Tuesday 30 June 2020

ఏంది సారూ!! మా కరెంట్ బిల్.. సందీప్ కిషన్ సెటైర్లు

లాక్ డౌన్‌లో కరెంట్ బిల్లుల షాక్.. హీరో సందీప్ కిషన్‌కి తగిలింది. సామాన్య జనంతో పాటు సెలబ్రిటీలు సైతం ఇంట్లోనే ఉండటంతో కరెంట్ వాడకం బాగా ఎక్కువైంది. ఈ లాక్ డౌన్‌లో విద్యుత్ వినియోగం బాగా ఎక్కువ కావడంతో.. విద్యుత్ బిల్లులు కూడా పేలిపోతున్నాయి. ఇప్పటికే విద్యుత్ బిల్లులు చెల్లించలేక సామాన్యులు గగ్గోలు పెడుతుంటే.. సెలబ్రిటీల పరిస్థితి కూడా ఇలాగే ఉంది. ఇప్పటికే తాప్సీ, కార్తీక లాంటి సెలబ్రిటీలకు కరెంట్ బిల్లులు షాక్ తగలగా.. ఈ విషయాన్ని షేర్ చేస్తూ పవర్ బిల్లులపై పవర్ ఫుల్ పోస్ట్‌లను సోషల్ మీడియాలో షేర్ చేశారు. తాజాగా సైతం స్పందిస్తూ.. ‘పవర్ బిల్లులు ఇలాగే వస్తే.. నెక్ట్స్ ఎవరి ఇంటికి ఎక్కువ బిల్లు వచ్చింది అని ఆన్‌లైన్‌ వార్‌ స్టార్ట్ అయినా ఆశ్చర్యం లేదు’ అంటూ ట్వీట్ చేశారు. ‘మా ఇంట్లోని ఎలక్ట్రిసిటీ బోర్డు మీటర్‌ని చూస్తే చిన్నప్పుడు గిర్రుమంటూ తిరిగే ఆటో రిక్షా మీటర్‌ గుర్తొచ్చింది. ఏంది సర్‌ ఆ బిల్లులు. కొత్తగా రిలీజైన సినిమాల వీకెండ్‌ కలెక్షన్లలా కరెంట్‌ బిల్లులు ఉన్నాయి’ అంటూ సెటైర్లు వేశాడు సందీప్ కిషన్. అయితే సందీప్ కిషన్‌కి ఎంత కరెంట్ బిల్ వచ్చిందన్న విషయాన్ని తెలియజేయకపోవడంతో.. ఇంతకీ మీకు కరెంట్ బిల్ ఎంత వచ్చింది? అంటూ నెటిజన్లు స్పందిస్తున్నారు. మరికొంత మంది స్పందిస్తూ.. మాకు ఇంతకు ముందు రూ.300 వచ్చేది.. కాని లాక్ డౌన్ వల్ల 3230 వచ్చింది, అయినా ఇంట్లోనే ఉండి ఏసీలు అన్నీ వేసుకుని ఉంటే బిల్ రాకుండా బాక్సాఫీస్ కలెక్షన్లు వస్తాయా? అయినా వీకెండ్ కలెక్షన్లు ఎప్పుడూ మీకే రావాలా?? ఈ సారి ఫర్ ఆ చేంజ్ గవర్నమెంట్ కి వస్తున్నాయ్ సందీప్ అన్న’.. అంటూ సందీప్ కిషన్ పోస్ట్‌పై సెటైర్లు వేస్తున్నారు నెటిజన్లు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2NLL4oo
v

సుశాంత్ ఆత్మహత్యపై షోయబ్ అక్తర్ కీలక వ్యాఖ్యలు

బాలీవుడ్ యంగ్ హీరో ఆత్మహత్య సినీ ఇండస్ట్రీలో తీవ్ర కలకలం రేపింది. సుశాంత్ ఆత్మహత్యతో బాలీవుడ్‌లో నెపోటిజంపై విమర్శల దుమారం రేగింది. గతనెల 14వ తేదీన సుశాంత్ బాంద్రాలో తాను నివాసం ఉంటున్న ఇంట్లోనే ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సుశాంత్ మరణాన్ని ఎవరు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. మంచి భవిష్యత్ ఉన్న సుశాంత్ ఇలా అర్ధాంతరంగా కన్నుమూయడం బాధాకరంగా ఉందని చాలామంది ప్రముఖులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తాజాగా పాకిస్తాన్ పేసర్ తన యూట్యూబ్ ఛానెల్ ద్వారా సుశాంత్ మృతిపై స్పందించాడు. సుశాంత్ మరణ వార్త తనను షాక్‌కు గురి చేసిందన్నాడు. మృతి చెందిన వార్త విన్నాక నన్ను ఓ విషయం చాలా బాధపడేలా చేసిందన్నాడు షోయబ్. అప్పట్లో సుశాంత్‌ని ఒకసారి ముంబైలో కలిసానని షోయబ్ గుర్తు చేశాడు. చాలా పొడుగాటి జుట్టుతో ఉన్నాడన్నాడు. ఆ సమయంలో సుశాంత్ ఎంఎస్ ధోని సినిమాలో నటిస్తున్నాడని కొందరు తనకు చెప్పారన్నారు. అప్పుడు నేను సుశాంత్‌తో మాట్లాడకుండా వెళ్లిపోయానని షోయబ్ అన్నారు. మాట్లాడిఉంటే అనేక సమస్యలపై అతనితో చర్చించే వాడినన్నాడు.తన జీవితానికి సంబంధించిన విషయాన్ని కూడా అతనితో పంచుకునేవాడినన్నారు. సమస్యలని ఎలా ఎదుర్కోవాలనే ధైర్యం అతనికి వచ్చేదన్నారు. ఆ రోజు మాట్లాడనుందుకు ఈ రోజు చాలా బాధపడుతున్నాను అని షోయబ్ పేర్కొన్నారు. సమస్యలు ప్రతి ఒక్కరికి ఉంటాయి.. కానీ డిప్రెషన్‌లో ఉన్నప్పుడు సన్నిహితంగా ఉన్నవారితో పంచుకుంటే కాస్త ఉపశమనం కలుగుతుందన్నారు షోయబ్ అక్తర్. హీరోయిన్‌ దీపిక పదుకొనే కూడా డిప్రెషన్‌, యాంగ్జైటీతో బాధపడేదని, కానీ ఆ విషయాన్ని అందరికి చెప్పి బయట పడిందన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. సుశాంత్‌ కూడా అలానే చేసి ఉండి ఉండే ఈ రోజు ఇలా జరిగి ఉండేది కాదోమో అని అక్తర్ తన బాధని వ్యక్తం చేశారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/38hTnSu
v

రాఘు రామ కృష్ణం రాజుపై వర్మ పోస్ట్.. అతని కులాన్ని ప్రస్తావిస్తూ కామెంట్స్

ఏంటండీ.. రాజుగారూ!! మీకు కాస్త వర్మ గాలి సోకినట్టు ఉంది.. ఆయనలాగే లాజిక్‌గా మాట్లాడుతూ నాకు నచ్చిందే చేస్తా.. నాకు ఇష్టం వచ్చింది మాట్లాడతా అని షోకాజ్‌లకే తిరిగి షోకాజ్‌లు ఇస్తున్నారు. కొంపతీసి మీపై వర్మ ప్రభావం ఏం లేదు కదా?? అని నరసాపురం వైసీపీ ఎంపీ రాఘు రామ కృష్ణం రాజును అడిగితే ఆయన నుంచి ఆసక్తికరమైన సమాధానం వచ్చింది. భలేవారే.. నాపై వర్మ ప్రభావం లేకపోవడం ఏంటండీ!! ఆయనంటే నాకు చాలా అభిమానం. ఆయన యాటట్యూట్‌ అంటే పిచ్చి. అంతేకాదు.. మా ఇద్దరిలో ఓ కామన్ పాయింట్ కూడా ఉంది. నేను ఆయన చాలా స్లోగా మాట్లాడుతుంటాం. ఇద్దరి వాయిస్‌లు ఇంచు మించు ఒకేలా ఉంటాయి. వాయిస్‌‌ల పరంగా మేం ఇద్దరం వీక్ అయినా ఏ విషయాన్నైనా కుండబద్దలు కొట్టేస్తాం’ అంటూ ఈ ఎంపీ గారు తనలోని వర్మని బయటపెట్టారు. అయితే ఎంపీ వ్యాఖ్యలపై వర్మ స్పందిస్తూ.. ‘మైండ్ బ్లోయింగ్.. రాజుగారూ!! రాజకీయాల్లో ఇలాంటి పర్సనాలిటీని ఇప్పుడే చూస్తున్నా.. వెరీ ఇంట్రస్టింగ్ అంటూ కామెంట్ చేశారు. ఇక ట్విట్టర్‌లో రాఘు రామ కృష్ణం రాజుని సింహంతో పోల్చుతూ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ‘నాకు రాజు అనే క్యాస్ట్ ఫీలింగ్ లేదు.., కాని నాకు ఖచ్చితంగా రఘు రామ కృష్ణరాజు ఫీలింగ్ ఉంది. ఎందుకంటే అతను నిజమైన సింహం.. అతను నిజమైన హీరో.. సింహం ఒక్కటే సింగిల్’ అంటూ ట్వీట్ చేశారు వర్మ. అయితే వర్మ పోస్ట్‌పై మండిపడుతున్నాయి వైసీపీ వర్గాలు.. ‘పోవయ్యా!! బూతు డైరెక్టరూ.. మొదట్లో ఇష్టం వచ్చినట్లు మాట్లాడి, తరువాత షోకాజ్ నోటీసులు పంపాక తిరిగి తోక ముడుచుకొని జగన్ అన్నకి క్షమాపణలు చెప్పాడు.. అతను ఎలా హీరో అవుతాడు.. క్యాస్ట్ ఫీలింగ్ లేదు అని ఇంత కులపిచ్చితో మాట్లాడుతున్నావు’, ‘ఇంకెందుకు ఆలస్యం సినిమా మొదలుపెట్టు మరి.. కాని ఒక్కమాట ‘సింహం సింగల్‌గా వస్తూంది కానీ సింగల్‌గా వచ్చిన ప్రతీది సింహం కాలేదు. గజ్జి కుక్క కూడా సింగిలే. ఎవరూ దగ్గరికి రానివ్వరు కాబట్టి అంత మాత్రాన అది సింహం అన్నట్టు కాదు’ అంటూ వర్మ పోస్ట్‌పై పంచ్‌లు వేస్తున్నారు నెటిజన్లు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2YLqkU4
v

కరోనాను జయించిన బండ్ల గణేష్.. రిపోర్ట్ షేర్ చేస్తూ ఎమోషనల్ పోస్ట్

కరోనా మహమ్మారి ప్రభావంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ప్రముఖ కమెడియన్, నిర్మాత, పౌల్ట్రీ యజమాని పూర్తిగా కోలుకున్నారు. తెలంగాణలో కరోనా మహమ్మారి రోజురోజుకూ విజృంభిస్తోన్న విషయం తెలిసిందే. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో రోజు రోజుకు కేసులు పెరుగిపోతున్నాయి. దీంతో మళ్లీ లాక్ డౌన్ చేస్తారనే ఊహాగానాలు వస్తున్నాయి. ఇదిలా ఉంటే నగరంలో కరోనా కేసులు విజృంభిస్తున్న వేళ హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేయించుకోవడానికి వెళ్లిన నిర్మాత బండ్ల గణేష్‌కి కరోనా సోకడం ఇండస్ట్రీలో కలకలం రేగింది. ఒకవైపు షూటింగ్‌లు తిరిగి ప్రారంభమైన తరుణంలో బండ్ల గణేష్‌కి కరోనా సోకడంతో ఈ వైరస్ ఎప్పుడు ఏ సెలబ్రిటీకి వ్యాపిస్తుందా అనే ఆందోళనలో ఉన్నారు. అయితే సుమారు 14 రోజుల చికిత్స అనంతరం నిర్మాత బండ్ల గణేష్ కరోనాను జయించి పూర్తిగా కోలుకున్నారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తెలియజేస్తూ తనను ప్రాణాలను కాపాడిన దేవుడికి ధన్యవాదాలు తెలియజేశారు బండ్ల గణేష్. ఈ సందర్భంగా అపోలో డయోగ్నోస్టిక్స్‌లో నిర్వహించిన కరోనా పరీక్షలకు సంబంధించిన రిపోర్ట్‌ని షేర్ చేశారు బండ్ల గణేష్. కాగా ‘మీరు చేసిన మంచి పనులు వల్ల దేవుడు నీయందున ఉండి మీకు మంచి చేశారు.. కరోనాను జయించారు. జాగ్రత్తగా ఉండి మంచి ఆహారం తీసుకోండి’ అంటూ ఆయన అభిమానులు సోషల్ మీడియాలో స్పందిస్తున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2YOlkyk
v

శ్రీదేవి తైస్ చూసే ఆమెకు బిగ్ ఫ్యాన్ అయ్యా: రామ్ గోపాల్ వర్మ

పేరు చెబితే చాలు మనకు సంచలనం, వివాదాస్పదం, వెటకారం వంటి పదాలు గుర్తుకొస్తుంటాయి. ఎందుకంటే, గడిచిన కొన్ని సంవత్సరాలుగా ఆయన తీరు ఇలానే ఉంది మరి. ఎవ్వరి మాటా వినడు సీతయ్య అన్నట్టుగా వర్మ కూడా ఎవ్వరినీ పట్టించుకోరు. తనకు నచ్చిన పని తాను చేసుకుంటూ వెళ్లిపోతుంటారు. వివాదాలను కూడా లెక్కచేయరు. అందుకే గట్స్ ఉన్న ఫిల్మ్ మేకర్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ లాక్‌డౌన్ సమయంలో దర్శక, నిర్మాతలంతా ఏం చేయాలని ఆలోచిస్తుంటే.. వర్మ మాత్రం వరుసపెట్టి సినిమాలు చేసేస్తున్నారు. ఓటీటీకి ఆదరణ పెరుగుతున్న ప్రస్తుత సమయంలో దానిని తలదన్నే ఏటీటీని తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేశారు. చిన్న చిన్న సినిమాలు చేస్తూ వాటిని ఏటీటీలో విడుదల చేస్తూ డబ్బులు చేసుకుంటున్నారు. మియా మాల్కోవా ‘క్లైమాక్స్’తో తన లాక్‌డౌన్ బిజినెస్‌ను మొదలుపెట్టిన వర్మ.. ‘నగ్నం’ (NAKED)తో సంచలనం సృష్టించారు. దేశీ బ్యూటీతో అందాలు ఆరబోయించి ఆ తరహా సినిమాలు చూసే వారిని తనవైపు తిప్పుకున్నారు. ఏడాదికి రూ.350 పెట్టి ఓటీటీ ప్లాట్‌ఫాంను సబ్‌స్క్రైబ్ చేసుకునే ఈ రోజుల్లో ఒక్క సినిమాకు రూ.200 చార్జ్ చేశారు. అయినప్పటికీ జనం ఎగబడ్డారు. 20 గంటల్లోనే రూ.70 లక్షలకు పైగా వసూలైంది. Also Read: అయితే, ‘నగ్నం’ సినిమా గురించి మాట్లాడేందుకు రామ్ గోపాల్ వర్మను ‘సమయం’ సంప్రదించింది. ఆయనతో ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ చేసింది. ‘నగ్నం’ ఒక క్రైమ్ థ్రిల్లర్ అని ఆర్జీవీ చెప్పారు. ఎరోటిక్ (శృంగారం) జోనర్‌కు క్రైమ్ థ్రిల్లర్‌ను జతచేసి ‘నగ్నం’ తీశామన్నారు. ‘నగ్నం’ అనేది చాలా బలమైన పదమని.. నగ్నం అంటే భౌతికంగా మాత్రమే కాదని, అంతర్గతంగా ఉండే భావమని అన్నారు. అయితే, ఈ సినిమా అంతర్గత నగ్నతకు సంబంధించినది అయినప్పుడు బాహ్య నగ్నత చూపించడం అవసరమా అని ఆర్జీవీని ‘సమయం’ అడిగింది. దీనికి వర్మ అవుననే సమాధానం ఇచ్చారు. ఈ సినిమాను శృంగారభరితంగా తీశాం కాబట్టి బాహ్య నగ్నత చూపించాల్సి ఉంటుందన్నారు. కాగా, రేపిడ్ ఫైర్‌లో భాగంగా ఆర్జీవీ చెప్పిన కొన్ని సమాధానాలు ఆసక్తికంగా ఉన్నాయి. ముఖ్యంగా ఆర్జీవీ అభిమాన నటి శ్రీదేవి ప్రస్తావన ఆసక్తికరం. ‘మీరు అకస్మాత్తుగా శ్రీదేవిలా మారిపోతే మీరు ఎలా ఫీలవుతారు’ అన్న ప్రశ్నకు ఆర్జీవీ తన స్టైల్లో సమాధానం చెప్పారు. ‘‘నాకు అస్సలు ఇష్టం ఉండదు. ఎందుకంటే, శ్రీదేవి గారి తైస్ చూడగలను కానీ.. నా తైస్ నేను చూసుకోలేను. ప్రధానంగా శ్రీదేవి తైస్ చూసే నేను ఆమెకు బిగ్ ఫ్యాన్ అయ్యాను’’ అని సమాధానం ఇచ్చారు. ఇక ఆర్జీవీ, బాలయ్య ఇద్దరిలో మంచి సింగర్ ఎవరంటే బాలయ్య అని సమాధానం ఇచ్చారు వర్మ. రామ్ గోపాల్ వర్మ ఇంటర్వ్యూ వీడియో


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/31vRRe7
v

Ram Gopal Varma: నాపై ఆర్జీవీ ప్రభావం.. షోకాజ్‌కే షోకాజ్ ఎవరి ఐడియా అంటే..: రఘు రామ కృష్ణం రాజు

వైసీపీ పార్టీ సొంత పార్టీ ఎంపీ రఘురామకృష్ణం రాజుకి క్రమశిక్షణ చర్యల్లో భాగంగా షోకాజ్ నోటీసులు పంపిస్తే లాజిక్‌లు లాగుతూ.. పార్టీకే షోకాజ్ ఇచ్చారు నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు. ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా ఉన్న రఘురామకృష్ణంరాజు మాటలు, ఆయన వ్యవహారశైలి కాస్త వర్మను పోలి ఉండటంతో ‘మైండ్ బ్లోయింగ్’ అంటూ స్పందించారు ఆర్జీవీ. ఈ ఇష్యూపై రఘురామకృష్ణంరాజు మాట్లాడుతూ.. ఖచ్చితంగా నాపై ప్రభావం ఉంటుంది. వర్మ ఆటిట్యూట్ నాకు చాలా ఇష్టం. మా ఇద్దరికీ ఓ కామన్ పాయింట్ ఉంది. నేను ఆయన చాలా స్లోగా మాట్లాడుతుంటాం. ఇద్దరి వాయిస్‌లు ఇంచు మించు ఒకేలా ఉంటాయి. వాయిస్‌‌ల పరంగా మేం ఇద్దరం వీక్. అయితే ప్రజెంట్ ఇష్యూలో షోకాజ్‌కి తిరిగి షోకాజ్ ఇవ్వడం అనేది నాకు వచ్చిన ఐడియానే. నేను మా పార్టీ పెద్దల్ని గిల్లడం లేదు.. నా చెంప మీద కొడితే.. నేను గిల్లి ఉంటాను బహుశా.. నేనేం గాంధీని కాదు. రెండో చెంప చూపించడానికి’ అంటూ గోదావరి వెటకారంతో వర్మ ప్రస్తావన తీసుకువచ్చారు వైసీపీ నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2BPhcFc
v

బట్టతల, తెలంగాణ యాస.. చాలా కష్టపడ్డాను: నవీన్ చంద్ర

‘అందాల రాక్షసి’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన నటుడు . ఆ సినిమా తరవాత న‌టుడిగా త‌న‌ను తాను కొత్తగా ఆవిష్కరించుకుంటూ వ‌స్తున్నారు. హీరోగా మాత్రమే కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్టుగా రాణిస్తున్నారు. ఇప్పుడు ఆయన హీరోగా, స‌లోని లూథ్రా హీరోయిన్‌గా న‌టించిన చిత్రం ‘భానుమ‌తి రామ‌కృష్ణ’. తెలుగు ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ ‘ఆహా’లో ఈ సినిమా ప్రసారం కానుంది. జూలై 3న ‘భానుమతి రామకృష్ణ’ ప్రీమియ‌ర్ ప్రసారం కానుంది. ఈ సంద‌ర్భంగా న‌వీన్ చంద్ర మీడియాతో ముచ్చటించారు. మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు. రామ‌కృష్ణ ఎలా ఉండ‌బోతున్నాడు? మ‌ధ్య త‌ర‌గ‌తి యువ‌కుడు. ఉన్నదాంట్లో హ్యాపీగా ఉండాల‌నుకునేవాడు. రేపు రామ‌కృష్ణను తెర‌పై చూస్తే చాలా మంది వారిని చూసుకున్నట్లు ఫీల్ అవుతారు. కామన్ ఆడియన్‌కి అంతగా క‌నెక్ట్ అయ్యే పాత్రే రామ‌కృష్ణ. డైరెక్టర్ శ్రీకాంత్ క‌థ చెప్పిన‌ప్పుడు మీకేమ‌నిపిచింది? ఫ్రెండ్ ద్వారా డైరెక్టర్ శ్రీకాంత్ నాకు ప‌రిచ‌యం అయ్యాడు. త‌ను ముందు రామ‌కృష్ణ పాత్రను కాస్త బొద్దుగా, బ‌ట్టత‌లతో, తెలంగాణ యాస‌తో మాట్లాడేలా ఊహించుకుని రాసుకున్నాడు. త‌ను రాసుకున్న స్క్రిప్ట్ న‌చ్చడంతో త‌న‌ని డైరెక్ట్ చేయ‌మ‌ని నేనే చెప్పాను. త‌ర్వాత ఓ రోజు రామ‌కృష్ణ పాత్రను నేను చేస్తాన‌ని త‌న‌తో అన్నాను. నేను అనుకున్న బ‌డ్జెట్‌కు మీకు పెద్ద హీరో అవుతారన్నాడు. క‌థ న‌చ్చింది. మీరు ఎలాంటి కొత్త ఎఫ‌ర్ట్స్ పెట్టన‌క్కర్లేదు అని అన్నాను. స‌రే! ఏముందిలే సుల‌భంగా చేసేయేగల‌మ‌ని అనుకుంటే.. మ‌ధ్య త‌ర‌గ‌తి రామ‌కృష్ణను తెర‌పై ఆవిష్కరించడానికి చాలా క‌ష్టప‌డాల్సి వ‌చ్చింది. Also Read: ఇప్పటి వ‌ర‌కు మీరు చేసిన పాత్రలకు ఈ పాత్రకు ఉన్న తేడా ఏంటి? చాలా తేడా ఉంటుందండి. ఇంత‌కు ముందు చెప్పిన‌ట్లు అంద‌రికీ క‌నెక్ట్ అయ్యే పాత్ర రామ‌కృష్ణది. భానుమ‌తితో త‌న ప్రేమ ఎలా మొద‌లైంది? అస‌లు ఇద్దరి మ‌న‌స్తత్వాల్లో ఎంత తేడా ఉంటుంది? రెండు వేర్వేరు ఆలోచ‌న‌లున్న భానుమ‌తి, రామ‌కృష్ణ ఏ పాయింట్ ద‌గ్గర క‌నెక్ట్ అవుతారు? అనే విష‌యాలు ఓ ఎమోష‌న‌ల్ యాంగిల్‌లో ఉంటాయి. అలాగే, రామ‌కృష్ణ పాత్రకు 30 ఏళ్లు పైబ‌డినా పెళ్లి కాదు. భానుమ‌తి పాత్ర కూడా అలాగే ఉంటుంది. నేను చేసిన వాటిలో డిఫ‌రెంట్ ల‌వ్‌స్టోరీ విత్ డిఫ‌రెంట్ ఎమోష‌న్స్ అని చెప్పగ‌ల‌ను. న‌టుడిగా సాఫ్ట్ యాంగిల్‌ను ఆవిష్కరించిన చిత్రమిది. న‌టుడిగా బెస్ట్ రోల్ చేశాన‌నే ఫీలింగ్ ఇచ్చిన మూవీ ఇది. సినిమా థియేట‌ర్స్‌లో విడుద‌ల కాకుండా ఓటీటీలో విడుద‌ల కావ‌డం ఎలా అనిపిస్తుంది? సినిమాను ప్రేక్షకుడికి రీచ్ చేయించాల‌నేదే మా ఆలోచ‌న‌. అయితే ముందుగా సినిమాను ఓటీటీలో రిలీజ్ చేయాల‌నే ఆలోచ‌న‌తో చేయ‌లేదు. థియేట‌ర్స్‌లోనే విడుద‌ల చేయాల‌ని అనుకున్నాం. థియేట‌ర్‌లో జ‌నాల మ‌ధ్య కూర్చుని సినిమా చూస్తే ఆ ఫీలింగే వేరు. ఓ పండగ‌లా అనిపిస్తుంది. కానీ ఇప్పుడు దేశంలోనే కాదు.. ప్రపంచంలో నెల‌కున్న ప‌రిస్థితులు బాగోలేవు. క‌రోనా ప్రభావంతో ప్రజ‌లు బ‌య‌ట‌కు రావ‌డానికే భ‌య‌ప‌డుతున్నారు. షూటింగ్స్ ఆగిపోయాయి. థియేట‌ర్స్ మూత‌ప‌డ్డాయి. ఇలాంటి ప‌రిస్థితుల్లో సినిమాను ప్రేక్షకుల‌ను రీచ్ చేయించాలంటే ఓటీటీలే మార్గం. Also Read: లాక్‌డౌన్‌లో ఏం చేస్తున్నారు? క‌రోనా వ‌ల్ల బాగా ఎఫెక్ట్ అయిన రంగాల్లో సినీ ఇండ‌స్ట్రీ ఒక‌టి. ఇంకా ప‌రిస్థితులు చ‌క్కబ‌డ‌లేదు. ప్రభుత్వాలు ప‌రిస్థితుల‌ను చ‌క్కబెట్టడానికి కృషి చేస్తున్నాయి. ప‌రిస్థితులు నార్మల్ అయ్యేంత వ‌ర‌కు ప్రజ‌లు కూడా త‌మ వంతు స‌హ‌కారాన్ని అందించాలి. లాక్‌డౌన్ కార‌ణంగా ఇంటికే ప‌రిమిత‌మ‌య్యాను. కొత్త విష‌యాల‌ను నేర్చుకుంటున్నాను. వార్తల‌ను ఫాలో అవుతున్నాను. ఇల్లు శుభ్రం చేసుకుంటున్నాను. టీవీ చూస్తున్నాను. వ‌ర్కవుట్స్ చేస్తున్నాను. ఒకవైపు హీరో, మ‌రో వైపు విల‌న్‌.. ఇలా డిఫ‌రెంట్ జర్నీ ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీ. ‘అందాల రాక్షసి’తో మొద‌లైన నా ప్రయాణంలో ప్రతి సినిమాతో న‌టుడిగా న‌న్ను నేను మ‌లుచుకుంటూనే వ‌చ్చాను. మంచి నటుడిగా అంద‌రికీ గుర్తుండాల‌నే ఆలోచిస్తాను. అందుక‌నే హీరోగా చేస్తున్నానా? విల‌న్‌గా చేస్తున్నానా? అని చూడను. క‌థ ఎలా ఉంది. నా పాత్ర ఎలా ఉంది అని ఆలోచిస్తాను. న‌చ్చితే వెంట‌నే ఓకే చెప్పేస్తున్నాను. త‌దుప‌రి చిత్రాలు ఏంటి? కీర్తి సురేష్ ‘మిస్ ఇండియా’లో కీల‌క పాత్ర చేశాను. ఆ సినిమా విడుద‌ల‌కు సిద్ధమ‌వుతుంది. ఇక రానా ‘విరాట‌ప‌ర్వం’లోనూ ఓ ముఖ్యమైన పాత్రలో న‌టిస్తున్నాను. ఈ సినిమా షూటింగ్ జ‌రుగుతుంది. అలాగే వ‌రుణ్ తేజ్‌ బాక్సర్‌గా చేస్తున్న లేటెస్ట్ మూవీలో నేను కూడా బాక్సర్ పాత్ర చేస్తున్నాను. త‌మిళంలో ధ‌నుష్ ‘ప‌టాస్‌’లో మెయిన్ విల‌న్‌గా న‌టించాను. త‌ర్వాత మంచి అవ‌కాశాలే వ‌స్తున్నాయి. కాక‌పోతే ఇప్పుడు క‌థలు విన‌ప‌డానికి కుద‌ర‌డం లేదు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2NFVeXB
v

చిరు కోసం.. మొన్న విజయశాంతి, నిన్న సుహాసిని, నేడు ఖుష్బూ!!

మలయాళ సూపర్ హిట్ మూవీ ‘లూసిఫర్’ను మెగాస్టార్ హీరోగా తెలుగులో రీమేక్ చేయనున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ‘ఆచార్య’తో బిజీగా ఉన్న చిరంజీవి.. ఈ సినిమా పూర్తయిన వెంటనే ‘లూసిఫర్’ రీమేక్‌ను మొదలుపెడతారు. ఈ సినిమాను కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్‌పై రామ్ చరణ్ నిర్మించనున్నారు. ‘సాహో’ ఫేమ్ సుజీత్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. ప్రస్తుతం సుజీత్ ఈ సినిమా స్క్రిప్ట్‌పై పనిచేస్తున్నారు. అలాగే, నటీనటుల ఎంపిక కూడా చేస్తున్నట్టు సమాచారం. ‘లూసిఫర్’లో మోహన్‌లాల్ పోషించిన పాత్రను తెలుగులో చిరంజీవి చేయనున్నారు. అలాగే, పృథ్వీరాజ్ సుకుమారన్ చేసిన పాత్రలో రామ్ చరణ్ నటించనున్నట్టు సమాచారం. అంతేకాకుండా ఈ ప్రాజెక్ట్‌లో బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్‌ను కూడా భాగం చేయనున్నట్టు వార్తలు వచ్చాయి. ఇదిలా ఉంటే, మంజు వారియర్ చేసిన పవర్‌ఫుల్ రోల్ కోసం ఇప్పుడు చిత్ర యూనిట్ వేట మొదలుపెట్టిందట. ఈ పాత్ర కోసం మొదట విజయశాంతి పేరును పరిశీలిస్తున్నట్టు వార్తలు వచ్చాయి. అయితే, ఆ తరవాత సుహాసిని పేరు వినిపించింది. Also Read: కానీ, ప్రస్తుతం ఇండస్ట్రీ వర్గాల నుంచి వస్తోన్న సమాచారం ప్రకారం మంజు వారియర్ చేసిన పాత్ర కోసం ఖుష్బూను సంప్రదించారట. ఆమె కూడా ఈ పాత్రలో నటించడానికి అంగీకరించారని అంటున్నారు. చిరంజీవితో ఖుష్బూ నటించడం కొత్తేమీ కాదు. గతంలో ‘స్టాలిన్’ సినిమాలో చిరంజీవికి ఖుష్బూ అక్కగా నటించారు. ఆ సినిమాలో అక్క, తమ్ముడిగా చిరంజీవి, ఖుష్బూ కెమిస్ట్రీ బాగా పండింది. కాబట్టి, ‘లూసిఫర్’ రీమేక్‌లోనూ మంజు వారియర్ పాత్రకు ఖుష్బూ మంచి చాయిస్‌ అని అంతా అంటున్నారు. మరి ఈ రూమర్‌లో నిజమెంతో తెలియాలి అంటే అధికారిక ప్రకటన వచ్చేంత వరకు ఆగాల్సిందే.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/31vo31b
v

‘కె.జి.ఎఫ్ 2’ డిజిటల్ రైట్స్.. షాక్‌కు గురిచేస్తోన్న డీల్!

కన్నడ సినిమా స్థాయిని పెంచిన చిత్రం ‘కె.జి.ఎఫ్: చాప్టర్ 1’. ఈ ఒక్క సినిమాతో శాండిల్‌వుడ్ స్టామినా ఏంటో దేశ వ్యాప్తంగా తెలిసింది. కన్నడ రాక్ స్టార్ యశ్ హీరోగా నటించిన ‘కె.జి.ఎఫ్’ పాన్ ఇండియా మూవీగా విడుదలై అన్ని భాషల్లో ఘన విజయం సాధించింది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం హిందీ ప్రేక్షకులను సైతం కట్టిపడేసింది. సుమారు రూ. 80 కోట్ల బడ్జెట్‌తో నిర్మించిన ఈ చిత్రం ఇంచుమించుగా రూ.250 కోట్లు వసూలు చేసింది. అంతేకాదు, రూ.100 కోట్లు వసూలుచేసిన తొలి కన్నడ సినిమాగా రికార్డు సృష్టించింది. ‘కె.జి.ఎఫ్’ బ్లాక్ బస్టర్ కావడంతో ‘కె.జి.ఎఫ్: చాప్టర్ 2’పై అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. ‘కె.జి.ఎఫ్ 2’కు ఉన్న డిమాండ్ కారణంగా బిజినెస్ కూడా భారీ స్థాయిలో ఉండనుంది. ఇప్పటికే ఈ సినిమా డిజిటల్ రైట్స్‌‌కు భారీ ధర పలికిందని అంటున్నారు. సుమారు రూ.55 కోట్ల డీల్ కుదిరిందట. ఈ డీల్ ఇప్పుడు ప్రతి ఒక్కరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ‘కె.జి.ఎఫ్: చాప్టర్ 2’ డిజిటల్ రైట్స్‌ను అమెజాన్ ప్రైమ్ వీడియో అన్ని భాషల్లో కలుపుకుని రూ.55 కోట్లకు కొనుగోలు చేసిందని సమాచారం. Also Read: ‘కె.జి.ఎఫ్ 2’ను ఈ ఏడాది అక్టోబర్ 23న విడుదల చేయాలని మేకర్స్ నిర్ణయించారు. దీంతో ఇప్పటి నుంచే ప్రీ రిలీజ్ బిజినెస్‌పై దృష్టిసారించారట. సినిమాకున్న డిమాండ్‌ను పూర్తి స్థాయిలో క్యాష్ చేసుకోవాలని చూస్తున్నారట. ‘కె.జి.ఎఫ్‌: చాప్టర్ 1’ డిస్ట్రిబ్యూటర్స్‌కు మంచి లాభాలు తీసుకురావడంతో ‘కె.జి.ఎఫ్: చాప్టర్ 2’ బిజినెస్‌ రూ.300 కోట్లు దాటుతుందని ట్రేడ్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ సినిమాను కూడా అంతే భారీగా రూ.150 కోట్లకు పైగా బడ్జెత్‌తో తెరకెక్కిస్తున్నారు. హోమబుల్ ఫిలింస్ బ్యానర్‌పై విజయ్ కిరగందూర్ నిర్మిస్తున్నారు. తెలుగులో వారాహి చలనచిత్రం సంస్థ విడుదల చేస్తోంది. బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ ఈ సినిమాలో విలన్ పాత్ర పోషించారు. అధీరగా ఆయన కనిపించనున్నారు. అలాగే, శ్రీనిధి శెట్టి, రవీనా టాండన్, నాజర్, సింహా, అచ్యుత్, వశిష్ట, రావు రమేష్ ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. రవి బస్రూర్ సంగీతం సమకూరుస్తున్నారు. భువన్ గౌడ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3gdhG6R
v

అందుకే నగ్నంగా నటించా.. ‘నాంది’ ప్రయోగం కాదు: అల్లరి నరేష్

అంటే కామెడీ చిత్రాలకు పెట్టింది పేరు. టాలీవుడ్‌లో అల్లరి నరేష్ మరో రాజేంద్ర ప్రసాద్ అని చెబుతుంటారు. అయితే, కేవలం కామెడీ చిత్రాలకు మాత్రమే పరిమితం కాకుండా ప్రేక్షకులకు గుర్తుండిపోయే ఎన్నో వైవిధ్యమైన పాత్రలు కూడా చేశారు నరేష్. ‘గమ్యం’, ‘నేను’, ‘శంభో శివ శంభో’ వంటి చిత్రాల్లో నరేష్ చేసిన పాత్రలు విమర్శకుల ప్రసంశలు అందుకున్నాయి. ఇటీవల మహేష్ బాబు ‘మహర్షి’ సినిమాలోనూ ఒక మంచి పాత్రలో నరేష్ నటించారు. అయితే, నరేష్ ఇప్పుడు ‘నాంది’ అనే థ్రిల్లర్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. నరేష్ పుట్టినరోజు సందర్భంగా మంగళవారం (జూన్ 30న) ‘నాంది’ టీజర్‌ను విడుదల చేశారు. ఈ టీజర్ ప్రస్తుతం యూట్యూబ్‌లో టాప్ ట్రెండింగ్‌లో ఉంది. ఈ సినిమాలో నరేష్ మేకప్ లేకుండా నటిస్తున్నారు. అంతేకాదు, నగ్నంగా కూడా కనిపించనున్నారు. ఇప్పటికే అల్లరి నరేష్ నగ్నంగా ఉన్న పోస్టర్ విడుదలైంది. టీజర్‌లో సైతం నరేష్ నగ్నంగా ఉన్న విజువల్స్ ఉన్నాయి. అసలు ఈ సన్నివేశం చేయడానికి ఆయన ఎందుకంత సాహసం చేశారు? అంటే సిట్యువేషన్ డిమాండ్ చేసింది కాబట్టి అంటున్నారు నరేష్. Also Read: ‘నాంది’ సినిమా గురించి తాజాగా నరేష్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. ‘నాంది’ కథ వాస్తవానికి చాలా దగ్గరగా ఉంటుందని, అందుకే నగ్నంగా నటించడానికి ఒప్పుకున్నానని అన్నారు నరేష్. ఏ పాపం తెలియని ఒక అమాయకుడు ఓ కేసులో అరెస్టయి జైలుకు వెళ్తే, ఆ తరవాత అతని జీవితంలో ఎలాంటి మార్పులు చోటుచేసుకున్నాయి అనే కథతో ఈ సినిమాను ఉంటుందని నరేష్ చెప్పారు. తనతో పాటు సినిమాలో నటించిన ఏ ఒక్కరూ మేకప్ వేసుకోలేదని స్పష్టం చేశారు. అయితే, ‘నాంది’ ప్రయోగాత్మక చిత్రం కాదని అన్నారు. ఇంత వరకు తానెప్పుడూ చేయని జోనర్ అని చెప్పారు. ప్రయోగం అంటే ‘లడ్డు బాబు’ అని, ఆ సినిమాలో తన మొహాన్ని దాచుకుని కొత్త మొహంతో ప్రేక్షకుల ముందుకు వచ్చానని వివరించారు. కాగా, ‘నాంది’ షూటింగ్ చివరి దశకు చేరుకుందని నరేష్ వెల్లడించారు. ఇంకా పదిహేను రోజుల చిత్రీకరణ ఉందని అన్నారు. అయితే, ఈ షూటింగ్ జనసందోహంతో చేయాలన్నారు. కాబట్టి, ఆ సన్నివేశాలను ప్రభుత్వ నిబంధనలతో ఇప్పుడు తీయలేమని అన్నారు. ఈ సినిమాను ఎస్‌వీ2 ఎంటర్‌టైన్మెంట్ బ్యానర్‌పై సతీష్ వేగేశ్న నిర్మిస్తున్నారు. విజయ్ కనకమేడల దర్శకుడిగా పరిచయమవుతున్నారు. శ్రీచరణ్ పాకాల సంగీతం సమకూరుస్తున్నారు. వరలక్ష్మీ శరత్‌కుమార్, ప్రియదర్శి, హరీష్ ఉత్తమన్, ప్రవీణ్, నవమి, శ్రీకాంత్ అయ్యంగార్, వినయ్ వర్మ, దేవీ ప్రసాద్, ప్రమోధిని, మణిచందన తదితరులు నటించారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2BrH75I
v

వెధవ కరోనా చస్తే చస్తాం.. మళ్లీ లాక్ డౌన్ చారిత్రక తప్పిదం: ప్రభుత్వాలపై నాగబాబు ఫైర్

కరోనా విషయంలో ప్రభుత్వాల మాటలకు చేతలకు చాలా తేడా ఉందన్నారు మెగా బ్రదర్ నాగబాబు. మళ్లీ లాక్ డౌన్ అంటే అది ప్రభుత్వాల వైఫల్యమే అన్నారు నాగబాబు. మళ్లీ లాక్ డౌన్ చేస్తే ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుందంటూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై సంచలన కామెంట్స్ చేశారు నాగబాబు. 90 రోజుల పాటు ఇళ్లలో నుంచి బయటకు రాకుండా వాళ్ల డ్యూటీ వాళ్లు సక్రమంగా చేశారని.. అయితే ఆ ఆ టైంలో ప్రభుత్వాలు చేయాల్సిన పనుల్ని, ప్రజలకు అందించాల్సిన కనీస అవసరాలను విస్మరించిందని అన్నారు నాగబాబు. లాక్ డౌన్ టైంలో మెడికల్ రిసోర్స్‌ని కూడకట్టుకోలేకపోయిందని.. ఇప్పుడు మళ్లీ లాక్ డౌన్ చేస్తే చారిత్రక తప్పిదం అవుతుందన్నారు నాగబాబు. యూట్యూబ్‌లో ‘మన ఛానల్ మన ఇష్టం’ అంటూ మెగా బ్రదర్, జనసేన నాయకుడు నాగబాబు కరెంట్ టాపిక్స్‌పై తనకు తోచిన సూచనలు, సలహాలు చేస్తున్నారు. తాజాగా తెలంగాణలో మళ్లీ లాక్ డౌన్ చేస్తున్నారనే వార్తలపై స్పందిస్తూ ప్రభుత్వంపై ఘాటు వ్యాఖ్యలు చేశారు నాగబాబు.

ప్రభుత్వానికి మళ్లీ లాక్ డౌన్ పెట్టాలనే ఆలోచన ఉందని వార్తలు వస్తున్నాయి. వీటిపై నేను ప్రశ్నించాలని అనుకునేది ఏంటంటే.. అసలు లాక్ డౌన్ పర్పస్ ఏంటి?? కరోనా వ్యాప్తిని కంట్రోల్ చేయడం.. మెడికల్ రిసోర్స్‌ని సమీకరించుకోవడం కోసం లాక్ డౌన్ విధించారని నేను అనుకుంటున్నా. గతంలో 60 నుంచి 90 రోజులు లాక్ డౌన్ విధించారు. ఈలోపు కేంద్ర ప్రభుత్వం కాని.. రాష్ట్ర ప్రభుత్వం కాని మెడికల్ రిసోర్స్‌ని కూడకట్టుకుని ఉండాల్సింది.

90 రోజుల పాటు ప్రజలు లాక్ డౌన్ వల్ల తమ జీవితాలను త్యాగం చేశారు.. ఎంత నష్టపోయారో అందరికీ తెలుసు. వలస కార్మికుల కష్టాలు చెప్పలేం. నోరు లేని జీవులు సైతం చాలా ఇబ్బందులు పడ్డాయి. కాని ఆ టైంలో మీరు చేయాల్సింది చేయకుండా.. ఇప్పుడు మళ్లీ లాక్ డౌన్ అంటూ జనజీవనాన్ని స్తంభింపచేయడం, ఆలోచన ఆలోచన చేయడం 100 శాతం కరెక్ట్ కాదు. మళ్లీ లాక్ డౌన్ చేశారంటే అది హిస్టారికల్ మిస్టేక్ అవుతుంది.

చాలా దేశాలు లాక్ డౌన్ లేకుండా.. సక్సెఫుల్‌గా ప్రజల్ని కాపాడగలిగారు. అయితే మన దేశం పెద్దది కాబట్టి సమస్యలు ఉంటాయి. కాని.. మళ్లీ లాక్ డౌన్ అంటే చారిత్రాత్మక తప్పిదం చేసినట్టే. ఇది నా ఒక్కడి అభిప్రాయం కాదు.. నాలా మాట్లాడే వాళ్లు కోట్లాది మంది ఉన్నారు. మళ్లీ లాక్ డౌన్ పెడితే ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుంది. వెధవ కరోనా చస్తే చచ్చాం.. తినడానికి తిండిలేదు.. బతుకు గడవడం లేదు. కరోనా వస్తే ఏంటి అనే పరిస్థితి వచ్చి.. ప్రజల్లో రివల్యూషన్ మైండ్ వచ్చేస్తుంది. అలాంటి ఆలోచనలు వచ్చేలా ప్రభుత్వాలు నిర్ణయం తీసుకోవడం కరెక్ట్ కాదు.

కరోనా వస్తే ఎలాంటి ట్రీట్ మెంట్ ఇవ్వాలి..? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? చెప్పాలి. అంతేతప్ప మళ్లీ లాక్ డౌన్ చేయడం కరెక్ట్ కాదు. ఇలాంటి ఆలోచన ఉంటే విరమించుకోవాలని లక్షలాది మంది ప్రజల పక్షాన నేను కోరుకుంటున్నా.. మళ్లీ లాక్ డౌన్ చేస్తే బిగ్ మిస్టేక్ అవుతుంది. దయచేసి లాక్ డౌన్ కాన్సెప్ట్ వద్దు. మీరు కరోనా బారిన పడ్డ వారికి ఏదోటి చేస్తారనే ఉద్దేశంతో 90 రోజులు బయటకు రాకుండా ఉన్నారు. నాకైతే ఇబ్బంది లేదు.. కాని సాధారణ జనం పరిస్థితి ఏంటి? కోట్లాది మంది జీవితాలు ఏమైపోతాయి. మళ్లీ లాక్ డౌన్ ఎందుకు చేస్తారు. గతంలో ప్రభుత్వాలు లాక్ డౌన్ చేసినప్పుడు ప్రజలు ఇంట్లో ఉండి వాళ్ల డ్యూటీ వాళ్లు చేశారు. ఇప్పుడు ప్రభుత్వాలు తమ డ్యూటీ తాము చేయాలి.

ఎవరికి కరోనా లక్షణాలు ఉన్నా.. వాళ్లకి బాగు చేయించే సదుపాయాలను ఇప్పటికే కల్పించాలి. కాని మీరు వాటిని సమీకరించుకోలేకపోవడం మీ తప్పే అవుతుంది. ప్రభుత్వాలు ఫెయిల్ అయినట్టే. మాటలు చెప్పడం వేరు.. దాన్ని ఆచరణలో పెట్టడం వేరు. ప్రభుత్వాలను చాలా మంది విమర్శించినప్పుడు కరెక్ట్ కాదని చెప్పాను. ప్రభుత్వాలకు సపోర్ట్‌గా మాట్లాడా. కాని ఇప్పుడు లాక్ డౌన్ నిర్ణయం ప్రభుత్వ వైఫల్యంగా కనిపిస్తుంది. దయచేసి మళ్లీ లాక్ డౌన్ వద్దు’ ఆవేశంగా మాట్లాడారు నాగబాబు.



from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3ifIzZI
v

ప్రభాస్ సినిమాలో రానా.. గోపీచంద్‌కు కుదరకపోవడంతో..!!

బాహుబలిగా ప్రభాస్‌, భళ్లాలదేవుడిగా రానా వెండితెరపై ప్రేక్షకులకు కనువిందు చేశారు. వీరిద్దరూ కలిసి నటించిన ‘బాహుబలి’ సిరీస్ బాక్సాఫీసు వద్ద రికార్డుల వర్షం కురిపించింది. మాహిష్మతి సింహాసనం కోసం వీరిద్దరూ పోరాడిన తీరు ప్రేక్షకులను కట్టిపడేసింది. అయితే, ‘బాహుబలి’ తరవాత మరోసారి వీరిద్దరూ కలిసి నటించబోతున్నారని ఇండస్ట్రీ టాక్. రాధాకృష్ణ దర్శకత్వంలో హీరోగా తెరకెక్కుతోన్న సినిమాలో రానా దగ్గుబాటి ఒక ప్రత్యేక పాత్రలో మెరవనున్నారని అంటున్నారు. రానా పాత్ర రెండు నిమిషాల పాటు ఉంటుందని తెలుస్తోంది. దీంతో రానా, ప్రభాస్ మరోసారి కలిసి నటిస్తు్న్నారనే వార్త ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ సినిమాకు ‘రాధే శ్యామ్’ అనే టైటిల్‌ను ఖరారు చేసినట్టు ఇప్పటికే వార్తలు వచ్చాయి. లాక్‌డౌన్‌కు ముందు ఈ చిత్ర యూనిట్ జార్జియాలో షూటింగ్ జరిపిన విషయం తెలిసిందే. ఈ షెడ్యూల్‌లో ప్రభాస్, పూజా హెగ్డే‌తో పాటు ప్రియదర్శి కూడా పాల్గొన్నారు. కరోనా విజృంభిస్తోన్న సమయంలోనే ఈ మూవీ టీమ్ మొత్తం ఇండియాకు తిరిగి వచ్చింది. ప్రస్తుతం షూటింగ్‌లకు ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో మిగిలిన భాగం షూటింగ్‌ను పూర్తిచేయాలని మేకర్స్ చూస్తున్నారు. Also Read: అయితే, ఈ సినిమాలో 2 నిమిషాల నిడివితో ఒక ప్రత్యేకమైన పాత్ర ఉందట. ఈ పాత్రలో నటించడానికి ముందు గోపీచంద్‌ను అనుకున్నారట ప్రభాస్. గోపీచంద్, ప్రభాస్ మంచి స్నేహితులు. ఈ చొరవతోనే గోపీని ప్రభాస్ అడిగారట. గోపీచంద్ అంగీకరించినా అనుకోని కారణాల వల్ల ఈ సినిమాలో నటించడం కుదరడంలేదట. దీంతో ప్రభాస్‌కు మరో ఆప్షన్ కింద రానా కనిపించారని అంటున్నారు. గోపీచంద్ చేయాల్సిన పాత్రను ఇప్పుడు రానా చేస్తున్నారని టాక్. ప్రస్తుతం వినిపిస్తోన్న ఈ వదంతుల్లో నిజమెంతో తెలియాలంటే కొన్ని రోజులు అయినా ఆగాలి.. లేదంటే అధికారిక ప్రకటన వచ్చేంతవరకైనా వేచి చూడాలి.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2BV9Z6A
v

Sri Reddy: పూనమ్ కౌర్ మళ్లీ ప్రెగ్నెంట్.. పవన్-పూనమ్‌ రహస్య బంధంపై శ్రీరెడ్డి సంచలన పోస్ట్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్-పూనమ్ కౌర్ రహస్య బంధంపై గత కొంతకాలంగా సంచలన ఆరోపణలు చేస్తున్న వివాదాస్పద నటి మరోమారు ఈ ఇద్దర్నీ టార్గెట్ చేసి రెచ్చిపోయింది. ఈసారి ఇంకాస్త ఘాటు పెంచుతూ సంచలన పోస్ట్‌ను తన ఫేస్ బుక్‌లో షేర్ చేసింది. ‘ఈ బ్రెయిన్ లేని పూనమ్ అక్క ఒకటి.. చేయాల్సిందంతా చేసి ఇప్పుడు పీకే ****** పట్టుకుని ఉయ్యాల ఊగుతాంది. మళ్లీ ప్రెగ్నెంట్ ఏమో’ అంటూ రాయడానికి వీలులేని బూతులతో చెలిరేగింది శ్రీరెడ్డి. అయితే ఈసారి పూనమ్‌ని టార్గెట్ చేయడం వెనుక రీజన్ ఏంటంటే.. రీసెంట్‌గా వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌పై సినిమాను ప్రకటిస్తూ.. పవన్ డూప్ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. డిజిటల్ టెక్నాలజీకి, ఆన్‌లైన్ వేదికలను క్యాష్ చేసుకుంటూ RGVWorld.in/ShreyasET ద్వారా వరుస సినిమాలు విడుదల చేస్తున్న వర్మ తాజాగా క్రితం పవన్ కళ్యాణ్ లైఫ్ ఆధారంగా 'పవర్ స్టార్' సినిమా తీస్తున్నట్లు సంచలన ప్రకటన చేశారు. అంతేకాదు ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ పాత్రలో నటించేందుకు ఆయన పోలికలతో ఉన్న నరేష్ అనే టిక్ టాక్ స్టార్‌ని పట్టుకున్నారు వర్మ. ఇతనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. అయితే వర్మ పవర్ స్టార్ సినిమా ప్రకటించగానే సోషల్ మీడియాలో ఫైర్ అవుతూ పోస్ట్‌లు పెట్టారు . ‘అమ్మాయిల మానసిక బలహీనతను పసిగట్టడం, అసభ్యకరమైన భాషను ఉపయోగించమని వారిని ప్రేరేపించడం, తన ట్వీట్స్‌ను పంపి షేర్ చేయమని చెప్పడం, దీని గురించి మీడియాకు తెలియజేయడం వంటి పనులు చేసే ఆర్జీవీ అనే క్యారెక్టర్‌ను కూడా దయచేసి ఈ సినిమాలో పెట్టండి. నేను చిన్న పిల్లగా ఉన్నప్పుడు మీరంటే నాకు ఎంతో గౌరవం. కానీ, ఇప్పుడు మిమ్మల్ని చూస్తే బాధేస్తుంది’ అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది పూనమ్. ‘ఒక వ్యక్తికి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఒక గంటపాటు నాకు బ్రెయిన్‌వాష్ చేసిన ఈ విశ్వాసఘాతుకుడైన డైరెక్టర్ ఫోన్ కాల్‌ను రికార్డు చేసి ఉంటే బాగుండేదని నాకు అనిపించింది. అతను నాకు పంపిన ట్వీట్స్‌ను సంబంధిత వ్యక్తికి నేను అప్పుడే పంపాను. నా అదృష్టం కొద్దీ మీడియాలో కొంత మంది నిజాయతీపరులు ఉన్నారు. లేకపోతే నీ కుట్రలకు నేను బలైపోయేదాన్ని’ అని వర్మను ఉద్దేశించి పూనమ్ సంచలన ఆరోపణలు చేయడంతో.. పవన్‌పై వర్మ సినిమా తీస్తాననడం ఏంటి?? దానిపై పూనమ్ సీరియస్ అవ్వడం ఏంటి?? అంటూ సినీ సర్కిల్స్‌లో హాట్ టాపిక్ నడిచింది. అయితే పవన్ కళ్యాణ్‌కి సంబంధించిన ఏ ఇష్యూపైనైనా బూతులతో రెచ్చిపోయే శ్రీరెడ్డి.. తాజాగా పూనమ్ ప్రెగ్నెంట్ ఏమో అంటూ ఆమెపై సంచలన పోస్ట్ షేర్ చేసింది. అయితే గతంలో పూనమ్ కౌర్.. పీకే లవ్స్ పేరుతో ఉన్న మాస్క్‌ని ధరించి ట్విట్టర్‌లో ప్రచారం నిర్వహించింది పూనమ్. దీనిపై శ్రీరెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేస్తూ.. ‘పూనమ్ అక్క.. పీకే మాస్క్ వేసుకోవటం ఎందుకు?? మా అందరికీ పీకేకి ఉన్న మాస్క్ తీసేయ్ అంటే తీయవు. మాస్క్ కే పీచే క్యా హై??’ అంటూ కామెంట్స్ చేసింది. దీంతో రియాక్ట్ అయిన పూనమ్.. స్వేచ్ఛ పేరుతో అమ్మానాన్నలను వదిలేసి, డబ్బు కోసం క్యారెక్టర్‌ని వదిలేసిన అమ్మాయి ఒక వేశ్య కంటే దారుణం. మనిషిగా మరో మృగం’’ అంటూ తీవ్ర స్థాయిలో మండి పడుతూ శ్రీరెడ్డికి గట్టి కౌంటర్ ఇచ్చింది పూనమ్. దీనికి మళ్లీ శ్రీరెడ్డి ఇంకాస్త ఘాటుగా స్పందిస్తూ ‘పూనమ్‌ని ప్రాస్టిట్యూట్’ అంటూ ఓ రేంజ్‌లో ఫైర్ అయ్యి నోటికి పనిచెప్పింది. అయితే చాలా రోజుల తరువాత వీరి మధ్య వివాదం మళ్లీ చెలరేగింది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3dMwHL2
v

అదిరింది రా.. నీ కొత్త అవతారం!! వెయిటింగ్ ఇక్కడ.. అల్లరోడి‌పై నాని కామెంట్స్

హీరో పుట్టిన రోజు కానుకగా ఆయన లేటెస్ట్ మూవీ 'నాంది' టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ టీజర్ ఆద్యంతం ఆసక్తికరంగా ఉండటమే గాక, టీజర్‌లో అల్లరోడి అవతారం, డైలాగ్ స్పెషల్ అట్రాక్షన్ అయ్యాయి. దీంతో ఈ టీజర్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. అయితే తాజాగా ఈ 'నాంది' టీజర్ చూసిన .. తనదైన స్టైల్ కామెంట్ చేస్తూ ట్వీట్ చేశారు. `అదిరింది రా.. నీకు, నీ సరికొత్త అవతారానికి జన్మదిన శుభాకాంక్షలు. `నాంది` సినిమా కోసం వెయిట్ చేస్తున్నా` అంటూ నాని ట్వీట్ చేశాడు. ఈ మేరకు తన బర్త్ డే సర్‌ప్రైజ్ అని పేర్కొంటూ అల్లరి నరేష్ చేసిన ట్వీట్ ట్యాగ్ చేశాడు. కేవలం హీరోలుగానే కాక నిజ జీవితంలో కూడా అల్లరి నరేష్, నాని మంచి స్నేహితులు కావడంతో ఈ ట్వీట్ చూసి ఇరువురి అభిమానులు మురిసిపోతున్నారు. Also Read: విజ‌య్ క‌న‌క‌మేడ‌ల ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కుతున్న నాంది సినిమాకు స‌తీష్ వేగేశ్న నిర్మాతగా వ్యవహరిస్తుండటం విశేషం. అల్లరి నరేష్ కెరీర్‌లో ఇది 57వ సినిమా. ఈ చిత్రంలో వరలక్ష్మి శరత్ కుమార్, ప్రియదర్శి, హరిశ్‌ ఉత్తమన్‌ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటివరకు 'నాంది' నుంచి విడుదలైన అప్‌డేట్స్ ప్రేక్షకుల్లో అంచనాలు పెంచేశాయి.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3eMXdWa
v

‘బంగారు బుల్లోడు’ టీజర్: బొడ్డు కనకమహాలక్ష్మి.. ఇంటిపేరు ఒంట్లోనే పెట్టేసుకుంది!

అల్లరి నరేష్, పూజా ఝవేరి హీరోహీరోయిన్లుగా రూపొందుతోన్న చిత్రం ‘బంగారు బుల్లోడు’. పి.వి.గిరి దర్శకత్వం వహిస్తున్నారు. ఏటీవీ సమర్పణలో ఎ.కె.ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు. ఈ ఏడాది ఉగాది పండుగనాడు విడుదల చేసిన ‘బంగారు బుల్లోడు’ ఫస్ట్ లుక్ ఆకట్టుకుంది. అంతేకాకుండా, నందమూరి బాలకృష్ణ సూపర్ చిత్రం ‘బంగారు బుల్లోడు’ టైటిల్‌తో నరేష్ చేస్తుండటంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగింది. కాగా, పుట్టినరోజు సందర్భంగా జూన్ 30న ‘బంగారు బుల్లోడు’ టీజర్‌ను‌ విడుదల చేశారు. టీజర్ చూస్తుంటే ఇది మంచి కామెడీ ఎంటర్‌టైనర్ అని అర్థమవుతోంది. ఇందులో నరేష్ బ్యాంక్ ఉద్యోగిగా కనిపించనున్నారు. బ్యాంక్ లాకర్‌లో ఉన్న కస్టమర్ల బంగారు ఆభరణాలు, నరేష్ పాత్ర చుట్టూ ఈ సినిమా కథ తిరుగుతుందని టీజర్ ద్వారా స్పష్టమవుతోంది. ‘‘బొడ్డు కనకమహాలక్ష్మి.. ఇంటిపేరు ఒంట్లోనే పెట్టేసుకుంది’’ అని నరేష్ చెప్పే డైలాగ్ సినిమాలోని రొమాంటిక్ యాంగిల్‌ను చూపిస్తోంది. Also Read: పూర్తిస్థాయి కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో నరేష్ పాత్ర ఆద్యంతం ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తుందని చిత్ర యూనిట్ చెబుతోంది. నిజానికి ఈ సినిమా వేసవిలో విడుదలకావాల్సింది. కానీ, లాక్‌డౌన్ కారణంగా ఆగిపోయింది. థియేటర్లు తెరుచుకున్న తరవాత సినిమా విడుదల తేదీని ప్రకటించనున్నారు. కాగా, ఈ సినిమాలో తనికెళ్ల భరణి, పోసాని కృష్ణమురళి, పృథ్వీ, ప్రవీణ్, వెన్నెలకిషోర్, సత్యం రాజేష్, ప్రభాస్ శ్రీను, జబర్దస్త్ మహేష్, అనంత్, భద్రం, అజయ్ ఘోష్, సారిక రామచంద్రరావు, రమాప్రభ, రజిత, శ్యామల ఇతర పాత్రలు పోషించారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3eH9ICy
v

అమీర్ ఖాన్ ఇంట్లో కరోనా కలకలం.. తల్లికి నెగిటివ్ రావాలంటూ ప్రార్థన

బాలీవుడ్ ఇండస్ట్రీలో కరోనా కలకలం సృష్టిస్తోంది. ఇప్పటికే అనేకమంది ప్రముఖులు కరోనా బారిన పడ్డారు. తాజాగా బాలీవుడ్ ప్రముఖ హీరో ఆమీర్ ఖాన్ ఇంటికి కరోనా సోకింది. ఈ విషయాన్ని ఆమీర్ ఖాన్ సోషల్ మీడియా వేదికగా తెలిపారు. తన సిబ్బందిలో కొందరికి కరోనా వైరస్ సోకినట్లు నిర్ధారించినట్లుగా పేర్కొన్నాడు. ఈ విషయంపై వెంటనే స్పందించిన ముంబై మున్సిపల్ కార్పోరేషన్ అధికారులకు ఆమీర్ ధన్యవాదాలు తెలిపాడు. అంతేకాకుండా కరోనా సోకిన తన సిబ్బందికి ఎలాంటి సాయం కావాలన్న తాను చేయడానికి సిద్ధంగా ఉన్నానన్నాడు. వైరస్ సోకిన వారిని క్వారంటైన్‌కు తరలించారన్నారు ఆమీర్. కోకిల బెన్ ఆస్పత్రి సిబ్బందికి కూడా ఆయన ధన్యవాదాలు తెలిపారు. కరోనా టెస్టుల విషయంలో ఆస్పత్రి డాక్టర్లు, సిబ్బంది,నర్సులు ఎంతో జాగ్రత్తగా వ్యవహరించారన్నారు. ఇక దేశంలో కరోనా ప్రమాద స్థాయి రోజురోజుకీ పెరిగిపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు ఆమీర్ ఖాన్. ముంబైలో ఇప్పటికే లక్ష కేసులు దాటిపోయాయన్నాడు. దాంతో అంతా అప్రమత్తంగా ఉండాలని సూచించాడు. తన తల్లికి కూడా కరోనా పరీక్షలు నిర్వహించాల్సి ఉందన్నాడు. అయితే ఆమెకు నెగిటివ్ రావాలని భగవంతుడ్ని ప్రార్థిస్తూ అభ్యర్థించాడు ఆమీర్ ఖాన్. ఇప్పటికే బాలీవుడ్‌లో చాలా మంది సెలబ్రిటీస్ కరోనా బారిన పడ్డారు. సంగీత దర్శకుడు వాజిద్ ఖాన్ కరోనాతో చనిపోయారు. ప్రముఖ నిర్మాతలు కరీం మోరాని ఇంట్లో కూడా ఆయనతో ఇద్దరు కూతుళ్లు కూడా కరోనా బారిన పడ కోలుకున్నారు. బోనీ కపూర్ ఇంట్లో కూడా పనిచేసే సిబ్బంది కరోనా వైరస్ సోకిన విషయం తెలిసిందే. దీంతో ఇప్పుడు ఆమీర్ ఖాన్ ఇంట్లో కూడా కరోనా విషయంలో ఆందోళన నెలకొంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/31yJn5V
v

Allu Arjun: తమన్నాతో రామ్ చరణ్.. ఆ ఆలోచన బన్నీదే!! వెరీ ఇంట్రెస్టింగ్..

డిజిటల్ మాధ్యమానికి, ఓవర్ ది టాప్ (ఓటీటీ) వేదికలకు క్రమంగా ఆదరణ పెరుగుతూ వస్తోంది. కరోనా కారణంగా షూటింగ్స్, థియేటర్స్ ఎక్కడికక్కడే మూతబడటం ఆన్‌లైన్ ప్రపంచానికి మంచి డిమాండ్ తెచ్చిపెట్టింది. ఈ సిచుయేషన్ క్యాచ్ చేసుకునేలా అల్లు అరవింద్ ఇటీవలే 'ఆహా' పేరుతో ఓ ఓటీటీ వేదికను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ వేదికపై పలు సినిమాలు రిలీజ్ చేస్తూ డిజిటల్ మాద్యమంలోనూ తమ మార్క్ చూపిస్తున్నారు. అయితే ఈ 'ఆహా' ఓటీటీ ప్లాట్‌ఫాం కోసం ఓ టాక్ షో చేయనుందని గత రెండు మూడు రోజులుగా వార్తలు షికారు చేస్తున్నాయి. అంతేకాదు ఈ టాక్ షోలో అల్లు అర్జున్, , రవితేజ వంటి స్టార్ హీరోలను, కొందరు హీరోయిన్లను కూడా తమన్నా ఇంటర్వ్యూ చేయబోతున్నారని తెలుస్తుండటం అందరిలోనూ ఆసక్తి నెలకొల్పింది. కాగా జనాలను ఆకర్షించేలా ఈ ప్రోగ్రాం చేయాలన్న వినూత్న ఆలోచన అల్లు అర్జున్‌ది అని తెలుస్తోంది. Also Read: ఓటీటీ డిమాండ్, సెలబ్రిటీ ముచ్చట్ల పట్ల జనాల ఆసక్తి గమనించిన అల్లు అర్జున్.. తన తండ్రి అల్లు అరవింద్‌కి ఈ సలహా ఇచ్చారట. పైగా తమన్నాను హోస్ట్‌గా తీసుకోవాలని రెఫర్ చేసింది కూడా బన్నీనే అనేది విశ్వసనీయ వర్గాల నుంచి అందిన సమాచారం. ఇకపోతే ఈ షోలో 20 ఎపిసోడ్స్ ఉంటాయని, ఇందుకోసం తమన్నా 7 లక్షలు రెమ్యునరేషన్ తీసుకుంటున్నారని మరికొన్ని వార్తలు వినిపిస్తున్నాయి. చూడాలి మరి ఆన్‌లైన్ వేదికపై తమన్నా ఏ రేంజ్‌లో ఆకట్టుకుంటుందనేది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3dMbDnW
v

నాంది టీజర్: నగ్నంగా నరేష్.. అబ్బో! మనోడు మామూలు డైలాగ్ చెప్పలేదండీ బాబూ

ఇన్నాళ్లు కామెడీ సినిమాలతో కడుపుబ్బా నవ్వించిన .. ఈ సారి ట్రాక్ ఛేంజ్ చేశారు. కామెడీలోనే ఎమోషన్ పండిస్తూ ఆకట్టుకున్న ఆయన ఇప్పుడు మాత్రం పూర్తిస్థాయి ఎమోషనల్ కాన్సెప్ట్‌తో '' రూపంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. సస్పెన్స్ థ్రిల్లర్ కథకు ఎమోషనల్ అంశాలు కలిపి రెడీ చేసిన ఈ కథను డైరెక్టర్ విజయ్ కనకమేడల తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ పోస్టర్స్ సినిమాపై హైప్ క్రియేట్ చేశాయి. కాగా ఈ రోజు (జూన్ 30) అల్లరి నరేష్ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు బర్త్ డే విషెస్ తెలుపుతూ 'నాంది' టీజర్ రిలీజ్ చేసి మరింత అట్రాక్ట్ చేశారు మేకర్స్. ఒక నిమిషం 28 సెకనుల నిడివితో కట్ చేసిన ఈ టీజర్ ఆద్యంతం ఉత్కంఠ భరితంగా ఉంది. టీజర్‌లో చూపించిన సన్నివేశాలు సినిమాపై ఆతృతను పెంచేశాయి. ఇక ఇందులో నరేష్ చెప్పిన డైలాగ్ అందరినీ ఆలోచింపజేయడమే గాక మూవీపై అంచనాలు పెంచేసింది. Also Read: ''ఒక మనిషి పుట్టడానికి కూడా తొమ్మిది నెలలే టైమ్‌ పడుతుంది. మరి నాకు న్యాయం చెప్పడానికేంటి సర్‌.. ఇన్ని సంవత్సరాలు పడుతోంది'' అంటూ తీవ్ర ఆవేదన చెందుతూ నరేష్ ఈ డైలాగ్ చెప్పారు. ఈ టీజర్ చూస్తుంటే అల్లరి నరేష్.. సినిమా కోసం తన శక్తిని మొత్తం ఉపయోగించడని స్పష్టంగా తెలుస్తోంది. చిత్రంలో వరలక్ష్మి శరత్ కుమార్, ప్రియదర్శి, హరిశ్‌ ఉత్తమన్‌ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మరోవైపు ఈ ఆసక్తికర టీజర్‌ని ట్విట్టర్ ఖాతా ద్వారా షేర్ చేశారు యంగ్ హీరో విజయ్ దేవరకొండ. ''ఈ ప్రపంచంతో ‘నాంది’ టీజర్‌ పంచుకోవడం చాలా సంతోషంగా ఉంది. చిత్ర బృందానికి నా తరఫున హృదయపూర్వక అభినందనలు. నరేష్‌ అన్న అద్భుతంగా నటించారని స్పష్టమవుతోంది'' అని విజయ్ పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ టీజర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3dRrHFm
v

Ram Gopal Varma: 'పవర్ స్టార్' ఎవరో తెలిసిపోయింది.. ఇవిగో పూర్తి వివరాలు!! వాళ్ళిద్దరి మధ్య డీల్..

సమయం, సందర్భం ఏదైనా సరే.. రామ్ గోపాల్ వర్మకు తెలిసిన ఒకే ఒక మంత్రం సంచలనాలకు కేంద్ర బిందువుగా ఉంటూ వార్తల్లో నిలవడం. ఆయన మాట, దూసుకుపోయే విధానం, తీసే సినిమాలు దేనికవి ప్రత్యేకమే. అది సినిమా అయినా, ఇంటర్వ్యూ అయినా తాను చెప్పాలనుకున్న విషయాన్ని నిర్మొహమాటంగా బయటపెట్టేయడం వర్మ నైజం. ఎప్పటికప్పుడు తాజా పరిస్థితులకు అనుగుణంగా మోల్డ్ అవుతూ సినిమాలు రూపొందించడం ఆయన లోని స్పెషల్ క్వాలిటీ. ఈ క్రమంలోనే డిజిటల్ టెక్నాలజీకి, ఆన్‌లైన్ వేదికలకు డిమాండ్ పెరుగుతుండటం క్యాచ్ చేసుకుంటూ RGVWorld.in/ShreyasET ద్వారా వరుస సినిమాలు రిలీజ్ చేస్తున్నారు వర్మ. ఇప్పటికే ''క్లైమాక్స్, నగ్నం'' సినిమాలతో సంచలనం సృష్టించిన ఆయన గత రెండు రోజుల క్రితం లైఫ్ ఆధారంగా 'పవర్ స్టార్' సినిమా తీస్తున్నట్లు ప్రకటించి మరో ఆటం బాంబ్ వేశారు. అంతేకాదు ఇందులో నటించబోయే నటుడు, ఇతనే అంటూ ఓ వీడియో కూడా రిలీజ్ చేసి ఆసక్తి రేకెత్తించారు. Also Read: వర్మ విడుదల చేసిన ఆ వీడియోలోని నటుడు అచ్చం పవన్ కళ్యాణ్‌ని పోలి ఉండటంతో.. అతను ఎవరు? ఆ నటుణ్ని వర్మ ఎలా పట్టాడు? అనే అన్వేషణ మొదలైంది. ఈ నేపథ్యంలో ‘తెలుగు సమయం’కు ప్రత్యేకంగా ఈ నటుడికి సంబంధించిన కొన్ని వివరాలు తెలిశాయి. అతని పేరు నరేష్. భద్రాచలంకు సమీపంలోని సారపాక గ్రామానికి చెందిన వ్యక్తి ఆయన. పవన్ కళ్యాణ్‌ని‌ పోలిన రూపు రేఖలు కలిగి ఉండటంతో ఆయనను అనుకరిస్తూ టిక్ టాక్ వీడియోలు చేస్తుంటాడు. ఈ వీడియోలు చూసి ఇతన్ని వర్మ కాంటాక్ట్ అయ్యారట. ఆ నటుడి వివరాలు సేకరించి ప్రత్యేకంగా కారు పంపించి తన ఆఫీసుకు రప్పించారట. 'పవర్ స్టార్' సినిమాలో నటించాలని ఆయన్ను కోరిన వర్మ.. కేవలం 10 రోజుల్లోనే షూటింగ్ కంప్లీట్ చేస్తా అని మాటిచ్చారట. రెండు భాగాలుగా ఈ మూవీ ఉంటుందని వర్మ చెప్పారట. అయితే ఇందుకు సంబంధించి డీల్ ఇంకా సెట్ కాలేదని, ప్రస్తుతం వాళ్ళిద్దరి మధ్య చర్చలు మాత్రమే నడుస్తున్నాయని తెలిస్తుండటం గమనార్హం.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3dRlp8I
v

Monday 29 June 2020

అల్లుడు అదుర్స్: రంగంలోకి దూకేందుకు రెడీ అయిన బెల్లంకొండ సాయి శ్రీనివాస్

దేశంలో కరోనా కాటుకు సెట్స్‌పై ఉన్న ప్రతిఒక్క సినిమా బలైపోయింది. ముందుగా వేసుకున్న షెడ్యూల్స్ అన్నీ తలక్రిందులయ్యాయి. లాక్‌డౌన్ రావడంతో దాదాపు మూడు నెలలుగా కెమెరా స్విచ్చాన్ చేయకపోవడంతో షూటింగ్స్ అన్నీ ఎక్కడికక్కడే నిలిచిపోయి.. విడుదల వాయిదా వేసుకున్నాయి. అయితే ఇటీవల షూటింగ్స్‌కి అనుమతులు రావడంతో తిరిగి ఒక్కొక్కరుగా సెట్స్ మీదకు వచ్చేస్తున్నారు. ఈ క్రమంలోనే యంగ్ హీరో రంగంలోకి దూకేందుకు రెడీ అయ్యారని తెలిసింది. 'రాక్షసుడు' మూవీ తర్వాత తన తర్వాతి సినిమాను సంతోష్ శ్రీ‌నివాస్ ద‌ర్శ‌క‌త్వంలో చేస్తున్నారు బెల్లకొండ శ్రీనివాస్. లాక్‌డౌన్‌కి ముందే మేజర్ పార్ట్ షూటింగ్ ఫినిష్ చేస్తుకున్న ఈ మూవీకి 'అల్లుడు అదుర్స్' అనే ఆసక్తికర టైటిల్ ఫిక్స్ చేశారు. ఇక ఈ చిత్రాన్ని ఏప్రిల్ 30న విడుదల చేయాలని భావించిన చిత్ర యూనిట్.. లాక్‌డౌన్ అమలులోకి రావడంతో చివరి షెడ్యూల్ షూటింగ్ కూడా జరపలేకపోయింది. దీంతో సినిమా రిలీజ్ కూడా వాయిదాపడింది. Also Read: ఈ నేపథ్యంలో తాజాగా 'అల్లుడు అదుర్స్' తదుపరి షెడ్యూల్ కోసం డేట్స్ ఫిక్స్ చేశారట దర్శకనిర్మాతలు. ఈ షూటింగ్ వచ్చే నెల నుంచి హైదరాబాదులో జరిపేలా ఏర్పాట్లు చేస్తున్నారు. త్వరత్వరగా ఫినిష్ చేసేసి దసరాకు చిత్రాన్ని విడుదల చేయాలనే విధంగా ప్లాన్ చేస్తున్నారట. ఈ చిత్రంలో బెల్లకొండ శ్రీనివాస్ సరసన , నభా నటేష్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇకపోతే ఈ అల్లుడు అదుర్స్ చిత్రంలో 8 ప్యాక్స్‌తో సరికొత్త లుక్‌లో కనిపించనున్నాడు బెల్లంకొండ శ్రీనివాస్. సుమంత్ మూవీ ప్రొడ‌క్షన్స్ బ్యాన‌ర్‌పై జి.సుబ్రహ్మణ్యం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ ఐటెం సాంగ్‌లో అందాల విందు చేయనుందని తెలిసింది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3ilWvl5
v

టెన్త్ పరీక్షలు పూర్తిగా రద్దు చేయాలంటున్న టాలీవుడ్ ప్రముఖ హీరో

కరోనా కారణంగా దేశం మొత్తం లాక్ డౌన్ విధించడంతో అన్ని కార్యకలాపాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. విద్యాసంస్థలు, కోచింగ్ సెంటర్లు మూతపడ్డాయి. కొన్ని రాష్ట్రాల్లో ఇప్పటికే అన్ని రకాలు పరీక్షలు రద్దు అయ్యాయి. ఇటు తెలంగాణ ప్రభుత్వం కూడా పదో తరగతి పరీక్షల్ని రద్దు చేసింది. లాక్ డౌన్ లో కొంచెం సడలింపులు ఇచ్చినప్పటికీ కరోనా వ్యాప్తి తగ్గకపోవడం వలన కొన్ని రాష్ట్రాలలో పదవ తరగతి పరీక్షలను రద్దు చేసారు. అందులో తెలంగాణ , ఆంధ్ర ప్రదేశ్ కూడా ఉన్నాయి. ఈ క్రమంలో టెన్త్ పరీక్షల విషయంలో కీలక వ్యాఖ్యలు చేశారు టాలీవుడ్ హీరో మంచు విష్ణు. పదవ తరగతి పరీక్షలను పూర్తిగా రద్దు చేయాలనీ అన్నారు విష్ణు. ఈ మేరకు సోమవారం ఆయన ట్వీట్‌ చేశారు. ‘ఈ ఏడాదే కాకుండా పది పరీక్షలు పూర్తిగా రద్దు చేయబడాలని నేను బలంగా కోరుకుంటున్నాను. 14,15 ఏళ్ల వయసులో బోర్డు పరీక్షలు అంటూ విద్యార్థులపై ఒత్తిడి అవసరమా? ఈ పరీక్షల ఉద్దేశం ఏమిటి?’అంటూ ట్విటర్‌లో ప్రశ్నించారు. ప్రస్తుతం ఈ ట్వీట్‌ సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది. ఇక పలువురు నెటిజన్లు విష్ణు అభిప్రాయంతో ఏకీభవిస్తున్నారు. మరికొందరు నెటిజన్లు మాత్రం విష్ణు ఆలోచన సరికాదంటున్నారు. . ఎందుకంటే పరీక్షలనేవి పిల్లలను భయపెట్టి ఒత్తిడికి గురి చేయడానికి ఉద్దేశించినవి కాదంటున్నారు. 15 సంవత్సరాల లోపు పిల్లలు ఏదైనా సులభంగా గ్రహిస్తారని మనస్తత్వ శాస్త్ర నిపుణులు చెబుతున్నారు .మరికొందరు 14, 15ఏళ్లలో వీరు ఒత్తిడిని తట్టుకోలేకపోతే.. ముందు ముందు భవిష్యత్తులు తమ జీవితానికి సంబంధించిన కీలక నిర్ణయాలు ఎలా తీసుకోగలరంటూ ప్రశ్నిస్తున్నారు. ఏదైనా సోషల్ మీడియాలో సరికొత్త చర్చకు దారి తీసింది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2NTeWj3
v

షాకింగ్.. ‘వర్మ’ నగ్నం బడ్జెట్ లక్ష కాదు.. జస్ట్ 2 వేలు, 12 గంటల్లో 70 లక్షల రెవెన్యూ, లెక్కలివిగో

నమ్మశక్యంగా లేకపోయినా.. ఇది ‘నగ్న’ సత్యం అంటున్నారు ‘నగ్నం’ దర్శకుడు . వెస్ట్ గోదావరి స్వీటీ పాపతో నగ్నం-నేకెడ్ అనే లషు చిత్రాన్ని రూపొందించి జూన్ 27 రాత్రి 9 గంటలకు RGVWorld.in/ShreyasET ద్వారా సోషల్ మీడియాలో విడుదల చేశారు ఆర్జీవీ. అంతకు పోర్న్ స్టార్ మియా మాల్కోవాతో ‘క్లైమాక్స్’ అనే మరో బూతు చిత్రాన్ని తీసి ఆన్ లైన్‌లో కాసులు కురిపించుకున్న వర్మ.. ఈ యాపారం ఏదో బాగుందని ఎలాగూ సొంత ప్రొడక్షన్ హౌస్ ఉంది కాబట్టి దేవరపల్లి (వెస్ట్ గోదావరి) పెద పాపతో ‘NAKED (నగ్నం) అనే చిత్రాన్ని వదిలిపెట్టారు. స్వీటీ నగ్న చిత్రం చూడాలంటే.. రూ. 200 చెల్లించాల్సి ఉంటుందని రేటు ఫిక్స్ చేశారు వర్మ. అసలే లాక్ డౌన్ కరువులో ఉన్నారో ఏమో కాని.. స్వీటీ పాప ‘నగ్నం’ చూసేందుకు పోటీ పడ్డారు నెటిజన్లు. ఏకంగా తొలి అరగంటలోనే 23,560 టిక్కెట్లు అమ్ముడు కాగా.. ఈ లఘు చిత్రం మొదటి 12 గంటలలో 70 లక్షల రెవెన్యూ తీసుకొచ్చింది. ఇక తొలి 20 గంటల్లో ఏకంగా 35445 పెయిడ్ వ్యూస్ వచ్చాయి. సోమవారం నాటికి కోటిని క్రాస్ చేసి సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది ‘నగ్నం’. అయితే సినిమా ఎగబడి చూసిన వాళ్లు ఇందులో ఏం లేదని తేల్చేసినా.. వర్మ కాన్సెప్ట్ అది కాదు కదా. సినిమాపై క్లిక్ చేసేలా చేయడమో కావడంతో వర్మ ‘నగ్నం’తో సూపర్బ్ సక్సెస్ అయ్యాడు. ఒకవైపు బడా నిర్మాతలు పెద్ద పెద్ద సినిమాలు తీసి ఎలా విడుదల చేయాలా అని తలల పట్టుకుంటుంటే.. లక్ష రెండు లక్షలతో సినిమాలు ఆర్జీవీ కొత్త పంథాలో ముందుకు వెళ్తున్నాడు. ఇదిలా ఉంటే.. ఇంతకీ వర్మ ఈ సినిమాను ఎంత బడ్డెట్‌తో తీశాడు అంటే.. కొంత మంది ఐదు లక్షలు అని.. ఇంకొంత మంది లక్ష అంటూ లెక్కలు చెప్పారు. మూవీ క్రిటిక్ మహేష్ కత్తి అయితే ఓ అడుగు ముందుకు వేసి.. ‘‘అంటే మీరు ఒప్పుకోరుగానీ... వర్మ "నగ్నం" రాజమౌళి 'బాహుబలి' రికార్డుల్ని బద్దలుకొట్టింది. లక్ష రూపాయల ఖర్చుతో తీసిన ఈ లఘు చిత్రం మొదటి 12 గంటలలో 70 లక్షల రెవెన్యూ తీసుకొచ్చింది. ఇప్పుడు చెప్పండ్రా...వాట్ టు డూ వాట్ నాట్ టు డూ!?!’’ అంటూ వర్మ నగ్నం కలెక్షన్లపై పోస్ట్ పెట్టాడు. కత్తికి క్లోజ్ ఫ్రెండ్‌ అయినా వర్మ.. కలెక్షన్లు ఓకే కాని.. ఖర్చు లక్ష అని రాశావ్ ఏంటి మిత్రమా? అంటూ అర్థరాత్రి పూట కత్తి మహేష్‌కి ఫోన్ చేసి అసలు బడ్జెట్‌ను రివీల్ చేయడంతో కత్తికి కళ్లు బైర్లు కమ్మాయట. ఈ విషయన్ని సోషల్ మీడియాలో షేర్ చేసి ‘నగ్నం’ చిత్రానికి అయిన బడ్జెట్ కేవలం రూ.2 వేలు మాత్రమే అని స్వయంగా వర్మ చెప్పాడంటూ బాంబ్ పేల్చేడు కత్తి మహేష్. ‘వర్మ గారికి కోపమొచ్చింది. అర్ధరాత్రి అంకమ్మ చివాలన్నట్లు ఇందాకే వర్మ ఫోన్. ఏంటయ్యా నా "నేకెడ్" ఫిల్మ్ బడ్జెట్ ఒక లక్ష అనిరాశావ్? అన్నారు. ఏమోనండి అంతకు మించిన ఖర్చు అందులో ఏమీ కనిపించలేదు. అందుకే లక్ష అని డిసైడ్ అయ్యాను, అని క్లియర్ గా చెప్పేసా. అందుకు ఆయన నవ్వుతూ... నన్ను అడిగితే నేను అసలు ఖర్చు చెప్పేవాడినిగా అన్నారు. గురుడు ఎన్నో పెగ్గులో ఉన్నాడో ఏమో అనుకుంటూ. చెప్పండి అన్నా.. జస్ట్ రెండు వేలు... అక్షరాలా INR 2000 అని బాంబ్ పేల్చాడు. అదేం లెక్కండి అని నేను అడిగేలోపే, లెక్క తేల్చేశాడు. ఆ నౌఖరు పాత్ర చేసిన కుర్రాడి ట్రావెల్ ఖర్చు రెండు వేలు తప్ప ప్రొడక్షన్ ఖర్చు ఏం లేదు. కెమెరా, ఎడిటింగ్ మిక్సింగ్ అన్ని మా దగ్గరే జరిగాయి. ఏ ఖర్చూ లేకుండా అని నిజం చెప్పారు. ఏమిటి ఈయన? ’అంటూ ‘నేకెడ్-నగ్నం’ బడ్జెట్-కలెక్షన్స్ వివరాలను తెలియజేశాడు వర్మ వీరాభిమాని కత్తి మహేష్. అసలే వర్మ.. ఆపై అర్థరాత్రి ఫోన్.. అదీ కత్తి మహేష్‌కి... ఆ రాత్రిలో ‘నగ్నం’ చిత్రంపై డిస్కషన్.. బడ్జెట్ రూ.2 వేలు అని చెప్పడం.. ఇదేదో నమ్మబుల్‌గా లేదు కాని. సినిమాని చూసిన చాలా మంది అయితే హా.. ఈ సినిమాకి అంతకంటే ఖర్చు ఎక్కువ కాదులే అంటూ కత్తి కామెంట్స్‌పై స్పందిస్తున్నారు. మరీ రెండు వేలేనా?? నటించిన వాళ్లకి కనీసం భోజనం కూడా పెట్టలేదా? అని నెటిజన్లు డౌట్స్ రైజ్ చేస్తుంటే.. ‘ఫిల్మ్ ప్రొడక్షన్ లెక్కలోకి వచ్చే ఖర్చు వేరు. కాస్ట్ ఆఫ్ ఆర్గనైజేషన్ వేరు. ఆల్రెడీ జీతాలు ఇస్తున్నవాళ్ళతో పని చేయించుకుని ఓవర్ హెడ్స్‌లో కలపొచ్చు. కానీ వర్మ అలా చెయ్యలేదు’ అంటూ క్లారిటీ ఇస్తున్నాడు కత్తి. ఇదీ పాయింటే కదా.!


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3dFr1mc
v

Rgv: అల్లు అర్జున్, రానా పేర్లు తీస్తూ రామ్ గోపాల్ వర్మ కామెంట్స్.. ఆ ఇద్దరి కారణంగా!!

బాలీవుడ్ యువ నటుడు సుశాంత్ ఆత్మహత్య తర్వాత సినీ ఇండస్ట్రీలో నెపోటిజం అనే అంశంపై పలు చర్చలు నడుస్తున్నాయి. నటీనటులు, ప్రేక్షకులు అంతా ఈ బంధుప్రీతి గురించే మాట్లాడుకునే పరిస్థితులు వచ్చేశాయి. సినీ వారసులకే అవకాశాలు, స్టార్ స్టేటస్ తప్ప టాలెంటెడ్ యాక్టర్స్ ఎవ్వరికీ కనిపించరనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి. ఈ క్రమంలో డైరెక్టర్ కీలక వ్యాఖ్యలు చేశారు. బాలీవుడ్ ప్రముఖుల వస్తున్న విమర్శలు, ఇండస్ట్రీలో నెపోటిజం లాంటి అంశాలపై వస్తున్న ఆరోపణలను ఆయన ఖండించారు. సినీ ఇండస్ట్రీలో బంధుప్రీతి ద్వారానే స్టార్ స్టేటస్ కొట్టేయడం ఎవరి తరం కాదని అన్నారు. రియల్ నెపోటిజం అంటే స్టార్ హీరోల కుమారులందరూ స్టార్ హీరోలు కావాలి.. కానీ అలా జరగడం లేదే అంటూ ఆసక్తికరంగా స్పందించారు వర్మ. హిందీలో ఫిరోజ్ ఖాన్, అమితాబ్ లాంటి హీరోలు తమ కుమారులను స్టార్ హీరోలుగా చేశారా? అని ఆయన ప్రశ్నించారు. Also Read: ఈ సందర్భంగా.. గతంలో జరిగిన ఓ విషయాన్ని వర్మ ప్రస్తావించారు. కొన్నేళ్ల క్రితం తనను ఓ తమిళ నటుడు కలిశాడని... , కోసం అల్లు అరవింద్, దగ్గుబాటి సురేశ్ బాబు తన కెరీర్ నాశనం చేశారని చెప్పాడని సంచలన వ్యాఖ్యలు చేశారు. బన్నీ, రానాను ఇండస్ట్రీలో నిలబెట్టేందుకు నన్ను తొక్కేస్తున్నారని, తెలుగులో మా లాంటి వాళ్లకు థియేటర్లు ఇవ్వడం లేదని ఆ హీరో చెప్పినట్లు వర్మ పేర్కొన్నారు. అయితే ఇలాంటి ఆరోపణలు చేయడం పనికిరాని వాళ్ళ పని అంటూ వర్మ చెప్పడం హాట్ ఇష్యూ అయింది. థియేటర్లో ఎవరి మూవీ చూడాలనేది పూర్తిగా ప్రేక్షకుడి ఛాయిస్ మాత్రమే. ప్రేక్షకుడి ఆధరణే ఉంటేనే ఆ సినిమా ఆడటం, హీరోకి స్టార్ స్టేటస్ తీసుకురావడం జరుగుతుంది. అంతేగానీ ఓ స్టార్ హీరోనో, నిర్మాతనో తలచుకొంటే తమ కొడుకులను స్టార్ హీరోలు చేయడమనేది జరిగే పని కాదని వర్మ అన్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/38oq8h3
v

Jr.Ntr: బెదిరింపులు ఆపండి.. తారక్ గతం గురించి తెలిస్తే..! హీరోయిన్ పాయల్ ఘోష్

చిత్రసీమలో నెపోటిజం (బంధు ప్రీతి) అనే అంశంపై గత కొన్నేళ్లుగా తీవ్ర దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే. అయితే ఇటీవలే డిప్రెషన్‌తో సుశాంత్ బలవన్మరణానికి పాల్పడటంతో నెపోటిజంపై ఆగ్రహ జ్వాలలు రగులిపోతున్నాయి. పలువురు నటీనటులు ఈ అంశంపై నోరువిప్పి చిత్రసీమలో జరుగుతున్న వ్యవహారం, సీక్రెట్స్ బయటపెట్టేస్తున్నారు. టాలెంట్ ఉన్న నటీనటులను పక్కన బెట్టి కేవలం కొంతమంది వారసత్వం నుంచి వచ్చిన నటులకు అవకాశాలు ఉస్తున్నారనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి. ఈ పరిస్థితుల్లో యంగ్ టైగర్ ఎన్టీఆర్‌కి మద్దతిస్తూ రంగంలోకి దిగిన పాయల్ ఘోష్‌కి‌ సోషల్ మీడియా నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తోంది. కూడా నెపోటిజం ప్రొడక్టే అంటూ ఆమెను ట్యాగ్ చేస్తూ మెసేజీలు పెడుతున్నారు నెటిజన్లు. దీంతో అదే సోషల్ మీడియా ద్వారా మరోసారి రియాక్ట్ అయిన పాయల్.. ఎన్టీఆర్‌కి తానెందుకు మద్దతు ఇస్తున్నానన్న విషయాన్ని మీరు ఎప్పటికీ అర్థం చేసుకోలేరని పేర్కొంటూ, తనకు బెదిరింపులు వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేసింది. Also Read: సినిమా కోసం తారక్ పడే కష్టం ఏంటనేది ఎవ్వరికీ తెలియదని పాయల్ తన ట్వీట్‌లో తెలిపింది. తారక్ గతం గురించి తెలుసుకున్నాక తనకు కన్నీళ్లు ఆగలేదని, ఏడ్చేశానని పేర్కొంది. అతని పట్ల జాలి చూపించాలని కోరింది. ఇకపోతే ఇకనైనా బెదిరింపులు ఆపాలని కోరిన పాయం ఘోష్.. ఆ బెదిరింపుల కారణంగా డైరెక్ట్ మెసేజ్ ఆప్షన్ తొలగించానని చెప్పింది. తెలుగు చిత్రసీమకు 'ప్రయాణం' సినిమాతో పరిచయమైన .. ఆ తర్వాత ఎన్టీఆర్ హీరోగా వచ్చిన 'ఊసరవెల్లి' సినిమాలో నటించింది. అయినప్పటికీ టాలీవుడ్‌లో సరైన గుర్తింపు రాకపోవడంతో బాలీవుడ్ బాట పట్టింది. తాజాగా ఇలా ఎన్టీఆర్‌కి మద్దతిస్తూ ఆమె కామెంట్స్ చేయడం సినీ వర్గాల్లో హాట్ టాపిక్ అయింది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3g7IeGw
v

శ్యామ్ కె నాయుడు కేసులో కొత్త ట్విస్ట్.. బెయిల్ రద్దు, ఫోర్జరీ కేసు

తనను పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడని ప్రముఖ సినిమాటోగ్రాఫర్ శ్యామ్ కె నాయుడుపై నటి హైదరాబాద్‌లోని ఎస్.ఆర్.నగర్ పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. సుధ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు శ్యామ్ కె నాయుడుని అరెస్ట్ చేశారు. అయితే, రిమాండ్‌కు తరలించిన రెండు రోజులకే బెయిల్ మీద బయటకు వచ్చారు. సాయి సుధతో తాను రాజీ కుదుర్చుకున్నట్టు నాంపల్లి కోర్టులో శ్యామ్ బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. దీంతో ఆయని కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయితే, శ్యామ్‌కు బెయిల్ ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ సాయి సుధ కోర్టుకెక్కారు. తనతో కాంప్రమైజ్ అయినట్టు శ్యామ్ కె నాయుడు కోర్టుకు సమర్పించిన బెయిల్ పిటిషన్‌లో ఉన్నది తన సంతకం కాదని సుధ వెల్లడించారు. తన సంతకాన్ని ఫోర్జరీ చేశారని కోర్టుకు సుధ తెలియజేశారు. నఖిలీ పత్రాలు సృష్టించి బెయిల్ పొందారని చెప్పారు. దీంతో శ్యామ్ కె నాయుడు పిటిషన్‌ను నాంపల్లి కోర్టు కొట్టివేసింది. ఆయన బెయిల్‌ను కూడా రద్దు చేసింది. అంతేకాకుండా, శ్యామ్ కె నాయుడుపై ఫోర్జరీ కేసును నమోదు చేయాలని పోలీసులను కోర్టు ఆదేశించింది. Also Read: శ్యామ్‌తో ఐదేళ్ల పరిచయం, సహజీవనం శ్యామ్‌ కె నాయుడుతో తనకు ఐదేళ్లుగా పరిచయం ఉందని, 2015 నుంచి సహజీవనం చేస్తున్నామని సాయి సుధ గత నెలలో పోలీసులకు ఫిర్యాదు చేశారు. మొదట్లోనే తనను పెళ్లి చేసుకుంటానని మాట ఇచ్చాడని, అందుకు సంబంధించిన వాయిస్ రికార్డ్స్, చాటింగ్ టెక్ట్స్‌లు తన దగ్గర ఉన్నాయన్నారు. శ్యామ్ ఇంట్లో కూడా తమ విషయం తెలుసని సుధ తెలిపారు. శ్యామ్ అన్నయ్య, ప్రముఖ సినిమాటోగ్రాఫర్ చోటా కె నాయుడు తమకు పెళ్లి చేయిస్తానని మాటిచ్చారన్నారు. అయితే, ఇప్పుడు పెళ్లి గురించి అడిగితే శ్యామ్ కె నాయుడు స్పందించడం లేదని, ఏం చేసుకుంటావో చేసుకో అంటున్నారని సాయి సుధ వాపోయారు. దీంతో శ్యామ్ కె నాయుడు, సుధను విచారణ నిమిత్తం పోలీస్ స్టేషన్‌కు పిలిచిన పోలీసులు వారిద్దరి మధ్య సఖ్యత కుదుర్చేందుకు ప్రయత్నించారు. శ్యామ్ కె నాయుడు అంగీకరించకపోవడంతో ఆయన్ని అరెస్టు చేశారు. ఆ తరవాత బెయిల్‌పై శ్యామ్ విడుదలయ్యారు. ఇప్పుడు బెయిల్ రద్దు కావడంతో మళ్లీ జైలుకు వెళ్లనున్నారు. అంతేకాదు, చీటింగ్ కేసుతో పాటు ఫోర్జరీ కేసు కూడా ఆయనపై పెట్టనున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2ZdupiQ
v

‘మా గంగానది’ ట్రైలర్: ఆలీ కూతురు సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ

ఆలీ, నియా హీరో హీరోయిన్లుగా రూపొందిన చిత్రం ‘మా గంగానది’. ‘అంత ప్రవిత్రమైనది స్త్రీ’ అనేది ఉప‌శీర్షిక‌. ర‌వికుమార్ స‌మ‌ర్పణ‌లో మూకాంబికా ప్రొడ‌క్షన్స్ బ్యాన‌ర్‌పై వి.నాగేశ్వర‌రావు, సూర్యవంత‌రం, ఎం.ఎన్‌.యు.సుధాక‌ర్ నిర్మించారు. వి. బాలనాగేశ్వర‌రావు ద‌ర్శక‌త్వం వహించారు. ఈ చిత్రంలో కుమార్తె బేబీ జువేరియా న‌టించ‌డం విశేషం. ఈ సినిమా ట్రైల‌ర్‌ను ఆలీ తాజాగా విడుద‌ల చేశారు. ఈ సందర్భంగా ఆలీ మాట్లాడుతూ.. ‘‘సాధార‌ణంగా మ‌నం న‌టించిన సినిమా టీజ‌ర్, ట్రైల‌ర్‌ను మ‌రొక‌రితో విడుద‌ల చేయిస్తుంటాం. కానీ క‌రోనా వ‌ల్ల అంద‌రూ భౌతిక దూరం పాటించాల్సి వ‌స్తుంది. అందుక‌ని నా సినిమా ట్రైల‌ర్‌ను నేనే గెస్ట్‌గా మారి విడుద‌ల చేస్తున్నాను. సినిమాలో తొలిసారి సీరియస్ పాత్ర చేశాను. ఇందులో నా కుమార్తె పాత్రలో నా కూతురు జువేరియా న‌టించింది. జువేరియాను స్క్రీన్‌పై చూడాల‌నేది వాళ్ల అమ్మ ఆశ. Also Read: చిన్నప్పుడు స్క్రీన్‌పై న‌న్ను చూసుకుని మా అమ్మ ఎలా సంతోష‌ప‌డిందో, నా భార్యకు కూడా మా అమ్మాయిని స్క్రీన్‌పై చూసి ఆనంద‌ప‌డాల‌ని ఎప్పటి నుంచో కోరిక‌. ఈ సినిమాతో ఆ కోరిక తీరింది. కేర‌ళ అమ్మాయి నియా హీరోయిన్‌గా న‌టించింది. ఇంకా చాలా మంది న‌టీన‌టులు నటించారు. హీరోగా ఇది నాకు 53వ సినిమా. లాక్‌డౌన్‌కి ముందే సినిమా రెడీ అయ్యింది. డిఫ‌రెంట్ కాన్సెప్ట్‌తో రూపొందిన ఈ చిత్రం అంద‌రికీ న‌చ్చుతుంద‌నే న‌మ్మకం ఉంది. ప్రేక్షక దేవుళ్ల ఆశీర్వాదం త‌ప్పక ఉంటుంద‌ని భావిస్తున్నాం’’ అని అన్నారు. డైరెక్టర్ వి. బాల నాగేశ్వరరావు మాట్లాడుతూ.. ‘‘ప్రస్తుత సమాజంలో జరుగుతున్న అన్యాయాలపై ముఖ్యంగా స్త్రీ సమస్యలపై రూపొందిన చిత్రమిది. ఈ చిత్రంలో ఆలీ గారి చిన్న కుమార్తె జువేరియా కూడా న‌టించ‌డం విశేషం. తప్పకుండా ఈ సినిమాను ఆశీర్వదించాల‌ని కోరుకుంటున్నాను’’ అని అన్నారు. కాగా, ఈ చిత్రానికి సునీల్ కశ్యప్ సంగీతం సమకూర్చారు. ప్రవీణ్ వనమాలి సినిమాటోగ్రఫీ అందించారు. ఈవీవీ సత్యనారాయణ ఎడిటర్. కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం వి. బాల‌నాగేశ్వర‌రావు. ‘మా గంగానది’ ట్రైలర్


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2BTmGOU
v

‘కృష్ణ అండ్ హిజ్ లీల’కు హిందూవాదం సెగ.. బోయ్‌కాట్ నెట్‌ఫ్లిక్స్ ట్రెండింగ్

సిద్ధు జొన్నలగడ్డ హీరోగా రవికాంత్ పెరెపు దర్శకత్వంలో తెర‌కెక్కిన ‘కృష్ణ అండ్ హిజ్ లీల’ చిత్రం వివాదంలో చిక్కుకుంది. ఈ సినిమాపై ఇప్పటికే సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు. సినిమాలోని ప్రధాన నటీనటులకు హిందూ దేవతల పేర్లను ఉపయోగించారని రాకేష్ అనే వ్యక్తి సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం చర్చనీయాంశమైంది. సోషల్ మీడియాలో ప్రస్తుతం ఈ సినిమాకు వ్యతిరేకంగా హిందూవాదులు విరుచుకుపడుతున్నారు. సినిమా మాధ్యమం మరోసారి హిందూమతాన్ని అవమానించిందని మండిపడుతున్నారు. ‘కృష్ణ అండ్ హిజ్ లీల’ సినిమా గురువారం (జూన్ 25న) నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన సంగతి తెలిసిందే. ఇదొక రొమాంటిక్ డ్రామా. ముగ్గురు అమ్మాయిలతో కృష్ణ రొమాన్స్ చేస్తాడు. సినిమాలో రొమాన్స్ కూడా కాస్త ఎక్కువగానే ఉందనే టాక్ కూడా వచ్చింది. దీంతో సినిమాలోని ప్రధాన పాత్రలకు దేవుళ్ల పేర్లు పెట్టి రొమాన్స్ నడిపించడం వల్ల వివాదం మొదలైంది. ఈ సినిమాను స్ట్రీమింగ్ చేస్తున్న కారణంగా నెట్‌ఫ్లిక్స్‌ను బోయ్‌కాట్ చేయాలనే ప్రచారం మొదలైంది. ట్విట్టర్‌లో #BoycottNetflix టాప్ ట్రెండింగ్‌లో ఉంది. Also Read: ఒక తెలుగు సినిమాకు సంబంధించి దేశ వ్యాప్తంగా నెట్‌ఫ్లిక్స్‌పై ఈ స్థాయిలో వ్యతిరేకత రావడం గమనార్హం. అయితే, నెట్‌ఫ్లిక్స్ వ్యతిరేకంగా జరుగుతోన్న ఈ ప్రచారాన్ని కొంత మంది వ్యతిరేకిస్తున్నారు. ‘కృష్ణ అండ్ హిజ్ లీల’ నెట్‌ఫ్లిక్స్ ఒరిజినల్ కానీ, సిరీస్ కానీ కాదని.. ఇండియన్స్ తీసిన సినిమా అని.. అలాంటప్పుడు సినిమా తీసినవారిని ప్రశ్నించడం మాని నెట్‌ఫ్లిక్స్‌ను బోయ్‌కాట్ చేయడమేంటని ప్రశ్నిస్తున్నారు. ఒకవేళ ఈ సినిమా థియేటర్‌లో విడుదలై ఉంటే ఎవరిని ప్రశ్నించేవారని అడుగుతున్నారు. మొత్తానికి ‘కృష్ణ అండ్ హిజ్ లీల’ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యింది. అంతేకాదు, ఈ ఉచిత ప్రచారం వల్ల తెలుగు రానివారు కూడా ఈ సినిమాలో ఏముందోనని చూసే అవకాశం ఉంది. కాగా, ఈ సినిమాలో శ్రద్ధా శ్రీనాథ్, సీరత్ కపూర్, షాలిని వాడ్నికట్టి హీరోయిన్లుగా నటించారు. రానా ద‌గ్గుబాటి ఈ చిత్రాన్ని స‌మ‌ర్పించారు. సురేష్ ప్రొడ‌క్షన్స్, వయాకామ్ 18 సంస్థలు నిర్మించాయి.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2NE7eZJ
v

తమన్నా టాక్ షో: మిల్కీ బ్యూటీ షాకింగ్ రెమ్యునరేషన్!!

మిల్కీ బ్యూటీ కేవలం హీరోయిన్‌గా మాత్రమే కాకుండా స్పెషల్ సాంగ్స్‌తోనూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఈ ఏడాది ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాలో ‘డాంగ్ డాంగ్’ అంటూ అదిరిపోయే స్టెప్పులతో ఆడియన్స్‌ను అలరించారు. తమన్నా ఇండస్ట్రీకి వచ్చి 15 ఏళ్లు కావస్తున్నా.. ఆమె క్రేజ్ మాత్రం ఇంకా తగ్గలేదు. ప్రస్తుతం తమన్నా ఆచితూచి పాత్రలను ఎంపిక చేసుకుంటున్నారు. మంచి స్క్రిప్ట్‌లు వస్తేనే అంగీకరిస్తున్నారు. అలాగే, తనకు ఇష్టమైన డ్యాన్స్‌ను ప్రదర్శించడానికి స్పెషల్ సాంగ్స్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ఇప్పటి వరకు వెండితెరపై ప్రేక్షకులను అలరించిన తమన్నా.. ఇప్పుడు బుల్లితెరపై సందడి చేయబోతున్నారట. ఓటీటీలోకి ఆమె అడుగుపెడుతున్నారని సమాచారం. ప్రముఖ నిర్మాత అల్లు అర్జున్ నెలకొల్పిన ‘ఆహా’ ఓటీటీ ప్లాట్‌ఫాం కోసం తమన్నా ఒక టాక్ షో చేస్తున్నట్టు ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. ఈ టాక్ షోలో అల్లు అర్జున్, రామ్ చరణ్, రవితేజ వంటి స్టార్ హీరోలను తమన్నా ఇంటర్వ్యూ చేయబోతున్నారని తెలిసింది. Also Read: ఈ టాక్ షోలో 20 ఎపిసోడ్స్ ఉంటాయని టాక్. అయితే, ఈ టాక్ షో కోసం తమన్నా భారీగా పారితోషికం తీసుకుంటున్నారని సమాచారం. ఒక్కో ఎపిసోడ్‌కు తమన్నా రూ. 7 లక్షలు రెమ్యునరేషన్ తీసుకుంటున్నారని అంటున్నారు. అంటే, 20 ఎపిసోడ్లకు కలిపి సుమారు కోటిన్నర రెమ్యునరేషన్ తీసుకుంటారని టాక్. ప్రస్తుతం తమన్నా ఒక సినిమాకు తీసుకునే పారితోషికం కన్నా ఈ టాక్ షోకు తీసుకోబోతోన్న రెమ్యునరేషనే అధికమట. ఈ ప్రచారంలో నిజమెంతో తెలీదు కానీ.. దీని వల్ల ఈ టాక్ షో మాత్రం కచ్చితంగా పాపులర్ అవుతుంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2Bbg6ni
v

అందరూ బాధ్యతగా ఉండాలి.. కరోనా విజృంభనపై మహేష్ మెసేజ్

కరోనా వైరస్ మన దేశంలోకి ప్రవేశించిన తొలిరోజుల్లో ప్రజలు భయాందోళనకు గురవుతున్నప్పుడు సినీ తారలు ధైర్యం చెప్పారు. ఆందోళన చెందవద్దని జాగ్రత్తలు పాటిస్తే కరోనా నుంచి బయటపడవచ్చని ప్రజలకు సూచించారు. మెగాస్టార్ చిరంజీవి, , ఎన్టీఆర్, రామ్ చరణ్.. ఇలా ఎంతో మంది స్టార్ హీరోలు వీడియో మెసేజ్‌ల ద్వారా ప్రజలను చైతన్యం చేశారు. అయితే, లాక్‌డౌన్ సమయంలో వైరస్ వ్యాప్తి పెద్దగా లేకపోయినా.. లాక్‌డౌన్ నుంచి సడలింపులు ఇచ్చిన తరవాత కరోనా విజృంభన మొదలైంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో రోజురోజుకి కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. ఒక్క హైదరాబాద్ నగరంలోనే ప్రతిరోజూ 500కు పైగా కేసులు నమోదవుతున్నాయి. ఇలాంటి సమయంలో మనమంతా బాధ్యతగా వ్యవహరించాలి అంటున్నారు సూపర్ స్టార్ మహేష్ బాబు. ప్రజలంతా జాగ్రత్తతో, బాధ్యతతో వ్యవహరించి కరోనాతో పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆయన సోమవారం ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పోస్ట్ పెట్టారు. Also Read: ‘‘లాక్‌డౌన్ నుంచి సడలింపులు ఇచ్చినప్పటి నుంచీ కేసుల సంఖ్య క్రమంగా పెరిగిపోతోంది. మనల్ని మనం కాపాడుకునే సమయం ఇది. అలాగే, మన చుట్టూ ఉన్నవాళ్లను కూడా కాపాడాలి. బయటికి వెళ్లే ప్రతిసారి మాస్క్ ధరించండి. మీ చుట్టుపక్కల నుంచి జాగ్రత్తగా ఉండండి. భౌతిక దూరాన్ని పాటించండి. అన్ని జాగ్రత్తలూ పాటించండి. అలాగే, ఆరోగ్య సేతు యాప్‌‌ను డౌన్‌లోడ్ చేసుకోండి. పాజిటివ్ కేసులను ట్రాక్ చేయడానికి ఈ యాప్ సహాయపడుతుంది. కోవిడ్ పాజిటివ్ ఉన్న ఎవరైనా మీకు దగ్గరగా వచ్చినా అలర్ట్ చేస్తుంది. ఆరోగ్య భద్రత, అత్యవసర సేవలను సులభంగా పొందొచ్చు. అందరం భద్రతగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి, బాధ్యతగా ఉండాలి’’ అని తన పోస్ట్‌లో మహేష్ పేర్కొన్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3iflq9y
v

ముద్దంటే భయమేస్తోంది.. హగ్స్, కిస్‌లు నా వల్లకాదు: రెజీనా

దక్షిణ భారత సినీ పరిశ్రమలోని ప్రతిభావంతులైన నటీమణుల్లో ఒకరు. అందం, అభినయం రెండూ సమపాళ్లలో ఉన్న నటి ఆమె. ‘ఎస్ఎంఎస్ - శివ మనసులో శృతి’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన రెజీనా.. ఆ తరవాత ‘కొత్త జంట’, ‘పవర్’, ‘పిల్లా నువ్వులేని జీవితం’, ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’ సినిమాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. ‘అ!’ సినిమాలో తన రూపం, నటనతో అందరినీ ఆశ్చర్యపరిచారు. రొమాంటిక్ సీన్స్‌లో నటించడానికి తాను ఏమీ సిగ్గుపడనని గతంలో రెజీనా చాలా సార్లు చెప్పారు. కొంత మంది హీరోలకు లిప్ లాక్‌లు కూడా పెట్టారు. ‘పవర్’లో రవితేజతో, ‘రారా కృష్ణయ్య’ సినిమాలో సందీప్ కిషన్‌తో హాట్ లిప్ లాక్ సీన్స్‌లో రెజీనా నటించారు. కొత్త ట్రెండ్ సెట్ చేయడానికి తాను ఇలాంటి సీన్స్‌లో నటించడానికి వెనకడుగు వేయనని రెజీనా చెబుతుంటారు. కానీ. ఇప్పుడు తన నిర్ణయాన్ని ఆమె వెనక్కి తీసుకున్నారు. రొమాంటిక్ సీన్స్‌లో తాను నటించబోనని అంటున్నారు. Also Read: ఇటీవల మీడియాతో ముచ్చటించిన రెజీనా తన రాబోయే చిత్రాల్లో ఇంటిమేట్ సీన్స్ గురించి మాట్లాడారు. ప్రస్తుతం కరోనా వైరస్ విజృంభిస్తోన్న నేపథ్యంలో కౌగిలించుకోవడం, ముద్దులు పెట్టుకోవడం వంటి సన్నివేశాలు చేయడానికి తనకు భయమేస్తోందని రెజీనా చెప్పారు. తన రాబోయే చిత్రాల్లో ఇలాంటి రొమాంటిక్ సన్నివేశాల్లో తాను నటించబోనని స్పష్టం చేశారు. ముద్దు సన్నివేశాల్లో నటించడం తనకు కాస్త ఇబ్బందిగానే అనిపిస్తుందని చెప్పారు. కానీ, కథకు అవసరం అనుకుంటే మన ఇబ్బందులు పక్కనబెట్టి ఇలాంటి సన్నివేశాలు చేయక తప్పదన్నారు. కాగా, విశాల్ ‘చక్ర’ సినిమాలో రెజీనా ఒక కీలక పాత్ర పోషించారు. ఆమెది నెగిటివ్ రోల్ అని అంటున్నారు. ఇప్పటికే ఆమె ‘ఎవరు’ సినిమాలో నెగిటివ్ రోల్ చేశారు. ఇప్పుడు మరోసారి తనలోని వైవిధ్యమైన నటనను రెజీనా బయటపెట్టబోతున్నారని టాక్. తాజాగా విడుదలైన ‘చక్ర’ టీజర్‌లో రెజీనా పాత్రను రివీల్ చేయలేదు. ఈ పాత్రను ప్రత్యేకంగా పరిచయం చేస్తారని అంటున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3ieaVna
v

వాళ్లను ఓదార్చడమే సరిపోయింది నాకు.. రూమర్స్‌పై ఎస్.జానకి మండిపాటు

దిగ్గజ గాయని చనిపోయారంటూ ఆదివారం సోషల్ మీడియాలో వదంతులు వచ్చిన విషయం తెలిసిందే. ఎవరో సోషల్ మీడియాలో పుట్టించిన ఈ తప్పుడు వార్త క్షణాల్లో వైరల్ అయిపోయింది. దీంతో జానకి కుమారుడు మురళీ కృష్ణ స్పందించాల్సి వచ్చింది. తన తల్లి ఆరోగ్యంగా ఉన్నారని, దయచేసి ఇలాంటి రూమర్లు వ్యాప్తి చేయొద్దని ఆదివారం సాయంత్రం మురళీ కృష్ణ వేడుకున్నారు. అలాగే, గానగంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కూడా ఈ రూమర్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి పనికిమాలిన రూమర్లు ఎందుకు క్రియేట్ చేస్తారో అర్థం కావడం లేదని మండిపడ్డారు. తాను జానకి అమ్మతో మాట్లాడానని, ఆమె ఆరోగ్యంగా ఉన్నారని వెల్లడించారు. దయచేసి సోషల్ మీడియాలో పాజిటివిటీని వ్యాప్తి చేయాలని, ఇలాంటి వదంతులతో ఇతరులను బాధపెట్టవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. Also Read: కాగా, ఈ వదంతులపై ఇప్పుడు స్వయంగా జానకి అమ్మ స్పందించారు. ఇలాంటి వదంతులు పుట్టించేవారిపై ఆమె మండిపడ్డారు. ఈ మేరకు ఒక ఆడియో మెసేజ్‌ను విడుదల చేశారు. ‘‘నాపాటికి నేను ఎక్కడో ఉన్నాను. హైదరాబాద్‌లో కూడా లేను మైసూరులో ఉన్నాను. ఆరోగ్యంగా ఉన్నాను. నాకే సమస్యా లేదు. ఎవరో అనవసరంగా పిచ్చిపిచ్చిగా ఏవేవో పెడుతుంటారు. ఇలాంటివి నమ్ముతూ కూర్చుంటే మనం ఏం చేయలేం’’ అని జానకి అసహనం వ్యక్తం చేశారు. ఎంతో మంది ఫ్యాన్స్ ఫోన్ చేసి ఏడుస్తున్నారని.. వాళ్లను ఓదార్చడమే తనకు సరిపోయిందని అన్నారు. తెలిసీ తెలియకుండా పిచ్చిపిచ్చిగా ఇలాంటి వదంతులు ఎందుకు పుట్టిస్తారో అర్థం కావడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘ఉన్నారా లేదా అని తెలుసుకుని పెట్టాలి. వాళ్లకు ఇష్టమొచ్చినట్టు వీళ్లు చచ్చారు.. వాళ్లు చచ్చారు అని పెట్టడమేంటి? హైదరాబాద్‌లో కరోనా మరీ ఎక్కువగా ఉందంటున్నారు. మీరు జాగ్రత్తగా ఉండండి’’ అని తన మెసేజ్‌లో జానకి వెల్లడించారు. ఎస్.జానకి ఆడియో మెసేజ్..


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3icrGPz
v

RGV: రామ్ గోపాల్ వర్మ 'పవర్ స్టార్' సినిమా.. సీనియర్ రచయిత రియాక్షన్ ఎలా ఉందో చూడండి!

పలు డిఫరెంట్ కాన్సెప్ట్ సినిమాలతో తెలుగు సినిమా ప్రేక్షకులకు కొత్త టేస్ట్ చూపించిన .. గత కొంతకాలంగా ట్రాక్ చేంజ్ చేసేశారు. తక్కువ బడ్జెట్ సినిమాలు, అడల్ట్ కిక్కిచ్చే మూవీలు రూపొందిస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. ఈ క్రమంలోనే రీసెంట్‌గా ''క్లైమాక్స్, నగ్నం'' మూవీలు తెరకెక్కించి సెన్సేషన్ క్రియేట్ చేసిన ఆయన.. పేరుతో పవన్ కళ్యాణ్‌ని టార్గెట్ చేస్తూ మరో సినిమా ప్రకటించడంతో అంతా షాకయ్యారు. పవర్ స్టార్ టైటిల్‌తో సినిమా అనౌన్స్ చేసిన వర్మ.. ఈ సినిమాలో పాత్రలకు సంబంధించిన వివరాలను కూడా చెప్పేశారు. నలుగురు పిల్లలు, ఒక రష్యన్ యువతి, అలాగే 8 బర్రెలు సినిమాలో ఉంటాయని వ్యంగ్యంగా ఆయన చేసిన ట్వీట్ హాట్ టాపిక్‌గా మారింది. ఆర్జీవీ చేసిన ఈ ప్రకటన చూసి పవన్ ఫ్యాన్స్ కాసింత మండిపడ్డారు. అయితే తాజాగా ఈ మూవీ ప్రకటనపై సీనియర్ రచయిత రియాక్ట్ కావడం మరింత సెన్సేషన్ అయింది. Also Read: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌పై వర్మ మూవీ ప్రకటించిన వెంటనే.. రామజోగయ్య శాస్త్రి ట్విట్టర్లో స్పందిస్తూ తాను హర్ట్ అయినట్లు పేర్కొన్నారు. తన కాలేజీ రోజుల్లో శివుడిని ఆరాధించాక మణిరత్నంని, ఆ తర్వాత ఆర్జీవీని అంతగా ఆరాధించేవాడినని చెబుతూ ఆవేదన వ్యక్తం చేశారు. ''మిమ్మల్ని చూసి మన తెలుగువాళ్లకూ ఒక మణిరత్నం అనుకున్నాం. కానీ ఇప్పుడు మీరేమో నా ఇష్టం అని చెప్పి ఏవేవో చేస్తున్నారు. పోండి సార్ మీతో కటీఫ్.. మీరేమీ రిప్లై ఇవ్వక్కర్లేదు. ఇచ్చినా తెలివిగా ఏదో చెప్పేస్తారు...నేను హర్ట్ అయ్యా'' అని ట్వీట్ చేశారు రామజోగయ్య శాస్త్రి. చూడాలి మరి ఈయన లాగే ఈ 'పవర్ స్టార్' సినిమాపై ఇంకెంతమంది రియాక్ట్ అవుతారో!.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2ZkqAbH
v

మూడు రోజులుగా ఫోన్ల మీద ఫోన్లు.. ఆ రూమర్ ఎవరు క్రియేట్ చేశారో గానీ: రేణు దేశాయ్

పవన్ మాజీ భర్య, హీరోయిన్ .. మరోసారి ముఖానికి రంగేసుకోబోతోందని గత కొన్ని రోజులుగా సోషల్ మీడియా కోడై కూస్తోంది. 'జాని' మూవీ తర్వాత తిరిగి వెండితెరపై కనిపించని ఆమె నటన విషయమై కీలక నిర్ణయం తీసుకుందని, మహేష్ బాబు నిర్మాణంలో రూపొందుతున్న కొత్త సినిమాలో నటించేందుకు ఓకే చెప్పిందనే వార్తలు జోరందుకున్నాయి. తాజా ఇంటర్వ్యూలో ఈ విషయంపై రియాక్ట్ అయింది రేణు. ఇప్పటివరకూ ఇదే తాను విన్న అతి పెద్ద రూమర్ అంటూ చమత్కరిస్తూనే అట్టి వార్తలను ఖండించింది. మహేష్ సినిమాలో తాను నటిస్తున్నట్లు వచ్చిన వార్తలు చూసి.. గత రెండు మూడు రోజులుగా తనకు ఫోన్ల మీద ఫోన్లు వస్తున్నాయని, చాలా మంది ఫోన్ చేసి అభినందనలు చెబుతున్నారని తెలిపింది. కాగా ఇలాంటి వార్తలను తెరపైకి తెచ్చిన వారికి రియల్లీ హ్యాట్సాఫ్ అంటూ తనదైన స్టైల్‌లో స్పందించింది రేణు దేశాయ్. మహేశ్ బాబు సినిమాలో తాను నటించడం లేదని క్లారిటీ ఇచ్చేసింది. Also Read: గతంలో కొన్ని ఇంటర్వ్యూల్లో తల్లి పాత్రల గురించి ప్రస్తావన వస్తే.. హీరోల చిన్నప్పటి పాత్రలకు తల్లిగా చేసేందుకు ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పడం కారణంగానే ఇలాంటి రూమర్స్ పుట్టించారని రేణు తెలిపింది. అదేవిధంగా అకీరా సినీ ఎంట్రీ గురించి కూడా మాట్లాడిన ఆమె.. అతను ఏ వృత్తిని ఎంచుకున్నా ఓ తల్లిగా ప్రోత్సహిస్తానని చెప్పింది. సినీ రంగం లోకి రావడమనేది అతని ఇష్టమే అని తెలిపింది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3eIZsK9
v

మహేష్ బాబుకు అదిరిపోయే గిఫ్ట్ పంపిన రష్మిక

సూపర్ స్టార్ మహేష్ బాబుకు సినీ ప్రముఖుల్లో కూడా అభిమానులు ఉన్నారు. మహేష్‌తో కలిసి నటించే అనేకమంది నటులు ఆయనను ఎంతగానో అభిమానిస్తారు. తాజాగా సరిలేరు నీకెవ్వరు సినిమాలో సూపర్ స్టార్ మహేష్‌తో జతకట్టింది కన్నడభామ . తన నటనతో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. సినిమాలో మహేష్‌ను వేధిస్తోన్న అల్లరిపిల్లగా నటనకు మంచి మార్కులే కొట్టేసింది. దీంతో రష్మికకు కూడా టాలీవుడ్‌లో మంచి ఆఫర్లు వస్తున్నాయి. అయితే లాక్ డౌన్ సందర్భంగా రష్మిక తన ఫ్యామిలీతోనే కలిసి ఉంటుంది. రష్మిక మండన్న కూర్గ్ లోని సుందరమైన హిల్ స్టేషన్‌లో తన తల్లిదండ్రులతో కలిసి లాక్ డౌన్ సమయాన్ని ఎంతో ఆనందంగా గడుపుతోంది. కూర్గ్ ప్రకృతి సౌందర్యం, కొండ పొలాల నుండి గొప్ప పంటలకు ప్రసిద్ది చెందింది. ఈ క్రమంలో కూర్గ్‌లో ఉన్న రష్మిక మహేష్‌కు అదరిపోయే గిఫ్ట్ పంపింది. అవకాడో ఫ్రూట్స్‌తో పాటు...ఆవకాయను ప్యాక్ చేసి మహేష్ ఇంటికి పార్సిల్ పంపింది. పంపిన విషయాన్ని మహేష్ సతీమణి నమ్రత సోషల్ మీడియాలో పోస్టు పెడుతూ అభిమానులకు తెలిపారు. అంతేకాకుండా అద్భుతమైన వాతావరణంలో... నోరూరించే గిఫ్ట్ పంపిన రష్మికకు ఆమె కృతజ్ఞతలు కూడా తెలిపారు. కరోనా లాక్ డౌన్ సమయంలో మాకు అందిన మొట్టమొదటి గిఫ్ట్ ఇదే అంటూ నమ్రతా తెలిపారు. రష్మిక ప్రస్తుతం రెండు ప్రాజెక్టులతో బిజీగా ఉంది. అల్లు అర్జున్ హీరోగా వస్తున్న పుష్ప సినిమాలో రష్మిక హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాన్ని మైత్రి ఫిల్మ్ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. దేవీ శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నారు. రష్మికతో పాటు.. ఈ సినిమాలో జగపతి బాబు, యాంకర్ అనసూయ, వెన్నల కిషోర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. తమిళలంలో సుల్తాన్ టైటిల్‌తో వచ్చిన మరోసినిమాలో కూడా రష్మిక నటిస్తోంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3ibiuL8
v

అయ్యో! పాపం.. తాప్సి పన్నుకి కరెంట్ షాక్!! హీరోయిన్ దిమ్మతిరిగిందట..

ప్రస్తుత పరిస్థితుల్లో జనాలను కరోనా మహమ్మారి కాటేస్తుంటే.. కరెంటు బిల్లులు షాకిస్తున్నాయి. దేశంలో ఎక్కడ చూసినా కరెంట్ బిల్లుల మోత మోగుతోంది. వేలల్లో, లక్షల్లో కరెంట్ బిల్లులు రావడం చూసి షాక్ అవుతున్నారంతా. సామాన్య ప్రజలు మొదలుకొని సెలబ్రిటీల వరకూ అందరి నడ్డి విరుస్తున్నాయి విద్యుత్ సంస్థలు. దీంతో అందరు కూడా విద్యుత్ బోర్డుపై ఓ రేంజ్‌లో మండి పడుతున్నారు. ఈ నేసథ్యంలోనే పలువురు సెలబ్రిటీలు ఇప్పటికే తమకొచ్చిన కరెంటు బిల్లులను సోషల్ మీడియా ద్వారా అందరికీ చూపిస్తూ విద్యుత్ బోర్డులపై దుమ్మెత్తి పోసిన సంగతి తెలిసిందే. తాజాగా తాప్సికి కూడా ఇది తప్పలేదు. ఆమె నివాసముంటున్న ఇంటికి జూన్ నెలకు గాను 36 వేల రూపాయల కరెంట్ బిల్ రావడంతో షాక్ అయిందట . దీంతో ఈ విషయాన్ని వెంటనే ఆమె విద్యుత్ అధికారుల దృష్టికి తీసుకెళ్లింది. Also Read: తనకు ఏప్రిల్ నెలలో 4390, మే నెలలో 3850 రూపాయలు వచ్చిన విద్యుత్ బిల్లు.. జూన్ వచ్చేసరికి ఒక్కసారిగా పెరిగిపోయి 36 వేలు రావడమేంటని ఆమె ప్రశ్నించింది. ఇంతటి పిచ్చి పెరుగుదల గతంలో ఎన్నడూ చూడనేలేదని బోర్డ్ వాళ్లకు ఫిర్యాదు చేసింది. తన అపార్ట్‌మెంట్ ఖాళీగా ఉందని, ఖాళీగా ఉన్నదానికే అంత బిల్లు వస్తే, అందులో ఉండి ఉంటే ఇంకెంత బిల్లు వచ్చేదో అంటూ తన ఫిర్యాదులో పేర్కొంది. అయితే ఇది చూసి సంబంధిత ఎలక్ట్రిసిటీ బోర్డ్ సమస్యను పరిష్కరిస్తామని ఆమెకు వివరణ ఇచ్చింది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2VsCL5a
v

వనితా విజయ్‌కుమార్‌ మూడో పెళ్లి.. ఆ ముచ్చట తీరిందో లేదో అప్పుడే కొత్త జంటపై పోలీస్ కేసు

సీనియర్ నటులు మంజుల, విజయ్ కుమార్ దంపతుల పెద్ద కూతురు వనిత విజయ్ కుమార్ ముచ్చటగా మూడో పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. చెన్నై లోని ఓ ఫంక్షన్ హాల్‌లో క్రిస్టియన్ వివాహ పద్దతిలో శనివారం రోజు (జూన్ 27) ఆమె వివాహం జరిగింది. అనే వ్యక్తిని వనితా విజయ్‌కుమార్‌ పెళ్లి చేసుకుంది. అయితే వీరి వివాహం జరిగిన మరునాడే ఈ కొత్త జంటపై నమోదు కావడం హాట్ ఇష్యూగా మారింది. కరోనా పట్ల జాగ్రత్తలు తీసుకుంటూ అతికొద్ది మంది సమక్షంలోనే వనితా విజయ్‌కుమార్‌- పీటర్ పాల్ వివాహం జరిగింది. పెళ్లిలో ప్రత్యేకంగా వైట్ డ్రెస్‌లో ఏంజెల్‌లా కనిపించి భర్తకు ముద్దులు పెడుతూ హల్చల్ చేసింది వనితా విజయ్‌కుమార్. దీంతో ఈ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇంతవరకూ బాగానే ఉన్నా మూడో భర్త అయిన పీటర్ పాల్ మొదటి భార్య ఎలిజిబెత్ హెలెన్ రూపంలో ఈ జంటకు సమస్య ఎదురైంది. Also Read: తనకు విడాకులు ఇవ్వకుండానే పీటర్ పాల్ మరో వివాహం చేసుకున్నాడని పేర్కొంటూ కొత్త జంటపై ఎలిజిబెత్ హెలెన్ పోలీస్ కేసు పెట్టింది.హెలెన్ ఫిర్యాదుతో పోలీసులు కొత్త జంటపై కేసు నమోదు చేశారనేది లేటెస్ట్ సమాచారం. దీంతో జనాల్లో ఈ అంశం పలు చర్చలకు తావిచ్చింది. కాగా 2007లో ఆకాష్‌తో విడాకులు తీసుకున్న వనిత విజయ్‌కుమార్.. 2007లో ఆనంద్ జయ్ రాజన్ అనే వ్యాపారవేత్తను రెండో పెళ్లి చేసుకుంది. ఆయనతోనూ విడాకులు తీసుకొని ముచ్చటగా మూడోసారి వివాహం చేసుకొని పీటర్ పాల్‌ని మూడో భర్తగా పొందింది. తమిళ ప్రేక్షకులకు సుపరిచితమైన వనిత.. తెలుగులో కోడి రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన 'దేవి' సినిమాలో నటించింది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2YEzHoB
v

వకీల్ సాబ్ లీక్: కోర్టులో పవన్ కళ్యాణ్! అది చూడగానే షాకైన దర్శకనిర్మాతలు

ఓ స్టార్ హీరో సినిమాను సక్సెస్‌ఫుల్‌గా ఫినిష్ చేయాలంటే చాలా కష్టం. ఎంతో మంది నిపుణులు, సాంకేతిక వర్గం సహకారంతో సినిమా రూపొందించడం, అది కూడా విడుదలకు ముందు ఎలాంటి లీక్స్ లేకుండా వెండితెరపై బొమ్మపడేలా చూసుకోవడమంటే మామూలు విషయం కాదు. మరోవైపు టెక్నాలజీ పెరుగుతున్నా కొద్ది సినిమా ఇండస్ట్రీని లీకుల బెడద ఎక్కువవుతూ వస్తోంది. తాజాగా పవర్ స్టార్ రీ ఎంట్రీ మూవీ వకీల్ సాబ్‌కు కూడా లీకుల బెడద తప్పలేదు. ‘’ సినిమాలో పవన్ కళ్యాణ్ లాయర్ పాత్ర పోషిస్తున్నారు. ఇప్పటికే మేజర్ పార్ట్ షూటింగ్ జరుపుకున్న ఈ మూవీ గత కొంతకాలంగా కరోనా విజృంభణ వల్ల వాయిదా పడింది. ఈ క్రమంలో సినిమాకు సంబంధించి ఎలాంటి లీక్స్ లేకుండా జాగ్రత్త పడుతూ వస్తున్న చిత్ర యూనిట్‌కి సడెన్ షాక్ తగిలింది. పవన్ కళ్యాణ్ లాయర్ గెటప్‌లో కోర్టులో వాదిస్తున్న స్టిల్ ఒకటి లీక్ అయింది. ఇది కాస్త వెంటనే సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ స్టిల్ ఎలా లీక్ అయ్యిందనే విషయమై ఆరా దీస్తున్నారు యూనిట్ సభ్యులు. Also Read: మెగాస్టార్ తమ్ముడిగా సినీ రంగప్రవేశం చేసి వరుసగా 25 సినిమాలు చేసిన పవన్.. ఆ తర్వాత రాజకీయ బాట పట్టారు. అయితే నిర్మాతల కోరిక మేరకు తిరిగి కెమెరా ముందుకొచ్చిన ఆయన మొదటగా ఈ 'వకీల్ సాబ్' మూవీ చేస్తున్నారు. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాకు వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్నారు. చిత్రంలో పవన్ కళ్యాణ్ సరసన ముగ్గురు హీరోయిన్స్ నివేదా థామస్, అనన్య నాగేళ్ల, అంజలి నటిస్తున్నారు. ఈ ముగ్గురే గాక మరో హీరోయిన్‌కి కూడా స్కోప్ ఉందని సమాచారం.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2CQUblH
v

Sunday 28 June 2020

Jr. Ntr: ఎన్టీఆర్ విషయమై యంగ్ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్.. మీరంతా మూసుకొని ఉండండి అంటూ!!

తెలుగు చిత్రసీమకు 'ప్రయాణం' సినిమాతో పరిచయమైంది హీరోయిన్ . ఆ తర్వాత హీరోగా వచ్చిన 'ఊసరవెల్లి' సినిమాలో మెరిసింది. ఓ పది సినిమాల్లో నటించినా కూడా టాలీవుడ్‌లో ఈ భామకు సరైన గుర్తింపు రాలేదు. దీంతో టాలీవుడ్‌ను వదిలి బాలీవుడ్ బాట పట్టిన ఈ ముద్దుగుమ్మ తాజాగా ఎన్టీఆర్‌పై కామెంట్స్ చేయడం సినీ వర్గాల్లో హాట్ టాపిక్ అయింది. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ బలవన్మరణం తర్వాత అంశం సినీ ఇండస్ట్రీలో చర్చల్లో నిలుస్తోంది. టాలెంట్ ఉన్న నటీనటులను పక్కన బెట్టి కేవలం కొంతమంది వారసత్వం నుంచి వచ్చిన నటులే ఇండస్ట్రీని ఏలుతున్నారనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి. మరోవైపు ఎన్టీఆర్ ఫ్యాన్స్, మీరా చోప్రా మధ్య వివాదం చెలరేగడం.. ఎన్టీఆర్ ఫ్యాన్స్ మీరా చోప్రాను టార్గెట్ చేస్తూ తీవ్ర పదజాలంతో దూషించడం సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. Also Read: అయితే ఈ వివాదంలోకి పాయల్ ఘోష్ ఎంటరై.. ఎన్టీఆర్ మహిళలను ఎంతో గౌరవిస్తాడని చెప్పింది. దీంతో ఎన్టీఆర్ కూడా నెపోటిజం ప్రొడక్టే (నట వారసత్వం) అంటూ.. అతనికి మీరు సపోర్ట్ చేస్తున్నారంటూ నెటిజన్స్ తనకు ట్వీట్స్ పెట్టారని తెలిపింది పాయల్. తాజాగా వీటిపై ట్విట్టర్ వేదికగా వారిపై తీవ్ర స్థాయిలో మండిపడింది. ఎన్టీఆర్‌ని తిట్టేవారికి కచ్చితంగా ఆయన గురించి ఏమీ తెలిసి ఉండదని అనుకుంటున్నా. అతనో హార్డ్ షిప్ ఎంతో కష్టపడి వచ్చాడు. మీరంతా మూసుకుని ఉండండి అంటూ పాయల్ ఘోష్ ట్వీట్ చేసింది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3dDWtRX
v

రజినీకాంత్ ఇంట్లో కరోనా టెన్షన్.. కీలక నిర్ణయం తీసుకున్న సూపర్ స్టార్..!

దేశంలో కరోనా మహమ్మారి ఉదృతి కొనసాగుతోంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, మహారాష్ట్ర రాష్ట్రాల్లో దూకుడుగా ఉండటంతో ప్రజల జీవన విధానం అతలాకుతలమవుతోంది. రోజురోజుకి వైరస్ విజృంభన ఊహించని స్తాయికి చేరుకోవడం అనాదిలోనూ ప్రపంచానికే ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. సాధారణ ప్రజలు, సెలబ్రిటీలు, రాజకీయవేత్తలు ఏ ఒక్కరినీ కరోనా భూతం వదిలిపెట్టడం లేదు. ఇంట్లో కరోనా టెన్షన్ పట్టుకుందని తెలుస్తోంది. దీంతో సూపర్ స్టార్ తీసుకున్నారని వార్తలు వస్తున్నాయి. ఇటీవలే రజినీకాంత్ ఇంటిని కూడా కరోనా తాకినట్లు వార్తలు రావడంతో ఆయన అభిమానులు షాక్ అయ్యారు. కానీ ఆ తర్వాత అది నిజం కాదని తెలిసి ఊపిరి పీల్చుకున్నారు. అయితే లేటెస్ట్ సమాచారం మేరకు కరోనా భయం ఎక్కువ కావడంతో రజినీకాంత్ చెన్నై తన సొంత ఇంటిని వదిలేసి, ఇంటికి దూరంగా ఉన్న ఫామ్ హౌస్‌లో సేద తీరుతున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం. Also Read: ఇక ఇంట్లో పనిచేసే పని మనిషి ఒకరు కరోనా సోకిన వ్యక్తితో కాంటాక్ట్ అయ్యాడని తెలిసి.. పని మనుష్యులను కూడా రావొద్దని చెప్పి కేవలం ఇద్దరు పనిమనుషులకే అనుమతి ఇచ్చారట రజినీకాంత్. మిగితా వారికి కూడా నెల నెలా జీతం ఇస్తున్నారట. ఇలా గత రెండు నెలల నుంచే జరుగుతోందని టాక్. ఇకపోతే ప్రస్తుతం తాను ఉంటున్న ఫామ్ హౌస్‌ నుంచి ఎవ్వరైనా సరే బయటకు వెళ్లడం, బయటివాళ్ళు లోపలికి రావడం పూర్తిగా నిషేధిస్తూ కఠిన నిర్ణయం తీసుకున్నారట రజినీకాంత్. గ్రాసరీకి సంబంధించి కూడా ఏ పనివారినీ బయటకు పంపించకుండా, కేవలం ఫామ్ హౌస్‌లో పండిన కూరగాయాలనే తింటున్నారట. కరోనా పూర్తిగా వెళ్లిపోయే దాకా తిరిగి చెన్నై రావొద్దని, సినిమా షూటింగ్స్‌లో పాల్గొనని డిసైడ్ అయ్యారట రజినీకాంత్.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/388CBFn
v

ఉపాధి లేక కూరగాయలు అమ్ముకుంటున్న బాలీవుడ్ నటుడు

కరోనా వైరస్ అనేక మంది ప్రాణాల్ని బలి తీసుకుంటుంది. దీంతోపాటు మరికొందర్నీ ఉపాధి లేక పస్తులు ఉంచుతోంది. కరోనా కారణంగా విధించిన లాక్ డౌన్‌తో అనేక రంగాలు మూత పడ్డాయి. దీంతో వేలాది మంది ఉపాధి కోల్పోయారు. అన్ని రంగాలపైఈ ఎఫెక్ట్ పడింది. ముఖ్యంగా సినీ పరిశ్రమలో పనిచేసే కార్మికులకు, చిన్న, చిన్న నటుల కష్టాలు మరింత ఎక్కువయ్యాయి. లాక్‌ డౌన్ కష్టాలు కడుపు కాలేలా చేస్తున్నాయి. తాజాగా ఓ నటుడు లాక్ డౌన్ కారణంగా షూటింగ్‌లు లేక కూరగాయలు అమ్ముతూ జీవనం సాగిస్తున్నాడు. బాలీవుడ్ నటుడు జావేద్ హైదర్ కూరగాయలు అమ్ముతున్న వీడియోను బిగ్‌ బాస్ ఫేమ్ డాలీ బింద్రా టిక్‌ టాక్‌ లో షేర్ చేసింది. కరోనా కారణంగా విధించిన లాక్‌ డౌన్ వల్ల అతడికి ఉపాధి కరువైంది. దీంతో అతడు పొట్టకూటి కోసం కూరగాయలు అమ్ముకుంటున్నాడంటూ ఆమె పేర్కొంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇటీవల ఆంధ్రప్రదేశ్ లో ఓ ప్రైవేట్ టీచర్ ఉపాధి లేక అరటిపళ్లు అమ్మిన సంగతి తెలిసిందే. గతంలో బాలీవుడ్ హీరో ఆయుష్మాన్ ఖురానా ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం డ్రీమ్ గార్ల్‌లో ముఖ్య పాత్ర పోషించిన నటుడు సోలంకి దివాకర్‌ కూడా ఉపాధి లేక పండ్లు అమ్ముకున్నాడు. ఇండస్ట్రీలోకి రాకముందు ఆయన పండ్లు, కూరగాయలు అమ్ముకునేవారు. ఇప్పుడు లాక్ డౌన్ వలన షూటింగ్స్ అన్నీ బంద్ కావడంతో తిరిగి పాత వృత్తినే కొనసాగిస్తున్నాడు. గత కొన్ని నెలలుగా ఆయన పండ్లు అమ్ముకుంటూ కుటుంబానికి అండగా నిలుస్తున్నాడు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3iieEjJ
v

ఆమెతో రొమాన్స్ అప్పుడే చేశా కాబట్టి సరిపోయింది.. లేదంటేనా! రొమాంటిక్ ఫొటోలతో హీరో రచ్చ

కరోనా ప్రభావంతో ఒక్కసారిగా పరిస్థితులు మారిపోయాయి. గతంలో అయితే కనిపించిన వారందరికీ షేక్ హ్యాండ్స్ ఇస్తూ హగ్గింగులతో విష్ చేసే మనం.. ఇప్పుడు మాత్రం అత్యంత ఆప్తులు, సన్నిహితులు కలిసినా కనీసం షేక్ హ్యాండ్ కూడా ఇవ్వలేకపోతున్నాం. మనిషి మనిషి మధ్య భౌతిక దూరం, మాస్క్ తప్పనిసరిగా మారింది. ఇక సినిమా షూటింగ్స్, అందులో రొమాంటిక్ సన్నివేశాలు, ముద్దు సీన్ల సంగతుల గురించి ప్రత్యేకంగా చెప్పాలా? ప్రస్తుతం షూటింగ్స్ రీ ఓపెన్ అయినప్పటికీ రొమాంటిక్ సీన్ అనగానే జంకి పోతున్నారు హీరోహీరోయిన్లు. సరిగ్గా ఈ పరిస్థితుల్లో కరోనాకు ముందు చేసిన రొమాంటిక్ సీన్ ఫోటోను, ఒకవేళ అదే సీన్ ఇప్పుడే చేస్తే ఎలా ఉంటుందనే ఫోటోను పోల్చుతూ ఆ రెండు పిక్స్ షేర్ చేసి ఆసక్తి రేకెత్తించారు హీరో . ప్రస్తుతం ఆయన 'హెల్మెట్' అనే మూవీ చేస్తున్నారు. ఇందులో అపర్ శక్తి సరసన ప్రసూతన్ హీరోయిన్‌గా నటిస్తోంది. కథానుసారంగా ఈ మూవీలో హీరోయిన్ కళ్ళలోకి చూస్తూ హత్తుకునే ఓ సన్నివేశం ఉంది. కరోనా, లాక్‌డౌన్ కంటే ఆ రొమాంటిక్ సీన్ ఫినిష్ చేసింది చిత్రయూనిట్. Also Read: అయితే ఆ రొమాంటిక్ సీన్ తాలూకు పిక్ షేర్ చేసిన హీరో అపర్ శక్తి ఖురానా.. ఆ సీన్ కరోనా కంటే ముందే కంప్లీట్ చేసాం కాబట్టి సరిపోయింది లేదంటే ముఖానికి షీల్డ్ పెట్టుకుని ఇలా నటించాల్సి వచ్చేది అంటూ మరో ఫోటో షేర్ చేశారు. దీంతో ఈ రెండు ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలు చూసి.. అయ్యో! పాపం, హీరోహీరోయిన్ల రొమాన్స్‌కి గడ్డు రోజులొచ్చాయంటూ వెరైటీగా కామెంట్స్ పెడుతున్నారు నెటిజన్లు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2Vs6Th2
v

దిగ్గజ గాయని ఎస్.జానకి ఇకలేరంటూ తప్పుడు ప్రచారం.. ఎస్పీ బాలు ఆవేదన

దిగ్గజ గాయని ఇకలేరనే వదంతులు ఆదివారం సాయంత్రం సోషల్ మీడియాలో విపరీతంగా వ్యాప్తి చెందాయి. ఈ తప్పుడు సమాచారాన్ని సోషల్ మీడియాలో చూసిన ఆమె అభిమానులు షాక్‌కు గురయ్యారు. ఇక ఆమె కుటుంబ సభ్యులు అయితే తీవ్ర ఆందోళన చెంది తరవాత జానకి అమ్మ ఆరోగ్యంపై స్పష్టత ఇచ్చారు. జానకి అమ్మ ఆరోగ్యంపై ఇలాంటి వదంతులు దయచేసి వ్యాప్తి చేయొద్దని ప్రతి ఒక్కరినీ విజ్ఞప్తి చేశారు. కాగా, జానకికి ఒక చిన్న శస్త్రచికిత్స జరిగింది. ప్రస్తుతం ఆమె కోలుకుంటున్నారు. ఈలోపలే ఆమె కన్నుమూశారంటూ వదంతులను ఇంటర్నెట్‌లో వ్యాప్తి చేసేశారు. ఇదిలా ఉంటే, జానకి అమ్మ ఆరోగ్యంపై వచ్చిన రూమర్‌పై గానగంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం స్పందించారు. ఇలాంటి రూమర్లు ఎందుకు పుట్టుకొస్తాయంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఫేస్‌బుక్‌లో ఆయన ఒక వీడియో మెసేజ్‌ను పోస్ట్ చేశారు. ‘‘జానకి అమ్మ ఆరోగ్యం గురించి తెలుసుకోవడానికి ఈరోజు ఉదయం నుంచి నాకు 20 మంది ఫోన్ చేశారు. దీనికి కారణం సోషల్ మీడియాలో కొంత మంది జానకి అమ్మ చనిపోయారంటూ పోస్టులు పెట్టడమే. ఏంటి ఈ అర్థంపర్థంలేని పనులు. నేను ఆమెతో మాట్లాడాను. ఆమె చాలా బాగున్నారు’’ అని బాలు స్పష్టం చేశారు. సోషల్ మీడియాను పాజిటివిటీని వ్యాప్తి చేయడానికి వాడాలని, ఇలాంటి విషయాల్లో చిలిపి చేష్టలు పనికిరావని బాలు ఆగ్రహం వ్యక్తం చేశారు. సోషల్ మీడియాను మంచిని వ్యాప్తి చేయడానికి వాడాలని విజ్ఞప్తి చేశారు. అలాగే, సీనియర్ గాయకుడు మనో కూడా జానకి ఆరోగ్యంపై స్పందించారు. ‘‘ఇప్పుడే జానకి అమ్మతో మాట్లాడాను. ఆమె మైసూరులో ఉన్నారు. ఆమె సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నారు. దయచేసి వదంతులు వ్యాప్తి చేయకండి’’ అని మనో ట్వీట్ చేశారు. కాగా, జానకి అమ్మ వయసు ప్రస్తుతం 82 సంవత్సరాలు. మూడు దశాబ్దాలకు పైగా దక్షిణాది సంగీత ప్రియులను మంత్ర ముగ్ధులను చేసిన గాత్రం జానకి అమ్మది. సినిమా ఇండస్ట్రీలోనే వైవిధ్యమైన గాయని ఆమె. తన సుధీర్ఘ కెరీర్‌లో 45 వేలకు పైగా పాటలు పాడారు. నైటింగేల్ ఆఫ్ సౌత్‌గా పిలుచుకునే జానకి అమ్మ.. మ్యాస్ట్రో ఇళయరాజా సంగీత సారథ్యంలో అత్యధిక పాటలు ఆలపించారు. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ సహా 17 భాషల్లో జానకి అమ్మ పాటలు పాడారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/31qAJGM
v

‘శివన్’ ట్రైలర్: ఇది ప్రపంచంలోనే తొలి ఏటీటీ ఫిలిం

ప్రపంచీకరణ ప్రభావం ఎంటర్‌టైన్మెంట్ మీద కూడా పడింది. డిజిటలైజేషన్ కారణంగా ఎంటర్‌టైన్మెంట్ ప్రజలకు మరింత చేరువైంది. ఆన్‌లైన్ డిజిటల్ ప్లాట్‌ఫాంలలో వివిధ భాషలకు చెందిన బోలెడంత కంటెంట్ ఎంటర్‌టైన్మెంట్ లవర్స్‌కు అందుబాటులోకి వచ్చింది. అందుకే, కరోనా కాలంలో థియేటర్లు మూతబడినా ఓటీటీ ప్లాట్‌ఫాంల ద్వారా ప్రజలు ఎంటర్‌టైన్మెంట్‌ను ఆస్వాదిస్తున్నారు. భాషతో సంబంధం లేకుండా కొత్త కొత్త సినిమాలను వీక్షిస్తున్నారు. వెబ్ ఫిలింస్‌ను ఎంజాయ్ చేస్తున్నారు. వెబ్ సిరీస్‌లు చూస్తున్నారు. లాక్‌డౌన్‌కు ముందు చిత్రీకరణ పూర్తిచేసుకుని, పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుని విడుదలకు సిద్ధంగా ఉన్న సినిమాలను ఓటీటీలో విడుదల చేయాలనే చాలా మంది నిర్మాతలు ఆలోచిస్తున్నారు. ఇప్పటికే కొన్ని సినిమాలు నేరుగా ఓటీటీలో విడుదలయ్యాయి. అయితే, నిన్న మొన్నటి వరకు ఓటీటీనే చాలా మందికి కొత్త. కానీ, ఇప్పుడు ఏటీటీ ప్లాట్‌ఫాం వచ్చింది. అంటే ఎనీటైమ్ థియేటర్. తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన శ్రేయాస్ మీడియా ఈ ఏటీటీ ప్లాట్‌ఫాంలోకి అడుగుపెట్టింది. శ్రేయాస్ ఈటీ పేరుతో డిజిటల్ వరల్డ్‌ను సృష్టించింది. Also Read: అయితే, ఓటీటీ-ఏటీటీ వీటి మధ్య తేడా ఏంటి అనే అనుమానం చాలా మందిలో ఉండొచ్చు. ఓటీటీ ప్లాట్‌ఫాంలను మనం నెలకు లేదంటే ఏడాదికి సబ్‌స్క్రిప్షన్ తీసుకొని దానిలో ఉన్న కంటెంట్‌ను ఎంజాయ్ చేస్తాం. ఏటీటీ అలా కాదు. ఏదైనా సినిమా లేదంటే సిరీస్‌ను ఒకసారి చూడటానికి డబ్బులు చెల్లిస్తాం. ఉదాహరణకు ‘క్లైమాక్స్’, ‘నగ్నం’ సినిమాలకు చెల్లించినట్టు. ఈ రెండు సినిమాలు శ్రేయాస్ ఈటీ ఏటీటీ ప్లాట్‌ఫాంలోనే అందుబాటులో ఉన్నాయి. ‘క్లైమాక్స్’ చూడాలంటే రూ.100, ‘నగ్నం’ చూడాలంటే రూ.200 చెల్లించాలి. ఈ ప్లాట్‌ఫాం సినీ నిర్మాతలకు ఎంతో ఉపకరిస్తుందని చాలా మంది అభిప్రాయం. కాగా, రామ్ గోపాల్ వర్మతో కలిసి చేసిన రెండు చిన్న సినిమాలను మాత్రమే ఇప్పటి వరకు శ్రేయాస్ ఈటీలో విడుదల చేశారు. ఇప్పుడు థియేటర్‌లో విడుదలైన సినిమాలను కూడా ఈ ప్లాట్‌ఫాంలోకి తీసుకొస్తున్నారు. ఈ విధంగా ప్రపంచంలోనే ఏటీటీ ప్లాట్‌ఫాంలో విడుదలైన తొలి సినిమాగా ‘శివన్’ నిలవనుంది. సాయితేజ, తరుణి సింగ్ హీరోహీరోయిన్లుగా శివన్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఈ ఏడాది మార్చి 13న విడుదలైంది. అయితే, సినిమా విడుదలైన కొన్ని రోజుల్లోనే లాక్‌డౌన్ అమల్లోకి రావడంతో ‘శివన్’ గురించి పెద్దగా ఎవరికీ తెలియలేదు. Also Read: అయితే, ఈ సినిమాను ఇప్పుడు శ్రేయాస్ ఈటీలో విడుదల చేస్తున్నారు. ఈ మేరకు ఆదివారం ‘శివన్ ట్రైలర్’ను విడుదల చేశారు. దీంతో ‘302’ మూవీని కూడా శ్రేయాస్ ఈటీలో విడుదల చేస్తున్నారు. ఈ రెండు సినిమాలు కాస్త అడల్ట్ కంటెంట్‌తో కూడిన థ్రిల్లర్ మూవీస్. భవికా దేశాయ్ ప్రధాన పాత్రలో నటించిన ‘302’లో వెన్నెల కిశోర్, రవివర్మ, విజయసాయి, తాగుబోతు రమేష్ కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా కూడా మార్చి 13న విడుదలైంది. మొత్తం మీద శ్రేయాస్ ఈటీ మరో కొత్త ప్లాట్‌ఫాంకు తెరతీసింది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3dGV8K2
v

‘మనం సైతం’ కార్యాలయంలో మొక్కలు నాటిన వి.వి.వినాయక్, పూనమ్ కౌర్

రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌కు టాలీవుడ్ నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. సినీ పరిశ్రమకు చెందిన ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రజలను చైతన్యపరిచేందుకు తమ వంతు ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే సినిమా, టీవీ పరిశ్రమకు చెందిన సెలబ్రిటీలు చాలా మంది మొక్కలు నాటారు. తాజాగా ఈ జాబితాలో దర్శకుడు , నటి చేరారు. హైదరాబాద్‌లోని ‘మనం సైతం’ కార్యాలయం ఆవరణలో నటుడు కాదంబరి కిరణ్‌తో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా వినాయక్ మాట్లాడుతూ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అనే ఇంత పెద్ద కార్యక్రమాన్ని మొదలుపెట్టిన ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్‌కు హృదయపూర్వక ధన్యవాదాలు అని అన్నారు. భావి తరాలకు మనం ఇచ్చే విలువైన బహుమతి లాంటి ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు చాలా సంతోషంగా ఉందని తెలిపారు. Also Read: పూనమ్ కౌర్ మాట్లాడుతూ.. ‘‘కొవిడ్-19 క్లిష్ట పరిస్థితుల్లో చాలా మంది మానవతావాదులు ఎంతో సహాయం చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో సమాజంలో ఎంత మంది మంచి మనుషులు ఉన్నారనే విషయం కూడా తెలుస్తుంది. సంతోష్ గారు గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను ప్రారంభించారు. పర్యావరణాన్ని మనం కాపాడుకోవాలి. కొవిడ్-19 తరవాత కూడా ఈ కార్యక్రమాన్ని కొనసాగించాలి. చాలా రోజుల తరవాత ఇంత మంది జనాలను చూస్తున్నాను. భయపడుతున్నా కానీ చాలా సంతోషంగా ఉంది’’ అని అన్నారు. ‘మనం సైతం’ సాయం నటుడు కాదంబరి కిరణ్ సారథ్యంలోని ‘మనం సైతం’ ట్రస్ట్ కరోనా కాలంలో ఇప్పటికే ఎంతో మందికి ఉచితంగా వంట సరుకులు అందించింది. తాజాగా 230 మందికి నగదు సహాయం చేసింది. ఇందుకు వసుధ ఫౌండేషన్ బాసటగా నిలిచింది. సినిమా రంగ కార్మికులతోపాటు అనేక మంది నిరుపేదలు ఈ నగదు సహాయం అందుకున్నారు. దర్శకుడు వి.వి.వినాయక్, హీరోయిన్ పూనమ్ కౌర్ చేతుల మీదుగా ఆదివారం చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వసుధ ఫౌండేషన్ చైర్మన్ మంతెన వెంకట రామరాజు మాట్లాడుతూ.. ‘కాదంబరి చేస్తున్న నిస్వార్థ సేవను తమ వంతుగా మరింత ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ‘మనం సైతం’కు వసుధ ఫౌండేషన్ చేయూత అందిస్తోంది’ అని అన్నారు. నగదు సహాయం అందించడం చాలా గొప్ప విషయమని వి.వి.వినాయక్ ప్రశంసించారు. ‘నగదు సహాయం అందుకున్న వాళ్ళు అశీర్వదించండి.. అందని వాళ్ళు అందాక ఆగండి. తదుపరి విడతలో తప్పక అందిస్తాం’ అని కాదంబరి అన్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/31plQV6
v

హెబ్బా పటేల్‌తో ‘సరిగమ’ పాడుతోన్న రాజ్ తరుణ్

యంగ్‌ హీరో రాజ్‌ తరుణ్, మాళవిక నాయర్ హీరోహీరోయిన్లుగా వస్తోన్న చిత్రం ‘ఒరేయ్ బుజ్జిగా..’. హెబ్బా పటేల్ కీలక పాత్ర పోషిస్తున్నారు. శ్రీమతి లక్ష్మీ రాధామోహన్‌ సమర్పణలో శ్రీసత్యసాయి ఆర్ట్స్‌ పతాకంపై కె.కె.రాధామోహన్‌ నిర్మిస్తున్నారు. కొండా విజయ్‌కుమార్‌ దర్శకత్వం వహించారు. ఇప్పటికే విడుదలైన టీజర్, పాటలకి మంచి రెస్పాన్స్ వస్తోంది. కాగా ఈ చిత్రం నుండి ‘స‌రిగ‌మ‌ప’ లిరికిల్ సాంగ్‌ను తాజాగా విడుద‌ల చేసింది చిత్ర యూనిట్‌. ‘స‌రిగ‌మ‌గ‌మ‌ గామ హంగామ చేద్దామా.. ప‌ద‌నిస‌నిస నీస్సా నీ నీషా నీద‌మ్మా’ అంటూ హుషారుగా సాగే ఈ పాట‌లో రాజ్‌ తరుణ్ ఎన‌ర్జిటిక్ స్టెప్పులు, హెబా ప‌టేల్ అందాలు యూత్‌ని ఆకట్టుకునేలా ఉన్నాయి. ఈ పాట‌కు వ‌న‌మాలి సాహిత్యం అందించ‌గా మ్యూజిక్ డైరెక్టర్ అనూప్‌ రూబెన్స్ ఆలపించారు. ‘కుమారి 21ఎఫ్’, ‘అంధగాడు’, ‘ఈడోరకం ఆడోరకం’ లాంటి చిత్రాల్లో నటించి తెలుగు సినిమా ప్రేక్షకులను ఆకట్టుకున్న రాజ్‌ తరుణ్, హెబా ప‌టేల్ క‌లిసి న‌టిస్తోన్న మ‌రో చిత్రం ఇది. Also Read: కాగా, ఈ చిత్రంలో వాణీ విశ్వనాథ్‌, నరేష్‌, పోసాని కృష్ణమురళి, అనీష్‌ కురువిళ్ళ, సప్తగిరి, రాజా రవీంద్ర, అజయ్‌ ఘోష్‌, అన్నపూర్ణ, సిరి, జయక్ష్మి, సోనియా చౌదరి, సత్య, మధునందన్‌ ముఖ్యపాత్రలు పోషించారు. నంద్యాల రవి మాటలు రాశారు. ఐ.ఆండ్రూ సినిమాటోగ్రఫీ అందించారు. ప్రవీణ్ పూడి ఎడిటర్. శేఖర్ మాస్టర్ కొరియోగ్రాఫర్. రియల్ సతీష్ ఫైట్స్ డిజైన్ చేశారు. ఈ సినిమా ఈపాటికే విడుదల కావాల్సింది. లాక్‌డౌన్ కారణంగా ఆగింది. థియేటర్లు తెరుచుకున్న తరవాత విడుదల తేదీని ప్రకటిస్తారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3eFTABr
v

పవర్ స్టార్ సినిమా: వర్మపై పూనమ్ ఆగ్రహం.. రహస్యాలు బయటపెట్టిన నటి

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై నటి ఫైర్ అయ్యారు. తాను చిన్న పిల్లగా ఉన్నప్పుడు ఆర్జీవీ అంటే గౌరవం ఉండేదని, ఇప్పుడు ఆయనను చూసి తనకు బాధ కలుగుతోందని అన్నారు. దీనికి కారణం పవన్ కళ్యాణ్‌పై ఆర్జీవీ సినిమాను ప్రకటించడమే. ప్రస్తుత కరోనా సమయంలో ఆన్‌లైన్ ద్వారా వరుసపెట్టి సినిమాలను వదులుతోన్న సంగతి తెలిసిందే. ‘ఆర్జీవీ వరల్డ్ థియేటర్’ పేరిట ప్రేక్షకుల ఇంటి వద్దకే సినిమాలను ఆన్‌లైన్ ద్వారా పంపుతున్నారు. ఇప్పటికే ‘క్లైమాక్స్’, ‘నగ్నం’ అనే రెండు సినిమాలను విడుదల చేసి సంచలనం సృష్టించారు. ఇప్పుడు ‘పవర్ స్టార్’ టైటిల్‌తో సినిమాను రూపొందిస్తు్న్నారు. ఈ మేరకు ఆదివారం ట్విట్టర్ ద్వారా వర్మ ప్రకటించారు. అంతేకాదు, ‘పవర్ స్టార్’ సినిమాలో పవన్ కళ్యాణ్ పాత్ర చేయబోయే నటుడిని కూడా పరిచయం చేశారు. Also Read: ‘‘బ్రేకింగ్ న్యూస్: ఆర్జీవీ వరల్డ్ థియేటర్‌లో నా తరవాత సినిమా టైటిల్ ‘పవర్ స్టార్’. పీకే, ఎంఎస్, ఎన్‌బీ, టీఎస్, ఒక రష్యా మహిళ, నలుగురు పిల్లలు, 8 బర్రెలు, ఆర్జీవీ పాత్రలు ఉంటాయి. ఈ పాత్రలు ఏమిటో అర్థం చేసుకున్నవారికి ఎలాంటి బహుమతులు ఉండవు’’ అని వర్మ ట్వీట్ చేశారు. అయితే, ఈ ట్వీట్‌కు పూనమ్ కౌర్ కౌంటర్ ఇచ్చారు. రామ్ గోపాల్ వర్మపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో తనతో ఆర్జీవీ ప్రవర్తించిన తీరును బయటపెట్టారు. ‘‘అమ్మాయిల మానసిక బలహీనతను పసిగట్టడం, అసభ్యకరమైన భాషను ఉపయోగించమని వారిని ప్రేరేపించడం, తన ట్వీట్స్‌ను పంపి షేర్ చేయమని చెప్పడం, దీని గురించి మీడియాకు తెలియజేయడం వంటి పనులు చేసే ఆర్జీవీ అనే క్యారెక్టర్‌ను కూడా దయచేసి ఈ సినిమాలో పెట్టండి. నేను చిన్న పిల్లగా ఉన్నప్పుడు మీరంటే నాకు ఎంతో గౌరవం. కానీ, ఇప్పుడు మిమ్మల్ని చూస్తే బాధేస్తుంది’’ అని పూనమ్ ట్వీట్‌లో పేర్కొన్నారు. అంతేకాదు, రామ్ గోపాల్ వర్మతో తన అనుభవాన్ని కూడా మరో ట్వీట్‌లో పొందుపరిచారు. ‘‘ఒక వ్యక్తికి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఒక గంటపాటు నాకు బ్రెయిన్‌వాష్ చేసిన ఈ విశ్వాసఘాతుకుడైన డైరెక్టర్ ఫోన్ కాల్‌ను రికార్డు చేసి ఉంటే బాగుండేదని నాకు అనిపించింది. అతను నాకు పంపిన ట్వీట్స్‌ను సంబంధిత వ్యక్తికి నేను అప్పుడే పంపాను. నా అదృష్టం కొద్దీ మీడియాలో కొంత మంది నిజాయతీపరులు ఉన్నారు. లేకపోతే నీ కుట్రలకు నేను బలైపోయేదాన్ని’’ అని వర్మను ఉద్దేశించి పూనమ్ ఆరోపణలు చేశారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2BLT4TI
v

విశాల్ ‘చక్ర’.. విలన్‌గా ఆ హీరోయిన్!!

తమిళ స్టార్ హీరోగా, నిర్మాతగా రూపొందుతోన్న చిత్రం ‘’. శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ సినిమాను తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో నిర్మిస్తున్నారు. ఎం.ఎస్.ఆనందన్ దర్శకుడు. యువన్ శంకర్ రాజా సంగీతం సమకూరుస్తున్నారు. విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ బ్యానర్‌పై విశాల్ నిర్మిస్తున్నారు. బ్యాంక్ రాబ‌రీ, హ్యాకింగ్‌, సైబ‌ర్ క్రైమ్ నేప‌థ్యంలో అత్యుత్తమ సాంకేతిక విలువ‌ల‌తో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈనెల 27న విడుదలైన ట్రైలర్ విశేషంగా ఆకట్టుకుంటోంది. విశాల్ హీరోగా గతంలో వచ్చిన ‘అభిమన్యుడు’ సినిమా స్టోరీ లైన్‌కు దగ్గరగా ఉంది ‘చక్ర’. ఈ సినిమాలోనూ విశాల్ ఆర్మీ ఆఫీసర్‌గా కనిపించనున్నారు. కాకపోతే, ‘అభిమన్యుడు’ సినిమాలో కన్నా ‘చక్ర’లో విశాల్ స్టైలిష్‌గా కనిపిస్తున్నారు. అలాగే, ఈ సినిమా మరింత గ్రాండ్‌గా ఉండనున్నట్టు అర్థమవుతోంది. అయితే, ఈ సినిమాలో విలన్ ఎవరనే విషయాన్ని ట్రైలర్‌లో రివీల్ చేయలేదు. దీనికి సంబంధించి కోలీవుడ్‌లో ఒక రూమర్ చక్కర్లు కొడుతోంది. Also Read: ‘చక్ర’ సినిమాలో రెజీనా కాసాండ్ర నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఈమె పాత్ర సినిమాకు కీలకం కానుందని అంటున్నారు. లేడీ విలన్‌గా రెజీనా కనిపించనుందని టాక్. ఇటీవల ‘ఎవరు’ సినిమాలో రెజీనా నెగిటివ్ రోల్‌ చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో నటనకు గాను రెజీనా విమర్శకుల ప్రశంసలు అందకున్నారు. ఇప్పుడు ‘చక్ర’ సినిమాలో కూడా రెజీనా పాత్ర అదిరిపోతుందట. అయితే, ఈ సినిమాలో మెయిన్ విలన్ ఎవరో తెలియాల్సి ఉంది. మనోబాల, రోబో శంకర్, కెఆర్ విజయ్, సృష్టి డాంగే ఈ చిత్రంలో ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3g4Y1px
v

అబ్బాయిలకు ఎలాంటి బౌండరీస్ లేవు.. లేడీ యాంకర్ వీడియోపై వర్మ క్రేజీ రియాక్షన్

సంచలనాలకు కేరాఫ్ అడ్రస్‌గా ఉంటూ నిత్యం వార్తల్లో నిలవడం కేవలం రామ్ గోపాల్ వర్మకే సాధ్యం. ఎప్పుడూ అప్‌డేట్‌గా ఉంటూ ఏదో ఒక సెన్సేషన్ క్రియేట్ చేసే ఆయన పలు టీవీ చానళ్లకు, యూ ట్యూబ్ చానళ్లకు ఇంటర్వ్యూలు ఇస్తూ ఫన్నీ కామెంట్స్ చేస్తుంటారు. ముఖ్యంగా లేడీ యాంకర్స్‌తో ఆయన మెదిలే తీరు, వాళ్ళను పొగిడే విధానం, వేసే రొమాంటిక్ పంచెస్ అబ్బో! అనిపిస్తుంటాయి. ఈ క్రమంలోనే తాజాగా ఓ బ్యూటిఫుల్ యాంకర్‌తో మాట్లాడుతూ హాట్ హాట్ కామెంట్స్ చేశారు వర్మ. ‘సార్.. రీసెంట్ టైమ్స్‌లో ఏ అమ్మాయిని చూస్తే.. వావ్ అనిపించింది’ అని యాంకర్ అడిగిన ప్రశ్నకు వెంటనే బదులిచ్చిన ఆయన.. ‘‘చాలా మంది అలా అనిపించారు. ఇన్‌క్లూడింగ్ యు’’ అనేయడంలో ఆ యాంకర్ మెలికలు తిరిగిపోయింది. దీంతో ఇందుకు సంబంధించిన క్లిప్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. Also Read: అయితే ఈ వీడియో క్లిప్‌కి ఇంకాస్త మసాలా జోడించి సినిమా పాట బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌తో టిక్ టాక్ వీడియో చేశారు కొందరు వ్యక్తులు. లేడీ యాంకర్‌తో వర్మ ‘నీతో కలిపి’ అనే మాట అనగానే ''అయిపాయె'' అనే పదం వచ్చేలా, బ్యాక్‌గ్రౌండ్‌లో పవన్ కళ్యాణ్ 'ఖుషి' సినిమాలోని పాట మ్యూజిక్ ప్లే అయ్యేలా ఈ వీడియో తయారు చేశారు. ఈ వీడియో చూసిన వర్మ దాన్ని తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేస్తూ..''సోషల్ మీడియాలో క్రియేటివ్‌‌గా ఆలోచించే అబ్బాయిలకు ఎలాంటి బౌండరీస్ లేవు. ఇంటర్వ్యూ చేస్తున్న అమ్మాయిని, నన్ను ఎలా చేశారో మీరే చూడండి'' అని పేర్కొన్నారు. ఇకపోతే ప్రస్తుతం వర్మ ఓటీటీ వేదికలపై కన్నేశారు. ఇందుకోసం ఇటీవలే 'క్లైమాక్స్; రూపొందించి సక్సెస్ అయిన వర్మ.. 'నగ్నం' పేరుతో బోల్డ్ కిక్ ఇచ్చారు. మరోవైపు కరోనా పేరుతో, మర్డర్ పేరుతో ఇంకొన్ని సినిమాలు తీస్తున్నారు. ఇదిలా ఉండగానే పవన్ కళ్యాణ్ కథతో పవర్ స్టార్ మూవీ రూపొందించనున్నట్లు తెలిపి సంచలనం సృష్టించారు వర్మ.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/388XdgA
v

నగ్నం: లోకల్ అమ్మాయి స్వీటీతో వర్మ.. పెట్టింది 5 లక్షలే అయినా! భలే వ్యాపారం చేస్తున్నాడే..

ట్రెండ్ ఫాలో అవుతూ సిచువేషన్ చూసి స్టెప్ తీసుకుంటున్న .. గత కొంతకాలంగా అడల్ట్ మూవీస్ రిలీజ్ చేస్తూ రచ్చ చేస్తున్నారు. అంతకుముందు ఇంటర్నేషనల్ పోర్న్ స్టార్ మియా మాల్కోవాతో 'గాడ్ సెక్స్ అండ్ ట్రూత్' సినిమాతో సంచలనాలు సృష్టించిన ఆయన, ఇటీవలే మరోసారి అదే మియా మాల్కోవాతో 'క్లైమాక్స్' మూవీ రూపొందించి ప్రస్తుత పరిస్థితులను సొమ్ము చేసుకున్నారు. ఓటీటీ వేదికలు, ఆన్‌లైన్ ప్లాట్‌ఫాన్స్‌కి క్రమంగా డిమాండ్ పెరుగుతుండటం గమనించిన రామ్ గోపాల్ వర్మ.. దాన్ని ఎలా క్యాచ్ చేసుకోవాలి అనే మార్గంలోనే అడుగులేస్తున్నారు. ఈ మేరకు ఇప్పటికే ఆర్జీవీ వరల్డ్ థియేటర్ పేరుతో ఓ ఆన్‌లైన్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ ఏర్పాటు చేసి ఆ వేదికపైనే 'క్లైమాక్స్' మూవీ రిలీజ్ చేశారు. రూపాయి ఖర్చు లేకుండా కేవలం తనకు తానే సోషల్ మీడియా ద్వారా సినిమా ప్రమోషన్స్ చేసుకున్న ఆయన, ఒక్కో వ్యూకి 100 రూపాయల పైకం డిసైడ్ చేసి భారీ సొమ్ము కూడగట్టుకున్నారు. దీంతో ఆ రుచి తెలిసి మరిన్ని సినిమాలను లైన్ లోకి తీసుకొచ్చారు. ఈ క్రమంలోనే నిన్న (జూన్ 27) రాత్రి తన లేటెస్ట్ అడల్ట్ మూవీ 'నగ్నం' రిలీజ్ చేసి మరోసారి సొమ్ము చేసుకున్నారు. ఈ సారి లోకల్ అమ్మాయి స్వీటీని నగ్నంగా చూపించి మ్యాజిక్ చేశారు. ఈ మూవీకి 200 రేటు పెట్టినా కూడా జనం ఎగబడి ఎగబడి చూశారు. ఈ మూవీకి మంచి డిమాండ్ ఉందని, వేలల్లో వ్యూస్ వస్తున్నాయంటూ వర్మనే స్వయంగా పేర్కొంటున్నారు. Also Read: ఇది చూసిన ఆడియన్స్ ఈ సినిమాల కోసం వర్మ ఎంత ఖర్చు పెట్టారు. ఎంత పోగు చేసుకుంటున్నారు? అనే దానిపై ఫోకస్ పెట్టారు. ఈ నేపథ్యంలోనే నగ్నం సినిమాకు ఆయన ఖర్చు పెట్టింది కేవలం 5 లక్షలే అని తెలిసింది. ప్రెజెంట్ సినిమా డిమాండ్ చూస్తే మినిమం కోటి రూపాయ‌లైనా వ‌సూల‌య్యేలా కనిపిస్తోంది. దీంతో వర్మ భలే వ్యాపారం చేస్తున్నాడే! అంటూ బడా నిర్మాతలు సైతం ఆశ్చర్యపోతున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/38aadmo
v

Power Star: రామ్ గోపాల్ వర్మ సంచలనం.. ఇతనే పవర్ స్టార్ అంటూ షాకింగ్ వీడియో రిలీజ్

సంచలనాలకు మారు పేరైన మరో సంచలనానికి తెరలేపారు. గత కొంతకాలంగా ఆన్‌లైన్ వేదికలపై హల్చల్ చేస్తూ బోల్డ్ కిక్ ఇస్తున్న వర్మ.. తాజాగా 'పవర్ స్టార్' అంటూ మరో సినిమాను ప్రకటించి సెన్సేషన్ క్రియేట్ చేశారు. ఇప్పటికే పరిటాల రవి, ఎన్టీఆర్ వంటి ప్రముఖుల నిజ జీవితాలపై సినిమా తీసిన వర్మ తాజాగా పవన్ కళ్యాణ్‌పై సినిమా తీస్తున్నానంటూ సోషల్ మీడియా వేదికగా ప్రకటన చేయడం సినీ, రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశం అయింది. బ్రేకింగ్‌ న్యూస్‌... ఆర్జీవీ వరల్డ్ థియేటర్‌లో నేను తీస్తున్న నా తదుపరి సినిమాకు పవర్ స్టార్‌ అని పేరు పెట్టాను. ఇందులో పీకే, ఎమ్మెస్, ఎన్‌బీ, టీఎస్‌, ఓ రష్యన్ మహిళ, నలుగురు పిల్లలు, ఎనిమిది బర్రెలు, ఆర్జీవీ నటిస్తారంటూ ట్వీట్ చేసిన వర్మ.. ఆ తర్వాత కొద్దిసేపటికే తన సినిమాలో 'పవర్ స్టార్' ఇతనే అంటూ ఓ షాకింగ్ వీడియో పోస్ట్ చేశారు. Also Read: ఈ వీడియోలో అచ్చం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గెటప్‌లో ఉన్న ఓ నటుడు.. పవన్ లాగే స్టైల్‌గా నడుస్తూ కనిపించడంతో ఇది సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ వీడియోను తన ట్విట్టర్ ఖాతా ద్వారా షేర్ చేసిన వర్మ.. ''నా కొత్త సినిమా పవర్ స్టార్‌లో స్టార్ ఇతనే. ఆయన నా ఆఫీస్‌కి వచ్చినపుడు తీసిన వీడియో ఇది. ఈ వ్యక్తి ఎవ్వరినైనా పోలి ఉంటే నేనైతే ఏమీ చేయలేను. కావాలని చేసిందైతే కాదు'' అంటూ తనదైన స్టైల్ కామెంట్ చేశారు. గతంలో కూడా ఇలాగే పవన్‌పై సెటైరికల్ కామెంట్స్ చేశారు వర్మ. ''పవన్‌ గారికి తిక్కుంది.. నాకు లెక్కుంది. కానీ లెక్కకన్నా.. తిక్కే అందరికీ నచ్చుతుంది. అందుకే ఆయన సూపర్‌స్టార్‌ అయ్యారు'' అనడం అప్పట్లో వివాదాస్పదం అయింది. మొత్తంగా చెప్పాలంటే వర్మ తీరు చూసి పవన్ అభిమానులు మాత్రం తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3eIVst1
v

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...