి త‌ర్వాత పాన్ ఇండియా హీరోగా మారిన ప్ర‌భాస్ చేస్తున్న పాన్ ఇండియా మూవీస్‌లో ‘రాధే శ్యామ్‌’ ఒక‌టి. క‌రోనా కార‌ణంగా ఎప్పుడో రిలీజ్ కావాల్సిన ఈ చిత్రం వాయిదా పడుతూ వ‌చ్చి, ఇప్ప‌టికీ రిలీజ్ అవుతుంది. యూర‌ప్ బ్యాక్ డ్రాప్‌లో సాగే ప్రేమ క‌థా చిత్ర‌మిది. ఇందులో ప్ర‌భాస్ హ‌స్త సాముద్రికా నిపుణుడిగా క‌నిపిస్తే.. పూజా హెగ్డే మ్యూజిక్ టీజ‌ర్ ప్రేర‌ణ అనే పాత్ర‌లో క‌నిపించ‌నుంది. సీనియ‌ర్ న‌టుడు కృష్ణంరాజు ఓ కీల‌క పాత్ర‌ను పోషిస్తున్నారు. బాలీవుడ్ న‌టి భాగ్య శ్రీ కూడా ఈ చిత్రంలో న‌టించారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/8EiSdPB
v

సినీ ఇండ‌స్ట్రీ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు స‌పోర్ట్ ఇవ్వ‌క‌పోవ‌డం దుర‌దృష్ట‌క‌రం : నాగ‌బాబు

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ లేటెస్ట్ చిత్రం ‘భీమ్లా నాయ‌క్‌’. ఫిబ్ర‌వ‌రి 25న సినిమా విడుద‌లైంది. సినిమా టికెట్స్ పెంపుకు సంబంధించిన జీవోను ఎందుకు ఆల‌స్యం చేస్తున్నార‌ని ప్ర‌శ్నించారు మెగా బ్ర‌ద‌ర్ నాగ‌బాబు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న ఓ వీడియో విడుద‌ల చేశారు. అందులో మాట్లాడుతూ ‘‘వకీల్ సాబ్ సినిమా నుంచి ప్రభుత్వం నేటి వరకు సినీ పరిశ్రమను, పవన్ కళ్యాణ్‌ను ఏపీ ప్ర‌భుత్వం టార్గెట్ చేసింది. ప్ర‌భుత్వం ప‌వ‌న్ క‌ళ్యాణ్‌పై ప‌గ‌తో ఇలా చేస్తున్న‌ప్ప‌టికీ సినీ ప‌రిశ‌మ్ర నుంచి, సినీ పెద్ద‌లు నుంచి మ‌ద్ద‌తు రాక‌పోవ‌డం శోచ‌నీయం. ఇలా చేయ‌డం త‌ప్పు అని చెప్ప‌డం కానీ, ట్వీట్స్ వేయ‌డం కానీ ఎవ‌రూ చేయ‌డం లేదు. సినీ ప‌రిశ్ర‌మ అభ‌ద్ర‌త‌ను క‌ళ్యాణ్‌బాబు, ఆయ‌న‌తో ఉన్న నాలాంటి వాళ్లు అర్థం చేసుకోగ‌లం. పెద్ద హీరోకే ఇలా ఉంటే సామాన్య మాన‌వుడి పరిస్థితి ఏంటి? వాళ్లు ఎంత బాధ‌ప‌డుతున్నారు. నాపై ఏమైనా కోపం ఉంటే నాపైనే చూపించండి. ఇండ‌స్ట్రీ మీద కాదు అని రిప‌బ్లిక్ సినిమా వేడుక‌లో ప‌వ‌న్ క‌ళ్యాణ్ అన్న మాట‌ల‌కు ఇప్పుడు వాళ్లు క‌రెక్ట్ ఉప‌యోగించుకుంటున్నారు. అయితే మీరెవ‌రూ దానిపై ఒక మాట కూడా మాట్లాడ‌క‌పోవ‌డం దురదృష్ట‌క‌రం. భీమ్లా నాయ‌క్ సినిమా చాలా పెద్ద హిట్ అయ్యింది. ప్ర‌జ‌లు సినిమాను ఆద‌రించారు. ఒక‌వేళ ఈ సినిమా స‌రిగ్గా ఆడ‌క‌పోయుంటే క‌ళ్యాణ్ బాబు న‌ష్ట‌మేమీ వ‌చ్చుండేది కాదు. డిస్ట్రిబ్యూట‌ర్స్‌, ఎగ్జిబిట‌ర్స్‌, నిర్మాత నష్ట‌పోయేవారు. దేవుడి ద‌య వ‌ల్ల సినిమా హిట్ అయ్యింది. అయితే సినీ ఇండ‌స్ట్రీకి సినిమా వ్య‌క్తిగా ఓ విష‌యం చెప్పాల‌నుకుంటునాను. భ‌విష్య‌త్తులో ఇలాంటి స‌మ‌స్య‌లు ఏ ప్ర‌భుత్వం ద్వారా అయినా వ‌స్తే క‌చ్చితంగా మీకోసం మేం నిల‌బ‌డ‌తాం. మీరు మాకు స‌హ‌కారం అందించ‌క‌పోయినా ప‌రావాలేదు. మేం మీకు అండ‌గా నిల‌బ‌డ‌తాం’’ అన్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/F2Hxnpf
v

తండ్రికి కొరివిపెట్టిన సురేఖావాణి కూతురు.. బంధువుల అరాచకంపై నోరు విప్పింది

బట్టల్ని చూసి క్యారెక్టర్‌ని డిసైడ్ చేయడం.. వాళ్ల ప్రవర్తనని బట్టి బతుకుని బజారున పెట్టడం.. సోషల్ మీడియాలో సెలబ్రిటీలకు ఎదురయ్యే అవమానాలు రోజూ చూస్తేనే ఉంటాం. అయితే పైకి నవ్వుతూ నవ్విస్తూ అలరిస్తూ ఉన్నా.. వాళ్లు మనుషులే కదా.. వాళ్లకి బాధలు ఉంటాయి.. బంధాలు ఉంటాయి.. బంధుత్వాలు ఉంటాయి.. అయితే బంధాన్ని నిలిపే బంధువులు కూడా కాకుల్లా పొడుకుని తింటే ఆ బాధ ఎంత దారుణంగా ఉంటుందో చెప్తూ కన్నీళ్లు పెట్టుకుంది సురేఖా వాణి కూతురు సుప్రితి. సురేఖవాణి-సుప్రిత అంటే సోషల్ మీడియాలో రచ్చ చేస్తుంటారు.. పొట్టి బట్టలతో పార్టీలు పబ్‌లని తెగ ఎంజాయ్ చేస్తుంటారు.. వీళ్లిద్దరిలో తల్లి ఎవరూ కూతురు ఎవరో తెలియట్లేదే.. ఇవే మనకి కనిపింపే వార్తలు. అయితే పైకి ఇంత సంతోషంగా ఉన్నా.. తాము ఎన్ని కష్టాలు పడ్డామో పడుతున్నామో కళ్లకు కట్టింది సురేఖా వాణి కూతురు . అందరూ తన తండ్రి చావు గురించి కామెంట్లు చేస్తుంటారని.. అసలు తన తండ్రి చనిపోయినప్పుడు ఏమైందో మీకు తెలుసా? అంటూ నాటి విషయాలను చెప్పుకుని ఎమోషనల్ అయ్యింది సుప్రిత. ‘మా నాన్న చనిపోయినప్పుడు పరిస్థితులు చాలా దారుణం. నాన్న బంధువల వైపు నుంచి మాకు సపోర్ట్ లేదు. వాళ్లు ఈ మాటలు వింటే సారీ కానీ.. జరిగింది చెప్తున్నా. డాడీకి తలకొరివి నేను పెట్టుకున్నాను.. డాడీ బంధువుల్ని తలకొరివిపెట్టమని పిలిస్తే.. ఒక్కరు కూడా ముందుకు రాలేదు. మా బంధువులు మా నుంచి చాలా తీసుకున్నారు.. ఇప్పటికీ కూడా మా నుంచి తినాలి తినాలి అనే అనుకుంటారు.. వాళ్లు ఎంత తింటారో తెలియదు కానీ.. ఇప్పటికీ ఆశిస్తూనే ఉంటారు. డాడీకి తలకొరివి పెట్టాలని చెప్తే.. మీరు పెట్టేసేయండి.. మేం తరువాత వస్తాం అన్నారు.. ఆ టైంలో మా మమ్మీ ఫ్యామిలీ అమ్మమ్మ, తాతయ్య, మామయ్య, అమ్మమ్మ వాళ్ల బ్రదర్స్ వాళ్లే మాకు తోడుగా ఉన్నారు. తలకొరివి పెట్టడం మాట అటు ఉంచితే కాడే మోయడానికి కూడా ముందుకు రాలేదు. అతను ఎవరో కాదు.. మా డాడీ సొంత అన్నయ్యే. ఎవరో కాడె మోయడానికి ముందుకు వస్తే.. మోయకండిరా.. మోస్తే కడిగించుకోవడానికి మళ్లీ రావాలని దారుణంగా మాట్లాడారు. నేను హ్యాండిల్ చేసిన పరిస్థితులు చూస్తే అసలు నేనేనా అనిపించింది. మా నాన్నకి అన్నీ నేనే కదా.. అన్నీ నేనే చూసుకున్నా.. నా తండ్రికి నేనే కొరివిపెట్టాను. నేను హ్యాండిల్ చేయలేనేమో అని అమ్మ భయపడేది కానీ.. కొరివిపెట్టి.. ఆ హస్తికలు కలిపి అన్నీ నేనే చూసుకున్నా. ఇది జరిగిన తరువాత ఒక పోస్ట్ పెట్టాను.. తల కొరివి పెట్టకూడదు అదీ ఇదీ అంటారు కానీ.. అమ్మాయి ఏదైనా చేయగలదు.. చేయొచ్చు అని నా అభిప్రాయాన్ని చెప్పాను. దానిపై కూడా కామెంట్లు పెట్టారు.. పబ్లిసిటీ స్టంట్.. సింపథీ అని దారుణంగా మాట్లాడారు. ఓమైగాడ్.. మనుషులు ఇలా కూడా ఉంటారా అనిపించింది. నాన్నని మిస్ అయినందుకు ఇప్పటికీ మేం బాధపడుతున్నాం.. బంధువులు అన్నవాళ్లు సంతోషపెట్టకపోయినా పర్లేదు.. ఇలా బాధపెట్టకుండా ఉంటే మంచిది. నా సక్సెస్ చూడకుండా నా తండ్రి వెళ్లిపోయినందుకు నాకు ఇంకా బాధగానే ఉంది.. కష్టం వచ్చినప్పుడు ఓదార్చడానికి.. సక్సెస్ సాధించినప్పుడు భుజం తట్టడానికి అమ్మ చేయి ఓవైపున ఎలాగైతే ఉందో.. నాన్న చేయి కోసం మరోవైపున వెతుక్కుంటూనే ఉన్నా’ అంటూ చాలా ఎమోషనల్‌గా మాట్లాడింది సుప్రిత.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/i6hvB7g
v

పవన్ కళ్యాణ్ ‘భీమ్లా నాయక్’ తొలి రోజు వసూళ్లు.. పవర్ స్టార్ మేనియా పీక్స్!

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ టైటిల్ పాత్ర‌లో న‌టించిన చిత్రం ‘’. రానా దగ్గుబాటి ఈ మూవీలో డానియ‌ల్ శేఖ‌ర్ అనే పవ‌ర్ ఫుల్ పాత్ర‌లో న‌టించారు. సితార ఎంట‌ర్‌టైన్మెంట్స్ బ్యాన‌ర్‌పై సూర్య దేవ‌ర నాగ వంశీ ఈ చిత్రాన్ని నిర్మించారు. సాగ‌ర్ కె.చంద్ర ద‌ర్శ‌కుడు. త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ ఈ చిత్రానికి మాట‌లు, స్క్రీన్ ప్లే అందించారు. ఫిబ్ర‌వ‌రి 25న విడుద‌లైన ఈ చిత్రం సూప‌ర్ హిట్ టాక్‌ను సొంతం చేసుకోవ‌డంతో బాక్సాఫీస్ ద‌గ్గ‌ర వ‌సూళ్ల సునానీ మొద‌లైంది. అస‌లు ‘భీమ్లా నాయక్’ చిత్రానికి తొలిరోజు వ‌చ్చిన వ‌సూళ్లు ఎంతనే వివ‌రాల్లోకి వెళితే..‘భీమ్లా నాయక్’ చిత్రం తొలిరోజు రూ.43.10 కోట్లు గ్రాస్ (నెట్ క‌లెక్ష‌న్స్ రూ.37.15 కోట్లు) వ‌సూళ్ల‌ను సాధించింది. ఏరియా వైజ్ తొలిరోజు క‌లెక్ష‌న్స్ (కోట్ల రూపాయ‌ల్లో) .. నైజాం - 13.6 సీడెడ్ - 3.25 గుంటూరు - 2.51 కృష్ణా - 0.89 కోట్లు నెల్లూరు - 1.04 కోట్లు వెస్ట్ - 3.02 కోట్లు ఈస్ట్ - 1.94 కోట్లు అంటే మొత్తం రూ.28.15 కోట్లు షేర్ క‌లెక్ష‌న్స్ వ‌సూళ్ల‌ను భీమ్లా నాయ‌క్ సాధించింది. ఓవ‌ర్ సీస్‌లో.. ఒవ‌ర్ సీస్‌లో భీమ్లా నాయ‌క్ చిత్రం శుక్ర‌వారం సాయంత్రానికి 1 మిలియ‌న్ డాల‌ర్ మార్కుని క్రాస్ అయ్యారు. అంటే మ‌న క‌రెన్సీలో రూ.9 కోట్ట మేర‌కు వ‌చ్చిన‌ట్టు ట్రేడ్ టాక్‌. తెలుగు నెటివిటీకి త‌గ్గ‌ట్టు ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఇమేజ్‌ను బేస్ చేసుకుని మ‌ల‌యాళ చిత్రం అయ్య‌ప్ప‌నుమ్ కోశియ‌మ్ సినిమాను త్రివిక్ర‌మ్ మార్చిన తీరు ఆక‌ట్టుకుంది. ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఇమేజ్‌ను బేస్ చేసుకుని రానా ద‌గ్గుబాటి క్యారెక్ట‌ర్‌ను కూడా దానికి పోటీగా మ‌లిచిన తీరు అభినంద‌నీయం. నిత్యా మీన‌న్‌, సంయుక్తా మీన‌న్ హీరోయిన్స్‌గా న‌టించారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/Z5FpBaD
v

Friday 25 February 2022

ఆ ఒక్క ఏరియాలో దుమ్ముదుమారం.. బాహుబలిని మించేసిన భీమ్లా నాయక్

భారీ అంచనాల నడుమ ఫిబ్రవరి 25న ప్రేక్షకుల ముందుకొచ్చిన 'భీమ్లా నాయక్' మూవీ ప్రేక్షకుల నుంచి ఓ రేంజ్ రెస్పాన్స్ తెచ్చుకుంది. విడుదలకు ముందు నుంచే నెలకొన్న హైప్ థియేటర్ల వద్ద జాతర వాతావరణం నెలకొల్పింది. తొలి రోజే భీమ్లా నాయక్ సినిమా చూసేందుకు జనమంతా థియేటర్ల బాట పట్టారు. దీంతో కలెక్షన్స్ పరంగా తొలి రోజే ఈ సినిమా ఆల్ టైమ్ రికార్డు నెలకొల్పింది. బాహుబలి సినిమాను సైతం వెనక్కినెట్టి మొదటి స్థానంలో తన పేరు లిఖించుకున్నాడు భీమ్లా నాయక్. రిలీజ్‌కి ముందు వచ్చిన అన్ని అప్‌డేట్స్ ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ పెంచేయడంతో మొదటి రోజు ఈ సినిమాకు హ్యూజ్ రెస్పాన్స్ లభించింది. అన్ని ఏరియాల్లో హౌస్ ఫుల్ కలెక్షన్స్‌తో సత్తా చాటిన భీమ్లా నాయక్ ఒక్క నైజాం ఏరియాలో మాత్రం బాహుబలిని మించేసి వసూళ్లు రాబట్టాడు. నైజాం ఏరియాలో మెగా హీరోలకు మంచి మార్కెట్ ఉంటుందని తెలుసు. కానీ ఆ అంచనాలను మించి కలెక్షన్స్ రావడం విశేషం. తొలి రోజుకు గాను ఒక్క నైజాం ఏరియాలోనే 11.85 కోట్ల రూపాయలు రాబట్టి సరికొత్త రికార్డు నెలకొల్పాడు భీమ్లా నాయక్. దీంతో నైజాం ఏరియాలో ఫస్ట్ డే అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన సినిమాగా భీమ్లా నాయక్ నిలిచింది. దీని తర్వాతి స్థానంలో 11.44 కోట్ల రూపాయలతో పుష్ప, 9.41 కోట్ల రూపాయలతో సాహో, ఆ తర్వాత 8.9 కోట్ల రూపాయలతో బాహుబలి-2 ఉన్నాయి. ఇకపోతే అన్ని ప్రాంతాల్లో కలిపి భీమ్లా నాయక్ సినిమాకు 106.75 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. అదే రేంజ్‌లో 2000 పైగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదలైంది. భీమ్లా నాయక్ సునామీ చూసి బ్రేక్ ఈవెన్ చేరడం పెద్ద కష్టమేమీ కాదని అంటున్నారు ట్రేడ్ పండితులు. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ విశ్వరూపం చూపించారని, ఆయనతో పోటీపడి రానా నటించారనే టాక్ బయటకొచ్చింది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/qHBfWY5
v

‘భీమ్లా నాయ‌క్’ వివాదంలోకి జూనియర్ ఎన్టీఆర్.. ఎప్పుడైనా అలా స్పందించారా? అంటూ ప్ర‌శ్నించిన పేర్ని నాని

‘భీమ్లా నాయ‌క్’ సినిమా విష‌యంలో ఆంధ్ర ప్ర‌దేశ్ ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు ఓ రేంజ్‌లో వినిపించాయి. ప్ర‌భుత్వంపై వ‌స్తున్న ఆరోప‌ణ‌ల‌పై ఏపీ సినిమాటోగ్ర‌ఫీ మంత్రి పేర్ని నాని స్పందించారు. ఈ క్ర‌మంలో ‘భీమ్లా నాయ‌క్’ సినిమాకు అస్స‌లు సంబంధం లేని జూనియ‌ర్ ఎన్టీఆర్ పేరుని ఆయ‌న ప్ర‌స్తావించారు. అస‌లు ‘భీమ్లా నాయ‌క్’ సినిమాకు ఎన్టీఆర్ ఏంటి సంబంధం అనే వివ‌రాల్లోకి వెళితే.. ‘‘భీమ్లా నాయక్ సినిమాను తొక్కేస్తున్నామ‌ని అంటున్నారు. సినిమాన ఎక్క‌డైనా తొక్కేయ‌డాని వీల‌వుతుందా? సినిమా బావుంటే ప్రేక్ష‌కులు ఆద‌రిస్తారు. ఇక ప్ర‌భుత్వం విడుద‌ల చేసిన జీవో బ్లాక్ టికెటింగ్‌ను రూపు మాప‌డానికి. కానీ ప్ర‌తి ప‌క్ష పార్టీలు అన్నీ బ్లాక్ మార్కెటింగ్‌ను ప్రోత్స‌హిస్తున్నాయి. అలాగే బ్లాక్ మార్కెటింగ్‌ను త‌ప్పు ప‌ట్టాల్సిన మీడియాలో కొంత మందికి దానికి అనుకూలంగా మాట్లాడ‌టం వింటే ఆశ్చ‌ర్యంగా అనిపించింది. టికెట్ రేట్స్‌పై జీవోను నిలిపి కలెక్ట‌ర్‌ను సంప్ర‌దించి టికెట్ రేట్స్ పెంపుద‌ల‌పై అనుమ‌తులు తీసుకోవ‌చ్చున‌ని హైకోర్టు తీర్పు చెప్పింది. కానీ ఎవ‌రూ అలా చేయ‌డం లేదు. మీకు కోర్టులు, ప్ర‌భుత్వాలు అంటే లెక్క‌లేదంటే ఎలా? మా ఇష్టా రాజ్యం అంటే ఎలా కుదురుతుంది? ఇక సినిమా టికెట్స్‌కు సంబంధించిన జీవోను ఆల‌స్యంగా విడుద‌ల చేశామ‌ని అంటున్నారు. నిజానికి ఈ నెల 21న సినిమా టికెట్స్‌కు సంబంధించిన క‌మిటీతో భేటీ.. 22న హోం సెక్ర‌ట‌రీ ఓ డ్రాఫ్ట్‌ను రూపొందించి దాన్ని లా క‌మీష‌న్‌కు పంపించ‌టం, 23 లేదా 24న జీవో రావ‌డం అనేది ప్లాన్. కానీ మా మిత్రుడు, మంత్రి గౌత‌మ్ రెడ్డి అకాల మ‌ర‌ణం చెంద‌టంతో జీవో ఆల‌స్య‌మైంది’’ అన్నారు పేర్ని నాని. ఇదే సంద‌ర్భంలో నారా లోకేష్ గురించి పేర్ని నాని మాట్లాడుతూ ‘‘ఇంకా ‘భీమ్లా నాయ‌క్’ సినిమా రిలీజ్ కానే లేదు. అప్పుడే లోకేష్ సినిమా బావుంటుందని, సినిమా కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నానని అన్నారు. మరి జూనియర్ ఎన్టీఆర్ సినిమా రిలీజ్ అవుతుంటే ఎప్పుడైనా ఇలా అన్నారా! అని ప్ర‌శ్నించారు’’ అన్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/U27yCDO
v

‘రాధే శ్యామ్’ లెక్కలు తెలిస్తే కళ్లు తిరగాల్సిందే.. ఓవర్ సీస్‌లో డార్లింగ్ పక్కా స్కెచ్!

పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ క‌థానాయ‌కుడిగా న‌టించిన చిత్రం ‘రాధే శ్యామ్‌’. బాహుబలితో పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిన ప్ర‌భాస్ వ‌రుస పాన్ ఇండియా సినిమాల‌తో సందడి చేస్తున్నారు. ఈ క్ర‌మంలో ఆయ‌న గ‌త చిత్రం సాహో విడుద‌లై రెండున్న‌రేళ్లు అవుతుంది. ఆయ‌న అభిమానులేమో ప్ర‌భాస్‌ను సిల్వ‌ర్ స్క్రీన్‌పై చూడ‌టానికి ఆతృత‌గా ఎదురుచూస్తున్నారు. మార్చి 11న డార్లింగ్ ప్ర‌భాస్ బాక్సాఫీస్ వ‌ద్ద త‌న స‌త్తా చాట‌డానికి రెడీ అంటున్నారు. లేటెస్ట్‌గా ఓవ‌ర్ సీస్‌లో సెన్సేష‌న్ క్రియేట్ చేయ‌డానికి చిత్రాన్ని మేక‌ర్స్ సిద్ధం చేస్తున్నారు. ట్రేడ్ వ‌ర్గాల స‌మాచారం మేర‌కు ఇప్ప‌టి వ‌ర‌కు ఓవ‌ర్‌సీస్‌లో మ‌రే చిత్రం విడుద‌ల కాన‌న్ని లొకేష‌న్స్‌లో అంటే హిందీ వెర్ష‌న్‌ 1116, తెలుగు వెర్ష‌న్‌ 1116, త‌మిళం 200 లొకేష‌న్స్‌లో విడుద‌ల చేయ‌బోతున్నార‌ట‌. 31116 స్క్రీన్స్‌లో..11116 షోస్‌ను ప్ర‌దర్శించ‌బోతున్నారు. మ‌రి ఇంత భారీగా రాధే శ్యామ్ విడుద‌లైతే వ‌సూళ్ల ప‌రంగా ఎలాంటి రికార్డులు క్రియేట్ అవుతాయో చూడాలి మ‌రి. పీరియాడిక్ ల‌వ్ స్టోరిగా రూపొందిన ఈ చిత్రంలో ప్ర‌భాస్ జోడీగా పూజా హెగ్డే న‌టించింది. ఇప్ప‌టికే విడుద‌లైన టీజ‌ర్‌, ట్రైల‌ర్‌, సాంగ్స్ అన్నీ సినిమాపై అంచ‌నాల‌ను పెంచేశాయి. త్వ‌ర‌లోనే మ‌రో కొత్త ట్రైల‌ర్‌ను కూడా విడుద‌ల చేసే అవ‌కాశం ఉంద‌ని టాక్ అయితే సినీ సర్కిల్స్‌లో బ‌లంగా వినిపిస్తోంది. ఈ చిత్రంలో ప్ర‌భాస్ హ‌స్త సాముద్రిక తెలిసిన ఎక్స్‌ప‌ర్ట్‌గా క‌నిపించ‌నున్నారు. పూజా హెగ్డే ఇందులో మ్యూజిక్ డైరెక్ట‌ర్‌గా క‌నిపించ‌నున్నారు. వీరి మ‌ధ్య సాగే రొమాంటిక్ ల‌వ్ స్టోరిగా ‘రాధే శ్యామ్’ అల‌రించ‌నుంది. యువీ క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై కృష్ణంరాజు స‌మ‌ర్ప‌ణ‌లో ప్ర‌మోద్‌, వంశీ, ప్ర‌శీద ‘రాధే శ్యామ్’ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రాధా కృష్ణ కుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. సీనియ‌ర్ న‌టుడు కృష్ణంరాజు ఇందులో స్వామిజీ పాత్ర‌లో క‌నిపించ‌నున్నారు. బాలీవుడ్ న‌టి భాగ్య శ్రీ ఇందులో ప్ర‌భాస్ త‌ల్లి పాత్ర‌లో న‌టించారు. హీరోయిన్ పూజా హెగ్డే చేతి రేఖ‌ల‌ను అనుస‌రించి ఆమె ఎదుర్కోబోయే ప్ర‌మాదాల‌ను గుర్తించిన ప్ర‌భాస్ ఆమెను ఎలా ర‌క్షించుకుంటాడనేదే ఈ సినిమా క‌థాంశం.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/O4n7oJb
v

తమన్ థియేట‌ర్‌లో చేసిన ర‌చ్చ పీక్స్‌.. వారిద్ద‌రి థాంక్స్ చెప్పిన మ్యూజిక్ సెన్సేష‌న్‌ !

ప్ర‌స్తుతం టాలీవుడ్ మ్యూజిక్ సెన్సేష‌న్ ఎవ‌రంటే ట‌క్కున వినిపిస్తోన్న స‌మాధానం త‌మ‌న్‌. ఇప్పుడు త‌మ‌న్ ఆనందానికి ప‌ట్ట‌ప‌గ్గాలు లేవు. అందుకు కార‌ణం.. ‘భీమ్లా నాయ‌క్‌’ సినిమా. శుక్ర‌వారం విడుద‌లైన ఈ సినిమా విజ‌య‌వంత‌మైన టాక్ సంపాదించుకుంది. ముఖ్యంగా సినిమా రిలీజ్ కంటే విడుద‌లైన లిరిక‌ల్ సాంగ్స్‌కు చాలా మంచి స్పంద‌న వ‌చ్చాయి. సినిమా రిలీజ్ త‌ర్వాత బ్యాగ్రౌండ్ స్కోర్‌కు ఎక్స్‌ట్రార్డిన‌రీ రెస్పాన్స్ వ‌చ్చింది. థియేట‌ర్స్‌లో ప్రేక్ష‌కులు, ఫ్యాన్స్ పాటలు వ‌స్తున్నప్పుడు చేస్తున్న సంద‌డి అంతా ఇంత కాదు. సాధార‌ణంగా హీరో పాట‌ల‌కు అభిమానులు స్క్రీన్ ద‌గ్గ‌ర‌కు వ‌చ్చి స్టెప్పులేయ‌డం అనేది కామ‌న్‌గా జ‌రిగే విష‌యం. అయితే, మ్యూజిక్ డైరెక్ట‌ర్ త‌మ‌న్‌, డ్రమ్స్ శివ మ‌ణి కూడా ఇప్పుడు ఆ లిస్టులో చేరిపోయారు. అభిమానుల‌తో క‌లిసి స్క్రీన్ ముందు వేసిన స్టెప్పుల వీడియో నెట్టింట వైర‌ల్ అవుతుంది. ఈ వీడియోను త‌మ‌న్ త‌న సోష‌ల్ మీడియాలో షేర్ చేశారు. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కి, త్రివిక్ర‌మ్‌కు ప్ర‌త్యేకంగా ధ‌న్య‌వాదాలు చెప్పారు మ్యూజిక్ డైరెక్ట‌ర్ త‌మ‌న్‌. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌తో త‌మ‌న్ వ‌ర్క్ చేసిన రెండో సినిమా ఇది. ప‌వ‌న్ రీ ఎంట్రీ మూవీ వ‌కీల్ సాబ్ సినిమాకు త‌మ‌న్ సంగీతం అందించారు. ఆ సినిమా మంచి విజ‌యాన్ని ద‌క్కించుకుంది. ఇప్పుడు అదే వ‌రుస‌లో భీమ్లా నాయ‌క్ చేరింది. ప‌వ‌న్ హీరోయిజాన్ని ఎలివేట్ చేసిన తీరుకి ..త‌మ‌న్ సంగీతం, నేప‌థ్య సంగీతం అద‌న‌పు బ‌లాలు అయ్యాయి. ఈ సినిమా వ‌సూళ్ల ప‌రంగా ఇప్ప‌టికే ఓవ‌ర్ సీస్‌లో వ‌న్ మిలియ‌న్ మార్కుని దాటేసింది. ఇప్పుడు తొలిరోజు మొత్తం ఎంత మేర‌కు వ‌సూళ్లు సాధించిందో కొన్ని గంట‌ల్లోనే క్లారిటీ వ‌చ్చేయ‌నుంది. పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి హీరోలుగా నటించిన ‘’ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సూర్య దేవర నాగవంశీ నిర్మించారు. సాగర్ కె.చంద్ర దర్శకత్వం వహించారు. త్రివిక్రమ్ ఈ చిత్రానికి మాటలు, స్క్రీన్ ప్లే అందించారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/6oyAnar
v

ఏడోసారి ఆ మైల్ స్టోన్ ట‌చ్ చేసిన‌ ప‌వ‌ర్ స్టార్‌.. ‘భీమ్లా నాయ‌క్’ స్ట్రోమ్ మామూలుగా లేదు!

పవర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ టైటిల్ పాత్ర‌లో న‌టించిన చిత్రం ‘భీమ్లా నాయ‌క్’. ఫిబ్ర‌వ‌రి 25న విడుద‌లైన ఈ సినిమా హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. ప‌వ‌ర్ స్టార్ ఫ్యాన్స్ సంబ‌రాలు చేసుకుంటున్నారు. ఇక బాక్సాఫీస్ ద‌గ్గ‌ర సినిమా వ‌సూళ్ల సునామీని సృష్టిస్తోంది. ఇక యు.ఎస్ విష‌యానికి వ‌స్తే.. ఫిబ్ర‌వ‌రి 24నే ‘భీమ్లా నాయ‌క్’ ప్రీమియ‌ర్స్ ప‌డ్డాయి. అక్క‌డ ప్రీమియ‌ర్ షోస్ వ‌సూళ్లు 867000 డాల‌ర్స్‌గా ట‌చ్ అయ్యింది. శుక్ర‌వారానికి ఇది వ‌న్ మిలియ‌న్ డాల‌ర్స్‌ను ట‌చ్ చేసిన‌ట్లు ట్రేడ్ వ‌ర్గాలు అంటున్నాయి. ఇలా ఓవ‌ర్ సీస్‌లో వ‌న్ మిలియ‌న్ మార్కును ట‌చ్ చేసిన సినిమాల్లో ప‌వ‌న్ క‌ళ్యాణ్ సినిమా ఏడోది. సినిమాకు స‌క్సెస్ టాక్ రావ‌డంతో ఇక సినిమా వ‌సూళ్ల ప‌రంగా ఎలాంటి రికార్డుల‌ను క్రియేట్ చేయ‌నుందో చూడాలి. ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో ముప్పై ఆరు కోట్ల రూపాయ‌ల గ్రాస్ వ‌సూళ్ల‌ను సాధిస్తుంద‌ని ట్రేడ్ వ‌ర్గాలు అంటున్నాయి. ముఖ్యంగా ఆంధ్ర ప్ర‌దేశ్‌లో టికెట్ రేట్స్ త‌క్కువ‌గా ఉన్నాయి. తెలంగాణ త‌ర‌హాలో అక్క‌డ మంచి టికెట్ రేట్స్ ఉండుంటే.. సినిమా వ‌సూళ్ల ప‌రంగా మ‌రింతగా దూసుకెళ్ల‌ద‌ని సినీ స‌ర్కిల్స్ టాక్‌. తెలుగు రాష్ట్రాలు స‌హా మొత్తం తొలి రోజు ‘భీమ్లా నాయ‌క్’ వ‌సూళ్లు ఏంతో తెలియాలంటే కొన్ని గంట‌లు ఆగితే పూర్తి వివ‌రాలు వ‌చ్చేస్తాయి. మ‌ల‌యాళ చిత్రం ‘అయ్య‌ప్పనుమ్ కోశియమ్‌’కు రీమేక్‌గా రూపొందిన ఈ చిత్రాన్నితెలుగులో సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై సూర్య‌దేవ‌ర నాగ‌వంశీ నిర్మించారు. సాగ‌ర్ కె.చంద్ర దర్శ‌కుడు. స్టార్ డైరెక్ట‌ర్‌ త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ ఈ చిత్రానికి మాట‌లు, స్క్రీన్ ప్లే అందించారు. తెలుగు నెటివిటీకి స‌రిపోయేలా, ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఇమేజ్‌ను దృష్టిలో పెట్టుకుని క‌థ‌ను, పాత్ర‌ల‌ను మ‌లిచారు. రానా ద‌గ్గుబాటి ఇందులో మ‌రో హీరోగా న‌టించారు. నిత్యామీన‌న్‌, సంయుక్తా మీన‌న్ హీరోయిన్స్‌గా న‌టించారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/9u8SG1e
v

RGV: భీమ్లా నాయక్ భూకంపం..! పవన్ కళ్యాణ్ యాక్టింగ్‌పై వర్మ రివ్యూ

మొత్తానికి 'భీమ్లా నాయక్' సినిమా విడుదలైంది. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎదురుచూపులకు ఫుల్‌స్టాప్ పడింది. నేడే (ఫిబ్రవరి 25) ఈ సినిమా గ్రాండ్ రిలీజ్ కావడంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో భీమ్లా నాయక్‌ మేనియా నడుస్తోంది. జనంతో థియేటర్స్ కిటకిటలాడుతున్నాయి. బొమ్మ బ్లాక్ బస్టర్ అనే టాక్ వినిపిస్తుండగా.. కొందరు మాత్రం విజువల్స్‌పై పెదవి విరుస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా వివాదాస్పద వీరుడు రామ్ గోపాల్ వర్మ రంగంలోకి దిగి తన రివ్యూ ఇచ్చేశారు. గత కొన్ని రోజులుగా మెగా ఫ్యామిలీ టార్గెట్‌గా పలు విమర్శనాస్త్రాలు సంధిస్తున్న ఆర్జీవీ.. తాజాగా పవన్ కళ్యాణ్ 'భీమ్లా నాయక్' సినిమాపై స్పందించిన తీరు ఆసక్తికరంగా మారింది. ఈ సినిమా ఎలా ఉంది? పవన్, రానాల నటన సంగతేంటి? అనే అంశాలను తీసుకొని రామ్ గోపాల్ వర్మ పెట్టిన ట్వీట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. వీటిని బట్టి చూస్తే ఈ సినిమాపై వర్మ సానుకూలంగా స్పందించినట్లు కనిపిస్తోంది. భీమ్లా నాయక్ సినిమా మూవీ ఓ మెరుపు లాంటిదని పేర్కొన్న వర్మ.. పవన్ కళ్యాణ్ ఓ సునామీ అనేశారు. ఇక రానా అయితే పవన్‌తో పాటీ పడీ నటించారని చెబుతూ ఆయనకు ఫుల్ మార్క్స్ వేసేశారు. అంతేకాదు భీమ్లా నాయక్ సినిమా భూకంపం సృష్టించిందని అన్నారు. అలాగే ఈ సినిమాను హిందీలో కూడా రిలీజ్ చేస్తే అక్కడ సంచలనం సృష్టించి ఉండేదంటూ తన ఫీలింగ్స్ తెలిపారు వర్మ. కాగా, రీసెంట్‌గా వచ్చిన 'పుష్ప' సినిమా బీటౌన్‌లో సూపర్ రెస్పాన్స్ అందుకుంది. మరి అల్లు అర్జున్‌ని అంతలా పొగిడే వర్మ ఈ భీమ్లా నాయక్ మూవీ హిందీ రిలీజ్ గురించి మాట్లాడరంటే అందులో ఏదో లాజిక్ ఉండే ఉంటుందని అనుమాన పడుతున్నారు నెటిజన్లు. ఏదేమైనా వర్మ పెట్టిన ఈ స్మాల్ రివ్యూ మాత్రం నెట్టింట వైరల్‌గా మారింది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/8BASWEt
v

Poonam Kaur : అక్కా బావ సినిమా హిట్టు.. స్క్రీన్ షాట్ వదిలిన పూనమ్ కౌర్

పవర్ స్టార్ సినిమా అంటే ఫస్ట్ డే ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. థియేటర్ల వద్ద జాతరలా ఉంటుంది. ఇక సినిమా మీద అంచనాలు ఆకాశన్నంటాయి. దీనికి తోడు నేటి ఉదయం నుంచి కూడా ట్విట్టర్‌లో పాజిటివ్ టాక్ స్ప్రెడ్ అయింది. ఇక రివ్యూలు సైతం భీమ్లా నాయక్‌కు అనుకూలంగానే వచ్చాయి. సినిమా అదిరిపోయింది.. బొమ్మ హిట్టు అని కామెంట్లు వస్తున్నాయి. ఒరిజినల్ సినిమాతో పోలిక పెట్టాల్సిన అవసరం లేదు.. తెలుగు ప్రేక్షకులకు తగ్గట్టుగా ఈ చిత్రాన్ని మార్చేశారు. త్రివిక్రమ్ మార్క్ డైలాగ్స్, పవన్ కళ్యాణ్ పర్ఫామెన్స్, యాటిట్యూడ్, రానా స్వాగ్, తమన్ మ్యూజిక్ ఇలా అన్నీ కూడా దుమ్ముదులిపేశాయి. అయితే భీమ్లా నాయక్ సినిమా మీద పరోక్షంగా కౌంటర్లు వేస్తోంది. భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుగుతున్న సమయంలో రాజకీయాలు, సినిమాలు అంటూ ఏదో కౌంటర్ వేసింది. ఇక పవన్ కళ్యాణ్ స్పీచ్ మీద వర్మ వేసిన ట్వీట్‌ మీద పూనమ్ కౌర్ సెటైర్ వేసింది. ఆడవాళ్లను ఆయుధాలుగా మార్చుకుంటారని దర్శకుల మీద పూనమ్ కౌంటర్ వేసింది. ఇక తాజాగా పూనమ్ కౌర్ ఓ వాట్సప్ చాట్‌కు సంబంధించిన స్క్రీన్ షాట్‌ను షేర్ చేసింది. అందులో ఇలా ఉంది.. ఓ వ్యక్తి స్టేటస్ పెట్టుకున్నట్టున్నాడు. దానికి వాట్ అని ఇంకో వ్యక్తి రిప్లై ఇచ్చారు. సినిమాకి వచ్చిన అక్కా.. బావ సినిమా.. ఉదయం 8 గంటలకు.. స్టార్ ఎమోజీలను రిప్లైగా ఇచ్చారు. ఇక వాటికి సిగ్గుపడుతున్నట్టుగా ఎమోజీలతో పాటు..నిజాయితీగా రివ్యూ చెప్పమని అడుగుతారు. సరే అక్కా అని అవతలి వ్యక్తి రిప్లై ఇస్తారు. అక్కా సినిమా హిట్.. ట్రస్ట్ మీ.. ప్రామీస్ చెబుతున్నా అని అవతలి వ్యక్తి రిప్లై ఇస్తారు. ఈ స్క్రీన్ షాట్‌ను పూనమ్ కౌర్ షేర్ చేయడంతో అసలు చర్చ మొదలైంది. ఇందులో అక్క ఎవరు.. తమ్ముడు ఎవరు.. బావ ఎవరు అనేది కొందరికి అర్థం కావడం లేదు. కానీ ఇంకొందరు మాత్రం పూనమ్ కౌర్ మీద సెటైర్లు వేస్తున్నారు. నీ నంబర్ నాలుగు అని కన్ఫామ్ అయింది.. అంటూ కామెంట్లు పెడుతున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/R6tnohG
v

‘భీమ్లా నాయక్’ .. మెప్పించే మాస్ ఫీస్ట్

గెలుపు ఓటములకు భిన్నంగా, తిరుగులేని మాస్ ఇమేజ్‌ని సంపాదించుకున్న అగ్ర కథానాయకుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. కొన్నాళ్లు సినిమా రంగానికి దూరమైనప్పటికీ ‘వకీల్ సాబ్’తో రీ ఎంట్రీ ఇచ్చారు. రీ ఎంట్రీ తర్వాత వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడమే కాదు.. వాటిని చక చకా పూర్తి చేసుకుంటూ వస్తున్నారు. ఆ క్రమంలో పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘’ విడుదల అయ్యింది. ఇది మలయాళ చిత్రం ‘అయ్యప్పనుమ్ కోశియుమ్’కు రీమేక్. అయితే మాతృకలో ఉన్నది ఉన్నట్లుగా కాకుండా పవన్ కళ్యాణ్ ఇమేజ్‌కి తగ్గట్టు మార్పులు చేర్పులు చేశారు త్రివిక్రమ్. పవన్ కళ్యాణ్‌తో ఉన్న స్నేహం కారణంగా ఆయన ‘భీమ్లా నాయక్’లో ఇన్ వాల్వ్ అయ్యారు. ఆయన మాటలు, స్క్రీన్ ప్లే అందించడంతో పాటు హీరో ఎలివేషన్ సాంగ్ కూడా రాశారు. సాగర్ కె.చంద్ర దర్శకత్వం వహించిన ఈ సినిమాను సితార ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై సూర్య దేవర నాగవంశీ నిర్మించారు. ప్రోమో, టీజర్, ట్రైలర్ సహా తమన్ అందించిన పాటలు సినిమాపై భారీ అంచనాలను పెంచాయి. మరి పవన్ కళ్యాణ్ తనదైన స్టైల్‌లో ‘భీమ్లా నాయక్’తో ప్రేక్షకులను మెప్పించారా? లేదా? అని విషయం తెలియాలంటే కథేంటో చూద్దాం... కథ: కర్నూలు జిల్లా హఠకేశ్వర్ మండలంలో తెలంగాణ బోర్డర్‌లోని పోలీస్ స్టేషన్‌లో సబ్ ఇన్‌స్పెక్టర్ భీమ్లా నాయక్ (పవన్ కళ్యాణ్). నిజాయతీ గల అధికారి. డానియల్ శేఖర్ (రానా దగ్గుబాటి) మాజీ పార్లమెంట్ సభ్యుడి కుమారుడు. తనొక రిటైర్డ్ మిలటరీ పర్సన్. తెలంగాణలోని నల్ల పట్ల ప్రాంతానికి వెళుతుంటాడు. కారులో మద్యం సీసాలు ఉంటాయి. పరిమితికి మించిన మద్యం దొరకడంతో ఓ కారణమైతే, తాగిన మత్తులో డానియల్ శేఖర్ అక్కడున్న పోలీసులపై చేయి చేసుకుంటాడు. దాంతో డానియల్ శేఖర్‌ని భీమ్లా నాయక్ అరెస్ట్ చేస్తాడు. అతని పొగరు చూసి ఎఫ్ఐఆర్ నమోదు చేస్తాడు. దాంతో డానియల్ శేఖర్ ఇగో దెబ్బ తింటుంది. అతను ప్లాన్ చేసిన భీమ్లా నాయక్‌ను ఓ కేసులో ఇరికిస్తాడు. భీమ్లా నాయక్ ఉద్యోగం పోతుంది. భీమ్లా నాయక్ ఆత్మ గౌరవం కోసం.. డానియల్ శేఖర్ అహంకారంతో ఒకరిపై ఒకరు యుద్ధం మొదలు పెడతారు. చివరకు ఆ ఘర్షణ ఇద్దరు ఒకరిని ఒకరు చంపుకుందామనుకునే వరకు వెళుతుంది. మరో వైపు డానియల్ తండ్రి, మాజీ పార్లమెంట్ మెంబర్(సముద్ర ఖని) రంగంలోకి దిగి.. భీమ్లా నాయక్ కుటుంబంపై పగ తీర్చుకోవాలనుకుంటాడు. భీమ్లా నాయక్ తన ఫ్యామిలీని కాపాడుకునే ప్రయత్నాల్లో ఉంటాడు. అప్పుడు డానియల్ శేఖర్‌కి భీమ్లా నాయక్ గురించి ఓ షాకింగ్ విషయం తెలుస్తుంది. అదేంటి? చివరకు భీమ్లా నాయక్, డానియల్ గొడవలో ఎవరు గెలుస్తారు? అనే విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.. సమీక్ష: ఇద్దరు వ్యక్తుల అహం దెబ్బతిన్నప్పుడు.. అహానికి. ఆత్మ గౌరవానికి మధ్య యుద్ధం జరిగినప్పుడు ఎలా ఉంటుందనేది చెప్పే కథాంశమే భీమ్లా నాయక్. ఇలాంటి సినిమాను ముందుకు తీసుకెళ్లాలంటే నువ్వా నేనా? అని పోటీ పడే ఇద్దరు నటులు అవసరం. ఈ సినిమాకు అలాంటి ఇద్దరు స్టార్స్ దొరికారు. మాస్ ఇమేజ్ ఉన్న పవన్ కళ్యాణ్ ఓ వైపు.. అతనికి ధీటుగా బళ్లాలదేవుడు మరో వైపు పోటా పోటీగా నటించారు. అయ్యప్పనమ్ కోశియుమ్ సినిమాను తెలుగులో రీమేక్ చేయబోతున్నారనగానే చాలా మంది ఈ కథలో పవన్ కళ్యాణ్ ఎలా సూట్ అవుతాడో అని అనుకున్నారు. అయితే మాటల మాంత్రికుడు, స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ కథను తెలుగు నెటివిటీకి తగ్గట్టు చక్కగా మార్చారు. పవన్ కళ్యాణ్ ఇమేజ్‌ను, ఫ్యాన్ ఫాలోయింగ్‌ను దృష్టిలో పెట్టుకుని ..పవర్ స్టార్ ఫ్యాన్స్ మెచ్చేలా ఆయన క్యారెక్టర్‌ను డిజైన్ చేసుకుంటూ వచ్చారు. పవర్ ఫుల్ డైలాగ్స్‌ను పవన్ పాత్రకు కథానుగుణంగా రాశారు. అలాగే యాక్షన్ పార్ట్‌లో పవన్‌ను ఎంత పవర్ ఫుల్‌గా చూపించారో, నిత్యామీనన్‌తో కలిసి నటించిన సన్నివేశాల్లో అంతే సరదాగా ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారు. ఇక రానా పాత్రను పవన్ పాత్రకు సరి సమానంగానూ చూపించారు. అంతేలా బలమైన సన్నివేశాలను మలిచారు. రానా సందర్భానుసారం పలికే డైలాగ్స్ సినిమాలో కామన్ ఆడియెన్‌కు బాగా నచ్చుతాయి. రెండు పాత్రలు ఢీ కొట్టుకున్నప్పుడు వాటిలోని ఎమోషన్స్ తగ్గకుండా ఉండేలా.. ఆడియెన్స్ కనెక్ట్ అయ్యేలా సన్నివేశాలను మలచడంలో త్రివిక్రమ్ తన పెన్ పవర్ చూపించారు. అలాగే ‘నన్ను పీకేస్తే మళ్లీ మొలుస్తా.. నన్ను తొక్కేస్తే మళ్లీ లేస్తా.. కానీ తిరుగులేని యుద్ధాన్ని నీకు చూపిస్తాను’ అంటూ పవన్ పొలిటికల్ కోణాన్ని చూపించే డైలాగ్స్ కూడా ఇందులో మనకు వినిపిస్తాయి. మలయాళ మాతృక వ్యవధి మూడు గంటలు ఉంటే.. తెలుగులో మాత్రం రన్ టైమ్ రెండు గంటల ఇవరై ఐదు నిమిషాలే ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారు. హీరో క్యారెక్టర్‌కు ఇచ్చిన బిల్డప్‌కు నెక్ట్స్ లెవల్‌కు ఎలివేట్ చేసేలా ఓ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ఉంది. అలాగే క్లైమాక్స్‌ను ఈ ఫ్లాష్ బ్యాక్‌కి లింకు పెడుతూ ముగింపును ఓ ఎమోషనల్ కోణంలో ఇచ్చారు. ఇక నిత్యామీనన్ పాత్రను చక్కగా డిజైన్ చేశారు. పవన్ కళ్యాణ్‌తో నటించే సన్నివేశాలు సరదాగా ఉంటూ ప్రేక్షకుడికి తెలియని స్మైల్‌ను తెప్పించేలా ఉన్నాయి. అలాగే సంయుక్తా మీనన్ పాత్రను కూడా ఎమోషనల్ కోణంలో చక్కగా చూపించారు. సముద్ర ఖని తనదైన కోణంలో పాత్రను చాలా సునాయసంగా చేసేశారు. ఇక సునీల్, సప్తగిరి, హైపర్ ఆది, రవి వర్మ, మురళీ శర్మ తదితరులు వారి వారి పాత్రలను క్యారీ చేసిన విధానం బావుంది. ఇక సాంకేతికంగా చూస్తే.. డైరెక్టర్ సాగర్ కె.చంద్ర టేకింగ్ బావుంది. నవీన్ నూలి ఎడిటింగ్‌ను కూడా అభినందించాల్సిందే. ఇక తమన్ అందించిన పాటలు, నేపథ్య సంగీతం సినిమా రేంజ్‌ను పెంచాయి. రవి కె.చంద్రన్ సన్నివేశాలను చక్కగా తన కెమెరాలో బంధించారు. చివరగా.. ‘భీమ్లా నాయక్’.. మెప్పించే మాస్ ఫీస్ట్రేటింగ్ : 3/5


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/FA2Kilq
v

Thursday 24 February 2022

చరిత్ర కోసం మీరు కాదు.. మీ కోసం చరిత్ర దేవర.. పవన్‌పై బండ్ల గణేష్

సినిమా అంటే.. హడావిడే ఎక్కువగా ఉంటుంది. బండ్ల గణేష్ స్పీచ్‌లు లేనదే.. పవన్ కళ్యాణ్ సినిమా ఈవెంట్లు జరగవు. బండ్లన్న స్పీచులకు సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. బండ్ల గణేష్‌కు, ఆయన మాటల తూటాలకు పవర్ స్టార్స్ ఫ్యాన్స్ ఫిదా అవుతుంటారు. అతని పొగడ్తలకు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ బండ్లన్న కూడా ఫ్యాన్స్ అయిపోతుంటారు. ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు బండ్ల గణేష్ వస్తాడా? లేదా? అని వారం ముందే చర్చలు ప్రారంభించేశారు. అయితే బండ్ల గణేష్ పేరు మీదుగా లీకైన ఆడియో సంచలనంగా మారింది. అందులో త్రివిక్రమ్ మీద చేసిన ఆరోపణలు, వాడిన పదజాలం దారుణంగా ఉంది. అయితే ఇప్పుడు బండ్ల గణేష్, త్రివిక్రమ్ మధ్య కోల్డ్ వార్ ఉందని అర్థమవుతోంది. ఆ ఆడియోలో ఉన్న వాయిస్ తనది కాదంటూ బండ్లన్న ఖండించాడు. అయితే భీమ్లా నాయక్ ఈవెంట్‌లో బండ్ల గణేష్ కనిపించలేదు. ఆహ్వానం అందలేదేమో.. ఏం జరిగిందో గానీ మొత్తానికి బండ్లన్న రాకపోవడం, ఆయన స్పీచు లేకపోవడంతో అభిమానులు హర్ట్ అయ్యారు. దీంతో బండ్లన్న ఎక్కడ అంటూ అభిమానులు హంగామా చేసేశారు ‘మా దేవర నటించిన భీమ్లా నాయక్ దెబ్బకి బాక్సులు బద్దలవ్వాలని రికార్డులు చిరిగిపోవాలని దిక్కులు పిక్కటిల్లేలా అభిమానులు స్వాగతం పలకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ .. చరిత్ర కోసం మీరు కాదు. మీ కోసం చరిత్ర దేవర.. ’ అంటూ భీమ్లా నాయక్ సినిమా మీద బండ్ల గణేష్ ట్వీట్ వేశాడు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/gfwOCiv
v

త్రివిక్రమ్‌నే టార్గెట్ చేసిందా.. పూనమ్ కౌర్ ట్వీట్ అర్థమదేనా?

భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఉన్నాడా?లేదా? అసలు వచ్చాడా? అనే అనుమానం అందరిలోనూ కలిగింది. బండ్ల గణేష్ ఆడియో లీక్ ఎఫెక్ట్ అని.. అందుకే త్రివిక్రమ్ మాట్లాడలేదని, సైలెంట్‌గా ఉండిపోయాడని కొందరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇదంతా ఒక వైపు ఉంటే.. ఇక స్పీచు మీద రామ్ గోపాల్ వర్మ వేసిన ట్వీట్, దాని మీద పూనమ్ స్పందించిన తీరు అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. పవన్ కళ్యాణ్ ఎంతో సటిల్డ్‌గా మాట్లాడాడు. ఎక్కడా గాడి తప్పకుండా.. భీమ్లా నాయక్ ఈవెంట్‌లో మాట్లాడేశాడు. దీని మీద వర్మ ట్వీట్ వేశాడు. పవన్ కళ్యాణ్ ఇచ్చిన స్పీచుల్లో ఇదే బెస్ట్ స్పీచ్.. ఎంతో ఎమోషనల్‌గా అనిపించింది అంటూ వర్మ చెప్పుకొచ్చాడు. వర్మ వేసిన ట్వీట్ మీద కౌంటర్ వేసింది. అయితే వర్మ వేసిన ట్వీట్‌ను రీట్వీట్ వేస్తూ పూనమ్ కౌర్ స్పందించింది. ఓ డైరెక్టర్ ఎదుటి వారి జీవితాలను పూర్తిగా నాశనం చేస్తాడు.. ఓ మూల నుంచి చూస్తూ ఎంజాయ్ చేస్తాడు.. బయటి జనాలు తిడుతుంటే.. సైలెంట్‌గా ఉంటాడు అని చెప్పుకొచ్చింది. ఇక ఇంకో డైరెక్టర్ అయితే ఎదుటివారిని తక్కువ చేస్తాడు.. ట్విట్టర్‌లో నవ్వుతుంటాడు. ఆ ఇద్దరూ కూడా అమ్మాయిలను ఆయుధాలుగా వాడుకుంటారు అని అనేసింది. ఇందులో ఒకరు అని అర్థమవుతోంది. ఇక ఇంకొకరు ఎవరు అని కొందరు నెటిజన్లు కామెంట్లు పెడుతుండగా.. ఇంకెవరు త్రివిక్రమ్ అని ఇంకొందరు సమాధానాలు ఇస్తున్నారు. మొత్తానికి పూనమ్ ట్వీట్లు మాత్రం పజిల్‌లానే ఉంటాయి.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/icPZSbh
v

Bheemla Nayak మొదటి రోజే సునామీ.. ఎంత రాబట్టనున్నాడంటే?

మొదటి రోజు దుమ్ములేపేట్టు కనిపిస్తోంది. దెబ్బకు మరోసారి రికార్డులు బద్దలయ్యేట్టు కనిపిస్తోంది. త్రివిక్రమ్ మార్క్ డైలాగ్స్, పవన్ కళ్యాణ్ యాటిట్యూడ్, నటన, రానా పర్ఫామెన్స్ అదిరిపోయాయి. ఈ సినిమా బ్లాక్ బస్టర్ అంటూ రిపోర్టులు వచ్చేశాయి. ప్రీ బుక్స్, అడ్వాన్స్ బుకింగ్స్‌తో సినిమా కలెక్షన్ల సునామీ సృష్టిస్తుందని అందరికీ అర్థమైంది. అయితే సినిమాకు గనుక పాజిటివ్ రిపోర్ట్స్ వస్తే ఈ కలెక్షన్లు మరింత పెరిగే చాన్స్ ఉంటుందని అంతా భావించారు. మొత్తానికి టాక్ అదిరిపోయింది. సినిమా మొదటి రోజు రికార్డ్ కలెక్షన్లను కొల్లగొట్టబోతోందని అర్థమవుతోంది.అయితే ఏపీలో థియేటర్ల సమస్య, నో బెనిఫిట్ షోలు, నో టికెట్ హైక్స్ ఉన్నాయి. దీంతో అక్కడే కలెక్షన్లలో కాస్త తేడా కొట్టేలా ఉంది. ప్రీమియర్స్‌తోనే భీమ్లా నాయక్ మూవీ 700k డాలర్లను రాబట్టేసింది. ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ మూవీ మొదటి రోజు ముప్పై కోట్ల మేర గ్రాస్ కొల్లగొట్టేట్టు తెలుస్తోంది. ఈ దెబ్బతో రికార్డుల మోత మొదలైనట్టే. ఇక ఈ వీకెండ్‌లోనే సినిమా బ్రేక్ ఈవెన్‌కు కూడా దగ్గర్లో వచ్చేలా ఉంది. అసలే ఈ సినిమాకు రెండు వారాలు టైం ఉంది. మొదటి వారంలోనే బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక రెండో వారంలో అయితే భీమ్లా నాయక్ లాభాల పంట పండిచేసేలా ఉన్నాడు. భీమ్లా నాయక్ 108 కోట్ల టార్గెట్‌తో బరిలోకి దిగినట్టు తెలుస్తోంది. ఇక భీమ్ల ా నాయక్ సినిమాకు పవన్ కళ్యాణ్, రానా నటన, త్రివిక్రమ్ మార్క్ డైలాగ్స్, తమన్ సంగీతం ప్రధాన బలాలుగా మారినట్టు చెప్పుకుంటున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/yPkW2KB
v

భీమ్లా నాయక్ ట్విట్టర్ రివ్యూ.. పవన్ కళ్యాణ్ విశ్వరూపం

పవర్ స్టార్ , రానా దగ్గుబాటి నటించిన సినిమా ఎట్టకేలకు నేడు (ఫిబ్రవరి 25) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయ్యప్పనుమ్ కోషియుమ్ సినిమాను తెలుగు నేటివిటీ తగ్గట్టుగా మార్పులు చేర్పులు చేసిన త్రివిక్రమ్.. ఈ సినిమాకు బ్యాక్ బోన్ అయ్యాడు. సాగర్ కే చంద్ర తెరకెక్కించిన ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద సూర్యదేవర నాగవంశీ నిర్మించాడు. ఇక నేడు విడుదలైన ఈ మూవీ ఇప్పటికే సోషల్ మీడియాలో దుమ్ములేపుతోంది. భీమ్లా నాయక్ సినిమా మీద ముందు నుంచీ అంచనాలు భారీగానే ఉన్నాయ్. గ్లింప్స్, పోస్టర్లతోనే సినిమా స్థాయి పెరిగింది. ఇక ఒక్కో పాట మరింత హైప్ క్రియేట్ చేసింది. ఈ మధ్య విడుదల చేసిన ట్రైలర్ అయితే ఇంకో రేంజ్‌లో ఉంది. దీంతో సినిమా మీద అంచనాలు ఆకాశన్నంటాయి. మొత్తానికి పవర్ స్టార్ అభిమానుల ఆకలి తీర్చే బొమ్మ పడిపోయింది. ఈ సినిమాను చూసి ఫ్యాన్స్ కాలర్ ఎగిరేస్తున్నారు. సినిమా చూసిన జనాలు అంతా కూడా ఒకే మాట చెబుతున్నారు. ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ చేసిన సినిమాల్లో ది బెస్ ఇదేనని, నటన అదిరిపోయిందని, యాటిట్యూడ్ చూపించడంలో పవన్ కళ్యాణ్‌ను మించిన వారు లేరంటూ కామెంట్లు పెడుతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా పాజిటివ్ టాక్. ఇలాంటి టాక్ విని ఎన్ని ఏళ్ల్అవుతోందో అని ఇంకో అభిమాని ట్వీట్ వేశాడు.పవన్ కళ్యాణ్ ఎంట్రీ సీన్ అయితే వీర లెవెల్ అంటూ అభిమానులు సందడి చేస్తున్నారు. థియేటర్లో ఫ్యాన్స్ విజిల్స్‌తో మోత మోగిస్తున్నారు. వన్ వర్డ్‌లో చెప్పాలంటే సినిమా బ్లాక్ బస్టర్ అని అంటున్నారు. పవన్ కళ్యాణ్ రానా సీన్స్, పవన్ కళ్యాణ్‌కు పెట్టిన డైలాగ్స్ అదిరిపోయాయని అంటున్నారు. మొత్తానికి భీమ్లా నాయక్ రికార్డుల వేట కొనసాగించేశాడని అర్థమవుతోంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/zW4gcoA
v

‘తగ్గేదే లే’ అంటున్న జక్కన్న.. RRR ప్రమోషన్స్‌‌కి కొత్త ప్లాన్ సిద్ధం చేసిన రాజమౌళి

ఎంటైర్ ఇండియా ఆస‌క్తిగా ఎదురు చూసే పాన్ ఇండియా చిత్రాల్లో RRR ఒక‌టి. టాలీవుడ్ టాప్ స్టార్స్ అయిన యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ హీరోలుగా ద‌ర్శ‌క ధీరుడు రాజ‌మౌళి తెర‌కెక్కించిన చిత్రమిది. ఈ సినిమాను ఈ ఏడాది సంక్రాంతి సందర్భంగా జ‌న‌వ‌రి 7న విడుద‌ల చేయాల‌ని ప్లాన్ చేసుకున్నారు. దానికి త‌గ్గ‌ట్టు పాన్ ఇండియా రేంజ్‌లో ప్ర‌ధాన న‌గరాల‌కు వెళ్లి RRR సినిమాను ప్ర‌మోట్ చేసుకుంటూ వ‌చ్చారు. తీరా సినిమా రిలీజ్‌కు ఐదు రోజులు ఉంద‌న‌గా.. క‌రోనా థ‌ర్డ్ వేవ ప్ర‌భావంతో సినిమా రిలీజ్‌ను వాయిదా వేయాల్సి వ‌చ్చింది. ఫ్యాన్స్ స‌హా అంద‌రికీ నిరాశ క‌లిగినా త‌ప్ప‌లేదు. క‌రోనా థ‌ర్డ్ వేవ్ పరిస్థితులు చ‌క్క‌బ‌డిన త‌ర్వాత మార్చి 25న ప్ర‌పంచ వ్యాప్తంగా RRRను విడుద‌ల చేయడానికి రెడీ అయ్యారు. మ‌రి ఇది వ‌ర‌కు దాదాపు ఇర‌వై కోట్ల రూపాయ‌ల‌కు పైగానే ప్ర‌మోష‌న్స్‌కు జ‌క్క‌న్న అండ్ టీమ్ ఖ‌ర్చు పెట్టారు. RRR రిలీజ్ కాక‌పోవ‌డంతో ఆ డ‌బ్బుల‌న్నీ వృథా అయ్యాయి. ఇప్పుడు సినిమా రిలీజ్ అవుతుంది. పోనీ వ‌దిలేద్దామా అంటే సినిమా ప్ర‌మోష‌న్స్ చేసి రెండు నెల‌లు దాటేస్తుంది కాబ‌ట్టి.. ప్ర‌మోష‌న్స్ చేసుకుంటే కానీ.. సినిమాకు మ‌ళ్లీ హైప్ క్రియేట్ చేయ‌లేరు. ఆ కార‌ణంతో ఎన్టీఆర్‌, చ‌ర‌ణ్‌, రామ్ చ‌ర‌ణ్ ఇప్ప‌టికే RRR ప్ర‌మోష‌న్స్ ప‌రంగా డిస్క‌ష‌న్స్ చేసుకున్నార‌ట‌. మార్చి 1 నుంచి మ‌ళ్లీ సినిమా ప‌బ్లిసిటీని స్టార్ట్ చేయాల‌నుకుంటున్నార‌ట‌. దీనికి సంబంధించిన ప్లానింగ్ కూడా త్వ‌ర‌లోనే రెడీ కానుంద‌ట‌. RRR సినిమాలో గోండు వీరుడు కొమురం భీమ్‌గా యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌.. మ‌న్యం వీరుడు అల్లూరి సీతా రామ‌రాజుగా మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ క‌నిపించ‌బోతున్నారు. చ‌రిత్ర‌లో ఎప్పుడూ క‌లుసుకోని ఇద్ద‌రు యోధులు క‌లుసుకుని బ్రిటీష్ వారిని ఎదిరిస్తే ఎలా ఉంటుంద‌నేదే క‌థాంశం. 1920 నేప‌థ్యంలో సాగే పీరియాడిక్ డ్రామా ఇది. ఇందులో బాలీవుడ్ స్టార్స్ అజ‌య్ దేవ‌గ‌ణ్‌, ఆలియా భ‌ట్‌ల‌తో పాటు హాలీవుడ్ స్టార్స్ అలిసన్ డూడి, రే స్టీవెన్ స‌న్‌, ఒలివియా మోరిస్ న‌టించారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/BZ5In9W
v

అమ్మాయిల‌ను ఆయుధాలుగా వాడుకుంటారు.. రామ్ గోపాల్ వర్మపై పూన‌మ్ కౌర్‌ ఘాటు వ్యాఖ్యలు!

సినిమాల కంటే వివాదాల్లో ఎక్కువ‌గా నిలిచే హీరోయిన్స్ ఎవ‌రంటే మ‌న‌కు వినిపించే పేర్ల‌లో పూన‌మ్ కౌర్ ఒక‌రు. సోష‌ల్ మీడియాలో ఆమె చాలా యాక్టివ్‌గా ఉంటారు. ఆమె సోష‌ల్ మీడియాలో చేసే వ్యాఖ్య‌లు వైర‌ల్ అవుతుంటాయి. వివిధ ప‌రిస్థితుల‌ను ఉద్దేశించి ఆమె చేసే వ్యాఖ్య‌లు హాట్ టాపిక్‌గా మారుతుంటాయి. తాజాగా ఇప్పుడు పూన‌మ్ కౌర్ చేసిన ఓ ట్వీట్ వైర‌ల్ అయ్యింది. ఏదో సాదా సీదా ట్వీట్ అనుకుంటే మ‌నం పొర‌బ‌డ్డ‌ట్టే. ఎందుకంటే ఆమె టార్గెట్ చేసింది వివాదాస్ప‌ద ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ‌ని. సాధార‌ణంగా ఆర్జీవీ ఎవ‌రినో ఒక‌రిని టార్గెట్ చేసి కామెంట్స్ చేస్తుంటాడు. ఇప్పుడు ఆయ‌నే టార్గెట్ కావ‌డం అనేది టాక్ ఆఫ్ ది ఇండ‌స్ట్రీగా మారింది. అయితే ఈ వ్యాఖ్యల‌కు ప‌వ‌న్ క‌ళ్యాణ్ సెంటరాఫ్ ఎట్రాక్ష‌న్ మార‌డం గ‌మ‌నార్హం. అస‌లు కాంట్ర‌వ‌ర్సియ‌ల్ డైరెక్ట‌ర్ రామ్ గోపాల్ వ‌ర్మ‌ను పూన‌మ్ కౌర్ ఏమ‌ని కామెంట్ చేసింది? ఎందుకు కామెంట్ చేసింది? అనే వివ‌రాల్లోకి వెళితే, నిన్న భీమ్లా నాయ‌క్ ప్రీ రిలీజ్ ఈవెంట్ జ‌రిగింది. అందులో ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఎవ‌రిపైనా విమ‌ర్శ‌లు చేయ‌కుండా చాలా జెంటిల్‌గా మాట్లాడారు. దీనిపై ఆర్జీవీ ట్విట్ట‌ర్ సాక్షిగా రియాక్ట్ అయ్యారు. తాను చూసిన బెస్ట్ స్పీచెస్‌లో ప‌వ‌న్ క‌ళ్యాణ్ మాట్లాడింది ఒక‌టని తెలియ‌జేస్తూ ఆర్జీవీ ఓ యూ ట్యూబ్ లింకును షేర్ చేశారు. అంత వ‌ర‌కు బాగానే ఉంది. అయితే ఆ త‌ర్వాత పూన‌మ్ కౌర్ రామ్ గోపాల్ వ‌ర్మ ట్వీట్‌కు రిప్లై ఇస్తూ.. ‘‘ఒక ద‌ర్శ‌కుడు ఆయ‌న వ్య‌క్తిగ‌త జీవితాన్ని కామెంట్ చేస్తారు. మూల‌గా, సైలెంట్‌గా ఉండిపోతారు. మ‌రో ద‌ర్శ‌కుడు ఆయ‌న్ని రాజ‌కీయంగా నాశ‌నం చేయ‌డానికి సిద్ధంగా ఉంటాడు. ట్విట్ట‌ర్‌లో న‌వ్వుతుంటాడు. ఇద్ద‌రూ డ‌బ్బులిచ్చి బాడుగ‌కు తెచ్చుకోబ‌డిన ఏజెంట్లే. వారు మ‌హిళ‌ల‌ను ఆయుధాలుగా వాడుకుంటారు’’ అని తెలిపారు. పూన‌మ్ ఇలా రామ్ గోపాల్ ట్వీట్‌ను షేర్ చేస్తూ కామెంట్ చేయ‌డం ఓ ర‌కంగా చాలా మందికి షాకింగ్‌గా అనిపించింది. పూన‌మ్ పంచ్ ఇచ్చిన వారిలో ఓ డైరెక్ట‌ర్ రామ్ గోపాల్ వ‌ర్మ అయితే, మ‌రో ద‌ర్శ‌కుడు ఎవ‌ర‌నేది ఓ ప్ర‌శ్న‌గానే ఆమె వ‌దిలేసింది. మ‌రి దీనిపై ఆర్జీవీ ఏమైనా రియాక్ట్ అవుతాడా? లేక సైలెంట్‌గా ఉండిపోతాడా? అని చూడాలి.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/RbtV0ix
v

యు.ఎస్ బాక్సాఫీస్ ద‌గ్గ‌ర ‘భీమ్లా నాయ‌క్‌’ జోరు.. ప్రీమియ‌ర్స్ క‌లెక్ష‌న్స్‌లో సరికొత్త రికార్డ్ దిశ‌గా ప‌వ‌ర్ స్టార్‌!

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ టైటిల్ పాత్ర‌లో న‌టించిన చిత్రం ‘భీమ్లా నాయ‌క్‌’. రానా దగ్గుబాటి కూడా మరో హీరోగా నటించారు. ఈ చిత్రం ఫిబ్రవరి 25న రిలీజ్ అవుతుంది. పవర్ స్టార్ ఫ్యాన్స్ ఎంతో ఆతృత‌గా సినిమా కోసం ఎదురు చూస్తున్నారు. ఒక రోజు మాత్ర‌మే బ్యాలెన్స్ ఉంది. అన్ని చోట్ల ఆన్ లైన్ బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. టికెట్స్ హాటు కేకుల్లా అమ్ముడైపోతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. ఓవ‌ర్ సీస్ బాక్సాఫీస్ ద‌గ్గ‌ర కూడా భీమ్లా నాయ‌క్ జోరు చూపిస్తున్నాడు. ప్రీమియ‌ర్ వ‌సూళ్ల‌లో భీమ్లా నాయ‌క్ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తుంది. సినీ స‌ర్కిల్స్‌లో వినిపిస్తోన్న స‌మాచారం మేర‌కు యు.ఎస్‌లో.. 325 లొకేషన్స్‌లో రిలీజ్ అవుతుంది. ఇన్ని లొకేష‌న్స్‌లో ఇప్ప‌టి వ‌ర‌కు 618000 డాల‌ర్స్‌ను రాబ‌ట్టుకుంది. అంటే ప్రీమిర్స్ ద్వారానే నాలుగు కోట్ల‌కు పైగానే ఇప్ప‌టికే భీమ్లా నాయ‌క్ రాబ్ట‌టేశాడు. వ‌న్ మిలియ‌న్ దిశ‌గా అడుగులేస్తున్నాడు. క‌రోనా మూడు వేవ్స్ దెబ్బ‌కు తెలుగు సినిమాల ఓవ‌ర్ సీస్ మార్కెట్ బాగానే దెబ్బ‌తింది. అఖండ‌, పుష్ప సినిమాలు బాగానే అక్క‌డి ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకున్నాయి. అయితే అవి రిలీజ్ త‌ర్వాత‌నే మంచి వ‌సూళ్ల‌ను సాధించాయి. కానీ భీమ్లా నాయ‌క్ విష‌యం పూర్తిగా వేరుగా క‌నిపిస్తోంది. సినిమా రిలీజ్‌కు ముందు ప్రీమియ‌ర్స్‌కు ఈరేంజ్ క‌లెక్ష‌న్స్ రావ‌డం ప‌వ‌ర్ స్టార్ స్టామినాకు నిద‌ర్శ‌న‌మ‌ని అంటున్నారు. క‌రోనా త‌ర్వాత బాలీవుడ్ స‌హా మ‌రే సినిమాకు ఈ రేంజ్ కలెక్ష‌న్స్ యు.ఎస్‌లో రాలేదు మ‌రి. మ‌రి భీమ్లా నాయ‌క్ వ‌న్ మ‌లియ‌న్ మార్క్‌ను చేరుకుటాడో లేదో తెలియాలంటే మ‌రికొన్ని గంట‌లు ఆగాల్సిందే. మ‌ల‌యాళ చిత్రం అయ్య‌ప్ప‌నుమ్ కోశియ‌మ్ సినిమాకు ఇది రీమేక్‌. ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఇందులో పోలీస్ ఆఫీస‌ర్‌గా క‌నిపిస్తే.. రాజ‌కీయాల్లో ఎద‌గాల‌నుకునే వ్య‌క్తిగా రానా క‌నిపించ‌బోతున్నారు. సితార ఎంట‌ర్‌టైన్మెంట్స్ బ్యాన‌ర్‌పై సూర్య‌దేవ‌ర నాగ‌వంశీ ఈ చిత్రాన్న నిర్మించారు. సాగ‌ర్ కె.చంద్ర ద‌ర్శ‌కుడు. త్రివిక్ర‌మ్ ఈ చిత్రానికి మాట‌లు, స్క్రీన్‌ప్లే అందించ‌డంతో పాటు ఓ పాట కూడా రాయ‌డం విశేషం.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/gb2Iwe7
v

Wednesday 23 February 2022

గాడ్ ఫాదర్ .. భీమ్లా నాయక్ కలిస్తే.. అరుదైన వీడియో షేర్ చేసిన రామ్ చరణ్

మెగా ప‌వ‌ర్‌స్టార్ రామ్ చ‌ర‌ణ్ ఈరోజు ఉద‌యం ప‌ది గంట‌ల‌కు త‌న సోష‌ల్ మీడియాలో ఓ అరుదైన వీడియోను షేర్ చేస్తాన‌ని తెలిపారు. దీంతో అంద‌రూ ఆయ‌న హీరోగా న‌టించిన RRR లేదా ఆచార్య సినిమాకు సంబంధించిన ఏదైనా వీడియోను షేర్ చేస్తారేమోన‌ని భావించారు. కానీ ఆయ‌న షేర్ చేసిన వీడియో చూసి ఫ్యాన్స్‌, ప్రేక్ష‌కులు థ్రిల్ అవుతున్నారు. ఇంత‌కీ అంద‌రూ అంత‌లా థ్రిల్ అయ్యేలా రామ్ చ‌ర‌ణ్ షేర్ చేసిన వీడియో ఎవ‌రిదో తెలుసా.. తండ్రి , బాబాయ్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ల‌ది. అస‌లు ఏం జ‌రిగింది అనే వివ‌రాల్లోకి వెళితే.. ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ హీరోగా న‌టించిన చిత్రం భీమ్లా నాయ‌క్‌. ఈ సినిమా షూటింగ్ స‌మ‌యంలో ఆ సినిమా సెట్స్‌ను చిరంజీవి ప్ర‌త్యేకంగా విజిట్ చేశారు. అది కూడా ఆయ‌న షూటింగ్ చేస్తున్న గాడ్ ఫాద‌ర్ సినిమా డ్రెస్‌లోనే. ఇంత‌కీ చిరంజీవి వేసుకున్న డ్రెస్ ఏదో తెలుసా? ఖైదీ నెం.786 అనే ఖైది డ్రెస్‌. చిరంజీవి రాక‌ను ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, త్రివిక్ర‌మ్ తెగ ఎంజాయ్ చేశారు. అలాగే త‌ర్వాత గాడ్ ఫాద‌ర్ సెట్స్‌ను ప‌వ‌న్ క‌ళ్యాణ్ విజిట్ చేశారు. ఆయ‌న‌కు తోడుగా త్రివిక్ర‌మ్ కూడా వ‌చ్చారు ఆ స‌మ‌యంలో చిరంజీవి సినీ ఇండ‌స్ట్రీలోని ప్ర‌ముఖులతో మాట్లాడుతున్నారు. వారిలో విజ‌యేంద్ర ప్ర‌సాద్‌, ఆర్‌.నారాయ‌ణ‌మూర్తి త‌దిత‌రులున్నారు. ఇలా భీమ్లా నాయ‌క్‌ను గాడ్ ఫాద‌ర్‌.. గాడ్‌ఫాద‌ర్‌ను భీమ్లా నాయ‌క్ క‌లుసుకున్న అపూర్వ క్ష‌ణాల‌ను వీడియోలో బంధించి దాన్ని ఈరోజు విడుద‌ల చేశారు రామ్ చ‌ర‌ణ్‌. ఆ వీడియో ఇప్పుడు సోష‌ల్ మీడియాలో తెగ హ‌ల్ చ‌ల్ చేస్తోంది. ఈ రెండు చిత్రాల్లో ముందుగా భీమ్లా నాయ‌క్ సినిమా ఫిబ్ర‌వ‌రి 25న విడుద‌ల‌వ అవుతుంది. చిరంజీవి విష‌యానికి వ‌స్తే.. ఆయ‌న న‌టిస్తోన్న గాడ్ ఫాద‌ర్ చిత్రం, మ‌లయాళ సినిమా లూసిఫ‌ర్‌కు రీమేక్‌.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/QIW09Hx
v

భీమ్లా నాయక్ ట్రైలర్: పవన్ కళ్యాణ్ నటనపై రామ్ చరణ్ కామెంట్

పవర్ స్టార్ హీరోగా ఫిబ్రవరి 25న గ్రాండ్‌గా రిలీజ్ కాబోతోంది భీమ్లా నాయక్ మూవీ. టాలీవుడ్ భారీ మల్టీస్టారర్‌గా రూపొందిన ఈ సినిమాలో రానా కీలకపాత్ర పోషించారు. ఇప్పటికే విడుదల చేసిన టీజర్, ఇతర అప్‌డేట్స్ భారీ రెస్పాన్స్ తెచ్చుకోగా.. రీసెంట్‌గా విడుదలైన ట్రైలర్ భారీ రేంజ్ వ్యూస్ రాబడుతోంది. ఈ ట్రైలర్ చూసిన తాజాగా తన సోషల్ మీడియా ఖాతా ద్వారా రియాక్ట్ అవుతూ ఆసక్తికర కామెంట్స్ చేశారు. ''భీమ్లా నాయక్ ట్రైలర్‌లో ఆ పవర్ అదిరిపోయింది. పవన్ కళ్యాణ్ గారి ప్రతీ డైలాగ్, యాక్షన్ పవర్ఫుల్గా ఉంది. నా మిత్రుడు రానా నటన, కనిపించిన తీరు సూపర్బ్. త్రివిక్రమ్, సాగర్ కె చంద్ర, నిత్య మీనన్, సితార ఎంటర్టైన్మెంట్స్, తమన్కు ఆల్ ది బెస్ట్'' అంటూ ట్విటర్‌లో పోస్ట్ పెట్టారు రామ్ చరణ్. బాబాయ్ పవన్ కళ్యాణ్ మూవీ ట్రైలర్పై అబ్బాయి రామ్ చరణ్ ఇచ్చిన ఈ రివ్యూ చూసి మెగా ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ అవుతోంది. 'అయ్యప్పనుమ్ కోషియుమ్‌' తెలుగు రీమేక్‌గా సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై భారీ రేంజ్‌లో 'భీమ్లా నాయక్' మూవీ రూపొందించారు. సాగర్ కే చంద్ర దర్శకత్వం వహించిన ఈ సినిమాకు త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు, దర్శకత్వ పర్యవేక్షణ చేశాడు. తమన్ బాణీలు కట్టారు. నిత్య మీనన్, సంయుక్త మీనన్ హీరోయిన్లుగా నటించారు. చిత్రంలో పవన్ కళ్యాణ్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించనున్నారు. ఈ చిత్రానికి భారీ రేంజ్ ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఈ మూవీపై పవన్ ఫ్యాన్స్ బోలెడన్ని అంచనాలు పెట్టుకున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/UzFsfnq
v

ముంబైలో ఆలీ భార్య.. ఛార్మీ ఎమోషనల్ పోస్ట్

పూరి జగన్నాథ్, ఛార్మీలు గత రెండేళ్లుగా ముంబైలోనే ఉంటున్నారన్న సంగతి తెలిసిందే. లైగర్ పనుల కోసం ఈ ఇద్దరూ అక్కడే ఉండిపోయారు. మధ్యలో కరోనా, లాక్డౌన్ వంటివి రావడంతో పూర్తిగా అటే ఫిక్స్ అయిపోయారు. ఈడీ పిలిచిందని మధ్యలో పూరీ, ఛార్మీలు హైద్రాబాద్‌కు వచ్చారు. అయితే ఇప్పుడు ముంబైకి తన బార్య జుబేదాతో కలిసి ఆలీ వెళ్లినట్టు కనిపిస్తోంది. మామూలుగానే ఆలీకి, పూరికి మధ్య ఎంతో సన్నిహిత సంబంధాలున్నాయి. పూరి సినిమాల్లో ఆలీకి ప్రత్యేక పాత్రలుంటాయి. ఇక పూరి ఆర్థిక కష్టాల్లో ఉన్న సమయంలో ఆలీ ఆదుకున్న సంగతి తెలిసిందే. ఆలీ గురించి పూరి పలు వేదికల్లో ఎంతో గొప్పగా చెప్పుకొచ్చాడు. అయితే ఇప్పుడు ఆలీ ముంబైకి ఎందుకు వెళ్లాడో తెలీదు గానీ.. చెప్పిన విషయం మాత్రం వైరల్ అవుతోంది. ఆలీ భార్య ఎక్కువగా యూట్యూబ్‌లో సందడి చేస్తుంటుంది. వంటల వీడియోలు, హోం టూర్ వీడియోలంటూ బాగానే ఫేమస్ అయింది. ఇక ఆలీ తన తోటీ ఆర్టిస్ట్‌లకు ఇంట్లోని భోజనం అంటూ బిర్యానీని వడ్డిస్తుంటాడు. అలా జుబేదా చేసే బిర్యానీకి నెట్టింట్లో చాలానే మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఇక ఇప్పుడు పూరి, ఛార్మీలకు జుబేదా స్పెషల్‌గా వంట చేసి వడ్డించినట్టుంది. ఇదే విషయాన్ని ఛార్మీ చెప్పుకొచ్చింది. మా దగ్గరకు వచ్చారు.. ఎంతో ప్రేమతో వంట చేసి వడ్డించావ్.. థ్యాంక్స్ అంటూ జుబేదా గురించి ఛార్మీ చెప్పుకొచ్చింది. థ్యాంక్యూ సో మచ్ డార్లింగ్ అంటూ ఛార్మీకి జుబేద రిప్లై ఇచ్చింది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/DH50w2Q
v

గుర్తుతెలియని వ్యక్తులు ఇంటికి తన మూడో భార్య బండారం బయటపెట్టిన నరేష్

తన మూడో భార్య రమ్య రఘుపతికి తనకి ఎలాంటి సంబంధం లేదంటూ వివరణ ఇచ్చారు సినీ నటుడు . లక్షల్లో అప్పులు తీసుకుని తిరిగి చెల్లించడం లేదంటూ కొంతమంది బాధితులు మంగళవారం నాడు గచ్చిబౌలి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆమెపై ఛీటింగ్ కేసు నమోదైన విషయం తెలిసిందే. అయితే ఈ కేసుకి తనకి ఎలాంటి సంబంధం లేదంటూ తన మూడో భార్య గురించి పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు నరేష్. ‘రమ్య రఘుపతి గారి ఫైనాన్సియల్ ఇష్యూస్ మీడియాలో బ్లాస్ట్ కావడంతో నాకు వరుసగా ఫోన్లు వస్తున్నాయి.. నా బంధువులు, మీడియా మిత్రులు జరిగిన దానిపై నిజానిజాలు తెలుసుకోవడానికి ఫోన్లుచేస్తున్నారు. వాళ్లందరికీ నేను చెప్పేది ఒక్కటే.. జరిగిన దానికి నాకు ఎలాంటి సంబంధం లేదు. ఇలా జరిగిందని నాకు నిన్నమొన్నటి వరకూ తెలియదు. రమ్య రఘుపతికి నాకు పెళ్లై దాదాపు తొమ్మిదేళ్లు అవుతుంది.. పెళ్లైన రెండు మూడేళ్లే మేం విడిపోయాం.. వేరుపడి ఐదేళ్లుపైనే అయ్యింది.. ఇలాంటి సమస్యలు ఉన్నాయి.. మరింత పెరుగుతుందనే కారణంతోనే మేం విడిపోయాం. విడిపోయిన తరువాత ఎవరికి వారే గౌరవంగా మా బతుకు మేం బతుకుతున్నాం. ఆమెకు నాకు ఎటువంటి సంబంధం లేదు.. వేరు వేరుగా ఉన్నాం. ఆమెకు సంబంధించి హిందూపూర్ ఇష్యూతో పాటు.. కొన్ని కొత్త విషయాలు కూడా వెలుగులోకి రావడంతో.. నాకు భయం వేసి.. నేనుకూడా రెండు నెలల క్రితమే.. పబ్లిక్ నోటీసు పేపర్‌లో ఇచ్చాను. నాకు ఈమెకు ఎలాంటి సంబంధం లేదని పేపర్‌లో నోటీసు ఇచ్చాను. ఎందుకంటే ప్రజలకు తెలియాలని.. నా వరకూ మేం దూరంగా ఉంటున్నా. కానీ గత కొన్ని దినాలుగా పెద్ద పెద్ద వాళ్లు ఇంటికి రావడం.. ఇంటి ముందు కార్లు ఉండటం.. పెద్దవాళ్లు ఏం జరుగుతుందో అని భయపడుతున్నారు.. రాత్రుల్లు కూడా చాలామంది ఇంటికి వస్తున్నారని మా వాళ్లు భయపడ్డారు.. ఇది ఫైనాన్సియల్ మ్యాటర్ కావడంతో నేను ఇన్వాల్వ్ కాలేదు.. ఇందులో నాకు ఎలాంటి సంబంధం లేదు.. అర్ధరాత్రి సమయంలో గుర్తుతెలియని వ్యక్తులు ఇంటికి వచ్చేవారు.. ఆ సమయంలోనే రమ్యను హెచ్చరించాను.. అయితే ఆమెలో మార్పు రాలేదు.. రమ్య వసూలు చేసిన డబ్బులకూ నాకు ఎలాంటి సంబంధం లేదు’ అంటూ వివరణ ఇచ్చారు నరేష్. ఇదిలా ఉంటే.. నరేష్‌కి రమ్య రఘుపతి మూడో భార్య.. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు, మాజీ మంత్రి రఘువీరా రెడ్డి సోదరుని కుమార్తే ఈ రమ్య రఘుపతి. ఉన్నత విద్య అభ్యసించిన రమ్య.. ఆస్ట్రేలియాలో ఫిలిం మేకింగ్ కోర్స్ పూర్తి చేసింది. సినిమాలపై ఆసక్తితో దర్శకుడు నీలకంఠ దగ్గర నందనవనం సినిమాకి అసిస్టెంట్‌గా పనిచేస్తున్నప్పడు నరేష్‌తో పరిచయం ఏర్పడి ఆ పరిచయం ప్రేమగా మారింది. ఆ ప్రేమతో తన తల్లి విజయ నిర్మల దగ్గర కో డైరెక్టర్‌గా పెట్టించారు నరేష్. ఆ తరువాత ఇరువర్గాలను ఒప్పించి 2010 పెళ్లి చేసుకున్నారు. అయితే అంతకు ముందు నరేష్‌కి ఇద్దరితో పెళ్లై.. విభేదాలతో విడిపోయారు. ఇక రమ్యని పెళ్లాడిన తరువాత కూడా విడాకుల పరంపర కొనసాగింది. పెళ్లైన మూడేళ్ల తరువాత రమ్యకి కూడా విడాకులు ఇచ్చారు నరేష్.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/wskC5cu
v

భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ లెక్కలు.. ఏరియా వైజ్ డీటైల్ రిపోర్ట్!!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్- కాంబినేషన్‌లో రాబోతున్న కొత్త సినిమా 'భీమ్లా నాయక్'. టాలీవుడ్ భారీ మల్టీస్టారర్‌గా రూపొందిన ఈ సినిమా ఫిబ్రవరి 25న గ్రాండ్‌గా రిలీజ్ కాబోతోంది. ఈ నేపథ్యంలో చిత్ర ప్రమోషన్స్ వేగవంతం చేశారు మేకర్స్. మరోవైపు ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, టీజర్, ట్రైలర్ సినిమాపై భారీ హైప్ క్రియేట్ చేశాయి. దీంతో ఈ సినిమాకు నెలకొన్న డిమాండ్ దృష్ట్యా ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా ఓ రేంజ్‌లో జరిగినట్లు ట్రేడ్ వర్గాల నుంచి వచ్చిన రిపొర్ట్స్ ద్వారా అర్థమవుతోంది. ఏరియా వైజ్ ప్రీ- రిలీజ్ బిజినెస్ చూస్తే.. నైజాం: 35 కోట్లు సీడెడ్: 16.50 కోట్లు ఉత్తరాంధ్ర: 9 కోట్లు ఈస్ట్ గోదావరి: 6.40 కోట్లు వెస్ట్ గోదావరి: 5.40 కోట్లు గుంటూరు: 7.20 కోట్లు కృష్ణా: 6 కోట్లు నెల్లూరు: 3.25 కోట్లు మొత్తంగా AP-TG రాష్ట్రాల్లో కలిపి 88.75 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరగగా.. కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా కలిపి 9 కోట్లు, ఓవర్సీస్‌లో మరో 9 కోట్ల బిజినెస్ జరిగినట్లు రిపోర్ట్స్ చెబుతున్నాయి. వరల్డ్ వైడ్‌గా చూస్తే 106.75 కోట్ల మేర బిజినెస్ జరిగింది. దీంతో 108 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో బరిలోకి దిగుతున్నాడు భీమ్లా నాయక్. 'అయ్యప్పనుమ్ కోషియుమ్‌' తెలుగు రీమేక్‌గా సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై భారీ రేంజ్‌లో భీమ్లా నాయక్ మూవీ రూపొందించారు. సాగర్ కే చంద్ర దర్శకత్వం వహించిన ఈ సినిమాకు త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు, దర్శకత్వ పర్యవేక్షణ చేశాడు. తమన్ బాణీలు కట్టారు. నిత్య మీనన్, సంయుక్త మీనన్ హీరోయిన్లుగా నటించారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/91aoIxu
v

ఆ మాటతో బుక్కైన అషు రెడ్డి..! ఛాన్స్ దొరికిందని రెచ్చిపోతున్న నెటిజన్లు

సోషల్ మీడియాతోనే నేమ్, ఫేమ్ కొట్టేసింది . ఆ తర్వాత బిగ్ బాస్ షోతో ఆ పాపులారిటీని రెట్టింపు చేసుకొని కుర్రకారు గుండెల్లో గూడు కట్టుకుంది. జూనియర్ సమంతగా పెరు తెచ్చుకున్న ఈ బ్యూటీ నెట్టింట చేసే అల్లరి మామూలుగా ఉండదు. నిత్యం తన ఫోటోషూట్లతో నెట్టింట మంట పెట్టడం అషు హ్యాబీ. ఈ నేపథ్యంలో తాజాగా ఆమె షేర్ చేసిన ఓ ఫోటో షూట్‌పై, దానిపై ఆమె జోడించిన ట్యాగ్ లైన్‌పై రెచ్చిపోయి కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు. కెరీర్‌ పరంగా దూసుకెళ్తున్న అషూ రెడ్డి హాట్‌ ఫోటోషూట్‌లతో సోషల్‌ మీడియాలో రచ్చ చేస్తోంది. చాలా డిఫరెంట్‌గా ఫొటోలకు పోజులిస్తూ ఆ ఫోటో షూట్స్ అభిమానులతో పంచుకుంటోంది. అయితే ఆమె షేర్ చేస్తున్న ఫోటోషూట్లను నెటిజన్లు, మీమర్స్ దారుణమైన కామెంట్లతో వైరల్ చేస్తున్నారు. కాగా, తాజాగా అల్ట్రా మోడ్రన్ స్టైల్‌లో టార్న్‌ డెనిమ్‌ షర్ట్‌ వేసుకొని ఫోటోలకు ఫోజులిచ్చిన అషూ.. 'చిరిగిన చొక్కా అయినా తొడుక్కో కానీ ఒక మంచి పుస్తకం కొనుక్కో' అని ఒక పెద్దాయన చెప్పాడంటూ క్యాప్షన్‌ ఇచ్చింది. ఇది చూసి నెటిజన్లు ఆమెపై అటాక్ చేస్తున్నారు. 'పాపం వీధి కుక్కలు దాడిచేసాయేమో చొక్కా మొత్తం చినిగింది' అంటూ ఫన్నీ కామెంట్స్‌ చేస్తున్నారు. ఇంకొందరైతే 'చిరిగిన చొక్కా వేసుకున్నావ్‌ సరే.. మరి పుస్తకం కొన్నావా?', 'కొటేషన్ బాగుంది కానీ మరి మంచి పుస్తకం కొనుకున్నవా లేదా' అని ప్రశ్నిస్తూ ట్రోల్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. బుల్లితెరపై హవా నడిపిస్తూనే ప్రస్తుతం 'ఫోకస్' అనే సినిమా చేస్తోంది అషు. అతి త్వరలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/zgKqtcs
v

Tuesday 22 February 2022

విజయ్ దేవరకొండ సరసన కియారా అద్వాని! క్రేజీ అప్‌డేట్

తెలుగు సినిమా సత్తా ఎల్లలు దాటుతోంది. టాలీవుడ్ మూవీస్ బిగ్గెస్ట్ సక్సెస్ అందుకుంటూ సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తున్నాయి. దీంతో ఇతర భాషా నటులు సైతం తెలుగు తెరపై కనిపించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. మరీ ముఖ్యంగా బాలీవుడ్ హీరోయిన్స్ తెలుగు సినిమాల్లో నటించేందుకు రెడీ అంటున్నారు. ఈ క్రమంలోనే బాలీవుడ్ బ్యూటీ మరో తెలుగు సినిమా ఓకే చేసిందని సమాచారం. గతంలో ''వినయ విధేయ రామ, భరత్ అనే నేను'' సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు చేరువైన కియారా అద్వానీ, ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ సరసన నటిస్తోంది. ఈ ప్రాజెక్టు సెట్స్ మీద ఉండగానే మరో సినిమాకు కమిటైందట కియారా. టాలీవుడ్ రౌడీ స్టార్ విజయ్ దేవరకొండతో ఓ సినిమా చేసేందుకు ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని తెలుస్తోంది. ప్రస్తుతం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో పాన్ ఇండియా మూవీ 'లైగర్' షూటింగ్‌లో భాగమవుతున్న .. ఈ సినిమా పూర్తి కాగానే జనగణమన ప్రాజెక్టులో భాగం కాబోతున్నారని విన్నాం. మరోవైపు శివ నిర్వాణ దర్శకత్వంలో ఇంకో సినిమా ఉండబోతోందని, అతి త్వరలో ఈ సినిమాను సెట్స్ మీదకు తీసుకురానున్నారని తెలుస్తోంది. అయితే ఈ మూవీలో విజయ్ దేవరకొండకు జోడీగా కియారా అద్వానీని ఎంపిక చేశారట. ఈ మేరకు ఆమెతో సంప్రదింపుల కార్యక్రమాలు కూడా ఫినిష్ అయ్యాయని అంటున్నారు. శివ చెప్పిన కథ వినగానే ఏ మాత్రం ఆలోచించకుండా ఈ సినిమాలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట కియారా అద్వానీ.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/BVI32Xt
v

సినీ ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ నటి కన్నుమూత

ఈ మధ్యకాలంలో సినీ ఇండస్ట్రీలో చోటు చేసుకుంటున్న వరుస మరణాలు కలవరపెడుతున్నాయి. తాజాగా మరో విషాదం నెలకొంది. ప్రముఖ సీనియర్ మలయాళ నటి కన్నుమూశారు. ప్రస్తుతం ఆమె వయసు 74సంవత్సరాలు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె మంగళవారం రాత్రి (ఫిబ్రవరి 22) కేరళలోని త్రిపుణితురలో తుది శ్వాస విడిచారు. ఇటీవలే ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్న ఆమె ఆరోగ్యం మరింత క్షీణించడంతో మంగళవారం రాత్రి మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. కేపీఏసీ లలిత అసలు పేరు మహేశ్వరి అమ్మ. దాదాపు 50 ఏళ్ల సినిమా కెరీర్‌లో ఆమె 550కి పైగా సినిమాల్లో నటించారు. మలయాళం సినిమా కమర్షియల్ అండ్ ఆర్ట్ స్కూల్ రెండింటిలోనూ బాగా రాణించారు ఈ లెజండరీ నటి. చివరిగా కేరళకు చెందిన సంగీత నాటక అకాడమీకి ఆమె ఛైర్ పర్సన్‌గా ఆమె పనిచేశారు. లలిత నటనకు గాను రెండు జాతీయ అవార్డులు, నాలుగు రాష్ట్ర పురస్కారాలు లభించాయి. మలయాళ చిత్ర నిర్మాత భరతన్‌ను పెళ్లాడింది లలిత. వీరికి సిద్ధార్థ్ భరతన్ అనే కుమారుడు, శ్రీకుట్టి భరతన్ ఆమె కుమార్తె ఉన్నారు. లలిత మరణవార్తతో సినీ పరిశ్రమలో విషాదం అలుముకుంది. పలువురు సినీ ప్రముఖులు ఆమె మరణం పట్ల సోషల్ మీడియా వేదికగా తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. లలిత మృతి పట్ల కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ సంతాపం తెలిపారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/z6u4ngS
v

Bheemla Nayak Pre Release :త్రివిక్ర‌మ్‌పై వైర‌ల్ అయిన ఆడియో లీక్‌.. వివ‌ర‌ణ ఇచ్చిన బండ్ల గ‌ణేష్‌

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కి నటుడు, నిర్మాత అయిన బండ్ల గ‌ణేష్ వీరాభిమాని అనే సంగ‌తి తెలిసిందే. ఆయ‌న రీసెంట్‌గా త‌న ట్విట్ట‌ర్‌లో ఎవ‌రినో టార్గెట్ చేస్తూ పోస్టులు చేయ‌డ టాక్ ఆఫ్ ది ఇండ‌స్ట్రీగా మారింది. దానిపై వివ‌ర‌ణ అడిగితే ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఎప్ప‌టికీ త‌న‌కు ఆరాధ్య దైవ‌మ‌ని జై దేవ‌ర ప‌వ‌న్ క‌ళ్యాణ్ అంటూ ట్వీట్ కూడా చేశారు. అదే త‌రుణంలో ఆయ‌న ఆడియో ఫైల్ ఒక‌టి లీక్ అయ్యింది. అందులో త్రివిక్ర‌మ్ త‌న‌ను భీమ్లా నాయ‌క్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు రాకుండా అడ్డుకుంటున్నారని, త‌న‌కు రావాల‌ని ఉన్నా ఆయ‌న కొంద‌రు వైసీపీ నేత‌ల‌తో క‌లిసి త‌న‌ను టార్గెట్ చేస్తున్నాడంటూ ఉంది. ఈ ఆడియో క్లిప్ సోమ‌వారం నెట్టింట తెగ వైర‌ల్ అయ్యింది. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ను దేవ‌ర అంటూ పిలిచే బండ్ల గ‌ణేష్ వీరాభిమానం గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. అలాగే పవ‌న్ క‌ళ్యాణ్‌, త్రివిక్ర‌మ్ మ‌ధ్య ఉండే స్నేహం గురించి కూడా బండ్ల గ‌ణేష్‌కు తెలియంది కాదు. అలాంటిది త్రివిక్ర‌మ్‌పై బండ్ల గ‌ణేష్ అలా ఎలా మాట్లాడుతాడు అనే చ‌ర్చ కూడా న‌డిచింది. అయితే ఈ ఆడియో క్లిప్‌పై ఓ ప్ర‌ముఖ ఛానెల్‌కు బండ్ల గ‌ణేష్ వివ‌ర‌ణ ఇచ్చారు. ఆ ఆడియో త‌న‌ది కాద‌ని, ఫేక్ ఆడియో అని, ఎవ‌రో క్రియేట్ చేసింద‌ని కొట్టి పారేశారు. అలాగే ఆ విష‌యంపై కూడా తాను స్పందించాల‌నుకోవ‌డం లేద‌ని కూడా తేల్చి పారేశారు. అయితే బండ్ల గ‌ణేష్ నిజంగానే అలా మాట్లాడాడా? త‌న‌ని టార్గెట్ చేయాల్సిన అవ‌స‌రం ఎవ‌రికుంది? అనే దానిపై ప‌లు ఊహాగానాలు మొద‌ల‌య్యాయి. ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ టైటిల్ పాత్ర‌లో న‌టించిన చిత్రం ‘భీమ్లా నాయక్‌’. శివ రాత్రి సంద‌ర్భంగా ఫిబ్ర‌వ‌రి 25న రిలీజ్ అవుతుంది. ఇందులో మ‌రో హీరోగా రానా ద‌గ్గుబాటి కూడా న‌టించారు. సినిమా సెన్సార్ కార్య‌క్ర‌మాల‌ను కూడా పూర్తి చేసుకుంది. ఫిబ్ర‌వరి 21న జ‌ర‌గాల్సిన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ మంత్రి మేక‌పాటి గౌత‌మ్ రెడ్డి మృతి కార‌ణంగా వాయిదా ప‌డింది. ఇది ఫిబ్ర‌వ‌రి 23న జ‌ర‌గ‌బోతుంది. ఇప్ప‌టికే విడుద‌లైన భీమ్లా నాయ‌క్ ట్రైల‌ర్ సోష‌ల్ మీడియాలో సెన్సేష‌న్ క్రియేట్ చేస్తోంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3bJshaX
v

ప్రభాస్‌ అండ్ టీమ్‌కి అమితాబ్ అదిరిపోయే గిఫ్ట్... థాంక్స్ చెప్పిన ‘రాధే శ్యామ్’ యూనిట్

పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్‌పై బాలీవుడ్ సూప‌ర్ స్టార్‌.. షెహ‌న్ షా అమితాబ్ త‌న ప్రేమ‌ను చూపించారు. ఇంత‌కీ బిగ్ బి ప్ర‌భాస్‌పై త‌న ప్రేమ‌ను ఎలా వ్య‌క్తం చేశార‌నే వివ‌రాల్లోకి వెళితే.. ప్ర‌భాస్ లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ ‘రాధే శ్యామ్‌’. ఈ పాన్ ఇండియా సినిమా మార్చి 11న ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వ‌తుంది. సినిమా పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు తుది ద‌శ‌కు చేరుకుంటున్నాయి. ఈ సినిమాకు ఓ వాయిస్ ఓవ‌ర్ ట్రాక్ ఉంది. దాన్ని ఎవ‌రితో చెప్పించాల‌ని టీమ్ ఎంత‌గానో మ‌ల్ల‌గుల్లాలు ప‌డుతూ వ‌చ్చింది. చివ‌ర‌కు ఆ కోరిక‌ను బిగ్ బి తీర్చేశారు. చిత్రానికి అమితాబ్ త‌న వాయిస్ ఓవ‌ర్‌ను అందించారు. ఈ విష‌యాన్ని చిత్ర ద‌ర్శ‌కుడు రాధా కృష్ణ‌, హీరోయిన్ పూజా హెగ్డే త‌మ సోష‌ల్ మీడియా అకౌంట్స్ ద్వారా తెలియ‌జేశారు. ‘‘ఆయ‌న త‌న నెరేష‌న్‌తో ఎపిక్ ల‌వ్ స్టోరిని మ‌రింత ఎపిక్‌గా మార్చినందుకు ధ‌న్య‌వాదాలు’’ అంటూ ‘రాధే శ్యామ్’ టీమ్ బిగ్ బికి థాంక్స్ చెప్పింది. మ‌రి తెలుగు స‌హా త‌మిళ‌, మ‌ల‌యాళ‌, క‌న్న‌డ భాష‌ల్లో ఇదే నెరేష‌న్‌ను ఎవ‌రు ఇచ్చార‌నేది ఇంకా తెలియాల్సి ఉంది. ప్ర‌స్తుతం ప్ర‌భాస్‌, అమితాబ్ క‌లిసి Project K సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇదే సంద‌ర్భంలో ప్ర‌భాస్‌..అమితాబ్‌ను రిక్వెస్ట్ చేసి ఉంటారు. ఆయ‌న ఒప్పుకుని ఉంటారు. ప్రభాస్, పూజా హెగ్డే జంటగా నటించిన పీరియాడిక్ లవ్ స్టోరి ‘రాధే శ్యామ్‌’. భారీ బ‌డ్జెట్‌తో పాన్ ఇండియా చిత్రంగా రిలీజ్‌కు స‌న్న‌ద్ధ‌మ‌వుతోంది. గోపీకృష్ణా మూవీస్ రెబ‌ల్ స్టార్ కృష్ణంరాజు స‌మర్ఫ‌ణ‌లో యువీ క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై వంశీ, ప్ర‌మోద్‌, ప్ర‌శీద ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రాధా కృష్ణ కుమార్ ద‌ర్శ‌కుడు. భారీ అంచ‌నాల‌తో సినిమా మార్చి 11న విడుద‌ల‌వుతుంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/rIYdCS5
v

Monday 21 February 2022

భీమ్లా నాయక్ ట్రైలర్ సునామీ.. RRR రికార్డులను చెరిపేస్తూ ఊచకోత

హీరోగా రూపొందుతున్న 'భీమ్లా నాయక్' సినిమా విడుదలకు ముందే రికార్డుల సునామీ సృష్టిస్తోంది. ఇప్పటికే విడుదల చేసిన టీజర్, గ్లింప్స్ ప్రేక్షకుల నుంచి ఓ రేంజ్ రెస్పాన్స్ అందుకోగా తాజాగా నిన్న (సోమవారం) రాత్రి విడుదల చేసిన ట్రైలర్ ఆన్ లైన్ వేదికలపై హంగామా చేస్తోంది. గత సినిమాల రికార్డులు చెరిపేస్తూ సత్తా చాటుతోంది. ఈ క్రమంలోనే RRR రికార్డును దాటేసి సరికొత్తగా తన పేరు లిఖించుకున్నాడు భీమ్లా నాయక్. ట్రైలర్ టాక్ ఎలా ఉన్నప్పటికీ ఈ వీడియోకు భారీ రేంజ్ రెస్పాన్స్ దక్కుతోంది. సామాజిక మాధ్యమాలను హోరెత్తిస్తూ లక్షల్లో లైకులు తెచ్చుకుంటోంది. అంతకుముందు వచ్చిన బిగ్ బడ్జెట్ సినిమాల రికార్డ్స్ అధిగమిస్తోంది. మొదట టాలీవుడ్‌లో అత్యదిక వేగంగా 100K లైక్స్ అందుకున్న ట్రైలర్‌గా రికార్డును నమోదు చేసిన భీమ్లా నాయక్.. ఆ తర్వాత 200K, 500K, 600K, 700K, 800K, 1M లైక్స్ కూడా చాలా వేగంగా అందుకొని మిగతా సినిమాల రికార్డులను బ్రేక్ చేశాడు. కాగా, రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ సినిమా RRR ట్రైలర్ 4 గంటల 12 నిమిషాల్లో 800K లైక్స్ అందుకొని రికార్డు క్రియేట్ చేయగా.. ఇప్పుడు భీమ్లా నాయక్ దాన్ని అధిగమించాడు. కేవలం 1 గంట 56 నిమిషాల్లోనే ఆ ఫీట్ అందుకొని సరికొత్త రికార్డు నెలకొల్పాడు. విడుదలకు ముందే ఈ ఊచకోత చూసి పవన్ ఫ్యాన్స్ హుషారెత్తిపోతున్నారు. 'అయ్యప్పనుమ్ కోషియుమ్‌' తెలుగు రీమేక్‌గా ఫిబ్రవరి 25వ తేదీన ఈ సినిమా విడుదల కానుంది. ఈ చిత్రానికి సాగర్‌.కె.చంద్ర దర్శకత్వం వహించగా.. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వ పర్యవేక్షణ చేస్తూ స్క్రీన్ ప్లే అందించారు. తమన్ బాణీలు కట్టారు. ఈ మూవీపై మెగా అభిమానుల్లో బోలెడన్ని అంచనాలున్నాయి.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/IoDpRXM
v

అనిల్ రావిపూడిని ర్యాగింగ్ చేసిన నందమూరి స్టార్ హీరో.. ఎప్పటికీ మరచిపోలేనంటున్న డైరెక్టర్

తెలుగు సినీ ఇండ‌స్ట్రీలో క‌మ‌ర్షియ‌ల్ సినిమాల‌ను తెర‌కెక్కిస్తూ ఒక వైపు హీరోల ఫ్యాన్స్‌ను, సాధార‌ణ సినీ ప్రేక్ష‌కుల‌ను మెప్పిస్తున్న నేటి త‌రం ద‌ర్శ‌కుల్లో ఒక‌రు. రీసెంట్‌గా ఓ ఇంట‌ర్వ్యూలో ఈయ‌న మాట్లాడుతూ త‌న‌ను నంద‌మూరి అగ్ర క‌థానాయ‌కుడు ఒక‌రు ర్యాగింగ్ చేశార‌ని చెప్పుకొచ్చారు. ఇంత‌కీ అనిల్ రావిపూడిని ర్యాగింగ్ చేసిన స‌ద‌రు నంద‌మూరి స్టార్ హీరో ఎవ‌రు అనే వివ‌రాల్లోకి వెళితే, అనిల్ రావిపూడి.. సినీ రైట‌ర్‌గా త‌న ప్ర‌స్థానాన్ని ప్రారంభించిన ఆయ‌న నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ ప‌టాస్‌తో ద‌ర్శ‌కుడిగా మారారు. తొలి సినిమాతోనే బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ కొట్ట‌డంతో ఇండ‌స్ట్రీలోని స్టార్ హీరోల‌ దృష్టిలో ప‌డ్డారు అనిల్‌. తొలి సినిమా ప‌టాస్ సినిమా చిత్రీక‌ర‌ణ స‌మ‌యంలో తాను ఎదుర్కొన్న అనుభ‌వాల‌ను ఆయ‌న రీసెంట్ ఇంట‌ర్వ్యూలో తెలియ‌జేశారు. ‘ పూర్తయ్యే సమయానికి రోజూ నా ఆఫీసుకి వ‌చ్చేవారు. ఆయ‌న న‌న్ను మామూలుగా ఆడుకునేవారు కాదు. ర్యాగింగ్ చేసేవారు. ర్యాగింగ్ అంటే ఏడిపించ‌డం కాదు. అల్ల‌రి చేసేవాళ్లు, జోక్ చేసేవాళ్లు. నాకు క‌థ చెప్ప‌వా అనేవారు. సినిమా రిలీజ్ కాలేదు క‌దా ఏం చెప్పాల‌ని అడిగితే.. అంటే నాకు క‌థ చెప్ప‌వా? అనేవారు. ఆయ‌న‌తో గ‌డిపిన క్ష‌ణాల‌ను నేను ఎప్ప‌టికీ మ‌ర‌చిపోలేను’’ అని అన్నారు అనిల్ రావిపూడి. ఇలా నందమూరి స్టార్ హీరోతో తనకున్న అనుబంధాన్ని ఆయన గుర్తు చేసుకున్నారు. తొలి సినిమా పటాస్ హిట్ అయిన తర్వాత సుప్రీమ్,ఎఫ్ 2, సరిలేరు నీకెవ్వరు చిత్రాలతో వరుస విజయాలను డైరెక్టర్గా సొంతం చేసుకున్నారు. ఇప్పుడు ఎఫ్ 3 సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు. ఈ సినిమాను మే 27న విడుదల చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు. దీని తర్వాత నందమూరి బాలకృష్ణతో సినిమా చేయబోతున్నారంటూ టాక్ వినిపిస్తోంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/nZw9Rdi
v

ఆశ్చర్యపరుస్తున్న 'సలార్' బడ్జెట్ లెక్కలు.. తగ్గేదే లేదంటున్న మేకర్స్!!

భారీ బడ్జెట్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ అవుతున్నారు యంగ్ రెబల్ స్టార్ . బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిన ఆయనతో బిగ్గెస్ట్ సినిమాలు రూపొందించేందుకు ఇంట్రెస్ట్ చూపుతున్నారు దర్శకనిర్మాతలు. ఈ క్రమంలోనే వరుసపెట్టి పాన్ ఇండియా మూవీస్ లైన్‌లో పెట్టారు ప్రభాస్. అందులో ఒకటే 'సలార్'. తాజాగా ఈ సినిమా గురించిన ఓ విషయం నెట్టింట వైరల్ అవుతోంది. కేజీఎఫ్ ఫేమ్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ కేటాయించి ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ సలార్ సినిమాను రూపొందిస్తోంది హోంబలే ఫిల్మ్స్‌ సంస్థ. హై వోల్టేజ్ యాక్షన్ సన్నివేశాల కోసం పెద్ద మొత్తంలో ఖర్చు పెడుతున్నారు. గతంలో ఏ సినిమాలోనూ చూడని విధంగా సలార్ సన్నివేశాలుండాలని భావిస్తున్న మేకర్స్.. బడ్జెట్ విషయంలో ఎక్కడా వెనక్కి తగ్గడం లేదు. దీంతో మొదట అనుకున్నదాని కంటే బడ్జెట్ విపరీతంగా పెరిగిపోతోందట. అయినప్పటికీ సినిమాపై ఉన్న నమ్మకంతో ముందడుగేస్తున్నారట నిర్మాతలు. మొత్తంగా చూస్తే 250 కోట్లకు పైగానే ఈ సినిమా కోసం ఖర్చు పెడుతున్నారని తెలుస్తోంది. మరోవైపు ఈ సినిమాను రెండు భాగాలుగా తెరకెక్కించబోతున్నారని తెలుస్తుండటం ఆసక్తికరంగా మారింది. భారీ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్ సరసన శృతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తోంది. జగపతి బాబు కీలక పాత్ర పోషిస్తున్నారు. అలాగే ఈ చిత్రంలో భారీ కాస్టింగ్ ఉండేలా నటీనటుల విషయంలో ప్రత్యేకంగా కేర్ తీసుకున్న డైరెక్టర్ ప్రశాంత్ నీల్.. కేజీఎఫ్ హీరోయిన్ శ్రీనిధి శెట్టితో ఓ స్పెషల్ సాంగ్ ప్లాన్ చేశారని సమాచారం. ఏప్రిల్ 14న ఈ చిత్రాన్ని విడుద‌ల చేయ‌బోతున్న‌ట్లు చిత్ర యూనిట్ ఇప్పటికే ప్రకటించేసింది. ఈ మూవీపై ప్రభాస్ ఫ్యాన్స్ బోలెడన్ని అంచనాలు పెట్టుకున్నారు. ఇకపోతే ప్రభాస్ లేటెస్ట్ మూవీ 'రాధే శ్యామ్' షూటింగ్ ఫినిష్ చేసుకొని విడుదలకు సిద్ధంగా ఉంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/huBKs8m
v

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...