Wednesday 23 February 2022

ముంబైలో ఆలీ భార్య.. ఛార్మీ ఎమోషనల్ పోస్ట్

పూరి జగన్నాథ్, ఛార్మీలు గత రెండేళ్లుగా ముంబైలోనే ఉంటున్నారన్న సంగతి తెలిసిందే. లైగర్ పనుల కోసం ఈ ఇద్దరూ అక్కడే ఉండిపోయారు. మధ్యలో కరోనా, లాక్డౌన్ వంటివి రావడంతో పూర్తిగా అటే ఫిక్స్ అయిపోయారు. ఈడీ పిలిచిందని మధ్యలో పూరీ, ఛార్మీలు హైద్రాబాద్‌కు వచ్చారు. అయితే ఇప్పుడు ముంబైకి తన బార్య జుబేదాతో కలిసి ఆలీ వెళ్లినట్టు కనిపిస్తోంది. మామూలుగానే ఆలీకి, పూరికి మధ్య ఎంతో సన్నిహిత సంబంధాలున్నాయి. పూరి సినిమాల్లో ఆలీకి ప్రత్యేక పాత్రలుంటాయి. ఇక పూరి ఆర్థిక కష్టాల్లో ఉన్న సమయంలో ఆలీ ఆదుకున్న సంగతి తెలిసిందే. ఆలీ గురించి పూరి పలు వేదికల్లో ఎంతో గొప్పగా చెప్పుకొచ్చాడు. అయితే ఇప్పుడు ఆలీ ముంబైకి ఎందుకు వెళ్లాడో తెలీదు గానీ.. చెప్పిన విషయం మాత్రం వైరల్ అవుతోంది. ఆలీ భార్య ఎక్కువగా యూట్యూబ్‌లో సందడి చేస్తుంటుంది. వంటల వీడియోలు, హోం టూర్ వీడియోలంటూ బాగానే ఫేమస్ అయింది. ఇక ఆలీ తన తోటీ ఆర్టిస్ట్‌లకు ఇంట్లోని భోజనం అంటూ బిర్యానీని వడ్డిస్తుంటాడు. అలా జుబేదా చేసే బిర్యానీకి నెట్టింట్లో చాలానే మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఇక ఇప్పుడు పూరి, ఛార్మీలకు జుబేదా స్పెషల్‌గా వంట చేసి వడ్డించినట్టుంది. ఇదే విషయాన్ని ఛార్మీ చెప్పుకొచ్చింది. మా దగ్గరకు వచ్చారు.. ఎంతో ప్రేమతో వంట చేసి వడ్డించావ్.. థ్యాంక్స్ అంటూ జుబేదా గురించి ఛార్మీ చెప్పుకొచ్చింది. థ్యాంక్యూ సో మచ్ డార్లింగ్ అంటూ ఛార్మీకి జుబేద రిప్లై ఇచ్చింది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/DH50w2Q
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...