Saturday 31 July 2021

హోటల్ రూములో నగ్నంగా వీడియోలు! బలవంతంగా యువ నటి చేష్టలు.. ఇండస్ట్రీలో మరో సంచలనం

ఓ వైపు శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రా కేసు సినీ వర్గాల్లో సంచలనంగా మారగా, ఇప్పుడు అనూహ్యంగా మరో యువనటి పోర్న్ రాకెట్ కేసు తెరపైకి రావడంతో అంతా షాకవుతున్నారు. యువ నటి నందితా దత్తాపై ఓ మోడల్ సంచలన ఆరోపణలు చేసింది. తనను బలవంతం చేసి న్యూడ్ వీడియోలు షూట్ చేసిందని చెప్పడంతో పోలీసులు ఈ ఇష్యూపై కఠిన చర్యలు తీసుకున్నారు. నందితా దత్తాతో పాటు ఆమె అసిస్టెంట్‌ని పోలీసులు అరెస్ట్ చేశారు. నందితా దత్తా, ఆమె ఫొటోగ్రాఫర్ మైనిక్ ఘోష్ ఇద్దరూ కలిసి కొంతమంది మోడల్స్‌తో బలవంతంగా ఓ స్టూడియోలో న్యూడ్ వీడియోలు చేసి వాటిని పోర్నోగ్రఫీ వెబ్‌ సైట్స్‌లో అప్‌లోడ్ చేస్తున్నట్లు తెలియడంతో పోలీసులు అటాక్ చేశారు. న్యూడ్ ఫొటోషూట్ జరిగిన స్టూడియో ఓనర్ బలిగంజ్‌ని కూడా పోలీసులు అదుపులోకి తీసుకొని.. న్యూటౌన్ పోలీస్ స్టేషన్‌కి తరలించారు. స్టూడియోలోని కెమెరా, ఇతర పరికరాలను స్వాధీనం చేసుకొని పలు విషయాలపై లోతుగా విచారణ జరుపుతున్నారు. నందితా దత్తా, తనను బలిగంజ్ స్టూడియోకి తెచ్చి బలి చేసిందని సదరు మోడల్ ఆరోపించింది. తనతో న్యూడ్ వీడియో బలవంతంగా చేయించారని, వద్దని వారిస్తున్నా అస్సలు వినలేదని చెప్పింది. అంతేకాదు తన ఫ్రెండ్స్‌లో ఓ యువతికి వెబ్ సిరీస్ ఆఫర్ ఇప్పిస్తానని చెప్పి కోల్‌కతాలోని న్యూ టౌన్ హోటల్‌కి తీసుకెళ్లి అక్కడి హోటల్ రూములో ఆమెతో నగ్న వీడియోలు షూట్ చేయించిందని ఆమె ఆరోపించింది. దీంతో సినీ ఇండస్ట్రీలో పోర్న్ రాకెట్ వ్యవహారం సంచలనంగా మారింది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3jbnD7u
v

సైలెంట్‌గా కానిచ్చేస్తున్న అనసూయ.. జబర్దస్త్ బ్యూటీ సరికొత్త ప్రయోగం! అసలు మ్యాటర్ లీక్..

జబర్దస్త్ బ్యూటీగా బుల్లితెరపై చేస్తున్న హంగామా అంతా ఇంతా కాదు. హాట్ యాంకర్‌గా వారం వారం ఆడియన్స్ మనసు దోచుకుంటూ ఫుల్ ట్రీట్ ఇస్తోంది. రెగ్యులర్ ప్రోగ్రామ్స్‌తో పాటు స్పెషల్ ఈవెంట్స్ చేస్తూ హవా నడిపిస్తున్న ఈ ముద్దుగుమ్మ.. అటువైపు వెండితెరపై కూడా దూసుకుపోతోంది. 'రంగమ్మత్త' క్యారెక్టర్‌తో ఫుల్ ఫేమ్ సంపాదించి వరుస సినిమా ఆఫర్స్ పట్టేస్తోంది. ఈ నేపథ్యంలోనే అనసూయకు సంబంధించిన ఓ క్రేజీ అప్‌డేట్ వైరల్ అవుతోంది. అనసూయను తమ సినిమాల్లో తీసుకోవడానికి దర్శకనిర్మాతలు క్యూ కడుతున్నా.. పారితోషికం కంటే పాత్రే ప్రధానం అన్న రీతిలో సెలక్టెడ్ సినిమాలు ఎంచుకుంటోంది ఈ జబర్దస్త్ బ్యూటీ. సినిమాల విషయంలో ఆచితూచి అడుగులు వేస్తూ హీరోయిన్ రేంజ్ డిమాండ్ క్రియేట్ చేసుకుంటోంది. కేవలం పారితోషికం కోసం సినిమాలు చేయనని, టీవీ ప్రోగ్రామ్స్ ద్వారా తనకు కావాల్సినంత డబ్బు వస్తోందని చెబుతున్న అనసూయ.. సినిమాల ద్వారా మంచి గుర్తింపు కోసం మాత్రమే ప్రయత్నిస్తున్నానని అంటోంది. ఇప్పటికే చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్న ఈ బ్యూటీ.. సైలెంట్‌గా ఓ సినిమాకు సైన్ చేసి చకచకా షూటింగ్ ఫినిష్ చేస్తోందట. ఈ సినిమాలో అనసూయ పాత్రనే హైలెట్ కానుందని అంటున్నారు. ఇది 6 కథల సమ్మేళనం అని, ఆరు కథల్లో అనసూయ కథ హైలైట్ అవుతుందనే విషయం బయటకొచ్చింది. డిఫరెంట్ కాన్సెప్ట్‌తో రాబోతున్న ఈ మూవీలో అనసూయ ఎయిర్ హోస్టెస్‌గా కనిపించనుందట. ఇప్పటికే పేపర్ బాయ్, విటమిన్-షి సినిమాలతో దర్శకుడిగా అందరిని ఆకట్టుకున్న జయశంకర్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడని, ఇప్పటికే కొంతభాగం షూటింగ్ కూడా కంప్లీట్ చేశారని తెలుస్తోంది. మరికొద్ది రోజుల్లో అనసూయ ఈ సినిమా సెట్స్ మీదకు రానుందని సమాచారం. ప్రస్తుతం అల్లు అర్జున్ హీరోగా రూపొందుతున్న 'పుష్ప' మూవీ షూటింగ్‌తో బిజీగా ఉంది అనసూయ.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3yjviH0
v

తిమ్మరుసు కలెక్షన్స్: బాక్సాఫీస్ వద్ద సత్యదేవ్ పర్‌ఫార్‌మెన్స్.. వసూళ్ల పరంగా రిపోర్ట్ చూస్తే!

కరోనా సెకండ్ వేవ్ దెబ్బకు మూతపడ్డ థియేటర్స్ మళ్ళీ తెరుచుకున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ శుక్రవారం కొత్త సినిమాల హవా కనిపించింది. కరోనా పాండెమిక్ తర్వాత ఆడియన్స్ ముందుకు వచ్చిన ఫస్ట్ మూవీగా '' నిలిచింది. ఈ సినిమాకు తొలి రోజు పాజిటివ్ టాక్ రావడంతో చెప్పుకోదగ్గ కలెక్షన్స్ వచ్చాయి. ఫస్ట్ షో స్లోగానే ఓపెన్ అయినా మౌత్ టాక్ బాగా రావడంతో తర్వాతి షోలు పుంజుకున్నాయి. సినిమాలో నటన, కథపై డైరెక్టర్ గ్రిప్పింగ్ ప్రేక్షకులను ఆకర్షించాయి. దీంతో బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ మార్క్ కనిపించిందని అంటున్నారు. ట్రేడ్ వర్గాలు చెబుతున్న లెక్కల ప్రకారం 'తిమ్మరుసు' మూవీ తొలి రోజుకు గాను 47 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లు తెలుస్తోంది. మొత్తంగా 27 లక్షల రూపాయల షేర్ వచ్చిందని రిపోర్ట్స్ చెబుతున్నాయి. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో సత్యదేవ్ లాంటి హీరో సినిమాకు ఈ రేంజ్ కలెక్షన్స్ వచ్చాయంటే సినిమాకు మంచి ఆదరణే లభించిందని చెప్పుకోవచ్చు. ఇకపోతే ఈ సినిమా బిజినెస్ లెక్క మొత్తం మీద 2.4 కోట్ల దాకా ఉండటంతో బ్రేక్ ఈవెన్ కావాలంటే 2.5 కోట్ల షేర్ రాబట్టాల్సి ఉంది. ఫస్ట్ డే కలెక్షన్స్ తర్వాత చూస్తే మరో 2.30 కోట్ల రేంజ్‌లో షేర్ రాబడితే సేఫ్ అయినట్లు. అయితే ఫస్ట్ డే కన్నా సెకెండ్ డే ఓపెనింగ్స్ బెటర్‌గా ఉన్నాయని తెలుస్తుండటం సినిమాకు బాగా ప్లస్. ఇక మూడో రోజు ఆదివారం కూడా సెలవుదినం కావడంతో ఈ సినిమాకు బెటర్ కలెక్షన్స్ వచ్చే అవకాశాలున్నాయని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. శరణ్‌ కొప్పిశెట్టి దర్శకత్వంలో రూపొందిన ఈ 'తిమ్మరుసు' సినిమాను క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కించి ప్రేక్షకుల ముందుకు తెచ్చారు. సత్యదేవ్, ప్రియాంక జవల్కర్ ప్రధాన పాత్రలు పోషించగా.. బ్రహ్మాజీ కీలక పాత్రలో కనిపించి అలరించారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3liAzes
v

పవన్, మహేష్, ప్రభాస్ మధ్య వార్.. ఈ సంక్రాంతికి బాక్సాఫీస్ షేక్ కావడం ఖాయమే! ఇవీ లెక్కలు

సినీ ఇండీస్ట్రీలో బిగ్గెస్ట్ సీజన్ అంటే సంక్రాంతి. ప్రతి ఏడాది సంక్రాంతికి ఎన్నో సినిమాలు విడుదలై బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తుంటాయి. సంక్రాంతికి తమ సినిమా రిలీజ్ చేస్తే భారీ హిట్ ఖాయం అని కొందరు దర్శకనిర్మాతలు సైతం నమ్మకం పెట్టుకుంటారు. చిన్న, పెద్ద హీరోల సినిమాలతో థియేటర్స్ వద్ద సంక్రాంతి శోభ కనిపిస్తుంటుంది. అయితే వచ్చే ఏడాది సంక్రాంతికి మాత్రం ఏకంగా ముగ్గురు బడా హీరోలు, అది కూడా భారీ ఫాలోయింగ్ ఉన్న స్టార్స్ రంగంలోకి దిగనుండటం జనాల్లో చర్చనీయాంశం అయింది. వరుస విజయాలతో ఫుల్ ఫామ్‌లో ఉన్న సూపర్ స్టార్ ఈ సారి 'సర్కారు వారి పాట' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఈ చిత్రాన్ని సంక్రాంతి బరిలో దింపారు డైరెక్టర్ పరశురామ్. జనవరి 13న మూవీ రిలీజ్ ఉంటుందని చెప్పేశారు. మరోవైపు యంగ్ రెబల్ స్టార్ భారీ సినిమా 'రాధే శ్యామ్' కూడా జనవరి 14న రంగంలోకి దిగుతోంది. ఈ సినిమా కోసం రెబల్ స్టార్ ఫ్యాన్స్ కళ్ళు కాయలు కాసేలా వెయిట్ చేస్తున్నారు. అయితే వీళ్ళతో పోటీగా కూడా సంక్రాంతి బరిలో నిలవబోతున్నారని తెలుస్తుండటం హాట్ టాపిక్ అయింది. మలయాళీ సూపర్ హిట్ మూవీ 'అయ్యప్పనుమ్ కోషియమ్' సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్, రానా హీరోలుగా రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ శరేవేగంగా సాగుతోంది. అయితే ఈ మూవీ రిలీజ్ విషయంలో మేకర్స్ ఓ అంచనాకు వచ్చేశారని సమాచారం. జనవరి 12వ తేదీన విడుదల చేయాలని ఫిక్సయ్యారనే టాక్ బలంగా వినిపిస్తోంది. దీంతో పవన్, మహేష్, ప్రభాస్ మధ్య పోటీ తప్పదని తెలుస్తోంది. మరోవైపు ఈ సంక్రాంతికి ముగ్గురు పెద్ద హీరోలు రంగంలోకి దిగుతుండటంతో ఇన్ని రోజులు వెలవెలబోయిన థియేటర్స్ ఇక కళ సంతరించుకుంటాయని అంతా ఆనందంగా ఉన్నారు. పవన్, మహేష్ఎం ప్రభాస్ ఫ్యాన్స్ ఎవరికివారు ఈ పోటీలో తమ హీరో అంటే తమ హీరోదే విజయం అని నెట్టింట హంగామా చేస్తున్నారు. సో.. చూడాలి మరి ఏం జరుగుతుందనేది!.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3C3i57p
v

ఒలింపిక్ రజత పతాక విజేతపై మాధవన్ సంచలన కామెంట్స్.. ఇలా అన్నారేంటీ..

మీరాభాయ్ ఛాను.. ఇప్పుడు ఈ పేరు తెలియని భారతీయులు లేరు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఒక నిరుపేద కుటుంబం నుంచి వచ్చి.. తన స్వశక్తితో వెయిట్‌లిఫ్టర్‌గా ఎదిగింది మీరా. తన అద్భుతమైన ప్రతిభతో రాష్ట్ర స్థాయిలో, జాతీయ స్థాయిలో ఎన్నో పతకాలను సొంతం చేసుకుంది. తాజాగా ఆమె మరో అద్భుతమైన ఘనతను సాధించింది. ప్రస్తుతం జరిగిన టోక్యో ఒలింపిక్స్‌లో ఆమె భారత్‌కు తొలి పతకాన్ని సాధించింది. 49 కిలోల విభాగంలో ఆమె రజత పతాకం సొంతం చేసుకుంది. ఈ సందర్భంగా మీరాభాయ్‌పై ప్రశంసల వర్షం కురిసింది. అంతేకాదు.. టోక్యో నుంచి దిల్లీ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్న ఆమెకు ఘన స్వాగతం లభించింది. అంతేకాక.. మిజోరాం ప్రభుత్వం ఆమెకు స్పోర్ట్స్ కోటాలో అడిషనల్ సూపరంటెండెంట్ అఫ్ పోలీస్‌గా పదవి కూడా ఇచ్చింది. ఇక ఆ తర్వాత మిజోరాంలోని తన స్వగృహానికి చెందిన ఆమె ముందు నుంచి ఎలా ఉందో అలాగే జీవనం ప్రారంభించింది. ఒలింపిక్స్‌లో పతకం గెలిచాను అనే గర్వం ఏ మాత్రం లేకుండా సాధారణంగా ఉంటుంది. తాజాగా ఆమె నేలపై కూర్చొని భోజనం చేస్తున్న ఫోటో కూడా ఒకటి సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఫోటోపై సర్వత్ర ప్రశంసల వర్షం కురుస్తోంది. ఒలింపిక్స్‌లో పతకం గెలిచాను అనే అహం ఏ మాత్రం లేకుండా చాలా సింపుల్‌గా ఉంటున్న మీరాభాయ్‌ని ఆమె అభిమానులతో పాటు సెలబ్రిటీలు కూడా ప్రశంసిస్తున్నారు. అయితే నటుడు ఈ ఫోటోపై చేసిన కామెంట్లు మాత్రం ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఈ పిక్‌పై స్పందించిన మాధవన్.. ‘అసలు ఇది నిజమేనా.. నేను నమ్మడం లేదు’ అంటూ ఆయన పేర్కొన్నారు. అయితే ఇలా కామెంట్ చేయడం వెనుక ఆయన అంతరార్థం మరోటి ఉంది. ‘ఎలాంటి ఉపాధి లేకపోయినా మహిళలు ఇలానే దృఢ సంకల్పంతో ముందుకు వెళ్లాలి’ అనేది ఆయన ఉద్ధేశం. ప్రస్తుతం ఈ విషయం సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3zTHnmK
v

నేను బతికే ఉన్నా.. చనిపోలేదు: షకీలా వీడియో సందేశం

శృంగార తార చనిపోయిందంటూ వస్తున్న పుకార్లపై స్పందించారామె. తన ఆరోగ్యం పూర్తిగా క్షీణించిందని.. తాను చనిపోయానని వస్తున్న వార్తల్ని ఖండిస్తూ వీడియో విడుదల చేసింది షకీలా. ‘నేను చనిపోయానని వార్తలు వస్తున్నాయి.. అలాంటిది ఏమీ లేదు.. నేను బాగానే ఉన్నాను. పూర్తి ఆరోగ్యంతో హ్యాపీగా ఉన్నాను. తన మొహంంలో చిరునవ్వు చూడండి.. చాలా హ్యాపీగా ఉన్నాను. ఎవరో తప్పుడు ప్రచారం చేస్తున్నారు. నాకు ఏమైపోయిందో అని చాలామంది ఆందోళన చెందారు.. చాలామంది ఫోన్లు చేస్తున్నారు.. మెసేజ్‌లు పెడుతున్నారు. నాపై ప్రేమ చూపించిన వారందరికీ చాలా పెద్ద థాంక్స్. అలాగే నాపై తప్పుడు ప్రచారం చేసిన వ్యక్తికి థాంక్స్.. తనని గుర్తు చేసుకునేలా చేశారు’ అంటూ వీడియో విడుదల చేసింది షకీలా.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/37gzLOI
v

టుడే ఇన్‌స్టా హిట్స్: రుహాని గ్లామర్ హీట్.. రష్మి స్టైలింగ్ ట్రీట్.. వర్రీ కావొద్దంటున్న లావణ్య

వేడెక్కిస్తున్న రుహానీ గ్లామర్ హీట్ ‘చి.ల.సౌ’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన నటి . ఆ తర్వాత ‘హిట్’, ‘డర్టీ హరీ’ వంటి సినిమాల్లో ఆమె నటించి ప్రేక్షకులను అలరించింది. ఆ తర్వాత పెద్దగా సినిమా అవకాశాలు రాకపోయినా.. సోషల్‌మీడియా ద్వారా అమె ప్రేక్షకులకు కావాల్సినంత వినోదాన్ని అందిస్తుంది. తాజాగా తన అందాలను చూపిస్తూ.. ఓ ఫోటోని ఇన్‌స్టాగ్రామ్ ద్వారా షేర్ చేసింది రుహానీ. నీరసంగా ఉంటూనే.. ప్రకాశం అంటే ఇదే అంటున్న మడోనా ‘ప్రేమమ్’ సినిమాతో మంచి హిట్ అందుకొని.. ఆ తర్వాత మలయాళం సినిమాలతో బిజీ అయిపోయింది హీరోయిన్ . మంచి అభినయంతో.. తెలుగు ప్రేక్షకులకు కూడా ఆమె చేరువ అయింది. ప్రస్తుతం నాని నటిస్తున్న ‘శ్యామ్ సింగరాయ్’ సినిమాలో ఆమె ఓ కీలక పాత్రలో నటిస్తోంది. తాజాగా చాలా నీరసంగా కనిపిస్తూ.. కొన్ని పిక్స్‌ని ఇన్‌స్టాగ్రామ్ ద్వారా షేర్ చేసింది మడోనా.. వీటిని తన తల్లి తీసింది అంటూ ఆమె క్యాప్షన్ పెట్టింది. ‘ఎక్స్‌ట్రా’గా నవ్వులు చిందిస్తున్న రష్మి నటిగా ఎన్నో సినిమాలు చేసిన రాని గుర్తింపు ఒకే ఒక టీవీ షోతో సంపాదించుకుంది రష్మి. ‘జబర్ధస్త్’ షోతో యాంకర్‌గా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన ఈ భామ. ఆ తర్వాత పలు టీవీ షోలతో పాటు సినిమాల్లో అవకాశాలు కూడా సంపాదించుకుంది. అయినప్పటికీ.. తనను వెలుగులోకి తీసుకువచ్చిన యాంకరింగ్‌ను మాత్రం ఆమె వదలడం లేదు. ఇక ఈ అమ్మడి ఫోటోషూట్‌లు తరచూ వైరల్ అవుతుంటాయి. తాజాగా చీరలో, నవ్వులు చిందిస్తూ కొన్ని ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పంచుకుంది. తుపాకీ చేపట్టిన గ్యాంగ్‌స్టర్‌గా సన్నీ యాక్షన్ బాలీవుడ్ హాట్ బ్యూటీ గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఓ పాపులర్ రియాల్టీ షోతో ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఆమె.. ఆ తర్వాత హీరోయిన్‌గా మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఇక సోషల్‌మీడియాలో సన్నీ చేసే హంగామా మామూలుగా ఉండదు. తాజాగా కొందరు అబ్బాయిలతో కలిసి గన్ పట్టుకొని.. ఓ గ్యాంగ్‌స్టర్‌లా బిల్డప్ ఇస్తూ ఓ వీడియోని నెటిజన్లతో షేర్ చేసింది సన్నీ. బీచ్ ఒడ్డున లావణ్య.. వర్రీ కావొద్దంటూ.. అందాల రాక్షసి సోషల్ మీడియాలో ఏ రేంజ్‌లో యాక్టివ్‌గా ఉంటుందో అందరికీ తెలిసిందే. ఆమె సినిమా విశేషాలతో పాటు.. తరచూ ఫోటోషూట్‌లు చేస్తూ వాటిని ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో షేర్ చేస్తుంది. తాజాగా బీచ్ ఒడ్డున నిలబడి దిగిన కొన్ని పిక్స్‌ని అభిమానులతో పంచుకుంది. దీనికి ‘డోంట్ వర్రీ.. బీచ్ హ్యాపీ’ అంటూ ఆమె క్యాప్షన్ పెట్టింది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3feWUWi
v

బాడీ షేమింగ్‌పై ‘తిమ్మరుసు’ హీరోయిన్ భావోద్వేగం.. నటన అంటే షేప్, సైజ్‌నా?

సత్యదేవ్ నటించిన ‘తిమ్మరుసు’ చిత్రం విజయవంతం కావడంతో ఫుల్ జోష్‌లో ఉంది హీరోయిన్ ప్రియాంకర్ జవాల్కర్. ఈ చిత్రంలో అను పాత్రలో ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. అయితే ఈ సినిమా క్రైమ్ థ్రిల్లర్ కావడంతో హీరో హీరోయిన్ల మధ్య రొమాన్స్.. డ్యుయెట్స్ లాంటివి పెట్టలేదు. హీరోకి అసిస్టెంట్‌గా ఫుల్ లెంగ్స్ రోల్‌ చేసినప్పటికీ పెద్దగా స్కోప్ లభించలేదు. పెర్ఫామెన్స్ పరంగా ఉన్నంతలో పర్వేలేదు కానీ.. తిమ్మరుసు చిత్రంలో ప్రియాంకర్ జవాల్కర్ బాగా బొద్దుగా కనిపించింది.. ఫేస్‌లో కూడా కళ తప్పినట్టే అనిపించింది. టాక్సీవాలా చిత్రంతో డెబ్యూ మూవీలోనే గ్లామరస్ పెర్ఫామర్ అని అనిపించుకున్న ప్రియాంక జవాల్కర్ .. తిమ్మరుసులో మాత్రం ఓ మోస్తరుగానే కనిపించింది. పైగా బాగా లావు కావడంతో బాడీ షేమింగ్ చేస్తూ కామెంట్లు రావడంతో ఎమోషనల్ అయ్యారు ప్రియాంకర్ జవాల్కర్. శనివారం నాడు ఈ మూవీ సక్సెస్ మీట్ నిర్వహించగా.. హాజరైన ప్రియాంక బాడీ షేమింగ్‌పై కౌంటర్ ఇచ్చారు. హెల్త్ ఇష్యూస్ వల్ల లావు కావాల్సి వచ్చిందని చెప్తూ భావోద్వేగానికి గురయ్యారు. ఆమె మాట్లాడుతూ.. ‘నేను వెయిట్ పెరిగాను.. లాక్ డౌన్ తరువాత కొన్ని హెల్త్ ఇష్యూస్ వచ్చాయి. ఇదే విషయాన్ని ‘తిమ్మరుసు’ చిత్ర దర్శకుడు శరణ్‌కి కూడా చెప్పాను. అప్పుడు ఆయన అన్నారు.. నాకు హీరోయిన్ కావాలి.. మోడల్ కాదు.. పాత్రకు సరిపోయే పెర్ఫామెన్స్ కావాలి అని అన్నారు. ఆయన నమ్మకానికి నేను న్యాయం చేశాననే అనుకుంటున్నాను. ఈ సినిమా కెమెరామెన్ అప్పుకి కూడా చేసి.. సడెన్‌గా ఇలా కనిపిస్తున్నాను.. ఏమనుకుంటారో అని చెప్పాను.. అప్పుడు ఆయన ఒకటే అన్నారు. ‘మీరు హీరోయిన్.. మోడలింగ్ ఏమీ చేయడం లేదు.. మీ పాత్రను మీరు పోషిస్తున్నారు. నీ క్యారెక్టర్ ఎంత నార్మల్‌గా ఉందో అంత రియలిస్టిక్‌గా ఉంది.. ఈ ఛేంజ్ ఇండస్ట్రీలో ఇప్పుడే మొదలైంది అని అన్నారు. ఈ విషయంలో నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నా.. నా లుక్ నాకు గర్వంగానే ఉంది. నా పట్ల నా టీం హ్యాపీగా ఉంది. ఈ చిత్ర నిర్మాత మహేష్.. హీరోయిన్స్ మాత్రమే కావాలని అనుకున్నారు మోడల్స్ కాదు. దర్శకుడు చరణ్ నన్ను నమ్మి ఈ పాత్ర ఇచ్చారు.. నా బాడీ, షేప్ గురించి కాకుండా పెర్ఫామెన్స్‌ని కోరుకున్నందుకు. అలాగే సత్యదేవ్‌కి స్పెషల్ థాంక్స్.. ‘యాక్టింగ్ అంటే.. ఎమోషన్స్ మాత్రమే.. లుక్ అనేది యాక్టింగ్ కంటే ఇంపార్టెంట్ కాదని నాకు చెప్పినందుకు. నేను నటించడానికి వచ్చా.. ఇంకా మంచి సినిమాలు చేస్తా.. మంచి పెర్ఫామెన్స్ ఇస్తా’ అంటూ ఎమోషనల్ అయ్యారు ప్రియాంక జవాల్కర్. ఇక ఈమె నటించిన తొలి చిత్రం టాక్సీవాలా హిట్ కాగా.. తిమ్మరుసు కూడా హిట్ లిస్ట్‌లో చేరింది. ఇక మూడో సినిమా ‘ఎస్. ఆర్. కళ్యాణ మండపం’ ఆగష్టు 6న థియేటర్స్‌లో విడుదల కానుంది. ఈ చిత్రానికి కూడా పాజిటివ్ రెస్పాన్స్ ఉండటంతో హ్యాట్రిక్ కొట్టేట్టుగానే ఉంది ప్రియాంక జవాల్కర్ (). Read Also:


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3zTK5bV
v

ఇది మామూలు రచ్చ కాదుగా.. యాంకర్ ఓంకార్ తమ్ముడి లేటెస్ట్ పోస్టర్ అదిరిపోయింది..

పలు టీవీ షోలలో యాంకర్‌గా తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న వ్యక్తి.. ఓంకార్. నిజంగా చెప్పుకోవాలంటే తెలుగు బుల్లి తెరకు అసలైన రియాల్టీ షోలను పరిచయం చేసిన యాంకర్ అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఇలా తెలుగు ఇండస్ట్రీలో తనకంటూ ఆయన ఓ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్నారు. బుల్లితెరపై తన ప్రతిభను కనబరచిన ఆయన.. వెండితరపై కూడా అద్భుతమైన గుర్తింపు సాధించారు. ‘జీనియస్’ అనే సినిమాతో దర్శకుడిగా వెండితెరకు ఆయన పరిచయం అయ్యారు. ఆ సినిమాతో తన సోదరుడు అశ్విన్‌ బాబుని హీరో‌గా పరిచయం చేశారు ఓంకార్. ఆ సినిమా తర్వాత అశ్విన్ హీరోగా ‘రాజు గారి గది’ అనే సిరీస్‌లో ఆయన నటించిన మూడు సినిమాలు మంచి బ్లాక్‌బస్టర్ హిట్లు అయ్యాయి. అయితే ఓంకార్ సోదరిడిగా మాత్రమే కాకుండా.. నటుడిగా ఈ సినిమాల ద్వారా మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు అశ్విన్. ప్రస్తుతం అతను హీరోగా ఓ సరికొత్త ప్రాజెక్టులో నటించబోతున్నాడు. తన కెరీర్‌లో ఏడవ సినిమాగా రూపొందుతున్న సినిమా ఇది కావడంతో. #AB7 అనే వర్కింగ్ టైటిల్‌తో ఈ సినిమా రూపొందుతుంది. ఈ చిత్రానికి అనిల్ కన్నెగంటి దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీ విగ్నేస్ కార్తీక్ సినిమాస్ బ్యానర్ పై గంగపట్నం శ్రీధర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాకు వికాస్ సంగీతం అందిస్తుండగా.. ఎం.ఆర్.వర్మ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. తాజా ఈ సినిమా నుంచి తొలి పోస్టర్‌ని విడుదల చేశారు. ఈ పోస్టర్‌లో రక్తం ఓడుతున్న చేతితో హీరో మనకు కనిపిస్తున్నాడు. ఇక సినిమా నుంచి ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ని ఆదివారం మధ్యాహ్నం 2.52 గంటలకు విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే తొలి పోస్టర్‌యే ఇంత భయంకరంగా ఉంటే.. ఫస్ట్‌లుక్ ఎలా ఉంటుంది అంటూ ప్రేక్షకులకు కామెంట్ చేస్తున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3j7rnXv
v

‘మై నేమ్ ఈజ్ శృతి’ అంటున్న హన్సిక.. సోషల్‌మీడియాలో షూటింగ్ పిక్స్ వైరల్

‘దేశముదురు’ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన బ్యూటీ . యుక్తవయస్సులోనే ఈ సినిమా చేసినప్పటికీ.. తొలి సినిమాతోనే మంచి పాపులారిటీ సంపాదించుకుంది ఈ భామ. ఆ తర్వాత వరుస సినిమాలు చేస్తూ టాలీవుడ్‌లో వరుస సినిమాలతో ఈ భామ బిజీ అయిపోయింది. అయితే ఆ తర్వాత సీన్ రివర్స్ అయింది. హన్సిక చేసిన సినిమాలు వరుసగా వరుసగా ఫ్లాప్లు అయ్యాయి. దీంతో కాస్త గ్యాప్ ఇస్తూ సినిమాలు చేస్తూ వస్తుంది హన్సిక. కొన్ని రోజుల క్రితం ‘తెనాలి రామకృష్ణ’ అనే సినిమాలో ఈ భామ చివరిసారిగా కనిపించింది. అయితు తాజాగా హన్సిక ప్రధాన పాత్రలో రూపొందుతున్న చిత్రం ‘మై నేమ్‌ ఈజ్‌ శృతి’. ది హిడెన్‌ ట్రూత్‌ అనేది ఉపశీర్షిక. వైష్ణవి ఆర్ట్స్‌ పతాకంపై రమ్య బురుగు, నాగేందర్‌ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రానికి డి. శ్రీనివాస్‌ ఓంకార్‌ దర్శకుడు. ఇటీవల చిత్రీకరణ ప్రారంభమైన ఈ చిత్రం తొలిషెడ్యూల్‌ని పూర్తిచేసుకుంది. ఈ సందర్భంగా దర్శకుడు చిత్ర విశేషాలను తెలియజేస్తూ ‘బ్యాక్‌ అండ్‌ ఫోర్త్‌ స్క్రీన్‌ప్లేతో హన్సిక ఇప్పటి వరకు తన కెరియర్‌లో పోషించనటువంటి సరికొత్త పాత్రలో సస్సెన్స్‌ థ్ల్రిలర్‌ని ఎంజాయ్‌ చేసే ప్రేక్షకులు ఒక మంచి అనుభూతిని కలిగించే చిత్రమిది. ఓ యువతి తన జీవితంలో ఎదురైన సంఘర్షణలను ఎలా ఎదుర్కొన్నది అనేది చిత్ర కథాంశం.ఆగస్టు రెండో వారంలో రెండో షెడ్యూల్‌ని ప్రారంభిస్తాం అన్నారు. మురళీశర్మ, జయప్రకాష్‌, ఆడుకాలం నరెన్‌, రాజా రవీంద్ర తదితరులు ఈ సినిమాలు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఇక తాజాగా విడుదల చేసిన సినిమా షూటింగ్ స్టిల్స్ సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతున్నాయి. ఓ యువతి తన జీవితంలో ఎదురైన సంఘర్షణలను ఎలా ఎదుర్కొన్నది అనేది కథాంశంగా ఈ సినిమా రూపొందుతుంది. ఈ సినిమా నుంచి అప్‌డేట్స్ తెలియగానే హన్సిక అభిమానులు ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమా ఎప్పుడు విడుదల అవుతుందా అంటూ వాళ్లు ఎదురుచూస్తున్నామని సోషల్‌మీడియాలో కామెంట్ చేస్తున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3zW62Hu
v

ఆ విషయంలో ఎందుకు నోరు మెదపరు.. బాలీవుడ్ సీనియర్ హీరోయిన్‌కి పూజా మద్దతు!

ఏ ఇండస్ట్రీలో అయిన సహజంగానే హీరోలకంటే హీరోయిన్ల రెమ్యూనరేషన్ తక్కువగా ఉంటుంది. మొదటి నుంచి పురుషాధిక్యం ఉండటం వల్లనో.. లేదా ఇతర కారణాల చేతనో ఇది ఇప్పటికీ కొనసాగుతూ వస్తుంది. ఒక సాధారణ హీరోకి ఉన్న రెమ్యూనరేషన్ కూడా స్టార్ హీరోయిన్‌కి ఉన్న రెమ్యూనరేషన్ కంటే ఎక్కువగానే ఉంటుంది. అయితే ఒక హీరో ఎక్కువ డబ్బులు డిమాండ్ చేస్తే దాన్ని గొప్పగా చెప్పుకొనే అభిమానులు ఒక హీరోయిన్ ఎక్కువ డబ్బులు డిమాండ్ చేస్తే మాత్రం ట్రోల్ చేస్తారు. అసలు నీకు అంత రెమ్యూనరేషన్ అవసరమా అంటూ నిలదీస్తారు. సరిగ్గా కొద్ది రోజుల క్రితం బాలీవుడ్ సీనియర్ నటి విషయంలో ఇదే జరిగింది. ఓ పౌరాణిక సినిమాలో ఆమెని సీత పాత్రలో నటించాలని కోరాగా.. ఆమె రూ.12 కోట్లు రెమ్యూనరేషన్ డిమాండ్ చేశారట. దీంతో ఆమెపై సోషల్‌మీడియాలో ఆగ్రహజ్వాలలు పుట్టుకొచ్చాయి. ఆమెను ఇండస్ట్రీలో నుంచి తప్పించాలంటూ నెటిజన్లు డిమాండ్ చేయడం ప్రారంభించారు. ‘బాయ్‌కాట్ బెబో’ అంటూ ఓ హ్యాష్‌ట్యాగ్‌ని కూడా సోషల్‌మీడియాలో వైరల్ చేశారు. అయితే దీనంతటికీ కారణం ఆమె ఎక్కువ రెమ్యూనరేషన్ డిమాండ్ చేయడమే అని తెలిసింది. ఈ నేపథ్యంలో పలువు ఇండస్ట్రీ ప్రముఖులు కరీనాకు అండగా నిలిచారు. తాజాగా ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉన్న హీరోయిన్ కూడా కరీనాకు తన సపోర్ట్‌ ఇచ్చింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. ‘‘ఆమెకు ఉన్న మార్కెట్ ప్రకారం ఆమె రెమ్యూనరేషన్ అడిగింది. అలా అడగడంలో తప్పేముంది. హీరోయిన్లు పెద్ద మొత్తం డిమాండ్ చేసినప్పుడు గోల చేసేవాళ్లు.. హీరోలు అలా చేసినప్పుడు నోరు ఎందుకు మెదపరు. అయినా రెమ్యూనరేషన్ అనేది నటుల హక్కు.. అయితే ఎంత ఇవ్వాలి అనేది నిర్మాత నిర్ణయం’’ అని పూజా హెగ్డే పేర్కొంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3lg9CYL
v

ఇస్మార్ట్ హీరో సినిమాపై మరో ఇంట్రెస్టింగ్ అప్‌డేట్.. రామ్‌తో జతకట్టనున్న కన్నడ బ్యూటీ

ఇస్మార్ట్ శంకర్ సినిమాతో భారీ హిట్ అందుకున్న ఎనర్జిటిక్ స్టార్ ఇటీవలే ‘రెడ్’ మూవీతో డీసెంట్ హిట్ ఖాతాలో వేసుకున్నాడు. క్లాస్, మాస్ ఆడియన్స్‌ని ఆకట్టుకుంటూ వెండితెరపై తన మార్క్ చూపిస్తున్న ఈ యంగ్ హీరో తాజాగా మరో సినిమాకు ఆయన కమిట్ అయ్యాడు. తమిళ దర్శకడు దర్శకత్వంలో ఆయన ఓ సినిమా చేస్తున్నారు .‘’ అనే వర్కింగ్ టైటిల్‌తో రూపొందుతున్న ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఈ సినిమాలో రామ్ ఓ పోలీస్ అఫీసర్ పాత్రలో నటించనున్నాడని ఫిలిమ్ నగర్‌లో టాక్ వినిపిస్తోంది. అయితే కొద్ది రోజుల క్రితం ఈ సినిమా నుంచి ఓ ఆసక్తికర అప్‌డేట్ వచ్చింది. ‘అత్తారింటికి దారేది’, ‘మిర్చి’, ‘అ..ఆ’ సినిమాలతో తన సెకండ్ ఇన్నింగ్స్‌ని స్టార్ చేసిన సీనియర్ నటి ‘నదియా’ సినిమాలో ఓ కీలక పాత్రో నటిస్తున్నారని ప్రకటన బయటకు వచ్చింది. అంతేకాక ఈ సినిమాలు తన లుక్‌ని నదియా స్వయంగా ట్వీట్ చేశారు. తాజాగా ఈ సినిమా నుంచి మరో అప్‌డేట్ బయటకు వచ్చింది. కృతి శెట్టితో పాటు ఈ సినిమాలో మరో హీరోయిన్‌ కూడా నటిస్తుందట. ఆమె మరెవరో కాదు.. పలు తమిళ, కన్నడ సినిమాలతో పాటు మన్మథుడు-2 సినిమాలో చిన్న పాత్రలో నటించిన ఈ సినిమాలో నటిస్తుందని చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. అయితే ఈ సినిమాలో అక్షర పాత్ర ఎలా ఉంటుందో.. అది సెకండ్ హీరోయిన్‌గానా.. లేక నెగటివ్ పాత్రలోనా తెలియాలి అంటే ఇంకొన్ని రోజుల వరకూ వేచి చూడాల్సిందే. ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే అలాగే శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై ఈ సినిమాను నిర్మిస్తున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3filfe1
v

Sarkaru Vaari Paata: మహేష్ అభిమానుల ఎదురుచూపులకు రిజల్ట్.. ‘ఫస్ట్ నోటీస్’ మాములుగా లేదుగా..

తమ అభిమాన నటుడు ఏ సినిమాలో నటిస్తున్నాడు.. దానికి దర్శకుడు ఎవరూ.. ఆ సినిమా కథాంశం ఏంటీ అని అభిమానలు ఎంతో ఆతృతతో ఉంటారు. తమ ఫేవరేట్ హీరో సినిమాకు సంబంధించి ప్రకటన వస్తే చాలు దానిపై ఎన్నో ఊహాగానాలు రచిస్తుంటారు. సినిమా ఇలా ఉండబోతుంది.. ఏ రేంజ్‌లో ఉంటుంది అంటు అంచనాలు వేస్తుంటారు. అయితే ప్రకటన వచ్చి చాలాకాలం అయినప్పటికీ.. సినిమా నుంచి సరైన అప్‌డేట్ రాకపోవడం వారికి కాస్తేంటి చాలానే నిరాశపరుస్తుంది. సరిగ్గా ఇదే విషయం సూపర్‌స్టార్ అభిమానుల విషయంలో జరిగింది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా తర్వాత మహేష్‌ని వెండితెరపై అభిమానులు చూడలేదు. ఈ సినిమా తర్వాత ఆయన ‘గీతగోవిందం’ ఫేమ్ దర్శకుడు డైరెక్షన్‌లో ‘సర్కారు వారి పాట’ అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా ప్రకటన వచ్చి చాలాకాలమే అయింది. అయితే కనీసం మహేష్ ముఖం పూర్తిగా కూడా చూపించకుండా ఫస్ట్‌లుక్ పోస్టర్లు వదిలింది చిత్ర యూనిట్. దీంతో మహేష్ అభిమానులు ఆగ్రహంలో మునిగిపోయారు. తమ హీరో సినిమా అప్‌డేట్ ఎప్పుడు వస్తుందా అని వాళ్లు ఎంతో ఆకలిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఆ తరుణం రానే వచ్చింది. కొద్ది రోజుల క్రితం ఈ సినిమా నుంచి అప్‌డేట్స్ వస్తాయని చిత్ర యూనిట్ ప్రకటించింది. అన్నట్లుగానే.. చిత్ర యూనిట్ శనివారం సాయంత్రం మహేష్ అభిమానులకు సర్‌ప్రైజ్ ఇచ్చింది. ఈ సినిమా నుంచి మహేష్ ఫస్ట్‌లుక్‌ని అధికారికంగా విడుదల చేసింది. ఈ ఫస్ట్‌లుక్‌లో మహేష్ కారులోంచి దిగుకుంటూ మంచి క్లాస్ లుక్‌లో కనిపిస్తున్నారు. ఈ పోస్టర్‌ని సూపర్‌స్టార్ మహేశ్ బాబు అధికారికంగా ట్వీట్ చేశారు. ఈ యాక్షన్ మరియు వినోదాన్ని ఈ సంక్రాంతికి మీ అందరితో పంచుకుంటాను అంటూ ఆయన పేర్కొన్నారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్స్‌పై రూపొందుతున్న ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది. ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉన్న థమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3rX1G01
v

బాలయ్య కారుపై తాగుబోతు రాళ్లదాడి.. గాయాలతో కారు దిగిన బాలయ్య ఏం చేశారో తెలిస్తే షాకే!! దటీజ్ లయన్

తెరముందు ఒకలా.. తెరవెనుక ఒకలా ఉండరు బాలయ్య. ఏదైనా ఫేస్ టు ఫేస్.. నచ్చారంటే ప్రాణం ఇస్తారు.. చిరాకు తెప్పిస్తే మాత్రం దబిడిదిబిడే.. ఎనీ సెంటర్ ఎనీ హ్యాండ్ బాబుకి తిక్కరేగిందంటే చెంపలు వాచిపోవాల్సిందే. చివరికి అభిమాని అయినా సరే మోత మామూలుగా ఉండదు. అలాంటిది ఒక తాగుబోతు బాలయ్య ప్రయాణిస్తున్న కారుకి అడ్డంగా వచ్చి.. పెద్ద రాయి తీసుకుని అద్దాన్ని ఫట్ మని కొడితే బాలయ్య ఊరుకుంటారా?? ఆయన్ని ట్రోల్ చేసేవాళ్లు.. నెగిటివ్‌గా మాట్లాడుకునేవాళ్లైతే ఖచ్చితంగా రెండు పీకే ఉంటాడులే అనే అనుకుంటారు. కానీ అక్కడ జరిగిన సీన్ వేరు.. బాలయ్యలో ఈ కోణం కూడా ఉందా? అనిపించేలే రియల్ ఇన్సిడెంట్‌ను షేర్ చేసుకున్నారు నటుడు . ‘లెజెండ్ విజయయాత్రకి మేమంతా బస్‌లో ఊర్లు తిరుగుతున్నాం. ఊరు పేరు నాకు గుర్తు లేదు కానీ.. ఇన్సిడెంట్ జరిగిన ప్రాంతంలో థియేటర్ లేదు కానీ.. పక్క ఊరిలో లెజెండ్ సినిమా ఆడుతుంది.. ఆ థియేటర్‌కి మేమంతా బస్‌లో వెళ్తున్నాం.. కాకపోతే ఈ ఊరు వెళ్లాలంటే ఈ ఊరు మీదుగానే వెళ్లాలి. అయితే తమ ఊరి మీదుగా బస్ వెళ్తుందని తెలుసుకున్న కొంతమంది అభిమానులు బస్ ఆపారు. అయితే ఆ అభిమానుల మధ్యలో నుంచి ఒక వ్యక్తి పెద్ద రాయి తీసుకుని వచ్చి బస్ ఫ్రెంట్ అద్దంపై వేసేశాడు. బస్ అద్దం మొత్తం పగిలిపోయింది. అయితే ఆ అద్దానికి వెనుకనే బస్‌లో నిలబడి ఉన్నారు మన లయన్ బాలయ్య బాబు. ఆయన వెనుకనే బోయపాటి గారు కూడా ఉన్నారు. అద్దం పగిలిపోవడంతో వీళ్లిద్దరికీ చిన్న చిన్న గ్లాస్ పీసెస్ కూడా తగిలి గాయాలయ్యాయి. ఒక్కసారిగా బస్ అద్దం పగిలేసరికి మాకు కంగారు వచ్చేసింది. అయితే ముందు నిలబడి ఉన్న బాలయ్య మాత్రం ఒక్క ఇంచు కూడా కదల్లేదు. ముందు సీట్లో ఉన్న డ్రైవర్ ఆ దెబ్బకి బస్ దిగి బయటకు పారిపోయాడు కానీ.. బాలయ్య మాత్రం ఒక్క అడుగు కూడా కదపలేదు. అయితే ఎవడైతే రాయి విసిరాడో ఆ వ్యక్తి బాగా తాగి ఉన్నాడు. అతన్ని చాలామంది కొడుతున్నారు.. పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని తగిలిస్తున్నారు. ఇంతలో బాలయ్య గారు.. ఆ పగిలిపోయిన అద్దం పెంకులపై కాలు పెట్టి.. ‘ఏయ్ వాడ్ని వదిలేయండి.. ఏమీ అనొద్దు.. పాపం వాడు తాగి ఉన్నాడు’ అనడంతో మేమంతా షాక్ అయ్యాం. అదీ ఆయన వ్యక్తిత్తం. అంత పెద్ద గొడవ జరిగిన తరువాత చాలామంది జనం మమ్మల్ని వెంబడించడంతో బస్సు ముందుకు వెళ్లలేని పరిస్థితి.. బౌన్సర్లు ఉన్నా సరే.. వేలాది మంది జనం ఉన్నారు. ఇలాంటి టైంలో ఆ థియేటర్‌కి ఎలా వెళ్తారు బాబుగారూ అని నేను అడిగా. చూస్తావా?? నేను ఎలా వెళ్తానో అని డోర్ తీసి నన్ను టపక్ మని బయటకు తోసేశారు. నేను జనంలోకి వెళ్లిపోయా.. కుమ్మేశారు నన్ను. థియేటర్ దగ్గరకు వెళ్లడానికి నన్ను పసికి పిసికి పారేశారు. నాకే ఇలా ఉంటే.. ఆయన పరిస్థితి ఏంటి అని వెనక్కి తిరిగా.. ఆయన అలా బస్‌లో నుంచి అడుగు బయటపెట్టారు. జనాలు సముద్రం రెండు పాయలుగా విడిపోయినట్టుగా విడిపోయి బాలయ్యకి దారి ఇచ్చేశారు. ఆయన జనానికి చేయి ఊపుతూ హ్యాపీగా నడుచుకుంటూ వచ్చేశారు. ఒక్కరు కూడా ఆయన దరిదాపుల్లోకి రాలేదు. బౌన్సర్ల అవసరం కూడా రాలేదు. నేను నా కళ్లతో చూసిన విషయం ఇది.. ఆ సీన్ చూసి ఓరి దేవుడా అనుకున్నా’ అంటూ ఆసక్తికరమైన విషయాన్ని తెలియజేశారు నటుడు సమీర్.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3zTk2Bv
v

ఆయనే మా అందరికి ఆదర్శం.. తన తాత ‘రామలింగయ్య’కి అల్లు అర్జున్ నివాళి

తెలుగు కమెడియన్లలో ఆయనదో ప్రత్యేకమైన స్థానం. ఆయన చేసిన కామెడి.. ఆయన బాడీ లాంగ్వేజీని మరెవరూ భర్తీ చేయలేరు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ‘ముత్యాలు.. వస్తావా..’ అంటూ పాడినా.. దానికి స్పూఫ్‌గా ‘రంజు భలే రామ్ చిలకా’ అనే పాటలో హీరోయిన్‌తో చిందులు వేయాలన్నా ఆయనకు ఆయనే సాటి.. ఆయన పద్మశ్రీ . ఎన్నో చిత్రాల్లో ఆయన నటనతో ప్రేక్షకులను రాయలింగయ్య అలరించారు. తనదైన విలక్షణమైన కామెడీతో ఆయన ప్రేక్షకుల మదిలో సుస్థిరమైన స్థానం సంపాదించుకున్నారు. ‘పుట్టిల్లు’ అనే సినిమాతో తన సినీ కెరీర్‌ని ప్రారంభించిన ఆయన.. దాదాపు ఐదు దశాబ్ధాలపాటు తెలుగు ప్రేక్షకులకు హాస్యం పంచారు. హాస్యం మాత్రమే కాదు.. సెంటిమెంట్ సీన్లలో కూడా ఆయన తనదైన ముద్ర వేశారు. వృత్తిరీత్య హోమియోపతి డాక్టర్ అయిన ఆయన స్వతంత్ర సమరంలోనూ పాల్గొని జైలుకు వెళ్లారు. ఇక తెలుగు చలనచిత్రానికి ఆయన అందించన సేవలకు గాను భారత ప్రభుత్వం ఆయనకు పద్మశ్రీ, రాష్ట్ర ప్రభుత్వం రఘుపతి వెంకయ్య అవార్డులను ప్రధానం చేసింది. నేడు (జూలై 31) అల్లు రామలింగయ్య వర్థంతి. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు, కుటుంబసభ్యలు ఆయన్ని గుర్తు చేసుకుంటూ సోషల్‌మీడియాలో పోస్టులు చేస్తున్నారు. ఆయన మనవడు, తాజాగా ఐకాన్ స్టార్‌గా మారిన తన తాతని తలచుకుంటూ ఓ భావోద్వేగ పోస్ట్ చేశాడు. ‘ఓ రైతు, ప్రఖ్యాత నటుడు, అంతకు మించి మంచి మనస్సున్న వ్యక్తి మా తాతగారు.. ఆయన వర్థంతి రోజున ఆయన్ని ఓసారి స్మరించుకుంటున్నాను. మీకు సినిమా మీద ఉన్న అభిలాషే మా అందరికీ వచ్చింది. మా అందరికి ఆదర్శంగా నిలుస్తూ.. మీ ప్రయాణం ఎప్పుడూ కొనసాగుతూనే ఉంటుంది. మీరు ఎప్పటికీ మా గుండెల్లోనే నిలిచిపోతారు’. అంటూ అల్లు అర్జున్ ట్వీట్ చేశాడు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3rM4wET
v

తహశీల్దార్ కార్యాలయంలో ఎన్టీఆర్.. కోట్లు విలువైన భూమి కొనుగోలు కోసమేనట!

నందమూరి నట వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఆ తర్వాత తనకంటూ ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఏర్పర్చుకున్నారు యంగ్ టైగర్ . తన తొలి సినిమా నుంచి నటనలో విలక్షణత చూపిస్తూ.. ప్రేక్షకులను అలరిస్తున్నారు ఆయన. కెరీర్ ఆరంభంలో మంచి సక్సెస్ అందుకున్న తారక్ తర్వాత వరుసగా ఫ్లాప్‌లు చవిచూశారు. అయితే పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ‘టెంపర్’ సినిమాతో మళ్లీ ఫామ్‌లోకి వచ్చారు. ఆ తర్వాత ఆయన వరుస హిట్లలతో మంచి జోష్‌లో ఉన్నారు. ప్రస్తుతం దర్శకధీరుడు ఎస్‌ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న ‘ఆర్ఆర్ఆర్’ అనే సినిమాలో నటిస్తున్నారు తారక్. ఈ సినిమాలో ఆయనకు జోడీగా హాలీవుడ్ బ్యూటీ ఒలివియా మోరిస్ నటిస్తోంది. ఇందులో ఆయన విప్లవ వీరుడు కొమురం భీమ్ పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమా తర్వాత ఆయనకు ‘జనత గ్యారేజ్’ సినిమాతో మంచి హిట్ అందించిన దర్శకుడు కొరటాల శివతో మరో సినిమా చేయనున్నారు తారక్. దీని తర్వాత కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో మరో సినిమా చేయనున్నారు అయన. అయితే ఇక అసలు విషయానికొస్తే.. తారక తాజాగా ఓ చోట అభిమానులకు దర్శనం ఇచ్చారు. అయితే అది సినిమా సెట్టో.. లేక థియేటరో కాదు.. ఎమ్మార్వో ఆఫీస్. కోట్లు విలువజైసే ఒక ఆరున్నర ఎకరాల భూమి కొనుగోలు కోసం ఆయన రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి ఎమ్మార్వో ఆఫీస్‌లో కనిపించారు. తన భూమి రిజిస్ట్రేషన్ కోరకు సంతకాలు పెట్టిన ఎన్టీఆర్.. ఆ తర్వాత అక్కడి ఉద్యోగులు.. అభిమానులతో కలిసి ఫోటోలకు పోజ్‌‌లు ఇచ్చారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్‌మీడియాలో వైరల్ అవుతున్నాయి.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3BSQWEe
v

నెటిజన్లకు షాక్ ఇచ్చిన సమంత.. ఆ ఒక్క అక్షరమే చాలు అంటున్న కుందనపు బొమ్మ

మొదటి సినిమాతోనే తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న నటి సమంతా. ఆ తర్వాత పలు స్టార్ హీరోలతో కలిసి సినిమాల్లో నటించిన ఆమె అనతి కాలంలోనే చాలా పాపులారిటీ సంపాదించుకుంది. ఇక అక్కినేని నట వారసుడు నాగ చైతన్యతో ఆమె ప్రేమాయణం.. ఆ తర్వాత పెళ్లి ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా నిలిచాయి. అక్కినేని కోడలు అయిన తర్వాత.. సమంతకు పాపులారిటీ మరింత పెరిగిపోయింది. ఒకవైపు హీరోయిన్‌గా రాణిస్తూనే.. మరోవైపు యాంకర్‌గా కూడా పలు ప్రోగ్రామ్‌లు నిర్వహిస్తూ ప్రేక్షకులను అలరించారు సమంత. రీసెంట్‌గా ఓటీటీలో కూడా ఆమె అడుగుపెట్టారు. ‘ది ఫ్యామిలీ మ్యాన్’ అనే వెబ్ సిరీస్‌తో ఆమె ప్రేక్షకులను పలకరించారు. ఇంతవరకు ఎన్నడూ చూడని విధంగా ఈ సిరీస్‌లో చేసిన ప్రదర్శన ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ముఖ్యంగా కొన్ని సన్నివేశాల్లో ఆమె ప్రదర్శనపై ప్రశంసల వర్షం కురిసింది. అయితే తాజాగా సమంత మరోసారి వార్తల్లో నిలిచింది. తాజాగా ఆమె తన సోషల్‌మీడియా ఖాతాల్లో అక్కినేని అనే పేరును తొలగించి.. కేవలం ‘ఎస్’ అనే ఒక అక్షరాన్ని మాత్రమే ఉంచింది. అయితే ఇది అభిమానుల మదిలో కాస్త కలవరపాటుని సృష్టించింది. అసలు ఇందుకు కారణం ఏంటీ.. సమంత ఏదైనా అనూహ్యమైన నిర్ణయం తీసుకుందా? లేక.. తన తదుపరి సినిమా శాకుంతంకి సూచనగా ఇలా పెట్టిందా అని ఎవరికి తోచిన విధంగా వాళ్లు ఊహాగానాలు వస్తున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3ffO7TU
v

దాన్ని చూసి కఠిన సత్యాలు తెలుసుకోండి.. సుమంత్ వివరణపై ఆర్జీవీ సెటైర్స్

ఈ మధ్య సినిమాలను ప్రమోట్ చేసుకునేందుకు వింత వింత దారులు తొక్కుతున్నారు. పెళ్లి,ఎంగేజ్మెంట్ అనే వాటిని అడ్డం పెట్టుకుని సినిమాలను జనాల్లోకి తీసుకెళ్తున్నారు. ఇక సోషల్ మీడియాలో ఎప్పుడు ఏది ఎందుకు వైరల్ అవుతుంది.. అది అలా ఎందకు అవుతోంది? అని ఆలోచనలు ఉండవు. అలా ఆ రూమర్ వైరస్‌లా వ్యాప్తి చెందుతూనే ఉంటుంది. మొన్న అంతా కూడా రెండో పెళ్లి గురించి వార్తలు వైరల్ అయ్యాయి. వెడ్డింగ్ కార్డ్ అంటూ ఒకటి చక్కర్లు కొట్టింది. అందులో వివాహానికి సంబంధించిన వివరాలేవీ లేకపోయినా కూడా సోషల్ మీడియా మొత్తం సుమంత్ రెండో పెళ్లి గురించి చర్చించుకుంది. అలా మొత్తానికి తన రెండో పెళ్లి అంటూ వస్తున్న రూమర్లపై క్లారిటీ ఇచ్చారు. అంతకు ముందే వర్మ ఈ సీన్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. పెళ్లి అంటే పెద్ద పెంట.. నీకు ఇంకా బుద్ది రాలేదా? మళ్లీ పెళ్లి చేసుకుంటావా? అని సుమంత్‌ని చెడామడా తిట్టేశాడు. తాను రెండో పెళ్లి చేసుకోవడం లేదని, ఆ వెడ్డింగ్ కార్డ్ తన తదుపరి సినిమా కాన్సెప్ట్‌కు సంబంధించింది అని చెప్పుకొచ్చారు. పెళ్లి, విడాకుల మీద రాబోతోన్న సినిమా అని అసలు విషయం క్లారిటీగా చెప్పారు. మొత్తానికి వాళ్లే లీక్ చేసి ఇలా తమ సినిమాను జనాల్లో హాట్ టాపిక్ అయ్యేలా చేశారని ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. అదెలా ఉన్నా గానీ సుమంత్ ఇచ్చిన వివరణతో కాస్త చల్లబడ్డట్టున్నారు. ఈ విషయం చెప్పినందుకు థ్యాంక్స్ సర్.. ఇదంతా సినిమా కోసమే అని చెప్పినందుకు ఆ దేవుడికి దయ్యానికి థ్యాంక్స్. మళ్లీ మొదలైందది అనే సినిమాను అందరూ చూడండి.. పెళ్లి గురించి కఠిన సత్యాలను తెలుసుకోండి.. పెళ్లి అనేది నరకంలో ప్రమాదవశాత్తు జరిగేదని తెలుసుకోండని వర్మ అన్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3jnIXa3
v

Chiranjeevi : జీవితసత్యాలు ఎప్పటికీ మార్గదర్శకంగా.. అల్లు రామలింగయ్యపై చిరు కామెంట్స్

తెలుగు వారికి పేరును పరిచయం చేయనక్కర్లేదు. నాటి తరం నేటి తరం అని తేడా లేకుండా ప్రతీ ఒక్క తెలుగు వ్యక్తికి ఆయన పేరు తెలుస్తుంది. మరీ ముఖ్యంగా సినీ అభిమానులకు ఆయన ఎప్పుడూ ప్రత్యేకమే. ఆయన వేసిన పాత్రలు, తరతరాలను నవ్వించిన తీరు ఎప్పటికీ చిరస్మరణీయమే. ఎన్టీఆర్ ఏఎన్నార్ నుంచి.. దాదాపు మూడు నాలుగు జనరేషన్స్‌ అంటే సునీల్ వంటి వారితోనూ కలిసి కామెడీని పండించారు. చివరగా కళ్యాణ రాముడు చిత్రంలోనూ అందరినీ నవ్వించేశారు. అల్లు రామలింగయ్య 2004లో జూలై 31న తుది శ్వాస విడిచిన సంగతి తెలిసిందే. ఇక నేడు ఆయన వర్దంతి. ఈ క్రమంలో అల్లు, మెగా ఫ్యామిలీలే కాకుండా ఇతర సెలెబ్రిటీలు సైతం ఆ మహనీయుడిని తలుచుకుంటున్నారు. ఈ క్రమంలో మెగా స్టార్ వేసిన పోస్ట్ వైరల్ అవుతోంది. ‘శ్రీ అల్లు రామలింగయ్య గారు భౌతికంగా మనమధ్య లేకపోయినా ఆయన నేర్పిన జీవితసత్యాలు ఎప్పటికీ మార్గదర్శకంగా వుంటాయి.ఒక డాక్టర్ గా,యాక్టర్ గా, ఫిలాసఫర్ గా,ఓ అద్భుతమైన మనిషిగా,నాకు మావయ్య గా ఆయన ఎల్లప్పుడూ మా స్మృతుల్లో ఉంటారు.ఆయన వర్ధంతి సందర్భంగా ఆయన జ్ఞాపకాలు మరోసారి నెమరువేసుకుంటూ’ అని చెప్పుకొచ్చారు. ఇక మరో వైపు బండ్ల గణేష్ కూడా అల్లు రామలింగయ్య వర్దంతి గురించి పోస్ట్ చేశారు. అల్లు వారి ముద్రను ఇండస్ట్రీపై బలంగా వేయాలని అరవింద్, బన్నీ బాగానే కష్టపడుతున్న సంగతి తెలిసిందే. అందుకే అల్లు స్టూడియోను కూడా ప్రారంభించేశారు. గత ఏడాది అల్లు రామలింగయ్య జయంతి సందర్భంగా స్టూడియో పనులను ప్రారంభించిన సంగతి తెలిసిందే.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3fg1Een
v

Balamevvadu Title Song : ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నా.. సుహాసిని

సినిమాకు ఎన్నో బలాలున్నాయి. ఓ వైపు మెలోడి బ్రహ్మా మణిశర్మ సంగీతం.. మరో వైపు కీరవాణి గాత్రం ఇంకో వైపు నటనలో వంకపెట్టలేనటు వంటి సీనియర్ నటి సుహాసిని. ఇలా బలమెవ్వడు సినిమా ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. ఆ మధ్య వదిలిన కాన్సెప్ట్ పోస్టర్ నెట్టింట్లో ఎంతగా హల్చల్ చేసిందో అందరికీ తెలిసిందే. కరోనా, మెడికల్ మాఫియా నేపథ్యంలో తెరకెక్కించినట్టు కనిపిస్తోన్న ఈ మూవీ కాన్సెప్ట్ పోస్టర్‌లో తళుక్కున మెరిశారు. తెలుగు, తమిళ చిత్రాల్లో తన అద్భుత నటనతో ప్రేక్షకుల హృదయంలో స్థానం సంపాదించుకున్న సుహసినీ.. చాలా గ్యాప్ తరువాత టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్నారు. "బలమెవ్వడు" సినిమాలో డాక్టర్ యశోద పాత్రలో నటిస్తున్నారు సుహసినీ. మెడికల్ మాఫియాకు వ్యతిరేకంగా పోరాడే నిజాయితీ గల వైద్యురాలి పాత్రలో సుహసినీ నటన అద్బుతంగా ఉండబోతోన్నట్టు కనిపిస్తోంది. అయితే ఇప్పుడు ఈ మూవీ నుంచి టైటిల్ సాంగ్‌ను వదిలారు. దీనికి మణిశర్మ సంగీతం అందించగా.. కీరవాణి పాడారు. కళ్యాణ్ చక్రవర్తి అద్భుతంగా ఈ పాటను రాశారు. ధృవన్ కటకం, నియా త్రిపాఠీ జంటగా నటిస్తున్న "బలమెవ్వడు" సినిమా వైద్యరంగంలోని దోపిడీని ప్రశ్నించబోతోంది. ఈ చిత్రానికి సత్య రాచకొండ దర్శకత్వం వహిస్తున్నారు. సనాతన దృశ్యాలు సమర్పణలో ఆర్ బి మార్కండేయులు "బలమెవ్వడు" చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటీవల విడుదల చేసిన "బలమెవ్వడు" కాన్సెప్ట్ టీజర్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది. నిజ జీవిత ఘటనల ఆధారంగా ఈ సినిమా రూపొందుతోంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3icl1a7
v

Kaatuka Kanule రేర్ ఫీట్.. ఇది సమష్టి విజయం

హీరోగా అపర్ణా బాలమురళీ అనే అమ్మాయిని హీరోయిన్‌గా పరిచయం చేస్తూ సుధా కొంగర తెరకెక్కించిన చిత్రం (తమిళంలో సూరారై పొట్రూ). ఎన్నో ఏళ్లుగా సరైన విజయం కోసం ఎదురుచూసిన సూర్యకు ఆకాశం నీ హద్దురా ఊపిరినిచ్చింది. అందరి మన్నళలు అందుకోవడమే కాకుండా ఆస్కార్ బరిలో నిలిచింది. ఇక సూర్య నటనను దేశం మొత్తం మరోసారి చూసింది. అలా ఓటీటీలో గత ఏడాది విడుదలైన ఈ చిత్రం ఇప్పటికీ ఏదో ఒక రకంగా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూనే ఉంటుంది. ఇప్పుడు ఈ చిత్రాన్ని హిందీలోనూ రీమేక్ చేస్తున్నారు. అసలు ఈ సినిమా అంతలా ఆదరణకు నోచుకోవడానికి బోలెడన్నీ కారణాలున్నాయి. అందులో సంగీతం కూడా ఒకటి. ఆ పాటలన్నీ కూడా సంగీత ప్రియుల్ని ఎంతగానో ఆకట్టుకున్నాయి. వాటిని తెరకెక్కించిన విధానం కూడా అంతే ముచ్చటగా ఉంటుంది. మరీ ముఖ్యంగా అంటూ హీరోయిన్ పాడే పాట, చేసే అల్లరి అందరినీ ఫిదా చేసేసింది. ఆ పాటకు ఇప్పుడు యూట్యూబ్‌లో రేర్ ఫీట్ దక్కింది. వీడియో సాంగ్‌కు వంద మిలియన్ల వ్యూస్ వచ్చాయి. ఈ పాటను ఇంత అద్భుతంగా రాసిన భాస్కర భట్ల, పాడిన తమిళ సింగర్ ఢీ, సంగీతమందించిన జీవీ ప్రకాశ్, కొరియోగ్రఫీ చేసిన శోభీ, శేఖర్ మాస్టర్ ఇలా అందరూ కలిసి సమష్టిగా కృషి చేయడంతోనే ఆ పాట అందరినీ ఇంతలా ఆకట్టుకోగలిగింది. ఓ సందర్భంలో మీడియాకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో పాటల రచయిత భాస్కర్ భట్ల ఈ పాట రాసిన సందర్భాన్ని, అందులోని పదాల వాడుక గురించి ఎంతో గొప్పగా చెప్పారు. ఆ పాటకు సంబంధించి భాస్కర భట్ల చెప్పిన విశేషాలు కింద లింకులో చదవొచ్చు. Also Read


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3lgGgJW
v

Friday 30 July 2021

RC 15 : రామ్ చరణ్‌కు జోడి దొరికేసింది.. శంకర్‌తో కియారా మాటామంతీ!

రామ్ చరణ్ దిల్ రాజు ప్రాజెక్ట్ గురించి సోషల్ మీడియాలో జరిగే చర్చల గురించి అందరికీ తెలిసిందే. ఈ భారీ ప్రాజెక్ట్‌ను అనౌన్స్ చేసిన క్షణం నుంచి ఏదో ఒక టాపిక్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఇన్ని రోజులుగా ఉన్న సస్పెన్స్‌కు ఇప్పుడు తెర దించారు. పక్కన కియారా అద్వాణీ మరోసారి జోడి కట్టబోతోందని చెప్పేశారు. తమ 50వ చిత్రంలో కియారా అద్వాణీ హీరోయిన్ అని దిల్ రాజు ప్రకటించేశారు. మొత్తానికి ఇన్నాళ్ల రూమర్లకు శంకర్ ఓ క్లారిటీ ఇచ్చారు. రామ్ చరణ్ పక్కన బాలీవుడ్ బ్యూటీని దించుతారని ఇది వరకు రూమర్లు వచ్చాయి. అందులో ముఖ్యంగా కియారా అద్వాణీ పేరే ఎక్కువగా వినిపించింది. ఆల్రెడీ ఈ జోడి వినయ విదేయ రామతో అలరించిన సంగతి తెలిసిందే. ఆ చిత్రం ఫ్లాప్ అయినా కూడా ఈ జోడికి మంచి మార్కులే పడ్డాయి. అంతేకాకుండా మార్కెట్ పరంగానూ ఆలోచించి కియారాను తీసుకున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం కియారాకు బాలీవుడ్‌లో ఫుల్ డిమాండ్ ఉంది. ఇక దక్షిణాదిలోనూ కియారాకు విపరీతమైన క్రేజ్ ఉందన్న సంగతి తెలిసిందే. అందుకే దిల్ రాజు శంకర్ ఇలా కియారాను తీసుకొచ్చినట్టు టాక్. నేడు (జూలై 31) కియారా బర్త్ డే సందర్భంగా ఈ అప్డేట్‌ను ఇచ్చారు. ఇక ఇప్పటికే శంకర్‌తో కియారా మాటామంతీ జరిపినట్టు.. స్క్రిప్ట్ గురించి చర్చించినట్టు కనిపిస్తోంది. దర్శకుడు హీరోయిన్ ఇద్దరూ కూడా వైట్ డ్రెస్సులో మెరిసిపోతోన్నారు. ఇద్దరూ కూర్చుని సినిమా గురించి బాగానే చర్చిస్తోన్నట్టు కనిపిస్తోంది. సీన్ల గురించి ఇప్పుడే శంకర్ తన హీరోయిన్‌కు బాగా వివరించి చెబుతున్నట్టున్నారు. ఈ మేరకు మరో ఫోటో బయటకు వచ్చింది. ఇందులో శంకర్‌ను కియారా తీక్షణంగా గమనిస్తున్నారు. మొత్తానికి రామ్ చరణ్ శంకర్ ప్రాజెక్ట్ మరో సారి ట్రెండ్ అవుతోంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3zUrrkd
v

ఇంట్లో ఒక్కదాన్నే ఉంటున్నా.. ఇక నాకు అదే పని : రష్మిక మందన్నా

సోషల్ మీడియాలో చేసే అల్లరికి అభిమానులు ఫిదా అవుతుంటారు. ఇక అమె షేర్ చేసే ఫోటోలు, వీడియోలు నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంటాయి. ఈ మధ్య ఆమె ఒక పని చేస్తున్నారు. నిత్యం తానేమీ చేశానో అభిమానులకు క్లియర్‌ కట్‌గా చెబుతున్నారు. ఓ రకంగా తన డైరీని సోషల్ మీడియాలో పెడుతున్నారు. పొద్దున లేచిన దగ్గరి నుంచి రాత్రి పడుకునే వరకు ఏమేం చేస్తుంటారో అలా చెప్పుకుంటూ వెళ్తారు. అయితే అందులో ఎక్కువగా తన పెట్ ఆరా గురించి ఉంటుంది. తాజాగా రష్మిక పోస్ట్ చేసిన తన డైరీలోనూ అదే ఉంది. ప్రస్తుతం రష్మిక పలు సినిమా షూటింగ్‌లతో బిజీగా ఉన్నారు. బాలీవుడ్, టాలీవుడ్ అంటూ అటూ ఇటూ తిరుగుతున్నారు. ఒక రోజు ముంబైలోఉంటే మరో రోజు హైద్రాబాద్‌లో ఉంటున్నారు. అలా తెలుగులో , ఆడాళ్లు మీకు జోహార్లు అనే సినిమాతో బిజీగా ఉన్నారు. బాలీవుడ్‌లో మరో రెండు ప్రాజెక్ట్‌లు సెట్స్ మీదున్నాయి. మొత్తానికి అంత బిజీగా ఉన్న రష్మిక ఇప్పుడు కాస్త రెస్ట్ తీసుకుంటున్నట్టు కనిపిస్తోంది. తాజాగా తాను షూటింగ్‌లు ఏం లేక ఇంట్లోనే ఒంటరిగా ఉంటున్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు తన డైరీలో చెప్పుకొచ్చిన విశేషాలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. జూలై 29వ తారీఖున తానేం చేసిందో రష్మిక చెప్పుకొచ్చారు. పొద్దున్నే లేచాను.. తిన్నాను.. టీవీ చూశాను.. మళ్లీ తిన్నాను.. ఆరాతో ఆడుకున్నాను.. మళ్లీ తిన్నాను.. పడుకున్నాను. ప్రతీ రోజూలానే ఈ రోజు కూడా చేసేశాను. నవ్వుకోవడానికి నాకు నేను చాలు. అయితే ఇంట్లో నేను ఒక్క దాన్నే ఉంటున్నా కూడా నా హెయిర్ బ్యాండ్ మిస్ అవుతూనే ఉంది. ప్రపంచంలో అందరూ ఇలానే ఉంటారా? అని ఆశ్చర్యపోతుంటాను. ఈ ఏడాదిలో నేను బాధపడుతున్న విషయం అదే.. ఎప్పుడూ అది ఎక్కడ మిస్ అయిందా? అని ఇళ్లంతా చూస్తుంటాను. కానీ అది ఆరా పని అనుకుంటున్నాను’ అని రష్మిక చెప్పుకొచ్చారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/37fLtsU
v

ఇది మరీ అరాచకం.. లోపల ధరించేవాటిపై శ్రుతీ హాసన్ ఫోటోలు.. ప్రియుడి వెక్కిరింతలు!

చర్యలు ఈ మధ్య శ్రుతి మించిపోతోన్నాయి. పబ్లిక్‌గా ప్రియుడి మీద పడిపోవడం, ముద్దులు పెట్టేయడం, ఇక ఇంట్లో అయితే ఆ ఆరాచకం గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. రోజూ ఏదో ఒకటి చేస్తూ ట్రెండింగ్‌లో ఉంటున్నారు. ఈ ఇద్దరూ ప్రస్తుతం ముంబైలో ఎంజాయ్ చేస్తున్నారు. శ్రుతీ హాసన్ తన పనిలో తాను బిజీగా ఉంటే.. తన ఆర్ట్ గీసుకునే పనిలో తాను బిజీగా ఉంటున్నారు. ఇక ఈ జంట చేసే చిలిపి పనులకు నెటిజన్లు షాక్ అవుతున్నారు. తాజాగా శ్రుతీ హాసన్ చేసిన పనికి ప్రియుడు సైతం నవ్వుకున్నారు. మొన్నటికి మొన్న ముంబైలోని ఓ సూపర్ మార్కెట్‌లో ఈ జంట హల్చల్ చేసింది. ప్రియుడి మీద కాలు ఎత్తి మరీ.. అతడిని ముద్దుల్లో ముంచెత్తింది. ఇక రెండ్రోజుల క్రితం తమ ఇంట్లోనే శ్రుతీ హాసన్ పిచ్చి పిచ్చిగా ఎగిరారు. ఆమెతో పాటుగా శంతను కూడా కాలు కదిపాడు. అకస్మాత్తుగా శ్రుతీ హాసన్ ఎగిరి వచ్చి ఆయన మీద పడింది. దీంతో శంతను ఒక్కసారిగా షాక్ అయ్యారు. అలా ఆ వీడియో నెట్టింట్లో వైరల్ అయింది. ఇక శంతను గోడ మీద ఆర్ట్ వేసుకుని ప్రాక్టీస్ చేసుకోకుండా.. శ్రుతీ హాసన్ శరీరాన్ని వాడేసుకున్నారు. ఆమె నడుము భాగం మీద తన ప్రతిభను చూపించారు. నడుము చుట్టూ కూడా శంతను ఆర్ట్ వేసేశారు. థగ్ లైఫ్ అంటూ రాసేశారు. ఇక ఇప్పుడు శ్రుతీ హాసన్ మరో లెవెల్‌కు చేరుకున్నారు. తన మీద తనకు ఎంత ప్రేమ ఉందో చూపించేందుకు శ్రుతీ హాసన్ ఈ పని చేసినట్టున్నారు. కాళ్లకు ధరించే సాక్స్ మీద శ్రుతీ హాసన్ తన ఫోటోలను ప్రింట్ చేయించుకున్నారు. ఇదేంటి? ఇలా కూడా చేస్తారా? అని శంతను నవ్వేశారు. అవును నాకు నేనంటే ఇష్టం అందుకే ఇలా చేశాను అంటూ వాటిని కాళ్లకు ధరించుకున్నారు. మొత్తానికి శ్రుతీ హాసన్ మాత్రం ఓ రేంజ్‌లో హల్చల్ చేస్తున్నారు. ఆమె ఇప్పుడు ప్రభాస్ పక్కన సలార్ చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3zTgT4H
v

ఆన్ లైన్ క్లాసుల మహిమ.. అల్లు అర్హ ఎంత బుద్దిగా వింటోంది?

ప్రస్తుత పరిస్థితుల్లో చదువులు ఎలా కొనసాగుతున్నాయో అందరికీ తెలిసిందే. గత ఏడాది నుంచి అంతా ఆన్ లైన్ చదువులే అయిపోయాయి. మధ్యలో బడులు తెరిచినా కూడా కరోనా దెబ్బకు మూసేయాల్సి వచ్చింది. అలా ప్రతీ సారి ప్రభుత్వాలకు ఎదురుదెబ్బే తగులుతోంది. ఇక ఇప్పుడు అందరూ కూడా ఆన్ లైన్ బాటే పడుతున్నారు. పిల్లలందరూ ఇంట్లోనే క్లాసులు వింటున్నారు. జూమ్ మీటింగ్ అంటూ అటెండ్ అవుతున్నారు. మొత్తానికి చదువులన్నీ కూడా ఫోన్లు, ల్యాప్ టాప్‌ల్లోకి ఎక్కేశాయి. ఇంట్లో ఉంటే పిల్లలు క్లాసులు ఎలా వింటారో అందరికీ తెలిసిందే. ఎవ్వరూ కూడా మనసు పెట్టి క్లాసులు వినరు. కానీ అల్లు పిల్లలు మాత్రం ఎంతో బుద్దిగా వింటున్నట్టు కనిపిస్తోంది. ఇప్పుడు ఆన్ లైన్‌లో క్లాసుల్లో బిజీగా ఉంది. తాజాగా ఓ వీడియోను తన ఇన్ స్టా స్టోరీలో షేర్ చేశారు. ఇందులో అల్లు అర్హ ఎంతో బుద్దిగా కూర్చుని ఆన్ లైన్ క్లాసులు వింటోంది. అందులో తన తోటీ వారంతా జూమ్ మీటింగ్‌లో ఉన్నట్టు కనిపిస్తోంది. అందరూ విఘ్నేశ్వరుని శ్లోకంతో ప్రారంభించినట్టున్నారు. వారిని వంత పాడుతూ ఆ శ్లోకాన్ని అల్లు అర్హ కూడా చెప్పేస్తోంది. మొత్తానికి అర్హ మాత్రం అల్లరి పిల్ల మాత్రమే కాదు.. ఎంతో వినయం, విధేయతలున్న చిచ్చర పిడుగు అని తెలుస్తోంది. ఇక అర్హ ఇప్పుడు సినీ ఎంట్రీ ఇస్తోన్న సంగతి తెలిసిందే. సమంత, గుణ శేఖర్ కాంబినేషన్‌లో వస్తోన్న శాకుంతల సినిమాలో అర్హ నటిస్తున్నారు. అలా మొత్తానికి అల్లు వారి నాల్గో తరం కూడా వెండితెరపై వెలిగేందుకు రెడీ అవుతోంది. శాకుంతలం సినిమాలో భరతుడి పాత్రలో అర్హ నటిస్తున్నారు. మొదటి రోజు షాట్‌లోనే అర్హ అదరగొట్టేసిందని సమంత చెప్పుకొచ్చారు. అర్హకు అదిరిపోయే డైలాగులున్నాయని కూడా తెలిపారు. డైలాగ్ విషయంలో, యాక్టింగ్ విషయంలో సాయం చేయాలని సమంతను అల్లు స్నేహారెడ్డి కోరారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2UYvVaN
v

RRR డేరింగ్ స్టెప్... క్లిష్ట పరిస్థితుల్లోనూ అలాంటి నిర్ణయం.. హీరోలిద్దరికీ రిస్కే!

ప్రస్తుతం ప్రపంచంలో ఎలాంటి పరిస్థితులున్నాయో అందరికీ తెలిసిందే. ఇంకా కరోనా మహమ్మారి మానవాళిని వెంటాడుతూనేఉంది. థర్డ్ వేవ్ ముప్పు పొంచి ఉంది. ఇలాంటి సమయంలో ఇక్కడ షూటింగ్‌లు చేసుకోవడం కూడా కష్టమే. కానీ అన్ని జాగ్రత్తలు పాటిస్తూ సినిమాను పూర్తి చేస్తున్నారు మేకర్స్. ఇలాంటి సమయంలో సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు. హీరోలిద్దరి సీన్లను తెరకెక్కించేందుకు టీం మొత్తానికి ఉక్రెయిన్‌కు తరలించారట. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్ర బృందం చివరి షెడ్యూల్‌ షూటింగ్‌ కోసం ఉక్రెయిన్‌కు పయనమైందని సమాచారం. కరోనా సెకెండ్‌ వేవ్‌ తర్వాత హైదరాబాద్‌లో షెడ్యూల్‌ ప్రారంభించిన రాజమౌళి అండ్‌ కో ఇటీవల ఈ షూటింగ్‌ పూర్తి చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే దోస్తీ పేరిటి మొదటి సాంగ్‌తో రచ్చ చేసేందుకు టీం మొత్తం రెడీ అయింది. ఐదు భాషలు.. ఐదుగురు సింగర్లతో కీరవాణి మ్యాజిక్ చేయబోతోన్నారు. ఒక వైపు రాజమౌళి తన హీరోలను విదేశాలకు పట్టుకెళ్తున్నారు. మొన్నటి హైద్రాబాద్ షెడ్యూల్‌లో హీరోలిద్దరిపై కీలక సన్నివేశాలను రామ్‌చరణ్‌పై ఓ పాటను చిత్రీకరించారు. ఆగస్ట్‌ ఒకటో తేదీ నుంచి ఉక్రెయిన్‌లో చివరి షెడ్యూల్‌ ప్రారంభిస్తారని తెలిసింది. ఇప్పటికే చిత్ర బృందం ఉక్రెయిన్‌కి బయలుదేరిందని తెలిసింది. ఒకటో తేదిన ప్రధాన తారాగణం, దర్శకుడు అక్కడికి చేరుకుని రెండో తేదిన షూటింగ్‌ మొదలుపెడతారని సమాచారం. ఆగస్ట్‌ రెండోవారం వరకూ చిత్రీకరణ జరుగుతుందని తెలుస్తోంది. ఈ కరోనా పరిస్థితుల్లో అక్కడకి వెళ్లడం నిజంగానే రాజమౌళి సాహసం. ఈ చిత్రాన్ని అక్టోబర్ 13న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారనే విషయం తెలిసిందే.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3rLVckw
v

Narappa Success meet : ధనుష్‌పై ప్రశంసలు.. దటీజ్ వెంకీ

విక్టరీ ఎప్పుడూ కూడా తన సినిమాల గురించి గొప్పలు చెప్పుకోరు. తన నటన, తన సినిమాల ఫలితం గురించి అంతగా చెప్పుకోరు. అయితే తన సినిమా సక్సెస్ ఫంక్షన్‌లో కూడా దాని ఒరిజినల్ సినిమా గురించి మాట్లాడుతూ అక్కడి దర్శకుడు, హీరోల గురించి కామెంట్ చేశారు. ఈ క్రమంలో దటీజ్ వెంకీ అని అభిమానులు ఆయన మీద ప్రశంసలు కురిపిస్తున్నారు. నిన్న జరిగిన ఈ సక్సెస్ మీట్‌లో వెంకటేష్ మాట్లాడిన మాటలు తెగ వైరల్ అవుతున్నాయి. థియేటర్లలో చూడాల్సిన ‘నారప్ప’ ఓటీటీలో వచ్చినందుకు ప్రేక్షకులకు బాధగా అనిపించినా.. మా పరిస్థితిని అర్థం చేసుకుని గొప్పగా ఆదరిస్తున్నారు. ప్రతి ఒక్కరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకొంటున్నాను అని వెంకటేష్‌ ఎమోషనల్ అయ్యారు. సినిమాను ఇంత బాగా ఆదరిస్తున్నందుకు చాలా ఆనందంగా ఉందని అన్నారు. 25ఏళ్ల కెరీర్‌లో ఎన్నో ఛాలెంజింగ్‌ పాత్రలు చేశాను. కానీ, ఈ సినిమా, ఇందులో నా పాత్ర చాలా విభిన్నమైనది. నటుడిగా నాకెంతో సవాల్‌గా నిలిచింది. ఇంత మంచి సినిమా ఇచ్చినందుకు వెట్రిమారన్‌, ధనుష్‌లకు థ్యాంక్స్‌. వాళ్లు ‘అసురన్‌’ చేయకపోతే.. ఈరోజు ఈ ‘నారప్ప’ లేదు. కచ్చితంగా ప్రేక్షకులందరికీ థియేటర్లో మరో మంచి సినిమా చూపిస్తానని మనస్ఫూర్తిగా చెప్తున్నా. సంక్రాంతికి ‘ఎఫ్‌3’ సినిమాతో తప్పకుండా వినోదాలు అందిస్తానని అన్నారు. అంటే ఈ లెక్కన దృశ్యం 2 చిత్రాన్ని ఓటీటీలో విడుదల చేయబోతోన్నామని పరోక్షంగా చెప్పినట్టైంది. ఈ సక్సెస్ మీట్‌లో అనిల్‌ రావిపూడి, ప్రియమణి, కార్తిక్‌ రత్నం, రాఖీ, అనంత శ్రీరామ్‌, గాంధీ తదితరులు పాల్గొన్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/37bkGyg
v

HBD Sonu Sood: రియల్ హీరోకి అభినందనల వెల్లువ.. గ్రాండ్ ట్రీట్ ఇచ్చిన ‘ఆచార్య’ యూనిట్

‘ఆపద్భాంధవుడు’ అంటే ఇప్పుడు అందరికీ గుర్తుకు వచ్చేది ఒకే ఒక పేరు.. అదే . కరోనా లాక్‌డౌన్‌లో సమయంలో కష్టాల్లో ఉన్న ఎందరో వలస కార్మికులు, నిరుపేదలకు ఆయన అండగా నిలిచారు. తమ స్వస్థలాలకు చేరుకోలే ఇబ్బందులు పడుతున్న ఎందరినో ఆయన తన సొంత ఖర్చుతో స్వస్థలాలకు చేర్చారు. కొద్ది రోజుల క్రితం వరకూ రెండో దశలోనూ విస్తృతంగా సేవా కార్యక్రమాలు చేశారు. ప్రధానంగా ఆక్సిజన్ కొరత ఏర్పడడంతో ఆయన, తన ఫౌండేషన్ తరఫున ఆక్సిజన్ ప్లాంటులను ఏర్పాటు చేశారు. తెలుగు రాష్ట్రాలతో పాటు.. దేశవ్యాప్తంగా పలు ప్రధాన రాష్ట్రాల్లో ఈ ప్లాంటులను ఏర్పాటు చేశారు సోనూ. ఈ క్రమంలో గత ఏడాది నుంచి సోనూసూద్‌కి ఫ్యాన్ ఫాలోయింగ్ భారీగా పెరిగిపోయింది. ఆయన్ని ఆదర్శంగా తీసుకొని.. అభిమానులు కూడా అదే దారిలో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. సోనూసూద్ పేరిట కొన్ని ఫౌండేషన్లు ఏర్పాటు చేసి.. ఎందరికో సహాయం చేస్తున్నారు. కాగా, నేడు (జూలై 30) సోనూసూద్ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా రియల్ హీరోకి విషెస్ చెబుతూ అభిమానులు సోషల్‌మీడియాలో పోస్ట్‌లు చేస్తున్నారు. అయితే ఆయన నటిస్తున్న ‘ఆచార్య’ చిత్ర యూనిట్ కూడా ఆయనకు పుట్టినరోజు సందర్భంగా ట్రీట్ ఇచ్చింది. సినిమాలో ఆయన లుక్‌ని చిత్ర యూనిట్ విడుదల చేసింది. ‘బంగారం వంటి మనస్సు ఉన్న.. విలక్షణ నటుడు సోనూసూద్‌కు చిత్ర యూనిట్ తరఫున పుట్టినరోజు శుభాకాంక్షలు’ అంటూ యూనిట్ పేర్కొంది. ఇక మెగాస్టార్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఈ సినిమాను రూపొందిస్తున్న రామ్ చరణ్ ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. కాజల్ అగర్వాల్, పూజా హెగ్డే ఈ సినిమాలో హీరోయిన్లుగా చేస్తున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3lh8rbs
v

గుమ్మడి నర్సయ్య బయోపిక్.. బయటకు వచ్చిన సుకుమార్!

రాజకీయ నాయకులు అనగానే సహజంగానే కొన్ని అభిప్రాయాలు, ముద్రలు వేసేస్తుంటారు. అవినీతి, అక్రమ సంపాదన అంటూ రకరకాలుగా ట్యాగులు తగిలిస్తుంటారు. కానీ రాజకీయ నాయకులందరూ అలానే ఉండరు. ఒక్క రూపాయి అవినీతి కూడా చేయని వారుంటారు. అలాంటిది ఐదు సార్లు ఎమ్మెల్యే గా గెలిచి, ఓ పార్టీ రాష్ట్ర స్థాయి నేతగా ఎదిగినా నిజాతీయికి నిలువుటద్దంలా రాజకీయ ప్రస్థానం సాగించారు సీపీఐ (ఎంఎల్) నేత . శాసనసభకు బస్సులో వచ్చే ఏకైక ఎమ్మెల్యేగా గుమ్మడి నర్సయ్య నిరాడంబర జీవితం ఆదర్శనీయంగా మీడియా ప్రశంసించింది. ప్రజా జీవితంలోనే తన జీవితాన్ని చూసుకున్న మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య జీవిత కథతో సినిమా రూపొందుతోంది. పరమేశ్వర్ అనే కొత్త దర్శకుడు ఈ బయోపిక్ తెరకెక్కిస్తున్నారు. తాజాగా గుమ్మడి నర్సయ్య బయోపిక్ టైటిల్ లోగోను ప్రముఖ దర్శకుడు విడుదల చేశారు. టైటిల్ లోగో విడుదల చేసిన అనంతరం దర్శకుడు సుకుమార్ చిత్ర బృందానికి బెస్ట్ విశెస్ తెలిపారు. ఒక ఆదర్శవంతమైన నాయకుడి గురించి ఈతరంతో పాటు రాబోయే తరాల ప్రజలకు, రాజకీయ నాయకులకు తెలిసేలా గుమ్మడి నర్సయ్య బయోపిక్ ఉండబోతోంది. ఈ సినిమాలో నటించే నటీనటులు, సినిమాకు పనిచేసే టెక్నీషియన్స్ వివరాలు త్వరలో తెలియజేయనున్నారు. గుమ్మడి నర్సయ్య కోసం మొత్తానికి సుకుమార్ ఇలా బయటకు వచ్చేశారు. మొన్నా మధ్య ఆయనకు ఆరోగ్యం బాగా లేదనే వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2WCeOMl
v

తొలిసారిగా అలాంటి విలక్షణమైన పాత్రలో నయనతార.. ఆసక్తికరంగా ‘నేత్రికన్’ ట్రైలర్

కొందరు హీరోయిన్లు మాత్రమే హీరోలతో సమానంగా క్రేజ్ సంపాదించుకుంటారు. అలా హీరోలతో సమానంగా దక్షిణాదితో పాటు దేశవ్యాప్తంగా గుర్తింపు సంపాదించుకున్న నటి . కెరీర్ ఆరంభంలో పలు గ్లామరస్ పాత్రల్లో నటించిన ఆమె స్టార్ హీరోయిన్ స్టాయిని సంపాదించుకుంది. అలాగే మంచి కెరీర్‌ని ఇటు టాలీవుడ్, అటు కోలీవుడ్‌లోనూ కొనసాగించింది. అయితే కొంతకాలం తర్వాత సినిమాలకు కాస్త బ్రేక్ ఇచ్చింది నయనతార. ఆ తర్వాత ఎక్కువ శాతం లేడీ ఓరియేంటెడ్ పాత్రలకు ప్రాధాన్యత ఇస్తూ వచ్చింది. మధ్యలో కొన్ని కమర్షిషల్ సినిమాలు చేస్తూనే.. లేడీ ఓరియేంటెడ్ సినిమాలు చేస్తున్నారు ఆమె. కొన్ని రోజుల క్రితం ‘ముక్కుత్తి అమ్మన్’ (తెలుగులో అమ్మోరు తల్లి) సినిమాతో ఆమె ప్రేక్షకుల ముందుకు వచ్చారు. మరోసారి ఓ ఆసక్తికర కథనంతో, విభిన్నమైన పాత్రతో ఆమెను ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు. ఆమె ప్రస్తుతం నటిస్తున్న చిత్రం ‘’. ఈ సినిమాలో నయనతార తొలిసారిగా ఓ అంధురాలి పాత్రలో నటిస్తోంది. ఈ సినిమా త్వరలో ఓ ప్రముఖ ఓటీటీలో విడుదల కానుంది. తెలుగు, తమిళ భాషలతో పాటు మలయాళ, కన్నడ భాషలలోనూ ఈ సినిమా విడుదల కానుంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్‌ని చిత్ర యూనిట్ విడుదల చేసింది. అమ్మాయిలను కిడ్నాప్ చేసే ఓ సీరియల్ కిల్లర్ బారిన పడిన హీరోయిన్.. అతని నుంచి ఎలా తప్పించుకుంటుంది అనే నేపథ్యంలో సినిమా రూపొందినట్లు ట్రైలర్ చేస్తూ అర్థం అవుతోంది. ప్రస్తుతం ఈ ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా అంధురాలి పాత్రలో నయనతార నటనపై ప్రశంసల వర్షం కురుస్తోంది. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఏ రేంజ్‌లో అలరిస్తుందో తెలియాలి అంటే.. ఆగస్టు 13వ తేదీ వరకు వేచి చూడాల్సిందే. ఇక ఈ సినిమాకు మిలింద్ రావ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు విగ్నేష్ శివన్ దర్శకత్వం వహిస్తున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3fd57uc
v

బండ్లన్న ఇంట్లో పవర్ స్టార్.. అలా బయటపడ్డ ఫోటో.. అదే బండ్ల గణేష్ భక్తి!

ట్వీట్లు, ఆయన వేసే పోస్ట్‌లు, చేసే కామెంట్లు ఎప్పుడూ వైరల్ అవుతూనే ఉంటాయి. మరీ ముఖ్యంగా ఆ పోస్టుల్లో ఉంటే అవి ఇంకా హల్చల్ చేస్తుంటారు. పవర్ స్టార్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో చేసే హంగామా అందరికీ తెలిసిందే. వారెప్పుడూ కూడా బండ్ల గణేష్ ట్వీట్ల మీద ఓ కన్నేసి ఉంచుతారు. అలా బండ్లన్న ట్వీట్ వేయడం ఆలస్యం ఇలా పవర్ స్టార్ ఫ్యాన్స్ దుమ్ములేపేస్తుంటారు. తాజాగా బండ్ల గణేష్ వేసిన ఓ ట్వీట్, షేర్ చేసిన ఫోటో నెట్టింట్లో వైరల్ అవుతోంది. బండ్ల గణేష్ తాజాగా తెలుగు రాష్ట్రాల‌ బ్రిటిష్‌ డిప్యూటీ హైకమిషనర్‌ ఆండ్రూ ఫ్లెమింగ్‌తో సమయం గడిపారు. ఆండ్రూ ఫ్లెమింగ్ బండ్లన్న ఆతిథ్యాన్ని స్వీకరించినట్టున్నారు. సకుటుంబ సపరివారసమేతంగా బండ్ల గణేష్ అతనికి అతిథి మర్యాదలు చేశారు. ఈ క్రమంలో కొన్ని ఫోటోలను బండ్ల గణేష్ షేర్ చేశారు. ఆ ఫోటోల్లో బండ్ల గణేష్ ఇంట్లోని ఓ రూం, ఆ రూంలోని ఓ గోడ, ఆ గోడ మీదున్న ఓ ఫోటో అందరినీ ఆకట్టుకుంది. ఆ రూంలో ఇంకా మరేతర దేవుడి ఫోటోలు గానీ, ఇతర ఫోటోలు గానీ లేవు. గబ్బర్ సింగ్ సమయంలో పవన్ కళ్యాణ్‌తో దిగిన ఫోటోను మాత్రమే గోడకు వేలాడిదీసి ఉంచాడు. అదే భక్తి అంటే అని పవర్ స్టార్ ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం బండ్లన్న ఇళ్లు, ఆ రూం, ఆ ఫోటో తెగ వైరల్ అవుతోంది. నెటిజన్ల ట్వీట్ల మీద రిట్వీట్లు కొడుతున్నారు. లైకులతో తెగ హల్చల్ చేస్తున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3leEc4P
v

మాధురీ దీక్షిత్ అవతారంలో హాట్ బ్యూటీ.. అదే తన డ్రీమ్ ప్రాజెక్ట్ అంటూ కామెంట్స్..

మాధురి దీక్షిత్.. గత జనరేషన్ సినీ ప్రేక్షకులకు ఆమె అభిమాన నటి.. అందం, అభినయంతో పాటు ఆమె డ్యాన్స్‌తోనూ ఎందరినో అలరించారు మాధురి. దశాబ్ధకాలం పాటు బాలీవుడ్ ఇండస్ట్రీలో నెం.1 నటిగా ఆమె కొనసాగారు. ఆ తర్వాత కూడా పలు సినిమాలు చేసిన ఆమె.. తనదైన శైలీ నటనతో ప్రేక్షకులకు వినోదాన్ని పంచారు. ఇక 2008లో భారత ప్రభుత్వం ఆమెను పద్మశ్రీ పురస్కారంతో సన్మానించింది. మాధురి నటన కంటే ఆమె డ్యాన్స్‌కి ఎక్కువ మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఎన్నో అద్భుతమైన చిత్రాల్లో నటించిన ఆమె చివరిగా రెండు సంవత్సరాల క్రితం విడుదలైన ‘కలంక్‌’ అనే సినిమాలో వెండితెరపై కనిపించారు. అయితే ప్రస్తుతం సినిమాలు కాకుండా టీవీ షోలలో జడ్జిగా చూస్తూ బిజీగా ఉన్నారు మాధురి. ఓ ప్రముఖ ఛానె‌ల్‌లో ప్రసారమవుతున్న డ్యాన్స్‌ షోకి ఆమె జడ్జిగా వ్యవహరిస్తున్నారు. అయితే ప్రస్తుతం ఏ ఇండస్ట్రీలో చూసిన బయోపిక్‌ల హవా నడుస్తోంది. మరి ఈ నేపథ్యంలో బయోపిక్ తీస్తే అందులో ఎవరు నటిస్తే బాగుంటుంది అనే సందేహం ప్రతీ అభిమాని మదిలో ఉంటుంది. అయితే మాధురి బయోపిక్‌లో నటించేందుకు నేను సిద్ధంగా ఉన్నాను అంటోంది ఓ బాలీవుడ్ నటి. ఆమె . బాలీవుడ్‌తో పాటు.. టాలీవుడ్‌లో పలు ప్రత్యేక పాటల్లో తన అందంతో, గ్లామర్‌తో పాటు.. డ్యాన్స్‌తోనూ కూడా ప్రేక్షకులను అలరించింది ఈ భామ. నోరా చేసే డ్యాన్స్ స్టైల్ మరెవరికి లేదు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అయితే కొద్ది రోజుల క్రితం తన యూట్యూబ్ ఛానెల్‌లో ఆమె మాట్లాడుతూ.. మాధురి దీక్షిత్ తన ఆరాధ్య నటి అని.. ఒకవేళ ఆమె బయోపిక్ తీస్తే అందులో నటించేందుకు సిద్ధంగా ఉన్నానని పేర్కొంది. తాజాగా మాధురి జడ్జిగా వ్యవహరిస్తున్న డ్యాన్స్ షోకి అతిథిగా వెళ్లిన నోరా.. ‘డోలారే డోలారే డోలా’ పాటలో మాధురి ధరించిన కాస్ట్యూమ్‌ను ధరించి వెళ్లింది. మరి దీని బట్టి మాధురి బయోపిక్‌లో నటించాలని నోరాకు ఎంత ఆశగా ఉందో అర్థం అవుతోంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3ff6CIq
v

దేవినేని ఉమక్క చిప్పకూడు తింటుందే.. చెలరేగిన రోజా.. సంచలన వ్యాఖ్యలు

అరెస్ట్ వ్యవహారం ఏపీలో హాట్ టాపిక్ అవుతుంది. కొండపల్లి అటవీ ప్రాంతంలో అక్రమమైనింగ్ చేస్తున్నారని తన అనుచరులతో కలసి నిరసన చేపట్టారు ఉమ. ఈ సమయంలో తెలుగుదేశం, వైసీపీ వర్గీయుల మధ్య ఘర్షణ చోటుచేసుకుని రాళ్లదాడి జరిగింది. ఈ దాడిలో పలువురికి గాయాలు కాగా.. దేవినేన ఉమ ఉద్దేశ పూర్వకంగానే జి. కొండూరులో అలజడి సృష్టించారని ఆయనపై పలు సెక్షన్ల కింద కేసు పెట్టి జైలుకి పంపారు పోలీసులు. అయితే ఈ వ్యవహారంపై వైసీపీ ఎమ్మెల్యే.. సినీ నటి స్పందిస్తూ.. దేవినేని ఉమపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉమక్క జైల్లో చిప్పకూడు తింటుంది అంటూ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్న రోజా మీడియాతో మాట్లాడుతూ.. ‘పేదల ఇంటి నిర్మాణం కోసం ప్రభుత్వం స్థలాలు సేకరిస్తుంటే.. ల్యాండ్ మాఫియా అని తెలుగుదేశం పార్టీ వాళ్లు బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే ఈరోజు అక్కడ మహిళలు ఇల్లులు కట్టుకుంటుంటే.. అక్కడ ఎవరూ ఇల్లు నిర్మించుకోవడం లేదు.. కేవలం మైనింగ్ మాత్రమే జరుగుతుందని దేవినేని ఉమక్క అక్కడకు వెళ్లి తెగ హడావిడి చేసి జైలుపాలయ్యాడు. ఏపీలో జగన్ మోహన్ రెడ్డిగారు చేస్తున్న అభివృద్ధి చూసి సహించలేని తెలుగుదేశం పార్టీ వాళ్లు కడుపు మంటతో ఇలాంటి పనులు చేస్తున్నారు. దేవినేని ఉమలాంటి వారు.. అక్కడకు వెళ్లి వైసీపీ నాయకుల మీద రాళ్లు వేయడం.. కర్రలతో కొట్టి అలజడి సృష్టించాలనే ప్రయత్నం చేస్తున్నారో ప్రజలంతా గమనిస్తున్నారు. అందుకే ఈరోజున ఉమ జైలుకి వెళ్లి చిప్పకూడు తినే పరిస్థితి వచ్చింది అంటూ ఘాటూ వ్యాఖ్యలు చేశారు రోజా. అయితే గతంలో కూడా ఉమని ఉద్దేశించి రోజా కీలక వ్యాఖ్యలు చేశారు. కరోనా నేపథ్యంలో ఏపీ సీఎం విఫలం అయ్యారని.. చేతులెత్తేశాం అని ప్రభుత్వం ఒప్పుకుంటే చంద్రబాబు వచ్చి మొత్తం సెట్ చేసేస్తారని దేవినేని ఉమ కామెంట్స్ చేయడంతో వాటికి కౌంటర్ ఇచ్చారు రోజా. ‘ఆయనొచ్చి ఏం చేస్తాడన్నది తరువాత.. ముందు ఈ సిగ్గులేని మాజీ మంత్రి ఆడా మగో తెలియక కేసీఆర్ అడిగాడు.. ముందు ఆ టెస్ట్‌లు చేయించండి’ అంటూ అప్పట్లో షాకింగ్ కామెంట్స్ చేశారు రోజా. ఇలా సమయం వచ్చిన ప్రతిసారి మాజీ మంత్రికి తనదైన శైలిలో గట్టిగానే కౌంటర్ ఇస్తున్నారు రోజా.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3fe3nkf
v

మరోసారి చరణ్‌ జోడీగా ఆమెనే ఫిక్స్.. శంకర్-చెర్రీ మూవీపై మరో క్రేజీ అప్‌డేట్

‘ధృవ’, ‘రంగస్థలం’ సినిమాల తర్వాత మెగా పవర్‌స్టార్ రేంజ్ ఎక్కడికో వెళ్లిపోయింది. అప్పటివరకూ ఆయన్ని ట్రోల్ చేసిన వాళ్లందరూ ఆ సినిమాల తర్వాత ఆయనకు అభిమానులకుగా మారిపోయారు. అయితే ఆ తర్వాత వచ్చిన ‘వినయ విధేయ రామ’ సినిమా కాస్త నిరాశ పరిచినప్పటికీ.. చరణ్‌కు ఉండే క్రేజ్ మాత్రం తగ్గలేదు. ప్రస్తుతం చరణ్ దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ‘ఆర్ఆర్ఆర్’ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో ఆయనతో పాటు యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా హీరోగా చేస్తున్నారు. భారీ మల్టీస్టారర్‌గా రూపొందుతున్న ఈ సినిమాపై భారీగా అంచనాలు ఉన్నాయి. దీంతో పాటు.. తన తండ్రి మెగాస్టార్ చిరంజీవి హీరోగా ఆయనే నిర్మాతగా వ్యవహరిస్తున్న ‘ఆచార్య’ సినిమాలో కూడా ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు రామ్ చరణ్. ఇక ఈ రెండు సినిమాల తర్వాత చరణ్ మరో భారీ ప్రాజెక్ట్‌తో ప్రేక్షకులను పలకరించనున్నాడు. అదే దర్శకుడు , రామ్ చరణ్ కాంబినేషన్‌లో వస్తున్న సినిమా. ఇప్పటికే ఈ సినిమా గురించి ప్రకటన వచ్చి చాలాకాలమే అయింది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై ఈ సినిమాను నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా ప్రాజెక్టుగా ఈ సినిమా రూపొందనుంది. అయితే ప్రకటన వచ్చినప్పటి నుంచి ఈ సినిమా గురించి ఎన్నో రూమర్లు పుట్టుకొచ్చాయి. ఈ సినిమాలో చరణ్ ముఖ్యమంత్రిగా కనిపించనున్నాడని. ‘ఒకే ఒక్కడు’ స్టైల్‌లో ఈ సినిమా ఉండబోతుంది అని ఎవరికి తోచిన విధంగా వాళ్లు రాసుకొచ్చారు. అయితే ఇప్పుడు ఈ సినిమాలో నటించే హీరోయిన్‌ గురించి ఓ వార్త సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది. యంగ్ హీరోయిన్ ఈ సినిమాలో చరణ్ సరసన నటించనుందని టాక్. ప్రస్తుతం వీరిద్దరు ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలో వీరిద్దరు జోడీ కట్టారు. సినిమా విడుదల కాకముందే ఈ జోడీపై భారీగా అంచనాలు ఉన్నాయి. మరి దీనిపై స్పష్టత రావాలంటే ఇంకొన్ని రోజులు ఎదురుచూడాల్సిందే.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3BWlULN
v

Samapath Nandi : మరిచిపోలేని రోజు.. దేవుడిని కలిశాను.. చిరుపై ‘రచ్చ’ డైరెక్టర్ కామెంట్స్

టాలీవుడ్ డైరెక్టర్ గురించి, ఆయన మేకింగ్ గురించి అందరికీ తెలిసిందే. మొదటి సినిమా ఏమైంది ఈవేళతో ఇండస్ట్రీలోని స్టార్ హీరోలను ఆశ్చర్యపరిచారు. అలా రెండో చాన్స్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌తో సంపత్ నందికి దక్కింది. వచ్చిన అవకాశాన్ని సంపత్ నంది ఉపయోగించుకుని రచ్చ వంటి మాస్ మసాలా కమర్షియల్ సినిమాను తెరకెక్కించాడు. అలా సంపత్ నంది మెగా హీరోకు హిట్టిచ్చారు. ఆ తరువాత పవన్ కళ్యాణ్‌తోనూ ఓ చాన్స్ వచ్చిందన, ఆయన కోసం చాలా ఏళ్లు ఎదురుచూశాడన్న సంగతి తెలిసిందే. ఇక సంపత్ నంది తెరకెక్కించిన బెంగాల్ టైగర్, గౌతమ్ నందా పర్వాలేదనిపించాయి. ఇప్పుడు సంపత్ నంది నిర్మాతగా, దర్శకుడిగా బిజీగా ఉన్నారు. గోపీచంద్ తమన్నా కాంబినేషన్‌లో రాబోతోన్న సీటీమార్ సినిమాను సంపత్ నంది రెడీ చేశాడు. మామూలుగా అయితే ఈ సమ్మర్‌లోనే రావాల్సింది. కానీ కరోనా వల్ల అంతా తారుమారైంది. ఇప్పుడు సంపత్ నంది కలిశారు. తన సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా కలిశాడా? లేదా? మరేతర కారణంతో కలిశాడో తెలియడం లేదు గానీ ఆయన చేసిన కామెంట్లు మాత్రం వైరల్ అవుతున్నాయి. చిరుతో దిగిన సెల్ఫీని షేర్ చేసిన సంపత్ నంది.. నా జీవితంలో మరో మరిచిపోలేని అద్భుతమైన రోజు. మన దేవుడు చిరంజీవి గారిని కలిశాను. ఎంతో విలువైన సమయాన్ని నాకు ఇచ్చారు. ఇంకా ఎన్నో గొప్ప సంగతులను వివరించారు. చర్చించారు. మున్ముందు అంతా మంచి జరగాలని ఆశీర్వదించారు అని సంపత్ నంది తన ఆనందాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ఇక ఈ పోస్ట్ మీద నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. చిరంజీవితో సినిమా చాన్స్ వచ్చిందా? అని కొందరు అడిగేస్తున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3lcDuVV
v

ONE మూవీ రివ్యూ.. మమ్ముట్టి మార్క్!

కేరళ మెగాస్టార్ నటన గురించి ఆయన ఎంచుకునే కథలు, చేసే సినిమాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మమ్ముట్టి నటనకు తెలుగులోనూ అభిమానులున్నారు. ఆయన నేరుగా నటించిన తెలుగు చిత్రాలు ఇప్పటికీ ఎప్పటికీ అలా నిలిచిపోతాయి. అలాంటి మమ్ముట్టి హీరోగా వచ్చిన పొలిటికల్ డ్రామా వన్ సినిమా ఇప్పుడు డబ్బింగ్ రూపంలో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నేడు (జూలై 30) ఆహాలో విడుదలైన ఈ మూవీ ఎలా ఉందో ఓ సారి చూద్దాం. తెలంగాణ రాష్ట్రానికి సీఎంగా కల్లూరి చంద్రం పాత్రలో మమ్ముట్టి కనిపిస్తారు. రాజకీయాల్లో సమూల ప్రక్షాళన తీసుకురావాలని ప్రయత్నిస్తుంటారు. అలా సీఎంకు వ్యతిరేకంగా ఓ యువకుడు సంజయ్ (మాథ్యూ థామస్) ఓ పోస్ట్ పెడతాడు. ముఖ్యమంత్రికి ఉండే ప్రోటోకాల్ వల్ల సంజయ్ ఇబ్బందులు ఎదుర్కొంటాడు. అలా ముఖ్యమంత్రి మీద, ప్రభుత్వం మీద ఫేక్ ఐడీతో విమర్శలు చేస్తాడు. దీన్ని ఆధారంగా చేసుకుని విపక్ష నాయకుడు జయానంద్ (మురళీ గోపీ) రాస్తాలు, సమ్మెలు, స్ట్రైక్‌లు చేస్తుంటాడు. ఇక ప్రజాప్రతినిధుల పనితీరుపై ప్రజలకు అసంతృప్తి ఉంటే వారి కాలపరమితి తీరక ముందే వారిని రీ కాల్ చేసే బిల్లు కోసం కల్లూరి చంద్రం ప్రయత్నిస్తాడు. ఈ క్రమంలో కల్లూరి చంద్రంకు ఎదురైన పరిస్థితులు ఏంటి? కల్లూరి చంద్రం స్నేహితుడు, పార్టీ ప్రెసిడెంట్ అయిన బాబీ(జోజు జార్జ్) చివరకు ఏం చేస్తాడు? తనకు వ్యతిరేకంగా పోస్ట్ పెట్టిన సంజయ్‌ కథ ఏమవుతుంది? ఇలాంటి ప్రశ్నలకు సమాధానమే వన్. కల్లూరి చంద్రం పాత్రలో మమ్ముట్టి తన అనుభవాన్ని చూపించారు. సీఎం పాత్రలో ఎంతో హుందాగా కనిపించారు. నీతి, నిజాయితీకి నిలువుటద్దంలా నటించారు. ప్రజలకు కష్టాలు వస్తే క్షణంలో స్పందించే మనసున్న నేతగా నటించారు. అలా ఈ క్యారెక్టర్‌లో మమ్ముట్టి అందరినీ మెప్పిస్తారు. స్నేహితుడికి అండగా ఉంటూనే, పార్టీ అధ్యక్షుడిగా తాను పడే మథనాన్ని బాబి పాత్రలో జోజు జార్జ్ అద్భుతంగా చూపించారు. ఇక సాధారణ కుటుంబం, మధ్యతరగతి యువకుడిగా సంజయ్ చక్కగా నటించాడు. ప్రతిపక్ష నాయకుడిగా జయానంద్ క్యారెక్టర్‌లో మురళీ గోపీ సరిగ్గా సరిపోయారు. మిగిలిన పాత్రల్లో అందరూ చక్కగా నటించారు. పొలిటికల్ డ్రామాను సినిమా నేపథ్యంగా ఎంచుకున్నప్పుడు ఒక మొనాటినీ వస్తుంది. మంచి పనులు చేద్దామని ప్రయత్నించడం, వాటిని విపక్షాలు చేయకుండా అడ్డుపడటం, ప్రజా పరిపాలను మార్చేద్దామని చూడటం, మార్పులు తీసుకురావాలని ప్రయత్నించడం వంటివి ఉంటాయి. వాటిని స్వపక్షం, విపక్షం రెండూ కూడా వ్యతిరేకిస్తుంటుంది. అలా రాజకీయపుటెత్తుగడల మధ్య కథనం నడుస్తూ ఉంటుంది. ఇందులోనూ అదే కనిపిస్తుంది. సినిమాల్లో జరిగినట్టుగా బయట జరగాలని, ప్రజా ప్రతినిధి, ఓ సీఎం అలా ఉండాలని ఆశించలేం. సమస్య చెప్పగానే స్పందించడం, సామాన్య ప్రజానీకం కోసం సీఎం రోడ్డెక్కడం వంటి సీన్లు చూడటానికి బాగానే ఉన్నా.. వాస్తవికతకు ఎంతో దూరంలో ఉన్నట్టు అనిపిస్తుంది. ఈ కథ మొత్తం కూడా రైట్ టు రీకాల్ చట్టం గురించి తిరుగుతుంది. ఎన్నికైన ఎమ్మెల్యేల పనితీరు నచ్చక పోతే మధ్యలోనే పదవి నుంచి తీసేసే అధికారం ప్రజలకు ఉండాలని, ఆ చట్టం చేయాలని, దాని ఆవశ్యకతను చెప్పేందుకు వన్ మూవీని దర్శకుడు వాడుకున్నట్టు కనిపిస్తోంది. అయితే ఇది వాస్తవంగా జరగదు. కానీ సినిమాలో మాత్రం పాజిటివ్ ఎండ్ ఇచ్చి.. ప్రేక్షకులను మెప్పించే ప్రయత్నం చేశాడు దర్శకుడు. వన్ విషయంలో ముఖ్యంగా నేపథ్య సంగీతం ఎక్కువ ప్రభావితం చూపిస్తుంది. సీఎం ఎంట్రీ, ఆయన వ్యక్తిత్వాన్ని చూపేందుకు కొట్టిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందరినీ మెప్పిస్తుంది. కొన్ని సీన్లు రొటీన్ అనిపించేలా ఉంటాయి. వాటికి కత్తెరపడితే బాగుండేది. సినిమాటోగ్రఫీ బాగుంది. మాటలు కూడా ఆలోచనలు రేకెత్తించేలా ఉంటాయి. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. చివరగా : వన్.. నిజంగానే మమ్ముట్టిన నటనలో నెంబర్ వన్


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3yiaKyS
v

ప్రస్తుతం నా దృష్టి మొత్తం దానిపైనే.. పెళ్లి వార్తలపై ఎట్టకేలకు నోరు విప్పిన హీరోయిన్ త్రిష

‘వర్షం’, ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’,‘బాడీగార్డ్‌’, ‘స్టాలిన్‌’ వంటి సినిమాల్లో నటించి తెలుగు ప్రేక్షకులను అలరించిన నటి . తన అద్భుతమైన నటనతో తెలుగు ప్రేక్షకులను ఇంతకాలం అలరిస్తున్న ఆమె.. గత కొంతకాలంగా మాత్రం కాస్త స్లో అయ్యారు. సరైన అవకాశాలు రాకపోవడం.. వచ్చిన మంచి హిట్లు దొరక్కపోవడంతో సినిమాల విషయంలో ఆమె కాస్త గ్యాప్ ఇచ్చారు. ప్రస్తుతం లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్నారు. అయితే చాలాకాలంగా గురించి వార్తలు వస్తూనే ఉన్నాయి. కొన్నేళ్ల క్రితం ఆమె ఓ ప్రముఖ హీరోతో డేటింగ్‌లో ఉందంటూ పుకార్లు పుట్టుకొచ్చాయి. మరి దీంతో ఎంతవరకూ నిజం ఉందో ఎవరికీ తెలియదు. ఆ తర్వాత కూడా ఆమె మరో స్టార్ హీరోని వివాహం చేసుకోనుందంటూ వార్తలు వచ్చాయి. అవీ అవాస్తవమని తేలిపోయాయి. అయితే ఈ మధ్యకాలంలో త్రిష పెళ్లి పీటలు ఎక్కబోతుంది అంటూ గుసగుసలు వినిపించాయి. ఓ ప్రముఖ తమిళ డైరెక్టర్‌తో ఆమె ఏడు అడుగులు వేయబోతుంది అంటూ తెలిసింది. అయితే దీనిపై తాజాగా త్రిష టీమ్ క్లారిటీ ఇచ్చింది. ఆమె ఇప్పట్లో పెళ్లి చేసుకోవడం లేదంటూ స్పష్టం చేసింది. ప్రస్తుతం త్రిష దృష్టి మొత్తం సినిమాలు, నటన మీదనే ఉందని.. అది తప్ప ఆమెకు మరో ఆలోచన లేదని టీమ్ పేర్కొంది. ఇలా త్రిష పెళ్లి గురించి వచ్చిన వార్తలను నమ్మవద్దని ఆమె అభిమానులకు సూచించింది త్రిష టీమ్. కాగా ప్రస్తుతం త్రిష ‘పొన్నాయ్ సెల్వన్’, ‘సతురంగ వెట్టాయ్’ తదితర చిత్రాల్లో నటిస్తోంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3lgVU7V
v

నాన్న కోరిక అది.. వాళ్ళు చనిపోయాక 7 రోజుల పాటు! వరుస విషాదాలపై నోరువిప్పిన రాజీవ్ కనకాల

తెలుగు చిత్రసీమలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా, విలన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు రాజీవ్ కనకాల. సినిమా ఏదైనా, అందులో తన క్యారెక్టర్ ఎలాంటిదైనా ఇట్టే ఒదిగిపోయే ఎన్నో హిట్ సినిమాల్లో భాగమయ్యారు. అయితే రాజీవ్ ఇంట్లో ఆయన తల్లి, తండ్రి, చెల్లి వరుస మరణాలు తీవ్ర విషాదం నింపాయి. ముందు తల్లి లక్ష్మి కనకాల, ఆ తర్వాత తండ్రి దేవదాస్ కనకాల, ఆ చేదు జ్ఞాపకాల నుంచి బయటపడక ముందే సిస్టర్ శ్రీ లక్ష్మి మరణాలు రాజీవ్ కుటుంబాన్ని కుదిపేశాయి. తాజా ఇంటర్వ్యూలో ఈ విషాద ఘటనలపై ఓపెన్ అయ్యారు రాజీవ్ కనకాల. మీ నాన్న గారికి ఓ డ్రీమ్ ఉండేదటగా అని యాంకర్ అడిగిన ప్రశ్నపై స్పందించిన రాజీవ్.. నాన్న డైరెక్ట్ చేయమని ఫోర్స్ చేయడంతో ఓ సారి పైలెట్ ఎపిసోడ్ డైరెక్షన్ చేశానని చెప్పారు. నాన్న డైరెక్షన్ చేయాల్సిన సీన్లు తనతో చేయించారని తెలిపారు. అలా దూరదర్శన్‌లో వచ్చే ప్రోగ్రాం కోసం చాలా ఎపిసోడ్స్ డైరెక్షన్ చేశానని అన్నారు. ఆ తర్వాత తన కుటుంబంలో జరిగిన వరుస విషాదాలపై ఆయన రియాక్ట్ అయ్యారు. తన తల్లి 2018లో మరణించారని, ఆ తర్వాత ఏడాదిన్నరకు తన తండ్రి కూడా కన్నుమూశారని తెలిపారు రాజీవ్ కనకాల. సోఫాలో కూర్చొని అలాగే కిందపడటంతో ఆయనకు ఫ్యాక్చర్ అయిందని, ఆసుపత్రిలో జాయిన్ చేసి బెటర్ ట్రీట్‌మెంట్ ఇచ్చినా ప్రయోజనం లేదని అన్నారు. అనారోగ్యంతో చివరకు ఆగస్టు 2న తన తండ్రి మరణించారని, ఆయనకు ఎవరితో చేయించుకోవడం ఇష్టం లేదేమో అంటూ ఎమోషనల్ కామెంట్స్ చేశారు రాజీవ్. ఆ తర్వాత సిస్టర్ మరణం గురించి కూడా వివరణ ఇచ్చారు రాజీవ్ కనకాల. తన చెల్లికి చాలా రోజుల నుంచే క్యాన్సర్ ఉందని, అయితే ఆమె ఎవ్వరికీ చెప్పుకోలేదని, అందరికీ తెలిసే సమయానికి ఆ క్యాన్సర్ 4th స్టేజ్‌కి వెళ్లిందని అన్నారు. అప్పటినుంచి ప్రతి ఆరు నెలలకోసారి ట్రీట్‌మెంట్ తీసుకుంది కానీ చివరకు అదే క్యాన్సర్‌తో కన్నుమూసిందని తెలిపారు. అప్పటినుంచి 7 రోజుల పాటు బాధతో నిద్ర కూడా పోయలేదని అన్నారు. అలా వరుసపెట్టి మూడేళ్లలో మూడు విషాదాలు తమ కుటుంబాన్ని వెంటాడాయని తెలిపారు రాజీవ్.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3C7mQgy
v

సూపర్‌స్టార్ మహేష్ సినిమాపై మరో లేటెస్ట్ అప్‌డేట్.. ఆడియో రైట్స్ ఎవరివంటే..

‘భరత్ అనే నేను’, ‘మహర్షి’, ‘సరిలేరు నీకెవ్వరు’ వంటి వరుస భారీ సక్సెస్‌లు అందుకొని సూపర్ ఫామ్‌లో కొనసాగుతున్న తన 27వ సినిమాను ‘గీతగోవిందం’ ఫేమ్ పరశురామ్ దర్శకత్వంలో చేయబోతున్నారు. ‘’ అనే టైటిల్‌తో ఈ సినిమా తెరకెక్కనుంది. ఈ సినిమా గురించి ప్రకటించి చాలాకాలమే అయినా.. వచ్చిన అప్‌డేట్‌లు మాత్రం తక్కువే. ఇంతకాలం వరకూ సినిమా నుంచి ఎలాంటి అప్‌డైట్‌లు లేకపోవడంతో చిత్రయూనిట్‌పై మహేష్ అభిమానులు ఎంతో ఆగ్రహంతో ఉన్నారు. తమ అభిమాన నటుడి సినిమాపై ఎప్పుడు అప్‌డేట్ వస్తుందా అంటూ వాళ్లు ఎంతో ఆకలిగా ఎదురుచూస్తున్నారు. అలా ఆతృతగా ఉన్న అభిమానులకు తాజాగా చిత్ర యూనిట్ మంచి శుభవార్త అందించింది. ఈ నెల 31వ తేదీన సినిమా నుంచి ఫస్ట్‌లుక్ విడుదల అవుతుందని చిత్ర యూనిట్ ప్రకటించింది. తాజాగా ఈ సినిమా యూనిట్ నుంచి మరో అప్‌డేట్ బయటకు వచ్చింది. థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా మ్యూజిక్ రైట్స్‌ను ‘సరిగమ సౌత్’ సంస్థ సొంతం చేసుకున్నట్లు వెల్లడించారు. దీంతో త్వరలోనే ‘సర్కారు వారి పాట’ నుంచి పాటల సందడి కూడా ప్రారంభం అవుతుందని సంకేతం వచ్చినట్లే. ఇక ఈ సినిమాలో కీర్తీ సురేష్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై సినిమాను నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమాపై విడుదల అయ్యే అవకాశం ఉంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3BZZvwY
v

పవన్ కళ్యాణ్‌తో నిత్యామీనన్ రొమాన్స్.. కన్ఫర్మ్ చేసిన మేకర్స్! చీరకట్టులో సూపర్బ్ లుక్

రీ- ఎంట్రీ తర్వాత కెమెరా ముందు దూసుకుపోతున్న పవన్ కళ్యాణ్.. రానాతో కలిసి '' తెలుగు రీమేక్ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. మాటల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే- సంభాషణలు అందిస్తుండగా.. సాగ‌ర్ కె చంద్ర ద‌ర్శ‌క‌త్వం వహిస్తున్నారు. తాజాగా ఈ మూవీ హీరోయిన్ విషయమై అఫీషియల్ స్టేట్‌మెంట్ ఇచ్చారు మేకర్స్. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన నటిస్తున్నట్లుగా ఎప్పటినుంచో వార్తలు వస్తున్నాయి. తొలిసారి పవన్‌ కళ్యాణ్‌తో జోడీ కడుతున్న ఈ బొద్దుగుమ్మ త్వరలోనే షూటింగ్‌లో జాయిన్ కానుందని చెప్పుకున్నారు. తాజాగా దీనిపై క్లారిటీ ఇస్తూ నిత్యామీనన్ షూటింగ్‌లో జాయిన్ అయిందని పేర్కొంది చిత్రయూనిట్. ఈ మేరకు రిలీజ్ చేసిన కొత్త పోస్టర్‌లో చీరకట్టులో కనిపించి అట్రాక్ట్ చేసింది నిత్య. ఈ సినిమాలో పవన్ భార్యగా ఆమె నటించనుందని తెలుస్తోంది. ఇంకా టైటిల్ డిసైడ్ చేయని ఈ సినిమాలో భీమ్లా నాయక్‌గా పవన్ కళ్యాణ్ పవర్ ఫుల్ రోల్ పోషిస్తున్నారు. రీసెంట్‌గా విడుదలైన ఆయన లుక్ పవర్ స్టార్ అభిమానులకు పూనకాలు తెప్పించి సినిమాపై భారీ హైప్ క్రియేట్ చేసింది. సితార ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై ప్రొడక్షన్ నెంబర్ 12గా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ప‌వర్‌ స్టార్ ప‌వ‌న్‌ క‌ళ్యాణ్‌, వెర్స‌టైల్ హీరో రానా ద‌గ్గుబాటి కాంబినేష‌న్‌లో రాబోతున్న సినిమా కావడంతో ప్రేక్షకులు ఓ రేంజ్ అంచనాలు పెట్టుకున్నారు. చిత్రంలో సముద్రఖని, మురళీశర్మ, బ్రహ్మాజీ, నర్రా శ్రీను కీలక పాత్రలు పోషిస్తున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3zVOZFt
v

ఇష్క్ మూవీ రివ్యూ.. భరించడం పెద్ద రిస్క్!

కరోనా సెకండ్ వేవ్ తరువాత చాలా గ్యాప్‌తో థియేటర్లు తెరుచుకున్నాయి. సినీ అభిమానులు కూడా థియేటర్లో సినిమా చూసి ఆ అనుభూతిని పొందాలని ఎదురుచూశారు. అలాంటి వారి ముందుకు నేడు (జూలై 30) తేజ సజ్జా, నటించిన చిత్రం వచ్చింది. మళయాలి సినిమా ఇష్క్‌కు రీమేక్‌గా వచ్చిన ఈ మూవీ తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుందా? లేదా? తేజ సజ్జాకు హిట్ వచ్చిందా? లేదా అన్నది చూద్దాం. సిద్దార్థ్ అలియాస్ సిద్దు () ఓ సాఫ్ట్ వేర్ ఉద్యోగి. అనసూయ అలియాస్ అను (ప్రియా ప్రకాశ్ వారియర్)తో సిద్దు ప్రేమలో ఉంటాడు. అలా అను బర్త్ డే సందర్భంగా ఆమెతో లాంగ్ డ్రైవ్ ప్లాన్ చేస్తాడు సిద్దు. లాంగ్ డ్రైవ్‌లో భాగంగా సిద్దు,అనులకు వింత పరిస్థితులు ఏర్పడుతాయి. సిద్దు, అనులు సన్నిహితంగా ఉన్న సమయంలో ఫోటోలు, వీడియోలు తీస్తాడు మాధవ్ (రవీందర్). పోలీస్ ఆఫీసర్ అంటూ ఆ ఇద్దరి భయపెట్టి బ్లాక్ మెయిల్ చేస్తాడు. కారులోనే అనుతో మాధవ్ అసభ్యకరంగా ప్రవర్తిసాడు. డబ్బులిస్తాను వదిలేయ్ అంటూ సిద్దు బతిమాలాడతాడు. అయినా అతని బుద్దిని చూపిస్తాడు. అను మీద కన్నేసిన అతను తప్పుగా ప్రవర్తిస్తాడు. చివరకు సిద్దు ఏం చేశాడు? పోలీస్ అంటూ వేధించిన వ్యక్తికి ఎలా బుద్ది చెప్పాడు? చివరకు అను సిద్దుల కథ ఎలా ముగిసింది? అనే ప్రశ్నలకు సమాధానమే ఇష్క్. సిద్దు పాత్రలో తేజ సజ్జ, అను క్యారెక్టర్‌లో ప్రియా ప్రకాశ్ వారియర్ బాగానే నటించారు. ఇంకా కొన్ని సీన్లలో తేజ ఇంకా చిన్న పిల్లాడిలానే కనిపిస్తాడు. ఇక ప్రియా వారియర్‌ కూడా బాగానే మెప్పించే ప్రయత్నం చేశారు. ఇందులో ఎక్కువగా ఆమె చేసింది ఏమీ లేకపోయినా కూడా ఉన్నంతలో ఆకట్టుకున్నారు. ఇందులో విలన్ లాంటి పాత్రలో రవీందర్ బాగానే ఆకట్టుకున్నారు. మిగతా పాత్రల్లో అందరూ తమ పరిధి మేరకు నటించారు. మళయాలి సినిమాకు రీమేక్‌గా వచ్చిన ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులకు సహన పరీక్షలా మారుతుంది. మార్పులు చేర్పులు చేసిన దర్శకుడు యస్ యస్ రాజు తెలుగు ప్రేక్షకులను మెప్పించలేకపోవచ్చు. ప్రేమజంటపై దాడులు, వేధింపులు అనే పాయింట్ కొత్తగానే ఉన్నా కూడా కథనం, తెరకెక్కించిన విధానం ఏమంత మెప్పించదు. ఎక్కడా కూడా ప్రేక్షకులను కథలో లీనం చేసేట్టుగా అనిపించదు. నిజమైన ప్రేమకు అర్థం చెప్పే క్రమంలో అలాంటి ఎండింగ్ ఇచ్చాడో మరేదైనా ఉద్దేశ్యంలో అలాంటి ముగింపు ఇచ్చాడో అర్థం కాక ప్రేక్షకుడు బయటకు వస్తాడు. సిద్దు కూడా ఆ పనులన్నీ ప్రేమతో చేశాడా? లేదా కోపంతోనా? అనుమానంతోనా? అనే సందేహాన్ని ప్రేక్షకులకు అలానే తీర్చకుండా వదిలేస్తాడు. ఇష్క్ సినిమాకు కలిసొచ్చే అంశం నిడివి మాత్రమే. సంగీతం విషయానికి వస్తే ఒకే ఒక్క పాట ఆకట్టుకుంటుంది. మాటలు ఉన్నా కూడా అవేమీ అంతగా ప్రభావితం చూపించవు. ఎడిటింగ్, సినిమాటోగ్రఫీ ఇలా ఏవీ కూడా సినిమాను కాపాడలేకపోవచ్చు. చివరగా : ఇష్క్.. భరించడం పెద్ద రిస్క్


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3zLwvqW
v

‘తిమ్మరుసు’ రివ్యూ.. సత్యదేవ్ కేసు గెలిచినట్టే!

యువ నటుడు సత్యదేవ్.. బ్రిలియంట్ యాక్టర్ అని తన విలక్షణ నటనతో ఇప్పటికే నిరూపించుకున్నాడు. ఒక పరిపూర్ణ నటుడుకి ఉండాల్సిన క్వాలిటీస్ అన్నీ సత్యదేవ్‌లో ఉన్నప్పటికీ స్టార్ హీరో ఇమేజ్ మాత్రం అందని ద్రాక్షగానే మిగిలిపోయింది. అయితే ‘తిమ్మరుసు’ చిత్రంతో థియేటర్స్‌ని రీ ఓపెన్ చేయించిన సత్యదేవ్ స్టార్ హీరో అనిపించుకున్నాడా? సెకండ్ వేవ్ తరువాత థియేటర్స్‌లో ‘తిమ్మరుసు’ పండుగ వాతావరణాన్ని తీసుకుని వచ్చాడా అన్నది సమీక్షలో చూద్దాం. ఇన్నాళ్లూ మంచి కంటెంట్ ఉన్న కథల్ని ఎంచుకున్న సత్యదేవ్.. తన పంథా కొనసాగిస్తూ.. ఈసారి ‘తిమ్మరుసు’గా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ‘బీర్బల్ త్రయం కేస్ 1: ఫైండింగ్ వజ్రముని’ అనే కన్నడ చిత్రానికి ఇది రీమేక్ కాగా.. కొరియన్ మూవీ ‘న్యూ ట్రయల్’ ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించారు. ఎంగేజింగ్ మర్డర్ ఇన్వెస్టిగేషన్‌తో చిత్ర కథ మొదలౌతుంది. సత్యదేవ్ సినిమా జర్నీ మొదలుపెట్టింది 2011లోనే కాగా.. ఈ చిత్రం కూడా 2011 నేపథ్యంలోనే ప్రారంభం అవుతుంది. యావజ్జీవ శిక్షను తప్పించడానికి లాయరు చేసే పోరాటమే ‘తిమ్మరుసు’. చేయని తప్పుకి శిక్ష అనుభవిస్తున్న ఓ ఖైదీని లాయర్ రామ్ (సత్యదేవ్) ఎలా కాపాడాడు? అన్నదే కథ. ఒక బార్‌లో పనిచేస్తున్న వాసు (అంకిత్) డ్యూటీ ముగించుకుని ఇంటికి వెళ్తున్న టైంలో అరవింద్ అనే క్యాబ్ డ్రైవర్‌ని దారుణంగా హత్య చేస్తారు. నిందితుడు పారిపోతుండగా.. వాసు పోలీసులకు సమాచారం ఇస్తాడు. అయితే ఆ కేసులో వాసుని ఇరికిస్తాడు పోలీస్ ఇన్ స్పెక్టర్ భూప‌తిరాజు (అజయ్). దీంతో చేయని నేరానికి ఎనిమిదేళ్లు శిక్ష అనుభవించి బెయిల్‌పై బయటకు వస్తాడు వాసు. ఆ కేసుని రీ ఓపెన్ చేయించి అతని కోసం పోరాడతాడు రామ్. అయితే ఆ కేసుకి రామ్‌కి సంబంధం ఏంటి? ఆ చనిపోయిన అరవింద్ ఎవరు? ఇంతకీ హత్య చేసింది ఎవరు? అన్నదే మిగిలిన కథ. కోర్టు డ్రామా నేపథ్యంలో వచ్చిన కథలు చాలావరకూ సక్సెస్ అయ్యాయి. అయితే వాదనలు ఎక్కువైతే జనం బోర్ ఫీల్ అయ్యే ప్రమాదం ఉంటుంది. అందుకే ‘తిమ్మరుసు’లో వాదనల జోలికి పెద్దగా పోకుండా కేవలం మర్డర్ ఇన్వెస్టిగేషన్‌తో కథను నడిపారు దర్శకుడు శరణ్ కొప్పిశెట్టి. కేవలం 39 రోజుల్లోనే సినిమాని కంప్లీట్ చేయడం కొసమెరుపు కాగా.. ఎంత వేగంగా అయితే షూటింగ్ కంప్లీట్ చేశారో.. ఈ చిత్రంలోని స్క్రీన్ ప్లే కూడా అంతే వేగంగా పరిగెడుతున్నట్టుగానే ఉంటుంది. చిన్న చిన్న లాజిక్‌లు మిస్ అయినా పాత్రల్లో ఉన్న పర్ఫెక్షన్ ప్రేక్షకుల్ని నిరాశ పరచదు. నెక్స్ట్ ఏం జరుగుతుందనే థ్రిల్‌ని మిస్ కాకుండా కథను ఆసక్తికరంగా మలచడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు. ఇంటర్వెల్ ట్విస్ట్‌తో సినిమాపై ఆసక్తిని పెంచాడు. క్రైమ్ థ్రిల్లర్ చిత్రాలకు ఉండాల్సిన ప్రాథమిక సూత్రం.. ఆడియన్స్‌ని కథలో ఇన్వాల్వ్ చేయడం.. నెక్స్ట్ ఏం జరుగుతుందనే క్యూరియాసిటీ క్రియేట్ చేయడం.. ‘తిమ్మరుసు’లో ఈ మ్యాజిక్ అక్కడక్కడా కనిపిస్తుంది కానీ.. అదే ఫ్లో కంటిన్యూ చేయలేకపోవడం లోటుగా కనిపిస్తుంది. మర్డర్ వెనుక ఉన్నమిస్టరీని కనిపెట్టే ప్రయత్నంలో ఎన్నో చిక్కుముడులు.. ఆ చిక్కుముడిని విప్పే ప్రయత్నంలో మరో ట్విస్ట్.. కన్నడ కథను రీమేక్ చేసినా అందులోని ఒరిజినాలిటీ మాత్రం పోగొట్టకుండా ‘తిమ్మరుసు’ని ఆసక్తికరంగానే మలిచాడు దర్శకుడు. అయితే క్లైమాక్స్ ఏదో ఉంటుందని భారీ హైప్ ఇచ్చి చివర్లో ఓస్ ఇంతేనా అనేట్టుగా చేశారు. నిజానికి ఈ మర్డర్ మిస్టరీకి కథ కొసరంతే కానీ కథనమే ప్రధాన బలం. హీరో క్యారెక్టర్‌ను ఎస్టాబ్లిష్ చేయడానికి అనవసరమైన హంగామా చేయకుండా సింపుల్‌గా కథలోకి తీసుకుని వెళ్లారు. కథానాయకుడి కోసం కథ అని కాకుండా.. కథ కోసం కథానాయకుడు అన్నట్టుగా హీరో పాత్ర ఉంటుంది. ఎవరైనా లాయర్ కేసు గెలిస్తే బైక్ నుంచి కారుకి వెళ్తారు.. కానీ రామ్ కారు నుంచి బైక్‌కి వచ్చాడు.. లాంటి చిన్న డైలాగ్ ద్వారా హీరో పాత్ర స్వభావం ఏంటన్నది చాలా చమత్కారంగా చూపించాడు దర్శకుడు. గతంలో కూడా సత్యదేవ్ థ్రిల్లర్ చిత్రాలను చేశాడు కానీ.. అందులో యాక్షన్ ఎపిసోడ్స్ లోటుగా కనిపిస్తుంది.. కానీ ఈ చిత్రంలో వాటిని ఫుల్ ఫిల్ చేశాడు సత్యదేవ్. లిఫ్ట్ ఫైట్ సినిమాలో హైలైట్ కాగా.. యాక్షన్ సీన్స్‌‌కి కూడా తాను చేయగలనని చూపించాడు సత్య దేవ్. ఇక కథలో కీలకమైన పాత్ర వాసు.. ఈ పాత్రలో అద్భుతంగా నటించాడు అంకిత్. అతని చుట్టూనే కథ నడుస్తుంది. ఇక హీరోకి అసిస్టెంట్ లాయర్‌గా నటించిన ప్రియాంక జవాల్కర్‌కి పెద్ద ఇంపార్టెన్స్ లేదు. ఈసినిమాలో సాంగ్స్ లేవు కాబట్టి.. హీరోకి ప్రియురాలి పాత్రలో సెటిల్ అయిపోయింది. ఇక బ్రహ్మాజీ.. సుధాకర్ పాత్రలో అదరగొట్టేశాడు.. అతని ప్రతి పంచ్‌కి థియేటర్స్‌లో నవ్వులు వినిపించాయి. హీరోతో పాటు జర్నీ చేసి లాయర్ పాత్రలో ఫుల్ లెంగ్త్ రోల్ చేశాడు బ్రహ్మాజీ. క్రిమినల్ లాయర్‌గా కనిపించిన రవిబాబు ఉన్నంతలో పర్వాలేదు. ఇక ఝాన్సీ, అజయ్, హర్ష, ప్రదీప్ తమ పాత్రలకు న్యాయం చేశారు. శ్రీచరణ్ నేపథ్య సంగీతం సినిమాకి ప్లస్ కాగా.. అప్పు ప్రభాకర్ కెమెరాపనితనం బాగుంది. హీరో సత్యదేవ్‌ని లాయర్‌గా బాగా చూపించారు. ప్రొడక్షన్ వాల్యూస్ సినిమాకి తగ్గట్టుగానే ఉన్నాయి. చివరిగా.. ‘తిమ్మరుసు’ కేసుతో పాటు బాక్సాఫీస్‌ని గెలిచినట్టే!!


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3ldKwd8
v

‘లక్ష్య’ నుంచి కొత్త పోస్టర్ రిలీజ్.. హీరోని అక్కడ ముద్దు పెట్టుకుంటున్న హీరోయిన్..

నాగశౌర్య హీరోగా సంతోష్‌ జాగర్లపూడి దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘ల‌క్ష్య’. సోనాలి నారంగ్ స‌మ‌ర్పణ‌లో శ్రీ వేంకటేశ్వర సినిమాస్‌ ఎల్‌ఎల్‌పి, నార్త్‌స్టార్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ప‌తాకాల‌పై నారయణదాస్ కె. నారంగ్‌, పుస్కూర్‌ రామ్‌మోహన్‌రావు, శరత్‌ మరార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. నాగ‌‌శౌర్య స‌ర‌స‌న కేతిక శ‌ర్మ హీరోయిన్‌గా న‌టిస్తోన్న ఈ చిత్రంలో ఒక కీల‌క పాత్రలో విలక్షణ న‌టుడు జ‌గ‌ప‌తి బాబు న‌టిస్తున్నారు. ఆర్చరీ క్రీడా ఆధారంగా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఈ సినిమాలో నాగశౌర్య మాజీ ఆర్చరీ ప్లేయర్ పాత్రలో కనిపించనున్నారు. కరోనా సెకండ్ వేవ్‌కి ముందు ఈ ఏడాది జవనరిలో సినిమా షూటింగ్‌ని మళ్లీ ప్రారంభించినట్లు ప్రకటించిన చిత్ర యూనిట్. కొద్ది రోజుల తర్వాత సినిమా టీజర్‌ని కూడా విడుదల చేసింది. ఈ టీజర్‌లో నాగశౌర్య లుక్స్.. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్.. తదితర విషయాలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ సినిమా నుంచి మరో కొత్త పోస్టర్‌ని చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ పోస్టర్‌లో హీరో నుదుటిపై హీరోయిన్ ముద్దు పెట్టడం మనం చూడొచ్చు. ఈ అప్‌డేట్ చూసిన తర్వాత సినిమా నుంచి మరిన్ని అప్‌డేట్స్ వస్తాయని అబిమానుల్లో ఆశాభావం పెరిగిపోయింది. అయితే ఆ అప్‌డేట్స్ సినిమా ట్రైలర్ గురించా.. లేక మొదటి సింగిల్ గురించా అనే విషయం తెలియాలి అంటే చిత్ర యూనిట్ నుంచి అధికారికంగా ప్రకటన వచ్చే వరకూ వేచి చూడాల్సిందే.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3BSujjv
v

కెమెరా ముందు దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు స్పీడ్.. షాకింగ్ లుక్! రాజమౌళి, పవన్ కళ్యాణ్ కామెంట్స్

శ‌తాధిక చిత్రాల ద‌ర్శ‌కుడు, టాలీవుడ్ దిగ్గజం తొలిసారి కెమెరా ముందుకొచ్చారు. తన దర్శకత్వ పర్యవేక్షణలో రూపొందుతున్న '' సినిమాతో ఆయన వెండితెరపై అలరించబోతున్నారు. విశిష్ట అనే పాత్రలో రాఘవేంద్రుడిని చూడబోతున్నాం. తాజాగా ఆయన ఇంట్రడ్యూసింగ్ వీడియో రిలీజ్ చేసి ఆకట్టుకున్నారు మేకర్స్. ఇందులో అన్ని వర్గాల ప్రేక్షకులను ఫిదా చేసేలా ఉంది. సూటు, బూటు వేసి గాగుల్స్ పెట్టి యమ స్టైలిష్‌గా కనిపించారు రాఘవేంద్ర రావు. దర్శకేంద్రుడి శిష్యుడు, దర్శక ధీరుడ రాజమౌళి ఈ వీడియోని ట్విట్టర్‌లో షేర్ చేస్తూ ఆసక్తికర కామెంట్స్ చేశారు. 100కు పైగా చిత్రాలకు దర్శకత్వం వహించి 'మౌనముని' ఇప్పుడు కెమెరా ముందుకొచ్చారు. ఆయన ఫస్ట్ లుక్ చూడండి అంటూ 'పెళ్లి సందD'వీడియోను ప్రేక్షకులతో పంచుకున్నారు రాజమౌళి. మరోవైపు పవన్ కళ్యాణ్ కూడా రాఘవేంద్ర రావుకు బెస్ట్ విషెష్ చెబుతూ ఓ లేఖ రాశారు. మొత్తానికైతే రాఘవేంద్ర రావు అలా కెమెరా ముందు చూసి తెలుగు ప్రేక్షకలోకం మురిసిపోతోంది. పాతికేళ్ల క్రిందట శ్రీకాంత్ హీరోగా 'పెళ్లి సందడి' సినిమాతో మ్యూజికల్ బ్లాక్ బస్టర్ హిట్ అందించిన దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు.. ఇప్పుడు మోడ్రన్ 'పెళ్లి సంద‌D' తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమాలో శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా నటిస్తుండటం విశేషం. రోషన్ సరసన శ్రీ లీల హీరోయిన్‌గా నటిస్తోంది. రాఘవేంద్ర రావు దర్శకత్వ పర్యవేక్షణలో గౌరి రోనంకి దర్శకత్వం వహిస్తున్నారు. కె. కృష్ణమోహన్ రావు సమర్పిస్తుండగా మాధవి కోవెలమూడి, శోభు యార్లగడ్డ, ప్రసాద్‌ దేవినేని నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. చిత్రంలో ప్రకాష్ రాజ్‌, రాజేంద్ర ప్ర‌సాద్‌, రావు ర‌మేష్‌, త‌నికెళ్ల భ‌ర‌ణి, పోసాని కృష్ణ ముర‌ళి, వెన్నెల కిషోర్‌, స‌త్యం రాజేష్‌, రాజీవ్ క‌నకాల‌, శ్రీ‌నివాస్ రెడ్డి, శక‌లక శంక‌ర్‌, అన్న‌పూర్ణ‌, జాన్సి, ప్ర‌గ‌తి, హేమ‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2UYe8Ay
v

సేవ్ సినిమా.. రివ్యూ రైటర్స్‌కి బ్రహ్మాజీ అభ్యర్థన! అలా చేయండంటూ నేరుగా చెప్పిన యాక్టర్

సినిమా అనే రంగుల ప్రపంచంలో ప్రతి ఒక్కరి పాత్ర కీలకమే. నిర్మాత, దర్శకుడు మొదలుకొని చిత్ర నిర్మాణంలో భాగమయ్యే నటీనటులు, సాంకేతిక నిపుణులు అందరిపై ఒక్కో బాధ్యత ఉంటుంది. ఎవరికి వారు వారి వారి పనులకు న్యాయం చేస్తేనే అనుకున్న అవుట్‌పుట్ బయటకొస్తుంది. ఇక ఆ సినిమా రిలీజ్ తర్వాత పరిస్థితి ఎలా ఉంటుంది? ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారనే దానిపై చిత్ర విజయం ఆధారపడి ఉంటుంది. అయితే ఈ ప్రక్రియలో రివ్యూ రైటర్స్‌ది కీలక పాత్ర అని చెప్పుకోవచ్చు. మూవీ రిలీజ్ అయ్యాక రివ్యూ రైటర్స్ సగటు ప్రేక్షకుడిని దృష్టిలో పెట్టుకొని సినిమాపై వారి వారి ఒపీనియన్స్ బయటపెడుతుంటారు. హీరో హీరోయిన్ల నటనతో పాటు దర్శకుడి ప్రతిభ, నిర్మాణ విలువలు, సాంకేతిక నిపుణుల పనితీరుపై ఓ వివరణ ఇస్తుంటారు. ఇవన్నీ కూడా సినిమా హిట్ కావడం, కాకపోవడంపై ఎంతోకొంత ప్రభావం చూపుతుంటాయి. అయితే తాజా పరిస్థితుల నడుమ సీనియర్ నటుడు రివ్యూ రైటర్స్‌కి బ్రహ్మాజీ ఓ అభ్యర్థన పెట్టడం సినీ వర్గాల్లో హాట్ టాపిక్ అయింది. ''ఈ గడ్డు కాలంలో ఓ రెండు మంచి మాటలు రాసి జనాలను థియేటర్‌కి రప్పించండి. లేకపోతే రివ్యూ రాయడానికి సినిమాలు ఉండవు.. సినిమా చూడడానికి థియేటర్స్ ఉండవు.. సేవ్ సినిమా సేవ్ థియేటర్స్. థాంక్యూ'' అని పేర్కొంటూ తన సోషల్ మీడియా ఖాతాలో ట్వీట్ చేశారు బ్రహ్మాజీ. ఆయన చేసిన ఈ పోస్ట్‌పై నెటిజన్స్ మిశ్రమంగా స్పందిస్తూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ రోజే విడుదలైన 'తిమ్మరుసు' సినిమాలో కీలక పాత్ర పోహ్సించారు బ్రహ్మాజీ. ఆయన చేసిన కామెడీ సినిమాలో స్పెషల్ అట్రాక్షన్ అయిందని తెలుస్తోంది. ఈ మేరకు 'తిమ్మరుసు'పై ఇప్పటివరకు వచ్చిన ట్విట్టర్ రెస్పాన్స్ పోస్ట్ చేస్తూ సినిమాపై హైప్ తీసుకొస్తున్నారు బ్రహ్మాజీ.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3j22E6U
v

Thursday 29 July 2021

సోడాల శ్రీదేవి ఇక్కడ.. పగిలిపోద్ది! సుధీర్ బాబుకు పంచ్ ఇచ్చిన హీరోయిన్.. వీడియో వైరల్

యంగ్ హీరో హీరోగా రాబోతున్న కొత్త సినిమా ''. ఈ సినిమాలో సుధీర్ బాబు క్యారెక్టర్ చాలా డిఫరెంట్‌గా ఉండబోతోంది. 'అక్కడుంది లైటింగ్ సూరి బాబు.. కొంచెం ఓల్టేజ్ ఎక్కువే ఉంటది' అంటూ మాస్ అప్పీయరెన్స్ ఇవ్వబోతున్నారు. డిఫరెంట్ కంటెంట్‌తో ఈ మూవీ తెరకెక్కుతోందని ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, వీడియోలు చెప్పకనే చెప్పేశాయి. ఈ నేపథ్యంలో తాజాగా సోడాల శ్రీదేవిని పరిచయం చేస్తూ ఇంట్రో వీడియో రిలీజ్ చేశారు మేకర్స్. చిత్రంలో సుధీర్ బాబు సరసన నటిస్తున్న హీరోయిన్ 'సోడాల శ్రీదేవి'గా నటిస్తోంది. తాజాగా విడుదలైన ఇంట్రో వీడియోలో ఆమె లుక్, డైలాగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. 'గోలి గొంతులోకి దిగుద్ది జాగత్త', 'ఒకడు సోడా సోడా అని మా కొట్టు దగ్గర తిరిగితే సోడా తీసి వాడి నెత్తిమీద కొట్టా. అప్పటినుంచి నా పేరు అయింది' అంటూ వచ్చిన డైలాగ్స్ ఆసక్తి రేకెత్తించాయి. ఇకపోతే ఈ వీడియోను సోషల్ మీడియా ద్వారా పంచుకున్న సుధీర్ బాబు.. ''తట్టుకోలేనంత కోపం, పట్టలేనంత ప్రేమ'' అంటూ ట్యాగ్ చేశాడు. దీంతో ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ప‌లాస 1978 సినిమాతో అరంగేట్రంలోనే మంచి పేరు సంపాదించిన క‌రుణ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో ఈ 'శ్రీదేవి సోడా సెంటర్' సినిమా తెరకెక్కుతోంది. 70 ఎమ్ ఎమ్ ఎంట‌ర్ టైన్మెంట్స్ బ్యాన‌ర్‌పై ప్రొడ‌క్ష‌న్ నెం. 4గా నిర్మితమవుతున్న ఈ చిత్రానికి విజ‌య్ చిల్లా, శ‌శిదేవి రెడ్డి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. మెలోడి కింగ్ మ‌ణిశ‌ర్మ సంగీతం అందిస్తున్నారు. చిత్రంలో లైటింగ్ మెన్ సూరిబాబు పాత్రలో సుధీర్ బాబు కనిపించనున్నారు. నరేష్, రఘుబాబు, అజయ్‌, సత్యం రాజేశ్‌, హర్షవర్థన్‌, సప్తగిరి, రోహిణి తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. అతి త్వరలో ఈ సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేయనున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3fcu494
v

Radhe Shyam Release Date: రాధే శ్యామ్ రిలీజ్ డేట్ అఫీషియల్ అనౌన్స్‌మెంట్.. సంక్రాంతి రేసులో ప్రభాస్

యంగ్ రెబల్ స్టార్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న '' సినిమాకు సంబంధించి కీలక అప్‌డేట్ ఇచ్చారు మేకర్స్. భారీ పాన్ ఇండియా మూవీగా రాబోతున్న ఈ మూవీ నుంచి ఇప్పటికే విడుదలైన ఫస్ట్‌లుక్, మోషన్ పోస్టర్, టీజర్‌లు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఆ తర్వాత లాక్ డౌన్ రావడం, షూటింగ్స్ వాయిదా పడటంతో చిత్ర యూనిట్ అప్‌డేట్స్ కరువయ్యాయి. పైగా ముందుగా చెప్పిన రిలీజ్ డేట్ జులై 30కి ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాలేకపోయింది. ఈ నేపథ్యంలో అదే రోజు జులై 30న కీలక అప్‌డేట్ ఇస్తామని ప్రకటించిన చిత్రయూనిట్.. తాజాగా కొత్త పోస్టర్ వదులుతూ న్యూ రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. ప్రభాస్ సంక్రాంతి బరిలో నిలుస్తారని తెలుపుతూ అధికారిక ప్రకటన ఇచ్చారు. వచ్చే ఏడాది జనవరి 14వ తేదీన 'రాధే శ్యామ్' ప్రేక్షకుల ముందుకు రానుందని తెలిపారు. ఈ మేరకు రిలీజ్ చేసిన కొత్త పోస్టర్‌లో చేతిలో సూట్ కేసు పట్టుకొని యమ స్టైలిష్ లుక్‌లో కనిపించి అట్రాక్ట్ చేశారు ప్రభాస్. విడుదలైన కొన్ని క్షణాల్లోనే ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ప్రభాస్ ఫ్యాన్స్ లైకులతో మోత మోగిస్తున్నారు. పీరియాడికల్‌ లవ్‌ స్టోరీగా యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై రాధాకృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ 'రాధే శ్యామ్' సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది. యు.వి.కృష్ణంరాజు సమర్పణలో వంశీ కృష్ణారెడ్డి, ప్రమోద్‌ ఉప్పలపాటి నిర్మిస్తున్నారు. భాగ్య శ్రీ, సచిన్ కేడ్కర్, ప్రియదర్శి, సాషా ఛేత్రీ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. తెలుగు, తమిళ, మలయాళీ, హిందీ, కన్నడ భాషల్లో ఈ మూవీ రిలీజ్ కానుంది. ఇప్పటికే ఈ మూవీ చివరి షెడ్యూల్ ఫినిష్ అయినట్లు తెలిపిన దర్శకనిర్మాతలు అతి త్వరలో పోస్ట్ ప్రొడక్షన్ పనులు స్టార్ట్ చేయనున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3BPZwUp
v

KTR: మరీ ఇంత దారుణమా? పరిష్కారం మీరే చూపాలంటూ రష్మి తీవ్ర ఆవేదన.. మంత్రి కేటీఆర్‌‌కి రిక్వెస్ట్

బుల్లితెర యాంకర్‌గా జబర్దస్తీ చేస్తూ అప్పుడప్పుడూ వెండితెరపై తళుక్కున మెరుస్తున్న యాంకర్ తాజాగా ఓ విషయమై తీవ్ర ఆవేదన చెందింది. తన ప్రోగ్రామ్స్, షూటింగ్స్ తదితర కార్యక్రమాలతో బిజీగా ఉంటూనే సోషల్ మీడియాలో యాక్టివ్ రోల్ పోషిస్తూ నిత్యం పలు విషయాలపై రియాక్ట్ అవుతుంటుంది ఈ జబర్దస్త్ యాంకర్. ఈ నేపథ్యంలోనే తీవ్ర ఆవేదనతో తాజాగా మంత్రి కేటీఆర్‌ని ట్యాగ్ చేస్తూ ఓ రిక్వెస్ట్ చేసింది రష్మి. ఈ సృష్టిలోని మూగ జీవాలంటే రష్మికి ఎంతో ఇష్టం. మూగ జీవులను రక్షించే బాధ్యత మనుషులపై ఉందని ఇప్పటికే పలుసార్లు సూచించింది రష్మి. మూగ జీవాలన్నాక చిన్న పెద్ద అనే తేడాలేదని, సృష్టి లోని జీవాలన్నింటినీ కాపాడుకోవాలంటూ పలు సందర్భాల్లో ఆమె చెప్పుకొచ్చింది. ఈ సృష్టిలోని మూగ జీవాలను ఏ చిన్న హాని కలిగిందని తెలిసినా ఓ జంతు ప్రేమికురాలిగా వెంటనే దాన్ని ఖండిస్తూ వస్తోంది రష్మి. లాక్ డౌన్ వేళ అంతా అన్నదానాలు, ఆర్ధిక సాయాలు చేస్తుంటే రష్మి మాత్రం మూగ జీవాల ఆకలి తీర్చింది. వీధి కుక్కలకు స్వయంగా ఆహారం పంచుతూ వాటిపై ప్రేమను చాటుకుంది. అయితే కొంతకాలంగా హైదరాబాద్‌ (GHMC) పరిధిలో వీధి కుక్కల సంతతిని తగ్గించేందుకు గాను వీధుల్లోని శునకాలకు వైద్య సిబ్బంది ఆపరేషన్‌ చేసి అలాగే వదిలేస్తున్నారు. ఆపరేషన్‌ తర్వాత చేయాల్సిన చికిత్స చేయకుండానే రోడ్లపై విడిచి పెడుతున్నారు. ఈ విషయాన్ని ‘సేవ్‌ యానిమల్స్‌ ఇండియా’ అనే ట్విటర్‌ ఖాతా ద్వారా ఓ నెటిజన్‌ కొంతకాలంగా ట్విటర్‌లో పోస్ట్ చేస్తూ సదరు వీధికుక్కల ఫొటోస్ కూడా పోస్ట్ చేస్తున్నాడు. ఇది రష్మి కంటపడటంతో వెంటనే ఆమె మంత్రి కేటీఆర్ సాయం కోరింది. GHMC పరిధిలోని శునకాలకు ఏబీసీ (యానిమల్‌ బర్త్‌ కంట్రోల్‌) వారు ఆపరేషన్‌ చేసి అలాగే వదిలేస్తున్నారని, దీనికి సరైన పరిష్కార చర్యలు తీసుకోవాలని కేటీఆర్‌కి రిక్వెస్ట్ పెట్టింది. మరోవైపు, కొంతమంది వైద్య సిబ్బంది తమ రోజువారీ టార్గెట్‌ రీచ్ కావడం కోసం ఇలా నోరులేని జీవాలను హింసించడం సరికాదని అభిప్రాయం జనాల నుంచి వ్యక్తమవుతోంది. చూడాలి మరి రష్మి రిక్వెస్ట్‌పై కేటీఆర్ రియాక్షన్ ఎలా ఉంటుందనేది!.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3fbnJe4
v

తిమ్మరుసు ట్విట్టర్ రివ్యూ: సినిమాపై ప్రేక్షకుల అభిప్రాయం ఎలా ఉందంటే..

వైవిద్యభరితమైన సినిమాలు ఎంచుకుంటూ తనదంటూ ప్రత్యేకమైన దారి అని నిరూపించుకుంటున్నారు యాక్టర్ సత్యదేవ్. సినిమా సినిమాకీ వైవిధ్యం ప్రదర్శించే నటుల్లో ఈయన ఒకరని చెప్పుకోవచ్చు. లీడ్ రోల్ పోషించిన తాజా సినిమా ''. నేడు (జులై 30) ఈ సినిమా తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అయితే ఇప్పటికే యూఎస్ షోస్, ప్రీమియర్స్ చూసిన ఆడియన్స్ ఈ సినిమాపై తమ తమ అభిప్రాయాలు వెల్లడిస్తూ ట్వీట్స్ పెడుతున్నారు. అందులో కొన్ని పరిశీలించి వాళ్ళ వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకుందామా.. శరణ్‌ కొప్పిశెట్టి దర్శకత్వంలో రూపొందిన ఈ 'తిమ్మరుసు' సినిమాను క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కించి ప్రేక్షకుల ముందుకు తెచ్చారు. క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంతో సాగే ఈ సినిమాలో వినోదమే ప్రధానమని, ఆ తర్వాత నెమ్మదిగా కథలోకి తీసుకెళ్తామని మూవీ ప్రమోషన్స్‌లో యాక్టర్ సత్యదేవ్ అన్నారు. డిఫరెంట్ మూవీ కాన్సెప్ట్ అని తెలియడం, పైగా కరోనా సెకండ్ వేవ్ లాక్‌డౌన్‌ తర్వాత థియేటర్లలో విడుదలవుతున్న సినిమా ఇదే కావడంతో ప్రేక్షకులు అంచనాలు పెట్టుకున్నారు. అయితే 'తిమ్మరుసు' ప్రీమియర్స్ చూసిన జనం చేస్తున్న ట్వీట్లను బట్టి చూస్తే ఈ సినిమా అంచనాలను రీచ్ అయినట్లే తెలుస్తోంది. ఈ చిత్రంలో ట్విస్టులు బాగున్నాయని, అలాగే ఇంటర్వెల్ బ్యాంగ్ ఆకట్టుకుందని అంటున్నారు. క్లైమాక్స్ కూడా సినిమాకు ప్లస్ అనే ట్వీట్స్ కనిపిస్తున్నాయి. ఇక యాక్టర్ సత్యదేవ్ నటన అద్భుతం అని చెబుతున్నారు. శ్రీ చరణ్ పాకాల అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగుందని, యాక్టర్ బ్రహ్మాజీ క్లాస్ కామెడీ సీన్స్ కడుపుబ్బా నవ్విస్తాయని అంటున్నారు. మొత్తానికైతే ఈ సినిమా సూపర్ సక్సెస్ అవుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతుండటం గమనించవచ్చు. మరోవైపు పలువురు సెలబ్రిటీలు ఈ సినిమా సక్సెస్ కావాలని కోరుకుంటూ ట్వీట్స్ చేశారు. కొద్దిసేపట్లో ఈ సినిమా పూర్తి రివ్యూతో మీ ముందుకు రాబోతోంది 'సమయం తెలుగు'.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3lau7WJ
v

పోసాని కృష్ణమురళికి కరోనా పాజిటివ్‌.. ఆయన భార్యకు కూడా! ఆసుపత్రిలో చికిత్స

మహమ్మారి ఉదృతితో ఇప్పటికే సినీ ఇండీస్ట్రీ కకావికలం అయింది. కరోనా ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ తాకిడిలో కొందరు సినీ నటులు కన్నుమూయగా, ఎంతోమంది యాక్టర్స్ కోవిడ్ బారినపడి తిరిగి కోలుకున్నారు. అయితే రీసెంట్‌గా కరోనా సెకండ్ వేవ్ ముగిసిందని ఉపిరిపీల్చుకున్న జనానికి.. ఇప్పుడు కరోనా థర్డ్ వేవ్ టెన్షన్ పట్టుకుంది. కొత్త కొత్త వేరియంట్లు వెలుగులోకి వస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. ఈ పరిస్థితుల నడుమ తాజాగా తనకు, తన కుటుంబసభ్యులకు కరోనా సోకిందని అధికారికంగా తెలిపారు నటుడు . గత కొన్నిరోజులుగా ఆనారోగ్యంతో బాధపడుతున్న పోసాని కృష్ణమురళి.. ఇటీవల ఆరోగ్య పరీక్షలు చేయించుకోగా ఆయనకు కరోనా అని తేలింది. దీంతో ఆయన కుటుంబ సభ్యులందరికీ కరోనా పాజిటివ్ టెస్ట్ చేశారు. వాళ్లకు కూడా కరోనా పాజిటివ్ అని నిర్ధారణ కావడంతో అంతా గచ్చిబౌళిలోని ఏఐజీ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు. ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించిన పోసాని.. తనకు సినిమా అవకాశాలు ఇచ్చిన దర్శక నిర్మాతలు, హీరోలను క్షమించమని కోరారు. కరోనా రావడం వల్ల తాను నటిస్తున్న రెండు పెద్ద సినిమాల షూటింగ్స్ వాయిదా పడ్డాయని, తన వల్ల సినిమా షూటింగ్స్ ఆగిపోవడం బాధగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు పోసాని కృష్ణమురళి. తనను మనస్ఫూర్తిగా మన్నించాలని నిర్మాతలకు విజ్ఞప్తి చేశారు. ప్రేక్షకులు, సినీ పరిశ్రమ ఆశీస్సులు, దేవుడి దయవల్ల త్వరలోనే కోలుకొని పూర్తి ఆరోగ్యంతో మళ్లీ షూటింగ్‌లకు హాజరవుతానని ఆయన తెలిపారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3lbFMEE
v

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...