Monday 31 August 2020

Pavitra: ఎన్నో సమస్యలు మరెన్నో వేధింపులు.. పూరి జగన్నాథ్ డాటర్ డేరింగ్ డిసీజన్..!

సోషల్ మీడియా అకౌంట్స్ నేటి సమాజానికి ఎంతగా ఉపయోగకరమో అంతే ప్రమాదకరం కూడా. ఫేస్‌బుక్, ఇన్స్‌స్టాగ్రామ్, ట్విట్టర్ లాంటి ఎన్నో సామాజిక మాధ్యమాలు అందుబాటులోకి రావడంతో నెటిజన్లు నేరుగా సెలబ్రిటీలకు తాము చెప్పదలచుకుంది చెప్పేస్తున్నారు. ఈ క్రమంలోనే కొందరు ఆకతాయిలు ఆన్‌లైన్ వేధింపులకు పాల్పడటం, సెలబ్రిటీలను ట్రోల్స్ చేయడం లాంటివి చేస్తూ రచ్చ రచ్చ చేస్తున్నారు. తాజాగా డాషింగ్ డైరెక్టర్ పవిత్ర కూడా అలాంటి వేధింపులే ఎదుర్కొందట. ఈ విషయాన్ని వెల్లడిస్తూ తన సోషల్ మీడియా ఖాతాను తొలగిస్తున్నట్లు ప్రకటించింది పవిత్ర. నిజానికి పవిత్ర పూరికి ఇన్స్‌స్టాగ్రామ్‌లో మాంచి ఫాలోయింగ్ ఉంది. @Pavithra_Puri పేరుతో అకౌంట్ మెయిన్‌టైన్ చేస్తున్న ఆమె.. ఎప్పటికపుడు లేటెస్ట్ ట్రెండ్ ఫాలో అవుతూ పోస్టులు పెడుతుండేది. దీంతో ఆమె ఫాలోవర్స్ సంఖ్య 104K దాకా దూసుకుపోయింది. ఈ పరిస్థితుల్లో ఉన్నట్టుండి తన ఇన్స్‌స్టాగ్రామ్ డిలీట్ చేస్తున్నానని, కొత్త అకౌంట్ @PavithraPuri ఓపెన్ చేస్తున్నానని తెలిపింది పవిత్ర. అలాగే తన పాత అకౌంట్ డిలీట్ చేయడానికి కారణాలు తెలుపుతూ ఓపెన్ అయింది. Also Read: తన పాత ఇన్స్‌స్టాగ్రామ్ అకౌంట్‌తో చాలా సమస్యలు వస్తున్నాయని, కొందరు ఆకతాయిలు ఇష్టమొచ్చినట్లు కామెంట్స్ చేస్తున్న కారణంగా ఆ అకౌంట్ రద్దు చేసుకొని కొత్త అకౌంట్‌కి షిఫ్ట్ అవుతున్నట్లు చెప్పింది పవిత్ర పూరి. అయితే అంత ఫాలోయింగ్ ఉన్న అకౌంట్ ఎందుకు డిలీట్ చేయాల్సి వచ్చిందనే దానిపై జనాల్లో చర్చలు మొదలయ్యాయి. మరోవైపు ఇప్పటికే కొడుకు ఆకాష్ పూరి సినీ గడప తొక్కిన నేపథ్యంలో కూతురు ఎప్పుడు కెమెరా ముందుకొస్తుంది అనేది హాట్ టాపిక్ అయింది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/32EapI2
v

Mahesh Babu: 'సర్కారు వారి పాట'లో మహేష్ క్యారెక్టర్ ఇదే! సినిమా ఫస్టాఫ్‌లో ఇలా, సెకండాఫ్‌లో అలా..

2020 ఆరంభం లోనే సరిలేరు నీకెవ్వరు అనిపించుకుంటూ ఇండస్ట్రీ హిట్ కొట్టేసిన సూపర్ స్టార్ మరికొద్ది రోజుల్లో 'సర్కారు వారి పాట' సెట్స్ ‌పైకి వెళ్లనున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ మూవీ టైటిల్ లుక్, మోషన్ పోస్టర్ రిలీజ్ చేసి మహేష్ అభిమానులను థ్రిల్ చేశారు మేకర్స్. దీంతో ఈ సినిమా స్టోరీ లైన్, విషయమై రకరకాల వార్తలు పుట్టుకొచ్చాయి. ఈ క్రమంలోనే తాజాగా ఫస్టాఫ్, సెకండాఫ్‌లలో మహేష్ బాబు రోల్ ఎలా ఉంటుందనే దానిపై ఓ న్యూస్ వైరల్ అవుతోంది. సోషల్ మెసేజ్‌తో కూడిన స్ట్రాంగ్ కథాంశంతో ఈ మూవీ స్క్రిప్ట్ రెడీ అయిందని, బ్యాంకింగ్‌ వ్యవస్థలో జరుగుతున్న మోసాలు, అవినీతికి సంబంధించిన సామాజిక అంశాన్ని ఇందులో చూపించనున్నట్లు ఫిలింనగర్‌లో టాక్ వినిపించింది. అయితే ఈ సినిమాలో మహేష్ వ్యాపారవేత్తగా కనిపిస్తాడని తెలుస్తుండటం మరింత ఆసక్తి రేకెత్తిస్తోంది. ప్రముఖ మీడియాల్లో వినిపిస్తున్న కథనాల ప్రకారం మహేష్ బాబు ఫస్టాఫ్‌లో వడ్డీ వ్యాపారిగా కనిపించనున్నారని, అలాగే సెకండాఫ్‌ మొత్తం కూడా బ్యాంకింగ్ కుంభకోణాలు ఫోకస్ చేస్తూ గతంలో ఏ సినిమాలో చూపించని కొత్త కోణాల్ని ఈ మూవీలో చూపబోతున్నారని తెలుస్తోంది. ఇక కామెడీకి పెద్ద పీట వేస్తూ హీరోయిన్ రోల్ కూడా గ్లామరస్‌గా తీర్చిదిద్దుతున్నారని టాక్. Also Read: మైత్రీ మూవీ మేకర్స్, జీఎమ్‌బి ఎంటర్‌టైన్‌మెంట్ ,14 రీల్స్ ప్లస్ సంస్థలు సంయుక్తంగా సమర్పిస్తున్న 'సర్కారు వారి పాట' సినిమాకు పరశురామ్ దర్శకత్వం వహిస్తున్నారు. చిత్రంలో మహేష్ సరసన హీరోయిన్‌గా నటిస్తుండగా.. ఎస్.ఎస్. థమన్ సంగీతం అందిస్తున్నారు. భారీ అంచనాల నడుమ మహేష్ కెరీర్‌లో 27వ సినిమాగా ఈ మూవీ సెట్స్ మీదకు రానుంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3jBcwTZ
v

ప్రియుడితో లేడీ కమెడియన్ రహస్య నిశ్చితార్థం.. స్వయంగా మ్యాటర్ రివీల్ చేసిన విద్యుల్లేఖ

లాక్‌డౌన్ వేళ ఎక్కువ సమయం విరామం దొరకడంతో ఇన్నాళ్లుగా వాయిదాపడిన పనులను పూర్తిచేస్తున్నారు నటీనటులు. ఫిజికల్ ఫిట్‌నెస్‌పై స్పెషల్ ఫోకస్ పెట్టేసి స్లిమ్‌ లుక్ లోకి మారుతున్నారు. మరోవైపు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ అంతా పెళ్లి పీటలెక్కుతూ సర్‌ప్రైజ్ చేస్తున్నారు. ఇప్పటికే నిఖిల్, నితిన్, రానా లాంటి యంగ్ హీరోలు తమ తమ ఇష్ట సఖులను పెళ్లాడగా.. మెగా డాటర్ నిహారిక నిశ్చితార్థం కంప్లీట్ చేసుకొని పెళ్లికి రెడీ అయింది. ఇదే బాటలో లేడీ కమెడియన్ కూడా తన ప్రియుడితో రోకా వేడుకను సీక్రెట్‌గా ఫినిష్ చేసేసింది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ రహస్య నిశ్చితార్థం తాలూకు వివరాలు తెలుపుతూ స్వయంగా తనకు కాబోయే భర్త ఫోటోను, నిశ్చితార్ధ సంగతులను తన సోషల్ మీడియా వేదికగా పంచుకుంది విద్యుల్లేఖ. లాక్‌డౌన్ వేళ ఓ రేంజ్ వర్కవుట్స్ చేసి బాడీ తగ్గించిన ఆమె.. తన ప్రియుడితో పెళ్లికి రెడీ అయింది. ఫిట్నెస్, న్యూట్రిషన్ నిపుణుడైన సంజయ్‌తో సైలెంట్‌గా నిశ్చితార్ధ కార్యక్రమాన్ని కానిచ్చేసింది. గత కొంత కాలంగా వీరిద్దరూ ప్రేమలో ఉన్నట్లు సమాచారం. Also Read: ఆగష్టు 26వ తేదీన తమ నిశ్చితార్థం జరిగినట్లు దాదాపు 5 రోజుల తర్వాత వెల్లడిస్తూ ప్రియుడితో దిగిన పిక్ షేర్ చేసింది రామన్. ఈ వేడుకకు కేవలం సన్నిహితులు, కుటుంబ సభ్యులు మాత్రమే హాజరైనట్లు పేర్కొన్న ఆమె.. లాక్‌డౌన్ నిబంధనలకు లోబడి నిశ్చితార్థం చేసుకున్నట్లు చెప్పింది. మా నిశ్చితార్థం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికీ ధన్యావాదాలు అని చెబుతూ విద్యుల్లేఖ పోస్ట్ పెట్టింది. తమిళ టెలివిజన్ నటుడు మోహన్ రామన్ కుతురే ఈ విద్యుల్లేఖ. తండ్రి వలె కెమెరా ముందు సత్తా చాటిన ఆమె పలు తమిళ, తెలుగు భాషా చిత్రాల్లో నటించి హాస్యం పండించింది. రీసెంట్‌గా ఆమె ''విశ్వమిత్ర, అర్జున్ సురవరం, వెంకీ మామ, మత్తు వదలరా'' సినిమాల్లో కనిపించింది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3bdBRjK
v

ప్రణబ్ ముఖర్జీలో ఆ విలక్షణత ఎంతో ఆకట్టుకుంది.. పవన్ కళ్యాణ్, మహేష్ బాబు తీవ్ర దిగ్బ్రాంతి

మాజీ రాష్ట్రపతి, భారతరత్న (84) సోమవారం సాయంత్రం కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఈ రాజకీయ కోవిదుడి మరణం యావత్ భారత దేశాన్ని శోకసంద్రంలోకి నెట్టేసింది. ప్రణబ్ దా మృతిపై పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తూ ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటున్నారు. కాగా ప్రణబ్ ఇకలేరనే వార్త తెలియగానే జనసేన అధినేత, సినీ నటుడు ట్విట్టర్ వేదికగా ఓ ప్రకటన రిలీజ్ చేశారు. ఇందులో ప్రణబ్ గొప్పతనాన్ని కీర్తిస్తూ ఆయన మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు. భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ గారు దివంగతులయ్యారనే వార్త తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని, ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామిక దేశమైన భారత రాజకీయాల్లో తనదంటూ సొంత ముద్రను ప్రణబ్ ముఖర్జీ వేసుకొన్నారని పవన్ పేర్కొన్నారు. అంతటి దిగ్గజ నేత మరణం దేశానికి తీరని లోటని అన్నారు. ఈ మేరకు ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్ధిస్తూ ప్రణబ్ ముఖర్జీ కుటుంబానికి తన తరఫున, జనసేన తరఫున ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని తెలిపారు. Also Read: అదే ప్రకటనలో ప్రణబ్ గొప్పతనాన్ని కీర్తిస్తూ.. ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులుగా, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రిగా పలు సంస్కరణలకు శ్రీకారం చుట్టిన ఆయన రాజకీయాల్లో విలక్షణమైన ధ్రువతారగా వెలిగారని పేర్కొన్నారు. దేశ రాష్ట్రపతిగా ఎదిగినా తన మూలాలు మరచిపోకుండా పండిట్ల కుటుంబపరంగా వస్తున్న దేవార్చన సంప్రదాయం అనుసరించి ప్రత్యేక పర్వదినాల్లో ఆ సంప్రదాయం కొనసాగించే విలక్షణత తనను ఆకట్టుకుందని పవన్ తెలిపారు. మరోవైపు ప్రణబ్ మృతిపై స్పందిస్తూ.. ఆయన మరణ వార్త తీవ్ర విషాదాన్ని మిగిల్చిందని పేర్కొంటూ ట్వీట్ చేశారు. భారత రాజకీయ కోవిదుడు ఇకలేరనే వార్తతో దేశం మూగబోయిందని, ప్రణబ్ ముఖర్జీ ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడిని ప్రార్ధిస్తున్నానని మహేష్ తెలిపారు. అలాగే మంచు లక్ష్మి, మోహన్ బాబు, బండ్ల గణేష్, తాప్సి తదితరులు తమ తమ సంతాపం వ్యక్తం చేస్తూ ట్వీట్స్ చేశారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3lACwR8
v

Balakrishna: బోయపాటి, బాలయ్య ఫిక్సయ్యారిలా.. BB3కి ఆసక్తికర టైటిల్!

బాలకృష్ణ, కాంబినేషన్‌లో రాబోతున్న కొత్త సినిమాపై ఓ రేంజ్ అంచనాలు పెట్టుకుంది ప్రేక్షకలోకం. వీరిద్దరిదీ సక్సెస్‌ఫుల్ కాంబో కావడం, పైగా ''సింహా, లెజెండ్'' లాంటి భారీ హిట్ల తర్వాత ఇద్దరి కాంబోలో వస్తున్న హాట్రిక్ మూవీ కావడంతో ఈ మూవీ కోసం కళ్ళలో ఒత్తులు వేసుకొని ఎదురు చేస్తున్నారు బాలయ్య ఫ్యాన్స్. ఇప్పటికే కొంతభాగం షూటింగ్ జరుపుకున్న ఈ మూవీ కరోనా కారణంగా వాయిదా పడింది. అతి త్వరలో తిరిగి షూటింగ్ స్టార్ట్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు బోయపాటి శ్రీను. ఇంతలో మూవీ టైటిల్ గురించిన ఓ ఆసక్తికర వార్త బయటకొచ్చింది. ఇటీవలే పేరుతో ఫస్ట్‌లుక్, ఫస్ట్ రోర్ రిలీజ్ చేసి నందమూరి అభిమానులను హుషారెత్తించిన మేకర్స్.. ఈ మూవీ కోసం పవర్‌ఫుల్ టైటిల్ పరిశీలనలో పెట్టారట. బాలయ్య సినిమా అంటే టైటిల్ క్రేజ్ కూడా మూవీకి కీలకం కాబట్టి 'మోనార్క్' అనే టైటిల్ ఫిక్స్ చేశారని టాక్ వచ్చింది. ఆ తర్వాత నందమూరి అభిమానులకు కిక్కిచ్చేలా 'డేంజర్' అనే టైటిల్ ఫైనల్ చేయాలని చిత్ర యూనిట్ భావిస్తున్నట్లు ఫిలిం నగర్‌లో చర్చలు వినిపించాయి. ఆ వెంటనే 'సూపర్ మ్యాన్' కూడా లైన్ లోకి వచ్చింది. కానీ తాజా సమాచారం మేరకు ఆ మూడు కాకుండా చిత్రానికి ‘టార్చ్‌బేరర్’ అనే డిఫరెంట్ టైటిల్ ఫిక్స్ చేశారని తెలుస్తోంది. Also Read: ఈ ‘టార్చ్‌బేరర్’ ఎక్కడో విన్నాం అనుకుంటున్నారు కదూ!. అదేనండీ ‘అరవింద సమేత వీరరాఘవ’ చిత్రంలో ఎన్టీఆర్ గురించి మాట్లాడుతూ రావు రమేష్ చెప్పే డైలాగ్ ఇది. ఇక బోయపాటి సినిమా అంటే పవర్‌ఫుల్ డైలాగ్స్‌తో పాటు బాలయ్య క్యారెక్టర్ ఎంత పదునుగా ఉంటుందో గత సినిమాలతోనే రుజువు చేశారు. ఈ క్రమంలోనే ఈ మూవీలో కూడా మేకోవర్, క్యారెక్టర్ డిజైన్ థియేటర్లను హోరెత్తించడం ఖాయం అని అంటున్నారు. బాలయ్య కెరీర్‌లో 106వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని మిర్యాల ర‌వీంద‌ర్‌రెడ్డి నిర్మిస్తున్నారు. థమన్ బాణీలు కడుతున్నారు. చిత్రంలో బాలయ్య మేకోవర్ సరికొత్తగా ఉంటుందని, ఆయన అఘోరాగా కనిపించనున్నారని సమాచారం. మరోవైపు ఈ మూవీలో బాలయ్య సరసన హీరోయిన్‌గా ఓ ముంబై మోడల్‌ని ఫైనల్ చేశారని టాక్.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3gNanm4
v

అమ్మ కోసం డాక్టర్‌ అయి.. కరోనా రోగులకు చికిత్స చేస్తూ: ‘ఉమామహేశ్వర’ నటి గురించి ఆసక్తికర విషయాలు

సత్యదేవ్ హీరోగా వెంకటేష్ మహా దర్శకత్వంలో వచ్చిన ‘ఉమామహేశ్వర ఉగ్రరూపస్య’ సినిమాలో హీరోయిన్‌గా నటించిన రూపా కొడువయుర్ అందరి దృష్టిని ఆకర్షించారు. సహజ సిద్ధమైన అందం, అభినయంతో కట్టిపడేశారు. అయితే, ఈ నటి అందరిలా కాదు.. చాలా ప్రత్యేకం. ఆమె గురించి తెలుసుకోవాల్సిన విషయాలు చాలానే ఉన్నాయి. చాలా మంది డాక్టర్ కాబోయి యాక్టర్ అయ్యాను అని చెబుతుంటారు. కానీ, ఈమె డాక్టర్ అయి ఆ తరవాత యాక్టర్ అయ్యారు. అమ్మ కలను నెరవేర్చడం కోసం డాక్టర్ అయ్యారు.. తన కలను సాకారం చేసుకోవడం కోసం యాక్టర్ అయ్యారు. రూప మంచి క్లాసికల్ డాన్సర్. తనకు సొంతంగా ఒక యూట్యూబ్ ఛానెల్ ఉంది. ‘సాహోరే బాహుబలి’ సాంగ్‌కు క్లాసికల్ డాన్స్ పెర్ఫార్మెన్స్ చేసి తన యూట్యూబ్ ఛానెల్‌లో అప్‌లోడ్ చేశారు. ఈ పెర్ఫార్మెన్స్‌తో రూపకు మంచి గుర్తింపు వచ్చింది. దీంతో పాటు కె.విశ్వనాథ్ సినిమాల్లోని పాటలకు ఆమె చేసిన నృత్యాలకు కూడా మంచి గుర్తింపు వచ్చినట్టు రూప ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. రూప జాతీయ స్థాయిలో వెయ్యికి పైగా నృత్య ప్రదర్శనలు చేశారు. ఆమె తల్లి మంగ లక్ష్మి సంస్కృతం లెక్చరర్, తండ్రి రవికుమార్ ఆర్మీలో పనిచేస్తున్నారు. రూప ప్రాథమిక విద్య విజయవాడలోని అమాలి స్కూల్, శ్రీ చైతన్య స్కూల్‌లో జరిగింది. అయితే, రూప డాక్టర్ అయితే చూడాలనేది తల్లి కోరిక. తల్లి కలను సాకారం చేయడం కోసం రూప ఎంతో కష్టపడి చదివారు. ఎంసెట్‌లో ఆమెకు మంచి ర్యాంక్ వచ్చింది. దీంతో గుంటూరులోని కాటూరి మెడికల్ కాలేజీలో ఆమెకు ఫ్రీ సీట్ లభించింది. అయితే, తాను ఎంసెట్‌కు ప్రిపేర్ అయ్యేటప్పుడు తన తల్లికి క్యాన్సర్ వచ్చిందని రూప ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. దీంతో తాను ఆంకాలజిస్ట్ కావాలని నిర్ణయించుకున్నానని తెలిపారు. ప్రస్తుతం తాను కొవిడ్ 19 రోగులకు చికిత్స అందిస్తు్న్నానని అన్నారు. అంతేకాదు.. రెండు మాస్కులు, గాగుల్స్, ఫేస్ షీల్డ్, పీపీఈ సూట్ ధరించి పనిచేయడం ఎంత కష్టమో చెప్పారు. అమ్మ కోరిక మేరకు డాక్టర్ అయిన రూప.. తన కలను నెరవేర్చుకోవడం కోసం యాక్టర్‌ను అయ్యారు. తనకు సుహాసిని, రాధిక సినిమాలంటే ఎంతో ఇష్టమని.. వాళ్లలా నటించాలని ఉండేదని రూప వెల్లడించారు. అయితే, సినిమా రంగంలోకి ఎలా అడుగు పెట్టాలో, ఎవరిని సంప్రదించాలో తనకు తెలియలేదని అన్నారు. అయితే, ‘ఉమామహేశ్వర ఉగ్రరూపస్య’ సినిమాలో నటించడానికి హీరోయిన్ల కోసం మేకర్స్ వెతుకుతున్న విషయం తెలుసుకుని తన ప్రొఫైల్ పంపానని చెప్పారు. డైరెక్టర్ వెంకటేష్ మహా, నిర్మాత ప్రవీణ ఆడిషన్ చేసి తనను ఎంపిక చేశారని తెలిపారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3gLJG14
v

షకలక శంకర్ హీరోగా ‘లాస్ట్ గాడ్‌ఫాదర్’.. ఆశీర్వదించిన వి.వి.వినాయక్

చిన్నికృష్ణ ప్రొడక్షన్స్ పతాకంపై ప్రధాన పాత్రలో గాంధీ మోహన్ రెడ్డి దర్శకత్వంలో వెలంపల్లి ప్రసాద్ నిర్మిస్తున్న చిత్రం ‘లాస్ట్ గాడ్‌ఫాదర్’. ఈ సినిమా ప్రారంభోత్సవ కార్యక్రమం నల్లమలుపు బుజ్జి కార్యాలయంలో లాంఛనంగా జరిగింది. ముహూర్తపు సన్నివేశానికి వి.వి.వినాయక్ క్లాప్ కొట్టగా.. నిర్మాత మల్లిడి సత్యన్నారాయణ రెడ్డి కెమెరా స్విచ్ ఆన్ చేశారు. డైరెక్టర్ డాలి తొలి సన్నివేశానికి గౌరవ దర్శకత్వం వహించారు. ఈ సందర్భంగా షకలక శంకర్ మాట్లాడుతూ.. ‘‘నా కెరీర్ ఈ బ్యానర్‌లోనే స్టార్ట్ అయ్యింది. ‘నోట్ బుక్’ సినిమాలో నాకు మొదట అవకాశమిచ్చారు ప్రసాద్ గారు. మళ్లీ ఇప్పుడు ఈ బ్యానర్‌లో నటిస్తున్నాను. వినాయక్ గారు నా సినిమాకి క్లాప్ కొట్టి ఆశీర్వదించారు. నిజంగా ఈ రోజు నాకు గొప్ప పండుగ రోజు. తప్పకుండా ఈ సినిమా నా కెరీర్‌లో మంచి సినిమా అవుతుంది’’ అన్నారు. Also Read: దర్శకుడు మల్లిడి గాంధీ మోహన్ రెడ్డి మాట్లాడుతూ.. ‘‘అందరికీ నచ్చే అన్ని అంశాలు కలబోసిన మంచి సబ్జెక్ట్ ‘లాస్ట్ గాడ్‌ఫాదర్’. షకలక శంకర్ మెయిన్ లీడ్ చేస్తున్నారు. మిగతా నటీనటులను త్వరలో ప్రకటిస్తాం. సంగీతం సాయి కార్తీక్ సమకూరుస్తున్నారు. సినిమాటోగ్రఫీ గరుడ వేగ అంజి, మాటలు దుర్గా ప్రసాద్... ఇలా అందరూ అత్యుత్తమ టెక్నీషియన్స్‌తోనే సినిమా చేస్తున్నాం. ఇంతకు ముందు నేను చేసిన సినిమా విషయంలో వచ్చిన అనుభవాలతో ఈ సినిమాని ప్రేక్షకులకు నచ్చేలా తీర్చిదిద్దుతాను’’ అని వెల్లడించారు. నిర్మాత ప్రసాద్ మాట్లాడుతూ.. ‘‘ఒక మంచి టీమ్‌తో మంచి సినిమాను నిర్మిస్తున్నాం. మేం పిలవగానే వచ్చి మా ప్రయత్నాన్ని ఆశీర్వదించిన వి.వి.వినాయక్, డాలి, నల్లమలుపు బుజ్జి గార్లకు ధన్యవాదాలు’’ అని అన్నారు. కాగా, ఈ సినిమాలో పాటలన్నింటినీ రెహమాన్ రాస్తున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3bbulG2
v

ఇప్పటికే 5 నెలలు సినిమాను పక్కన పెట్టాం: ‘V’ దర్శకుడు మోహనకృష్ణ ఇంద్రగంటి

2004లో ‘గ్రహ‌ణం’ సినిమాతో ద‌ర్శకుడిగా కెరీర్‌ను ప్రారభించిన మోహ‌న‌కృష్ణ ఇంద్రగంటి.. 16 ఏళ్ల జ‌ర్నీలో తెర‌కెక్కించినవి ప‌ది చిత్రాలే. అయితే ప్రతి సినిమా దేనిక‌దే ప్రత్యేక‌మైన‌ది. ప్రస్తుతం మోహ‌న‌కృష్ణ ఇంద్రగంటి ద‌ర్శక‌త్వంలో రూపొందిన చిత్రం ‘వి’. నేచుర‌ల్ స్టార్ , సుధీర్ బాబు, నివేదా థామ‌స్‌, అదితి రావు హైద‌రి ప్రధాన పాత్రలు పోషించారు. ‘అష్టాచ‌మ్మా’, ‘జెంటిల్‌మ‌న్’ చిత్రాల త‌ర్వాత నాని, మోహ‌న‌కృష్ణ ఇంద్రగంటి కాంబినేష‌న్‌లో రూపొందిన హ్యాట్రిక్ మూవీ ఇది. సెప్టెంబ‌ర్ 5న అమెజాన్ ప్రైమ్ వీడియోలో ‘వి’ చిత్రం విడుదలవుతుంది. ఈ సందర్భంగా పాత్రికేయ మిత్రుల‌తో మోహనకృష్ణ ముచ్చటించారు. ✦ ‘వి’ సినిమాను ముందుగా థియేట‌ర్స్‌లో విడుద‌ల చేయాల‌ని అనుకున్నాం. కానీ ఇప్పుడు ఓటీటీలో విడులవుతుంది. నేను, దిల్‌ రాజు గారు, నాని స‌హా టీమ్‌తో చ‌ర్చించి ఓటీటీలో చేస్తేనే బెట‌ర్ అని అనుకున్నాం. ‘వి’ సినిమాను ఇప్పటికే ఐదు నెల‌లుగా హోల్డ్ చేశాం. ప్రేక్షకుల్లో కూడా సినిమా విడుద‌లపై ఆస‌క్తి నెల‌కొంది. ఇంకా థియేట‌ర్స్ ఓపెన్ చేసే విష‌యంలో క్లారిటీ లేదు. ఇక ప్రేక్షకుల‌ ఎగ్జయిట్మెంట్‌ను హోల్డ్ చేయ‌డం మంచిది కాద‌ని ఆలోచించి నిర్ణయం తీసుకున్నాం. ఓ రకంగా థియేట‌ర్స్ కంటే ఓటీటీ వ‌ల్ల సినిమా 200 దేశాల్లో విడుద‌ల‌వుతుంది. అంద‌రికీ సినిమా చేరువ అవుతుంది. మొద‌టి వారంలో సినిమా చూసేవాళ్లు మొద‌టి రోజునే సినిమా చూసే అవ‌కాశం క‌లిగింది. ✦ ఒక టెక్నీషియ‌న్‌గా సినిమాలను థియేట‌ర్స్‌లో చూడ‌టానికే నేను ఇష్టపడతాను. ప్రేక్షకులు కూడా అంతే.. థియేట‌ర్ ఎక్స్‌పీరియెన్స్ డిఫ‌రెంట్. దీన్ని ఎవ‌రూ మిస్ చేసుకోవాల‌నుకోరు. అయితే ప్రస్తుతం మ‌నం చూస్తున్న ప‌రిస్థితి చాలా ఇబ్బందిక‌ర‌మైన‌ద‌నే చెప్పాలి. ఇలాంటి సంద‌ర్భంలో మ‌న సినిమాల‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే మాధ్యమం ఓటీటీ. Also Read: ✦ డైరెక్టర్‌గా నేను ఇప్పటి వ‌ర‌కు చేసిన సినిమాల‌తో పోల్చితే స్టైల్ ప‌రంగా, స్కేల్ ప‌రంగా ‘వి’ నాకొక ఛాలెజింగ్ మూవీ అనే చెప్పాలి. 5 రాష్ట్రాల‌తో పాటు థాయ్‌లాండ్‌లోనూ చిత్రీక‌రించాం. ఇంత‌కు ముందు నా సినిమాల‌ను నేనింతలా లావిష్‌గా చేయ‌లేదు. నేను తీసిన సినిమాల్లో నెక్స్ట్ రేంజ్ మూవీ అని చెప్పవచ్చు. ✦ ఓటీటీల‌కు నేను వ్యతిరేకం కాదు. దీన్ని ఒక మాధ్యమంగానే చూడాలి త‌ప్ప.. సినిమా థియేటర్‌తో పోల్చి చూడ‌కూడదు. ఓటీటీలో సినిమాను విడుద‌ల చేయ‌డం వ‌ల్ల ఫ‌స్ట్ డే మ‌నం థియేట‌ర్‌కు వెళ్లి సినిమా చూడ‌టం, ఫ‌స్ట్ డే క‌లెక్షన్స్‌, హంగామా అన్నింటినీ మిస్ అవుతున్నాం. ఓ సోష‌ల్ ఎక్స్‌పీరియెన్స్‌ను మిస్ అవుతున్నాం. సినిమా రంగానికి సంబంధించి థియేట‌ర్ ఎక్స్‌పీరియెన్స్ మిస్ అవుతున్నామ‌ని భావించేవాళ్లు చాలా మందే ఉన్నారు. నిర్మాత కె.ఎస్‌.రామారావు గారైతే నాకు ఫోన్ చేసి అదే విష‌యాన్ని చెప్పారు. కానీ ప‌రిస్థితుల‌కు అనుగుణంగా మేం తీసుకున్న నిర్ణయం మంచిదేన‌ని ఆయ‌న అభినందించారు. ✦ నేను చేసిన యాక్టర్స్‌తోనే సినిమా చేయ‌డానికి కార‌ణం కంఫ‌ర్ట్ జోన్‌లో ఉండ‌టానికే అని భావిస్తాను. నాకేం కావాలో యాక్టర్స్‌గా వాళ్లకు బాగా తెలుసు. అలాగే నా పాత్రల‌కు కూడా వాళ్లు సూట్ అవుతారనిపిస్తే వాళ్లని అప్రోచ్ అవుతాను. సినిమాటోగ్రాఫ‌ర్ విందాతోనూ నాకు మంచి వేవ్ లెంగ్త్ కుదిరింది. నాకేం కావాలి? ఎలా కావాలి? అని అత‌నికి బాగా తెలుసు. నేను పెద్దగా వివ‌రించ‌న‌క్కర్లేదు. ఓ టెక్నీషియ‌న్‌గా త‌న పొటెన్షియ‌ల్‌ను పూర్తి స్థాయిలో చూపించే సినిమా ఇది. Also Read: ✦ ‘వి’ అనే టైటిల్‌ను ఎందుకు పెట్టాం? అనే విష‌యం తెలియాలంటే సినిమా చూడాల్సిందే. టైటిల్ గురించి నేనేదో చెప్పిన‌ట్లు సోష‌ల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. కానీ ఆ వార్తల్లో నిజం లేదు. ✦ రీసెంట్‌గా రిలీజైన ట్రైల‌ర్‌లో అదితిరావు హైదరిని చూపించకపోవడానికి కారణం ఉంది. తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ✦ టెక్నిక‌ల్ డిజిటల్ మాధ్యమాల్లో సినిమా చూసే సమయంలో ఫోన్‌లో ఒక‌లా, టాబ్‌లో మ‌రోలా, లాప్‌టాప్‌లో మ‌రో ర‌కంగా.. ఇలా వేరియేషన్స్ ఉంటాయి. దాన్ని బేస్ చేసుకుని బ్రైట్‌నెస్, సౌండ్ ఎలా ఉంది అని చెక్ చేసుకుని ముందుకెళ్లాం. వీలైనంత థియేటర్ ఎక్స్‌పీరియెన్స్‌ను ప్రేక్షకుడికి అందించ‌డానికి ప్రయత్నించాం. ✦ దిల్ రాజు గారు అగ్ర నిర్మాత.. డిస్టిబ్యూటర్, ఎగ్జిబిటర్, బయ్యర్. అన్నింటిలో అనుభవం ఉంది. నిర్మాతగా ఏం చేయాల‌నే విష‌యంపై ఆయ‌న చాలా క్లారిటీగా ఉన్నారు. థియేట‌ర్‌లో కాకుండా ‘వి’ సినిమా ఓటీటీలో విడుద‌ల‌వుతున్నందుకు ఆయ‌న‌ చాలా హ్యాపీగా ఉన్నారు. ఎందుకంటే ఇది వ‌ర‌కు చెప్పిన‌ట్లు థియేట‌ర్స్ కోసం ఐదు నెల‌లుగా వెయిట్ చేశాం. నేను, నాని అడ‌గ‌టంతో ఆయ‌న ఇన్నిరోజులు ఆగారు. కానీ థియేటర్స్ ఓపెన్ అయ్యే విషయంలో ఓ క్లారిటీ లేదు. దీంతో ఇంకా ఆయ‌న్ని వెయిట్ చేయ‌మ‌ని చెప్పడంలో అర్థం లేద‌నిపించింది. ✦ నాని ‘అష్టాచమ్మా’ విడుదల తేదీకే తను నటించిన ‘వి’ సినిమా వస్తుంది. యాదృచ్చిక‌మే. అమెజాన్ చెప్పిన డేట్ ఇది. నాని, నేను కలిసి చేసిన మూడో సినిమా.. నాని, దిల్ రాజు చేసిన మూడో సినిమా. ఇలా అన్నీ ఫ్యాక్టర్స్ క‌లిశాయి. ఈ రిలీజ్ డేట్‌ను అమెజాన్ ప్రైమ్ వాళ్లే నిర్ణయించారు. నిజానికి ఈ సినిమాను 2019 డిసెంబ‌ర్‌లో విడుద‌ల చేయాల‌నుకున్నాం. అంత‌లో మా నాన్నగారు కాలం చేయ‌డంతో నాకు రెండు నెల‌లు బ్రేక్ ప‌డింది. అది 2020కి పోస్ట్ పోన్ అయ్యింది. ✦ నేను నానికి క‌థ చెప్పగానే రెండు పాత్రల గురించి చెప్పాను. నేను ఏ పాత్ర చేస్తే బావుంటుంద‌ని నాని అడిగితే.. నెగ‌టివ్ షేడ్ ఉండే రోల్ చేయ‌మ‌ని చెప్పాను. త‌ను కూడా ఆ పాత్రనే చేయాల‌నుకుంటున్నాన‌ని చెప్పాడు. క‌థ చెప్పే స‌మ‌యంలో అది నాని 25వ సినిమా అని నాకు తెలియ‌దు. తెలిసిన త‌ర్వాత ‘నీకు ఓకేనా’ అని నానిని అడిగితే.. ‘నా 25వ సినిమాను మీతో కలిసి చేయడం హ్యాపీగా ఉందండి’ అని చెప్పాడు. Also Read: ✦ నాని నాతో ‘అష్టాచ‌మ్మా’ చేసేట‌ప్పటికీ ‘వి’ సినిమా చేసే స‌మ‌యానికి యాక్టర్‌గా చాలా ప‌రిణితి చెందాడు. బేసిక్‌గా నాని రిస్క్ చేయ‌డానికి భ‌య‌ప‌డ‌డు. ‘జెర్సీ’ సినిమానే ఇందుకు ఉదాహరణ. త‌న‌కు క్యారెక్టర్ న‌చ్చితే చాలు.. త‌న పాత్ర ఎంత నిడివి ఉంద‌ని కూడా చూడ‌కుండా యాక్ట్ చేస్తాడు. బేషజాలు లేని యాక్టర్. ✦ నాని, సుధీర్‌బాబుతో ముందు నుండి ఉన్న వేవ్ లెంగ్త్ కార‌ణంగా వారితోనే సినిమా చేయాల‌నుకున్నాను. ఇద్దరూ క‌లిసిపోయి, పాత్రల‌ను అర్థం చేసుకుని యాక్ట్ చేస్తారు. కాబ‌ట్టి నాకు ‘వి’ సినిమా చేయ‌డం సుల‌భ‌మైంది. సుధీర్‌బాబుకు మంచి యాక్షన్ ఇమేజ్ ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకుని త‌నతో ఓ మంచి ఫైట్‌ను తీశాను. సినిమా ప్రారంభంలో ఫైట్ వ‌స్తుంది. అది కూడా క‌థ‌లో భాగంగానే ఉంటుంది. స్పెష‌ల్‌గా డిజైన్ చేసి చేసిన ఫైట్ అది. యాక్షన్ స‌న్నివేశాలు నాని, సుధీర్ మ‌ధ్య చాలా రేసీగా ఉంటాయి. అలాగే సుధీర్ బాబు డాన్సును కూడా ఓ సాంగ్‌లో చూడొచ్చు. నాని, సుధీర్ మ‌ధ్య స‌న్నివేశాలు చాలా ఎమోష‌న‌ల్‌గానూ ఉంటాయి. ✦ పెద్ద హీరోల‌తో ప‌నిచేయాలంటే కాస్త భ‌యంగా ఉంటుంది. అందుకు కార‌ణం వారికి ఉండే ఇమేజ్‌, వారి సినిమాల‌పై అంచ‌నాలు, అభిమానుల కోరుకునే అంశాలు. నేను ముందు క‌థ రాసుకుని హీరో ఎవ‌ర‌ని ఆలోచిస్తాను. ✦ సినిమా మ్యూజిక్‌, బ్యాగ్రౌండ్ స్కోర్‌ను అమిత్ త్రివేదినే చేయాల‌నుకున్నారు. కానీ వేరే క‌మిట్‌మెంట్ ఉండ‌టం వ‌ల్ల త‌ను మ‌ధ్యలో వెళ్లిపోవాల్సి వ‌చ్చింది. ఆ స‌మ‌యంలో మాకు త‌మ‌న్‌ను సంప్రదిస్తే ఎలా ఉంటుంద‌ని ఆలోచించాం. త‌ను అప్పుడు ‘అల వైకుంఠ‌పుర‌ములో’ స‌క్సెస్ మీదున్నాడు. మేం అడ‌గ్గానే స‌రేన‌ని త్వర‌గా చేసి పెట్టేశాడు. ✦ ‘వి’ ఒక మిస్టరీ యాక్షన్ ఎమోష‌న‌ల్ డ్రామా. అంద‌రినీ మెప్పించేలా ఉంటుంది. ఈ సినిమా క్లైమాక్స్ చూస్తే అంద‌రికీ సీక్వెల్ ఉంటుంద‌నే అనుమానం వ‌స్తుంది. అయితే దీని సీక్వెల్ గురించి నేను ఆలోచించ‌లేదు. ✦ వెబ్ సిరీస్‌ల‌ను ఓ య‌జ్ఞంలా చేయాలి. ఓ ప‌ది ఎపిసోడ్స్ చేయాలి. ఇప్పుడు మూడు నాలుగు క‌మిట్‌మెంట్స్ ఉండ‌టంతో అంత స‌మ‌యం కేటాయించ‌లేను. అయితే ‘సప్తభూమి’ అనే బుక్‌ను వెబ్ సిరీస్‌గా చేస్తే బావుంటుంద‌నే ఆలోచ‌నైతే వ‌చ్చింది. మ‌రి వెబ్ సిరీస్ చేయ‌లా? సినిమా చేయాలా అని ఆలోచిస్తున్నాను. ✦ మూడు, నాలుగు సినిమాలు చేయ‌డానికి క‌మిట్ అయ్యాను. అవి పూర్తయిన త‌ర్వాత దిల్‌ రాజు గారి బ్యాన‌ర్‌లో మ‌రో సినిమా చేస్తాను. అలాగే విజయ్ దేవరకొండ సినిమా చేయాల్సి ఉంది. అయితే ముందు విజ‌య్‌, పూరి సినిమా పూర్తి కావాలి. తర్వాత మరో కమిట్ మెంట్ ఉంది.. దాని త‌ర్వాతే మా సినిమా ఉంటుంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2G7AqYA
v

దేశం విలువైన వజ్రాన్ని కోల్పోయింది: ప్రణబ్ మృతికి చిరంజీవి సహా సినీ ప్రముఖుల సంతాపం

మాజీ రాష్ట్రపతి, భారతరత్న సోమవారం కన్నుమూశారు. ఆయన వయసు 84 సంవత్సరాలు. అనారోగ్యంతో ఢిల్లీలోని ఆర్మీ రీసెర్చ్ అండ్ రెఫరల్ హాస్పిటల్‌లో చేరిన ప్రణబ్.. చికిత్స పొందుతూ సోమవారం సాయంత్రం తుది శ్వాస విడిచారు. 21 రోజులపాటు ప్రాణాలతో పోరాడి చివరికి అస్తమించారు. ప్రణబ్ ముఖర్జీ కన్నుమూసిన విషయాన్ని ఆయన కుమారుడు అభిజిత్ ముఖర్జీ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. కాగా, ప్రణబ్ ముఖర్జీ మృతికి సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియా ద్వారా నివాళులు అర్పిస్తున్నారు. మెగాస్టార్ , నటి రోజా, బాలీవుడ్ హీరో అజయ్ దేవగణ్, రవీణాటాండన్, రితేష్ దేశ్‌ముఖ్, సాయి ధరమ్ తేజ్, తాప్సి, మోహన్‌లాల్, సంగీత దర్శకుడు తమన్, బాలీవుడ్ నటి కంగనా రనౌత్ తదితరులు ట్విట్టర్ ద్వారా ప్రణబ్ ముఖర్జీ మృతికి సంతాంప తెలిపారు. Also Read: దేశం ఒక విలువైన వజ్రాన్ని కోల్పోయిందని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. ‘‘శ్రీ ప్రణబ్ ముఖర్జీ మృతి నన్నెంతగానో బాధించింది. ఆయనతో మాట్లాడిన మాటలు నాకు ఎల్లప్పుడూ గుర్తుంటాయి. గొప్ప జ్ఞానం కలిగిన నిష్ణాతుడు ఆయన. అద్భుతమైన రాజకీయ జీవితం. మిమ్మల్ని కోల్పోతున్నాం సార్. దేశం ఒక విలువైన వజ్రాన్ని నేడు కోల్పోయింది. ప్రణబ్ దా ఆత్మకు శాంతి చేకూరాలి’’ అని చిరంజీవి ట్వీట్ చేశారు. చిరంజీవి మాత్రమే కాదు.. ప్రతి ఒక్క సెలబ్రిటీ ప్రణబ్ లేని లోటు తీరనది విచారం వ్యక్తం చేశారు. ప్రణబ్ కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2QEy1qj
v

హరీష్ శంకర్‌తో పవన్ సినిమా.. అప్‌డేట్ ఇచ్చిన నిర్మాతలు

పవర్ స్టార్ అభిమానులకు అదిరిపోయే అప్‌డేట్ ఇచ్చింది మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ. ఈ బ్యానర్‌లో పవన్ కళ్యాణ్ సినిమా చేయబోతోన్న సంగతి తెలిసిందే. హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తారు. ఈ చిత్రానికి సంబంధించి నిర్మాతలు సోమవారం సాయంత్రం అప్‌డేట్ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా సెప్టెంబర్ 2న సాయంత్రం 4:05 గంటలకు ఒక సర్‌ప్రైజ్ ఇవ్వబోతున్నట్టు ప్రకటించారు. ఈ మేరకు మైత్రీ మూవీ మేకర్స్ ట్వీట్ చేసింది. కాగా, ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ‘వకీల్ సాబ్’ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. బాలీవుడ్ హిట్ మూవీ ‘పింక్’కు రీమేక్‌గా తెరకెక్కుతోన్న ఈ సినిమాను బోనీ కపూర్, దిల్ రాజు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. శ్రీరామ్ వేణు దర్శకత్వం వహిస్తున్నారు. తమన్ సంగీతం సమకూరుస్తున్నారు. ఈ సినిమా ఇప్పటికే విడుదల కావాల్సింది. కానీ, లాక్‌డౌన్ కారణంగా విడుదల వాయిదా పడింది. థియేటర్లు తెరుచుకున్న తరవాత విడుదల తేదీ ప్రకటిస్తారు. Also Read: మరోవైపు, క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ మరో సినిమా చేస్తున్నారు. పీరియాడిక్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కనుంది. ఈ చిత్రంలో బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌ను కీలక పాత్రకు ఎంపిక చేసినట్టు సమాచారం. ఈ చిత్రానికి ‘విరుపాక్ష’ అనే టైటిల్ ప్రచారంలో ఉంది. కీరవాణి సంగీతం సమకూరుస్తు్న్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్‌ను విలన్‌గా తీసుకున్నట్టు వదంతులు వినిపిస్తున్నాయి. ‘వకీల్ సాబ్’ సినిమా పూర్తయిన వెంటనే క్రిష్, హరీష్ శంకర్ సినిమాలను పవన్ ప్రారంభించనున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2QBwbGK
v

@139 రేప్ కేసు: ప్రదీప్‌ని నన్ను దారుణంగా ట్రోల్ చేశారు.. బాధగా ఉంది కాని ఆమెకు అండగా ఉంటాం: హీరో కృష్ణుడు

ర్యాలగూడకు చెందిన పాతికేళ్ల మహిళ ఇటీవల పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో తనను 139 మంది 5000 సార్లు రేప్ చేశారని సంచలన ఆరోపణలు చేసింది. ఇందులో యాంకర్ ప్రదీప్‌తో పాటు హీరో కృష్ణుడు పేరు కూడా ఉండటంతో ఈ కేసు సంచలనంగా మారింది. అయితే యువతిపై అత్యాచారం చేసిన మాట వాస్తవమే కాని.. డాలర్ బాబు అనే వ్యక్తి కుట్ర చేసి ఈ అమ్మాయిని ఉపయోగించుకుని ఆర్థికపరమైన అబ్ధి పొందడం కోసమే ఈ కుట్ర చేశాడని సోమవారం నాడు ప్రెస్ మీట్‌లో సంచలన విషయాలు వెల్లడించింది ఆ యువతి. అయితే ఈ కేసుతో కాని తనతో కాని యాంకర్ ప్రదీప్, హీరో కృష్ణుడికి ఎలాంటి సంబంధం లేదని కుట్రలో భాగంగానే ఇదంతా చేశానని వాళ్లకి క్షమాపణ చెప్పింది ఆ దళిత యువతి. అయితే తమపై వచ్చిన ఆరోపణలపై ముందే స్పందించిన ప్రదీప్, హీరో కృష్ణుడు.. తమకేం తెలియదని ఎవరో కుట్ర చేసి తమపై ఇలాంటి నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని ఖండించారు. తాజాగా ఆ దళిత యువతి ప్రెస్ మీట్ తరువాత ఈ ఇష్యూపై హీరో కృష్ణుడు స్పందిస్తూ వీడియో విడుదల చేశారు. ఆయన మాట్లాడుతూ..‘రీసెంట్‌గా మీరు చూసే ఉంటారు.. పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో 139 మంది నన్ను రేప్ చేశారని ఓ సంచలన కేసు నమోదైంది. అందులో యాంకర్ ప్రదీప్ పేరుతో పాటు నా పేరుని కూడా చేర్చడం జరిగింది. ఆ విషయంలో నేను చాలా షాక్‌కి గురయ్యా. ఆ తరువాత కొన్ని యూట్యూబ్ ఛానల్స్.. నన్ను, ప్రదీప్‌ని దారుణంగా టార్గెట్ చేశారు. నిజా నిజాలు తెలుసుకోకుండా ట్రోల్ చేశారు. వీటిని చూసి.. చాలా మంది మీడియా మిత్రులు నన్ను సంప్రదించారు.. దాన్ని నేను ఖండించా. ఆ తరువాత నిజా నిజాలు ప్రెస్ మీట్ ద్వారా తెలుసుకున్నారు. నిజంగా ఆ అమ్మాయికి ఇలా జరగడం దారుణమే. ఈ విషయంలో ఆమెకు మా సపోర్ట్ ఉంటుంది. తప్పు ఎవరు చేసినా తప్పే. ఈరోజు మందక్రిష్ణ మాదిగ ప్రెస్ మీట్‌లో చెప్పారు.. ఎస్సీ ఎస్టీ లాంటి కేసును దుర్వినియోగం చేయకూడదు.. అమాయకుల్ని ఇరికించకూడదని. దీని వెనుక ఎవరు ఉన్నారో అన్ని వివరాలు తెలియజేస్తూ.. నేను కాని ప్రదీప్ కాని లేరని చెప్పారు. వారికి ధన్యవాదాలు. అలాగే నా మిత్రులు, కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు. పార్టీలకు అతీతంగా నాకు సపోర్ట్ చేశారు.. కష్ట కాలంలో నా వెంట ఉన్నారు. ఈ సందర్భంగా నేను మహిళలందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా.. ఇలాంటివి జరిగినప్పుడు వెంటనే స్పందించండి.. ముందుకు రండి. దిశా ఘటనలో ఏం జరిగిందో చూశాం. వెంటనే స్పందిస్తూ పోలీస్ వారు చర్యలు చేపడతారు. మేం ఎంత సెలబ్రిటీలమైనా మాకూ కుటుంబాలు ఉన్నాయి. నా కూతురు, భార్యలతో పాటు బయటవాళ్లను గౌరవిస్తాను. రీసెంట్ నాన్న పోయిన బాధలో ఉన్న నా తల్లికి ఈ ఘటన ఎంత వేదన మిగిల్చిందో నాకు తెలుసు. మా తమ్ముడు కూడా చాలా బాధపడ్డాడు. నిజా నిజాలు తెలుసుకోకుండా ట్రోల్ చేయడం సరికాదు. మాకు కుటుంబాలు ఉంటాయి. ఈరోజు నాకు జరిగింది.. రేపు ఇంకో సెలబ్రిటీకి జరగొచ్చు. దయచేసి నిజా నిజాలు తెలుసుకోండి’ అంటూ ఎమోషనల్ అయ్యారు హీరో కృష్ణుడు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3js0ewY
v

వీడియో: షూటింగ్ షురూ చేసిన సుప్రీం హీరో.. ఇస్మార్ట్ బ్యూటీతో స్టెప్పులు

కరోనా వైరస్, లాక్‌డౌన్ కారణంగా సుమారు నాలుగు నెలలు ఇంటికే పరిమితమైన సుప్రీం హీరో ఎట్టకేలకు ముఖానికి రంగేసుకున్నారు. ఆయన హీరోగా తెరకెక్కుతోన్న ‘సోలో బ్రతుకే సో బెటర్’ సినిమా షూటింగ్ తిరిగి ప్రారంభమైంది. సాయి ధరమ్ తేజ్‌తో పాటు హీరోయిన్ నభా నటేష్ ఈ షూటింగ్‌లో పాల్గొంటున్నారు. ప్రస్తుతం పాటను చిత్రీకరిస్తున్నారు. శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ అందిస్తున్నారు. షూటింగ్ తిరిగి ప్రారంభించిన విషయాన్ని తెలియజేస్తూ చిత్ర నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర (SVCC) వీడియోను విడుదల చేసింది. షూటింగ్ కోసం ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారో ఈ వీడియోలో చూపించారు. క్యారవ్యాన్‌లను పూర్తిగా శానిటైజ్ చేస్తున్నారు. ప్రతి ఒక్కరూ మాస్క్‌లు ధరించి సెట్‌లోకి వస్తున్నారు. ఇక మేకప్‌మ్యాన్‌లు పీపీఈ కిట్‌లు ధరించి నటీనటులకు మేకప్ వేస్తున్నారు. మొత్తం మీద అన్ని జాగ్రత్తల నడుమ ‘సోలో బ్రతుకే సో బెటర్’ షూటింగ్ తిరిగి ప్రారంభమైంది. షూటింగ్ తిరిగి ప్రారంభంకావడంపై హీరోహీరోయిన్లు సాయి ధరమ్ తేజ్, నభా నటేష్ ఆనందం వ్యక్తం చేశారు. ట్విట్టర్ ద్వారా స్పందించారు. Also Read: ‘‘తిరిగి సెట్స్ మీదుకి రావడం చాలా బాగుంది. మేమంతా చాలా ఆనందంగా ఉన్నాం. ప్రతి ఒక్కరూ సురక్షితంగా ఉండటానికి మేం చాలా జాగ్రత్త తీసుకుంటున్నాం’’ అని సాయి ధరమ్ తేజ్ ట్వీట్ చేశారు. అలాగే నభా నటేష్ ట్వీట్ చేస్తూ.. ‘‘షూటింగ్‌ను తిరిగి ప్రారంభించినందుకు మేం సూపర్ ఎగ్జైటెడ్‌గా ఉన్నాం. అదే సమయంలో మేం అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం’’ అని పేర్కొన్నారు. కాగా, ఈ సినిమా ద్వారా సుబ్బు దర్శకుడిగా పరిచయమవుతున్నారు. తమన్ సంగీతం సమకూరుస్తున్నారు. బి.బాపినీడు సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్‌పై బీవీఎస్ఎన్ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వెంకట్ సి దిలీప్ సినిమాటోగ్రఫీ అందిస్తు్న్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/32ISMXp
v

వికారాబాద్ అడవుల్లో రకుల్ ప్రీత్.. అంతా సీక్రెట్‌గా కానిచ్చేస్తున్న డైరెక్టర్!

ముంబై నుంచి నేరుగా వికారాబాద్ అడవుల్లో వాలిపోయిందట యంగ్ హీరోయిన్ . సీక్రెట్‌గా అక్కడే షూటింగ్‌లో పాల్గొంటోందని తెలిసింది. ఆహా ఓటీటీ కోసం రూపొందిస్తున్న ఓ వెబ్ సిరీస్ షూట్‌లో నటిస్తోందట రకుల్. ఈ వెబ్ సిరీస్ కోసం మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్‌తో వికారాబాద్ అడవుల్లో ఆడిపాడుతోందట. లాక్‌డౌన్ కారణంగా షూటింగ్స్ బంద్ అయ్యాక లాంగ్ గ్యాప్ తీసుకొని తిరిగి నిన్ననే(ఆగస్టు 30) సెట్స్ మీదకు వచ్చిందట రకుల్ ప్రీత్. క్రిష్ తెరకెక్కిస్తున్న ఈ మూవీ కోసం విమానాశ్రయం దిగగానే నేరుగా వికారాబాద్ వెళ్లిందట రకుల్. అక్కడే సీక్రెట్‌గా క్రిష్ తన సినిమా షూటింగ్ చేస్తున్నారట. దాదాపు వారం రోజుల పాటు ఈ షూట్ ఉండొచ్చని తెలుస్తోంది. ఇందులో రకుల్ గ్లామర్ రోల్ పోషిస్తోందని టాక్. ఇకపోతే డైరెక్టర్ క్రిష్.. తన తదుపరి సినిమాను పవన్ కళ్యాణ్‌తో చేయనున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు షూటింగ్స్ లేకపోవడంతో ఆ గ్యాప్ ఫిల్ చేస్తూ ఇంతలో వైష్ణవ్ తేజ్- రకుల్ వెబ్ సిరీస్ ఫినిష్ చేయాలని ప్లాన్ చేసిన క్రిష్ దాన్ని ఇలా అమలు చేస్తున్నారని సమాచారం. Also Read: ఇక తెలుగులో చివరగా ‘మన్మథుడు 2’ మూవీలో నాగార్జునతో రొమాన్స్ చేసిన రకుల్.. ఆ తర్వాత టాలీవుడ్ నుంచి అవకాశాలు సన్నగిల్లడంతో బాలీవుడ్‌పై ఫోకస్ పెట్టేసింది. ఉత్తరాది ప్రేక్షకులకు కూడా తన అందాల రుచి చూపించాలని ప్లాన్ చేసి బోల్డ్ పాత్రలు చేసేందుకు రెడీ అయింది. ఈ క్రమంలోనే ఆమె రీసెంట్‌గా ఓ వేశ్య పాత్ర చేసేందుకు అంగీకారం తెలిపిందని తెలుస్తోంది. ముంబై రెడ్ లైట్ ఏరియాకు చెందిన ప్రముఖ వేశ్య జీవిత కథ ఆధారంగా ఈ మూవీ రానుందని టాక్.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3hIKHZn
v

ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కి నిర్మాత రిక్వెస్ట్: మాకు అది సెంటిమెంట్.. త్వరలోనే బిగ్ సర్‌ప్రైజ్!

యంగ్ టైగర్ ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌తో కలిసి ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో RRR సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ చిత్ర షూటింగ్ పూర్తి కాగానే.. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కనున్న తన 30వ సినిమా షూటింగ్‌లో ఎన్టీఆర్ పాల్గొంటారు. ‘అరవింద సమేత’ సినిమాను నిర్మించిన హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌లోనే ఈ సినిమాను కూడా చేస్తున్నారు. నందమూరి కళ్యాణ్ రామ్ ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌ కూడా ఈ చిత్ర నిర్మాణంలో భాగస్వామిగా ఉంది. పొలిటికల్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కబోతోన్న ఈ సినిమాకు ‘అయిననూ పోయి రావలె హస్తినకు’ అనే టైటిల్ ప్రచారంలో ఉంది. కానీ, దీనిపై ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఇదిలా ఉంటే, ఈ సినిమాకు సంబంధించి అప్‌డేట్ ఏదైనా ఇవ్వాలని ఎన్టీఆర్ అభిమానులు సోషల్ మీడియా ద్వారా నిర్మాతలను కోరుతున్నారు. దీనికి నిర్మాత సూర్యదేవర నాగవంశీ పాజిటివ్‌గా రెస్పాండ్ అయ్యారు. ఫ్యాన్స్ కోసం అదిరియే అప్‌డేట్ సిద్ధమవుతోందని ఆయన అన్నారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ ద్వారా స్పందించారు. Also Read: ‘‘మన యంగ్ టైగర్ ఎన్టీఆర్ అన్న ఫ్యాన్స్ అందరికీ చెప్పేదేంటంటే.. ఒక అప్‌డేట్ ఇవ్వాలంటూ మీరు పంపుతోన్న మెసేజ్‌లను మేం అందుకున్నాం. మేం షూటింగ్‌ ప్రారంభించిన తరవాత మాత్రమే ఏ విషయాన్నైనా రివీల్ చేస్తాం. షూటింగ్ ప్రారంభించకుండా ఏ విషయాన్ని రివీల్ చేయకూడదు అనేది మా సెంటిమెంట్. మా మీద నమ్మకం ఉంచండి, చాలా చాలా పెద్ద అప్‌డేట్ సిద్ధమవుతోంది’’ అని నాగవంశీ తన ట్వీట్‌లో పేర్కొన్నారు. కాగా, డైరెక్టర్ త్రివిక్రమ్ ఈ లాక్‌డౌన్ సమయాన్ని స్క్రిప్ట్‌కు మెరుగులు దిద్దడానికి వాడినట్టు సమాచారం. ఇప్పటికే త్రివిక్రమ్-ఎన్టీఆర్ కాంబినేషన్‌లో ‘అరవింద సమేత’ వంటి హిట్ సినిమా రావడం, ఈ ఏడాది ‘అల వైకుంఠపురములో’ చిత్రంతో త్రివిక్రమ్ ఇండస్ట్రీ హిట్ అందుకోవడం, RRR తరవాత ఎన్టీఆర్ హీరోగా వస్తోన్న సినిమా కావడంతో అంచనాలు ఆకాశాన్ని అంటుతున్నాయి. అందుకే, త్రివిక్రమ్ ఈ లాక్‌డౌన్ సమయంలో స్క్రిప్ట్‌కు మరింత సానపట్టారని అంటున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3bahT9D
v

Radhe Shyam: లాంగ్ గ్యాప్ తర్వాత ఇటలీ బయల్దేరుతున్న ప్రభాస్ అండ్ టీమ్.. రిస్క్ చేసేందుకు రెడీ!

యంగ్ రెబల్ స్టార్ లాంగ్ గ్యాప్ తర్వాత మళ్ళీ ఫారిన్ ట్రిప్ వేయనున్నారని తెలుస్తోంది. ఆయన లేటెస్ట్ మూవీ ‘’ షూటింగ్ తదుపరి షెడ్యూల్ కోసం ప్రభాస్ అండ్ టీమ్ అతిత్వరలో ఇటలీ బయల్దేరబోతోందని సమాచారం. గతంలో కూడా కరోనా కారణంగా షూటింగ్స్ వాయిదా పడిన సమయంలో ఫారిన్ షూట్‌లో ఉండి చివరగా షూటింగ్ వాయిదా వేసుకున్న ఈ చిత్ర యూనిట్ మరోసారి రిస్క్ చేయడానికి రెడీ అయిందని టాక్. 1960 దశకం నాటి ప్రేమకథతో ఎంతో ప్రతిష్టాత్మకంగా రాధాకృష్ణ దర్శకత్వంలో ‘రాధే శ్యామ్’రూపొందుతోంది. ఈ సినిమా ఫస్ట్‌లుక్ ఇటీవలే రిలీజ్ చేసి ఆసక్తి రేకెత్తించిన చిత్రయూనిట్.. ఇక త్వరత్వరగా షూటింగ్ ఫినిష్ చేసేందుకు ప్లాన్స్ చేస్తోందట. ఈ మూవీ షూటింగ్ ఎక్కువ భాగం ఫారిన్ లొకేషన్స్‌లో షూట్ చేయాల్సి ఉండటంతో మరికొద్ది రోజుల్లో ఇటలీ షూట్ ప్రారంభించాలని ప్లాన్ చేస్తున్నారట మేకర్స్. యూరప్‌లో టూరిజం విషయంలో నిబంధనలను సడలిస్తుండడంతో దీనిని సద్వినియోగం చేసుకునేలా సన్నాహాలు ప్రారంభించారట. అన్నీ అనుకున్నట్లు జరిగితే సెప్టెంబర్ రెండోవారంలో ఫ్లైట్ ఎక్కాలని డిసైడ్ అయ్యారట. Also Read: మరోవైపు గత నాలుగు నెలలకు పైగా షూటింగ్స్ వాయిదా పడటం, విదేశాల్లో కరోనా కల్లోలం సృష్టిస్తుండటం కారణంగా ఇక విదేశీ షూటింగ్స్ కుదరవని భావించి ఇప్పటికే ఈ మూవీ కోసం హైదరాబాద్ రామోజీ ఫిలిం సిటీలో భారీ సెట్ వేసి షూటింగ్ చేయాలని ఫిక్సయ్యారు. ఇందుకోసం దాదాపు 6 కోట్లు ఖర్చు చేశారట. దీంతో తదుపరి షెడ్యూల్ ఇక్కడే ఫినిష్ చేస్తారా? లేక ఇటలీ వెళ్తారా? అనేది సందేహంగా మారింది. అయినా ఇలాంటి పరిస్థితుల్లో ప్రభాస్ విదేశీ ప్రయాణం అనేది పెద్ద రిస్క్ అనే చెప్పుకోవాలి. ప్ర‌భాస్ 20వ చిత్రంగా తెర‌కెక్కుతున్న ఈ రాధే శ్యామ్ సినిమాలో ఆయన సరసన అందాల తార పూజా హెగ్డే ఆడిపాడుతోంది. గోపీకృష్ణ బ్యానర్, యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. చిత్రంలో ప్రభాస్ ప్యూర్ రొమాంటిక్ రోల్ చేస్తున్నారనేది విశ్వసనీయ వర్గాల సమాచారం.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2Ddv114
v

సునీల్ హీరోగా ‘వేదాంతం రాఘవయ్య’.. హరీష్ శంకర్‌దే బాధ్యత

హీరో క్యారెక్టర్లకు కాస్త గ్యాప్ ఇచ్చిన మళ్లీ తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌లో సునీల్ హీరోగా ఒక సినిమా చేస్తున్నారు. ఈ చిత్రానికి ‘వేదాంతం రాఘవయ్య’ అనే టైటిల్‌ను పెట్టారు. అంతేకాదు, ఈ సినిమాకు హరీష్ శంకర్ కథ అందించారు. అలాగే, ఈ సినిమాను ఆయన సమర్పిస్తున్నారు. రామ్ ఆచంట, గోపీ ఆచంట నిర్మాతలు. 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌లోనే ‘గద్దలకొండ గణేష్’ వంటి హిట్ చిత్రాన్ని హరీష్ శంకర్ డైరెక్ట్ చేశారు. ఇప్పుడు అదే బ్యానర్‌తో కలిసి సినిమాను నిర్మిస్తుండటం, ఆ సినిమాకు ఆయనే కథ రాయడం విశేషం. ‘వేదాంతం రాఘవయ్య’.. ఈ టైటిల్‌ వింటుంటేనే ఏదో తెలియని ఆసక్తి కలుగుతోంది. టైటిల్ చాలా ప్లెజెంట్‌గా ఉందనిపిస్తోంది. మరి సినిమా ఎలా ఉండబోతోందో చూడాలి. ఈ సినిమాకు ఇంకా దర్శకుడిని ఖరారు చేయలేదు. త్వరలోనే దర్శకుడి పేరుతో పాటు ఇతర వివరాలను చిత్ర యూనిట్ ప్రకటించనుంది. ఇదిలా ఉంటే, సునీల్ హీరోగా వచ్చిన ఆఖరి సినిమా ‘2 కంట్రీస్’. ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఆ తరవాత సునీల్ మళ్లీ క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మారిపోయారు. ‘సిల్లీ ఫెలోస్’లో నరేష్ కలిసి నటించారు. ఆ తరవాత ‘అరవింద సమేత’, ‘అమర్ అక్బర్ ఆంటొని’, ‘చిత్రలహరి’, ‘అల వైకుంఠపురములో’ వంటి పెద్ద సినిమాల్లో నటించినా ఆయన పాత్రలకు పెద్దగా గుర్తింపు రాలేదు. ఈ ఏడాది వచ్చిన ‘డిస్కోరాజా’ సినిమాతో సునీల్ విలన్ అవతారం ఎత్తారు. ప్రస్తుతం ఆయన నెగిటివ్ రోల్ పోషిస్తోన్న ‘కలర్ ఫొటో’ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. Also Read:


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3hVCAsc
v

ఆ ఫంక్షన్‌లో వాడు నా నడుము గిల్లేశాడు, హీరో నరేష్ వాడితో ఫైట్ చేశారు: హీరోయిన్ లతా శ్రీ

హీరో నరేష్, సీత హీరో హీరోయిన్లుగా నటించిన ‘పోలీస్ భార్య’ 90లో పెద్ద హిట్ మూవీ. రేలంగి నరసింహరావు దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా వందరోజుల సినిమా వేడుకలో జరిగిన ఇన్సి డెంట్‌ను షేర్ చేసుకున్నారు అలనాటి నటి లత శ్రీ. ‘పోలీస్ భార్య’ చిత్రంలో బోల్డ్‌గా కనిపించింది లతా శ్రీ. అప్పట్లో ఆమెకు హాట్ హీరోయిన్‌గా పేరు. అయితే ఆమె నటించిన ‘పోలీస్ భార్య’ చిత్రం వందరోజుల వేడుకలో ఆడియన్స్‌లో ఒకడు తనతో అసభ్యకరంగా ప్రవర్తించడంతో చెంప పగలకొట్టా అని చెప్పు కొచ్చింది ఈ హీరోయిన్. ‘బేసిక్‌గా నాకు కోపం ఎక్కువ.. ‘పోలీస్ భార్య’ మూవీ వంద రోజుల ఫంక్షన్ జరుగుతుంది. అప్పట్లో ఆర్టిస్ట్‌లు బయటకు వచ్చేవారు కాదు.. ఆ వేడుకకు చాలామంది జనం వచ్చారు.. ఆర్టిస్ట్‌లు అందరం వస్తుంటే.. హీరో నరేష్, హీరోయిన్ సీత అందరం కలిసి వెళ్తున్నాం.. ఈలోపు వెనుక నుంచి వచ్చి ఒకడు నడుముని గట్టిగా గిల్లేశాడు. వాడివైపు కోపంగా చూస్తుండగానే మళ్లీ రెండోసారి ఏదో చేయడానికి మీదికి వస్తున్నాడు. నాకు పిచ్చ కోపం వచ్చి వాడి చేయిపట్టుకుని వెనక్కి తిప్పి ఒక్కటి ఇచ్చా. వెంటనే వాడు అక్కడ నుంచి వెళ్లిపోయి గ్యాంగ్‌ని తీసుకుని వచ్చాడు. ఓ పది మందిని తీసుకుని మా మీదికి వచ్చాడు. ఏంటి మావాడ్ని కొట్టావ్ అంటూ మీది మీదికి వస్తుంటే.. హీరో నరేష్ గారు రియల్ హీరో అనిపించారు. వాళ్లతో ఫైట్ చేసి.. అందర్నీ వెనక్కి నెట్టేసి పోలీసుల్ని పిలిచించారు. అక్కడ్నుంచి హీరో నరేష్ గారే నాకు ప్రొటక్షన్‌గా ఉండి వేన్ ఎక్కించి ఇంటికి పంపారు’ అంటూ చెప్పుకొచ్చారు . పదోతరగతి ఉండగానే హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన లతా శ్రీ.. నాటి అగ్రహీలందరితోనూ నటించింది. యమలీల, నెంబర్ వన్, ఆ ఒక్కటీ అడక్కు లాంటి హిట్ చిత్రాల్లో నటించిన లతా శ్రీ.. తెలుగు, కన్నడ, హిందీ భాషల్లో 70కి పైగా చిత్రాల్లో నటించింది. హీరో క్రిష్ణ, బాలయ్య, రాజేంద్ర ప్రసాద్ సినిమాల్లో నటించింది. నాటి అగ్రహీరోలకు చెల్లెలుగా నటించి మెప్పించింది లతా శ్రీ. 1990లో జిమ్ ట్రైనర్‌ను ప్రేమించి పెళ్లాడిన ఈమె ఆ తరువాత సినిమాలకు దూరమయ్యారు. చివరిగా ఈవీవీ ‘అత్తిలి సత్తిబాబు’ చిత్రంలో కనిపించారు లతా శ్రీ. Read Also:


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/31Igvrx
v

139 People Rape Case: అందుకే యాంకర్ ప్రదీప్ పేరు చెప్పా.. షాకింగ్ నిజాలు బయటపెట్టిన బాధితురాలు

ఏకంగా 139 మంది ఒక్కసారి కాదు రెండు సార్లు తనపై 5000 సార్లు అత్యాచారం చేశారని 25 ఏళ్ల దళిత యువతి ఇచ్చిన ఫిర్యాదు సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. నల్గొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన ఆమె గత 10 రోజుల క్రితం ఈ విషయాన్ని బయటపెడుతూ హైదరాబాద్ పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో తన ఫిర్యాదు అందించడంతో జనం ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. అయితే ఆమె ఇచ్చిన లిస్టులో పలువురు సినీ, రాజకీయ ప్రముఖులతో పాటు , నటుడు కృష్ణుడు ఉండటం జనాల్లో చర్చనీయాంశంగా మారింది. ఒక్కరే కాకుండా గ్యాంగ్ రేప్‌లు కూడా చేశారని, గర్భం దాల్చితే అబార్షన్స్ చేయించారని.. అలాగే ఫోన్లలో తనను నగ్నంగా చిత్రీకరించి హింసించారని యువతి ఇచ్చిన ఫిర్యాదుపై 113 పేజీలతో ఎఫ్ఐఆర్‌ నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అయితే ఈ పరిస్థితుల్లో సదరు యువతి మాట మారుస్తూ ఈ కేసుతో యాంకర్ ప్రదీప్‌కి గానీ, నటుడు కృష్ణుడుకి గానీ ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది. తాజాగా జరిగిన ప్రెస్‌మీట్‌లో బాధితురాలు మాట్లాడుతూ సంచలన విషయాలు బయటపెట్టింది. Also Read: రాజశేఖర్ రెడ్డి అలియాస్ డాలర్ బాయ్ ప్రెషర్ మూలంగానే తాను 139 మంది పేర్లతో ఫిర్యాదు చేశానని బాధితురాలు చెప్పింది. ఇందులో కొందరికి సంబంధం లేదని చెప్పినా కూడా వినకుండా తనను ఫిజికల్‌గా, మెంటల్‌గా టార్చర్ పెట్టి బెదిరింపులకు పాల్పడి తనతో ఈ కంప్లైంట్ పెట్టించాడని తెలిపింది. ఆయన చెప్పిన గైడెన్స్‌తోనే ఇప్పటిదాకా మీడియా ముందు మాట్లాడానని చెప్పుకొచ్చింది. తనపై రేప్ జరిగిన మాట వాస్తవమే గానీ కొందరిని అన్యాయంగా బలి చేశాడని, తనను కొట్టి అందరి పేర్లు పెట్టించాడని బాధితురాలు తెలిపింది. ఈ కేసుతో సంబంధం లేని వాళ్లందరికీ సారీ చెబుతున్నానని చెప్పింది. డాలర్ బాయ్ మూలంగా కేసు తప్పుదోవ పట్టిందని, అతని ఒత్తిడి వల్లనే యాంకర్ ప్రదీప్ పేరు, నటుడు కృష్ణుడు పేరు చెప్పానని తెలిపింది. సెలబ్రిటీల నుంచి డబ్బులు గుంజడానికి డాలర్ బాయ్ ఈ కుట్ర పన్నాడని పేర్కొంది. తనపై 139 మంది రేప్ చేయలేదని.. డాలర్ బాయ్ తనను, తన కుటుంబాన్ని బెదిరించి అలా కేసు పెట్టించాడని బాధితురాలు చెప్పింది. Read Also:


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/31HYNEz
v

Sitara: అప్పుడు తమన్నా ఇప్పుడు రష్మిక.. సితార టార్గెట్ చూడండి గురూ!! పరేషాన్ చేసిందిలే

సూపర్ స్టార్ కూతురు సూపర్ ఫాస్ట్ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎందుకంటే చిన్నతనం నుంచే తన చలాకీతనంతో ఘట్టమనేని ఫ్యాన్స్ అందరికీ దగ్గరైంది సితార. పాటలు పాడటం, డాన్సులేయడం, డైలాగ్స్ చెప్పడం ఇలా ఆల్ రౌండ్ ప్రతిభ చూపిస్తూ వావ్! అనిపించుకుంది. ముఖ్యంగా తన తండ్రి మహేష్ సినిమాల్లోని పాటలకు స్టెప్పులేస్తూ ఆకర్షిస్తున్న సితార పాప.. తాజాగా 'మైండ్ బ్లాక్' చేసే చిందులేసింది. Also Read: ఈ ఏడాది ఆరంభంలో మహేష్ బాబు హీరోగా వచ్చిన 'సరిలేరు నీకెవ్వరు' సినిమాలోని డ్యాంగ్ డ్యాంగ్ పాటకు స్టెప్పేసి గతంలోనే ఫిదా చేసిన సితార.. ఈ సారి 'మైండ్ బ్లాక్' పాటకు డాన్స్ చేసి మరోసారి పరేషాన్ చేసేసింది. ఈ పాటలో హీరోయిన్ రష్మిక మందన వేసిన డాన్సింగ్ మూవ్‌మెంట్స్ అచ్చుగుద్దినట్లు దించేసింది సితార. ఈ వీడియోను నమ్రత తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేయడంతో వెంటనే వైరల్ అయింది. సితార చేసిన ఈ మెస్మరైజ్ డాన్స్ పర్‌ఫార్‌మెన్స్ చూసి.. ''నెవ్వర్ బిఫోర్.. ఎవర్ ఆఫ్టర్'' అంటూ అదే సినిమాలోని డైలాగ్‌తో కామెంట్స్ పెడుతున్నారు నెటిజన్లు. లాక్‌డౌన్ కారణంగా గత నాలుగు నెలలుగా ఇంట్లోనే ఉంటున్న మహేష్ బాబు.. కూతురు సితార, కొడుకు గౌతమ్‌లతో జాలీగా గడుపుతున్నారు. ఆయన లేటెస్ట్ మూవీ 'సర్కారు వారి పాట' అతి త్వరలో సెట్స్ మీదకు రానుంది. పరశురామ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో మహేష్ సరసన కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటించనుంది. ఈ సినిమా ఫినిష్ అయ్యాక రాజమౌళితో సినిమా చేయనున్నారు మహేష్.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3hKhwoy
v

సినీ ఇండస్ట్రీలో మరో విషాదం.. కరోనాతో టాలీవుడ్ నిర్మాత మృతి

దేశంలో విలయతాండవం చేస్తున్న సినీ ఇండస్ట్రీని కూడా కుదిపేస్తోంది. ఇప్పటికే టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ ఇండస్ట్రీలకు చెందిన ఎందరో సినీ ప్రముఖులు కరోనా బారిన పడి కోలుకోగా.. ఇంకొందరు కరోనాతో పోరాడి కన్నుమూశారు. ఇదిలా ఉండగానే టాలీవుడ్‌లో మరో విషాదం చోటుచేసుకుంది. కరోనా కారణంగా గత రాత్రి టాలీవుడ్ నిర్మాత కన్ను మూశారు. ఆయన మరణ వార్త తెలిసి పలువురు సినీ ప్రముఖులు తమ తమ సంతాపం వ్యక్తం చేస్తున్నారు. గత కొన్నిరోజులుగా కరోనా వైరస్‌తో బాధపడుతున్న బొగారి లక్ష్మీనారాయణ సికింద్రాబాద్ యశోద హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. తెలుగులో ‘ఎదురీత’ అనే సినిమాను నిర్మించారు బోగారి లక్ష్మీనారాయణ. శ్రీ భాగ్యలక్ష్మి ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ ప‌తాకంపై ఆయన ఈ చిత్రాన్ని నిర్మించారు. పలు సినిమాల్లో విలన్ రోల్ పోషించిన శ్రవణ్ రాఘవేంద్ర‌ను ఈ మూవీ ద్వారా హీరోగా పరిచయం చేశారాయన. Also Read:


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2Z5V4iH
v

Sunday 30 August 2020

డ్రగ్స్ మత్తులో టాలీవుడ్ సెలబ్రిటీల అరాచకాలు.. అమ్మో! భయమేస్తోందంటూ మాధవీలత షాకింగ్ కామెంట్స్

ముక్కుసూటిగా మాట్లాడటం, ఉన్నది ఉన్నట్లు కుండబద్దలు కొట్టేయడం యంగ్ హీరోయిన్ మాధవీలతకు ఓ అలవాటు. ఇష్యూ ఏదైనా సరే తనదైన కోణంలో స్పందిస్తూ ఉంటుంది ఈ హీరోయిన్ కమ్ పొలిటీషియన్. ఈ క్రమంలోనే తాజాగా బాలీవుడ్ ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారిన డ్రగ్స్ వ్యవహారాన్ని టాలీవుడ్‌‌కి కూడా లింక్ చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేసింది ఈ ముద్దుగుమ్మ. ఒక్క బాలీవుడ్ మాత్రమే కాదు టాలీవుడ్ లోనూ డ్రగ్స్ పార్టీలు జరుగుతున్నాయని, టాలీవుడ్ అంతా డ్రగ్స్ మత్తులో ఊగిపోతోందని పేర్కొంటూ ఓ పోస్ట్ పెట్టింది. బాలీవుడ్ న‌టుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మ‌హ‌త్య కేసులో ఆయన ప్రేయసి రియా చక్రవర్తిని కీలకంగా తీసుకొని విచారిస్తున్న క్రమంలో డ్రగ్స్ డీలర్లతో ఆమె చేసిన వాట్సాప్ చాట్ బయటకురావడం సినీ వర్గాల్లో హాట్ ఇష్యూ అయింది. అయితే ఈ ఇష్యూలోకి ఎంటరైన హీరోయిన్ కంగనా రనౌత్.. బాలీవుడ్‌లో 99 శాతం మంది డ్రగ్స్ తీసుకుంటున్నారంటూ సంచలన ఆరోపణలు చేసింది. సరిగ్గా ఈ పరిస్థితుల్లో నోరువిప్పి టాలీవుడ్‌లో కూడా డ్రగ్స్ మాఫియా ఉందని, ఇక్కడ ఏ పార్టీ జరిగినా డ్రగ్స్ తప్పకుండా వాడతారంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది. అంతటితో ఆగక తెలంగాణ నార్కోటిక్స్ కంట్రోల్ బోర్డ్ అధికారులు దీనిపై దృష్టి పెట్టాలని పేర్కొంది. ''ఇతర దేశాల మారక ద్యవ్యాలు ఎందుకు? ఆ మత్తులో జరిగే అరాచకాలు ఎవరు బయటపెట్టరు. అది సరే కానీ.. తెలంగాణ NCB మన టాలీవుడ్ మీద కూడా ఒక కన్నేయండి. పీతకన్ను కాకుండా సీరియస్ కన్ను వేయండి. మన ఇండస్ట్రీలో డ్రగ్స్ వినియోగం ఎక్కువగా ఉంది. అది లేకుండా కొన్ని పార్టీలు జరగవు'' అని పేర్కొన్న మాధవీలత.. చివరగా ''నాకు భయంగా ఉంది ఈ పోస్ట్ పెట్టాను అని నన్ను ఎవరైనా బెదిరిస్తారేమో అని. ఎవరు డ్రగ్స్ జోలికి పోరు ఆ అధికారులు కూడా చూసి చూడనట్లే ఉంటారు. నిజంగా పట్టుకుంటే వాళ్ళకి భయం.. ఒకవేళ పట్టుకున్నా ప్రభుత్వాలు ఎలాగూ వేదిలెయ్ అని భయపెడతాయి కదా ఆఫీసర్స్‌ని. సరేలే నాకేమన్నా అయితే చట్టం చేతకానితనం అని నేనే కేసు పెట్టాల్సి వస్తుందేమో'' అంటూ ప్రభుత్వ అధికారులు, రాజకీయ నాయకులపై సెటైర్స్ వేసింది మాధవీ. Also Read: గతంలో టాలీవుడ్ ఇండస్ట్రీలో డ్రగ్స్ కలకలం పెద్ద రచ్చకు దారితీసిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంలో చాలామంది సినీ ప్రముఖుల పేర్లు బయటకొచ్చాయి. అయితే ఆ తర్వాత ఈ కేసు వివరాలు వెల్లడించకుండా అధికారులు మెల్లగా సైలెంట్ కావడంతో అది మిస్టరీ గానే మిగిలింది. మళ్ళీ ఇప్పుడు మాధవీలత చేసిన కామెంట్స్ చూస్తుంటే మరోసారి రచ్చ కావడం ఖాయమే అని తెలుస్తోంది. సో.. చూడాలి మరి మాధవీలత చేసిన ఈ కామెంట్స్‌పై టాలీవుడ్ ప్రముఖులు ఎలా రియాక్ట్ అవుతారనేది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/32F3UVh
v

S. Radha Krishna: నిర్మాత చినబాబు బర్త్ డే.. వెల్లువెత్తుతున్న శుభాకాంక్షలు

నేడు (ఆగష్టు 31) టాలీవుడ్ ప్రొడ్యూసర్, మృదుస్వభావి . ఈ సందర్భంగా ఆయనకు పలువురు సినీ ప్రముఖులు, పీఆర్‌ఓలు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలుపుతున్నారు. టాలీవుడ్ ఇండస్ట్రీలో అందరితో కలివిడిగా ఉండే ఆయన భవిష్యత్తులో మరెన్నో విజయాలు అందుకోవాలని కోరుకుంటూ స్వీట్ విషెస్ పోస్ట్ చేస్తున్నారు. చినబాబు అసలు పేరు . హారిక అండ్ హాసిని క్రియేషన్స్, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్స్ స్థాపించి పలు సినిమాలు రూపొందించారు చినబాబు. పోగొట్టుకున్న చోటే వెతుక్కోవాలి అనే ఫార్ములాతో సక్సెస్ అయ్యారు చినబాబు. ఎప్పుడో 28 ఏళ్ల క్రితం 'ఆత్మకథ' సినిమా తీసి నష్టాలు మూటగట్టుకున్న ఆయన.. తిరిగి 'జులాయి' సినిమాతో మరోసారి నిర్మాణ రంగంలోకి ఎంటర్ అయ్యారు. ఆ సినిమాతో సూపర్ హిట్ అందుకొని ఆ వెంటనే ''సన్నాఫ్ సత్యమూర్తి, అఆ..'' సినిమాలతో లాభాల బాట పట్టారు. ఓ ఇన్సూరెన్స్ కంపెనీలో ఉద్యోగం చేసిన చినబాబు నిర్మాతగా ఎదిగిన తీరు, సాధించి తీరాలనే ఆయన మొండితనం ఎందరికో ఆదర్శం అని చెప్పుకోవచ్చు. తన జీవితంలో ముఖ్యమైన వ్యక్తి త్రివిక్రమ్ శ్రీనివాస్ అని చెబుతుంటారు చినబాబు. ఆయన పదునైన మాటలు తనను ఎంతగానో ఆకర్షిస్తాయని, ఆయనతో ఎక్కువ సినిమాలు చేయాలనుందని అంటారాయన. కాగా ఇప్పటికే చినబాబు- త్రివిక్రమ్ కాంబోలో వచ్చిన ''జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి, అఆ..'' సినిమాలు సూపర్ డూపర్ హిట్ సాధించిన సంగతి తెలిసిందే. ఇక ఆయన స్థాపించిన బ్యానర్ హారిక అండ్ హాసిని క్రియేషన్స్‌ సక్సెస్‌ఫుల్ సినిమాలతో ముందుకెళ్తోంది. హారిక, హాసిని తన ఇద్దరు కూతుళ్ళ పేర్లు అని గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పారు చినబాబు. ఇండస్ట్రీలో మృదుస్వభావిగా పేరున్న చినబాబుకు మీ మా 'సమయం తెలుగు' తరఫున ప్రత్యేకంగా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతున్నాం.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2QAl40K
v

Manchu Lakshmi: రియా విషయంలో ఇది సరైన పద్దతి కాదు.. నెట్టింట రచ్చ చేస్తున్న మంచు లక్ష్మి ట్వీట్

బాలీవుడ్ యువ నటుడు బలవన్మరణం తర్వాత జరుగుతున్న పరిణామాలు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశం అయిన సంగతి తెలిసిందే. సుశాంత్ ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదని, ఈ మరణం వెనుక కొందరి హస్తం ఉందని ఆరోపణలు గుప్పుమనడంతో ఈ కేసును సీరియస్‌గా తీసుకొని సీబీఐ రంగంలోకి దిగింది. అయితే సుశాంత్ సూసైడ్ కేసులో ఆయన ప్రేయసి రియా చక్రవర్తిని కార్నర్ చేస్తూ పలువురు అనుమానాలు వ్యక్తం చేశారు. దీంతో ఆమెను లోతుగా విచారిస్తూ కూపీ లాగుతున్నారు సీబీఐ అధికారులు. ఈ పరిస్థితుల్లో చేసిన ఓ ట్వీట్ నెట్టింట రచ్చ చేస్తోంది. ఇటు సుశాంత్‌కి, అటు రియా చక్రవర్తికి న్యాయం జరగాలంటూ మంచు లక్ష్మి పెట్టిన పోస్ట్ వివాదాస్పదంగా మారింది. తాను ఇటీవల రియా, రాజ్‌దీప్ సర్దేశాయి ఇంటర్వ్యూ మొత్తం చూశాక దీనిపై స్పందించాలా వద్దా అని దీర్ఘంగా ఆలోచించి ఈ పోస్ట్ చేస్తున్నా అంటూ తన భావాలను అందరి ముందుంచింది మంచు లక్ష్మి. ఇందులో ఆమె ప్రస్తావించిన కొన్ని అంశాలు సోషల్ మీడియాలో రచ్చకు కారణమయ్యాయి. ఓ అమ్మాయిని ఒంటరి చేసి రాక్షసురాలిగా చిత్రీకరిస్తున్నారని రియాను ఉద్దేశిస్తూ లక్ష్మి పెట్టిన సందేశంపై కొందరు నెటిజన్స్ ఫైర్ అవుతున్నారు. ఆమె పోస్ట్ చేసిన సందేశం వివరంగా చూస్తే.. ''సుశాంత్ సూసైడ్ కేసులో నిజానిజాలేంటో తనకు తెలియదు. అయితే వాటిని తెలుసుకోవాలనుకుంటున్నా. సుశాంత్‌కు న్యాయం చేయాలని సీబీఐ సహా అన్ని రకాల ఏజెన్సీలు, అధికారులు కష్టపడుతున్న తీరు హర్షనీయం. కాకపోతే నిజానిజాలు బయటకురాకుండానే ఒకరిని నిందించడం, వేరొకరి ఫ్యామిలీని కించపరిచే వ్యాఖ్యలు చేయడం సరికాదనేది నా అభిప్రాయం. మీడియా కథనాలు చూసి రియా కుటుంబం పడే ఆవేదన ఎలా ఉంటుందో నాకు తెలుసు. జీవితంలో ఇలాంటి సందర్భాల్లోనే సహచరులు అండగా నిలబడాలి. రియా విషయంలో ఇది సరైన పద్దతి కాదు. అసలు విషయం బయటకొచ్చే దాకా ఆమెను నిందించడం ఆపండి'' అని మంచు లక్ష్మి పేర్కొంది. Also Read: అయితే లక్ష్మి మాటలకు తాప్సి లాంటి కొందరు సెలబ్రిటీలు మద్దతిస్తుండగా.. కొంతమంది సుశాంత్ ఫ్యాన్స్ మాత్రం తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. సూసైడ్ కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న రియాకు మీరు మద్దతు ఇవ్వడమేంటని మంచు లక్ష్మిపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/31IWgtQ
v

Anchor Pradeep: యువతిపై 139 మంది రేప్.. యాంకర్ ప్రదీప్‌‌‌పై ట్రోలింగ్.. ఇదీ అలీ రెజా రియాక్షన్

దాదాపు 139 మంది తనను ఐదు వేల సార్లు అత్యాచారం చేశారని, కొన్నేళ్ల నుంచి ఇది కొనసాగుతోందంటూ ఓ దళిత యువతి సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. నల్గొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన ఆమె హైదరబాబ్ పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడం సంచలనంగా మారింది. అయితే ఆమె ఇచ్చిన లిస్టులో పలువురు సినీ, రాజకీయ ప్రముఖులతో పాటు యాంకర్ ప్రదీప్, నటుడు కృష్ణుడు కూడా ఉండటం జనాల్లో హాట్ టాపిక్ అయింది. మరోవైపు లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రదీప్.. ఆ అమ్మాయి ఎవరో కూడా తనకు తెలియదని, ఈ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని తెలుపాడు. ఇందులోకి లాగడం అనేది తనను మానసిక మానభంగం చేయడమే అంటూ ఫైర్ అయ్యాడు. ఈ మేరకు ఇప్పటికే యాంకర్ ప్రదీప్‌‌కు అండగా నిలుస్తూ పలువురు యాంకర్స్ స్పందిస్తున్నారు. ఇప్పటికే యాంకర్ రవి.. ప్రదీప్‌కు మద్దతు తెలిపాడు. దయచేసి ప్రదీప్‌పై సోషల్ ట్రోలింగ్ ఆపండి అని కోరాడు. Also Read: ఈ క్రమంలోనే తాజాగా బిగ్ బాస్ ఫేమ్ కూడా రియాక్ట్ అవుతూ తన మద్దతు తెలిపాడు. ఎప్పటికైనా నిజమే గెలుస్తుందని తాను ప్రదీప్‌కు అండగా ఉంటానని పేర్కొంటూ మెసేజ్ పోస్ట్ చేశాడు అలీ రెజా. వాస్తవాలు తెలియకుండా సోషల్ ట్రోలింగ్ చేయకండి అని కోరాడు. మరోవైపు నటుడు కృష్ణుడు కూడా ఆ అమ్మాయి చెబుతుందంతా అవాస్తవం అని కొట్టిపారేస్తూ ఈ కేసుతో తనకెలాంటి సంబంధం లేదని అన్నాడు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2GdGbnN
v

Ntv: ఎన్ టీవీ 13వ వార్షికోత్సవం.. పవన్ కళ్యాణ్, బండ్ల గణేష్ ప్రత్యేక శుభాకాంక్షలు

తెలుగు వార్తా ఛానళ్లలో తనదైన ముద్ర వేసుకున్న ఎన్ టీవీ విజయవంతంగా 13వ వార్షికోత్సవం జరుపుకుంటోంది. ఈ సందర్భంగా సంస్థ యాజమాన్యానికి హృదయపూర్వక శుభాకాంక్షలు చెప్పారు . ఛానెల్ సిబ్బందికి, సంస్థ అధినేత టీ. నరేంద్ర చౌదరి గారికి అభినందనలు తెలియజేస్తూ ఎన్ టీవీ మరెన్నో ప్రజాహిత వార్తా కథనాలు అందిస్తూ ప్రేక్షకాదరణ పొందాలని ఆకాంక్షించారు పవన్. ఇక పవన్ వీరాభిమాని ట్వీట్ చేస్తూ.. ''13 ఏళ్ళ క్రితం అడుగులు వేయడం ప్రారంభించిన మా ఎన్ టీవీ .. జర్నలిజం విలువలను ముందుకు తీసుకుని వెళుతూ మరిన్ని విజయాలు సాధిస్తుందని ఆశిస్తూ. యాజమాన్యానికి, సిబ్బందికి అభినందనలు'' అని పేర్కొన్నారు. జర్నలిజం అంటే ఒక బాధ్యత.. జర్నలిజం అంటే ఒక కట్టుబాటు.. జర్నలిజం అంటే కత్తిమీద సాము అన్న చైతన్యంతో ఎన్ టీవీ మొదలైంది. జనం వారి ప్రయోజనం జంట లక్ష్యాలుగా ప్రయాణం ప్రారంభించింది. వార్తలు చెప్పడంలో విలక్షణత చూపిస్తూ జనం గొంతుకగా నిలిచింది. లైవ్ వ్యాన్లతో వార్తా ప్రసారాల స్థాయిని పెంచుతూ అసలు లక్ష్యం ప్రజాహితమే అంటూ దూసుకు పోతోంది. ప్రతి వార్తకీ ప్రజలే కేంద్రం కావాలి. ప్రతి కార్యక్రమానికీ ప్రజాహితమే లక్ష్యం కావాలి. జనాకాంక్షకు ప్రతిక్షణం ఎన్టీవీ వేదిక కావాలి. జనాభిప్రాయానికి ఎన్టీవీ ప్రతిబింబం కావాలి అన్నట్లుగా యాజమాన్యం ముందుకు సాగుతోంది. మొదలైన దగ్గర నుంచి ప్రజాభిప్రాయాన్ని ప్రతిబింబించడంలో ఎన్టీవీది ఒక ప్రత్యేకమైన ముద్ర. సర్వేల నిర్వహణలో, ఫలితాల ఖచ్చితత్వంలో ఎన్టీవీది ఒక బెంచ్ మార్క్. ఒక్కసారి తప్ప ఈ పదమూడేళ్ళలో ఎన్టీవీ సర్వేలు పొరబడిన సందర్భాలే లేవు. ఇప్పుడు ప్రతి ఎన్నకల ముందూ ఎన్టీవీ సర్వే అంటే పార్టీలకు ఒక లిట్మస్ టెస్ట్. ప్రజలకి ఒక చుక్కాని. ఎన్నికలకు ముందు ఏడాది నుంచే దశలు వారిగా సర్వేలు వెలువరించడం ఎన్టీవీకి ఆనవాయితీ. ఈ సర్వేలను చూసి వ్యూహాన్ని మార్చుకున్న పార్టీలు కూడా ఉన్నాయి. ట్రెండ్‌తో పాటు ట్రెడిషన్‌కి కూడా సమప్రాధాన్యమిస్తూ సాగుతోంది ఎన్టీవీ ప్రయాణం. సమాజానికి మార్గనిర్దేశనం చేసే ధార్మిక గురువుల ఆధ్యాత్మిక సందేశాన్ని ప్రజలకు అందించే గురుతర బాధ్యతను నెత్తికెత్తుకుంది. సనాతన ధర్మ పరిరక్షణలో ఎన్టీవీ, భక్తి టీవీ పదేళ్లుగా కలసి అడుగులేస్తున్నాయి. ఏటా భక్తి టీవీ, ఎన్టీవీ ఆధ్వర్యంలో నిర్వహించే కోటి దీపోత్సవం దేశంలోనే అతి ముఖ్యమైన హిందూ ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో ఒకటిగా పేరు తెచ్చుకుంది. అటు సోషల్ మీడియాలో కూడా శరవేగంగా దూసుకుపోతోంది ఎన్ టీవీ.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3gJ3mme
v

Pushpa: 'పుష్ప'లో జగపతిబాబు.. సినిమాకే ఓ అసెట్! సుకుమార్ పక్కా స్కెచ్..

క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ స్కెచ్చేశారంటే అది ఎలా వర్కవుట్ చేస్తారో ఎలాంటి అవుట్‌పుట్ ఇచ్చి ఆకట్టుకుంటారో ప్రత్యేకంగా చెప్పాలా. ఇప్పుడు తన లేటెస్ట్ సినిమా కోసం కోసం కూడా కొత్త కొత్త ప్లాన్స్ చేస్తూ ఒక్కొక్కటిగా ఆ ఫార్ములా అమలులోకి తెస్తున్నారు సుకుమార్. కథ మొదలుకొని నటీనటుల ఎంపిక, తెరకెక్కించే విధానం అన్నింటా విలక్షణత చూపిస్తూ క్రియేటివ్ ఆలోచనలు చేసే ఆయన 'పుష్ప'లో ఓ స్పెషల్ రోల్ కోసం మరోసారి సీనియర్ నటుడు జగపతిబాబును రంగంలోకి దించుతున్నారట. పుష్పలో కథను మలుపుతిప్పే విలన్ క్యారెక్టర్ ఉందట. ఈ క్యారెక్టర్ సినిమాకే పెద్ద అసెట్ కానుందని టాక్. అయితే ఈ రోల్ కోసం ముందుగా ఓ బాలీవుడ్ సీనియర్ నటుడిని ఎంపిక చేసుకున్నారట సుక్కు. కానీ ఇంతలో లాక్‌డౌన్ రావడం, ఆ నటుడికి డేట్స్ అడ్జస్ట్ కాకపోవడంతో వెంటనే జగపతిబాబును లైన్ లోకి తీసుకొచ్చారని సమాచారం. గతంలో ఆయన రూపొందించిన ''నాన్నకు ప్రేమతో, రంగస్థలం'' పోషించిన రోల్స్ అద్భుతం అనే చెప్పాలి. సో.. ఇప్పుడు అదే ఫార్ములా ‘పుష్ప’లో కూడా అప్లై చేసి వర్కవుట్ చేయబోతున్నారట సుకుమార్. త్వరలోనే దీనిపై చిత్రయూనిట్ నుంచి అధికారిక సమాచారం రానుందని ఫిలిం నగర్ టాక్. Also Read: గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న పుష్ప మూవీని మైత్రీ మూవీ మేకర్స్‌ పతాకంపై నవీన్ యెర్నేని, రవిశంకర్ నిర్మిస్తున్నారు. అల్లు అర్జున్, రష్మిక మందన హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ ఫస్ట్‌లుక్ పోస్టర్ సినిమాపై భారీ అంచనాలు క్రియేట్ చేసింది. లారీ డ్రైవర్ పుష్పరాజ్ రోల్‌లో బన్నీ నటిస్తుండగా, పల్లెటూరు పిల్లలా డిఫెరెంట్ క్యారెక్టర్ పోషిస్తోంది రష్మిక. అల్లు అర్జున్ కెరీర్‌లో మొట్టమొదటి ప్యాన్ ఇండియా మూవీగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/31GEYh3
v

అందరితో తిట్లు తింటున్నా.. ఏదేమైనా సరే చివరకు..! ఫీలింగ్స్ బయటపెట్టిన సుడిగాలి సుధీర్

ఈ మధ్యకాలంలో ఏ ప్రోగ్రాంలో చూసినా బుల్లితెర కామెడీ కింగ్, రొమాంటిక్ ఫెల్లో సుడిగాలి సుధీరే కనిపిస్తున్నాడు. జబర్దస్త్ ద్వారా ఫేమస్ అయిన సుధీర్.. కొన్ని షోస్ హోస్ట్ చేస్తూ యాంకర్‌గా కూడా సత్తా చాటాడు. జబర్దస్త్‌లో కంటెస్టెంట్‌గా వచ్చి ఆ తర్వాత టీం లీడర్‌గా ఎదిగి చివరకు హీరో కూడా అయ్యాడు. అయితే రీసెంట్‌గా వచ్చిన ప్రోగ్రామ్స్‌లో ఈ సుడిగాడిని ఓ రేంజ్‌లో ఆడుకుంటూ కామెంట్స్ చేస్తున్నారు తోటి నటీనటులు. తాజాగా ఈ విషయంపై స్పందిస్తూ ఓపెన్ అయ్యాడు సుధీర్. ఈ మధ్యకాలంలో వస్తున్న ప్రతీ ఈవెంట్‌లో సుధీర్‌నే కార్నర్ చేస్తూ రెచ్చిపోతున్నారు తోటి నటులు. రీసెంట్‌గా జరిగిన ఓ ప్రోగ్రాంలో సింగర్ రాహుల్ సిప్లిగంజ్ అయితే ఏకంగా గూట్లే, హౌలే గాడు అంటూ సుధీర్‌పై విరుచుకుపడటం చూశాం. దీంతో సుధీర్ ఫ్యాన్స్ కొందరు హర్ట్ అయ్యారు. ఈ నేపథ్యంలో తాజాగా సుధీర్ చేసిన చిట్ చాట్‌లో ఇదే విషయంపై ఆయన అభిప్రాయం అడిగారు. అయితే దీనిపై రియాక్ట్ అయిన ఎంతో కూల్‌గా సమాధానమిచ్చి ఆకట్టుకున్నాడు. Also Read: ''వేరొకరిని తిట్టాలని గానీ కించ పరిచాలని గానీ ఎవ్వరూ అనుకోరు. హైపర్ ఆది, శేఖర్ మాస్టర్, రాహుల్ ఇంకా ఎవ్వరైనా సరే.. వాళ్లంతా నా మీద కౌంటర్స్ వేస్తుంటే జనాలు నవ్వుతూ ఎంజాయ్ చేస్తున్నారు. ఒకవేళ పొడిగితే నవ్వుతారని అనిపిస్తే అలాగే చేయమంటాను. మేం ఏది చేసినా మా లక్ష్యం మిమ్మల్ని నవ్వించడం, ఎంటర్టైన్ చేయడం మాత్రమే'' అని చెప్పి తాను పడుతున్న తిట్ల వెనుకనున్న సీక్రెట్స్ రివీల్ చేశాడు సుధీర్. బుల్లితెరపై హవా నడిపిస్తూనే వెండితెరపై కూడా బిజీ అవుతున్నాడు సుధీర్. ఇటీవలే ‘సాఫ్ట్‌వేర్ సుధీర్’ చిత్రంతో హీరోగా సత్తా చాటిన ఆయన రీసెంట్‌గా మరో సినిమాను లైన్‌లో పెట్టాడు. రాజశేఖర్ రెడ్డి పులిచర్ల దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమా సెప్టెంబర్ మొదటివారం నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/31Gwy9r
v

ఒక్కసారి ఆ సుఖం చూస్తే ఇక కదలవు.. అందుకే నేను ఊరొదిలి వెళ్లా.. పూరి వర్షన్‌లో ఓపెన్ అయ్యాడిలా..!!

లాక్‌డౌన్ వేళ వరుస పోడ్ కాస్ట్ ఆడియోలతో రకరకాల విషయాలు చెబుతున్నారు డాషింగ్ డైరెక్టర్ . తన అభిప్రాయాలను నిర్మొహమాటంగా బయటపెడుతూ షాకింగ్ కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పటికే ఎన్నో ఆడియో సందేశాలతో ఆలోచనలు రెక్కించిన ఆయన తాజాగా ఓ మోటివేషనల్ ఆడియో రిలీజ్ చేశారు. ఆయన వర్షన్ లోనే కష్టపడితే ఎలా పైకి రావొచ్చో వివరించారు. ''నీకేంట్రా పొయ్యికాడ ఆకు మడి అంటారు. దీని అర్థం పొలం మధ్యలో ఇల్లు కట్టుకుంటే ఇంటిచుట్టూ పొలం ఉంటుంది. హాయిగా వంట చేసుకుంటూ పంట చేసుకోవచ్చు. ఏ టెన్షనూ ఉండదు. దీన్నే అంటాం. చాలా బాగా ఉంటుంది పైగా సుఖంగా కూడా ఉంటుంది. అందుకే అందరం దీన్నే కోరుకుంటాం. ఒక్కసారి ఆ సుఖం చూశాక అందులోంచి కదలం. దాని వల్ల మన గ్రోత్ ఆగిపోద్ది. మన లైఫ్ లిమిటెడ్ అయిపోద్ది. ఎక్కడికో వెళ్లాల్సిన వాడివి అక్కడే ఉంటావు. నేను కూడా కంఫర్ట్ జోన్‌లో చేసిన సినిమాలన్నీ తేడా చేశాను. ఆ జోన్ నుంచి బయటకొస్తే గానీ నిజమైన సక్సెస్ రాదనీ తెలుసుకున్నాను. Also Read: మనం చేసే పని రొటీన్ అని ఫీల్ అయిన ప్రతిసారి కొత్త ఐడియా వేస్తూ డిఫెరెంట్ రూట్‌లో వెళ్ళాలి. అందులో రిస్క్ ఉండాలి. రిస్క్ లేకపోతే అది కొత్త ఐడియానే కాదు. ఇక్కడ తీసుకుంటాం.. అక్కడ అమ్మేస్తాం.. ఇంత లాభం.. ఇది కంఫర్ట్ జోన్. కొంపదీసి ఇది ఎవ్వడూ కొనకుంటే.. ఇది రిస్క్ జోన్. మనం ఎప్పుడూ చిన్న రిస్క్ లోనే ఉండాలి. రిస్క్‌లో ఉన్నప్పుడే అలర్ట్ ఉంటూ తెలియకుండానే పనిపై ఎక్కువ ఎఫర్ట్ పెడతాం. దాని వల్ల వచ్చిన సక్సెస్ వేరే రేంజ్‌లో ఉంటుంది. నువ్ సూపర్ స్టార్ అవుతావు. కంఫర్ట్ జోన్ బ్యాచ్ అంతా నీ వెనుక ఉంటారు. నువ్వు మాత్రం ఎక్కడో ఉంటావు. నువ్ ఉన్న ఊళ్ళో నీకు కంఫర్ట్‌గా వెంటనే ఆ ఊరు వదిలేయ్. అదే పని వేరే ఊళ్ళో స్టార్ట్ చెయ్. తప్పదు లాక్ అయిపోయాను అనే పరిస్థితుల్లో ఆ ఊళ్ళోనే కొత్తగా ట్రై చెయ్. లైఫ్‌లో ఎప్పుడూ మన కింద మెత్తటి దిండు ఉండకూడదు. ఫైర్ ఉండాలి.. అప్పుడే మజా.. కింద కాలుతుంటేనే కరెక్టుగా ఉంటావ్. అందుకే నువ్వే మంట పెట్టుకొని దానిపై కూర్చో. భయం వైపు అడుగులు వెయ్. నువ్వు చేసే కొత్తపని మొత్తం నీ కంట్రోల్‌లో ఉండకూడదు. Also Read: ఎప్పుడూ రెస్పాన్సిబిలిటీ నుంచి ఎస్కేప్ కాకూడదు. మైండ్ ఎప్పుడూ పాజిటివ్‌గా పెట్టుకోండి. కొత్తగా ట్రై చేయడం వల్ల కొంపలేం అంటుకుపోవు. మీరు ఎంప్లాయ్ అయితే ఉన్న జాబ్ కొత్తగా చేయండి లేదా కొత్త జాబ్ చేయండి. పిట్టగోడ మీద నడిచిన్నపుడే ఆచితూచి అడుగేస్తాం. ఒళ్ళు దగ్గరపెట్టుకొని నడుస్తాం. నోట్లో నుంచి నాన్సెన్స్ రాదు. మరీ భయంగా ఉంటే మెల్లగా అడుగులేస్తాం. అందుకే నేను ఊరొదిలి పోయా.. మీరు కూడా పోండి'' అని పూరి జగన్నాథ్ అన్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3gHKDrh
v

మగువ ట్రైలర్: బూతు సీన్లతో రచ్చ రచ్చ.. మరీ ఇంత అరాచకమా? సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇస్తారో..!

ఈ మధ్యకాలంలో బూతు కంటెంట్ సినిమాలు మరీ ఎక్కువయ్యాయి. సినిమా ద్వారా ఏదో ఒక మెసేజ్ ఇస్తూనే సినిమా అంతా బూతు సీన్లతో నింపేస్తున్నారు. కొన్ని సినిమాల్లో అయితే మరీ శృతిమించిన అడల్ట్ సీన్స్ పెడుతుండటం చూస్తూనే ఉన్నాం. సెగలు పుట్టించే సీన్స్ పెట్టేసి యువతరానికి గాలం వేస్తూ మార్కెట్ చేసుకుంటున్నారు కొందరు దర్శకనిర్మాతలు. ఇక ఈ సంగతి అటుంచితే మోడ్రన్ యువతి ''అబల కాదు సబల'' అనే కాన్సెప్ట్ తీసుకొని '' అనే ఓ మూవీ రూపొందించారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ విడుదల చేశారు. ఒక నిమిషం 28 సెకనుల నిడివితో కట్ చేసిన ఈ మగువ ట్రైలర్‌లో బూతు సీన్లు పెట్టి రచ్చ రచ్చ చేశారు. ఓ సాఫ్ట్‌వేర్ అమ్మాయి నైట్ డ్యూటీకి వెళుతుండగా కొందరు రేపిస్టులు ఆ అమ్మాయిని కిడ్నాప్ చేసి నిర్మానుష్యంగా ఉన్న ప్రాంతంలోని బిల్డింగ్‌కు తీసుకెళ్లి రేప్ చేసే ప్రయత్నం చేయడం, అయితే తెల్లారేసరికి ఆ అమ్మాయి ప్రాణాలతో బయట పడటాన్ని మధ్య మధ్యలో అడల్ట్ సీన్స్ పెట్టి ఆకర్షించే ప్లాన్ చేశారు. ''మానం పోయినా సరే ప్రాణం కాపాడుకోవాలి. ఇది నేటి మాట.. నా మాట'' అనే హీరోయిన్ డైలాగ్‌తో ట్రైలర్ ముగించారు. Also Read: యూనివర్సల్ డ్రీమ్స్ బ్యానర్‌పై దర్శకత్వంలో రూపొందుతున్న 'మగువ' మూవీలో సురేష్ బాబు, మధు ప్రియ, ప్రసన్న పుష్పమాల, హరీష్ చంద్ర, నవికేత్ పాటిల్, దేవలరాజు రవి తదితరులు నటించారు. రొమాంటిక్ సోషల్ థ్రిల్లర్‌గా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2Ev9B0f
v

Bandla Ganesh: పవన్‌‌తో బండ్ల గణేష్ సినిమా! హింట్ ఇచ్చిన నిర్మాత.. అదే పనిలో ఉన్నాడట!!

రెండేళ్ల పాటు రాజకీయ ప్రయాణం చేసిన .. నిర్మాతల కోరిక మేరకు తిరిగి కెమెరా ముందుకొచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం సినిమాల్లో చేస్తూనే రాజకీయ కార్యకలాపాల్లో భాగమవుతున్న పవర్ స్టార్, వరుస ప్రాజెక్టులను లైన్‌లో పెట్టారు. కాగా ఈ మధ్యకాలంలో పవన్ భక్తుడు, ఆయన వీరాభిమాని అయిన కూడా నిత్యం వార్తల్లో నిలుస్తూ యాక్టివ్ అయిన క్రమంలో పవన్- బండ్ల గణేష్ కాంబోలో సినిమా రాబోతుందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. తాజాగా బండ్ల గణేష్ చేసిన కామెంట్‌తో దీనిపై చిన్న హింట్ దొరికింది. గతంలో పవన్ కళ్యాణ్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన 'గబ్బర్ సింగ్' సినిమాకు నిర్మాతగా వ్యవహరించి భారీ లాభాలు గడించారు బండ్ల గణేష్. అప్పటి నుంచి పవన్‌ మీద ఆయనకున్న అభిమానం రెట్టింపయింది. ఎన్నో సందర్భాల్లో పబ్లిక్‌గా తన దేవుడు పవన్ కళ్యాణ్ అని చెప్పారు కూడా. ఈ నేపథ్యంలో బండ్ల గణేష్- పవన్ కాంబోలో మరో సినిమా రావాలని కోరుకుంటున్నారు మెగా ఫ్యాన్స్. సెంటిమెంటల్‌గా చూసినా ఈ కాంబో సూపర్ హిట్ అందుకునే ఛాన్స్ ఉంది పైగా పవన్‌పై బండ్ల గణేష్ అభిమానం కొలవలేని కాబట్టి ఈ ఇద్దరి కాంబోలో మరో సినిమా రావాలని భావిస్తున్నారు ప్రేక్షకులు. Also Read: ఈ క్రమంలోనే ''మా అన్న పవన్ అన్న గారితో సినిమా ఎప్పుడు తీస్తున్నారు?'' అని ఓ నెటిజన్ బండ్ల గణేష్‌ని నేరుగా అడిగేశాడు. దీనిపై రియాక్ట్ అయిన ఆయన.. ''నేను అదే పనిలో ఉన్నాను బ్రదర్.. మన దేవుడి ఆశీర్వాదం కోసం ఎదురుచూస్తున్నాను'' అంటూ బదులిచ్చారు. అంటే పవన్‌తో సినిమా చేయడం కోసం గట్టిగానే ప్లాన్ చేస్తున్నట్లు హింట్ ఇచ్చారన్న మాట. సో.. చూడాలి మరి ఈ పవన్ కళ్యాణ్ కరుణించి బండ్ల గణేష్‌కి ఏ మేర అవకాశమిస్తాడనేది!.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3luXXmw
v

Mahesh Babu: సితారతో మహేష్ సరదా సమయం.. నమ్రత ఇంట్రెస్టింగ్ కామెంట్

ఒకప్పుడు సినిమాల్లో సందడి చేసిన మహేష్ సతీమణి నమ్రత.. ఇప్పుడు సోషల్ మీడియాలో హవా నడిపిస్తోంది. సామాజిక మాధ్యమాల్లో నిత్యం చురుకుగా పోస్టులు పెడుతూ సూపర్ స్టార్ ఫ్యాన్స్‌ని ఖుషీ చేస్తోంది. ముఖ్యంగా భర్త సినిమా ప్రాజెక్టులు, , గౌతమ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తూ ఆకట్టుకుంటోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా నమ్రత షేర్ చేసిన పిక్, దానిపై ఆమె చేసిన కామెంట్ వైరల్ అవుతోంది. లాక్‌డౌన్ కారణంగా షూటింగ్స్ బంద్ కావడంతో గత నాలుగు నెలలకు పైగా భార్యా పిల్లలతో ఇంట్లోనే సరదాగా గడుపుతున్నారు మహేష్ బాబు. సాదారణంగానే షూటింగ్స్ చేస్తూ కూడా ఫ్యామిలీకి సమయం కేటాయించే ఆయన ఈ పూర్తి విరామాన్ని ఫుల్లుగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇక ఈ విశేషాలను ప్రేక్షకుల ముందుంచుతూ ప్రత్యేకంగా ఆకర్షిస్తోంది నమ్రత. ఈ క్రమంలో ఇప్పటికే తన పిల్లలు సితార, గౌతమ్‌లతో మహేష్ చేస్తున్న సరదా తాలూకు ఫోటోలు వైరల్ చేసిన నమ్రత.. తాజాగా మరో ఫోటో పోస్ట్ చేస్తూ 'నాన్న కూతురు సితార' అని ఇంట్రెస్టింగ్ కామెంట్ పెట్టింది. ఆమె షేర్ చేసిన ఈ పిక్‌లో తన కూతురు సితారను ఆప్యాయంగా చూస్తూ మురిసిపోతున్నట్లు కనిపిస్తున్నారు మహేష్ బాబు. అయితే ఇందులో మహేష్ సరికొత్త మేకోవర్‌ చూడొచ్చు. Also Read: ఇక మహేష్ సినిమాల విషయానికొస్తే.. ఈ ఏడాది ఆరంభంలో 'సరిలేరు నీకెవ్వరు' అనిపించుకుంటూ ఇండస్ట్రీ హిట్ కొట్టిన ఆయన ప్రస్తుతం 'సర్కారు వారి పాట' సినిమా చేస్తున్నారు. పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్, జీఎమ్‌బి ఎంటర్‌టైన్‌మెంట్ ,14 రీల్స్ ప్లస్ సంస్థలు నిర్మిస్తున్నాయి. చిత్రంలో మహేష్ సరసన కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. ఎస్.ఎస్. థమన్ సంగీతం అందిస్తున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3hTqH64
v

ప్రభాస్‌పై అమెరికన్ పాప్ సింగర్ ప్రశంసలు.. బిగ్ థ్యాంక్స్ చెప్పిన రెబల్ స్టార్

పాన్ ఇండియా స్టార్ హీరోగా, బాలీవుడ్ భామ శ్రద్ధ కపూర్ హీరోయిన్‌గా నటించిన చిత్రం ‘’. సుజీత్ దర్శకత్వం వహించారు. యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై వంశీ, ప్రమోద్, విక్రమ్ ఈ భారీ చిత్రాన్ని నిర్మించారు. సుమారు రూ.350 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ యాక్షన్ మూవీ గతేడాది ఆగస్టు 30న విడుదలైంది. ఇండియాస్ బిగ్గెస్ట్ యాక్షన్ మూవీగా విడుదలైన ఈ పాన్ ఇండియా మూవీ బాలీవుడ్ బాక్సాఫీసు వద్ద బాగానే వసూలు చేసింది. అయితే, తెలుగు సహా ఇతర భాషల్లో రాణించలేకపోయింది. మొత్తం మీద ప్రపంచ వ్యాప్తంగా రూ.400 కోట్ల మేర గ్రాస్ వసూలుచేసింది. ఇదిలా ఉంటే, నేటితో ఈ చిత్రం ఏడాది పూర్తిచేసుకుంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపింది. అలాగే, హీరో ప్రభాస్ తన డైహార్డ్ ఫ్యాన్స్‌కి, చిత్ర యూనిట్‌కు కృతజ్ఞతలు తెలిపారు. అంతేకాదు, అమెరికన్ పాప్ సింగర్, మోడల్ మెర్సీకి కూడా ప్రభాస్ కృతజ్ఞతలు తెలిపారు. దీనికి ఒక కారణం ఉంది. సాహోలో ‘బ్యాంగ్ బ్యాంగ్’ అంటూ వచ్చే ఇంగ్లిష్ సాంగ్‌ను మెర్సీ ఆలపించారు. ‘సాహో’ ఏడాది పూర్తిచేసుకున్న సందర్భంగా మెర్సీకి ఇన్‌స్టాగ్రామ్ ద్వారా బిగ్ థ్యాంక్స్ చెప్పారు. అంతేకాదు, ఆమె పాడిన సాంగ్‌ను కూడా పోస్ట్ చేశారు. మెర్సీ కూడా తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలను ‘సాహో’ సెలబ్రేషన్స్‌తో నింపేశారు. ఇప్పటి వరకు అత్యంత ప్రతిభావంతులైన నటుల్లో ప్రభాస్ ఒకరని మెర్సీ కొనియాడారు. నిజాయతీగా చెప్పాలంటే ఆయన గొప్ప వ్యక్తని ప్రశంసించారు. ప్రభాస్‌తో మరోసారి కలిసి పనిచేయాలనుందని పేర్కొన్నారు. అలాగే, ‘సాహో’ వంటి సినిమాలో తనకు పనిచేసే అవకాశం రావడం నిజంగా అదృష్టమని మెర్సీ అన్నారు. చాలా మంచి టీమ్‌తో తాను పనిచేశానని సంతోషంగా చెప్పారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3gL4ndE
v

Sushant Singh Rajput: సుశాంత్ ఇంట్లో దెయ్యం.. బయటకొస్తున్న సంచలన విషయాలు.. రియాకు భారీ భద్రత

యువ నటుడు సూసైడ్ మిస్టరీ రోజుకో మలుపు తిరుగుతోంది. సుశాంత్ ప్రేయసి రియా చక్రవర్తిపై తీవ్ర అనుమానాలు రేకెత్తడంతో ఆమెను లోతుగా విచారిస్తోంది సీబీఐ. సుశాంత్ ఆత్మహత్య దేశవ్యాప్త సంచలనంగా మారడంతో ఈ కేసును సీరియస్‌గా తీసుకొని రియాపై ప్రశ్నల వర్షం కురిపిస్తూ ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు సీబీఐ అధికారులు. ఈ విచారణలో భాగంగా డ్రగ్స్ వినియోగం, సుశాంత్‌ ఆర్ధిక లావాదేవీలు, సుశాంత్ ఫ్లాట్‌లో 8 హార్డ్ డిస్కుల ధ్వంసం తదితర అంశాలపై స్పషల్ ఫోకస్ పెట్టారు. అయితే సీబీఐ విచారణ తర్వాత.. రియా ఇంటికి చేరుకుంటున్న క్రమంలో కొందరు సుశాంత్ అభిమానులు ఆమె కారుపై దాడి చేసే ప్రయత్నం చేశారు. రియాకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నానా హంగామా చేశారు. ఈ పరిణామాల నడుమ తనకు భద్రత కల్పించాలంటూ రియా చేసిన అభ్యర్థనను పరిగణలోకి తీసుకొని రియా ఉంటున్న ఇంటికి పోలీసులు భారీ భద్రత కల్పించారు. మరోవైపు సుశాంత్ సూసైడ్ మిస్టరీపై అనేక కోణాల్లో దర్యాప్తు చేస్తున్న సీబీఐ అధికారులు సుశాంత్ ఫ్రెండ్ సిద్దార్థ్ పితానిని, వంట మనిషి ధీరజ్‌ని, ఇంటి పని మనుషులను కూడా విచారిస్తున్నారు. Also Read: కాగా సీబీఐ విచారణలో భాగంగా వెల్లడించిన విషయాలు మరో సంచలనంగా మారాయి. జనవరి నుంచే సుశాంత్ మానసిక స్థితిలో మార్పు కనిపించిందని, అలాగే తన ఫ్లాట్‌లో దెయ్యం ఉందని సుశాంత్ భయపడేవాడని సిద్దార్థ్ సీబీఐ అధికారులతో చెప్పాడు. అలాగే సుశాంత్ డబ్బుతోనే రియా సరదాలు తీర్చుకునేదని, ఆ డబ్బుతోనే ఆమె షాపింగ్స్ చేస్తుండేదని ఆయన పేర్కొన్నాడు. గతంలో రియాకు వ్యతిరేకంగా సాక్ష్యాలు చెప్పాలంటూ తనకు ఫోన్ కాల్స్ వస్తున్నట్లుగా సిద్దార్థ్ పోలీస్ కంప్లైంట్ చేసిన సంగతి తెలిసిందే. దీంతో సుశాంత్ సూసైడ్ కేసులో చోటుచేసుకుంటున్న ఊహించని మలుపులు ఇటు మీడియాలో అటు జనాల్లో హాట్ టాపిక్ అవుతున్నాయి.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3gH7iEf
v

ఆ హీరోకి డ్రగ్స్ పిచ్చి.. భార్యను వదిలి నాతో డేటింగ్ చేస్తూ! షాకింగ్ సీక్రెట్స్ రివీల్ చేసిన కంగన

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ సూసైడ్ కేసు తర్వాత బాలీవుడ్ ఇండస్ట్రీని కుదిపేసే విషయాలు ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయి. ఇండస్ట్రీలో నేపోటిజం రాజ్యమేలుతోందని, బ్యాగ్రౌండ్ లేని నటులను తొక్కేస్తున్నారంటూ ఆరోపణలు వస్తున్న వేళ డీలర్లతో బాలీవుడ్ నటులకు సంబంధాలున్నాయని తెలుస్తుండటం జనాల్లో హాట్ టాపిక్ అయింది. సుశాంత్ ప్రేయసి రియా చక్రవర్తి వాట్సప్‌ చాటింగ్‌పై పోలీసులు ఆరా తీయగా ఆమెకు ఇండస్ట్రీ పెద్దలతో పాటు డ్రగ్స్ డీలర్లతోనూ కాంటాక్ట్స్ ఉన్నాయని తేలడంతో ఈ అంశం ఎన్నో అనముమానాలు రేకెత్తిస్తూ పలు చర్చలకు తావిచ్చింది. సరిగ్గా ఈ తరుణంలో హీరోయిన్ మరోసారి రెచ్చిపోయింది. నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) రంగంలోకి దిగితే బాలీవుడ్ హీరోలంతా అడ్డంగా బుక్కవుతారని, అగ్ర నటులందరి రక్త నమూనాలు తీసుకుంటే ఎన్నో రహస్యాలు బయట పడతాయంటూ సంచలన కామెంట్స్ చేసిన కంగన.. తాజాగా డ్ర‌గ్స్ వివాదంపై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది. ఓ జాతీయ మీడియాకిచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ ఓ స్టార్ హీరో డ్రగ్స్‌కి బానిసై ఆసుపత్రి పాలయ్యాడని చెబుతూ కొన్ని సీక్రెట్స్ బయటపెట్టింది. Also Read: ఆ హీరో డ్రగ్స్ ఎక్కువ మోతాదులో తీసుకోవడం కారణంగా అతని భార్య కూడా విడాకులు ఇచ్చేసిందని, ఆ స‌మ‌యంలోనే తాను అత‌నితో డేటింగ్ చేశానంటూ సంచలన కామెంట్స్ చేసింది కంగన. అయితే ఆ హీరో కుటుంబ సభ్యులు తనను వేధించారని పేర్కొంది. అలాగే ఇండస్ట్రీలో గురువు అని చెప్పుకునే వ్యక్తే తనకు డ్రగ్స్ రుచి చూపించాడంటూ మరో బాంబ్ పేల్చింది. బాలీవుడ్ ఇండస్ట్రీ అంతా డ్రగ్స్ కంపు కొడుతోందని, 99 శాతం మంది డ్రగ్స్ లేకుండా ఉండలేక పోతున్నారంటూ ఓపెన్ కామెంట్స్ చేసింది కంగన. అయితే ఆ హీరో ఎవరనే విషయాన్ని మాత్రం ఆమె బయటపెట్టలేదు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2G4e6Py
v

మా తాతయ్య చనిపోతే అంత్యక్రియలకు డబ్బుల్లేవు.. భాస్కర్ సాయం చేశాడు: ‘జబర్దస్త్’ నరేష్

‘జబర్దస్త్’ ఆర్టిస్ట్ గురించి పరిచయం అవసరంలేదు. టీనేజ్ కుర్రాడే అయినా జన్యులోపంతో ఐదేళ్ల కుర్రాడిలా ఉంటాడు. అదే అతనికి ప్లస్ పాయింట్ అయ్యింది. తనలోని లోపాన్ని తనకు అనువుగా మలుచుకొని కమెడియన్‌గా రాణిస్తున్నాడు నరేష్. ‘జబర్దస్త్’, ‘ఎక్స్‌ట్రా జబర్దస్త్’లో నటించడమే కాకుండా రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు, విదేశాల్లో సైతం ఈవెంట్లు చేస్తూ వినోదాన్ని పంచుతున్నాడు. రెండు చేతులా సంపాదిస్తున్నాడు. ఇదిలా ఉంటే, తాజాగా ఓ యూట్యూబ్ ఛానెల్‌తో కలిసి తన ‘హోం టూర్’ వీడియో చేశాడు నరేష్. తన ఇంటిలో ఉన్న సామానులు, తనకు వచ్చిన ట్రోపీల గురించి నరేష్ వివరించాడు. ఈ క్రమంలో అమెరికాలో తనకు వచ్చిన తొలి షీల్డ్‌ను నరేష్ చూపించాడు. ఈ షీల్డ్ తనకు ఎంతో ప్రత్యేకమని చెప్పాడు. దీనికి కారణం కూడా చెప్పుకొచ్చాడు. అమెరికా ఈవెంట్‌కు వెళ్లే సమయంలో తన తాతయ్య చనిపోయారని.. అయితే, ఆ సమయంలో తాతయ్య అంత్యక్రియలు చేయడానికి కూడా డబ్బుల్లేవని నరేష్ వెల్లడించాడు. అప్పుడు భాస్కర్ అన్న దగ్గర అప్పు తీసుకున్నానని తెలిపాడు. Also Read: తాతయ్య కార్యక్రమాలు పూర్తయని తరవాత అమెరికా ఈవెంట్‌కు వెళ్లానని.. అక్కడ ఇచ్చిన డబ్బులతో భాస్కర్ అప్పు తీర్చానని నరేష్ చెప్పాడు. అమెరికాలో తాను చేసిన తొలి ఈవెంట్ కూడా అదేనని, అందుకే ఆ షీల్డ్ అంటే తనకు ఎంతో ఇష్టమని వెల్లడించాడు. నిజానికి నరేష్ తన ఇంటిని షీల్డ్స్‌తో నింపేశాడు. కళాకారుడికి డబ్బుల కన్నా ఈ షీల్డ్స్ అంటేనే ప్రాణమని చెప్పుకొచ్చాడు. త్వరలోనే తాను ఒక పెద్ద ఇల్లు కొంటానని అన్నాడు. ప్రస్తుతం నరేష్ ఉంటోన్న ఇంటిని కింది వీడియోలో చూడొచ్చు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3jmVV5W
v

Saturday 29 August 2020

దొంగ బాబాలపై చిరంజీవి, త్రివిక్రమ్ సినిమా.. నవ్వులే నవ్వులు!!

మెగాస్టార్ కామెడీని కూడా ఎంత బాగా పండిస్తారో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికే ఆయన హీరోగా బోలెడన్ని కామెడీ సినిమాలు వచ్చాయి. మరోవైపు, మాటల మాంత్రికుడు శ్రీనివాస్ సినిమాల్లో కామెడీ శాతం ఏ స్థాయిలో ఉంటుందో అందరికీ తెలిసిందే. అలాంటిది, వీరిద్దరి కాంబినేషన్‌లో సినిమా వస్తే.. థియేటర్లలో నవ్వులే నవ్వులు. ఆ సమయం ఎంతో దూరంలో లేదని ప్రస్తుతం ఇండస్ట్రీ వర్గాల ద్వారా వస్తోన్న సమాచారం. త్రివిక్రమ్ ఇప్పటికే చిరంజీవికి స్టోరీ లైన్ నెరేట్ చేశారట. ఇది దొంగ స్వామీజీలపై రాసుకున్న కథ అని అంటున్నారు. అందుకే, కామెడీ పాళ్లు కాస్త ఎక్కువగానే ఉంటాయట. భక్తి ముసుగులో ప్రజలను మోసం చేస్తోన్న స్వామీజీలపై త్రివిక్రమ్ ఎక్కుపెడుతున్న బాణం ఈ సినిమా అంటున్నారు. చిరంజీవి, త్రివిక్రమ్ కలిసి గతంలో ‘జై చిరంజీవ’ సినిమాకు పనిచేశారు. అయితే, ఈ సినిమాకు త్రివిక్రమ్ కథ, మాటలు అందించారు. మరి ఇప్పుడు చిరంజీవిని త్రివిక్రమ్ డైరెక్ట్ చేస్తారో లేదో చూడాలి. Also Read: ఇదిలా ఉంటే, త్రివిక్రమ్ తన తరవాత సినిమాను యంగ్ టైగర్ ఎన్టీఆర్‌తో చేయబోతున్నారు. ‘అరవింద సమేత’ సినిమాను నిర్మించిన హారిక అండ్ హాసిని క్రియేషన్స్ సంస్థే ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. నందమూరి కళ్యాణ్ రామ్ ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ కూడా ఈ చిత్ర నిర్మాణంలో భాగమవుతోంది. తమన్ సంగీతం సమకూర్చనున్నారు. మరోవైపు, చిరంజీవి ‘ఆచార్య’తో బిజీగా ఉన్నారు. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ సమర్పణలో మ్యాట్నీ ఎంటర్‌టైన్మెంట్ బ్యానర్‌పై నిరంజన్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మణిశర్మ సంగీతం సమకూరుస్తున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/34JSS3I
v

మూడేళ్ల నుంచీ నేను గర్భవతినే.. బేబీ బయటకు రానంటోంది: సమంత

అక్కినేని నాగచైతన్యను పెళ్లాడిన కొన్ని నెలలకే ప్రెగ్నెన్సీపై సోషల్ మీడియాలో చర్చలు మొదలైపోయాయి. సమంత గర్భం దాల్చారంటూ ఇప్పటికే చాలా సార్లు వదంతులు వచ్చాయి. సమంత కూడా వాటిని ఖండిస్తూ వచ్చారు. తాజాగా సమంతకు మరోసారి ఈ ప్రశ్న ఎదురైంది. సమంత తాజాగా ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్ ద్వారా చాట్ సెషన్‌ను నిర్వహించారు. తన ఫాలోవర్లు అడిగిన చాలా ప్రశ్నలకు ఆమె సమాధానాలు ఇచ్చారు. అయితే, ఒక ఫాలోవర్ అడిగిన ప్రశ్న.. దానికి సమంత ఇచ్చిన సమాధానం ఆసక్తికరంగా మారింది. ‘మీరు గర్భం దాల్చారా’ అని ఒకరు అడిగిన ప్రశ్నకు సమంత చాలా సమయస్ఫూర్తితో, చమత్కారంగా సమాధానం ఇచ్చారు. తాను 2017 నుంచీ గర్భం దాలుస్తూనే ఉన్నాను అని ఇప్పటి వరకు వచ్చిన వదంతులను పరోక్షంగా ప్రస్తావిస్తూ సమంత రిప్లై ఇచ్చారు. ‘‘నేను 2017 నుంచీ గర్భవతినేనని భావిస్తు్న్నాను. ఈ బేబీ నిజంగా బయటికి రావడానికి ఇష్టపడటం లేదని నా భావన’’ అని సమంత వీడియో ద్వారా రిప్లై ఇచ్చారు. నాగచైతన్య, సమంత వివాహం 2017 అక్టోబర్ 6న గోవాలో జరిగింది. ఆ తరవాత ఈ జంట హనీమూన్‌కు విదేశాలకు వెళ్లింది. ఇక ఆ తరవాత సమంత ప్రెగ్నెన్సీ వార్తలు మొదలైపోయాయి. గడిచిన మూడేళ్లుగా ఈ వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. వాటిని చూసి చూసి సమంతకు కూడా విసుగొచ్చినట్టుంది. అందుకే, మళ్లీ అదే ప్రశ్న అడిగేసరికి వెటకారంగా సమాధానం ఇచ్చారు. ఇక, సమంత సినిమాల విషయానికి వస్తే ఆమె విగ్నేష్ శివన్ దర్శకత్వంలో ఒక సినిమాను అంగీకరించారు. నయనతారతో కలిసి ఆమె నటించబోతున్నారు. Also Read: మరోవైపు, ‘ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2’ వెబ్ సిరీస్‌లో నటించిన సమంత.. ఇటీవలే తన డబ్బింగ్‌ను పూర్తిచేశారు. ఈ సిరీస్‌కు రాజ్, డీకే దర్శకత్వం వహించారు. మనోజ్ బాజ్‌పాయి, ప్రియమణి, గుల్ పనగ్ ముఖ్య పాత్రలు పోషించారు. ఈ సిరీస్ ద్వారా డిజిటల్ వరల్డ్‌లోకి సమంత అడుగుపెడుతున్నారు. ఇక, అశ్విన్ సరవణన్ దర్శకత్వంలోనూ ఒక తమిళ సినిమాను సమంత అంగీకరించారు. హారర్ జోనర్‌లో తెరకెక్కనున్న ఈ సినిమాలో ప్రసన్న ప్రధాన పాత్ర పోషిస్తున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2EOxxv2
v

టాలీవుడ్ ప్రముఖ సింగర్ కారుణ్య ఇంట విషాదం

టాలీవుడ్ ప్రముఖ సినీ గాయకుడు కారుణ్య ఇంట విషాదం నెలకొంది. కారుణ్య తల్లి జానకి అనారోగ్యంతో శనివారం తెల్లవారు జామున కన్నుమూశారు. బాలాపూర్‌ మండలం మీర్‌పేట్‌లోని త్రివేణినగర్‌లో ఆమె మృతి చెందారు. జానకి కేంద్ర రక్షణ రంగ సంస్థ బీడీఎల్‌లో ఉద్యోగం చేసి పదవీ విరమణ పొందారు. కొంత కాలంగా కేన్సర్‌తో బాధపడుతున్న ఆమె.. ఆరోగ్యం క్షీణించడంతో శనివారం తుది శ్వాస విడిచారు. కారుణ్య తండ్రి మధు సైతం డిఫెన్స్‌లోనే పనిచేసి రిటైర్‌ అయ్యారు. కారుణ్య తల్లి జానకి మరణవార్త తెలుసుకున్న పలువురు తమ విచారం వ్యక్తం చేశారు. పలువురు సింగర్స్ కారుణ్యకు ఫోన్ చేసి ప్రగాఢ సానుభూతి తెలిపారు. అయితే కరోనా నేపథ్యంలో కారుణ్య తల్లి అంత్యక్రియలకు పరిమిత సంఖ్యలో బంధువులు, సన్నిహితులు హాజరయ్యారు. సైదాబాద్‌ శ్మశానవాటికలో ఆమె అంత్యక్రియలు నిర్వహించారు. కారుణ్య 2006లో సోనీ టీవీ నిర్వహించిన 'ఇండియన్‌ ఐడల్‌' కార్యక్రమంలో పాల్గొని ద్వితీయ స్థానంలో నిలిచిన సంగతి తెలిసిందే. అనంతరం సినీ రంగంలోకి ప్రవేశించి ప్రముఖ గాయకుల సరసన నిలిచాడు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3lt7U3P
v

కాంబినేషన్ సెట్ అయ్యింది.. పవన్ కోసం మళ్లీ ఒక్కటైన ఇద్దరు దర్శకులు!

సినీ రచయిత వక్కంతం వంశీ ‘నాపేరు సూర్య నా ఇల్లు ఇండియా’ సినిమాతో దర్శకుడిగా మారిన విషయం తెలిసిందే. ఈ సినిమాకు ముందు ఆయన పలు చిత్రాలకు కథలు అందించారు. దర్శకుడు సురేందర్ రెడ్డితో కలిసి వంశీ ఎక్కువగా పనిచేశారు. వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన ‘కిక్’, ‘రేసుగుర్రం’ సినిమాలు బ్లాక్ బస్టర్లుగా నిలిచాయి. ఇప్పుడు పవర్ స్టార్ కోసం సురేందర్ రెడ్డి, వక్కంతం వంశీ మరోసారి కలిసి పనిచేయనున్నట్టు సమాచారం. పవన్ కళ్యాణ్ హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో సినిమా ఖరారైందని ఇండస్ట్రీ వర్గాల ద్వారా తెలిసింది. వక్కంతం వంశీ రాసిన కథతో ఈ సినిమా రూపొందబోతోంది. ఎస్‌.ఆర్‌.టి.ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై రామ్‌ తాళ్లూరి ఈ చిత్రాన్ని నిర్మించనున్నారని సమాచారం. పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా సెప్టెంబర్ 2న ఈ సినిమాను ప్రకటిస్తారని అంటున్నారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ‘వకీల్ సాబ్’ సినిమా చేస్తోన్న విషయం తెలిసిందే. ఈ చిత్రం తర్వాత క్రిష్ జాగర్లమూడి, హరీష్ శంకర్, సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో పవన్ వరుసగా సినిమాలు చేయనున్నారు. ఇదిలా ఉంటే, సెప్టెంబర్ 2న ‘వకీల్ సాబ్’ మోషన్ పోస్టర్‌ను విడుదల చేయనున్నట్టు తెలుస్తోంది. బాలీవుడ్ హిట్ మూవీ ‘పింక్’కు రీమేక్‌గా తెరకెక్కుతోన్న ఈ సినిమాను బోనీ కపూర్ బేవ్యూ ప్రాజెక్ట్స్ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. శ్రీరామ్ వేణు దర్శకత్వం వహిస్తున్నారు. తమన్ సంగీతం సమకూరుస్తున్నారు. నివేదా థామస్ కీలక పాత్ర పోషించారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, ‘మగువా’ సాంగ్ సెన్సేషన్ క్రియేట్ చేశాయి. థియేటర్లు తెరుచుకున్న తరవాత ఈ సినిమా విడుదల తేదీని ప్రకటిస్తారు. Also Read:


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3jli70m
v

ఎస్పీ బాలుకి ఫిజియోథెరపి.. మెల్లమెల్లగా కోలుకుంటోన్న దిగ్గజ గాయకుడు

కరోనా వైరస్‌తో పోరాడుతూ చెన్నైలోని ఎంజీఎం హాస్పిటల్‌లో చికిత్స పొందుతోన్న దిగ్గజ గాయకుడు మెల్లమెల్లగా కోలుకుంటున్నారని ఆయన కుమారుడు ఎస్పీ చరణ్ వెల్లడించారు. అలాగే, బాలు ఆరోగ్యం నిలకడగా ఉందని, వైద్యులకు ఆయన స్పందిస్తున్నారని, ఇంకా వెంటిలేటర్, ఎక్మో సహాయంతో చికిత్స కొనసాగుతోందని సమాచారం. బాలు ఆరోగ్యంపై శనివారం ఎంజీఎం హాస్పిటల్ ఎలాంటి ప్రకటన చేయలేదు. అయితే, హాస్పిటల్ వర్గాల ద్వారా బాలు ఆరోగ్య పరిస్థితిపై సమాచారం బయటికి వచ్చింది. బాలసుబ్రహ్మణ్యంకు ఫిజియోథెరపీ చేస్తున్నట్లు తెలిసింది. ఈ ప్రక్రియ కొన్ని రోజులుగా జరుగుతోందని, ఫిజియోథెరపీకి బాలు శరీరం సహకరిస్తోందని హాస్పిటల్ వర్గాలు తెలిపాయి. ఊపిరితిత్తులు కూడా మెరుగుపడినట్లు తెలుస్తోంది. మరోవైపు, తన తండ్రి ఆరోగ్యంపై ఎస్పీ చరణ్ శుక్రవారం ఒక వీడియో సందేశాన్ని విడుదల చేశారు. తన తండ్రి మెల్లమెల్లగా కోలుకుంటున్నారని చెప్పారు. ఇక శనివారం ఫేస్‌బుక్‌లో ఒక పోస్ట్ పెట్టారు. ‘‘నాన్న నిన్నటి నుంచి నెమ్మదిగా కోలుకుంటున్నారు. అందరికీ ధన్యవాదాలు. నాన్న ఆరోగ్యం గురించి ప్రస్తుతానికి కొత్త అప్‌డేట్ ఏం లేదు’’ అని చరణ్‌ ఫేస్‌బుక్‌ పోస్ట్‌లో పేర్కొన్నారు. కాగా, కరోనా వైరస్ సోకడంతో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆగస్టు 5న చెన్నైలోని ఎంజీఎం హాస్పిటల్‌లో చేరిన విషయం తెలిసిందే. మొదట జలుబు, జ్వరం వంటి స్వల్ప లక్షణాలతో బాధపడిన బాలు.. ఆగస్టు 13న తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆ రోజు నుంచీ ఆయనకు ఐసీయూలో వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నారు. ఆ తరవాత వెంటిలేటర్‌తో పాటు ఎక్మో (ఎక్స్‌ట్రాకార్పోరియల్ మెంబ్రేన్ ఆక్సీజనేషన్) సపోర్ట్‌తో చికిత్స చేస్తున్నారు. Also Read:


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3b6vqiv
v

ఇండియన్ స్టైల్ ఐకాన్ అల్లు అర్జున్.. వాటే ట్రెండ్ గురూ!

టాలీవుడ్‌లోని స్టార్ హీరోల అభిమానులకు ప్రస్తుతం ట్విట్టర్ ట్రెండ్‌లు ప్రామాణికంగా మారిపోయాయి. ప్రతి స్టార్ హీరో ఫ్యాన్స్ ఒక హ్యాష్‌ట్యాగ్‌తో తమ హీరోని ట్విట్టర్ టాప్ ట్రెండ్‌లో ఉంచుతున్నారు. శనివారం ట్విట్టర్ ట్రెండ్‌లో టాప్‌లో ఉన్నారు. #IndianStyleIconAlluArjun అనే హ్యాష్‌ట్యాగ్‌తో బన్నీ ఫ్యాన్స్ మిలియన్ల కొద్దీ ట్వీట్లు చేస్తూ తమ హీరోను టాప్ ట్రెండ్‌లో ఉంచారు. తమ హీరోకు సంబంధించిన ఏదో ఒక పోస్టు పెడుతూ దానికి ఈ హ్యాష్‌ట్యాగ్‌ను తగిలిస్తున్నారు. ‘ఇండియన్ స్టైల్ ఐకాన్ అల్లు అర్జున్’ అంటూ ట్రెండ్ సెట్ చేశారు. అయితే, బన్నీ అభిమానులకు అకస్మాత్తుగా ఈ ట్రెండ్ సెట్టింగ్ ఆలోచన రావడానికి కారణం ఉంది. అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ ‘అల వైకుంఠపురములో’ టీఆర్‌పీ రేటింగ్‌లో ఆల్‌టైమ్ ఇండస్ట్రీ రికార్డు‌ను నెలకొల్పింది. ఇటీవల టీవీలో ప్రసారమైన ‘అల వైకుంఠపురములో’ సినిమాకు 29.4 టీఆర్‌పీ రేటింగ్ వచ్చింది. ఇంత వరకు ఏ తెలుగు సినిమాకు ఈ స్థాయిలో టీఆర్‌పీ రేటింగ్ రాలేదు. అంటే, ‘బాహుబలి 2’ రికార్డును కూడా ‘అల’ దాటేసింది. అందుకే, బన్నీ ఫ్యాన్స్ మంచి ఊపు మీద ఉన్నారు. ఇలా ట్విట్టర్‌లో ట్రెండ్ సెట్ చేస్తున్నారు. కాగా, సంక్రాంతికి విడుద‌లైన ‘అల వైకుంఠపురములో’ సినిమా బాక్సాఫీస్ వద్ద ‘నాన్ బాహుబ‌లి 2’ రికార్డులన్నింటినీ కొల్లగొట్టింది. మ్యూజిక్ పరంగా కూడా ‘అల వైకుంఠపురములో’ రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తోంది. ఈ సినిమా ఓటీటీ ప్లాట్‌ఫాంలో విడుద‌లై 6 నెల‌లు కావోస్తుంది. ఇప్పటికే చాలా మంది ఓటీటీ ద్వారా ఈ సినిమాను చాలా సార్లు వీక్షించారు. అయినప్పటికీ, టీవీలో ప్రసారమైన ఈ సినిమాను బుల్లితెర ప్రేక్షకులు విపరీతంగా చూడటం విశేషం. కాగా, హారిక అండ్ హాసిని క్రియేష‌న్స్, గీతా ఆర్ట్స్ బ్యాన‌ర్లపై అల్లు అర‌వింద్, కె.రాధాకృష్ణ (చినబాబు) నిర్మించిన ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించారు. తమన్ సంగీతం సమకూర్చారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/31DcR23
v

సుడిగాలి సుధీర్ హీరోగా మరో సినిమా: మళ్లీ ఆ దర్శకుడే.. ఈసారి రొమాంటిక్ కామెడీ!

‘సాఫ్ట్‌వేర్ సుధీర్’ చిత్రంతో హీరోగా సత్తా చాటిన ‘జబర్దస్త్’ కమెడియన్ మరో సినిమాను పట్టాలెక్కించారు. సుధీర్ హీరోగా సాంబశివ ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్‌లో తెరకెక్కబోయే చిత్రం ఇటీవలే పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ‘సాఫ్ట్‌వేర్ సుధీర్’ చిత్రంతో సుధీర్‌ని హీరోగా పరిచయం చేసిన రాజశేఖర్ రెడ్డి పులిచర్ల దర్శకత్వంలోనే ఈ చిత్రం రూపుదిద్దుకోనుంది. నిర్మాత అంజన్ బాబు నిమ్మల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్ర రెగ్యులర్ షూటింగ్ సెప్టెంబర్ మొదటివారం నుంచి ప్రారంభం కాబోతోంది. Also Read: ఈ సినిమా గురించి దర్శకుడు రాజశేఖర్ రెడ్డి పులిచర్ల మాట్లాడుతూ.. ‘‘హీరో సుధీర్, నా కాంబినేషన్‌లో రాబోతోన్న రెండో సినిమా ఇది. ప్రేక్షకులకు కనువిందు చేసే రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనుంది. సప్తగిరి ఓ ప్రత్యేక పాత్రలో నటించనున్నారు. చక్కటి సంగీతం, యూత్‌ని ఆకట్టుకునే పాటలు, అదిరిపోయే కామెడీ పంచ్‌లు హైలెట్‌గా ఈ చిత్రం రూపుదిద్దుకోనుంది. అన్ని కమర్షియల్ హంగులతో, సీనియర్ నటీనటులందరి కలయికతో ఈ సినిమా ఉంటుంది. రెగ్యులర్ షూటింగ్ సెప్టెంబర్ మొదటివారం నుంచి ప్రారంభం కానుంది. మా నిర్మాత అంజన్ బాబు నిమ్మల ఖర్చుకు వెనకాడకుండా మంచి మంచి లొకేషన్స్‌లో చిత్రాన్ని రూపొందించడానికి సహకరిస్తున్నారు’’ అని తెలిపారు. కాగా, ఈ సినిమాలో పోసాని కృష్ణమురళి, ఝాన్సీ, రాజ్‌బాల తదితరులు నటించనున్నారు. ఈ చిత్రానికి చరణ్ అర్జున్ సంగీతం సమకూరుస్తున్నారు. రాజ్ తోట సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3lu17XM
v

జెనీలియాకు కరోనా పాజిటివ్.. 21 రోజులపాటు ఒంటరిగా..!

ప్రముఖ నటి దేశ్‌ముఖ్ కరోనా బారిన పడ్డారు. తనకు కరోనా వైరస్ సోకినట్టు జెనీలియా ప్రకటించారు. అయితే, ప్రస్తుతం తాను కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నానని కూడా చెప్పారు. ఈ మేరకు శనివారం సాయంత్రం ట్వీట్ చేశారు. ‘‘మూడు వారాల క్రితం నాకు కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయ్యింది. గడిచిన 21 రోజుల్లో నాలో ఎలాంటి లక్షణాలు కనిపించలేదు. దేవుడి దయవల్ల ఈరోజు నాకు కరోనా నెగిటివ్ అని వచ్చింది. ఈ వ్యాధిపై పోరాటం నాకు చాలా సులభంగా అనిపించినప్పటికీ గత 21 రోజుల పాటు ఒంటరిగా గడపడం చాలా ఛాలెంజింగ్‌గా అనిపించింది. మరొకరితో గడిపే సమయం ఉండదు. కేవలం డిజిటల్ ప్రపంచంలో మునిగితేలడం వల్ల ఒంటరితనాన్ని పోగొట్టొచ్చు. మళ్లీ తిరిగి నా కుటుంబ సభ్యులు, స్నేహితుల వద్దకు చేరడం సంతోషంగా ఉంది. మన చుట్టూ ఉన్నవారికి ప్రేమను పంచడమే నిజమైన బలం. అందరికీ ఇది అవసరం. త్వరగా పరీక్ష చేయించుకోండి, ఆరోగ్యవంతమైన ఆహారం తీసుకోండి, ఫిట్‌గా ఉండండి. ఈ మహమ్మారిపై పోరాడటానికి ఇదొక్కటే మార్గం’’ అని జెనీలియా తన ట్వీట్‌లో పేర్కొన్నారు. ఇదిలా ఉంటే, ‘బొమ్మరిల్లు’ సినిమాలో హాసినిగా తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చెరిగిపోని ముద్రవేసిన జెనీలియా.. ఆ తరవాత చాలా సినిమాల్లో నటించి స్టార్ హీరోయిన్‌గా ఎదిగారు. బాలీవుడ్ నటుడు, మహారాష్ట్ర మాజీ సీఎం విలాష్‌రావ్ దేశ్‌ముఖ్ తనయుడు రితేష్ దేశ్‌ముఖ్‌ను పెళ్లాడిన తరవాత జెనీలియా సినిమాలకు పూర్తిగా దూరమయ్యారు. పెద్ద కుటుంబానికి కోడలిగా వెళ్లిన జెనీలియా.. అత్తింటి గౌరవాన్ని కాపాడేలా చాలా హుందాగా వ్యవహరిస్తున్నారు. భర్త రితేష్, కొడుకులు రియాన్‌, రాహిల్‌‌లతో కలిసి జీవితాన్ని సంతోషంగా గడుపుతున్నారు. సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ పాలుపంచుకుంటున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3b857bv
v

ధైర్యం చేస్తోన్న నాగచైతన్య, సాయి పల్లవి.. షూటింగ్ షురూ!

షూటింగ్‌లు తిరిగి మొదలుపెట్టుకోవడానికి ప్రభుత్వాలు అనుమతులు ఇచ్చినా స్టార్ హీరోలు మాత్రం భయపడుతున్నారు. తమ మూలంగా యూనిట్ సభ్యులు రిస్క్‌లో పడకూడదని భావించి ఇంకా ఏ స్టార్ హీరో షూటింగ్ మొదలుపెట్టలేదు. కానీ, అక్కినేని నాగార్జున ధైర్యం చేశారు. బిగ్ బాస్ సీజన్ 4 కోసం ఆయన మేకప్ వేసుకుంటున్నారు. తెలుగు సినీ పరిశ్రమ నుంచి షూటింగ్‌లో పాల్గొంటున్న తొలి స్టార్ హీరో నాగార్జునే. అయితే, ఇప్పుడు ఆయన బాటలోనే అక్కినేని నడుస్తున్నట్టు సమాచారం. నాగచైతన్య, తమ ‘లవ్ స్టోరీ’ షూటింగ్‌ను తిరిగి ప్రారంభిస్తున్నట్టు ఇండస్ట్రీ వర్గాల ద్వారా తెలుస్తోంది. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా షూటింగ్‌కు సంబంధించి హైదరాబాద్‌లోని రామోజీ ఫిలిం సిటీలో చిత్ర యూనిట్ ఏర్పాట్లు చేస్తుందట. అన్ని జాగ్రత్తలూ చాలా కఠినంగా పాటిస్తూ ఈ షూటింగ్ చేయనున్నారని అంటున్నారు. సెప్టెంబర్ 7 నుంచి షూటింగ్ ప్రారంభమవుతుందని సమాచారం. 15 రోజుల షెడ్యూల్ కోసం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశారని టాక్. Also Read: ఇప్పటికే చాలా వరకు షూటింగ్ పూర్తయింది. మిగిలిన భాగాన్ని రామోజీ ఫిలిం సిటీలోనే తక్కువ మంది సిబ్బందితో పూర్తిచేయాలని శేఖర్ కమ్ముల టీమ్ నిర్ణయం తీసుకుందని సమాచారం. కాగా, ‘లవ్ స్టోరీ’ చిత్రాన్ని అమిగోస్ క్రియేషన్స్‌, శ్రీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్లపై నారాయణ్‌దాస్ నారంగ్, పి. రామ్మోహన్ రావు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. పవన్ సీహెచ్ సంగీతం సమకూరుస్తున్నారు. విజయ్ సి కుమార్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటర్.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2QAiLe7
v

ఆ రౌడీని నడిరోడ్డుపై కొట్టింది, టెర్రరిస్ట్‌ని పట్టుకున్నది నా వియ్యంకుడే: నాగబాబు వీడియో

మెగా బ్రదర్ గారాలపట్టి కొణిదెల వివాహం త్వరలో జరగనుందనే విషయం తెలిసిందే. గుంటూరు రేంజ్ ఐజీ ప్రభాకర్ రావు కుమారుడు జొన్నలగడ్డ వెంకట చైతన్యను నిహారిక పెళ్లిచేసుకోబోతున్నారు. ఆగష్టు 13 వీరి నిశ్చితార్థ వేడుక హైదరాబాద్‌లో నిరాడంబరంగా జరిగిన విషయం తెలిసిందే. అయితే త్వరలో వియ్యంకుడు కాబోతున్న ఐజీ ప్రభాకర్ రావు డేరింగ్ నెస్ గురించి తెలియజేస్తూ తన యూట్యూబ్ ఛానల్‌లో వీడియో విడుదల చేశారు నాగబాబు. ఈ వీడియోలో కాబోయే వియ్యంకుడిపై ప్రసంసలు కురిపించారు నాగబాబు. ఆయన మాట్లాడుతూ.. ‘ఈనెల (ఆగష్టు) 31న రిటైర్డ్ కాబోతున్న ఐజీ జొన్నలగడ్డ ప్రభాకర్ గారికి.. అభినందనలు తెలియజేస్తున్నా. వారితో త్వరలో వియ్యం అందుకోబోతున్నా. మా ఫ్యామిలీకి పోలీస్ డిపార్ట్ మెంట్‌తో తెలియని అనుబంధం ఉంది. మా నాన్న పోలీస్‌గా పనిచేశారు. మా నాన్నగారి కోరిక ఏంటంటే.. మా ముగ్గురు అన్నదమ్ముల్లో ఎవరొకర్ని ఐపీఎస్ చేయాలని.. కాని ఎవరం ఆ ఫీట్ సాధించలేకపోయాం. కాని ఇన్నాళ్లకు ప్రభాకర్ గారితో వియ్యం అందుకునే ఛాన్స్ వచ్చింది. ఆ విధంగా ఓ పోలీస్ మా ఫ్యామిలీలో భాగం కాబోతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఆయన 1990లో సర్వీస్‌లో చేరారు. అంతకు ముందు ప్రైవేట్ జాబ్ చేసేవారు. కాని పోలీస్ అవ్వి.. ప్రజలకు సర్వీస్ చేయాలని కోరుకున్నారు. అలాగే గ్రూప్ 1లో ఆఫీసర్‌గా పోలీస్ డిపార్ట్‌మెంట్‌లోకి అడుగుపెట్టారు. రీసెంట్‌గా ఆయన కరోనా ముందు వరకూ పదవీ బాధ్యతలు నిర్వర్తించారు. డీఎస్పీగా పదవీ బాధ్యతలు చేపట్టిన కొత్తలో.. గుంటూరలో ఓ రౌడీ షీటర్ ప్రజల్ని ఇబ్బంది పెడుతుంటే రోడ్డు మీద కొట్టుకుంటూ తీసుకుని వెళ్లి రౌడీయిజాన్ని కట్టడి చేశారు. అలాగే రాజమండ్రిలో టెర్రరిస్ట్‌లు చొరబడినప్పుడు వాళ్లని చాలా చాకచక్యంగా పట్టుకుని జాతీయ స్థాయిలో సన్సేషన్ అయ్యారు. రాయలసీమలో పనిచేస్తున్నప్పుడు ఫ్యాక్షన్ వల్ల వచ్చే నష్టాన్ని తెలియజేస్తూ వాళ్లతో మార్పు తీసుకువచ్చేందుకు ప్రయత్నించారు. ఆయన గురించి చెప్పుకోవాలంటే చాలా ఉన్నాయి. పోలీస్ డిపార్ట్ మెంట్‌కి సంబంధించిన వ్యక్తులు అంటే ఒకింత భయం ఉంటుంది. కాని ఆయన్ని చూసిన తరువాత ఇంత సాఫ్ట్‌గా ఉన్నారేంటి అనిపిస్తుంది. చాలా కూల్‌గా నవ్వుతూ ఉంటారు. ముఖ్యంగా నాకు సంతోషం కలిగించే విషయం ఏంటంటే.. ప్రభాకర్ రావు గారి అబ్బాయి చైతన్యకి మా అమ్మాయి నిహారికను ఇవ్వడం. ఈ మధ్యలో వీరిద్దరికీ నిశ్చితార్థం అయ్యింది.. త్వరలో పెళ్లి జరగబోతుంది. ఇంత మంచి ఫ్యామిలీకి మా అమ్మాయి కోడలుగా వెళ్లడం ఆనందంగా ఉంది. ఇలాంటి మంచి వ్యక్తులతో వియ్యం అందుకోవడం చాలా సంతోషంగా ఉంది. బావగారూ.. మీ రిటైర్డ్ మెంట్ అయిన తరువాత కూడా చాలా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను’ అంటూ వీడియో సందేశం ద్వారా తనకు కాబోయే బావగారిపై ప్రసంసలు కురిపించారు నాగబాబు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3gMi0ti
v

ఈరోజు నా 31వ పుట్టినరోజు.. అక్కినేని వారి చమత్కారం.. శుభాకాంక్షల వెల్లువ

టాలీవుడ్ స్టార్ హీరో, బిగ్ బాస్ 4 హోస్ట్ అక్కినేని ఈరోజు (ఆగస్ట్ 29న) తన 61వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. తన 60వ పుట్టినరోజును స్పెయిన్‌లో జరుపుకున్న కింగ్ నాగార్జున.. ఈ బర్త్‌డేను మాత్రం హైదరాబాద్‌లోనే కుటుంబ సభ్యుల సమక్షంలో జరుపుకుంటున్నారు. నాగార్జున పుట్టినరోజు సందర్భంగా ఆయనకు సినీ, రాజకీయ ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలియజేశారు. వారందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ ఒక వీడియో మెసేజ్‌ను నాగార్జున ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. ఈ వీడియోలో ఒక ఆసక్తికర అంశం ఉంది. తాను 31వ ఏట అడుగుపెట్టినట్టు చెబుతూ నాగార్జున ఈ వీడియోను మొదలుపెట్టారు. ‘‘ఈవాళ నా 31వ పుట్టినరోజు. నిన్నటి నుంచి ఎంతో మంది విషెస్.. ప్రేమ, అభిమానంతో మెసేజ్‌లు నాకు పంపుతున్నారు. చాలా సంతోషంగా ఉంది. మరోసారి మీ అందరికీ కృతజ్ఞతలు. ఇంకో విషయంపై చాలా హ్యాపీగా ఉన్నాను. ఐదున్నర నెలలు తరవాత మళ్లీ పని చేయబోతున్నాను. షూటింగ్‌కి వెళ్లబోతున్నాను. ఏ షూటింగ్ అంటే.. బిగ్ బాస్ సీజన్ 4’’ అని ఎంతో సంతోషంగా చెప్పారు నాగార్జున. అయితే, తన వయసు 31 అంటూ చెప్పిన అక్కినేని వారి చమత్కారానికి ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. కింగ్‌కి పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతున్నారు. అక్కినేని అభిమానులతో పాటు సినీ ప్రముఖులు ఎంతో మంది ట్విట్టర్ ద్వారా నాగార్జునకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. నాగార్జునకు శుభాకాంక్షలు తెలిపిన వారిలో నేచురల్ స్టార్ నాని, విక్టరీ వెంకటేష్, శ్రీకాంత్, శ్రీవిష్ణు, సీరత్ కపూర్, హేమంత్ మధుకర్, నాగచైతన్య, అఖిల్ తదితరులు ఉన్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/31E8AeP
v

లతా శ్రీ మేనల్లుడే నాగశౌర్య.. బంధుత్వం తెంచుకోవడంపై నటి ఆవేదన

నాగశౌర్య ఫ్యామిలీకి లతా శ్రీకి ఉన్న రిలేషన్ ఏంటి? ఇప్పుడు ఈ రెండు ఫ్యామిలీల మధ్య రిలేషన్ ఎందుకు లేదు.. నాగశౌర్య ఈమెను అత్తని చెప్పుకోవడానికి ఎందుకు ఇష్టపడడు.. లాంటి విషయాలను తెలుసుకునే ముందు అసలు లతా శ్రీ ఎవరు? ఆమె ఇండస్ట్రీలోకి ఎలా వచ్చారో.. ఓ లుక్కేద్దాం..

నాగ శౌర్య పేరెంట్స్ శంక‌ర ప్ర‌సాద్‌ మూల్పూరి, ఉషా ముల్పూరిలు ఐరా క్రియేషన్స్ బ్యానర్‌ స్థాపించి కొడుకు నాగశౌర్యతో సొంతంగా సినిమాలు చేస్తున్నారు. ఛలో లాంటి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు కూడా.


లతా శ్రీ మేనల్లుడే నాగశౌర్య.. బంధుత్వం తెంచుకోవడంపై నటి ఆవేదన

నాగశౌర్య ఫ్యామిలీకి లతా శ్రీకి ఉన్న రిలేషన్ ఏంటి? ఇప్పుడు ఈ రెండు ఫ్యామిలీల మధ్య రిలేషన్ ఎందుకు లేదు.. నాగశౌర్య ఈమెను అత్తని చెప్పుకోవడానికి ఎందుకు ఇష్టపడడు.. లాంటి విషయాలను తెలుసుకునే ముందు అసలు లతా శ్రీ ఎవరు? ఆమె ఇండస్ట్రీలోకి ఎలా వచ్చారో.. ఓ లుక్కేద్దాం..



అంద చందాలతో యముడినే మైమరపించింది..
అంద చందాలతో యముడినే మైమరపించింది..

సినిమాల్లో యమధర్మరాజు అంటే ‘యమలీల’ చిత్రంలోని కైకాల సత్యనారాయణ గుర్తుకు వస్తారు. గంభీరమైన స్వరంతో యముండా అంటూ అంటూ ఆయన పలుకుకి బెంబేలెత్తిపోయేవారు.. అలాంటి యమధర్మరాజుకి తన అంద చందాలను ఎరగా వేసి.. ‘అభివందనం యమరాజా..’ అంటూ ఆడిపాడి యమధర్మరాజుతో హిమ క్రీములు రుచి చూసేట్టు చేసిన నాటి నటి లత శ్రీ అందరికీ గుర్తుండే ఉంటుంది.



70కి పైగా సినిమాలు.. స్టార్ హీరోలకు ముద్దుల చెల్లలు
70కి పైగా సినిమాలు.. స్టార్ హీరోలకు ముద్దుల చెల్లలు

యమలీల, నెంబర్ వన్, ఆ ఒక్కటీ అడక్కు లాంటి సంచలన చిత్రాలల్లో నటించి తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో సుమారు 70 కిపైగా చిత్రాల్లో నటించిన ఈ సీనియర్ నటి 1999 తరువాత కనుమరుగైంది. ఈమెను చిట్టి చెల్లలు అనిపిలుచుకునేవారు. ఎందుకంటే అప్పట్లో హీరోయిన్‌గానే కాకుండా ఇండస్ట్రీలోని స్టార్ హీరోలకు చెల్లెలుగా చేసింది.



పదో తరగతిలో ఉండగానే హీరోయిన్..
పదో తరగతిలో ఉండగానే హీరోయిన్..

ఈమెకు అప్పట్లో సినిమాల్లోకి ఎంట్రీ చాలా ఈజీగానే వచ్చింది. విజయవాడలో లతా శ్రీ పదో తరగతి చదివే రోజుల్లో సీనియర్ దర్శకుడు తమ్మారెడ్డి భరద్వాజ నూతన నటీనటులుకావాలని పేపర్‌లో వేసిన యాడ్ చూసి.. ఫొటోలు పంపింది. ఆ వెంటనే ఆ సినిమాలో హీరోయిన్‌గా సెలెక్ట్ కావడం.. ఆ వెంటనే వరుస చిత్రాల్లో బిజీ అయ్యింది.



జిమ్ ట్రైనర్‌తో ప్రేమ.. పెళ్లి.. ఆపై సినిమాలకు దూరం
జిమ్ ట్రైనర్‌తో ప్రేమ.. పెళ్లి.. ఆపై సినిమాలకు దూరం

జిమ్ ట్రైనర్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుని 1999 తరువాత సినిమాలకు దూరమైంది. ఆ తరువాత 2007లో ఈవీవీ అత్తిలి సత్తిబాబు సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చింది. అయితే లతా శ్రీ ప్రస్తుతం ఇండస్ట్రీకి దూరంగానే ఉన్నా.. ఆమెకు ఇద్దరు కొడుకులు ఉన్నారు. పెద్ద కొడుకు ఇంజనీరింగ్ చేస్తుండగా.. రెండో కొడుకు బీటెక్ చేస్తున్నాడు.



నాగశౌర్య ఫ్యామిలీతో లతా శ్రీకి ఉన్న రిలేషన్..
నాగశౌర్య ఫ్యామిలీతో లతా శ్రీకి ఉన్న రిలేషన్..

ఇక లతా శ్రీతో హీరో నాగశౌర్యకి ఉన్న రిలేషన్ ఏంటి అన్న విషయానికి వస్తే.. నాగశౌర్యకి సొంత అత్తే లతా శ్రీ. కాని తనకు ఇండస్ట్రీలో ఎవరూ లేరని చెప్పడంతో పాటు ఎప్పుడూ కూడా తన మేనత్త లతా శ్రీ పేరును నాగశౌర్య కాని.. అతని తండ్రి కాని ప్రస్తావించకపోవడంతో లతా శ్రీ హర్ట్ అయ్యారు. అయితే తనకు ఒక నేమ్ అండ్ ఫేమ్ ఉందని.. తనంటే ఇష్టంలేని వార్లు పేర్లు చెప్పుకుని బతకడం తనకు అవసరం లేదంటున్నారు లతా శ్రీ.



అన్నయ్య కాబట్టే ఉన్నాడని చెప్తా.. వాళ్లు అలా కాదు..
అన్నయ్య కాబట్టే ఉన్నాడని చెప్తా.. వాళ్లు అలా కాదు..

‘చాలామంది నా అన్నయ్య (నాగశౌర్య) తండ్రిని ఇండస్ట్రీలో ఎవరైనా ఉన్నారా అంటే లేరని అంటున్నారు.. కాని నాకు నా అన్నయ్య ఉండి లేడని చెప్పలేను. ఉన్నాడంటే ఉన్నాడనే అంటా.. వాళ్ల గురించి నేను చెప్పాలని అనుకోవడం లేదు’ అని అంటోంది లతా శ్రీ. అయితే నా పేరు చెప్పుకోవడానికి వాళ్లు ఇష్టపడరు.. అలాంటప్పుడు నా మేనల్లుడు నాగశౌర్య పేరుకాని.. నా అన్నయ్య పేరుకాని చెప్పుకోవాలని నేను అనుకోవడం లేదు.. కాని నా తోడపుట్టినోడు కాబట్టి నీతో పాటు ఎవరైనా ఉన్నారా అంటూ మా అన్నయ్య అని చెప్తున్నా.. వాళ్లు అది కూడా చెప్పుకోలేకపోతున్నారు’ అంటూ వాపోయింది లతా శ్రీ.



నాగశౌర్యను లతా శ్రీనే ఇండస్ట్రీకి పరిచయం చేసిందా??
నాగశౌర్యను లతా శ్రీనే ఇండస్ట్రీకి పరిచయం చేసిందా??

హీరో నాగశౌర్యను ఇండస్ట్రీకి ఎవరు పరిచయం చేశారన్న దానిపై లతా శ్రీ మాట్లాడుతూ.. ఈ విషయాన్ని మాట్లాడాలని అనుకోవడం లేదు.. ఇండస్ట్రీకి ఎలా వచ్చాడో వాళ్లకి తెలుసు. ఆ ఫ్యామిలీతో ఇబ్బందులు గొడవలు అని కాదు కాని.. చిన్న చిన్న మిస్ అండర్ స్టాడింగ్ వచ్చాయి. నా అన్నయ్య మీద నాకు ఇష్టం ఉంటుంది. అన్నయ్య మనోడే.. మేనల్లుడు మనోడే.. కాని వదిన మనది కాదు కదా.. ఖచ్చితంగా అల్లుడు అంటే ఏ అత్తకు అయినా ఇష్టం ఉంటుంది. అతని సినిమాలు కూడా చూస్తా. అమ్మతో కలిసి చూసేదాన్ని. ఈ మధ్య కాలంలో చూడలేదు కాని.. ఊహలు గుసగుసలాడే చూశా’ అంటూ చెప్పుకొచ్చింది సీనియర్ నటి లతా శ్రీ. మరి నాగశౌర్య తన మేనత్తను ఎందుకు దూరం పెట్టాడు.. రెండు ఫ్యామిలీల మధ్య గ్యాప్ ఎందుకు వచ్చిందన్న విషయంపై క్లారిటీ ఇవ్వలేదు.





from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3beHb6r
v

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...