Wednesday 31 March 2021

సూపర్ స్టార్ రజనీకాంత్‌కు ప్రతిష్టాత్మక దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు.. పండగ చేసుకుంటున్న ఫ్యాన్స్

సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజనీకాంత్‌ను ప్రతిష్టాత్మక వరించింది. సినీ రంగంలో విశేష సేవలు అందించిన వారికి 1969 నుంచి కేంద్ర ప్రభుత్వం ఈ అత్యున్నత పురస్కారం అందిస్తోంది. ఈ నేపథ్యంలో 51వ దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డు గ్రహీతగా రజనీకాంత్ నిలిచారు. తాజాగా ఈ విషయాన్ని కేంద్ర మంత్రి ప్రకాశ్‌ జావడేకర్ ప్రకటించారు. ‌ "సూపర్ స్టార్ రజనీకాంత్‌కు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు దక్కిందని తెలియజేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. భారత సినీ రంగంలోని అత్యున్నత నటుల్లో ఒకరైన రజనీకాంత్ గారికి ఈ సంవత్సరం దాదా సాహెబ్ ఫాల్కే అవార్డును అందించనున్నాం. నటుడిగా, నిర్మాతగా, స్క్రీన్ రైటర్ గా చిత్ర పరిశ్రమకు ఆయన చేసిన సేవలు గుర్తించ దగినవి. రజనీకాంత్‌ను ఈ అవార్డుకు ఎంపిక చేసిన జ్యూరీ సభ్యులకు ధన్యవాదాలు" అని ప్రకాశ్‌ జావడేకర్ ట్వీట్ చేశారు. రజనీకి ఈ ప్రతిష్టాత్మక అవార్డు రావడంతో ఆయన ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. Also Read: భారతీయ చలన చిత్ర పితామహుడు దాదాసాహెబ్ ఫాల్కే పేరుతో సినిమా రంగంలో విశిష్ట సేవలందించిన ప్రముఖులకు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అందిస్తుంటారు. గతంలో దక్షిణాదికి చెందిన బొమ్మిరెడ్డి నరసింహారెడ్డి, ఎల్వీ ప్రసాద్, నాగిరెడ్డి, అక్కినేని నాగేశ్వరరావు, శివాజీ గణేషన్, రాజ్‌కుమార్, రామానాయుడు, బాలచందర్‌, కె. విశ్వనాథ్‌ లాంటి వారు ఈ అందుకున్నారు. బాలీవుడ్ దిగ్గజం అమితాబ్‌ బచ్చన్‌ను కూడా ఇటీవలే దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుతో గౌరవించారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2PHvOgG
v

న్యూడ్ ఫొటో కోసం ప్రియమణికి రిక్వెస్ట్.. అలా చేస్తే తప్పకుండా ఇస్తానంటూ అమ్మడి షాకింగ్ రియాక్షన్!

రోజురోజుకూ కొత్త పుంతలు తొక్కుతున్న టెక్నాలజీ సెలబ్రిటీలు- సామాన్య మనుషుల మధ్య దూరాన్ని మరింత తగ్గిస్తోంది. సోషల్ మీడియా వేదికగా ప్రతి ఒక్కరూ సెలబ్రిటీలకు నేరుగా మెసేజ్ చేసేస్తున్నారు. ఈ క్రమంలో కొంతమంది నెటిజన్స్ హద్దుమీరి ప్రవర్తిస్తుండటం సెలబ్రిటీలకు సమస్యగా మారుతోంది. మరీ ముఖ్యంగా హీరోయిన్స్‌కి లేనిపోని తలనొప్పులు తెస్తున్నాయి. తాజాగా సీనియర్ హీరోయిన్ ప్రియమణికి ఇదే పరిస్థితి ఎదురుకావడంతో ఈ అమ్మడు షాకింగ్ రియాక్షన్ ఇచ్చింది. అందం, అందుకు తగ్గ అభినయం రెండూ కలగలిపి ఉన్న అతికొద్ది మంది హీరోయిన్లలో ఒకరుగా మంచి గుర్తింపు సంపాదించింది. టాలీవుడ్‌లో ఒకానొక సమయంలో బిజీ హీరోయిన్‌గా సత్తా చాటిన ప్రియమణి.. జగపతిబాబు, నాగార్జున, రవితేజ, బాలకృష్ణ లాంటి స్టార్ హీరోల సరసన నటించి భారీ విజయాలందుకుంది. బికినీలో కిక్కివ్వాలన్నా, హోమ్లీ లుక్‌లో కనిపించి ఫ్యామిలీ ఆడియన్స్‌ని మెప్పించాలన్నా బెటర్ ఛాయిస్ ప్రియమణి మాత్రమే అన్నట్లుగా హవా నడిపించిన ఆమె పెళ్లి తర్వాత కాస్త స్లో అయింది. ఆ తర్వాత రీసెంట్‌గా సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన ప్రియమణి.. మళ్ళీ సినిమాలతో బిజీ అవుతోంది. ఈ నేపథ్యంలో నేటితరం హీరోయిన్స్ లాగే ప్రియమణి కూడా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫోటోషూట్స్ పోస్ట్ చేస్తోంది. ఇటీవల మోడ్రన్ బ్లాక్ డ్రెస్ ధరించి ఓ ఫొటోషూట్‌లో పాల్గొన్న ఆమె.. ఇందుకు సంబంధించిన ఫొటోలను తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతా ద్వారా పంచుకుంది. ఇవి చూసిన ఓ నెటిజన్ అభ్యంతరకర కామెంట్ చేశాడు. ఏకంగా మీ న్యూడ్ పిక్ పోస్ట్ చేయండి అని నేరుగా అడిగేశాడు సదరు నెటిజన్. దీనిపై వెంటనే రియాక్ట్ అయిన ప్రియమణి చాకచక్యంగా వ్యవహరిస్తూ అతనికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. 'మీ తల్లిని అలాగే మీ సోదరిని అలాంటి ఫొటోలు అడిగి పోస్ట్ చేయండి. అప్పుడు నేను కూడా పోస్ట్ చేస్తాను' అంటూ దిమ్మతిరిగే రిప్లై ఇచ్చింది. దీంతో వెంటనే సదరు నెటిజన్ క్షమించండి అంటూ వేడుకున్నాడు. ఈ విషయంలో ప్రియమణి చాకచక్యాన్ని మెచ్చుకుంటున్నారంతా. ప్రస్తుతం తెలుగులో ''నారప్ప, విరాటపర్వం'' సినిమాల్లో నటిస్తోంది ప్రియమణి.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3cK0d7j
v

Acharya: ట్రెండ్ అవుతున్న చిరంజీవి స్టెప్స్.. స్పెషల్ కిక్కిస్తున్న ఇద్దరు అందాల భామలు

ఎన్ని తరాలు మారినా, ఎందరు కొత్త హీరోలు చిందులేసినా టాలీవుడ్‌లో చిరంజీవి స్టెప్పులకున్న డిమాండే వేరు. అప్పట్లో బ్రేకు డాన్సులతో తెలుగు సినీ లోకాన్ని ఉర్రూతలూగించిన మెగాస్టార్.. వయసుతో సంబంధం లేకుండా ఇప్పటికీ అదే కంటిన్యూ చేస్తున్నారు. రీ- ఎంట్రీ తర్వాత కూడా మెగాస్టార్ వేస్తున్న స్టెప్పులకు ఫిదా అవుతోంది ప్రేక్షకలోకం. తాజాగా ఆయన లేటెస్ట్ మూవీ 'ఆచార్య' నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ 'లాహే.. లాహే' రిలీజ్ చేశారు. ఈ వీడియోలో మెగా స్టెప్పులు చూస్తే.. థియేటర్స్ మాటేమో గానీ ఇంట్లోనే ఈలలు వేసే పరిస్థితి. మెగా అభిమానులను సర్‌ప్రైజ్‌ చేస్తూ నిన్న (బుధవారం) సాయంత్రం స్టార్ డైరెక్టర్ కొరటాల శివ వదిలిన ఈ వీడియో దేశవ్యాప్తంగా ట్రెండ్ అవుతోంది. ముఖ్యంగా చిరంజీవి వేసిన స్టెప్స్ జనాన్ని తెగ ఆకర్షిస్తున్నాయి. ఈ సాంగ్ విడుదలైన కొద్ది క్షణాల్లోనే యూట్యూబ్ సెన్సేషన్‌గా మారి యమ స్పీడ్‌గా దూసుకుపోతోంది. సీనియర్‌ నటి సంగీత ప్రత్యేక ఆకర్షణగా నిలవగా స్టార్ హీరోయిన్ కాజల్‌ అగర్వాల్‌ ఆమెతో కలిసి కాలు కదపడం, మధ్య మధ్యలో మెగా స్టెప్పులు గోల పెట్టిస్తున్నాయి. రామజోగయ్య శాస్త్రి అందించిన లిరిక్స్, మణిశర్మ బాణీలు పాటకు ప్రాణం పోశాయి. ప్రస్తుతం ఈ సాంగ్ యూట్యూబ్‌లో ట్రెండ్ అవుతోంది. చిరంజీవి 152వ చిత్రంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ 'ఆచార్య' సినిమా రూపొందిస్తున్నారు. ఈ మూవీపై డైరెక్టర్ కొరటాల ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. ఇందులో రామ్ చరణ్ 'సిద్ధ' అనే కీలకపాత్ర పోషిస్తూనే నిర్మాణ భాగస్వామిగా ఉండటం విశేషం. నిరంజన్‌ రెడ్డి, రామ్‌చరణ్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీలో చిరంజీవి సరసన కాజల్ హీరోయిన్‌గా నటిస్తోంది. మే 14వ‌ తేదీన ఈ మూవీ గ్రాండ్‌గా విడుదల కానుంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3cFt6kJ
v

ఒరేయ్ కాస్త మాట్లాడనివ్వండిరా.. నాకు లేట్ అవుతోంది! అభిమానులకు రష్మిక స్వీట్ వార్నింగ్

అంటే ఎంత క్యూట్‌గా మాట్లాడుతుంది.. ఎలాంటి అల్లరి పనులు చేస్తుందో అందరికీ తెలిసిందే. నేషనల్ క్రష్‌గా జాతీయ స్థాయిలో గుర్తింపు సాధించిన ఆమె.. ఇప్పుడు బాలీవుడ్‌లో కూడా అడుగు పెట్టేశారు. సిద్దార్థ్ మల్హోత్రతో ఓ సినిమా చేస్తున్నారు. అంత కంటే ముందుగానే ఉత్తరాది ప్రేక్షకులను ప్రైవేట్ ఆల్బమ్‌తో ఆకట్టుకున్నారు. క్యూట్ ఎక్స్ ‌ప్రెషన్స్, స్టెప్పులతో ఆకట్టుకున్నారు. అయితే రష్మిక స్టేజ్ ఎక్కితే అందరినీ ఎలా ఆకట్టుకుంటారో తెలిసిందే. తన ముద్దు ముద్దు మాటలు, హావభావాలతో అందరినీ కట్టిపడేస్తుంటారు. మొన్న చెన్నైలో జరిగిన 'సుల్తాన్' ఈవెంట్‌లోనూ రష్మిక దంచి కొట్టేశారు. తమిళం అంతా రాకపోయినా కూడా స్టేజ్ మీద అడిగి మరీ మాట్లాడేశారు. కార్తీకి స్టేజ్ మీదే ఐ లవ్యూ చెప్పేశారు. తమిళంలో కష్టపడి ఎంతో ఇష్టంగా తమిళ అభిమానుల కోసం మాట్లాడేశారు. నిన్న హైద్రాబాద్‌లో జరిగిన సుల్తాన్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లోనూ రష్మిక తన సత్తా చాటారు. ముంబైలో బిజీగా ఉన్నా.. షూటింగ్‌కు ఆలస్యమవుతున్నా కూడా సుల్తాన్ ఈవెంట్ కోసం అర్జెంట్‌గా వచ్చేశారు. అలా త్వరగా మాట్లాడేసి వెళ్లిపోవాలనే ఉద్దేశ్యంలో ముందుగానే మైక్ అందుకున్నారు. కానీ రష్మిక ముద్దు చేష్టలకు అభిమానులు గోల గోల చేశారు. మైక్ అందుకున్న రష్మిక అక్కడికి వచ్చిన ప్రేక్షకులను మాస్క్ ఏది.. సోషల్ డిస్టెన్స్ ఏది అంటూ స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. ఆ తరువాత కార్తీ గురించి, సుల్తాన్ గురించి కాసేపు ప్రసగించారు. కార్తీ, సుల్తాన్ టీం నన్ను చెన్నైలో బాగా చూసుకున్నారు. మన హైద్రాబాద్ గురించి అక్కడ బాగా చెప్పాను.. బిల్డప్ ఇచ్చాను.. వారిని బాగా చూసుకోండి మీరు అంటూ తన అభిమానులకు రష్మిక సూచించారు. అలా రష్మిక తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ ఉంటే మధ్యలో సూర్య సూర్య అంటూ అభిమానులు అల్లరి చేశారు. వారితో పాటుగా రష్మిక కూడా సూర్య సూర్య కార్తీ కార్తీ అంటూ నినాదాలు చేశారు. అయితే ఫ్యాన్స్ ఎంత సేపటికీ ఆగకపోవడంతో.. అరేయ్ నన్ను మాట్లాడనివ్వండిరా.. నాకు లేట్ అవుతుందిరా.. మళ్లీ వెళ్లాలి అంటూ రష్మిక తన అభిమానులను తియ్యగా వేడుకున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/39yXYS3
v

వకీల్ సాబ్ దర్శకుడు శ్రీరామ్ వేణు ఇంటర్వ్యూ.. పవన్ సలహాలతో ‘పింక్’ కథలో మార్పులు.. అసలు కథ ఇదీ

‘ఓ మై ఫ్రెండ్’ చిత్రంతో టాలీవుడ్ కు పరిచయమైన దర్శకుడు శ్రీరామ్ వేణు. నాని హీరోగా 'ఎంసీఏ' చిత్రాన్ని రూపొందించి సక్సెస్ అందుకున్న ఈ టాలెంటెడ్ డైరెక్టర్ తాజాగా 'పవర్ స్టార్' పవన్ కళ్యాణ్ తో "వకీల్ సాబ్" చిత్రాన్ని తెరకెక్కించారు. పవన్ కళ్యాణ్ అభిమాని అయిన శ్రీరామ్ వేణు... ఒక అభిమానిగానే "వకీల్ సాబ్" సినిమా చేశానని చెబుతున్నారు. "వకీల్ సాబ్" సినిమాకు దర్శకత్వం వహించిన తన అనుభవాలను మీడియాతో పంచుకున్నారు శ్రీరామ్ వేణు. ఆ విశేషాలు చూస్తే... ట్రైలర్ రెస్పాన్స్ చూస్తే.. క్వారెంటైన్ వల్ల అందరం ఇళ్లలోనే ఉన్నాం. ఇన్నాళ్లూ థియేటర్ సెలబ్రేషన్స్ కు ఆడియెన్స్ కు దూరంగా ఉన్నారు. మొన్న థియేటర్లో వకీల్ సాబ్ ట్రైలర్ రిలీజ్ సందర్భంగా ఓ పావు గంట లోపలికి వెళ్లేందుకు మరో పావుగంట బయటకు వచ్చేందుకు పట్టింది. అంత పెద్ద సంఖ్యలో ఫ్యాన్స్ వచ్చారు ట్రైలర్ రిలీజ్ కార్యక్రమానికి. పవన్ గారి సినిమా కోసం వాళ్లు ఎంత వేచి చూస్తున్నారో అప్పుడు అర్థమైంది. ఒక అభిమానిగా పవన్‌ని డైరెక్ట్ చేయడం పట్ల.. అభిమాన హీరోను డెరెక్ట్ చేయడం కంటే కావాల్సింది ఏముంటుంది. ఈ ప్రాజెక్ట్ ను ఎంతో సంతోషంగా తీసుకున్నాను. మేకింగ్ టైమ్ లో ఎక్కడా ఒత్తిడికి గురి కాలేదు. దర్శకుడిగా చెబుతున్నా.. వకీల్ సాబ్ సినిమా బాగుంటుందనే పూర్తి నమ్మకం ఉంది. మనకు నచ్చిన పని చేసినప్పుడు వచ్చే సంతృప్తిని సంతోషాన్ని ఇప్పుడు పొందుతున్నా. కష్ట సుఖాలు ప్రతి పనిలో ఉంటాయి. ఒత్తిడి, కష్టం ప్రతి సినిమాకు, ప్రతి దర్శకుడికి ఉంటాయి. ఎంసీఏ టైమ్ లోనూ ప్రెజర్ ఉంది. వకీల్ సాబ్ సినిమా చేసేప్పుడు ప్రతి రోజూ ఎంజాయ్ చేశాను. పవన్ గారిని చూడగానే సంతోషం కలుగుతుంది. హ్యాపీగా ఫీలవుతాను. పవన్ కొన్ని ఇన్ ఫుట్స్ ఇచ్చారు ఈ ప్రాజెక్ట్ సెట్ అయినప్పుడు పవన్ గారిని వెళ్లి కలిశాను. ఆయన నాతో మాట్లాడుతూ... పింక్ రీమేక్ సినిమాను ఎలా చేద్దామనుకుంటన్నారు, మీ ఆలోచనలు ఏంటి అని అడిగారు. ఈ కథను మీరు ఎలా తెరకెక్కించాలని ఆలోచిస్తున్నారు అని తెలుసుకున్నారు. కళ్యాణ్ గారితో రెండు మూడు సార్లు మీటింగ్ జరిగింది. వకీల్ సాబ్ కథ, స్క్రీన్ ప్లే, క్యారెక్టర్ గురించి నేను అనుకునే విషయాలు ఆయనతో చెప్పాను. ఆయన కూడా కొన్ని ఇన్ ఫుట్స్ ఇచ్చారు. దాన్ని బట్టి ముందుకు వెళ్ళాం. కళ్యాణ్ గారికి వేర్వేరు రకాల ఆడియెన్స్ ఉంటారు. ఏ,బీ,సీ అనే కేటగిరీలు ఉంటాయి. వాళ్లందరికీ చేరేలా సినిమాను రూపొందించాను. పింక్ ఒరిజినల్ అలా ఉండదు. కథ రాస్తున్నప్పుడు, స్క్రీన్ ప్లే విషయంలో, మాటల విషయంలో పవన్ గారి ఇమేజ్ గుర్తు చేసుకుంటూ వచ్చాను. వకీల్ సాబ్‌లో మెయిన్ పాయింట్ ఇదే.. సబ్జెక్ట్, నేను రాసుకున్న స్క్రీన్ ప్లేకు తగినట్లే పవన్ గారు, నాయికల క్యారెక్టర్స్ ఉంటాయి. ట్రైలర్ లోనే కథ చెప్పేశాను. ట్రైలర్ చూశాక మీకు అది అర్థమయి ఉంటుంది. వుమెన్ ఎంపవర్ మెంట్ గురించి ఇప్పటికే రెండు భాషల్లో ఇదే సినిమా చేశారు. వకీల్ సాబ్ లోనూ ఆ మెయిన్ పాయింట్ ఉంటుంది. అది వదిలేసి, కోర్ పాయింట్ తప్పించుకుని వేరే విధంగా సినిమాను రూపొందించలేదు. హిట్స్ ఫ్లాప్స్ ఏది వచ్చినా ఇక్కడే ఉంటా.. నా మొదటి సినిమా ఓ మై ఫ్రెండ్ సరిగ్గా ఆడలేదు. ఆరేడేళ్లు టైమ్ తీసుకుని ఎంసీఏ చిత్రాన్ని చేశాను. ఫ్రెండ్స్ కథతో ఓ మై ఫ్రెండ్, వదిన మరిది కాన్సెప్ట్ తో చేసిన ఎంసీఏ ఈ రెండు సినిమాలు వకీల్ సాబ్ సినిమా చేసేందుకు ఉపయోగపడ్డాయి. నా ఫస్ట్ సినిమా రిలీజై ఈ నవంబర్ కు సరిగ్గా పదేళ్లు పూర్తవుతున్నాయి. నాకు సినిమాలంటే ఇష్టం. హిట్స్ ఫ్లాప్స్ ఏది వచ్చినా ఇక్కడే ఉండాలని నిశ్చయించుకున్నాను. పవన్ గారితో పనిచేస్తున్నప్పుడు ఎప్పుడూ ఇబ్బంది పడలేదు పవన్ గారితో పనిచేయాలి అనేది నా డ్రీమ్. నా జీవితంలో ఏడేళ్లు సినిమాకు దూరంగా ఉన్నాను. అదే నా జీవితంలో అది పెద్ద కష్టం. ఇక అంతకంటే కష్టమేదీ ఉండదు. పవన్ గారితో పనిచేస్తున్నప్పుడు ఎప్పుడూ ఇబ్బంది పడలేదు. నా పని ఏంటో నాకు తెలుసు. కాబట్టి ఇబ్బంది అనిపించలేదు. కోర్ట్ రూమ్ డ్రామా కాబట్టి, దాన్ని మార్చలేదు. కోర్ ఐడియా అలాగే ఉంటుంది. వ్యాపారం, ట్రేడ్.. వాటికి తగ్గట్టే వకీల్ సాబ్ ఒక స్టార్ హీరో సినిమా చేస్తున్నప్పుడు ఒక వ్యాపారం, ట్రేడ్ దాని చుట్టూ అల్లుకుని ఉంటాయి. దానికి తగినట్లే వకీల్ సాబ్ సినిమా తెరకెక్కించాను. ట్రైలర్ లో చూసినట్లు, ఎక్కువ సేపు కోర్ట్ రూమ్ డ్రామానే చూపించాను. వకీల్ సాబ్ సినిమా విషయంలో ఎలాంటి గొప్ప స్పందన వస్తుందో చూడాలి. ఈ ‘పింక్’ ఎలా ఉండబోతుందంటే.. ఫెయిల్యూర్ వచ్చినా, సక్సెస్ వచ్చినా తెల్లవారి పెన్ పేపర్ పట్టుకుని నా పని నేను చేయాల్సిందే. నేను మనసును నమ్ముతాను. జయాపజయాలు ఏది వచ్చినా మన పని మనం చేయాల్సిందే అని నమ్ముతాను. ప్రతి వంద కిలోమీటర్లకు భారతదేశంలో ప్రతిదీ మారిపోతుంటుంది. హిందీ పింక్ ఒకలా ఉంటుంది. తమిళ పింక్ మరోలా ఉంటుంది. పవన్ గారు అంటే ఏంటో, ఒక అభిమానిగా, దర్శకుడిగా నాకు తెలుసు. కాబట్టి ఆయనకు సరిపోయేలా సబ్జెక్ట్ మార్చి చేశాను. ప్రకాష్ రాజ్ పాత్రకి నందా అని పేరు పెట్టింది అందుకే ఎవరి ఊహలకు తగినట్లు సినిమా చేయలేను. బద్రి సినిమాను గుర్తు చేయడానికే ప్రకాష్ రాజ్ గారి పాత్రకు నందా అని పెట్టాను. అందులో సందేహం లేదు. పవన్ కళ్యాణ్ గారితో ఓ స్పెషల్ ప్రమోషనల్ సాంగ్ ఉంటుంది. అది ఎప్పుడు రిలీజ్ చేస్తారో చెప్పలేము. అది సంగీత దర్శకుడు థమన్ గారు రివీల్ చేస్తారు. వుమెన్ ఎంపవర్ మెంట్ కథ పవన్ కోసమే.. పవన్ కళ్యాణ్ గారితో ప్రతి ఒక్క దర్శకుడు సినిమా చేయాలని కోరుకుంటారు. పవన్ గారికున్న స్టేచర్ కు వుమెన్ ఎంపవర్ మెంట్ కంటే మంచి కాన్సెప్ట్ ఉండదు. ఆయనకు ప్రస్తుతం బాధ్యత గల సినిమాల కరెక్ట్. ఇంతకంటే కమర్షియల్ కథలు కూడా మరేముంటాయి. పింక్ కథలో మార్పులు.. నో అంటే నో అనే అంశం వకీల్ సాబ్ కథలో ఎలా ఉంటుందో మీరు తెరపైనే చూడాలి. నేనో కథ రాశాను, ఓ పాత్రను డిజైన్ చేశాను. అందులో ఎలాంటి పొలిటికల్ వ్యూస్ ఉన్నాయో లేదో అనేది చెప్పలేను. మీరు సినిమా చూసి చెప్పాలి. పింక్ కథలో మార్పులు చెప్పినప్పుడు పవన్ గారు బాగున్నాయని అన్నారు. పవన్ గారితో ప్రతి రోజూ బెస్ట్ మూవ్ మెంట్ అనుకోవచ్చు. మిగిలిన పుటేజ్ చూసుకున్నప్పుడు కూడా నాకు ఎగ్జైటింగ్ గానే ఉంది. వకీల్ సాబ్ రికార్డ్స్ గురించి.. వకీల్ సాబ్ సినిమా విషయంలో నేను ఒత్తిడికి లోనయ్యే టైమ్ కూడా లేదు. కథ కుదిరింది, ప్రాజెక్ట్ మొదలుపెట్టాం. సినిమా చేసుకుంటూ వెళ్లాం. నెక్ట్ సినిమా గురించి ఇంకా స్పష్టత లేదు. త్వరలో డీటెయిల్స్ చెప్తాను. హానెస్ట్లీ వకీల్ సాబ్ తీసుకొచ్చే ఎలాంటి రికార్డ్స్ గురించి ఆలోచించడం లేదు. మొన్న ఫ్యాన్స్ తో మీటింగ్ జరిగింది. మనకు సినిమా రికార్డ్స్ తో గుర్తుండదు. ఒక సినిమా అంకెలతో గుర్తుండదు. మనం ఎమోషన్ తో కనెక్ట్ అయితే ఆ సినిమా ఎప్పటకీ గుర్తుంటుంది. బొమ్మరిల్లు సినిమాను మనం అంకెలతో గుర్తుపెట్టకోలేదు కదా. పవర్ స్టార్ ఫ్యాన్స్ ను డిజప్పాయింట్ చేయకుండా వకీల్ సాబ్ లోని ఒక స్టిల్ లీక్ చేశారు ఫ్యాన్స్. అది బాగుందని చూసి. ఆ స్టిల్ నే పోస్టర్ లో పెట్టాను. లాయర్ సాబ్, మగువా లోకానికి తెలుసా నీ విలువ లాంటి కొన్ని టైటిల్స్ అనుకున్నాం. కానీ పవర్ స్టార్ ఫ్యాన్స్ ను డిజప్పాయింట్ చేయకుండా వకీల్ సాబ్ అని పెట్టుకున్నాం. మగువా మగువా అని పదాలు పెట్టాలని నేనే సూచించాను. ఆ ముగ్గురు అమ్మాయిలు అద్భుతంగా చేశారు.. ఒక క్యారెక్టర్ ఇన్నోసెంట్ గా ఉండాలి. ఆ క్యారెక్టర్ కు అనన్య నాగ‌ళ్లను తీసుకున్నాను. కాన్ఫిడెన్స్ ఉన్న మరో అమ్మాయి పాత్రకు అంజలిని తీసుకున్నాం. టుడేస్ గర్ల్ క్యారెక్టర్ కు కావాల్సి వచ్చినప్పుడు నివేదాను సెలెక్ట్ చేశాం. ఈ ముగ్గురూ తమ క్యారెక్టర్స్ చక్కగా చేశారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3rD876x
v

శీఘ్రస్ఖలన సమస్యకు శ్రీరెడ్డి పరిష్కారం.. అది తాగితే బుస్ బుస్ అట!

చాలామంది పురుషుల్లో శీఘ్రస్కలనం సమస్య ఉంటుంది. వారి జీవిత సహచరణితో కలసి శృంగారంలో పాల్గొన్నప్పుడు ఒకటి రెండు నిమిషాల్లోనే స్కలనం జరిగిపోతుంటుంది. ఎక్కువసేపు సెక్స్ చేయలేరు. దీనివల్ల పడకసుఖాన్ని ఆస్వాదించలేక చిరాకు, నిరాశ, నిస్పృహ వంటి భావనలు కలిగి దాంపత్య జీవితంపై ప్రభావం చూపుతుంది. అయితే ఇలాంటి వాటికి నా దగ్గర అద్భుతమైన చిట్కా ఉందని అంటుంది సెక్సీ బ్యూటీ . సోషల్ మీడియా సంపాదనపై ఫోకస్ పెట్టిన వివాదాస్పద నటి శ్రీరెడ్డి.. ఫేస్ బుక్ ఫాలోవర్స్‌కి ఎప్పుడూ టచ్‌లోనే ఉంటోంది. ఇక సొంతంగా యూట్యూబ్ ఛానల్‌కి కూడా స్టార్ చేసిన శ్రీరెడ్డి అటువైపుగా కూడా ఆదాయ మార్గాలపై అన్వేషిస్తుంది. ఇటీవల సోషల్ మీడియాలో యాక్టివ్ కావడానికి ప్రయత్నాలు చేస్తున్నానని.. తనని ఫాలో కావాలని కోరిన శ్రీరెడ్డి తనదైన శైలిలో వీడియోలను షేర్ చేస్తూ ఫాలోవర్స్‌ని పెంచుకుంటుంది. నిన్న మొన్నటివరకూ పవన్ కళ్యాణ్, ఆయన అభిమానుల్ని.. ఆ తరువాత టాలీవుడ్ సెలబ్రిటీలను తిడుతూ.. హాట్ హాట్ డిస్కషన్స్‌తో హీట్ పెంచేసిన శ్రీరెడ్డి.. అందాల ఆరబోస్తూ తన భారీ అందాలను వివిధ భంగిమల్లో ప్రదర్శిస్తూ ఒకవైపు తన ఫాలోవర్స్‌ని నయనానందం కలిగిస్తూ మరోవైపు సోషల్ మీడియా మార్కెట్‌ని క్యాష్ చేసుకుంటుంది. అయితే ఈసారి మాత్రం ఇంకాస్త డోస్ పెంచిన శ్రీరెడ్డి.. ఏకంగా పడక సుఖంలో రెచ్చిపోవడానికి చిట్కాలు చెప్తుంది. ఇందుకోసం తానే స్వయంగా ఓ ఎనర్జిటిక్ డ్రింక్‌ను తయారుచేస్తూ దాని గురించి ఓరేంజ్‌లో చెప్పుకొచ్చింది శ్రీరెడ్డి. ఈ డ్రింక్ తాగితే బెడ్‌పై భర్తలు, బాయ్ ఫ్రెండ్‌లు తెగ రెచ్చిపోతారని తనదైన శైలిలో బీప్ సౌండ్ వేసే మాటలు మాట్లాడింది శ్రీరెడ్డి. ఆంటీస్.. మీ భర్త **** సరిగా పనిచేయడం లేదా?? అది పనిచేస్తున్నా సరే తొందరగా డమాల్ అని వచ్చేస్తుందా? అయితే ఈ డ్రింక్‌ని మీ ఆయనతో తాగించాల్సిందే. ఇక అమ్మాయిలూ మీ బాయ్ ఫ్రెండ్ విషయంలో డిజప్పాయింట్‌తో ఉన్నారా? బెడ్ మీద అది సరిగా చేయడం లేదా? అయితే ఈ డ్రింక్ ట్రై చేయండి.. మీ వాడి *** నాగరాజా అంటూ నాట్యం చేస్తుంది అంటూ పచ్చి బూతులతో రెచ్చిపోయింది శ్రీరెడ్డి. ఈ ఎనర్జిటిక్ డ్రింక్ ఆంటీలు, అంకుల్స్, తాతలు, ముత్తాతలు కూడా ట్రై చేయొచ్చని చెప్తుంది. ఇంతకీ ఈ ఎనర్జిటిక్ డ్రింక్ ఎలా తయారుచేయాలి?? ఏమేమి కావాలో కూడా చూపించింది శ్రీరెడ్డి. ఫ్రూట్స్ పీసెస్, బనానా, తేనె, నానబెట్టిన డ్రై ఫ్రూట్స్, మిల్క్ పౌడర్, బూస్ట్, వాటర్.. ఇవన్నీ మిక్సీలో మిక్స్ చేసి ఓ గ్లాస్ తాగారంటే పడకగదిలో రెచ్చిపోతారని చెప్తోంది శ్రీరెడ్డి. అయితే నిజంగానే శ్రీరెడ్డి చెప్పినట్టుగా ఈ ఎనర్జిటిక్ డ్రింక్ తాగేస్తే పడకగదిలో రెచ్చిపోవచ్చని ఫిక్స్ అయిపోకండి.. ఎందుకంటే చెప్పింది శ్రీరెడ్డి కాబట్టి కాస్త ఆలోచించి అడుగేస్తే మంచిది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/31zcXXN
v

తాగి షూటింగ్‌కి, బాలయ్య తిట్టినా వినలేదు, ఆ దర్శకుడు పరమ నీచుడు, దుర్మార్గుడు: అంబికా కృష్ణ షాకింగ్ కామెంట్స్

నందమూరి బాలకృష్ణ కెరియర్‌లో మోస్ట్ డిజాస్టర్ చిత్రాల లిస్ట్ ఒకటి. ప్రముఖ దర్శకుడు దర్శకత్వంలో 2005లో వచ్చిన ఈ చిత్రం అట్టర్ ఫ్లాప్ అయ్యింది. ప్రముఖ నిర్మాత ఈ చిత్రాన్ని అప్పట్లో భారీ బడ్జెట్‌తో నిర్మించారు. అయితే ఈ చిత్రం డిజాస్టర్ కావడానికి ప్రధాన కారణం దర్శకుడు రవికుమార్ చౌదరి అని అతనో పెద్ద నీచుడు, దుర్మార్గుడు అంటూ సంచలన కామెంట్స్ చేశారు నిర్మాత అంబికా కృష్ణ. ఇటీవల ప్రముఖ యూట్యూబ్ ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో నందమూరి బాలక్రిష్ణతో ఉన్న అనుబంధాన్ని తెలియజేస్తూ వీరభద్ర సినిమా గురించి మాట్లాడారు అంబికా కృష్ణ. ఈ సందర్భంగా దర్శకుడు రవికుమార్ చౌదరిపై సంచలన కామెంట్స్ చేశారు. ‘బాలయ్య నటించిన వీరభద్ర సినిమా అంత ఘోరంగా ఫెయిల్ కావడానికి కారణం దర్శకుడు ఏఎస్ రవికుమార్. ముమ్మాటికీ అతని ఫెయిల్యూర్ వల్ల భారీ డిజాస్టర్ వచ్చింది. పరమ దుర్మార్గపు నీచుడు వాడు. నాకు ఎలాంటి మొహమాటం లేదు.. వాడో పెద్ద నీచుడు.. ఈ మాట చెప్పడానికి నాకేం భయం లేదు. వాడివల్లే సినిమా పాడైపోయింది. ఏఎస్ రవికుమార్ చౌదరి వాడి ఇష్టం వచ్చినట్టు సినిమా తీసేసి.. ఇష్టం వచ్చినట్టు డబ్బులు ఖర్చు పెట్టించేసి ఒక్కటి కూడా సరిగా చేయలేదు. చెప్పిన కథ ఒకటి చేసిన స్క్రిప్ట్ ఒకటి.. అనుకున్న బడ్జెట్ ఒకటి.. ఖర్చు పెట్టించింది మరోటి. ఒళ్లు పొగరుతో అహంకారంతో సినిమా తీసి మొత్తం నాశనం చేశాడు. బాలయ్య గారి కాల్ షీట్లు దొరికి.. సినిమా వచ్చిందంటే మనం ఎంత జాగ్రత్తగా తీయాలి. వాడు మాత్రం తాగి షూటింగ్‌కి వచ్చేవాడు. బాలయ్య గారు కూడా వీడి మీద కేకలు వేశారు, తిట్టారు. అయినా మారలేదు. కానీ సినిమా విషయంలో బాలయ్య చాలా నిబద్ధతతో ఉంటారు. దర్శకుడు ఎలాంటి వాడైనా సరే.. ఆయన చెప్పిందే చేస్తారు. వీరభద్ర సినిమా పోవడానికి కారణం బాలయ్య కాదు.. దర్శకుడే .. వాడి నీఛుడు వాడివల్లే పోయింది సినిమా. నేను కూడా చాలా నష్టపోయా. పాపం బాలయ్య గారూ తరువాత కూడా అన్నారు.. మనం మళ్లీ చేద్దాం అని. అది ఆయన మంచితనం. షూటింగ్ సమయంలో చాలాసార్లు చెప్పిచూశాం.. చాలా గొడవలు కూడా అయ్యాయి. బూతులు కూడా వచ్చాయి’ అంటూ దర్శకుడు ఏఎస్ రవికుమార్‌పై షాకింగ్ కామెంట్స్ చేశారు అంబికా కృష్ణ.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3rEdmCK
v

Tuesday 30 March 2021

ఆ విషయంలో సురేఖా వాణి కూతురికి ఎదురుదెబ్బ.. ఏం పాపం చేశానంటూ సుప్రిత ఆవేదన

టాలీవుడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ సురేఖా వాణి, ఆమె కూతురు గురించి సోషల్ మీడియాలో తెలియని వారెవ్వరూ ఉండరు. తెరపై కనిపించే సురేఖా వాణి, సోషల్ మీడియాలో హల్చల్ చేసే ఒక్కరేనా? అని ఆశ్చర్యపోవాల్సిందే. పార్టీలు, పబ్‌లు అంటూ వీకెండ్‌తో కూతురితో కలిసి సురేఖా వాణి హల్చల్ చేస్తుంటారు. అలా సురేఖా వాణి తన కూతురిని సోషల్ మీడియాలో ఓ స్టార్‌ను చేసేశారు. ఇక వెండితెరపై హీరోయిన్‌గా ఎంట్రీ ఇప్పించే ప్రయత్నాలు కూడా జరుగుతున్నట్టు టాక్. వెండితెరపై కూతురు ఎంట్రీపై సురేఖా వాణి ఏనాడో క్లారిటీ ఇచ్చారు. తనకు అయితే ఎలాంటి అభ్యంతరం లేదని, సుప్రిత ఇష్టపడితే సినిమాల్లోకి వస్తుందని, లేదంటే లేదని చెప్పేశారు. కానీ సురేఖా వాణి అడుగులు, సుప్రితను ఇలా ఫేమస్ చేసే ప్రయత్నాలు చూస్తుంటే త్వరలోనే సిల్వర్ స్క్రీన్ మీద సందడిచేయనున్నట్టు కనిపిస్తున్నారు. సుప్రిత ఎప్పుడూ కూడా కాంట్రవర్సీకి కేరాఫ్ అడ్రస్‌గా ఉంటారు. ఆమె చేసే పోస్ట్‌లు, వేసే సెటైర్లు వివాదాలకు దారి తీస్తుంటాయి. సోషల్ మీడియాలో సుప్రిత కనిపించే తీరు, వస్త్రాధారణపై నెటిజన్లు కౌంటర్లు వేస్తుంటారు. ఇక సుప్రిత చేసే పోస్ట్‌లో ఎక్కువగా తప్పులు దొర్లుతుంటాయి. స్పెల్లింగ్ మిస్టేక్‌లపై నెటిజన్లు కౌంటర్లు వేయగా.. దానికి ఘాటుగా స్పందించారు సుప్రిత. పనికొచ్చే పనులు చేయమని, ఇలా తప్పులు ఎంచడం కాదని సుప్రిత గట్టిగానే క్లాప్ పీకారు. మొన్నామధ్య సురేఖా వాణి రెండో పెళ్లిపై వార్తలు వైరల్ అయ్యాయి. ఆ రూమర్లు రాసిన మీడియా మీదా సుప్రిత వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఉన్నవి రాయండి.. కొత్తవి క్రియేట్ చేయకండి.. అసలు మీకు మీరు జర్నలిస్ట్‌లు, ప్రైమ్ మీడియా అని ఎలా చెప్పుకుంటారు అని కౌంటర్లు వేశారు. తాజాగా సుప్రితకు ఎదురుదెబ్బ తగిలింది. ఇన్ స్టాగ్రాం ఫాలోవర్ల టపాటపా పడిపోతూ వచ్చారు. గడిచిన వారం రోజుల్లో సుప్రిత ఇన్ స్టాగ్రాం ఫాలోవర్ల సంఖ్య పడిపోయింది. వారం రోజుల్లో 321 మంది కొత్త ఫాలో అయితే.. ఉన్నవారిలో 422 మంది అన్ ఫాలో అయ్యారు. ఈ లెక్కన మొత్తంగా 101 మంది తగ్గిపోయారు. అయితే ఫాలోవర్ల కంటే అన్ ఫాలోవర్ల సంఖ్యే ఎక్కువగా ఉండటంతో సుప్రిత తెగ బాధపడిపోయింది. ప్రస్తుతం సుప్రితకు 3.47లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. అయితే సుప్రిత తన ఫాలోవర్ల విషయంలో తెగ బాధపడిపోతోన్నారు. ఇలా అన్‌ఫాలో ఎందుకు అవుతున్నారంటూ సుప్రిత తెగ ఆలోచించినట్టున్నారు. ఏం పాపం చేశాను ఫ్రెండ్స్ అంటూ సుప్రిత ఆవేదన చెందింది. ఈ పోస్ట్ పెట్టడంలోనూ సుప్రిత స్పెల్లింగ్ మిస్టేక్ చేశారు. చేశాను అని రాయబోయి.. చేయను అని రాసేశారు. మళ్లీ ఆ తప్పును వేరే పోస్ట్ ద్వారా సరి చేసేసుకున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3wcgnOn
v

ఒరేయ్ నువ్ మారవా?..ఇకనైనా అలాంటి పనులు ఆపేయ్.. స్టార్ సింగర్‌పై శ్రీముఖి ఫైర్

బుల్లితెర ఫైర్ బ్రాండ్, సౌండ్ సిస్టమ్ గురించి అందరికీ తెలిసిందే. బిగ్ బాస్ షో కంటే ముందు బుల్లితెర మీద రాములమ్మగా బాగానే ఫేమస్ అయ్యారు. రాములమ్మగా ఐకానిక్ స్టెప్పులతో శ్రీముఖి ఫుల్ క్రేజ్ తెచ్చుకున్నారు. స్టార్ యాంకర్‌గా ఉన్న సమయంలోనే శ్రీముఖి బిగ్ బాస్ షోలోకి వెళ్లారు. మూడో సీజన్‌లో హయ్యెస్ట్ పెయిడ్ కంటెస్టెంట్‌గా శ్రీముఖి నిలిచారు. అలా ఆమె క్రేజ్ బిగ్ బాస్‌కు ముందు బిగ్ బాస్‌కు తరువాత అన్నట్టు మారిపోయింది. బిగ్ బాస్ షోకి రాకముందు శ్రీముఖిపై నెగెటివిటీ అనేది లేదు. కానీ బిగ్ బాస్ ఇంట్లో ఆమె చేష్టలు, మాటలు, ద్వేషం ఇవన్నీ చూశాక విపరీతమైన నెగెటివిటీ పెరిగింది. రాహుల్ సిప్లిగంజ్‌తో ఆమె చేసిన కోల్డ్ వార్ ఆమెను దారుణంగా దెబ్బ కొట్టేసింది. బిగ్ బాస్ మూడో సీజన్ విజేతగా నిలిచే అన్ని అర్హతలున్నా కంటెస్టెంట్‌గా శ్రీముఖికి భారీ మద్దతు లభించింది. కానీ ప్రతీసారి రాహుల్ సిప్లిగంజ్‌ను టార్గెట్ చేయడంతో అతనే టైటిల్ విన్నర్‌గా గెలిచాడు. బిగ్ బాస్ షో నుంచి బయటకు వచ్చాక శ్రీముఖి దూకుడు తగ్గింది. మునుపటిలా యాంకరింగ్ చేయడం లేదు. ఎక్కువగా అవకాశాలు రావడం లేదు. ఇప్పుడు శ్రీముఖి చేతిలో ఒక్కటంటే ఒక్క షో కూడా లేదు. పండుగలకు వచ్చే స్పెషల్ ఈవెంట్లు మాత్రమే శ్రీముఖి చేస్తున్నారు. అలా తాజాగా ఓ ఈవెంట్‌లో శ్రీముఖి సందడి చేస్తున్నారు. ఇందులో శ్రీముఖి తన గ్యాంగ్‌తో కలిసి దుమ్ములేపుతోన్నట్టు కనిపిస్తున్నారు. మామూలుగా శ్రీముఖి గ్యాంగ్‌లో ఆర్జే చైతు, , సాకేత్ సోదరి, అవినాష్, అరియానా, విష్ణుప్రియ ఉంటారు. శ్రీముఖి తన గ్యాంగ్‌తో కలిసి సోషల్ మీడియాలో చేసే అల్లరి అంతా ఇంతా కాదు. ఈ అందరూ ఒకే చోట కలిశారంటే అక్కడంతా సందడి వాతావరణం నెలకొంటుంది. మొన్నామధ్య శ్రీముఖి తన ఫ్రెండ్స్‌తో కలిసి గోవాలో రచ్చ చేసిన సంగతి తెలిసిందే. ఇక సింగర్ సాకేత్‌తో శ్రీముఖి ఎంత క్లోజ్‌గా ఉంటారో అందరికీ తెలిసిందే. ఈ ఇద్దరి సోషల్ మీడియా ఖాతాలను పరిశీలిస్తే ఆ విషయం అర్థమవుతుంటుంది. తాజాగా శ్రీముఖి ఓ ఈవెంట్‌ ఫోలో పాల్గొన్నారు. అందులో సాకేత్ కూడా పర్ఫామెన్స్ ఇచ్చినట్టున్నారు. ఈ ఈవెంట్ షూటింగ్ రాత్రంతా జరిగింది. ఉదయం ఆరు గంటల వరకు షూటింగ్ జరిగింది. తెల్లవారు ఝామున షూటింగ్‌కు ప్యాకప్ చెప్పి శ్రీముఖి వెళ్లారు. కానీ ఇంత లోపు సాకేత్ మాత్రం ఎంత అల్లరి చేయాలో అంత చేసేశారు. శ్రీముఖి ఫోన్‌ను దొంగతనం చేసి మరీ ఏడిపించాడు. ఆమె ఫోన్‌ను తీసుకుని అందులో ఫోటోలు దిగడం, దొంగచాటుగా శ్రీముఖి వీడియోలు తీసి ఇన్ స్టాలో పెట్టేయడం చేశారు. ఇక దీనిపై శ్రీముఖి సీరియస్ అయ్యారు. ఓరేయ్ సాకేత్ మారవా? నువ్ మారవా? నా ఫోన్ దొరికిన ప్రతీసారి ఈ ఫోటోలు దిగుడు ఏందిరా?‘ అని కౌంటర్ వేశారు. ఇక అంతేకాకుండా శ్రీముఖి వాల్ పేపర్‌ను మార్చేశారు. ఒరేయ్ సాకేత్.. ఫోన్‌లు దొంగతనం చేయడం ఆపు అని శ్రీముఖి వార్నింగ్ ఇచ్చారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/39uX3C3
v

మహేష్ బాబు డూప్ దీన స్థితి.. కనీసం పిల్లలకి పాలు కొనలేక ఆకలితో పస్తులు, కన్నీటి పర్యంతం

మేం కళనే నమ్ముకుని ఉన్నాం.. డూప్‌గా చేస్తూ చిన్న చిన్న ఈవెంట్లు చేస్తున్నాం. మాకు ఇది తప్ప వేరే పని తెలియదు. మేం ఒక ప్రోగ్రామ్ చేస్తే వెయ్యి రెండువేలు ఇస్తారు.. నెలలో ఐదారు ప్రోగ్రామ్స్ దొరికితేనే పూట గడుస్తుంది. ఈ కరోనా వల్ల ప్రోగ్రామ్స్ రావడం లేదు. ఎవరూ పిలవడం లేదు. పెళ్లం పిల్లల్ని కూడా పోషించలేని స్థితిలో ఉండిపోయాం. చాలా ఇబ్బందులు పడుతున్నాం.. నాకు ముగ్గురు పిల్లలు.. ఒక బాబుకి తొమ్మిదేళ్లు.. ఆ తరువాత ఇద్దరు కవల పిల్లలు పుట్టారు. వాళ్లు పాలు తాగుతున్నారు. వాళ్లకి కనీసం పాలు కూడా కొనలేని పరిస్థితిలో ఉన్నాం.. అద్దె ఇంట్లోనే ఉంటున్నాం.. ఉదయాన్నే రెండు పాల పేకెట్లు.. సాయంత్రం రెండు పాల పేకెట్లు తీసుకుని వెళ్లాలి. లేదంటే వాళ్లు ఆకలితో ఏడుస్తూ ఉంటారు. నేను పస్తులుండైనా సరే వాళ్ల ఆకలి తీర్చడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది. ఇండస్ట్రీలో మాలాంటి వాళ్లు చాలామంది ఉన్నారు.. మాలాంటి వాళ్లని పట్టించుకునేవాళ్లు చాలా తక్కువమంది ఉన్నారు. ఆరోజుకి ఆరోజు చూసుకుని మురిసిపోవడం తప్ప.. ఇంతకంటే మా జీవితాలు బాగుపడటం లేదు. ఫ్యాన్స్ అసోషియేషన్స్‌లు ముందుకు వచ్చి సాయం చేస్తుంటారు. మహేష్ బాబు ఫ్యాన్స్ అసోసియేషన్ వాళ్లు కరోనా టైంలో సాయం చేశారు. మహేష్ బాబుకి డూప్‌గా చేయడం నా అదృష్టంగా భావిస్తున్నా. రాజకుమారుడు సినిమా అప్పటి నుంచి మహేష్ బాబు డూప్‌గా చేస్తున్నాను. రామ్ గోపాల్ వర్మ అప్పల రాజు సినిమాలో చేశా. మహేష్ బాబు డూప్‌గా చేయడానికి అవకాశం రాలేదు. అయితే థమ్స్ అప్ యాడ్‌లో మహేష్ బాబు డూప్‌గా చేసే అవకాశం వచ్చింది.. తీరా ముంబై వెళ్లిన తరువాత వేరే వాళ్లతో చేయించారు’ అంటూ తన ధీన పరిస్థితిని చెప్పుకొచ్చాడు శ్రీను.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2QNuQ2V
v

రెండో పెళ్లికి ఓకే చెప్పిన నాగబాబు.. ఈ వయసులో మీకు ఓకే అయితే నాకూ ఓకే అంటూ షాకింగ్ కామెంట్స్

ఇటీవలే నిహారికకు పెళ్లి చేసిన మెగా బ్రదర్ తాత అయ్యేందుకు రెడీగా ఉన్నారు. ఇక వరుణ్ తేజ్‌కి కూడా పెళ్లి వయసు ఎప్పుడో వచ్చేయడంతో కోడల్ని వెతికిపట్టే పనిలో ఉన్నారు. ఈఏడాదో.. లేదంటే వచ్చే ఏడాదో వరుణ్ తేజ్‌ని కూడా ఓ ఇంటి వాడిని చేయడం ఖాయంగానే కనిపిస్తుంది. ఇక నాగబాబు పిల్లలిద్దరి పెళ్లిళ్లు అయిపోయిన తరువాత మనవడు, మనవరాళ్లతో ఆడుకుండా ఇంట్లో రామ క్రిష్ణ అనుకుంటారులే అని అనుకుంటే పొరపాటే.. అరవై ఏళ్లు వచ్చినా ఆయనలో మరో పెళ్లి ఆశ మాత్రం చావనే లేదు. ఈ వయసులో కూడా రెండో పెళ్లి సై అంటూ నాగబాబు సరదాగా చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇప్పటికే పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్లు చేసుకున్నాడంటూ సమయం సందర్భం కాకపోయినా నోటికొచ్చినట్టు మాట్లాడుతూ ఉంటారు చాలామంది. ఈ మూడు పెళ్లిళ్ల విషయంలో మింగలేక కక్కలేక.. పవన్ కళ్యాణ్ మౌనం వహిస్తూ ఉంటారు. అయితే తమ్ముడు తీర్చుకున్న మూడు పెళ్లిళ్ల ముచ్చటను తాను ఫాలో కావాలని అనుకుంటున్నారో ఏమో కానీ.. నాగబాబు తన మనసులో కోరికను బయటపెట్టారు. ఎవరో పిచ్చ అభిమాని.. ‘సార్.. మీరు మళ్లీ పెళ్లి చేసుకుంటారా?’ అని నాగబాబుని అడగ్గా.. హుందాగా స్పందించాల్సింది పోయి.. ‘ఈ వయసులో నాకు పెళ్లా.. మీరంతా ఓకే అంటే నాకు ఓకే’ అంటూ సమాధానం ఇచ్చారు నాగబాబు. తమ్ముడు విషయంలో చేసుకున్న మూడు పెళ్లిళ్ల విషయంలోనే సమాధానం చెప్పలేక నానా తిప్పలూ పడుతుంటూ.. ఇప్పుడు కొత్తగా ఈ వయసులో ఈ పెళ్లి ప్రస్తావనలు అవసరం అంటారా? నాగబాబు గారూ అంటూ సెటైర్లు వేస్తున్నారు నెటిజన్లు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3sDyb2y
v

బాలయ్యను మళ్లీ కెలికిన నాగబాబు.. మందు బాటిల్‌తో బ్రాండ్, బ్లడ్ అంటూ రచ్చ

మెగా బ్రదర్ ముక్కుసూటిగా మాట్లాడతారనే పేరుతో పాటు అనవసరమైన చౌకబారు వ్యాఖ్యలతో నవ్వుల పాలౌతుంటారనే విమర్శ కూడా ఉంది. ముఖ్యంగా నందమూరి నటసింహం విషయంలో నాగబాబు రగిల్చిన మంట నేటికీ చల్లారలేదు. తాజాగా మరోసారి బాలకృష్ణను సోషల్ మీడియా వేదికగా కెలికారు నాగాబాబు. ఈ మధ్యకాలంలో ఇన్‌స్టాగ్రామ్ లైవ్ చాట్‌లో పాల్గొంటున్న నాగబాబు తన అభిమానులు అడిగే ప్రశ్నలకు సమాధానం ఇస్తున్నారు. అయితే నాగబాబు పర్సనల్ విషయాలతో పాటు సిల్లీ క్వచ్ఛన్స్‌కి కూడా గమ్మత్తైన ఆన్సర్‌లు ఇస్తూ హాట్ టాపిక్ అవుతుండగా ఓ నెటిజన్.. ‘మంచి కిక్ ఇచ్చే బ్రాండ్ పేరు చెప్పండి మాస్టారూ’? అని నాగబాబుని అడగ్గా.. మేన్సన్ హౌస్ బ్రాందీ బాటిల్‌ని షేర్ చేశారు నాగబాబు. అంతటితో ఆగకుండా.. ఆ బ్లడ్ వేరు.. ఆ బ్రాండ్ వేరు అంటూ బాలయ్య అభిమానుల్ని కెలికారు. నందమూరి బాలకృష్ణ తాగే బ్రాండ్.. మేన్సన్ హౌస్ బ్రాంది. చాలా సందర్భాల్లో ఈ విషయాన్ని ఆయనే స్వయంగా చెప్పారు. ఇక తరచూ తన వంశం గురించి, బ్లడ్ గురించి మాట్లాడుతూ ఉంటారు బాలయ్య. అయితే నాగబాబు బాలయ్య బ్రాండ్‌ని షేర్ చేయడమే కాకుండా బ్లడ్ గురించి కూడా మాట్లాడటంతో ఇన్ డైరెక్ట్‌గా బాలయ్యని టార్గెట్ చేసినట్టు అర్థమౌతోంది. ఎన్నికల ముందు బాలకృష్ణను టార్గెట్ చేస్తూ.. అంతా నా ఇష్టం అంటూ యూట్యూబ్ ఛానల్‌లో పెద్ద రచ్చే చేశారు నాగబాబు. అసలు బాలయ్య అంటే ఎవరో తనకి తెలియదని.. ఆయన్ని వ్యక్తిగతం టార్గెట్ చేస్తూ వరుస వీడియోలను షేర్ చేసి బాలయ్యతో సై అంటే సై అని కాలుదువ్వారు. ఇక లాక్ డౌన్‌లో షూటింగ్‌ల నిమిత్తం ఇరు రాష్ట్రాల సీఎంలతో చిరంజీవి నేతృత్వంలో సినీ పెద్దలు పలు దఫాల చర్చలు జరపగా.. వాటికి బాలయ్యను ఆహ్వానించకపోవడంతో ఆయన ఫైర్ అయ్యారు. చిత్రీకరణ అంశాలపై ప్రభుత్వంతో సినీ పెద్దలు జరుపుతున్న చర్చల విషయం తనకు పేపర్లో వచ్చే వార్తల ద్వారా మాత్రమే తెలిసిందని.. భూములు పంచుకోవడానికి రియల్ ఎస్టేట్ కోసం ఈ చర్చలు జరుపుతున్నారంటూ బాలయ్య వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో అప్పట్లో కూడా నాగబాబు సీరియస్‌గానే రియాక్ట్ అయ్యారు. నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని.. బాలక్రిష్ణ ఇండస్ట్రీకి కింగ్ కాదు.. కేవలం హీరో మాత్రమే అని గుర్తించుకుని మాట్లాడాలని భవిష్యత్‌లో ఇలాంటి వ్యాఖ్యలు చేస్తూ చూస్తూ ఊరకోం అంటూ ఘాటుగా స్పందించారు నాగబాబు. అయితే తాజాగా ఇన్ స్టాగ్రామ్ చాట్ ద్వారా మరోసారి బాలయ్యను ఇన్ డైరెక్ట్‌గా కెలికినట్టైంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3dnmA1a
v

సుడిగాలి సుధీర్ పరువుదీసిన నాగబాబు..! మరీ దారుణంగా అలా అనేశాడేంటి? మెగా బ్రదర్‌ షాకింగ్ కామెంట్స్

జబర్దస్త్ షోలో ఉన్నంత కాలం అక్కడి టీం లీడర్స్, కంటెస్టెంట్లు ఆయన మీద.. మెగా ఫ్యామిలీ మీద ఎంత ప్రేమించారో అందరికీ తెలిసిందే. ప్రతీ స్కిట్లలో మెగా భజన కూడా ఎక్కువగా ఉండేది. కొందరైతే ఏకంగా చిరంజీవి, పవన్ కళ్యాణ్‌ల మీదే స్కిట్లు వేసేశారు. ఇక అందరూ కూడా మెగా అభిమానులే అని చెప్పుకునే వారు. అలా కొందరు నాగబాబుకు చాలా దగ్గరయ్యారు. అందులో సుధీర్, గెటప్ శ్రీను, రాం ప్రసాద్, హైపర్ ఆది ఇలా చాలా మంది సన్నిహితులుగా మారారు. ఆ మధ్య మెగా ఈవెంట్లు ఎక్కడున్నా సరే వీరు వచ్చేవారు. మెగా ఇంట్లో ఒకరిలా బాగానే ఉన్నారు. అయితే నాగబాబు జబర్దస్త్‌ను వీడి వచ్చిన సమయంలో వీరంతా హ్యాండ్ ఇచ్చారు. నాగబాబు అంటే ప్రాణం, ఏదైనా చేస్తాం అని చెప్పుకునే సుధీర్, శ్రీను, రాం ప్రసాద్, ఆదిలు జబర్దస్త్‌లోనే ఉండిపోయారు. బాండ్, అగ్రిమెంట్లకు భయపడి అక్కడే ఉన్నారని ఆ మధ్య టాక్ కూడా నడిచింది. అయితే వారు నాగబాబుతో మాత్రం ఇంకా మంచి సంబంధాలు కొనసాగిస్తున్నారని తెలుస్తోంది. ఎందుకంటే నిహారిక పెళ్లిలో గెటప్ శ్రీను తెగ సందడి చేశాడు. మెగా ఈవెంట్లలో ఇప్పటికీ హైపర్ ఆది కనిపిస్తున్నాడు. అయితే సుధీర్ విషయంలో మాత్రం ఏదో తేడా కొడుతోంది. సుధీర్‌కు మెగా ఫ్యామిలీకి మధ్య దూరం పెరిగినట్టు కనిపిస్తోంది. సుధీర్‌ను నాగబాబు దూరం పెట్టినట్టు తెలుస్తోంది. తాజాగా నాగబాబు తన ఫాలోవర్లతో ముచ్చట్లు పెట్టేశారు. నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు వెరైటీ సమాధానాలు ఇస్తూ వస్తున్నారు. అలా కొందరు జబర్దస్త్ మీద కూడా ప్రశ్నలు అడిగేశారు. మీకు రాం ప్రసాద్ ఇష్టమా? గెటప్ శ్రీను ఇష్టమా? అంటే గెటప్ శ్రీను ఫోటో పెట్టేసి ఆన్సర్ చెప్పేశాడు నాగబాబు. ఇక సుధీర్ గురించి ఏదైనా చెప్పండి సర్ అని ఓ నెటిజన్ అడిగాడు. ఆ ప్రశ్నకు నాగబాబు ఇచ్చిన సమాధానం ఎన్నో అనుమానాలు తెరపైకి తీసుకొచ్చింది. సుధీర్ అంటే అందరికీ తెలిసింది ఒక్కడే. అది జబర్దస్త్ . కానీ నాగబాబు మాత్రం వెరైటీగా.. శతకోటి సుధీరుల్లో ఏ సుధీరు గురించి నువ్వడిగేది అంటూ పరువు దీసేశాడు. అంటే ఈ లెక్కన సుధీర్ గురించి మాట్లాడటం నాగబాబుకు ఇష్టం లేనట్టు కనిపించింది. అందుకే శతకోటి బోడిలింగాల్లో అన్నట్టుగా అలా సుధీర్ మీద కామెంట్ చేసినట్టు అనిపిస్తోంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/31ub3rx
v

ఆ వార్తలు బాధించాయి.. ప్రేయర్‌తోనే నాన్న బతికారు: సుధాకర్ కొడుకు బెనిడిక్ మైఖేల్

ఇటీవల తన కొడుకు బెనిడిక్ మైఖేల్ (బెన్నీ) సినిమాల్లోకి వస్తున్నాడని ప్రకటన చేశారు సీనియర్ కమెడియన్, ప్రముఖ హీరో సుధాకర్. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో సుమారు 600 చిత్రాలకు పైగా నటించి.. స్టార్ హోదా అనుభవించిన సుధాకర్.. అనారోగ్య సమస్యలతో సినిమాలకు దూరం అయ్యారు. బ్రెయిన్ స్టోక్ రావడంతో కోమాలోకి వెళ్లిన ఆయన.. ప్రస్తుతం ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నారు. మెగాస్టార్ చిరంజీవి రూమ్ మేట్ అయిన సుధాకర్‌కి ఇండస్ట్రీలోని స్టార్ హీరోలందరితోనూ మంచి అనుబంధం ఉంది. అనారోగ్యంతో ఉన్న సుధాకర్ పూర్తి స్థాయిలో కోలుకోలేకపోవడంతో సినిమాలకు రిటైర్‌మెంట్ ప్రకటించారు. ఇక సినిమాలు చేసే ఉద్దేశం లేదని చెప్పిన ఆయన.. తన కొడుకు బెన్నీ సినిమాల్లోకి రావాలనే కోరికతో ఉన్నాడని.. తన బ్లడ్‌లోనే నటన ఉందని అంటున్నాడంటూ కొడుకు అరంగేట్రంపై క్లారిటీ ఇచ్చారు సుధాకర్. ఇక బెన్నీ టాలీవుడ్ ఎంట్రీపైనా.. తన తండ్రి అనారోగ్యం పాలైనప్పుడు ఎదుర్కొన్న ఇబ్బందులపై ఓపెన్ అయ్యారు. ‘నేను డిగ్రీ మేనేజ్‌మెంట్ చేసి.. అమెజాన్‌లో జాబ్ చేస్తున్నా.. ఉద్యోగం చేయడం ఇష్టం లేదు.. చేయాలని చేస్తున్నా.. అంతే. నాకు యాక్టింగ్ అంటే ఇష్టం. మొదటి నుంచి నాన్నగారు నా లైఫ్ నాకే వదిలేశారు. నీకు నచ్చింది చేయమని చెప్పారు. నేను చాలామందికి సుధాకర్ కొడుకుని అని తెలియదు. వాళ్లే నాన్న చేసిన సినిమాల గురించి చెప్తుంటే హ్యాపీగా ఉంటుంది. నాన్నకి హెల్త్ బాలేకపోయినప్పుడు చాలా ఫీల్ అయ్యేవాళ్ళం. నేను అప్పుడు పదో తరగతి చదువుతున్నా.. కానీ న్యూస్ ఛానల్స్‌లో ఏవేవో వార్తలు వచ్చేవి. వాటిని చూసి చాలా బాధ వేసేది. భయం కలిగేది. కానీ చర్చ్‌కి వెళ్లి ప్రేయర్స్ చేయడం వల్ల నాన్నగారు చాలావరకూ రికవరీ అయ్యారు. ఆయన త్వరగానే కోలుకున్నారు. ప్రస్తుతానికైతే నాకు యాక్టింగ్ చేయాలని ఉంది. నాన్నగారు టిప్స్ చెప్తున్నారు. నటనలో ట్రైనింగ్ తీసుకుంటున్నా. వర్క్ షాప్ నడుస్తుంది. నరేష్ అనే కొత్త దర్శకుడు కథ చెప్పాడు.. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతుంది. కేవలం హీరోగానే చేయాలని లేదు.. నాన్నగారిలా ఏ పాత్ర చేసినా మంచి పేరు తెచ్చుకోవాలని ఉంది. ఏ పాత్ర వచ్చినా చేస్తా’ అని అన్నారు కమెడియన్ సుధాకర్ కొడుకు బెన్నీ (బెనిడిక్ మైఖేల్).


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/39nVLc4
v

చీర పైకెత్తి రెచ్చిపోయిన శ్రీయ.. పబ్లిక్ గానే అతనిపై ముద్దుల వర్షం.. బాబోయ్! మరీ ఈ రేంజ్‌లోనా..

టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ శరణ్ ఈ మధ్యకాలంలో తెగ రెచ్చిపోతోంది. సినిమాలకు కాస్త బ్రేక్ ఇచ్చిన ఈ అమ్మడు ఫొటోలు, వీడియోలతో నెటిజన్లకు స్పెషల్ ట్రీట్ ఇస్తోంది. ఎక్కువగా క్లీవేజ్ వీడియోలనే షేర్ చేస్తూ కుర్రకారుకు కిక్కిస్తూనే తన భర్త ఆండ్రూ కొశ్చివ్‌తో చిల్ అవుతున్న పిక్స్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. విహారయాత్రకు వెళ్లినా, ఇంట్లో ఉన్నా, వర్షం పడినా హుషారుగా చిందులేసే ఈ అమ్మడు తాజాగా హొలీ వేడుకల్లో తడిసి ముద్దయింది. నార్త్ ఇండియన్ కల్చర్‌లో హొలీ పండగను ఘనంగా జరుపుకుంటారు. ఈ క్రమంలోనే ఉత్తర ప్రదేశ్ లోని డెహ్రడూన్‌లో పుట్టి పెరిగిన శ్రీయ.. తన భర్తతో కలిసి హోలీ వేడుకను గ్రాండ్‌గా జరుపుకుంది. రంగుల్లో మునిగి తేలుతునే నార్త్ ఇండియన్ ట్రెడీషనల్ వేర్‌లో కనిపించి అట్రాక్ట్ చేసింది. డాన్స్ చేస్తూ ఎంజాయ్ చేయడంలో తనకు సాటెవ్వరూ రారు అని ఇప్పటికే పలుసార్లు ప్రూవ్ చేసుకున్న ఆమె, ఈ వేడుకలో రెచ్చిపోయి చిందులేయడం హాట్ టాపిక్ అయింది. చీర పైకెత్తి హుషారుగా చిందేసిన శ్రీయ.. భర్తతో కలిసి స్టెప్పులేస్తూ రొమాంటిక్‌గా తన కౌగిలిలో అతన్ని చుట్టేసింది. అంతటితో ఆగక పబ్లిక్ గానే ఆయనపై ముద్దుల వర్షం కురిపించింది. అక్కడితో కూడా సరిపెట్టని ఈ ముద్దుగుమ్మ ఈ వీడియోను తన సోషల్ మీడియా వాల్‌పై పోస్ట్ చేస్తూ హొలీ శుభాకాంక్షలు తెలిపింది. దీంతో వెంటనే ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారి తెగ చెక్కర్లు కొడుతోంది. ఇది చూసి 'బాబోయ్! శ్రీయ ఎనర్జీ మరీ ఈ రేంజ్‌లో ఉందా' అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇకపోతే సినిమాలకు పెళ్లి అడ్డు కాదు అన్నట్లుగా పెళ్లి తర్వాత కూడా అదే జోష్‌లో సినిమాలు చేస్తోంది శ్రీయ. ప్రస్తుతం ఈ సీనియర్ స్టార్ హీరోయిన్ దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక మూవీ RRRలో నటిస్తోంది. ఇందులో బాలీవుడ్ హీరో అజయ్ దేవగన్‌కి జోడీగా కీలకపాత్రలో కనిపించబోతోంది శ్రీయ.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2PaMu0j
v

కరోనా తెచ్చిన తంటా.. గవర్నమెంట్ నిర్ణయంతో 'ఖిలాడి'కి షాక్.. నిలిచిపోయిన రవితేజ న్యూ మూవీ!!

గతేడాది సినీ ఇండస్ట్రీకి చుక్కలు చూపించిన కరోనా మహమ్మారి మరోసారి పంజా విసరడం ప్రారంభించింది. దేశవిదేశాల్లో కరోనా సెకండ్ వేవ్ కొనసాగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఇక కోవిడ్ ఇబ్బందులు పోయినట్లే అనుకున్న తరుణంలోనే షాకిస్తూ కొత్త కేసులు నమోదవుతుండటం అందరినీ అయోమయంలో పడేసింది. ఈ క్రమంలో నేరుగా కరోనా షాక్ కొత్త సినిమా 'ఖిలాడీ'కి తగిలిందని తెలుస్తోంది. ఏ స్టూడియోస్‌, పెన్‌ స్టూడియోస్‌ పతాకాలపై సత్యనారాయణ కోనేరు నిర్మిస్తున్న ఈ చిత్రానికి రమేశ్‌ వర్మ దర్శకత్వం వహిస్తుండగా.. రవితేజ సరసన మీనాక్షి చౌదరి, డింపుల్‌ హయతి హీరోయిన్లుగా నటిస్తున్నారు. రాక్‌స్టార్ దేవీ శ్రీ ప్ర‌సాద్ సంగీతం అందిస్తున్నారు. గత కొంతకాలంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా ప్రస్తుతం ఇటలీలో సెట్స్‌పై ఉంది. అక్కడ కొన్ని రోజులపాటు షూటింగ్ జరుపుకోగా తాజా పరిస్థితుల నేపథ్యంలో షూటింగ్ నిలిపివేయాల్సి వచ్చిందట. ఇటీవల క‌రోనా కేసులు మ‌ళ్లీ పెరుగుతున్న కారణంగా అక్కడి ప్రభుత్వం లాక్‌డౌన్ విధించింది. దీంతో మాస్ మహారాజా మూవీ షూటింగ్‌కి బ్రేక్స్ పడ్డాయని సమాచారం. పరిస్థితి ఇప్పట్లో అదుపులోకి వస్తుందో రాదో క్లారిటీ లేకపోవడంతో చిత్రయూనిట్ తిరిగి హైదరాబాద్‌కి పయనమైందని విశ్వసనీయ వర్గాల సమాచారం. సస్పెన్స్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌‌గా రవితేజ కెరీర్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న ఈ సినిమాపై అంతా స్పెషల్ కేర్ తీసుకుంటున్నారట. చిత్రంలో యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా, బుల్లితెర హాట్ యాంకర్ అనసూయ భరద్వాజ్ కీలకపాత్రల్లో కనిపించనున్నారు. ఇటీవలే రిలీజ్ చేసిన ఈ మూవీ ఫస్ట్‌లుక్ పోస్టర్, రవితేజ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన గ్లింప్స్ ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ పొందడంతో సినిమాపై హైప్ క్రియేట్ అయింది. సో.. చూడాలి మరి అన్నట్లుగానే మే 28న ఈ సినిమాను విడుదల చేస్తారా? లేక షూటింగ్ డిలే కారణంగా వాయిదా వేస్తారా? అనేది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2PKoXCY
v

గన్ ఇలా పట్టుకోవాలి.. అందమైన యాంకర్లకు నాగార్జున ట్రైనింగ్, 61 ఏళ్లొచ్చినా మన్మథుడి గురి తప్పట్లేదు!

టాలీవుడ్ మన్మథుడు ‘’ మూవీ రిలీజ్‌కి రెడీ అయ్యింది. ఏప్రిల్ 2న భారీ అంచనాలతో ప్రేక్షకులకు ముందు వస్తున్న ఈ మూవీ ప్రమోషన్స్‌లో బిజీ అయ్యారు కింగ్ నాగార్జున. స్టార్ మా ఛానల్‌లో ప్రసారం అవుతున్న ‘స్టార్ట్ మ్యూజిక్’ కార్యక్రమంలో ‘వైల్డ్ డాగ్’ టీంతో కలిసి సందడి చేశారు నాగార్జున. అందమైన యాంకర్లతో గన్ ఎలా పట్టుకోవాలో నేర్పిస్తూ.. తన మన్మథ కళకు మరోసారి పదును పెట్టారు కింగ్ నాగార్జున. మంజూష, శ్యామల, సుమ, విన్ధ్యా విశాఖ మొదలైన అందమైన యాంకర్లకు గన్ ఎలా పట్టుకోవాలి? ఎలా షూట్ చేయాలి అన్న దానిపై ట్రైనింగ్ ఇచ్చి ఫుల్ ఎంటర్ టైన్ చేశారు నాగార్జున. అయితే మధ్యలో యాంకర్ రవి వచ్చి నాక్కూడా గన్ పట్టుకోవడం నేర్పించండి సార్ అని అడగ్గా.. హోపో అన్నట్టుగా నాగార్జున ఎక్స్ ప్రెషన్స్ ఇచ్చి లేడీ యాంకర్లపై మన్మథబాణం విసిరారు. ఈ ప్రోమోలో నాగార్జునతో పాటు.. వైల్డ్ డాగ్ మూవీ హీరోయిన్ దియా మీర్జా, అలీ రెజా తదితరులు సందడి చేశారు. మొత్తంగా ఎంతమంది ఉన్నప్పటికీ 60 ఏళ్ల వయసులో కూడా గ్రీకువీరుడిగా కనిపించి స్పెషల్ అట్రాక్షన్ అయ్యారు కింగ్ నాగార్జున. ఇక వైల్డ్ డాగ్ మూవీ విషయానికి వస్తే.. ఈ మూవీలో నాగార్జున డేర్ డెవిల్ ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్ ఏసీపీ విజయ్ వర్మ పాత్రలో నటిస్తుండగా.. ఆయన సరసన దియామీర్జా హీరోయిన్‌గా నటిస్తోంది. సయామీ ఖేర్ కీలక పాత్ర పోషిస్తున్నారు. అహిషోర్ సాల్మోన్ ద‌ర్శక‌త్వం వహిస్తున్నారు. మ్యాట్నీ ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై నిరంజన్‌రెడ్డి, అన్వేష్‌రెడ్డి సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం ఏప్రిల్ 2న రిలీజ్ కానుంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3u5CCUb
v

Anu Emmanuel: అల్లు వారబ్బాయితో డేటింగ్.. ఇద్దరి మధ్య ముదిరిన లవ్ ట్రాక్! అనుమానాలు పెంచిన వీడియో

హీరోహీరోయిన్ల మధ్య లవ్ ట్రాక్స్, డేటింగ్ వ్యవహారాలు నడవడం కామనే. బాలీవుడ్‌లో అయితే ఈ కల్చర్ మరీ ఎక్కువ. అయితే ఇటీవలి కాలంలో ఈ పోకడ టాలీవుడ్ ఇండస్ట్రీలోనూ బాగానే విస్తరించింది. పలువురు హీరో హీరోయిన్స్ మధ్య లవ్ ట్రాక్స్ నడుస్తున్నాయంటూ వస్తున్న వార్తలే ఇందుకు నిదర్శనం. తాజాగా అలాంటి ఓ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. యంగ్ హీరోయిన్ బర్త్ డే సందర్భంగా చేసిన ఓ కామెంట్‌తో సినీ సర్కిల్స్‌లో చర్చలు ముదిరాయి. టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలరే అయినా డేటింగ్ వ్యవహారాల పట్ల కాస్త దూరంగా ఉండే అల్లు శిరీష్.. ఇప్పుడు యంగ్ హీరోయిన్ అను ఇమ్మాన్యుయేల్ మాయలో పడిపోయాడని తెలుస్తోంది. అను ఇమ్మాన్యుయేల్- శిరీష్ నడుమ సమ్‌థింగ్ సమ్‌థింగ్ నడుస్తోందంటూ ప్రచారాలు ఊపందుకున్నాయి. దీనంతటికీ ప్రధాన కారణం అల్లు వారబ్బాయి తన సోషల్ మీడియా వాల్‌పై పోస్ట్ చేసిన వీడియోనే కావడం గమనార్హం. మార్చి 28వ తేదీన అను ఇమ్మాన్యుయేల్ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆమెకు బెస్ట్ విషెస్ చెబుతూ ఓ వీడియో పోస్ట్ చేశాడు అల్లు శిరీష్. ఇందులో అనుతో శిరీష్ మెయిన్‌టైన్ చేసిన క్లోజ్ రిలేషన్ పలు అనుమానాలు రేకెత్తిస్తోంది. అంతేకాదు 'సైకో' అంటూ అనును ప్రేమగా కామెంట్ చేయడం చూసి వీళ్ళిద్దరూ లవ్ ట్రాక్ ఎక్కేశారని జనం అర్థం చేసుకుంటున్నారు. యంగ్ అండ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ కదా.. ఇలా చేస్తే ఆ మాత్రం డౌట్ రావడం సహజమే మరి. సో.. చూడాలి శిరీష్- అను డేటింగ్ అంటూ జోరుగా వస్తున్న వార్తలపై వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంటుందనేది!. ఇప్పటికే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో 'అజ్ఞాతవాసి', స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌తో 'నా పేరు సూర్య' సినిమాలు చేసి మెగా కాంపౌండ్ హీరోయిన్ అనిపించుకుంది అను ఇమ్మాన్యుయేల్. ఇక ఇప్పుడు అదే మెగా రెలేటివ్ అల్లు శిరీష్‌తో లవ్ ట్రాక్ నడిపిస్తుందని తెలుస్తుండటం సర్వత్రా ఆసక్తికరంగా మారింది. ఇటీవలే 'అల్లుడు అదుర్స్' సినిమాతో అలరించిన అను ఇమ్మాన్యుయేల్.. ప్రస్తుతం శర్వానంద్ హీరోగా రాబోతున్న 'మహా సముద్రం' సినిమాలో నటిస్తోంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3rC7PwF
v

సోహెల్‌ కొత్త అవతారం! ఐదో సీజన్ కోసం ఆ ఛాన్సు మనోడిదే.. ఇక రచ్చ మామూలుగా ఉంటుందా..?

నాల్గో సీజన్‌లో ఎన్నో వింతలు విచిత్రాలు జరిగిన సంగతి మనందరికీ తెలుసు. ఈ సీజన్ గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ ఎంతో రసవత్తరంగా జరిగింది. 25 లక్షల క్యాష్ పెట్టెను తీసుకుని ఆట నుంచి తప్పుకోవడం ఓ సెన్సేషన్. తెలుగు బిగ్ బాస్ హిస్టరీలో ఇలాంటి ఘటన జరగలేదు. అలా 25 లక్షలు తీసుకోవడంతో ఆటను యూటర్న్ తిప్పేశాడు. విన్నర్‌కు రావాల్సిన 50 లక్షల ప్రైజ్ మనీ లోంచి సగం తీసేసుకున్నాడు. చివరకు విన్నర్‌ కంటే ఎక్కువగా సోహెల్ లాభపడ్డాడు. అభిజిత్‌కు బిగ్ బాస్ ట్రోఫీ వచ్చింది. కానీ సోహెల్ మాత్రం హాట్ టాపిక్ అయ్యాడు. బిగ్ బాస్ ఫినాలే ఎపిసోడ్ నాడు సోహెల్ గురించి పెట్టిన చర్చ అంతా ఇంతా కాదు. ఫినాలే ఎపిసోడ్ నాడు సోహెల్, మెహబూబ్ ఎమోషనల్ డ్రామా, చిరంజీవి నాగ్‌లు చెక్కులు ఇస్తూ అదనంగా డబ్బులు ఇవ్వడంతో హాట్ టాపిక్ అయింది. అలా మొత్తంగా సోహెల్ మెహబూబ్‌లు నాటి ఎపిసోడ్‌లో 45 లక్షలు గెలిచినట్టు అయింది. బిగ్ బాస్ ట్రోఫీ విజేత అభిజిత్ అయితే.. క్యాష్ ప్రైజ్ విజేతగా సోహెల్ నిలిచాడు. ఎక్కువ డబ్బులు రావడంతో సోహెల్ విజేతగా అందరి దృష్టిలో పడ్డాడు. క్రేజ్‌లో మాత్రం సోహెల్ అభిజిత్ ఒకే లెవెల్‌లో ఉంటారు. సోహెల్ అందరినీ ఆకట్టుకుంటూ, నవ్విస్తూ ఎంటర్టైన్ చేస్తుంటారు. అలాంటి సోహెల్‌కు ఇప్పుడు మంచి ఆఫర్ వచ్చింది. ఇప్పటికే సోహెల్ వెండితెర మీద హీరోగా మెరిసేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు. ఈ క్రమంలో ఓ మంచి మాస్ సినిమాతో రాబోతోన్నాడు. అయితే తాజాగా వినిపిస్తున్న సమచారం మేరకు సోహెల్ బుల్లితెరపై హోస్ట్‌గా కనిపించబోతున్నాడు. బిగ్ బాస్ ఐదో సీజన్ బజ్‌కు సోహెల్ హోస్ట్‌గా వ్యవహరించబోతోన్నట్టు టాక్. మూడో సీజన్ బజ్‌ను తనీష్, నాల్గో సీజన్ బజ్‌ను రాహుల్ సిప్లిగంజ్ నడిపించిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఐదో సీజన్‌ బజ్‌ను సోహెల్ నడిపించబోతోన్నాడని సమాచారం. ఐదో సీజన్‌ను జూన్ నెలలో ప్రారంభించేందుకు బిగ్ బాస్ యూనిట్ కసరత్తులు చేస్తోందట.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3wcIVXN
v

Monday 29 March 2021

బోల్డ్ భామతో రొమాన్స్‌కి రెడీ అయిన మెగా మేనల్లుడు.. 'రొమాంటిక్' బ్యూటీతో అంతా సెట్..! యమ క్రేజీ

కొందరు హీరోలు మొదటి సినిమాతోనే స్టార్స్ అయిపోతుంటారు. అలాంటి లిస్టులో ముందుగా చెప్పుకోవాల్సిన పేరు . మెగా మేనల్లుడిగా, సాయి ధరమ్ తేజ్ తమ్ముడిగా సినీ గడప తొక్కిన ఈ యువ హీరో తన తొలి సినిమా 'ఉప్పెన'తో సముద్రమంత క్రేజ్ కొట్టేశాడు. తనదైన నటనతో తెలుగు ప్రేక్షకులను ఫుల్లుగా ఆకర్షించాడు. దీంతో ఆయనకు ఓవర్‌నైట్ స్టార్‌డం వచ్చేసింది. ఈ నేపథ్యంలో వైష్ణవ్ తేజ్‌కి ఆఫర్స్ వెల్లువెత్తుతున్నాయి. మెగా కాంపౌండ్ హీరో కోసం దర్శకనిర్మాతలు క్యూ కట్టేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా బయటకొచ్చిన ఓ అప్‌డేట్ ప్రేక్షకుల్లో యమ క్రేజీగా మారింది. 'ఉప్పెన'లో కృతి శెట్టితో పడవలో రొమాన్స్ చేసి రసిక ప్రియులను మత్తెక్కించిన వైష్ణవ్.. తన అప్‌కమింగ్ మూవీలో 'రొమాంటిక్' బ్యూటీ కేతిక శర్మతో జోడీ కట్టబోతున్నారట. ఉప్పెన తర్వాత ఇప్పటికే క్రిష్ దర్శకత్వంలో ఓ సినిమా కంప్లీట్ చేసిన వైష్ణవ్ తేజ్.. ఇటీవలే సీనియర్ నిర్మాత BVSN ప్రసాద్‌తో ఓ సినిమాకు కమిటయ్యారు. అర్జున్ రెడ్డి కథను తమిళ్‌లో రీమేక్ చేసిన దీన్ని డైరెక్ట్ చేయబోతున్నారు. ఇందులోనే కేతికను హీరోయిన్‌గా తీసుకున్నారని తెలుస్తోంది. ఈ మేరకు 'రొమాంటిక్' బ్యూటీతో సంప్రదింపుల కార్యక్రమాలు కూడా ఫినిష్ అయ్యాయని ఫిలింనగర్ టాక్. మొదటి సినిమాతో లక్కీ హీరో అనిపించుకున్న వైష్ణవ్‌తో సినిమా ఆఫర్ అనగానే ఏ మాత్రం ఆలోచించకుండా ఓకే అనేసిందట . దీంతో బోల్డ్ సీన్స్ దట్టించి నేటితరం ఆడియన్స్ కోరుకునే విధంగా ఈ మూవీ కథను మలిచే పనిలో పడ్డారట గిరీశయ్య. ప్రస్తుతం పూరి తనయుడు ఆకాష్ హీరోగా రూపొందుతున్న 'రొమాంటిక్' మూవీలో బోల్డ్ క్యారెక్టర్ చేస్తోంది కేతిక. సో.. చూడాలి మరి ఇదే నిజమైతే వైష్ణవ్ రొమాంటిక్ ట్రీట్ ఏ రేంజ్‌లో ఉంటుందనేది!.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3m3oesM
v

నితిన్ బర్త్ డే పార్టీలో సింగర్ సునీత హల్చల్.. చిల్ అయిన నవ దంపతులు.. రొమాంటిక్ ఫ్రేమ్స్ వైరల్

కరోనా వైరస్ విజృంభణ, లాక్‌డౌన్ కొనసాగుతున్న వేళ టాలీవుడ్ సెలబ్రిటీలు ఒక్కొక్కరుగా పెళ్లి పీటలెక్కేసిన సంగతి తెలిసిందే. గతేడాది జులై 26వ తేదీన హీరో ఓ ఇంటివాడయ్యాడు. తన ప్రేయసి షాలిని కందుకూరి మెడలో మూడు ముళ్ళేసి ఆమెలో సగభాగం అయ్యాడు. అప్పటినుంచి షాలినితో సరదాగా గడుపుతూనే వరుస సినిమాలు చేస్తున్న నితిన్.. పెళ్లి తర్వాత మొదటి పుట్టినరోజు వేడుక చేసుకున్నారు. నేడు (మార్చి 30) నితిన్ బర్త్ డే కావడంతో గత రాత్రి తన ఫ్యామిలీ, అత్యంత సన్నిహితులతో ఆయన పుట్టినరోజు వేడుక జరుపుకున్నారని తెలుస్తోంది. కోవిడ్ వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో కేవలం అత్యంత సన్నిహితుల మధ్య నితిన్ పుట్టినరోజు వేడుక జరుపుకున్నారట. ఈ వేడుకకు తన భర్తతో కలిసి హాజరు కావడం విశేషం. ఈ నవ దంపతులు అంతా కలిసి బర్త్ డే వేడుకలో చిల్ అయ్యారు. నితిన్ ఇంట్లోనే జరిగిన ఈ వేడుకలో సునీత భర్త రామ్ వీరపనేని ఫుల్ ఎంజాయ్ చేశారట. అనంతరం ఈ రెండు జోడీలు కలిసి కెమెరా ముందు పోజులిచ్చాయి. దీంతో నవ దంపతుల రొమాంటిక్ ఫ్రేమ్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నితిన్ బర్త్ డే సందర్భంగా పలువురు సెలబ్రిటీలు ఆయనకు విషెస్ తెలుపుతున్నారు. కాగా, సునీత భర్త రామ్‌తో నితిన్‌కి సన్నిహిత సంబంధాలున్నాయని గతంలోనే విన్నాం. పైగా సునీత- రామ్ వెడ్డింగ్ ఈవెంట్‌లో కూడా తన భార్య షాలినితో కలిసి రచ్చ చేశారు నితిన్. మళ్ళీ ఇప్పుడు ఓ స్పెషల్ డే సందర్భంగా ఈ రెండు జోడీలు కలవడం చూస్తుంటే వీరి మధ్య స్నేహబంధం ఎంత గట్టిదనేది తెలిసిపోతోంది. ఇక నితిన్ కెరీర్ అంటారా.. జయాపజయాలను పక్కనబెట్టి వరుస ప్రాజెక్ట్స్ చేస్తూ జోష్‌లో ఉన్నాడు. ఇటీవలే ''చెక్, రంగ్ దే'' సినిమాలతో ప్రేక్షకుల ముందుకొచ్చిన ఆయన జూన్ నెలలో తన లేటెస్ట్ ప్రాజెక్టు 'మాస్ట్రో'తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3wdc2dC
v

HBD Nithiin: మాస్ట్రో ఫస్ట్‌లుక్ రిలీజ్.. అనుమానాలు రేకెత్తిస్తున్న పోస్టర్!

నేడు (మార్చ్ 30) యంగ్ హీరో పుట్టినరోజు సందర్భంగా బెస్ట్ విషెస్ తెలుపుతూ ఆయన కొత్త సినిమా 'మ్యాస్ట్రో' ఫస్ట్‌లుక్ రిలీజ్ చేసింది చిత్రయూనిట్. ఈ ఏడాది వరుస సినిమాలను లైన్‌లో పెట్టిన నితిన్ ఇటీవలే 'చెక్' సినిమాతో డిజాస్టర్ మూటగట్టుకొని ఆ వెంటనే 'రంగ్ దే' మూవీతో డీసెంట్ హిట్ అందుకొని ఆకర్షించారు. ఇక ఇప్పుడు 'మ్యాస్ట్రో' అంటూ మరో డిఫరెంట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో నితిన్ సొంత బ్యానర్ అయిన శ్రేష్ఠ్ మూవీస్ బ్యానర్‌పై ఓ సినిమా చేస్తున్నట్లుగా గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమానే 'మ్యాస్ట్రో' అంటూ ఫస్ట్‌లుక్ బయటకు వదిలారు. ఇందులో నితిన్ అంధుడిగా కనిపించనుండటం విశేషం. కాగా, తాజాగా విడుదలైన ఈ పోస్టర్‌లో చేతిలో స్టిక్ పట్టుకొని నడుస్తున్న నితిన్ వెనకాలే రక్తపు మరకలు కనిపిస్తుండటంతో చిత్రంలో అతని క్యారెక్టర్ ఎలా ఉండబోతోంది? అనే అనుమానాలు మొదలయ్యాయి. ఇకపోతే నితిన్ 30వ సినిమాగా రాబోతున్న ఈ చిత్రంలో ఆయన సరసన ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్, మిల్కీబ్యూటీ తమన్నా హీరోయిన్లుగా నటిస్తుండగా.. యాంకర్ శ్రీముఖి కీలక పాత్రలో కనిపించనున్నారు. నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి, సోదరి నిఖితారెడ్డి నిర్మిస్తుండటం మరో విశేషం. మహతి స్వరసాగర్ సంగీతం అందిస్తున్నారు. జూన్ 11వ తేదీన ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా ఈ మూవీ రిలీజ్ కానుంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా అప్‌డేట్స్ మూవీపై హైప్ క్రియేట్ చేశాయి.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3rAfADo
v

Vakeel Saab: రిలీజ్‌లో టైమ్ గ్యాప్ అంతే! రికార్డుల్లో టైమింగ్ అదే.. ఆ పవర్‌తో బాహుబలి రికార్డ్స్ షేక్

పవర్ స్టార్ రీ- ఎంట్రీ మూవీ 'వకీల్ సాబ్' ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ కానున్న సమయం దగ్గరపడుతుండటంతో సోషల్ మీడియాలో ఆయన అభిమానుల హంగామా మామూలుగా లేదు. రెండేళ్ల టైమ్ గ్యాప్ తీసుకొని వెండితెరపై కనిపించనున్న నేపథ్యంలో ఆ క్షణం కోసం వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. ఇంతలో చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా నిన్న (సోమవారం) సాయంత్రం రిలీజ్ చేయడంతో దీనికి ఓ రేంజ్ స్పందన వస్తోంది. లాయర్ అవతారంతో పవన్‌ని చూసి ఊగిపోతోంది మెగా లోకం. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా పవన్ ఫ్యాన్స్ రచ్చే కనిపిస్తోంది. ‘మీరు వర్జినా అని అమ్మాయిలను అడగొచ్చు.. మేం అబ్బాయిలను అడగొద్దా? ఏం న్యాయం నందాజీ’ అంటూ కోర్టులో పవన్ వేసిన కౌంటర్స్ చిత్ర విడుదలకు ముందే గోల పెట్టిస్తున్నాయి. ఇక రికార్డులకు పెట్టింది పేరు అని ఇది వరకే నిరూపించుకున్న పవన్.. అదే జోష్ కంటిన్యూ చేస్తున్నారు. తాజాగా విడుదలైన 'వకీల్ సాబ్' ట్రైలర్ సోషల్ మీడియాను షేక్ చేస్తూ పలు రికార్డులు తిరగరాస్తోంది. విడుదలైన క్షణం నుంచే స్పీడ్ పెంచేసిన వకీల్ సాబ్ ట్రైలర్ మొదటి 115 నిమిషాల్లో 500K లైక్స్ సంపాదించింది. ఇక వ్యూస్ అయితే చెప్పాల్సిన పనే లేదు.. జెట్ స్పీడులో వస్తున్నాయి. ఇక మొదటి 236 నిమిషాల్లో 658K లైక్స్ సంపాదించి టాలీవుడ్‌లో ఇంత త్వరగా ఇన్ని లైక్స్ పొందిన ట్రైలర్‌గా రికార్డు క్రియేట్ చేసింది. దీంతో ఇన్నాళ్లు బాహుబలి పేరిట ఉన్న రికార్డ్ సైతం తుడిచిపెట్టుకుపోయింది. ప్రెజెంట్ ఈ ట్రైలర్ జోష్ చూస్తుంటే మొదటి 24 గంటల్లో ఎవ్వరికీ అందనంత దూరంలో అరుదైన రికార్డ్ నమోదు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయని అంటున్నారు సినీ విశ్లేషకులు. వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించిన 'వకీల్ సాబ్' చిత్రంలో పవన్ కళ్యాణ్‌కు జోడీగా శృతి హాసన్ నటించారు. నివేదా థామస్, అంజలి, అనన్య నాగళ్ల ఇతర ముఖ్యపాత్రలు పోషించారు. తమన్ సంగీతం సమకూరుస్తోన్న ఈ చిత్రాన్ని బోనీ కపూర్ బే వ్యూ ప్రాజెక్ట్స్ సౌజన్యంతో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు, శిరీష్ నిర్మించారు. ఏప్రిల్ 9న ఈ మూవీ భారీ ఎత్తున రిలీజ్ కానుంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3u0gr1y
v

Varsha: ఆమెతో హైపర్ ఆది డబుల్ మీనింగ్ డైలాగ్.. షూటింగ్ స్పాట్‌లో ఘర్షణ.. వర్ష షాకింగ్ డిసీజన్!!

గత ఏడేళ్లకు పైగా అలుపెరగని జర్నీ కొనసాగిస్తూ నవ్వుల్లో ముంచెత్తుతోంది జబర్దస్త్ ప్రోగ్రామ్. యాంకర్స్, జడ్జెస్, కమెడియన్స్ మారినా అందులో వేసే పంచులు, డబుల్ మీనింగ్ డైలాగ్స్ మాత్రం మారడం లేదు. మరోవైపు ఇదే జబర్దస్త్ ప్రోగ్రామ్ సామాన్యులను సైతం సెలబ్రిటీలను చేస్తోంది. ఈ వేదికపై సత్తా చాటి వెండితెర ఛాన్సులు పట్టేసిన కమెడియన్స్ లిస్ట్ పెద్దదే. అయితే ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఎపిసోడ్స్ ప్రోమోలతో ఆసక్తి రేకెత్తించే జబర్దస్త్ మేనేజ్‌మెంట్ తాజాగా ఏప్రిల్ 2వ తేదీ షో తాలూకు ప్రోమో రిలీజ్ చేసింది. ఈ వీడియోలో పంచుల సంగతి అటుంచితే కారణంగా ఇద్దరు టీమ్ లీడర్ల మధ్య జరిగిన గొడవ చూసి షాక్ అవుతున్నారు జనం. ఈ మధ్యకాలంలో జబర్దస్త్ ద్వారా ఫుల్ ఫేమస్ అవుతున్న వర్ష ఆత్మహత్యకు ప్రయత్నించిన సీన్ చూసి అంతా ఆశ్చర్యపోయారు. కెవ్వు కార్తీక్‌తో స్కిట్ చేస్తున్న వర్ష.. అతన్ని ఫూల్ చేయబోయింది. దీంతో మధ్యలో కలుగజేసుకున్న జడ్జ్ రోజా ‘మీరూ మీరూ ఫూల్స్ చేసుకోవడం కాదు. బయట ఉన్న టీమ్ లీడర్లను, కంటిస్టెంట్లను ఫూల్స్ చేయండి' అని చెప్పింది. దీంతో మొదట వద్దకు వెళ్లి యాక్సిడెంట్ డ్రామా వేసింది వర్ష. మరి హైపర్ ఆది ఊరుకుంటాడా.. డబుల్ మీనింగ్ డైలాగులతో రివర్స్ పంచులేసి అక్కడి నుంచి పంపించాడు. ఆ తర్వాత చంటితో ప్రాంక్ చేసింది వర్ష. 'డైలాగులు వాడు చెబితే చేయడం కాదు నువ్ పర్ఫెక్ట్‌గా ప్రాక్టీస్ చేసుకో.. అన్నీ చెబుతారా' అంటూ వర్షకు చెప్పాడు చంటి. దీంతో కోపంతో అక్కడినుంచి వెళ్లి బిల్డింగ్ పైకి ఎక్కి దూకుతా అని బెదిరించింది వర్ష. అప్పుడు చంటి భయపడటం చూసి కిందకు వచ్చి ఏప్రిల్ ఫూల్ అనేసింది. దీంతో చంటికి చిర్రెత్తే కోపం వచ్చి కార్తీక్‌పై గొడవ చేశాడు. ఆ తర్వాత చాలా మంది గుమిగూడారు. ఇద్దరు టీమ్ లీడర్లు కొట్టుకున్నారు. అది చూసి రోజా, రష్మీ షాక్ అయ్యారు. సో.. చూడాలి మరి ఈ ఎపిసోడ్‌లో ఏం చూపిస్తారనేది!.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3dduOZW
v

కడుపే కదా మళ్లీ వస్తుందిలే అనుకున్నా.. చివరికి పిల్లల్లేకుండా పోయారు: నటి శ్రీలక్ష్మి

నా జీవితంలో ఆనందానికి, విషాదానికి నేనే జవాబు దారీ అంటున్నారు సీనియర్ నటి, లేడీ కమెడియన్, హీరోయిన్ శ్రీలక్ష్మి. ఇటీవల ఒక యూట్యూబ్ ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన పర్సనల్ లైఫ్ విషయాలను షేర్ చేసుకున్న తన తండ్రి మరణానికి గల కారణం? ఆయన ఎందుకు చనిపోయారు? ఎవరు మోసం చేశారు అన్న విషయాలను బయటపెట్టారు. తన జీవితం గురించి ఆలోచిస్తే.. తప్పుచేశాననే ఫీలింగ్ కలుగుతుందని అన్నారు. నాకంటూ ఫ్యామిలీ బాండింగ్ లేకుండా పోయిందే అని బాధ వెంటాడుతుందని అన్నారు శ్రీలక్ష్మి. దేవుడు ప్రతి ఒక్కరికీ ఒక కొరత పెడతాడు. ఎలాంటి కొరత లేదు అంటే వాడు మనిషే కాదు.. నాకైతే దేవుడు పిల్లలు లేకుండా చేశాడు. నేను నా సుఖాన్ని చూసుకుని వెళ్లిపోవడం కరెక్ట్ కాదని ఆలోచించి.. బాధ్యతలు బరువులు తీసుకుని పిల్లలు ఏం ఉందిలే కావాలనుకుంటే మళ్లీ కనొచ్చని అనుకున్నాను. కడుపే కదా మళ్లీ వస్తుందిలే అనుకున్నా.. కానీ తల్లకిందులైనా సరే మళ్లీ తల్లిని కాలేకపోయా. స్పైరల్ ఆపరేషన్ జరిగింది.. థైరాయిడ్ వచ్చేసింది.. ఏజ్ పెరిగిపోయి చాలా ఇబ్బందులు వచ్చేశాయి. దీంతో ఆ ఆనందానికి ఫుల్ స్టాప్ పెట్టేశా. ఆరోజుల్లో ఆర్టిస్ట్‌లు త్యాగం చేయడానికి ప్రాణం ఇచ్చేవాళ్లు.. ఈరోజుల్లో అలా ఏం లేదు’ అంటూ తన పర్సనల్ లైఫ్ విషయాలను షేర్ చేసుకున్నారు నటి శ్రీలక్ష్మి.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/31rdAT5
v

‘వకీల్ సాబ్’ ట్రైలర్: నువ్ వర్జిన్‌వా.. ఇదేం న్యాయం నందాజీ.. కూర్చోండి ఇక చాలు!

పవర్ స్టార్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన ‘’ ట్రైలర్ వచ్చేసింది. ‘కోర్టులో వాదించడం తెలుసు.. కోటు తీసి కొట్టడమూ తెలుసు’ అంటూ టీజర్‌తో తన పాత్ర ఎలా ఉండబోతుందోనన్న దానిపై హింట్ ఇచ్చిన పవన్ కళ్యాణ్.. ట్రైలర్‌లో విశ్వరూపం చూపించారు. కోర్టు సీన్ల నేపథ్యంలో ఈ ట్రైలర్ ఆద్యంతం ఆసక్తిగా ఉంది. నువ్ వర్జిన్‌వా అని క్రిమినల్ లాయర్ ప్రకాష్ రాజ్.. నివేదా థామస్‌ని ఇబ్బంది పెట్టేలా ప్రశ్నలు అడగడం.. ఆ తరువాత ముగ్గురు యువతలకు జరిగిన అన్యాయాన్ని ట్రైలర్‌లో చూపించారు. ఈ కేసు నిమిత్తం వాదించడానికి కోర్టులోకి ఎంట్రీ ఇచ్చిన పవర్ స్టార్.. లాయర్ (నందా) ప్రకాష్ రాజ్‌ని ముప్పుతిప్పలు పెట్టారు. ‘సరిగ్గా చెప్పండి.. ఏం చెప్పారు? ఏం చేశారు’? అంటూ కోర్టులో బలంగానే వాదనను వినిపించారు వకీల్ సాబ్. అలా జరగొద్దు జరగకూడదు పవర్ స్టార్ చెప్పే పవర్ ఫుల్ డైలాగ్‌తో పాటు.. చివర్లో అదిరిపోయే పంచ్ కూడా ఉంది. ‘నువ్ వర్జిన్‌వా.. మీరు అమ్మాయిల్ని అడగొచ్చు.. నేను అబ్బాయిల్ని అడగకూడదా? ఏం న్యాయం నందాజీ ఇది.? కూర్చోండి.. కూర్చోండి చాలు’ అంటూ ప్రకాష్ రాజ్‌కి పంచ్ ఇచ్చారు పవర్ స్టార్. పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ మూవీ కావడంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ అంచనాలకు తగ్గట్టుగానే ఈ సినిమా టీజర్, సాంగ్స్ మరింత హైప్ తీసుకుని వచ్చాయి. బాలీవుడ్ బ్లాక్ బస్టర్ మూవీ ‘పింక్’కు రీమేక్‌గా రూపొందిన ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ పవర్ ఫుల్ వకీల్‌ (లాయర్)గా కనిపిస్తున్నారు. శ్రీరామ్ వేణు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్‌కు జోడీగా శ్రుతిహాసన్ నటించారు. నివేదా థామస్, అంజలి, అనన్య నాగళ్ల ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. తమన్ సంగీతం సమకూరుస్తోన్న ఈ చిత్రాన్ని బోనీ కపూర్ బే వ్యూ ప్రాజెక్ట్స్ సౌజన్యంతో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు, శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/31GRgoZ
v

'లైఫ్‌లో మజా కోసం' బిగ్‌బాస్ బ్యూటీతో హర్భజన్ సింగ్.. కాలేజీ ముచ్చట్లు చెబుతూ క్రేజీ వీడియో

స్పిన్ బౌలింగ్‌తో టీమిండియా అద్బుతమైన విజయాల్లో భాగమైన క్రికెట్ కింగ్ వెండితెరపై సందడి చేయబోతున్నారు. యాక్షన్ కింగ్ అర్జున్‌తో కలిసి "" సినిమా చేస్తున్నారు. వారిద్దరినీ దృష్టిలో పెట్టుకొని ఈ సినిమాకు 'సింగ్ అండ్ కింగ్' అనే ఆసక్తికర ట్యాగ్ లైన్ పెట్టారు. ఆర్.కె ఎంటర్ టైన్మెంట్స్ సమర్పణలో శ్రీ లక్ష్మీ జ్యోతి క్రియేషన్స్ పతాకంపై ఈ సినిమా రూపొందుతోంది. చిత్రానికి ఏ.ఎన్. బాలాజీ నిర్మాతగా వ్యవహరిస్తుండగా.. 'జాన్ పాల్ రాజ్-శ్యామ్ సూర్య' సంయుక్తంగా దర్శకత్వం వహిస్తున్నారు. బిగ్‌బాస్ ఫేమ్, మాజీ 'మిస్ శ్రీలంక' హీరోయిన్‌గా నటిస్తోంది. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రంలో ప్రముఖ తమిళ నిర్మాత జె.సతీష్ కుమార్ (జెఎస్ కె) విలన్‌గా నటిస్తున్నారు. పలు సినిమాలతో గుర్తింపు దక్కించుకున్న కమెడియన్ సతీష్ కీలకపాత్ర పోషిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా టైటిల్ లోగోను మంత్రాలయం పీఠాధిపతి శ్రీ సుభుదేంద్ర తీర్ధ స్వామి మంత్రాలయంలో విడుదల చేసి ఆసక్తిరేకెత్తించారు. 25 కోట్ల రూపాయల భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ మూవీ షూటింగ్ చేస్తూనే ప్రమోషన్స్ చేపడుతోంది చిత్రయూనిట్. ఇందులో భాగంగా తాజాగా 'లైఫ్‌లో మజా కోసం' అనే పాట రిలీజ్ చేశారు. కాలేజీ ముచ్చట్లతో శరత్ సంతోష్ పాడిన ఈ పాట యూత్ ఆడియన్స్‌ని అట్రాక్ట్ చేస్తోంది. ఈ చిత్రానికి శాంతకుమార్ సినిమాటోగ్రఫీ చేపట్టగా డి.ఎం.ఉదయ్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. చిత్రాన్ని పలు ఇండియన్ భాషల్లో విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3sz5UdE
v

మళ్లీ అడ్డంగా బుక్కైన బండ్ల గణేష్.. దానికి ఫైన్ కట్టి నెట్టింట్లో నవ్వులపాలు.. దారుణమైన ట్రోలింగ్స్

మహా కూటమి ఓడిపోతే.. 7’O Clock బ్లేడ్‌తో పీక కోసుకుంటా. ఇది నా ఛాలెంజ్.. రాస్కోరా సాంబా!! హెడ్ లైన్స్‌లో పెట్టుకుంటావో.. బ్యానర్ ఐటమ్‌ గా వేసుకుంటావో నీ ఇష్టం. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి ఖాయం అంటూ సవాల్ చేసి అప్పట్లో పొలిటికల్ జోకర్‌గా మిగిలిపోయారు . ఆ తరువాత ఈ పాలిటిక్స్‌కి ఆ 7’O Clock బ్లేడ్‌‌కి ఓ దండం రా నాయనా.. బుద్దొచ్చింది.. ఇక రాజకీయాల్లోకి చచ్చినాపోను.. నా సినిమాలు నేను చేసుకుంటా అంటూ బండ్ల గణేష్ తిరిగి సినిమాలపై ఫోకస్ పెట్టారు. అయితే అప్పుడంటే సినిమాలు, ఈవెంట్లూ అవీ ఇవీ ఉండేవి కాబట్టి బండ్ల గణేష్ ఏదో ఒక స్టేజ్‌పై కామెడీ చేసేశారు. ప్రస్తుతానికైతే సినిమాలేం లేవు కాబట్టి.. ట్విట్టర్ ద్వారానే అభిమానులతో టచ్‌లో ఉంటున్నారు. తరచూ బండ్ల గణేష్ సోషల్ మీడియాలో జోరుగా దూసుకుపోతుంటారు. ఒక్కోసారి ఆ స్పీడ్‌లో యాక్సిడెంట్‌లు కూడా అవుతుంటాయి. ఆయన మీదే ట్రోలింగ్ రూపంలో దాడి జరుగుతూ ఉంటుంది. సోషల్ మీడియాను ఎలా వాడాలో తెలీక కొన్ని సార్లు.. భాష రాక ఇంకొన్ని సార్లు తెగ ఇబ్బందులు పడుతుంటాడు. అలా ఎన్నో సందర్భాల్లో సోషల్ మీడియాలో దారుణమైన ట్రోలింగ్‌ను బండ్ల గణేష్ ఎదుర్కొన్నారు. సోషల్ మీడియాను ఎలా హ్యాండిల్ చేయాలో తెలియక.. ఆ మధ్య పవన్ కళ్యాణ్‌ను తిట్టిన, వ్యతిరేకంగా వచ్చిన ట్వీట్‌ను లైక్ చేసేశారు. ఆ సందర్భంగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ బండ్లన్నను ఆడుకున్నారు. తప్పు తెలుసుకున్న బండ్ల గణేష్ త్వరగానే సరిదిద్దుకున్నాడు. ట్విట్టర్ ఎలా వాడాలో తెలియక జరిగిన తప్పు అని వివరణ ఇవ్వడంతో అభిమానులు శాంతించారు. ఇక బండ్ల గణేష్ పెట్టే ట్వీట్లు అందరినీ నవ్విస్తుంటాయి. ఆయన ఎక్కువగా చదువుకోలేదన్న సంగతి అందరికీ తెలిసిందే. ఇంగ్లీష్ కూడా రాదని తెలిసిందే. కానీ బండ్ల గణేష్ మాత్రం తన ఇంగ్లీష్ నాలెడ్జ్‌ను పదే పదే అందరికీ చూపిస్తుంటారు. స్పెల్లింగ్స్ తప్పుగా రాయడంతో అందరూ బండ్ల గణేష్‌ను ఓ రేంజ్‌లో ఆడుకుంటుంటారు. తాజాగా బండ్ల గణేష్ మళ్లీ తప్పులో కాలేసి ట్రోలర్స్‌కి దొరికేశారు. ఒకసారి కాదు.. ఒకే తప్పుకు రెండు సార్లు దొరికారు. ప్రస్తుతం కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అందరూ కూడా మాస్కులు ధరించాలని ప్రభుత్వం ఆదేశించింది. మాస్కులు లేని యెడల ఫైన్ వేస్తూ ప్రభుత్వం కాస్త కఠినంగా వ్యవహరిస్తోంది. అలానే బండ్ల గణేష్‌ మాస్క్ ధరించనందు వల్ల రెండు వేల రూపాయలు ఫైన్ పడింది. ఇదే విషయాన్ని బండ్ల గణేష్ చూపుతూ ఆధారాలు కూడా చూపించాడు. మాస్క్ లేనందున రూ. 2వేల జరిమానా కట్టాలని అందులో ఉంది. అయితే ప్రజలకు జాగ్రత్త చెబుతూ మాస్క్ ధరించండని బండ్ల గణేష్ ట్వీట్‌లోని ఉద్దేశం. ఆయనఉద్దేశ్యం కరెక్ట్ అయినా చెప్పిన మాట, రాసిన పదాలు మాత్రం తప్పు. మాస్క్ ధరించండి (Wear mask) అని చెప్పాల్సింది పోయి.. where mask అని మొదటగా ట్వీట్ పెట్టాడు. అది తప్పు అని తెలుసుకుని డిలీట్ చేశాడు. మరో ట్వీట్ వేసిన బండ్ల గణేష్ మళ్లీ తప్పులో కాలేశాడు. ఈ సారి Waer mask అంటూ అడ్డంగా దొరికాడు. ఈ పాట్లు దేనికి బండ్లన్న.. ఏ స్కూల్‌లో చదివావ్ అన్నా.. నీ వల్ల మాకు వచ్చిన ఇంగ్లీష్ కూడా పోతోంది.. స్పెల్లింగ్స్ కూడా మరిచిపోతోన్నా అని రకరకాలుగా బండ్ల గణేష్‌ను నెటిజన్లు ఆడుకుంటున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2PjQH1s
v

రంగురంగుల హోలీ.. భర్తతో కాజల్ చిల్!! పద్దతిగా కానిచ్చేసిన కొత్త పెళ్లి కూతురు

పండగ వచ్చిందంటే చిన్నాపెద్దా అంతా సంబరంగా రంగులతో ఎంజాయ్ చేస్తుంటారు. పల్లె, పట్నం అనే తేడాలేకుండా అన్ని ఏరియాల్లో హోలీ సంబరాలు మిన్నంటుతాయి. స్నేహితులు, బాగా కావాల్సిన వాళ్లకు రంగులు పూస్తూ ఆనందంతో కేరింతలు కొడుతుంటారు. సుఖం, దుఃఖం, సంతోషాలకు ప్రతీకగా వేడుకగా అంతా కలుసుకొని రంగురంగుల హోలీ జరుపుకుంటారు. కాగా, కొత్త పెళ్లి కూతురు ఇంట్లో ఈ ఏడాది హోలీ వేడుకలు ఘనంగా జరిగాయి. తాజాగా ఈ ఫొటోలు సోషల్ మీడియాలో షేర్ చేసిన కాజల్.. అందరికీ హోలీ శుభాకాంక్షలు తెలిపింది. ప్రేమించి పెళ్లిచేసుకున్న కాజల్- గౌతమ్ జోడీ పెళ్లైన తర్వాత మొదటిసారి హోలీ వేడుకలో ఎంజాయ్ చేశారు. ఒకరికొకరు రంగులు పూసుకుని ఫొటోలకు పోజులిచ్చారు. హోలీ పండుగని చాలా పద్ధతిగా చేసుకున్న కాజల్.. తన భర్తతో సరదాగా గడిపింది. ఇందుకు సంబంధించిన ఫొటోస్ తనే స్వయంగా షేర్ చేయడంతో అవి వైరల్ అవుతున్నాయి. రంగులు పూసుకున్న చందమామ లుక్ నెటిజన్లను ఎంతగానో ఆకర్షిస్తోంది. పెళ్లి తర్వాత సినిమా జోష్ మరింత పెంచింది కాజల్. పెళ్లికి ముందు కమిటైన సినిమాలు కంప్లీట్ చేస్తూనే కొత్త సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ వస్తోంది. ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో 'భారతీయుడు-2' సినిమాలో నటిస్తున్న ఆమె.. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'ఆచార్య' మూవీలో చిరంజీవితో రొమాన్స్ చేస్తోంది. దీంతోపాటు హిందీలో 'ముంబై సాగా' సినిమా చేస్తోంది. మంచు విష్ణుతో కలిసి చేసిన 'మోసగాళ్లు' మూవీ ఇటీవలే విడుదలైంది. మొత్తానికి సినిమాల జోష్ కంటిన్యూ చేస్తూనే భర్తతో ఇలా వీలు చిక్కినప్పుడల్లా చిల్ అవుతున్న కాజల్‌ని చూసి ఆమె ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3m1Yvky
v

Rang De 3 Days Collections: థియేటర్స్‌తో కొనసాగుతున్న నితిన్- కీర్తి సురేష్ హవా

యంగ్ హీరో లేటెస్ట్ మూవీ 'రంగ్ దే' చెప్పుకోదగిన కలెక్షన్స్ రాబడుతోంది. ఇటీవలే 'చెక్' సినిమాతో డిజాస్టర్ మూటగట్టుకున్న నితిన్.. ఈ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌తో తిరిగి ట్రాక్ ఎక్కినట్లు తాజా రిపోర్ట్స్ చెబుతున్నాయి. భారీ అంచనాల నడుమ మార్చి 26వ తేదీన విడుదలైన ఈ చిత్రం మంచి టాక్‌ సొంతం చేసుకుంది. దీంతో కలెక్షన్స్ పరంగా భేష్ అనిపించుకుంటూ బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతోంది. విడుదలకు ముందు చేసిన ప్రమోషన్స్, టీజర్, ట్రైలర్ సినిమాపై హైప్ క్రియేట్ చేయడమే గాక, విడుదలైన తొలిరోజే పాజిటివ్ టాక్ తీసుకొచ్చాయి. దీంతో వసూళ్ల హవా నడిపిస్తూ ఈ సినిమా ముందుకెళ్తోంది. మూడో రోజు సెలవుదినం ఆదివారం కావడంతో కలెక్షన్స్ ఇంకాస్త పెరిగాయి. తెలుగు రాష్ట్రాల్లో కలిపి ఆదివారం రోజు 2.88 కోట్ల షేర్, 5 కోట్ల గ్రాస్ వసూళ్లు నమోదయ్యాయి. ఏరియాల వారీగా కలెక్షన్ వివరాలు చూస్తే.. నైజాం- 1.24 కోట్లు సీడెడ్‌- 52 లక్షలు ఉత్తరాంధ్ర- 40 లక్షలు ఈస్ట్‌ గోదావరి- 17 లక్షలు వెస్ట్‌ గోదావరి- 13 లక్షలు గుంటూరు- 16 లక్షలు కృష్ణా- 16.50 లక్షలు నెల్లూరు- 10 లక్షలు ప్రపంచవ్యాప్తంగా 23.90 కోట్ల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన రంగ్ దే మూవీ ఈ మూడు రోజుల్లో కలిపి 10 కోట్లకు పైగా షేర్ రాబట్టింది. వచ్చే వారం కూడా ఇదే రన్ కొనసాగిస్తే బ్రేక్ ఈవెన్ చేరుకోవడం ఈజీ అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. సితార ఎంటర్టైన్మైంట్స్ బ్యానర్‌పై వెంకీ అట్లూరి దర్శకత్వంలో రూపొందిన ఈ కలర్‌ఫుల్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లో నితిన్, జంటగా నటించారు. ఇద్దరి నటనపై ప్రేక్షకుల నుంచి ప్రశంసలు దక్కుతున్నాయి.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3rB2ZQe
v

నాకు ఓటు గుద్దండి.. రూ. లక్ష పట్టండి: హీరోయిన్ ఖుష్బూ ఎన్నికల హామీ మామూలుగా లేదు

తమిళనాడులో ఎన్నికల నేపథ్యంలో చిత్ర విచిత్రాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా అభ్యర్థులు ఓట్లు గుద్దించుకోవడం కోసం ఆచరణ సాధ్యం కానీ ఎన్నికల హామీలతో ఊదరగొడుతున్నారు. తులం శరవణన్ ఇండిపెడెంట్ అభ్యర్థి.. తనను గెలిపిస్తే.. ప్రతి ఇంటికి ఏడాదికి రూ.కోటి, ఓ మినీ హెలికాప్టర్, పెళ్లిళ్లుకు బంగారు నగలు, మూడంతస్తుల భవనం కట్టించి ఇస్తానని హామీలు కురిపించడంతో పాటు.. చంద్రమండలానికి తీసుకుపోతా అంటూ ఓటర్లను పిచ్చోళ్లని చేసే హామీలు ఇచ్చారు. అయితే తాజాగా సినీ నటి కూడా ఓటర్లను ప్రసన్నం చేసుకునే హామీ ఇచ్చారు. తనను గెలిపిస్తే.. ఆడపిల్ల అకౌంట్‌లో రూ. లక్ష వేస్తానంటూ హామీ హామీ ఇచ్చారు ఖుష్బూ. భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా ధౌజండ్ లైట్స్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న ఖుష్బూ తన నియోజకవర్గ పరిధిలో ఎన్నికల ప్రచారం నిర్వహించి ఓటర్లకు ఈ లక్ష రూపాయల ఆఫర్‌ని ప్రకటించారు. ఆర్ధికంగా మహిళలు మరింత బలంగా ఉండాలని, వారికి ఆర్థిక స్వాతంత్య్రం అవససరం అని అందుకే తన నియోజకవర్గంలో ఆడపిల్లలు పుడితే ..వెంటనే వారి పేరు మీద లక్ష రూపాయిలు డిపాజిట్ చేస్తామని హామీ ఇచ్చారు ఖుష్బూ. ఇక ప్రచారంలో భాగంగా దోసెలు వేస్తూ ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేశారు ఖుష్బూ. మొత్తానికి హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన ఖుష్బూ.. పదేళ్ల పొలిటికల్ జర్నీలో మూడు పార్టీలు మారిన నేతగా రికార్డ్ క్రియేట్ చేశారు. ఇటీవల బీజేపీ తీర్థం పుచ్చుకున్న ఖుష్బూ సుందర్ .. కాంగ్రెస్ పార్టీలో జాతీయ అధికారిక ప్రతినిధిగా పనిచేసి తమిళనాడు రాజకీయాల్లో చక్రం తిప్పేందుకు బీజేపీ కండువా కప్పుకున్నారు. అంతకు ముందు 2010లో డీఎంకే అధ్యక్షుడు కరుణానిధి సమక్షంలో ఆ పార్టీలో చేరిన ఖుష్ఫూ 2014లో ఆ పార్టీని వీడి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఆ తరువాత మళ్లీ పార్టీ మార్చేసి.. 2020లో బీజేపీ తీర్థం పుచ్చుకుని పాలిటిక్స్‌లో యాక్టివ్ అయ్యారు. తమిళనాట బీజేపీకి సినీ గ్లామర్ అందించడం కోసం ఖుష్బూ కమలదళాన్ని ముందుండి నడిపిస్తున్నారు. తమిళనాట ఖుష్బూకి బీభత్సమైన క్రేజ్ ఉంది. ఒకానొక సందర్భంలో ఈ బొద్దుగుమ్మకి గుడిలు కూడా కట్టి పూజలు చేశారు తమిళతంబీలు. హీరోయిన్‌గా రాణించిన ఖుష్బూ కమలం అండతో పొలిటికల్ జర్నీని ఎలా లీడ్ చేస్తుందో చూడాలి మరి.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3rz2lml
v

మొత్తానికి పార్ట్నర్ దొరికేసింది.. రొమాన్స్‌లో ముగిని తేలిన సోహెల్

బిగ్ బాస్ ఫేమ్ ప్రస్తుతం తన సినిమా పనుల్లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఉదయం నుంచి రాత్రి వరకు షూటింగ్‌తో బిజీగా ఉంటున్నానని, వర్కవుట్లు చేయడానికి కూడా టైం ఉండటం లేదని సోహెల్ చెప్పుకొచ్చారు. సెట్‌లోనే డంబెల్స్‌తో వర్కవుట్లు చేస్తున్నానని సోహెల్ అన్నారు. ఈ మధ్యే అరియానాను కూడా తన సెట్‌కు ఆహ్వానించారు. ఇద్దరూ కలిసి సెట్‌లో బాగానే రచ్చ చేశారు. అయితే సోహెల్ సినిమా విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి. ఫస్ట్ లుక్ పోస్టర్ ఎంత మాస్‌గా ఉందని, ఎంతగా వైరల్ అయిందో అందరికీ తెలిసిందే. అయితే ఈ చిత్రంలో సోహెల్‌కు జంటగా నటించేది ఎవరనే విషయాన్ని మాత్రం సస్పెన్స్‌గా ఉంచారు. ఈ కొత్త మూవీలో సోహెల్ పక్కన పార్ట్నర్‌గా ఎవరు నటించనున్నారా? అని అందరూ అనుకుంటుండగా అసలు విషయం చెప్పేశారు. హోలీ సందర్బంగా తన సినిమాలోని హీరోయిన్ గురించి సోహెల్ అందరికీ చెప్పేశారు. ఉమామహేశ్వర ఉగ్రరూపస్య సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన తన సినిమాలో నటిస్తోందని సోహెల్ తెలిపారు. ఎంతగానో ఎదురుచూస్తోన్న అసలు సిసలు అప్డేట్ ఈ హోళీ నాడు వచ్చేసింది. ఇప్పటికీ ఆ ఎదురుచూపులు అయిపోయాయ్.. మా సినిమాలో హీరోయిన్ రూపా కడవయూర్‌ను అందరికీ పరిచయం చేస్తున్నాను. ఎంబీబీఎస్ డాక్టర్ అయిన రూపా.. నటన మీదున్న ప్యాషన్‌తో సినిమాల్లోకి వచ్చారు. ఉమామహేశ్వర ఉగ్రరూపస్య సినిమాతో తన సత్తా చాటారు. ఈమె రాకతో మా టీం ఇంకా బలంగా తయారైంది. నిర్మాత, దర్శకుడు, కెమెరామెన్ ఇలా ప్రతీ ఒక్కరూ అద్భుతమైన వారే. రూపను అందరూ ఆహ్వానించండని తన అభిమానులను సోహెల్ కోరారు. సినిమా పరంగానే కాదు ఇకపై మనకు ఫ్యామిలీ డాక్టర్ కూడా దొరికేసింది అంటూ సెటైర్ వేశారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3w6ovQr
v

‘వకీల్ సాబ్’ ట్రైలర్ థియేటర్స్ లిస్ట్.. క్యూ కడుతున్న ఫ్యాన్స్, పవన్ మేనియాతో ట్రెండింగ్ నెం.1

హోలీ పండుగని.. పండగలా మార్చేస్తాం అంటూ పవర్ స్టార్ అభిమానులు సోషల్ మీడయాలో ట్రెండ్ క్రియేట్ చేస్తున్నారు. నేడు హోలీ సందర్భంగా సాయంత్రం 6 గంటలకు ‘వకీల్ సాబ్’ ట్రైలర్‌ను రిలజ్ చేయనున్నారు. దీంతో పవన్ కళ్యాణ్ అభిమానులు అసలు సిసలు పండుగలా భావిస్తూ.. #VakeelSaabTrailerDay హ్యాష్ ట్యాగ్‌తో ట్రెండ్ క్రియేట్ చేస్తున్నారు. ప్రస్తుతం వకీల్ సాబ్ ట్రైలర్ టాప్ ట్రెండింగ్‌లో ఉంది. ఇదిలా ఉంటే వకీల్ సాబ్ ట్రైలర్‌ను థియేటర్స్‌లో విడుదల చేస్తూ సరికొత్త అధ్యాయనానికి తెరతీశారు పవన్ కళ్యాణ్ అభిమానులు. ఆంధ్రా, సీడెడ్, నైజాం లోని ఏ సెంటర్స్‌లో ‘వకీల్ సాబ్’ ట్రైలర్ మెగాభిమానుల చేతుల మీదుగా విడుదల కాబోతోంది. ఆ థియేటర్స్ లిస్ట్‌ను నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ప్రకటించింది. ఆ థియేటర్స్ లిస్ట్ చూస్తే... వైజాగ్ సంగం, గోపాలపట్నం - మౌర్య, గాజువాక (మిండి) - గ్లోబెక్స్, మధురవాడ - ఎస్టీబీఎల్ స్క్రీన్ 1, శ్రీహరిపురం - ఎస్వీసీ లికిత, విజయనగరం - ఎస్వీసీ మల్టీప్లెక్స్, శ్రీకాకుళం - ఎస్వీసీ రామ్ లక్ష్మణ, అనకాపల్లి - రామచంద్ర, తగరపువలస - రాములమ్మ, పాయకరావుపేట - ఎస్వీసీ శ్రీలక్ష్మి, రాజం - ఎస్వీసీ అప్సర, చీపురుపల్లి - వంశీ, బొబ్బిలి - టీబీఆర్ స్క్రీన్ 1, పార్వతీపురం - టీబీఆర్ స్క్రీన్ 1, యలమంచిలి - సీత నెల్లూరు ఎం1 సినిమాస్, కావలి - మానస సినిమాస్, సూల్లూరుపేట - వీ ఈపిక్, నాయుడుపేట - సీఎస్ తేజ, వెంకటగిరి - బ్రమర, కందుకూరు - కోటీశ్వర, దర్శి - వెంకటేశ్వర, గూడురు - వెంకటేశ్వర సినీ కాంప్లెక్స్ ఈస్ట్ గోదావరి రాజమండ్రి - గీత అప్సర, రాజమండ్రి - సాయికృష్ణ, కాకినాడ - పద్మప్రియ కాంప్లెక్స్, కాకినాడ - దేవి మల్టీప్లెక్స్, అమలాపురం - వెంకటరమణ, మండపేట - రాజరత్న కాంప్లెక్స్, మల్కిపురం - పద్మజ కాంప్లెక్స్, రావులపాలెం - వెంకటేశ్వర, జగ్గంపేట - రాజవేణి, సామర్లకోట - విగ్నేశ్వర, పిఠాపురం - అన్నపూర్ణ, తుని - శ్రీరామ, రామచంద్రపురం - కిషోర్, పెద్దాపురం - లలితా కాంప్లెక్స్, నీలపల్లి - శ్రీసత్య, రాజనగరం - ఫార్చూన్ ఫోర్ సినిమాస్, తాటిపాక - అన్నపూర్ణ వెస్ట్ గోదావరి ఏలూరు - సత్యనారాయణ, భీమవరం - పద్మాలయ, తాడేపల్లిగూడెం - రంగ మహల్, తణుకు - వీరనారాయణ, పాలకొల్లు - మారుతి, నర్సాపురం - అన్నపూర్ణ, జంగారెడ్డి గూడెం - లక్ష్మి, నిడదవోలు - వీరభద్ర, ఆకివీడు - విజయ, గణపవరం - మహాలక్ష్మి, కొవ్వూరు - అనన్య, అత్తిలి - కనకదుర్గ, పెనుగొండ - మినర్వా గుంటూరు గుంటూరు - భాస్కర్ సినిమాస్, సినీ స్క్వేర్, వి ప్లాటెనొ, తెనాలి - లక్ష్మి కాంప్లెక్స్, ఒంగోల్ - సత్యం, రత్నమహాల్, చిలకలూరుపేట - కేఆర్ కాంప్లెక్స్, మాచర్ల - రామా టాకీస్, చీరాల - శాంతి థియేటర్ కృష్ణ విజయవాడ - అప్సర, శైలజ, మచిలీపట్నం - సిరి వెంకట్, గుడివాడ - జీ3 సింధూర నైజాం ఆర్టీసీ ఎక్స్ రోడ్స్ - సుదర్శన్ 35ఎంఎం, వరంగల్ - రాధిక, ఖమ్మం - శ్రీ తిరుమల, కరీంనగర్ - మమత, నల్గొండ - నటరాజ్, మిర్యాలగూడ - రాఘవ, నిజామాబాద్ - లలిత మహల్, మహబూబ్ నగర్ - శ్రీనివాస, అదిలాబాద్ - మహేశ్వరి, సూర్యాపేట - కిషోర్ సీడెడ్ కడప - రవి, అనంతపురం - త్రివేణి, ప్రొద్దుటూరు - అరవీటి, హిందూపురం - గురునాథ్, కర్నూలు - ఎస్వీసీ, నంద్యాల - రామనాథ్, తిరుపతి - సంధ్య, మదనపల్లి - కృష్ణ, బళ్లారి - నటరాజ్, గుంతకల్ - ఎస్ఎల్వీ, రైల్వే కోడూర్ - ఏఎస్ఆర్, కాళహస్తి - ఆర్ఆర్, చిత్తూరు - విజయలక్ష్మి


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3djmgR0
v

రాత్రి 3 గంటల వరకు అక్కడే.. అర్ధరాత్రి వేళ కమెడియన్‌తో శ్రీముఖి అలా..! షాకింగ్ సెల్ఫీ వీడియో

హీరోయిన్ల మాటేమో గానీ బుల్లితెర యాంకర్ల హంగామా మాత్రం మామూలుగా లేదండోయ్!. హీరోయిన్లకు గట్టి పోటీ ఇస్తూ హాట్ హాట్‌గా కనిపించడమే గాక భారీ ఫాలోయింగ్ కూడగట్టుకుంటున్నారు. ఒకరకంగా చెప్పాలంటే స్టార్ హీరోయిన్ల కంటే ఈ లేడీ యాంకర్లే సోషల్ మీడియాను దున్నేస్తున్నారు. ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్‌డేట్స్ పోస్ట్ చేస్తూ నెటిజన్లను బుట్టలో వేసుకుంటున్నారు. ఈ లిస్టులో ప్రధానంగా చెప్పుకోవాల్సిన పేరు . ముందుగా సినిమాల్లోకి వచ్చి ఆ తర్వాత టీవీ తెరపై పాపులర్ అయిన యంగ్ అండ్ హాట్ శ్రీముఖి.. సోషల్ మీడియాలోనూ తెగ హంగామా చేస్తుంటుంది. ఓ వైపు గ్లామర్ ట్రీట్ ఇస్తూనే మరోవైపు అల్లరి చేష్టలు చేస్తూ ఆకట్టుకోవడం అమ్మడి హాబీ. గత సీజన్ బిగ్ బాస్‌లో రచ్చరచ్చ చేసి రన్నరప్ కొట్టేసిన శ్రీముఖి.. ప్రస్తుతం పలు టీవీ షోస్ చేస్తూ యమ జోష్‌‌లో ఉంది. ఈ క్రమంలోనే తాజాగా ఓ సెల్ఫీ వీడియో పోస్ట్ చేసి షాకిచ్చింది బుల్లితెర రాములమ్మ. ఈ వీడియోలో కమెడియన్ సద్దాంతో కలిసి ఊహించని విధంగా కనిపించింది శ్రీముఖి. ఓ బుల్లితెర కార్యక్రమానికి సంబంధించిన షూటింగ్ జరుగుతుండగా.. విరామం సమయంలో కమెడియన్ సద్దాంతో కలిసి ఈ షాకింగ్ వీడియో చేసింది. మొబైల్ యాప్ ఉపయోగించి ఈ ఇద్దరూ జంతువుల్లా భయంకరమైన లుక్‌లో కనిపించారు. అంతేకాదు 'షూటింగ్ జరుగుతోంది. రాత్రి 3 గంటల వరకు ఇక్కడే ఉన్నాం.. నిద్రొస్తోంది.. ఇక ఇంటికెళ్ళాలి' అని కామెంట్ చేశారు. ఈ వీడియోలు చూసిన నెటిజన్స్ ఆ టైమ్‌లో కూడా ఇలాంటి పనులేంటి అంటూ ముక్కున వేలేసుకుంటున్నారు. ప్రస్తుతం శ్రీముఖి ‘క్రేజీ అంకుల్స్' సినిమాలో లీడ్ రోల్ పోషిస్తోంది. భార్యల వద్ద సుఖం దొరకక దాని కోసం అన్వేషించే అంకుల్స్ కథతో ఈ మూవీ రూపొందుతోంది. దీంతో పాటు నితిన్ 30వ సినిమాగా రాబోతున్న 'అందాదున్' తెలుగు రీమేక్‌లోనూ నటిస్తోంది ఈ యంగ్ యాంకర్.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2PxqGvv
v

Sunday 28 March 2021

చూడగానే కళ్లలో నీళ్లు తిరిగాయి.. ఎక్కువగా ఆలోచించొద్దని అర్థమైంది.. నాగార్జున ఎమోషనల్ కామెంట్స్

అక్కినేని ప్రధానపాత్రలో తెరకెక్కిన '' మూవీ ఏప్రిల్‌ 2న విడుదల కాబోతోంది. మ్యాట్నీ ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై నిరంజన్‌రెడ్డి, అన్వేష్‌రెడ్డి సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాకు అహిషోర్ సాల్మోన్ ద‌ర్శక‌త్వం వహించారు. డేర్ డెవిల్ ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్ ఏసీపీ విజయ్ వర్మ పాత్రలో నాగార్జున కనిపించబోతున్నారు. దియా మీర్జా హీరోయిన్‌గా నటించగా.. సయామీ ఖేర్ కీలక పాత్ర పోషించారు. చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా ఆదివారం రాత్రి హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్‌ ఈవెంట్ నిర్వహించారు మేకర్స్. ఇందులో హీరో నాగార్జున మాట్లాడుతూ ఎమోషనల్ కామెంట్స్ చేశారు. తనకు ఎక్స్‌పరిమెంటల్ సినిమాలు చేయడమే ఇష్టమని చెప్పిన నాగార్జున ఎప్పుడూ కొత్త కథల వేటలోనే ఉంటానని అన్నారు. చేసిన పని మళ్లీ చేయటం తనకు ఇష్టముండదని, మూస ధోరణిలో వెళితే బోర్ కొడుతుందని చెప్పారు. కొత్త చిత్రాలు, కొత్త దర్శకులతో పని చేస్తున్నందు వల్లే యంగ్‌ అండ్‌ ఎనర్జిటిక్‌గా ఉన్నానని నాగార్జున అన్నారు. మగాడంటే ఎలా ఉండాలని అనుకుంటామో ఈ చిత్రంలో తన పాత్ర అలాగే ఉంటుందని చెప్పుకొచ్చారు. ఏసీపీ విజయ్ వర్మ క్యారెక్టర్ నచ్చి ఈ సినిమా ఓకే చేశా. మగాడంటే ఇలా ఉండాలి అనేలా ఆయన క్యారెక్టర్ ఉంటుంది. ఇప్పటి వరకూ నేను చేసిన సినిమాల్లో ఇదే స్ట్రాంగ్‌ క్యారెక్టర్‌. పక్కా కమర్షియల్‌ చిత్రమిది అని తెలిపిన నాగార్జున.. కరోనా గురించి మాట్లాడుతూ చిన్న వైరస్‌ ప్రపంచానికి బ్రేకులు వేసిందని అన్నారు. దేని గురించీ ఎక్కువగా ఆలోచించొద్దని మనకు నేర్పిందని, లాక్‌డౌన్‌ తర్వాత షూటింగ్‌ కోసం మనాలీ వెళ్లడం.. అలా బయట ప్రపంచంలోకి అడుగుపెట్టగానే ఆనందమేసిందని చెప్పారు. ఆ సమయంలో కళ్లలో నీళ్లు తిరిగాయంటూ ఎమోషనల్ అయ్యారు. ఈ సినిమా కోసం ప్రతి నిమిషాన్ని ఆస్వాదిస్తూ పనిచేశానని నాగార్జున తెలిపారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/39kmKVN
v

ఇండియన్ వైడ్ ట్రెండ్ అవుతున్న ప్రభాస్ లగ్జరీ కారు.. దేశంలోనే రెండోది.. ఇదీ రెబల్ స్టార్ రేంజ్!!

సెలబ్రిటీలన్నాక లగ్జరీకి పెద్ద పీట వేయడం కామనే అయినా ఈ మధ్యకాలంలో అది మరీ ఎక్కువైంది. విలాసవంతమైన భవనాలు కొనుగోలు చేయడం, లగ్జరీ కార్లలో తిరగడం, ఖరీదైన క్యారవాన్స్ మెయిన్‌టైన్ చేయడం లాంటివి చేస్తున్నారు నేటితరం హీరోహీరోయిన్లు. ఈ నేపథ్యంలో ఇటీవలే యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఓ ఖరీదైన కారు కొనేయగా.. తాజాగా అంతకుమించి అన్నట్లుగా యంగ్ రెబల్ స్టార్ కొనేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వివరాలు ఇండియన్ వైడ్ ట్రెండ్ అవుతుండటం విశేషం. మామూలుగా ప్రభాస్‌కు కార్లంటే మహా ఇష్టం. ఇప్పటికే ఆయన దగ్గర BMW 520D, ఇన్నోవా క్రిస్టా, జగువార్‌ ఎక్స్‌జేఎల్‌, రేంజ్‌ రోవర్‌ వోగ్‌, రోల్స్‌ రాయ్స్‌ గోస్ట్‌ కార్లు ఉన్నాయి. అంతటితో ఆగక కార్లపై ఉన్న మోజుతో మరో కొత్త కారు కొన్నారు. లంబోర్ఘిని అవెన్‌టోడోర్‌ ఎస్‌ రోడ్‌స్టర్‌ను ప్రభాస్ సొంతం చేసుకున్నారని, అది నిన్న (ఆదివారం) సాయంత్రం డెలివరీ అయిందని తెలిసింది. ఇది ఇండియాలో రెండోదని.. సక్సెస్‌ఫుల్‌గా డెలివరీ చేసేశామని ఆ కారుకు చెందిన సంస్థ తెలిపింది. సుమారుగా ఈ లగ్జరీ కారు విలువ అన్ని టాక్సులతో కలుపుకొని 7 కోట్లు ఉంటుందని బిజినెస్ వర్గాలు చెబుతున్న మాట. అత్యాధునిక ఫీచర్స్‌తో ఈ కారు నడుస్తుందని, ఇప్పటికే ప్రభాస్ దీనిపై చెక్కర్లు కొడుతూ ఎంజాయ్ చేస్తున్నారని తెలుస్తోంది. రెబల్ స్టార్ కొనుగోలు చేసిన ఈ కారును చూసి మురిసిపోతున్న ఆయన ఫ్యాన్స్.. పాన్ ఇండియా స్టార్ 'బాహుబలి' రేంజ్ అంటే ఇదీ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ప్రభాస్ వరుస సినిమాలతో బిజీ బిజీగా ఉన్నారు. ఇటీవలే 'రాధేశ్యామ్' షూటింగ్ ఫినిష్ చేసిన ఆయన.. ''ఆదిపురుష్, సలార్'' సినిమా షూటింగ్స్‌లో పాల్గొంటున్నారు. వీటితో పాటు నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ మరో పాన్ ఇండియా మూవీ రూపొందనుంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3rAowbM
v

Avinash: వీకెండ్ ఎంజాయ్‌.. మామిడి తోటలో అవినాష్‌తో అరియానా..! ఫాంహౌస్‌లో రచ్చ రచ్చ

బిగ్ బాస్ నాల్గో సీజన్ పుణ్యాన కొన్ని ట్రాకులు బాగానే క్లిక్ అయ్యాయి. కొన్ని జంటలు స్నేహితుల్లా, ఇంకొన్ని అంతకు మించి అనేలా బంధాలు ఏర్పడ్డాయి. మొత్తానికి వారంతా బయటకు వచ్చాక కూడా తమ బంధాలను అలానే కొనసాగిస్తున్నారు. ఇంకా రచ్చ రచ్చ చేస్తున్నారు. కలిసి జంటలుగా సోషల్ మీడియాను ఊపేస్తోన్నారు. బిగ్ బాస్ ఇంట్లో , అవినాష్ చేసిన హల్చల్ అందరికీ గుర్తుండే ఉంటుంది. బిగ్ బాస్ షోలో అరియానా అతి, అవినాష్ అంతకు మించి యాక్షన్, పులిహోర, ట్రాకులు కలపడం అందరికీ తెలిసిందే. తన అతితో జనాలను విసిగించినా సరే చివరి వరకు అరియానా పోరులో నిలిచారు. ఆమె ముక్కుసూటిదనం, ధైర్యం, తెగవ వంటి లక్షణాలు అందరికీ నచ్చాయి. మితి మీరిన అతి ఉన్నా కూడా జనాలు మాత్రం ఆమెకు కొన్ని లక్షణాలను చూసి చివరి వరకు ఉంచారు. ఇక అవినాష్ మాత్రం తనది తాను ఎంటర్టైనర్ అనే ట్యాగ్ ఇచ్చి కాస్త ఓవర్ యాక్షన్ చేయడంతో మధ్యలోనే పంపించేశారు. టాప్ 5 కంటెస్టెంట్‌గా ఉండే అర్హత కలిగినవాడే.. కానీ తన చేష్టలతో ముందుగానే ఆట నుంచి విరమించుకోవాల్సి వచ్చింది. బిగ్ బాస్ ఇంట్లో అవినాష్ కలిపిన పులిహెర, అతని ట్రాకుల గురించి అందరికీ తెలిసిందే. చివరకు అరియానా అవినాష్ ట్రాక్ మాత్రం బాగానే క్లిక్ అయింది. తామిద్దరం మంచి స్నేహితులం మాత్రమేనని అరియానా, అవినాష్ క్లారిటీ ఇచ్చారు. కానీ ఆన్ స్క్రీన్‌లొ మాత్రం ఈ మధ్య రెచ్చిపోతున్నారు. ఇక ఓపెనింగ్స్, ప్రకటనల్లో మాత్రం ఈ ఇద్దరూ జంటగానే కనిపిస్తున్నారు. ఈ మధ్యే అరియానా కాస్త కుదుటపడింది. ఆరోగ్యం బాగా అవ్వడంతో ప్రిన్సెస్ ఈజ్ బ్యాక్ అంటూ అవినాష్ తెగ సంబరపడిపోయాడు. వీకెండ్ స్పెషల్‌గా అరియానా, అవినాష్ ఇద్దరూ కూడా ఫాంహౌస్‌కు వెళ్లారు. మామిడి తోటలో బాగానే ఎంజాయ్ చేసినట్టున్నారు. సిటీ పరిసర ప్రాంతాల్లోని ఈ ఫాం హౌస్‌లో రాత్రంతా రచ్చ చేసినట్టు కనిపిస్తున్నారు. ప్రస్తుతం ఈ ఇద్దరూ కలిసి ఓ హోటల్ ప్రారంభోత్సవానికి సిద్దమైనట్టు కనిపిస్తున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/39mDb49
v

అలాంటి మనుషులను దూరం పెట్టండి.. ఒట్టి మాటలను నమ్మకండి.. సురేఖా వాణి షాకింగ్ పోస్ట్

నటి టాలీవుడ్‌లో తనకంటూ ఓ ముద్ర వేసుకున్నారు. తన నటనతో అందరినీ మెప్పించారు. కామెడీ పాత్రలైనా, ఎమోషనల్ క్యారెక్టర్లైనా ఏదైనా సరే ఆమె తనదైన శైలిలో స్క్రీన్ మీద మెప్పించగలరు. అయితే సురేఖా వాణిని తెరపై చూసి సోషల్ మీడియాలో చూస్తే మాత్రం ఎవ్వరైనా షాక్ అవ్వాల్సిందే. అక్కడికి ఇక్కడికి ఎంతో పూర్తి భిన్నంగా ఉంటారు. సోషల్ మీడియాలో సురేఖా వాణి మోడ్రన్ లేడీగా కనిపిస్తుంటారు. ఇక ఆమె తన కూతురు సుప్రితతో కలిసి చేసే సందడి మామూలుగా ఉండదు. కూతురిని కూడా తెరపైకి తీసుకురావాలని బాగానే ప్రయత్నిస్తున్నట్టు కనిపిస్తున్నారు. సుప్రిత ఇప్పటికే పలు ప్రైవేట్ ఆల్బమ్స్, యాడ్స్‌లోనూ నటించారు. ఇక త్వరలోనే సినీరంగ ప్రవేశం కూడా చేయబోతోతన్నట్టు తెలుస్తోంది. ఈ ఇద్దరూ కూడా నిత్యం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతుంటారు. తన తల్లిపై, తనపై వచ్చే వార్తలు, గాసిప్స్‌పై సుప్రిత ఫైర్ అవుతుంటారు. మీడియాపై సుప్రిత వేసే సెటైర్లు హాట్ టాపిక్ అవుతుంటాయి. ఆ మధ్య సురేఖా వాణి రెండో పెళ్లికి సంబంధించి వచ్చిన వార్తలపై సుప్రిత ఓ రేంజ్‌లో మండిపడ్డారు. ఉన్నవి మాత్రమే రాయండి.. కొత్తవి క్రియేట్ చేసి రాయకండి అంటూ మీడియాపై కౌంటర్లు వేశారు సుప్రిత. అలా ప్రతీ సందర్భంలోనూ సుప్రిత కాస్త ఘాటుగానే స్పందిస్తుంటారు. ఇక సురేఖా వాణి సైతం సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటారు. నిత్యం తమపై వచ్చే వార్తలు, గాసిప్స్, రూమర్లను ఓ కంట కనిపెడుతూనే ఉంటారు. అయితే తాజాగా సురేఖా వాణి ఓ పోస్ట్ చేశారు. అందులోని అంతరార్ధం, అది ఎవరిని ఉద్దేశించి చేశారో కచ్చితంగా తెలియడం లేదు. కానీ సురేఖా వాణికి గట్టి ఎదురుదెబ్బ తగిలినట్టు కనిపిస్తోంది. నకిలీ మనుషులను దూరం పెట్టండి.. ఒట్టి మాటలను నమ్మకండి.. అలాంటప్పుడే మన జీవితం సంతోషంగా సుఖంగా ఉంటుందని సురేఖా వాణి చెప్పుకొచ్చారు. కానీ ఆ కామెంట్లు ఎవరిని ఉద్దేశించి చేశారో తెలియడం లేదు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3cqMO3I
v

అను ఇమ్మానుయేల్ బర్త్ డే.. 'మహాసముద్రం' నుంచి స్పెషల్ పోస్టర్

నేడు (మార్చి 28) బ్యూటిఫుల్ హీరోయిన్ . ఈ సందర్భంగా ఆమె లేటెస్ట్ మూవీ 'మహాసముద్రం' నుంచి స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ మేరకు ఆమెకు యూనిట్ సభ్యులందరి తరపున ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు. లైట్ హౌస్ ఆఫ్ అంటూ అను అందాన్ని వర్ణించారు. ఈ పోస్టర్‌లో క్యూట్ పోజిచ్చి చూపులతోనే మత్తెక్కిస్తోంది అను ఇమ్మానుయేల్. గతంలో ఎన్నడూ చూడని వైవిద్యభరితమైన కథాంశాన్ని తీసుకొని ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ మూవీ రూపొందిస్తున్నారు డైరెక్టర్ అజయ్ భూపతి. చిత్రంలో యంగ్ హీరో హీరోగా నటిస్తుండగా ఆయన సరసన అను ఇమ్మానుయేల్ హీరోయిన్‌గా నటిస్తోంది. సముద్రం బ్యాక్‌డ్రాప్‌లో లవ్ అండ్ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాలో లవర్ బాయ్ సిద్ధార్ద్ మరో హీరోగా నటిస్తుండటం విశేషం. అదితి రావ్‌ హైదరీ మరో హీరోయిన్. RX 100తో దర్శకుడిగా టాలెంట్ రుజువు చేసుకున్న అజయ్ భూపతి ఈ సినిమాతో మరో మెట్టు ఎక్కాలని పట్టుదలగా ఉన్నారు. ఇప్పటికే విడుదలైన సినిమా పోస్టర్స్ చిత్రంపై క్యూరియాసిటీ పెంచేశాయి. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై అనిల్ సుంకర నిర్మిస్తున్న ఈ మూవీ ఆగస్టు 19న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3svUZkU
v

Monal: ఎయిర్ పోర్ట్‌లో అందరి ముందే హగ్.. అఖిల్ చేసిన పనికి మోనాల్ షాక్..!

బిగ్ బాస్ షోలో అఖిల్ చేసిన సందడి గురించి రెండు తెలుగు రాష్ట్రాల్లో అందరికీ తెలిసిందే. ఈ ఇద్దరి మధ్య ప్రేమ, స్నేహం,కోపం, ద్వేషం ఇలా అన్ని ఎమోషన్స్‌ను బిగ్ బాస్ ఇంట్లో మనమంతా చూశాం. ఇక మోనాల్ ఆడిన ఆట అయితే అందరికీ ఆశ్చర్యం వేసేలా ఉంటుంది. అభిజిత్ అవినాష్ అంటూ మోనాల్ ఒక్కో సందర్భంలో ఒక్కోలా ఉంటూ వచ్చారు. బిగ్ బాస్ నాల్గో సీజన్ మొత్తంలో మోనాల్ లేని ఎపిసోడ్ ఉండదు. అంతలా మోనాల్ ప్రభావితం చేసింది. ఉంటే అఖిల్‌తో.. లేదంటే అభిజిత్‌తో.. ఈ ఇద్దరూ కాదంటే అవినాష్‌తో.. ఎవరో ఒకరితో మోనాల్ ట్రాక్ నడుపుతూనే వచ్చారు. అలా మొత్తానికి జనాల దృష్టిలో మోనాల్ బాగానే పడ్డారు. చివరి వరకు మోనాల్ అఖిల్ జంట మాత్రం నిలిచిపోయారు. అది ప్రేమో? స్నేహమో అనే క్లారిటీ ఇవ్వలేదు. క్లారిటీ ఇచ్చినా వారు చేసే చేష్టలకు, చెప్పే మాటలకు పొంతన ఉండటం లేదు. బుల్లితెరపై ఈ ఇద్దరూ చేసే రచ్చ మామూలుగా ఉండటం లేదు. బయటకు వచ్చాక మోనాల్ అఖిల్ మరింత దగ్గరయ్యారు. బిగ్ బాస్ ఇంట్లో అయితే కనీసం మిగతా వాళ్లు ఉండేవారు కాబట్టి.. అప్పుడో ఇప్పుడో మాట్లాడేది. అభిజిత్‌తో మాట్లాడాలని ప్రయత్నించేది. కానీ బయటకు వచ్చాక అభిజిత్ అంటే అంత ఎత్తున లేస్తోంది. ఇప్పుడు ఈ ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా వ్యవహారం నడుస్తోంది. ఇప్పుడు మెనాల్ తన పూర్తి సమయాన్ని అఖిల్‌కే ఇస్తున్నట్టు కనిపిస్తున్నారు. నిన్న మోనాల్‌తో అఖిల్ వీడియో కాల్ మాట్లాడిన సంగతి తెలిసిందే. వీడియో కాల్ మాట్లాడిన అనంతరం ప్రేమ గురించి వేదాంతం చెప్పుకొచ్చారు. ప్రేమ, క్యాన్సర్ ఒక్కటే.. అది సైలెంట్‌గా వస్తుంది.. మనల్ని చంపేసి తీసుకెళ్తుంది అని అఖిల్ వెరైటీ పోస్ట్ పెట్టారు. అయితే ఈ ఇద్దరి మధ్య వ్యవహారం ఏదో తేడా కొడుతోందని అందరూ అనుకున్నారు. కానీ తాజాగా అఖిల్ మోనాల్‌కు షాక్ ఇచ్చాడు. హైద్రాబాద్‌లో అడుగుపెట్టిన మోనాల్‌కు అఖిల్ సర్‌ప్రైజ్ ఇచ్చాడు. వెనకలా నుంచి అఖిల్ చేయి వేయడంతో మోనాల్ షాక్ అయిపోయింది. అఖిల్‌ను అలా చూసి ఆశ్చర్యపోయి ఏడుపు ప్రారంభించింది. అనంతరం అఖిల్‌ను ఎయిర్ పోర్ట్‌లోనే అందరి ముందే హగ్ చేసుకుంది. ఇక తనకు అఖిల్ రెండో గిఫ్ట్ ఇచ్చాడంటూ ఆనందాన్ని వ్యక్తం చేసింది మోనాల్.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2QKrUnQ
v

Rang De 2 days Collections: మెల్లమెల్లగా పుంజుకుంటున్న నితిన్.. ఇదీ లేటెస్ట్ రిపోర్ట్

బ్యాచిలర్ లైఫ్ నుంచి భర్తగా ప్రమోషన్ పొందిన .. వరుస సినిమాలతో జోష్‌లో ఉన్నారు. ఈ నేపథ్యంలో మార్చి 26వ తేదీన రొమాంటిక్ ఎంటర్‌టైనర్ మూవీ 'రంగ్ దే'తో ప్రేక్షకుల ముందుకొచ్చి పాజిటివ్ రెస్పాన్స్ తెచ్చుకున్నారు. నితిన్- జంటగా వచ్చిన ఈ సినిమా తొలుత మిశ్రమ స్పందన తెచ్చుకున్నప్పటికీ.. మెల్లగా పాజిటివ్ వైబ్రేషన్స్ స్ప్రెడ్ అయ్యాయి. దీంతో తొలి రెండు రోజుల్లో చెప్పుకోదగిన కలెక్షన్స్ రాబట్టింది 'రంగ్ దే' మూవీ. రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి తొలిరోజుకు గాను 4.65 కోట్ల రూపాయల కలెక్షన్స్ రాబట్టిన 'రంగ్ దే' మూవీ.. సెకండ్ డే కూడా అదే స్పీడ్ కొనసాగించింది. మరో మూడు కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి మొత్తంగా రెండు రోజుల్లో కలిపి 7.65 కోట్ల షేర్ వసూలు చేసింది. ఈ రెండు రోజుల్లో వచ్చిన గ్రాస్ కలెక్షన్స్ 10.81 కోట్లు అని తెలిసింది. ఏరియాల వారీగా రెండు రోజుల రిపోర్ట్ చూస్తే.. నైజాం: 2.74 కోట్లు ఈస్ట్ గోదావరి: 69.8 లక్షలు వెస్ట్ గోదావరి: 48 లక్షలు కృష్ణా: 36.7 లక్షలు నెల్లూరు: 33.1 లక్షలు వైజాగ్: 94 లక్షలు గుంటూరు: 96 లక్షలు సీడెడ్: 1.14 కోట్లు మొత్తంగా చూస్తే ఇది గుడ్ రిపోర్ట్ అని చెబుతోంది చిత్రయూనిట్. 24.5 కోట్ల రూపాయల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో బరిలోకి దిగిన ఈ మూవీ ఆడియన్స్ రెస్పాన్స్‌తో మెల్లమెల్లగా పుంజుకుంటుండటం నిర్మాతలను ఆనందపరుస్తోంది. సితార ఎంటర్టైన్మైంట్స్ బ్యానర్‌పై వెంకీ అట్లూరి దర్శకత్వంలో ఈ కలర్‌ఫుల్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ రూపొందింది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/31tmnE6
v

ముక్కు అవినాష్‌ తల్లికి అనారోగ్యం.. ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి సపోర్ట్

సీఎంఆర్‌ఎఫ్‌ (ముఖ్యమంత్రి సహాయ నిధి) ద్వారా ప్రభుత్వం ఎంతోమంది పేదలను ఆదుకుంటోంది. అవసరమైన వారికి ఆర్ధికంగా తోడు నిలుస్తూ ప్రాణాలను కాపాడుతోంది తెలంగాణ ప్రభుత్వం. ఈ నేపథ్యంలోనే జబర్దస్త్ కమెడియన్, బిగ్ బాస్ నాలుగో సీజన్ కంటిస్టెంట్ ముక్కు అవినాష్‌‌కు చెక్కు అందింది. ఈ విషయాన్ని మంత్రి కొప్పుల ఈశ్వర్ తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా వెల్లడించారు. జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం రాఘవపట్నం గ్రామానికి చెందిన కాళ్ళ లక్ష్మిరాజం (ముక్కు అవినాష్ తల్లి) అనారోగ్యానికి గుర‌య్యారు. దీంతో ల‌క్ష్మిరాజం చికిత్స నిమిత్తం ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్‌ఎఫ్) నుండి 60 వేల రూపాయలు మంజూరు చేసింది తెలంగాణ గవర్నమెంట్. ఈ న‌గ‌దుకు సంబంధించిన చెక్కును శ‌నివారం హైదరాబాద్ క్యాంపు కార్యాలయంలో లక్ష్మిరాజం కుమారుడు ముక్కు అవినాష్‌కు మంత్రి కొప్పుల ఈశ్వర్ అందజేసి ఆ ఫొటోను సామజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు. ఇటీవల జరిగిన బిగ్ బాస్ నాలుగో సీజన్‌లో ముక్కు అవినాష్ చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. అరియానా అతి, అవినాష్ అంతకు మించి అన్నట్లుగా యాక్షన్‌తో అప్పటికే ఉన్న పాపులారిటీని రెట్టింపు చేసుకున్నారు. అయితే బిగ్ బాస్ ముగిశాక పలు ఇంటర్వ్యూల్లో పాల్గొన్న అవినాష్.. తన తల్లిపై ఉన్న ప్రేమను బయటపెట్టాడు. అమ్మ అంటే తనకెంతో ఇష్టమని చెప్పాడు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3sugLpf
v

Nani: షూటింగ్ చేయనివ్వనంటూ అభిమాని వార్నింగ్ .. దెబ్బకు షాకైన నాని.. సెన్సేషనల్ కామెంట్స్

స్టార్ హీరోల అభిమానులు ఎలా ఉంటారో అందరికీ తెలిసిందే. ఫ్యాన్స్ వార్ సోషల్ మీడియాలో ఎంతటి వివాదానికి దారి తీస్తుంటాయో నిత్యం చూస్తుంటాం. అయితే వీటి గురించి నిన్న తన 'టక్ జగదీష్' పరిచయ వేడుకలో సెన్సేషనల్ కామెంట్స్ చేశాడు. నేను వారిలా ఫ్యాన్స్‌ను ఎంకరేజ్ చేయను అంటూ కొత్త వివాదానికి దారి తీశాడు. ఇప్పుడు నాని ఎవరిని ఉద్దేశించి ఆ మాటలు అన్నారా? అని నెటిజన్లు జుట్టు పీక్కుంటున్నారు. రాజమండ్రిలో నిన్న సాయంత్రం జరిగింది. మొదటిసారిగా ఇలాంటి ఓ వేడుకను నిర్వహించారు. టక్ జగదీష్ ఫ్యామిలీని తెలుగు ప్రేక్షకులను పరిచయం చేయడానికి ఈ ఈవెంట్‌ను ఏర్పాటు చేశామని అన్నారు. ఇక సినిమాలోని ప్రతీ పాత్ర, ఆ పాత్రల స్వభావం, వాటితో తనకుండే బంధం గురించి నాని వివరించారు. తన ప్రసంగంలో మధ్యలోనే నాని టక్ జగదీష్ కుటుంబాన్ని అందరికీ పరిచయం చేశారు. నాని మామూలుగానే ఫ్యాన్స్ ట్వీట్లకు రియాక్ట్ అవ్వరు. ఫ్యాన్స్‌తో ఎక్కువగా ఇంటరాక్ట్ అవ్వరు. అయితే గత వారం రోజులుగా నాని రాజమండ్రిలోనే షూటింగ్ చేస్తున్నారట. 'శ్యామ్ సింఘరాయ్' సినిమా కోసం వారం నుంచి రాజమండ్రిలోనే ఉన్నారట. అయితే ఓ సారి షూటింగ్ స్పాట్‌కు వెళ్తుంటే.. అక్కడ అందరూ ఉన్నారు. అందులోంచి ఒకతను మాత్రం.. ‘నేను మీకు వీరాభిమానిని.. మీరు నాతో సెల్ఫీ దిగకపోతే.. మిమ్మల్ని షూటింగ్ చేసుకోనివ్వను’ అంటూ వార్నింగ్ ఇచ్చాడు. అలా వార్నింగ్‌ను కూడా ప్రేమతో ఇవ్వడం కేవలం ఈ రాజమండ్రి వాళ్లతోనే సాధ్యమవుతుందని నాని చెప్పుకొచ్చారు. అయితే తాను మాత్రం ఫ్యాన్స్‌ను సెల్పీలు, ఫ్యాన్స్ వార్ అంటూ అలాంటి వాటిని ఎంకరేజ్ చేయనని అన్నారు. మా అమ్మానాన్ననలు నన్ను చూసి గర్వ పడుతుంటారు. అభిమానులు నన్ను చూసి గర్వపడేలా చేస్తాను అని అన్నారు. ఇప్పుడు చూసే వాళ్లకు చిన్న చిన్న ఇటుకలే కనిపిస్తాయి.. త్వరలోనే ఓ పెద్ద గోడ కనిపిస్తుంది.. మీ అభిమానం ఉంటే ఎప్పుడూ ఇలానే ఉంటాను అని నాని అన్నారు. శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో రీతూ వర్మ, ఐశ్వర్య రాజేష్‌లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రం ఏప్రిల్ 23న రాబోతోంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3swTanE
v

Saturday 27 March 2021

Pawan Kalyan: మొత్తానికి ఆ పని ఫినిష్.. పవర్ స్టార్ ఇమేజ్ కారణంగానే! సీక్రెట్ రివీల్ చేసిన బోనీ కపూర్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ని మరోసారి వెండితెరపై చూసే ఆ సమయం ఆసన్నమవుతోంది. ఆయన రీ- ఎంట్రీ మూవీ '' ఏప్రిల్ 9వ తేదీన విడుదలకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగంగా పూర్తి చేస్తోంది చిత్రయూనిట్. ఇందులో భాగంగా ఇటీవలే తన పాత్ర కోసం డబ్బింగ్‌ చెప్పడం ప్రారంభించిన పవన్ కళ్యాణ్‌.. శనివారంతో ఆ పని పూర్తి చేసేశారు. ఇదిలాఉంటే ఇటీవల జరిగిన ఓ మీడియా సమావేశంలో ఈ మూవీకి సంబంధించి ఓ ఆసక్తికర విషయాన్ని బయటపెట్టారు నిర్మాత బోనీ కపూర్. బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ 'పింక్' రీమేక్‌గా భారీ హంగులతో తెరకెక్కుతున్న ఈ 'వకీల్ సాబ్' సినిమాకు వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్నారు. బోనీకపూర్ సమర్పకులుగా వ్యవహరిస్తుండగా.. దిల్ రాజు నిర్మాణ సారథ్యం వహిస్తున్నారు. పవన్ రీ- ఎంట్రీ మూవీ కావడంతో ఈ సినిమాపై స్పెషల్ కేర్ తీసుకుంటున్న దర్శకనిర్మాతలు పవన్ ఫ్యాన్స్ ఊగిపోయేలా కొన్ని సన్నివేశాలు చిత్రీకరించారట. ఈ నేపథ్యంలో చిత్ర సమర్పకులు బోనీ కపూర్ సినిమాకు సంబంధించిన ఓ ఆసక్తికరమైన విషయాన్ని బయటపెట్టారు. 'పింక్' సినిమాను తమిళంలో అజిత్‌తో 'నేర్కొండ పర్వాయ్' తీశాం. అందులో ఓ యాక్షన్ సీన్‌ను చేర్చాం అని చెప్పిన ఆయన.. ఇప్పుడు తెలుగు రీమేక్ 'వకీల్ సాబ్'లో పవన్ ఇమేజ్‌ని దృష్టిలో పెట్టుకొని రెండు భారీ యాక్షన్ సీక్వెన్సులు పెట్టామని అన్నారు. చిత్రంలో ఈ రెండు సీన్స్ క్రేజ్‌ని రెట్టింపు చేసేలా ఉంటాయని తెలిపారు. ఇది వినగానే పవన్ ఫ్యాన్స్‌లో ఈ సినిమా పట్ల ఉన్న క్యూరియాసిటీ అమాంతం పెరిగింది. ఈ ప్రతిష్టాత్మక చిత్రంలో పవన్ కళ్యాణ్‌తో సరసన ముగ్గురు హీరోయిన్లు నివేదా థామస్, అంజలి, అనన్య నాగేళ్ల నటిస్తున్నారు. శృతి హాసన్ కీలకపాత్ర పోషిస్తోంది. ఈ మూవీ అనౌన్స్ చేసినప్పటి నుంచే భారీ హైప్ క్రియేట్ అయింది. పవన్‌ని తిరిగి వెండితెరపై చూడబోతున్నామనే శుభవార్త మెగా అభిమానుల్లో జోష్ నింపింది. ఈనెల 29న 'వకీల్ సాబ్' ట్రైలర్‌ విడుదల కానుంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2PDzArb
v

Tuck Jagadish: 'నిన్ను కోరి'లో అంతటితో సరిపెట్టాం కానీ ఇక్కడ.. ఆసక్తికర విషయాలు బయటపెట్టిన డైరెక్టర్

నాచురల్ స్టార్ '' అనే మరో వైవిధ్యభరితమైన కథతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మాణంలో తెరకెక్కనున్న ఈ సినిమాకు శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్నారు. 'నిన్నుకోరి' వంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవీ త‌ర్వాత నాని- శివ నిర్వాణ కాంబినేష‌న్‌లో అన్నిర‌కాల క‌మ‌ర్షియ‌ల్ ఎలిమెంట్స్‌తో ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా ఈ చిత్రం రూపొందు‌తోంది. చిత్రంలో నాని స‌ర‌స‌న రీతూ వ‌ర్మ‌, ఐశ్వ‌ర్యా రాజేష్ హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. తమన్ బాణీలు కడుతున్నారు. నాని కెరీర్‌లో 26వ సినిమాగా రాబోతున్న ఈ సినిమా ప్రమోషన్స్ వేగవంతం చేసిన చిత్రయూనిట్.. 'టక్ జగదీష్' పరిచయ వేడుక కార్యక్రమాన్ని రాజమండ్రిలో ఘనంగా నిర్వహించింది. ఈ కార్యక్రమంలో హీరో నాని, చిత్ర డైరెక్టర్ శివ నిర్వాణ, హీరోయిన్లు రీతూ వ‌ర్మ‌, ఐశ్వ‌ర్యా రాజేష్‌లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిత్రానికి సంబంధించిన పలు విషయాలు షేర్ చేసుకుంటూ తమ సినిమాపై హైప్ పెంచుకున్నారు. టక్ జగదీష్ ఫ్యామిలీ ఎమోషన్స్‌తో కూడుకున్న సినిమా అని తెలిపిన డైరెక్టర్ శివ నిర్వాణ.. రెండేళ్ల నుంచి ఈ కథకు సపోర్ట్ ఇస్తున్న నిర్మాతలకు స్పెషల్ థాంక్స్ చెప్పారు. అందరి సపోర్ట్ ఉండటం వల్లే ఇంత పెద్ద క్యాస్టింగ్ ఉన్న సినిమాను కోవిడ్ తరువాత కూడా చేశానని, చిత్రంలో జగపతి బాబు- నానిలను అన్నాదమ్ములుగా చూడటం ఐ ఫీస్ట్‌లా ఉంటుందని అన్నారు. 'నిన్ను కోరి' సినిమాలో రెండు మూడు ఎమోషనల్ సీన్స్ ఉంటాయి.. కానీ ఇందులో ఎక్కువగా ఉంటాయని ఇంతకంటే సినిమా గురించి ఎక్కువగా చెప్పలేకపోతున్నానని తెలిపారు. 'కొందరికి కుల పిచ్చి ఉంటుంది.. కొందరికి డబ్బు పిచ్చి ఉంటుంది.. కానీ నాకు కుటుంబం అంటే పిచ్చి' అనేదే టక్ జగదీష్ సినిమా అని, ఫ్యామిలీ ఎమోషన్స్‌తో కూడిన ఈ సినిమా అందరికీ నచ్చుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు డైరెక్టర్ శివ నిర్వాణ.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3fmd29A
v

RC15: రామ్ చరణ్ న్యూ ప్రాజెక్టుపై శంకర్ సీరియస్ స్కెచ్.. దిల్ రాజు అలా ప్లాన్ చేశారంటే వీర లేవలే మరి!

మెగా పవర్ స్టార్ జోష్ మామూలుగా లేదండోయ్. ఓ వైపు తన ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ RRR చేస్తూనే మరోవైపు ఇతర ప్రాజెక్టులపై ఫుల్ ఫోకస్ పెడుతున్నారు. హీరోగా, నిర్మాతగా మెగా అభిమానులను ఫిదా చేస్తున్నారు. ప్రెసెంట్ రాజమౌళి రూపొందిస్తున్న RRRతో పాటు తండ్రి చిరంజీవితో కలిసి 'ఆచార్య' మూవీ షూటింగ్‌లో పాల్గొంటున్న చెర్రీ.. మరికొద్ది రోజుల్లో పాన్ ఇండియా డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నారు. ఈ మూవీని నిర్మించనున్నారు. చెర్రీ కెరీర్‌లో 15వ చిత్రంగా రాబోతున్న ఈ సినిమాపై శంకర్ సీరియస్ స్కెచ్ వేస్తున్నారనేది లేటెస్ట్ టాక్. భారీ బడ్జెట్‌ కేటాయించి దిల్ రాజు ఈ మూవీ తెరకెక్కించబోతున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంస్థ 50వ చిత్రంగా రానున్న నేపథ్యంలో అత్యంత స్పెషల్‌గా ఉండాలని ఆయన డిసైడ్ అయ్యారట. ఈ మేరకు ఎప్పటికప్పుడు దర్శకుడు శంకర్‌తో డిస్కషన్స్ చేస్తూ ప్రీ ప్రొడక్షన్ పనులు చేస్తున్నారట. అలాగే ఈ ప్రీ ప్రొడక్షన్ పనుల కోసం చెన్నైలో ప్రత్యేకంగా కొత్త ఆఫీస్ ఓపెన్ చేయబోతున్నారట దిల్ రాజు. అన్ని వసతులతో కుడి చిత్రయూనిట్ మీట్ కావడానికి, సినిమాకు సంబంధించిన డిస్కషన్స్ పెట్టుకోవడానికి అనువుగా ఉండేలా ఈ ఆఫీస్ డిజైన్ చేయిస్తున్నారని సమాచారం. ఇకపోతే తన నాచురల్ జానర్ పొలిటికల్ నేపథ్యంలోనే ఈ సినిమా కథను కూడా రాసుకున్నారట శంకర్. భారీ విజువల్ వండర్‌గా ఈ సినిమాని రూపొందించాలని, చెర్రీ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ మూవీ కావాలని ఆయన ఫిక్సయినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ చిత్రంలో రామ్ చరణ్ యంగ్ చీఫ్ మినిస్టర్‌గా కనిపిస్తారనే టాక్ కూడా బలంగా వినిపిస్తోంది. చరణ్‌కు జోడీగా మరోసారి బాలీవుడ్ బ్యూటీ కియరా అద్వానీ నటించనుందని తెలుస్తోంది. ఇదంతా చూస్తుంటే ఈ మూవీ వీర లెవల్‌లో ఉంటుందని అర్థమవుతోంది కదూ!.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3ctLNI1
v

టాలీవుడ్ బడా నిర్మాతపై కేసు.. పరారీలో ప్రొడ్యుసర్? కొడుకు, కోడలు అరెస్టు

శేరిలింగంపల్లి నియోజకవర్గం నుంచి గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన వెనిగండ్ల (భవ్యాస్ ఆనంద్ ప్రసాద్)పై రామచంద్రాపురం పోలీసులు చీటింగ్ కేసు నమోదు చేశారు. ఆనంద్ ప్రసాద్ కుమారుడు, కోడల్ని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం. భవ్యా కన్‌స్ట్రక్షన్స్ అధినేత, ప్రముఖ సినీ నిర్మాత అయిన వి.ఆనంద్ ప్రసాద్ తనను మోసం చేశారంటూ ఓ వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆనంద్ ప్రసాద్ 2017లో తమ కంపెనీలో పెట్టుబడి పెట్టాలంటూ దానికి బదులుగా ఏటా నాలుగు శాతం లాభాలు తిరిగి ఇస్తామని చెప్పి తన దగ్గర రూ.కోటి డబ్బు తీసుకున్నారని బాధితుడు ఫిర్యాదులో పేర్కొన్నారు. డబ్బు తీసుకొని అసలు ప్రతిఫలం ఇవ్వకుండా దాట వేస్తున్నారని, తిరిగి అడిగితే చంపుతామని బెదిరిస్తున్నారని పేర్కొన్నాడు. ఎన్నికల్లో పోటీ చేసి ఒడిపోయినందున తనకు కొంత సమయం ఇవ్వాలని ఆనంద్ ప్రసాద్ గతంలో కోరినట్లు ఫిర్యాదులో వివరించాడు. తనకు బాచుపల్లి బరంపేట ప్రాంతాల్లో భూములు ఉన్నాయని, వాటిని మీపేరుపై రిజిస్ట్రేషన్ చేస్తామని చెప్పారని అన్నారు. ఇలా చెప్పి కొన్నాళ్ళు గడిపారని ఎన్నిసార్లు అడిగినా సరైన సమాధానం ఇవ్వకపోగా చంపుతామని బెదిరించడంతో తాను ఇలా ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. తమనే కాకుండా తన లాగా మరో వంద మంది కూడా మోసం చేసినట్లు ఆయన తెలిపారు. ఈ మేరకు మోసం చేసిన వెనిగళ్ళ ఆనంద్ ప్రసాద్, అతని భార్య, కుమారుడు, కోడలు, శివ కుమార్ అనే వ్యక్తులపై కేసు నమోదు చేశామని పోలీసులు చెప్పారు. ఇప్పటికే కుమారుడిని, కోడల్ని అరెస్ట్ చేసి ఆనంద్ ప్రసాద్ సహా మిగతా వారి కోసం గాలిస్తున్నట్లు తెలిపారు. వి.ఆనంద్ ప్రసాద్ టాలీవుడ్ పలు చిత్రాలను నిర్మించారు. గోపీచంద్‌ హీరోగా శౌర్యం, వాంటెడ్, లౌక్యం, సౌఖ్యం చిత్రాలు.. రవిబాబు దర్శకత్వంలో అమరావతి, తేజ దర్శకత్వంలో నీకూ నాకూ డ్యాష్ డ్యాష్ వంటి చిత్రాలను నిర్మించారు. బాలయ్య-పూరీ జగన్నాథ్ కాంబినేషన్‌లో వచ్చిన పైసా వసూల్ సినిమా కూడా ఈయన బ్యానర్ నుంచే వచ్చింది. నారారోహిత్‌తో శమంతకమణి, ఇటీవల సందడి చేసిన మిడిల్ క్లాస్ మెలడీస్, చెక్ వంటి సినిమాలకు ఆనంద్ ప్రసాద్ నిర్మాతగా ఉన్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3m1sHMz
v

జనసేన-బీజేపీ అభ్యర్థి కత్తి రత్నప్రభ‌తో కత్తి మహేష్ భేటీ.. ఒకే కులం, ఒకే ఇంటిపేరు అయినా సరే ట్విస్ట్ మామూలుగా లేదు!

పవన్ కళ్యాణ్ పేరు చెబితే కత్తి మహేష్ కస్సున లేస్తుంటాడు. ఎటు నుంచి ఎటు తీసుకుని వచ్చైనా సరే.. పవన్ కళ్యాణ్‌పై కత్తి దూయడంతో జనసైనికుల ఆగ్రహాన్ని చవిచూసే కత్తి మహేష్ జనసేన-బీజేపీ ఉమ్మడి అభ్యర్థి కత్తి రత్నప్రభ‌తో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. కత్తి మహేష్ ఏంటి?? జనసేన అభ్యర్థితో భేటీ కావడం ఏంటి? అంటే ఇప్పుడు రాజకీయాలన్నీ కుల సమీకరణ నేపథ్యంలోనే నడుస్తుండగా.. ఈ భేటీ కూడా అలాంటిదే. ఎస్సి రిజర్వుడు కావడంతో.. కులసమీకరణలో భాగంగా మాదిగ సామాజికవర్గానికి చెందిన ఐఏఎస్ అధికారిణి రత్నప్రభను జనసేన-బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా తిరుపతి బరిలో దించారు. తిరుపతిలో వైఎస్సార్సీపీ అభ్యర్థి గురుమూర్తి, తెలుగుదేశం అభ్యర్థి పనబాక లక్ష్మి ఇద్దరూ మాల సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థులు కాగా.. రత్నప్రభ మాదిక సామాజిక వర్గం కావడంతో అదే సామాజిక వర్గం.. అదే ఇంటి పేరు కలిగిన కత్తి మహేష్.. కత్తి రత్నప్రభ‌తో భేటీ అయ్యారు. కత్తి మహేష్ ఒక్కరే కాదు కానీ.. చిత్తూరు జిల్లాకి చెందిన కొంతమంది మాదిగ నేతలతో భేటీ అయ్యారు కత్తి రత్నప్రభ‌. ఈ సందర్భంగా సోషల్ మీడియా ఆసక్తికరమైన పోస్ట్ పెట్టారు కత్తి మహేష్. కత్తి రత్నప్రభ గారు నిబద్ధత కలిగిన ఐఏఎస్ అధికారిణిగా రాణించారు. దళితజాతికి ఎంతో సేవచేసిన కత్తి చంద్రయ్యగారి వారసురాలు. జనసేన-బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా తిరుపతి బరిలో దిగడం వ్యక్తిగతంగా నాకు ఆనందాన్ని కలిగించే విషయం అని చెప్పిన కత్తి మహేష్ తాజా పోస్ట్‌లో మరో ట్విస్ట్ ఇచ్చారు. ‘చిత్తూరు జిల్లాలో మాదిగ నాయకత్వం లేదు. మాదిగలలో ఐకమత్యం లేదు. ఆర్ధిక వనరులు అంతకన్నా లేవు. స్థానికి మాలలతో పాటు తమిళమాలలు అక్కడ బలమైన వాయిస్ ఉన్న కమ్యూనిటీ. చాలా ఎన్జీవోలు కూడా వాళ్లే రన్ చేసేవాళ్ళు. కాబట్టి, పబ్లిక్ లైఫ్ లో వాళ్లే కనిపిస్తారు. వినిపిస్తారు. అందుకే అన్ని రాజకీయ పార్టీలు మాలలకే ప్రాధాన్యత ఇస్తారు. పర్సెంటేజీ పరంగా మాల-మాదిగల నిష్పత్తికి తేడా 3% మించకపోయినా, మాలలే ఎక్కువ శాతం ఉన్నారు అనే నమ్మకం రాజకీయ వర్గాలలో బలంగా ఉంది. అంతమాత్రం చేత ఓడిపోయే సీటులో బీజేపీ లాంటి దళిత వ్యతిరేక పార్టీ నిలబెట్టిన స్థానికేతర మాదిగ మాజీ ఐఏఎస్ అధికారిణికి ఓటు వెయ్యాలి అనే వాదనలో చాలా లోపం ఉంది. చిత్తూరు జిల్లాకి సంభందించిన మాదిగగా నా దృక్కోణం దీనికి వ్యతిరేకం. కేవలం మాదిగలకు రెప్రజెంటేషన్ ఉండాలి కాబట్టి, మొత్తంగా దళితులకే అన్యాయం చేసే బీజేపీకి ఓటెయ్యడం... నా మనసుకినప్పదు’ అంటూ చివర్లో ట్విస్ట్ ఇచ్చారు కత్తి మహేష్. సో.. భేటీ వరకూ ఓకే కానీ.. ఓటు మాత్రం వేయడం కుదరదని చెప్పకనే చెప్పారు కత్తి మహేష్.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3lXZ1zX
v

క్షమించడం.. అందరి క్షేమం కోసం క్యాన్సిల్ చేయక తప్పలేదు: సింగర్ సునీత పోస్ట్

వివాహం తరువాత సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ అయ్యారు సింగర్ . తన పర్సనల్ లైఫ్ విషయాలతో పాటు సింగర్‌‌గా ప్రొఫెషనల్ అప్డేట్స్‌ని కూడా సోషల్ మీడియా ద్వారా షేర్ చేసుకుంటున్నారు. తాజాగా తన మ్యూజికల్ ఈవెంట్ క్యాన్సిల్ కావడంతో అభిమానులకు క్షమాపణలు తెలియజేస్తూ ఫేస్ బుక్‌లో పోస్ట్ పెట్టింది . శనివారం నాడు హైదరాబాద్‌లోని పీపుల్ ప్లాజాలో ప్రముఖ సంగీత దర్శకుడు మణిశర్మ ఆధ్వర్యంలో ‘మణిశర్మ మ్యూజికల్ నైట్’ ఈవెంట్ జరగాల్సి ఉంది. ఈ కార్యక్రమానికి సింగర్ సునీతతో పాటు గీతామాధురి, రమ్య, సాహితి, రేవంత్, అనురాగ్ కులకర్ణి, శ్రీక్రిష్ణ, సాకేత్ తదితర గాయకులు పాల్గొనాల్సి ఉంది. అయితే హైదరాబాద్‌లో కరోనా కేసులో ఒక్కసారిగా పెరిగిపోవడంతో ఈ మ్యూజిక్ కన్సర్ట్‌ క్యాన్సిల్ అయ్యింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తెలియజేస్తూ.. అభిమానులకు క్షమాపణలు తెలియజేసింది సింగర్ సునీత. అందరి క్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నారని.. అందరూ క్షేమంగా ఉండాలని కోరుతూ ఫేస్ బుక్‌లో పోస్ట్ పెట్టారు సింగర్ సునీత.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2Pag6dW
v

బర్త్ డే చిన్నోడిది.. సందడి మొత్తం పెద్దోడిది.. ఆ గ్రేసు ఏంది ‘ఆచార్యా’.. మళ్లీ వీణ స్టెప్ లాహె లాహె

ఈ పోస్టర్ చూశారుగా.. మెగాస్టార్ స్టైలిష్ స్టెప్‌కి ఎవరైనా విజిల్ కొట్టాల్సిందే అనేట్టుగా ఉంది. 60 ప్లస్‌లో గ్రేసు బహు చూడసక్కగా ఉంది బాసూ అనేట్టుగానే ఉంది. నేడు రామ్ చరణ్ బర్త్ డే సందర్భంగా ‘ఆచార్య’ హడావిడి మామూలుగా లేదండోయ్. చిన్నోడు బర్త్ డే సెలబ్రేషన్స్ అయితే ఈ పెద్దోడు దంచికొడుతున్నాడు. రామ్ చరణ్ పుట్టినరోజు కానుకగా కొరటాల శివ 'ఆచార్య' మూవీ నుంచి స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు. చిరంజీవి- రామ్ చరణ్ కలిసి తొలిసారి ఈ సినిమాలో పూర్తి స్థాయిలో స్క్రీన్ షేర్ చేసుకోబోతుండగా.. తండ్రీ కొడుకులు కలిసి ఉన్న పవర్ ఫుల్ పోస్టర్ రిలీజ్ చేశారు కొరటాల. చేతిలో తుపాకులు పట్టుకుని ''ధర్మానికి ధైర్యం తోడైన వేళ'' అంటూ ఆచార్యతో సిద్ధ సర్ ప్రైజ్ చేశాడు. రియల్ లైఫ్‌లో తండ్రీ కొడుకులైన చిరు, చరణ్‌లు ఆ పోస్టర్‌లో మాత్రం అన్నాతమ్ముడిగానే కనిపిస్తున్నారు. ఇక ఈ పోస్టరే ఫ్యాన్స్‌కి ఫుల్ మీల్స్ అనుకుంటే.. అసలు సిసలు విందుభోజనంలా ఆచార్య నుంచి మరో పోస్టర్ వచ్చింది. మార్చి 31న ఆచార్య నుంచి ‘లాహే.. లాహే’ అనే ఫస్ట్ లిరికల్ సాంగ్‌ను రిలీజ్ చేయబోతున్నారు. మణిశర్మ దరువు వేస్తున్న ఈ సాంగ్‌కి సంబంధించిన పోస్టర్‌ని రామ్ చరణ్ బర్త్ డే సందర్భంగా రిలీజ్ చేశారు. చిరంజీవి బ్లాక్ షర్ట్‌లో వీణ స్టెప్ వేస్తున్నట్టుగా మంచి గ్రేసులో కనిపించి.. స్టెప్పు వేస్తే నేనే వెయ్యాలెహే అనేట్టుగా హరిదాసులతో కలసి అదరగొట్టేశారు చిరు. మొత్తానికి ఈ మెగాస్టెప్పు పోస్టర్ ఫ్యాన్స్ పూనకం రప్పించేట్టుగా ఉంటే.. ఎప్పుడొప్పుడు ‘ఆచార్యా’? అనేట్టుగా ఆసక్తిపెంచేశారు మెగాస్టార్.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3feo94e
v

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...