Monday 31 August 2020

వికారాబాద్ అడవుల్లో రకుల్ ప్రీత్.. అంతా సీక్రెట్‌గా కానిచ్చేస్తున్న డైరెక్టర్!

ముంబై నుంచి నేరుగా వికారాబాద్ అడవుల్లో వాలిపోయిందట యంగ్ హీరోయిన్ . సీక్రెట్‌గా అక్కడే షూటింగ్‌లో పాల్గొంటోందని తెలిసింది. ఆహా ఓటీటీ కోసం రూపొందిస్తున్న ఓ వెబ్ సిరీస్ షూట్‌లో నటిస్తోందట రకుల్. ఈ వెబ్ సిరీస్ కోసం మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్‌తో వికారాబాద్ అడవుల్లో ఆడిపాడుతోందట. లాక్‌డౌన్ కారణంగా షూటింగ్స్ బంద్ అయ్యాక లాంగ్ గ్యాప్ తీసుకొని తిరిగి నిన్ననే(ఆగస్టు 30) సెట్స్ మీదకు వచ్చిందట రకుల్ ప్రీత్. క్రిష్ తెరకెక్కిస్తున్న ఈ మూవీ కోసం విమానాశ్రయం దిగగానే నేరుగా వికారాబాద్ వెళ్లిందట రకుల్. అక్కడే సీక్రెట్‌గా క్రిష్ తన సినిమా షూటింగ్ చేస్తున్నారట. దాదాపు వారం రోజుల పాటు ఈ షూట్ ఉండొచ్చని తెలుస్తోంది. ఇందులో రకుల్ గ్లామర్ రోల్ పోషిస్తోందని టాక్. ఇకపోతే డైరెక్టర్ క్రిష్.. తన తదుపరి సినిమాను పవన్ కళ్యాణ్‌తో చేయనున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు షూటింగ్స్ లేకపోవడంతో ఆ గ్యాప్ ఫిల్ చేస్తూ ఇంతలో వైష్ణవ్ తేజ్- రకుల్ వెబ్ సిరీస్ ఫినిష్ చేయాలని ప్లాన్ చేసిన క్రిష్ దాన్ని ఇలా అమలు చేస్తున్నారని సమాచారం. Also Read: ఇక తెలుగులో చివరగా ‘మన్మథుడు 2’ మూవీలో నాగార్జునతో రొమాన్స్ చేసిన రకుల్.. ఆ తర్వాత టాలీవుడ్ నుంచి అవకాశాలు సన్నగిల్లడంతో బాలీవుడ్‌పై ఫోకస్ పెట్టేసింది. ఉత్తరాది ప్రేక్షకులకు కూడా తన అందాల రుచి చూపించాలని ప్లాన్ చేసి బోల్డ్ పాత్రలు చేసేందుకు రెడీ అయింది. ఈ క్రమంలోనే ఆమె రీసెంట్‌గా ఓ వేశ్య పాత్ర చేసేందుకు అంగీకారం తెలిపిందని తెలుస్తోంది. ముంబై రెడ్ లైట్ ఏరియాకు చెందిన ప్రముఖ వేశ్య జీవిత కథ ఆధారంగా ఈ మూవీ రానుందని టాక్.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3hIKHZn
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...