Wednesday 30 September 2020

Vijay Devarakonda: సౌత్ హీరోల్లో టాప్ లేపిన విజయ్... ఫుల్ ఖుషీలో ఫ్యాన్స్

యంగ్ హీరో విజయ్ దేవరకొండకు యూత్‌లో ఉన్న క్రేజ్ గురించి వేరే చెప్పనక్కర్లేదు. తనని తాను రౌడీగా ఫీలయ్యే ఈ సెన్సేషనల్ స్టార్ అభిమానులను ఎల్లప్పుడూ అలరిస్తూనే ఉంటాడు. రౌడీ బ్రాండ్‌‌తో కొంతకాలం క్రితం ఫ్యాషన్ రంగంలో అడుగుపెట్టిన ఆయన యూత్‌కి ఐకాన్‌గా మారిపోయాడు. బయటే కాదు సోషల్‌మీడియాలోనూ ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే విజయ్ తాజాగా ఓ అరుదైన రికార్డు సాధించాడు. అదేంటో తెలుసా.. ఇన్‌స్టాగ్రామ్‌లో 9 మిలియన్ల ఫాలోవర్స్‌ సాధించుకున్నాడు. సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో 9 మిలియన్ల ఫాలోవర్స్‌ని కలిగిన ఏకైక హీరోగా రికార్డు క్రియేట్ చేశాడు. Also Read: దక్షిణాది ఏ హీరోకూ సాధ్యం కాని రికార్డును సొంతం చేసుకున్న తమ అభిమాన హీరోని చూసి అభిమానులు తెగ సంబర పడిపోతున్నారు. 2018, మార్చి 7న త‌న అకౌంట్‌ని ప్రారంభించారు. ఇంత త‌క్కువ వ్యవధిలోనే 9 మిలియ‌న్ల ఫాలోవ‌ర్స్‌ని సొంతం చేసుకోవ‌డంతో ఆ క్రేజ్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఓ రికార్డుగా చెబుతున్నారు. విజ‌య్ ప్రస్తుతం పూరీ జ‌గ‌న్నాథ్ దర్శకత్వంలో `ఫైట‌ర్‌` సినిమాలో నటిస్తున్నాడు. డైరెక్టర్‌ సుకుమార్‌‌తో చేసే క్రేజీ ప్రాజెక్టుపై కొద్దిరోజుల క్రితమే ప్రకటన వెలువడింది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2Gdosgw
v

పాన్ ఇండియా మూవీగా ‘సైనైడ్’ ... కీలక పాత్రలో ప్రియమణి

మహిళలను ప్రేమ పేరుతో శారీరకంగా అనుభవించి ఆపై గర్భనిరోధక మాత్రలను నమ్మించి సైనైడ్‌ ఇచ్చి చంపేసిన మోహన్ అనే సైకో కిల్లర్ దేశవ్యాప్తంగా కలకలం రేపిన సంగతి తెలిసిందే. కర్ణాటకకు చెందిన మోహన్ ఏకంగా 2003 - 2009 కాలంలో ఏకంగా 20 మంది మహిళలను కనికరం లేకుండా చంపేశాడు. న్యాయస్థానం అతడికి ఆరు మరణశిక్షలు, 14 జీవితఖైదులు విధించింది. ఈ కేసు ఆధారంగా దర్శకుడు రాజేశ్‌ టచ్‌రివర్‌ ‘సైనైడ్‌’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం సహా హిందీలో పాన్‌ ఇండియా మూవీగా ప్రదీప్‌ నారాయణన్‌ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో ఇన్వెస్టిగేటివ్‌ పోలీస్‌ అధికారి పాత్రలో నటించనున్నారు. హిందీలో ఆ పాత్రను యశ్‌పాల్‌ శర్మ పోషిస్తారని దర్శకుడు రాజేశ్‌ తెలిపారు. జనవరి నుంచి షూటింగ్ ప్రారంభిస్తామని నిర్మాత ప్రదీప్‌ నారాయణన్‌ వెల్లడించారు. తనికెళ్ల భరణి, సమీర్‌, రోహిణి, చిత్రంజన్‌ గిరి తదితరులు నటించనున్న ఈ చిత్రానికి జార్జ్‌ జోసెఫ్‌ సంగీతం అందించనున్నారు. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ ‘సంచలనాత్మక కేసు ప్రేరణతో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాం. ఇందులో ప్రియమణి పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపిస్తారు’ అని తెలిపారు. ‘‘20 మంది మహిళలను ప్రేమ పేరుతో శారీరకంగా లొంగదీసుకుని ఆ తర్వాత హత్యలకి పాల్పడిన మోహన్‌ కథే ఈ సినిమా. జనవరి నుంచి షూటింగ్ స్టార్ అవుతుంది. బెంగళూరు, మంగళూరు, కూర్గ్‌, మడిక్కెరి, గోవా, హైదరాబాద్‌ తదితర ప్రాంతాల్లో చిత్రీకరణ చేస్తాం’’ అని నిర్మాత తెలిపారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3jkhKDE
v

కీర్తిసురేష్ సినిమాపై వివాదం... నట్టికుమార్ కొడుకు, కుమార్తెపై కేసు నమోదు

సినీ నిర్మాత నట్టి కుమార్‌ కుమారుడు, కుమార్తెలపై బంజారాహిల్స్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. నట్టిస్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ అధినేత నట్టి క్రాంతి, క్విటీస్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌కు చెందిన నట్టి లక్ష్మి కరుణ సినీ హక్కుల విషయంలో తనను మోసం చేశారంటూ ఫ్రెండ్లీ మూవీస్‌ యజమాని అడ్డాల చంటి పోలీసులకు ఫిర్యాదు చేశారు. బంజారాహిల్స్ ఇన్‌స్పెక్టర్‌ కళింగరావు కథనం ప్రకారం.. సీనియర్ నటుడు నరేస్ తనయుడు నవీన్‌ విజయ కృష్ణ, కీర్తి సురేష్‌ జంటగా నటించిన ‘ఐనా ఇష్టం నువ్వు’ సినిమాకు సంబంధించి ప్రసార, శాటిలైట్‌, డిజిటల్‌ హక్కులు అడ్డాల చంటి వద్ద ఉన్నాయి. Also Read: ఆ హక్కులను తమకు విక్రయించాలని నట్టి క్రాంతి, నట్టి లక్ష్మీకరుణ కొంతకాలం క్రితం చంటిని సంప్రదించారు. ఇందుకోసం రూ.45 లక్షలు మూడు వాయిదాల్లో చెల్లిస్తామని ఒప్పందం చేసుకుని మూడు చెక్కులిచ్చారు. అయితే చెక్కుల్లో ఉన్న అమౌంట్‌లో తేడా ఉండటంతో మరో మూడు చెక్కులు ఇస్తామని నమ్మించారు. ఎన్ని రోజులు గడుస్తున్నా వారి నుంచి రెస్పాన్స్ లేకపోవడంతో చంటి ఆ సినిమా హక్కుల ఒప్పందాన్ని రద్దు చేసుకున్నారు. వారిద్దరిపై తెలుగు ఫిలిం ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌లో సైతం చంటి ఫిర్యాదు చేశారు. ఈ సమయంలోనే నట్టి క్రాంతి, నట్టి లక్ష్మి కరుణ తామే నిర్మాతలుగా ఆ సినిమా పోస్టర్లు తయారు చేయించి సోషల్‌ మీడియాలోనూ విడుదల చేశారు. దీంతో షాకైన చంటి బుధవారం బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి నట్టి క్రాంతి, నట్టి లక్ష్మి కరుణపై ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3jkccsO
v

‘డ్రగ్స్ అమ్ముకోవాల్సిన అవసరం మాకు లేదు’.. అధికారులపై హీరోయిన్ల ఫైర్

డ్రగ్స్‌ కేసులో అరెస్టయి ప్రస్తుతం బెంగళూరులోని పరప్పన అగ్రహార జైలులో ఉన్న కన్నడ హీరోయిన్లు సంజనా గల్రాని, రాగిణి ద్వివేదిలను ఈడీ అధికారులు బుధవారం కూడా విచారించారు. సంజనా పేరిట 11 బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయని, వాటిలో రూ.40లక్షల వరకు అమౌంట్ ఉన్నట్లు గుర్తించారు. గతంలో ఆమె ఐఎంఏ సంస్థలో పెద్ద మొత్తంలో బంగారంపై పెట్టుబడి పెట్టినట్ల విచారణలో వెలుగులోకి వచ్చింది. సంజనాకు అరెస్ట్ చేయడానికి నాలుగు వారాల ముందు నుంచి అనేక బ్యాంక్ అకౌంట్లలోకి భారీగా నగదు ట్రాన్స్‌ఫర్ అయినట్లు గుర్తించారు. కూడా విదేశాల నుంచి డ్రగ్స్‌ తెప్పించుకుని చాలామందికి సరఫరా చేసిందన్న కోణంలో అధికారులు విచారించారు. వీరితో పాటు జైలులో ఉన్న ఇతర నిందితులను కూడా అధికారులు ప్రశ్నిస్తున్నారు. అయితే తాము ఎలాంటి అక్రమాలకు పాల్పడలేదని, సినిమాలు, షాపింగ్‌మాల్స్ ఓపెనింగ్స్, యాడ్స్‌ ద్వారానే ఆదాయం సంపాదించామని ఇద్దరు హీరోయిన్లు తెగేసి చెబుతున్నట్లు తెలుస్తోంది. డ్రగ్స్ అమ్ముకుని సొమ్ము చేసుకోవాల్సిన అవసరం తమకు లేదని అధికారులతో వాదనకు దిగినట్లు సమాచారం. Also Read: అయితే నగదు బదిలీ, డ్రగ్స్ సరఫరాకు సంబంధించిన ప్రశ్నలకు వారిద్దరు అస్పష్టంగా సమాధానం చెప్పినట్లు అధికారులు చెబుతున్నారు. దీంతో సంజనా, రాగిణిని మరింత విచారించి సరైన సమాధానాలు రాబట్టాలని పోలీసులు యోచిస్తున్నారు. ఇప్పటికే డ్రగ్స్ కేసులో ఉచ్చు బిగుసుకున్న ఇద్దరు హీరోయిన్లపై తాజాగా సెక్స్ రాకెట్ ఆరోపణలు వచ్చాయి. వ్యభిచారం నిర్వహణకు వీరు ఓ వాట్సాప్ గ్రూపు నిర్వహించేవారని, పోలీసులు అరెస్ట్ చేసే ముందు దాన్ని డిలీట్ చేసినట్లు తెలుస్తోంది. దీనిపైనా పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/33fp0Ls
v

‘ధృవ’సీక్వెల్‌పై‌ రూమర్స్.. రామ్‌చరణ్ ఆలోచన ఏంటి?

మెగా పవర్‌స్టార్ కెరీర్లో ‘ధృవ’ సినిమా ప్రత్యేకంగా నిలుస్తుంది. యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమాతో ఆయన ఇమేజ్ భారీగా పెరిగింది. తమిళంలో జయం రవి నటించి... అతని సోదరుడు మోహన్‌ రాజ్‌ తెరకెక్కించిన ‘తని ఒరువన్‌’ సూపర్‌హిట్‌గా నిలిచింది. దీనికి డైరెక్టర్ సురేందర్‌రెడ్డి కొన్ని మార్పులు చేసి తెలుగులో తెరకెక్కించారు. రామ్‌చరణ్ స్టైల్, యాక్షన్‌కు తోడు అరవిందస్వామి విలనిజంతో ఈ సినిమా తెలుగులోనూ భారీ విజయం సాధించింది. అయితే ఇప్పుడు ఆ జయం రవి, అతడి సోదరుడు ‘తని ఒరువన్‌-2’ తెరకెక్కించే పనిలో పడ్డారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని, వచ్చే ఏడాది ఫిబ్రవరి నుంచి షూటింగ్ మొదలవుతుందిన కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. జయం రవి ప్రస్తుతం మణిరత్నం తెరకెక్కిస్తున్న ‘పొన్నియన్‌ సెల్వన్‌’ చిత్రంలో నటిస్తున్నారు. ఆ షూటింగ్ జనవరికల్లా పూర్తి చేసుకుని ఫిబ్రవరి నుంచి ‘తని ఒరువన్‌-2’ కోసం రంగంలోకి దిగాలని ప్లాన్ చేసుకున్నారట. దీంతో తెలుగులోనూ ‘ధృవ-2’ తీస్తారా? అందులో రామ్‌చరణ్ నటిస్తారా? లేదా? అని ఫిల్మ్‌నగర్‌లో చర్చ నడుస్తోంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3kZ4sNm
v

వాళ్లను కాపాడటానికి రక్తదానం ఒక్కటే పరిష్కారం : బాలకృష్ణ

వైద్య రంగం ఎంతగా అభివృద్ధి చెందినా కృత్రిమంగా రక్తం తయారు చేయడం కుదరదని అన్నారు హీరో, హిందూపురం ఎమ్మెల్యే . అందువల్లే అందరూ రక్తదానం చేయాలని సూచించారు. ముఖ్యంగా వ్యాధిగ్రస్తులను ఆదుకునేందుకు రక్తదానం చేయాలని పిలుపునిచ్చారు. ఈ మేరకు ఓ వీడియోను ఆయన విడుదల చేశారు. Also Read: ప్రస్తుతం దేశంలో సంవత్సరానికి 10-12వేల మంది తలసేమియా వ్యాధితో జన్మిస్తున్నారని, వారికి రక్తాన్ని ఎక్కించాల్సిన అవసరం ఉందన్నారు. వీరి కోసం కృత్రిమ రక్తాన్ని తయారు చేయలేం కాబట్టి.. రక్తదానం ఒక్కటే పరిష్కారమని తెలిపారు. ఎదుటివారికి రక్తదానం, ప్లాస్మా దానం చేయడం వల్ల మనకెలాంటి దుష్పరిణామాలు ఉండవని చెప్పారు. అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా తలసేమియా బాధితుల కోసం తెలంగాణా తెలుగు యువత, ఎన్టీఆర్ ట్రస్ట్ సహకారంతో రక్తదాన శిబిరం నిర్వహిస్తున్నట్టు బాలకృష్ణ తెలిపారు. నందమూరి అభిమానులు, టీడీపీ కార్యకర్తలు, ఆరోగ్యంగా ఉన్న ప్రతి ఒక్కరూ రక్తదానం చేసి ఆపదలో ఉన్న వారి ప్రాణాలను కాపాడాలని ఆయన పిలుపునిచ్చారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/30k9VXl
v

వాళ్లను కాపాడటానికి రక్తదానం ఒక్కటే పరిష్కారం : బాలకృష్ణ

వైద్య రంగం ఎంతగా అభివృద్ధి చెందినా కృత్రిమంగా రక్తం తయారు చేయడం కుదరదని అన్నారు హీరో, హిందూపురం ఎమ్మెల్యే . అందువల్లే అందరూ రక్తదానం చేయాలని సూచించారు. ముఖ్యంగా వ్యాధిగ్రస్తులను ఆదుకునేందుకు రక్తదానం చేయాలని పిలుపునిచ్చారు. ఈ మేరకు ఓ వీడియోను ఆయన విడుదల చేశారు. Also Read: ప్రస్తుతం దేశంలో సంవత్సరానికి 10-12వేల మంది తలసేమియా వ్యాధితో జన్మిస్తున్నారని, వారికి రక్తాన్ని ఎక్కించాల్సిన అవసరం ఉందన్నారు. వీరి కోసం కృత్రిమ రక్తాన్ని తయారు చేయలేం కాబట్టి.. రక్తదానం ఒక్కటే పరిష్కారమని తెలిపారు. ఎదుటివారికి రక్తదానం, ప్లాస్మా దానం చేయడం వల్ల మనకెలాంటి దుష్పరిణామాలు ఉండవని చెప్పారు. అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా తలసేమియా బాధితుల కోసం తెలంగాణా తెలుగు యువత, ఎన్టీఆర్ ట్రస్ట్ సహకారంతో రక్తదాన శిబిరం నిర్వహిస్తున్నట్టు బాలకృష్ణ తెలిపారు. నందమూరి అభిమానులు, టీడీపీ కార్యకర్తలు, ఆరోగ్యంగా ఉన్న ప్రతి ఒక్కరూ రక్తదానం చేసి ఆపదలో ఉన్న వారి ప్రాణాలను కాపాడాలని ఆయన పిలుపునిచ్చారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/30k9VXl
v

ఆ ఘనతకు 21ఏళ్లు.. జ్ఞాపకాల్లో మునిగి తేలుతున్న త్రిష

తమిళ, తెలుగు భాషల్లో సుమారు దశాబ్దం పాటు అగ్ర హీరోయిన్‌గా కొనసాగింది చెన్నై బ్యూటీ త్రిష. రెండు భాషల్లోనూ స్టార్ హీరోలతో పాటు యంగ్ హీరోలతోనూ ఆడిపాడింది. అయితే సినిమాల్లోకి రాకముందు ‘మిస్ చెన్నై’ ఎంపికైన సంగతి అందరికీ తెలిసిందే. సరిగ్గా 21ఏళ్ల క్రితం అంటే 30-09-1999వ తేదీన ఆమె ఈ టైటిల్ గెలుచుకుంది. Also Read: ఆ సందర్భాన్ని త్రిష తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా గుర్తుచేసుకుంది. `మిస్ చెన్నై`గా నిలిచినప్పటి ఫొటోను షేర్ చేసింది. ‘30-09-1999.. ఆ రోజు నా జీవితం మారిపోయింది. ‘మిస్ చెన్నై 1999’ అంటూ కామెంట్ చేసింది. దీంతో నెటిజన్లు త్రిషను అభినందనలతో ముంచెత్తుతున్నారు. Also Read:


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/36jyEi9
v

బీచ్‌‌లో చెమటోడుస్తున్న రష్మిక... వైరల్‌గా మారిన వర్కవుట్‌ వీడియో

‘ఛలో’ సినిమాతో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన కన్నడ బ్యూటీ అతి తక్కువ సమయంలోనే స్టార్ హోదా దక్కించుకుంది. ఈ ఏడాది సరిలేరు నీకెవ్వరు, భీష్మ సినిమాలతో బ్లాక్‌బస్టర్ హిట్లు అందుకున్న రష్మిక తాజాగా... సుకుమార్, అల్లు అర్జున్ కాంబినేషన్లో వచ్చిన ‘పుష్ప’ సినిమాలో ఛాన్స్ దక్కించుకుంది. దీంతో పాటు మెగాస్టార్ ‘ఆచార్య’లో రామ్‌చరణ్ సరసన నటించనున్నట్లు తెలుస్తోంది. Also Read: సోషల్‌ మీడియాలో యాక్టివ్‌ ఉండే ఈ అమ్మడు తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్లో ఓ ఇంట్రస్టింగ్ వీడియో పోస్ట్ చేసింది. తొలిసారి బీ‌చ్‌లో వర్కవుట్స్ చేస్తూ ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్ ఇచ్చింది. ‘ఇది నేను చేసిన మొదటి బీచ్‌ వర్కవుట్‌ వీడియో. సముద్ర అలల శబ్దం, మట్టి వాసన, సూర్యాస్తమయం, నా పాదాల వ్యతిరేకంగా ఇసుక, ఇది ఎంతో బ్యూటిఫుల్‌గా ఉంది. భవిష్యత్‌లో కూడా ఇలాంటి వర్కవుట్ చేస్తూ వీడియో తయారు చేయాలనుకుంటున్నా’ అంటూ వీడియోతో పాటు మెసేజ్ పోస్ట్ చేసింది రష్మిక.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2SbNvCX
v

‘నా తప్పు ఏమున్నదబ్బా’.. స్టెప్పులతో మతిపోగొట్టిన ఊర్వశి రౌటేలా

మాజీ మిస్ ఇండియా, బాలీవుడ్ హీరోయిన్ తెలుగులో నటిస్తున్న తొలి చిత్రం ‘బ్లాక్ రోజ్’. ఈ సినిమాకు సంబంధించి ప్రమోషనల్ సాంగ్‌ను యూనిట్ బుధవారం సాయంత్రం విడుదల చేసింది. `నా తప్పు ఏమున్నదబ్బా` అంటూ సాగే ఈ పాటలో ఊర్వశి దుమ్మురేపే డ్యాన్సులతో మతి పోగొడుతోంది. శ్రీనివాస సిల్వర్‌ స్క్రీన్ పతాకంపై తెరకెక్కుతున్న ‘బ్లాక్ రోజ్’ సినిమాలో ఊర్వశి టైటిల్ రోల్ పోషిస్తోంది. ఏమైంది ఈవేళ, రచ్చ , బెంగాల్ టైగర్ వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను అలరించిన ప్రముఖ దర్శకుడు సంపత్ నంది ఈ చిత్రానికి కథ అందిస్తున్నారు. షేక్‌ స్పియ‌ర్‌ రచించిన “ది మర్చంట్ ఆఫ్ వెనిస్`` లోని జ్యూయిష్ మనీ లెండర్ షైలాక్ పాత్ర ఆధారంగా ఫిమేల్ ఓరియెంటెడ్ ఎమోషనల్ థ్రిల్లర్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. అనేక సూపర్ హిట్ చిత్రాల‌ను నిర్మించిన నిర్మాత శ్రీనివాసా చిట్టూరి పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా సిల్వర్‌ స్క్రీన్‌ పతాకంపై ప్రొడక్షన్ నెం:4గా తెలుగు, హిందీ భాషల్లో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. స్నేహ గీతం, దొంగాట చిత్రాలకు స్క్రీన్ ప్లే రైటర్ గా పనిచేసిన మోహన్ భరద్వాజ్ ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3jc8MbD
v

బెడ్రూమ్ సీన్స్ ఆఫర్లే ఎక్కువగా వస్తున్నాయి: ఆండ్రియా

తమిళ సినీ పరిశ్రమలో సింగర్‌గా అడుగుపెట్టి నటిగా మారింది జెరెమియా. 'కండనాల్‌ ముదల్‌' అనే చిత్రం ద్వారా కోలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు ఆ తర్వాత 'పచ్చైకిళి ముత్తుచరం'లో శరత్‌కుమార్‌కు జంటగా నటించింది. కార్తీతో 'ఆయిరత్తిల్‌ ఒరువన్'(యుగానికొక్కడు) చిత్రంలో నటించి తమిళ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. కమల్‌తో ‘విశ్వరూపం’ చిత్రంలో నటించింది. ఆమె నటించిన సినిమాల్లో చాలావరకు తెలుగులోనూ డబ్ కావడంతో టాలీవుడ్ ప్రేక్షకులకూ ఆమె సుపరిచితమే. Also Read: గతంలో యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్‌తో రొమాన్స్ చేసిన ఫోటోలు సోషల్‌మీడియాలో చక్కర్లు కొట్టాయి. యాక్టింగ్‌తో పాటు హాట్‌ హాట్ సీన్లలోనూ ఆండ్రియా ఇతర హీరోయిన్లకు పోటీ పడుతుంటుంది. ఈ కోవలోనే ‘వడచెన్నై’ సినిమాలో బెడ్రూమ్ సన్నివేశాల్లో రెచ్చిపోయి నటించింది. అయితే ఆ సీన్లలో చాలావరకు ఎడిటింగ్‌లో తీసేశారు. కానీ అవన్నీ ఆ తర్వాత సోషల్‌మీడియాలో లీక్ కావడంతో ఆండ్రియా దిగ్భ్రాంతి చెందింది. ఈ సందర్భంగా ఆండ్రియా మాట్లాడుతూ ‘వడచెన్నై’ చిత్రంలో పడక సీన్లలో నటించి తప్పుచేశానని, అప్పటి నుంచి బెడ్‌రూమ్‌ సీన్లతో ఉన్న సినిమాల్లో నటించే అవకాశాలే ఎక్కువగా వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేసింది. మంచి పాత్రలకు సంబంధించి ఆఫర్లు వస్తే రెమ్యునరేషన్ తగ్గించుకోవడానికి కూడా తాను సిద్ధంగా ఉన్నానని ఆండ్రియా తెలిపింది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3n65aKr
v

‘కోబలి’పై క్రేజీ న్యూస్... బండ్ల గణేష్‌తో చేసే సినిమా అదేనా?

పవన్‌కు తాను అభిమానిని కాదని.. భక్తుడినంటూ చెబుతుంటారు నిర్మాత బండ్ల గణేష్. ఆయనతో గబ్బర్‌సింగ్ లాంటి బ్లాక్‌బస్టర్ మూవీని తీసిన ఆయన తన దేవుడితో మరో సినిమా తీయనున్నట్లు రెండ్రోజుల క్రితం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆయన ప్రకటనతో పవన్ ఫ్యాన్స్‌లో జోష్ పెరిగింది. వీరిద్దరి కాంబోలో గబ్బర్‌సింగ్ లాంటి సినిమా రిపీట్ కావాలని కోరుకుంటున్నారు. అయితే ఈ సినిమా వివరాలు, సాంకేతిక నిపుణుల వివరాలను బండ్ల గణేష్ వెల్లడించలేదు. Also Read: అయితే ఈ సినిమాలో టాలీవుడ్‌లో అప్పుడే రూమర్లు చక్కర్లు కొడుతున్నాయి. గతంలో .. పవన్‌తో ‘’ పేరుతో భారీ బడ్జెట్ మూవీ ప్లాన్ చేశారు. సోషియో ఫాంటసీ కథతో తెరకెక్కించేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నాక ఈ ప్రాజెక్ట్ అటకెక్కింది. ఇటీవల పవన్‌ మళ్లీ బిజీగా మారడంతో ‘కోబలి’ మళ్లీ తెరపైకి వచ్చింది. ఇప్పుడు బండ్ల గణేష్‌ పవన్‌తో మూవీ అనౌన్స్ చేయగానే అది ‘కోబలి’ అనే వార్తలు వినిపిస్తున్నాయి. పవన్ ‘వకీల్ సాబ్’ తర్వాత మరో మూడు చిత్రాలకు ఓకే చెప్పేశారు. అటు త్రివిక్రమ్ ఎన్టీఆర్‌తో సినిమా చేయాల్సి ఉంది. దీంతో ఆయన ఎన్టీఆర్‌తో మూవీ తర్వాత కోబలి ప్రీ ప్రొడక్షన్ పూర్తి చేసి, పవన్ మూడు సినిమాలు పూర్తయ్యాక షూటింగ్ ప్రారంభించేలా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ వార్త నిజమే అయితే పవన్ ఫ్యాన్స్‌కు పండగే అని చెప్పొచ్చు. Also Read:


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2Sem4IU
v

వ్యభిచారం కోసం వాట్సాప్ గ్రూపు.. మరిన్ని చిక్కుల్లో రాగిణి, సంజనా

డ్రగ్స్ కేసులో ఇరుక్కుని జైలు జీవితం గడుపుతున్న కన్నడ హీరోయిన్లు , మరో వివాదంలో చిక్కుకున్నారు. కేసులు చాలవన్నట్లు కొత్తగా సెక్స్ రాకెట్‌‌ వ్యవహారంలో వీరిపై ఆరోపణలు వచ్చాయి. డ్రగ్స్ కేసులో బెయిల్ పిటిషన్‌ను న్యాయస్థానం తిరస్కరించడంతో రాగిణి, సంజన దాని నుంచి బయటపడే మార్గాలు అన్వేషిస్తున్నారు. ఈ సమయంలోనే వారిపై సెక్స్ రాకెట్‌ ఆరోపణలు రావడం కలకలం రేపింది. డ్రగ్స్ కేసు విచారణలో హీరోయిన్లను కస్టడీలోకి తీసుకుని ప్రశ్నించిన సీసీబీ పోలీసులు వారి మొబైల్ ఫోన్స్ పరిశీలించారు. వాటిలో ఇతర అమ్మాయిల అశ్లీల వీడియోలు, అర్ధనగ్న ఫోటోలు కనిపించడంతో పోలీసులు కంగుతిన్నారు. వీరికి సెక్స్ రాకెట్‌తో సంబంధాలున్నాయన్న అనుమానాలు రావడంతో మరింత లోతుగా విచారణ చేస్తున్నారు. Also Read: వ్యభిచారంతో పాటు బ్లూ ఫిలిమ్స్‌ రాకెట్లకు సంబంధించి రాగిణి, సంజనా ఓ ప్రత్యేక వాట్సాప్ గ్రూపు నిర్వహించేవారని, డ్రగ్స్ వ్యవహారం వెలుగులోకి రాగానే ఆ గ్రూప్‌ను డిలీట్ చేశారని పోలీసులు గుర్తించారు. సాంకేతిక నిపుణుల సాయంతో ఆ వాట్సాప్‌ గ్రూపులో సమాచారాన్ని రికవరీ చేసిన సీసీబీ పోలీసులు ఆ గ్రూపులో సభ్యులుగా ఉన్న వారందరికీ నోలీసులు పంపి విచారించాలని అనుకుంటున్నారు. ఈ విచారణ జరిగితే ఇంకెన్ని షాకింగ్ విషయాలు వెలుగులోకి వస్తాయో? అన్న అనుమానాలు కలుగుతున్నాయి. Also Read:


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3ie3hYv
v

ఒక రోజు ముందుగానే ‘ఒరేయ్ బుజ్జిగా’ విడుదల.. పొట్టచెక్కలైపోయే కామెడీ!

యంగ్‌ హీరో రాజ్‌ తరుణ్, మాళవిక నాయర్ జంటగా నటించిన చిత్రం ‘ఒరేయ్ బుజ్జిగా’. విజయ్ కుమార్ కొండా దర్శకత్వం వహించారు. శ్రీమతి లక్ష్మీ రాధామోహన్‌ సమర్పణలో శ్రీసత్యసాయి ఆర్ట్స్‌ పతాకంపై కె.కె.రాధామోహన్‌ నిర్మించారు. రొమ్‌కామ్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌కెక్కిన ఈ చిత్రాన్ని అక్టోబర్ 2న ‘ఆహా’లో విడుదల చేస్తున్నట్టు ఇప్పటికే ప్రకటించారు. అయితే, అంతకన్నా ముందుగానే అంటే రేపు (అక్టోబ‌ర్ 1న) సాయంత్రం 6 గంట‌లకే ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్టు నిన్న జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ప్రకటించారు. ఈ ఈవెంట్‌ మంగళవారం రాత్రి హైద‌రాబాద్‌లోని ట్రైడెంట్ హోట‌ల్‌లో జ‌రిగింది. ఈ వేడుకలో కమెడియన్ స‌ప్తగిరి మా‌ట్లాడుతూ.. ‘‘ఐదు నెలల డార్క్ డేస్‌ త‌ర్వాత ఈ స్టేజి మీద నిల‌బ‌డి మాట్లాడ‌డం చాలా బాగుంది. ఈ సినిమాలో ఒక సీక్వెన్స్‌తో మిమ్మల్నంద‌రిని హిలేరియ‌స్‌గా న‌వ్వించ‌బోతున్నాం. బాస్ బామ్మర్ది అనే క్యారెక్టర్లో ఈ సినిమాలో క‌న‌ప‌డ‌బోతున్నాను. నేను, రాజ్‌త‌రుణ్‌, పోసాని, మాళ‌విక‌, న‌రేష్‌గారు చేసిన ఆ సీక్వెన్స్ మిమ్మల్ని క‌డుపుబ్బా న‌వ్వించి ప‌దే ప‌దే మాట్లాడుకునే విధంగా ఉంటుంది. ఇంత మంచి క్యారెక్టర్ ఇచ్చిన విజ‌య్ గారికి, రాధా మోహ‌న్‌గారికి ధ‌న్యవాదాలు’’ అని అన్నారు. కొరియోగ్రాఫర్ శేఖ‌ర్ మాస్టర్ మాట్లాడుతూ.. ‘‘ఇలాంటి ఫంక్షన్స్ చూసి చాలా రోజులైంది. విజ‌య్ గారు డైరెక్ట్ చేసిన మూడు సినిమాల్లో అన్ని పాట‌లు నాతోనే కొరియోగ్రఫి చేయించారు. ఈ సినిమాలో అవ‌కాశం ఇచ్చిన రాధా మోహ‌న్ గారికి, విజ‌య్ గారికి ఈ సంద‌ర్భంగా నా కృత‌జ్ఞత‌లు. ఆండ్రూ గారి ఫోటోగ్రఫీకి నాతో పాటు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఈ సినిమాలో అన్ని సాంగ్స్ చాలా బాగా పిక్చరైజ్ చేశారు. ఈ సినిమాతో రాజ్ త‌రుణ్ మంచి డ్యాన్సర్ అని మ‌రోసారి ప్రూవ్ చేసుకుంటాడు. అనూప్ అన్నీ మంచి ట్యూన్స్ ఇచ్చారు. మాళ‌విక చ‌క్కగా న‌టించింది’’ అని అన్నారు. ద‌ర్శకుడు విజ‌య్‌ కుమార్ కొండా మాట్లాడుతూ.. ‘‘మూడు సంవ‌త్సరాల క్రితం నేను నెక్ట్స్ ఏం సినిమా చేయాలి అని ఆలోచ‌న వ‌చ్చిన‌ప్పుడు అంద‌రినీ న‌వ్వించే సినిమా చేయాలి అని డిసైడ్ అయ్యాను. అలా ఒక పాయింట్‌గా స్టార్ట్ చేసి నా స్నేహితుడు నంద్యాల ర‌వితో క‌లిసి చాలా రోజులు ట్రావెల్ చేసి ఈ క‌థ రాశాను. మధ్యలో మ‌ధునంద‌న్, ప్రకాశ్ మాకు హెల్ప్ చేశారు. ఈ సినిమాలో డైలాగ్స్ ఇంత బాగున్నాయి అంటే దానికి కార‌ణం నంద్యాల ర‌వి పెట్టిన ఎఫ‌ర్ట్‌. ఈ క‌థ ఎవ‌రితో తీస్తే బాగుంటుంది అనుకున్నప్పుడు రాజ్‌ త‌రుణ్ బెస్ట్ చాయిస్ అనిపించింది. త‌ర్వాత రాధా మోహ‌న్ గారిని క‌లిసి స‌ర్ సినిమాకు కొంచెం ఎక్కువ ఖ‌ర్చు అవుతుంది అని చెప్పాను. ఆయ‌న క‌థ‌ను, నన్ను న‌మ్మి ఖ‌ర్చుకు వెన‌కాడ‌కుండా సినిమాకు ఏది కావాలో అవ‌న్ని స‌మ‌కూర్చి మాకు హెల్ప్ చేశారు. సినిమాలో చాలా పెద్ద ప్యాడింగ్ ఉంటుంది. మేము థియేట‌ర్‌లో మీ న‌వ్వుల్నే మిస్ అవుతున్నాం కాని మీరు న‌వ్విన ప్రతిసారి మా మాట‌లు గుర్తొస్తాయి. డెఫినెట్‌గా ఆహాలో ఒక మంచి సినిమా అవుతుంది. మేము ఎంత నిజాయితీగా సినిమా చేశామో మీరు అంత నిజాయితీగా ఆహాలోనే సినిమా చూడండి. థ్యాంక్యూ’’ అని అన్నారు. నిర్మాత కె.కె.రాధామోహ‌న్ మాట్లాడుతూ.. ‘‘ఆరు నెలల త‌ర్వాత ఇలాంటి ఫంక్షన్ చేస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. ఒరేయ్ బుజ్జిగా లాంటి ఒక మంచి ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ రూపొందించాలంటే ఆర్టిస్టులు, టెక్నీషియ‌న్స్ అంద‌రి స‌హ‌కారం ఉండాలి. అలా పూర్తిగా అంద‌రి స‌హ‌కారంతోనే ఈ సినిమా పూర్తిచేయ‌గ‌లిగాను. ద‌ర్శకుడు విజ‌య్ కుమార్ గారు స్టార్‌బ‌క్స్ కాఫీ హౌస్‌లో ఫ‌స్ట్ ఈ స్టోరీ నాకు చెప్పారు. త‌ను నంద్యాల ర‌వి కొన్ని సంవ‌త్సరాలు క‌ష్టప‌డి ఫ్లాలెస్‌గా ఒక స్క్రిప్ట్‌ని త‌యారు చేసి ఆ స్క్రిస్ట్‌ని న‌న్ను ప్రొడ్యూస్ చేయ‌మ‌ని అడిగారు. సినిమా చెయొచ్చు కాని ఆ స‌బ్జెక్ట్‌కి మంచి టీమ్ కుద‌రాలి అనుకున్నాను. అలా మంచి టీమ్‌, మంచి ప్యాడింగ్ కుదిరింది. అంద‌రు కష్టప‌డి ఒక మంచి సినిమాగా చేశారు. త‌ప్పకుండా ప్రతి ఒక్కరూ సినిమా చూసి ఎంజాయ్ చేస్తారు. ఫుల్ లెంగ్త్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా ఈ సినిమా ఆహాని మ‌రోమెట్టు ఎక్కిస్తుంద‌ని మేము న‌మ్ముతున్నాము’’ అని అన్నారు. హీరో రాజ్ త‌రుణ్ మాట్లాడుతూ.. ‘‘ఇప్పట్లో ఇలాంటి ఒక ఈవెంట్ జ‌రుగుతుంద‌ని నేను ఊహించ‌లేదు. ముందుగా శేఖ‌ర్ మాస్టర్, విజ‌య్‌ ప‌ట్టుబ‌ట్టి నాతో ఈ సినిమాలో డ్యాన్స్ వేయించారు. అలాగే ఆండ్రూ గారు స్పీడ్‌, క్వాలిటీ రెండు ఒకేసారి ఎలా చేస్తారో నాకు తెలీదు. మ‌ధు యాక్టర్‌గానే కాకుండా స్క్రిప్ట్‌లో కూడా హెల్ప్ చేశారు. నంద్యాల ర‌వి గారు పేప‌ర్‌మీద పెన్ను పెడితే న‌వ్వులు పూస్తాయి. స‌ప్తగిరి గారు చాలా బాగా న‌టించారు. అనూప్ అద్భుత‌మైన మ్యూజిక్ ఇచ్చారు. ఈ సినిమాలో మాళ‌వికని ఒక కొత్త కోణంలో చూస్తారు. చాలా బాగా న‌టించింది. ఈ సినిమా నాతో చేసినందుకు విజ‌య్‌గారికి థ్యాంక్స్‌. అయితే నా త‌ర‌పున ఆహా వారికి, ప్రొడ్యూస‌ర్‌ గారికి ఒక రిక్వస్ట్. నాకు చాలా మంది మెసేజెస్ పెడుతున్నారు. సినిమా బ‌జ్ చాలా బాగుంది.. సినిమాని ఒక‌రోజు ముందుగా మాకు చూపించండి అని అడుగుతున్నారు. వారంద‌రి కోసం సినిమాని ఒక‌రోజు ముందుగా ప్రీమియ‌ర్ వేయాల్సిందిగా కోరుకుంటున్నాను’’ అని అన్నారు. రాజ్ త‌రుణ్, ప్రేక్షకుల కోరిక మేర‌కు అక్టోబ‌ర్ 1 సాయంత్రం 6 గంట‌ల‌ నుండి ఆహాలో ఒరేయ్ బుజ్జిగా అందుబాటులో ఉంటుంద‌ని నిర్మాత రాధా మోహ‌న్ తెలిపారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/30mMcWe
v

బాలీవుడ్ డ్రగ్స్‌ కేసులో షాకింగ్ ట్విస్ట్... తెరపైకి ముగ్గురు స్టార్ హీరోలు

డ్రగ్స్‌ కేసులో హీరోయిన్ ఇప్పటికే అరెస్ట్ కాగా.. దీపికా పదుకొనే, శ్రద్ధా కపూర్, సారా అలీఖాన్, రకుల్‌ప్రీత్ సింగ్ తదితురులు ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. నలుగురు హీరోయిన్లను నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు విచారించి కీలక సమాచారాన్ని రాబట్టారు. టెక్నాలజీ సాయంతో వీరి మొబైల్ డేటాను పునరుద్ధరించిన ఎన్సీబీ అధికారులకు షాకిచ్చే సమాచారం లభించినట్లు తెలుస్తోంది. ఆ ఇన్ఫర్మేషన్ ఆధారంగా డ్రగ్స్ వ్యవహారంలో ముగ్గురు స్టార్ హీరోలు భాగస్వాములుగా ఉన్నట్లు తెలుస్తోంది. బాలీవుడ్‌లో బడా హీరోలుగా చెలామణి అవుతున్న వారు డ్రగ్స్‌ ఉపయోగిస్తున్నట్లు పక్కా ఆధారాలు లభించినట్లు ఎన్సీబీ వర్గాలు చెబుతున్నాయి. త్వరలోనే వారికి కూడా నోటీసులు పంపించి విచారించనున్నట్లు తెలుస్తోంది. ఆ హీరోలు నోరు విప్పితే డ్రగ్స్ గుట్టు మొత్తం బయటపడటం ఖాయంగా కనిపిస్తోంది. ప్రస్తుతం వారి ఫోన్లపై ఎన్‌సీబీ నిఘా పెట్టినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. Also Read:


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2GbTBkr
v

విస్కీ, పైనాపిల్ జ్యూస్‌తో కాక్‌టెయిల్.. పవన్ హీరోయిన్ కొత్త రెసిపి

విస్కీ.. ఎంతో మందికి ఇష్టమైన మత్తెక్కించే పానీయం. అమితంగా తాగితే ఇది శరీరానికి చెడు చేస్తుంది కానీ.. మితంగా తాగితే ప్రయోజనాలు చాలానే ఉన్నాయి. ఈ ప్రపంచంలో కొన్ని వేల విస్కీ బ్రాండ్లు అందుబాటులో ఉన్నాయి. సామాన్యుల నుంచి మిలియనీర్ల వరకు ఎవరి తాహతకు తగ్గట్టు వాళ్లు పుచ్చుకునే విస్కీ బ్రాండ్లు మార్కెట్‌లో దొరుకుతున్నాయి. సామాన్యులు విస్కీలో సోడా లేదంటే నీళ్లు కలుపుకుని దానికి కాస్త స్టఫ్ యాడ్ చేసి తాగేస్తుంటారు. కానీ, బడా బాబులు విస్కీని రకరకాలుగా తాగుతారు. విస్కీ కాక్‌టెయిల్స్‌కి మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉంది. నిజానికి విస్కీ కాక్‌టెయిల్స్‌ను మిక్స్ చేయడానికి ఎక్స్‌పర్ట్స్ ఉంటారు. పబ్‌లు, పేరుమోసిన క్లబ్‌లలో ఈ విస్కీ కాక్‌టెయిల్స్ లభిస్తాయి. అయితే, వీటిని ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. విస్కీ కాక్‌టెయిల్స్ ఒకటైన ‘జానీ పైనాపిల్’ హైబాల్‌ను హీరోయిన్ తయారు చేశారు. ఈ రెసిపీని ఎలా తయారుచేయాలో చూపించారు. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక వీడియోను పోస్ట్ చేశారు. ఈ జానీ పైనాపిల్ హైబాల్ తయారీకి ఖరీదైన జానీ వాకర్ రెడ్ లేబుల్ బ్రెండెడ్ విస్కీ కావాలి. అలాగే పైనాపిల్ జ్యూస్, సోడా, ఐస్ క్యూబ్స్ అవసరం. ముందుగా హైబాల్ (పొడవాటి గాజు గ్లాసు) తీసుకొని దాని నిండా ఐస్ క్యూబ్స్ వేయాలి. అందులో 30 ఎంఎల్ జానీ వాకర్ రెడ్ లేబుల్ విస్కీ పోయాలి. దానిలో 50 ఎంఎల్ సోడా కలపాలి. ఆ తరవాత 60 ఎంఎల్ ఫ్రెస్ పైనాపిల్ జ్యూస్ పోయాలి. ఈ మిశ్రమాన్ని బాగా కలిపి, పైనాపిల్ ముక్కతో గార్నిస్ చేసి లాగించేయడమే. ఈ కాక్‌టెయిల్‌ను గతవారం తనకోసమే తయారుచేసుకున్నట్టు కృతి వెల్లడించారు. జానీ వాకర్ రెడ్ లేబుల్ బ్లెండెడ్ విస్కీ ఫుల్ బాటిల్ ఖరీదు సుమారు రూ.3 వేలు. ఇదిలా ఉంటే, కృతి కర్బంద ‘బోణి’ సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమయ్యారు. ఆ తరవాత పవన్ కళ్యాణ్‌తో ‘తీన్‌మార్’ సినిమాలో నటించారు. అనంతరం మంచు మనోజ్‌కు జోడీగా ‘మిస్టర్ నూకయ్య’లో, రామ్‌ సరసన ‘ఒంగోలుగిత్త’లో కనిపించారు. నందమూరి కళ్యాణ్ రామ్ ‘ఓం’లో కూడా నటించారు. అందం, అభినయం రెండూ ఉన్నా ఎందుకో కృతి టాలీవుడ్‌లో రాణించలేకపోయారు. ఆమె చివరిగా ‘బ్రూస్ లీ: ది ఫైటర్’ సినిమాలో రామ్ చరణ్‌కు అక్కగా కనిపించారు. ప్రస్తుతం బాలీవుడ్‌లో సినిమాలు చేస్తు్న్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3jlk3GE
v

కృష్ణా నదికి వరదలు.. కొట్టుకుపోయిన హీరో శర్వానంద్ తాత ఇల్లు

కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కృష్ణా నది పరవళ్లు తొక్కుతోంది. వరద నీరు ముంచెత్తడంతో నదీ పరివాహక ప్రాంతాలు ముంపులో చిక్కుకున్నాయి. దీంతో అనేక గ్రామాలు వరద నీటిలో మునిగిపోయి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కృష్ణా జిల్లా సమీపంలోని ఎడ్లలంక గ్రామం కూడా ముంపులో చిక్కుకుంది. ఈ నేపథ్యంలో అదే గ్రామంలో ఉన్న హీరో తాత, భారత మాజీ అణు శాస్త్రవేత్త డాక్టర్ మైనేని హరిప్రసాద్ ఇల్లు కొట్టుకుపోయింది. Also Read: పాతకాలం నాటి ఇల్లు కావడంతో వరద నీటికి పునాదులు కదిలి ఇల్లు మొత్తం నదిలో కలిసిపోయింది. శర్వానంద్ అవనిగడ్డ వచ్చినప్పుడల్లా ఇదే ఇంట్లో ఉండేవారట. ఆయన్ని కలిసేందుకు చాలా మంది అభిమానులు ఆ ఇంటికి వచ్చేవారు. ప్రస్తుతం వరద నీటిలో శర్వానంద్ తాత ఇల్లు కొట్టుకుపోవడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. శర్వానంద్ ప్రస్తుతం ‘మహాసముద్రం’ అనే సినిమాలో నటిస్తున్నారు. తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ‘ఆర్‌ఎక్స్ 100’ ఫేం అజయ్ భూపతి దర్శకత్వం వహిస్తున్నారు. Also Read:


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/30noWaS
v

‘షాదీ ముబారక్‌’ ఫస్ట్‌ లుక్‌: లవర్ బోయ్‌గా మారిన ఆర్కే నాయుడు

బుల్లితెరపై సెన్సేషన్ క్రియేట్ చేసిన ‘మొగలిరేకులు’ సీరియల్‌లో ఆర్కే నాయుడు పాత్రను ప్రేక్షకులకు ఎప్పటికీ మరిచిపోలేరు. పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా నటించిన సాగర్‌ను ఇప్పటికీ ఆర్కే నాయుడుగానే ఫేమస్. ఈ ఒక్క పాత్రతో సాగర్‌కు హీరోకి వచ్చినంత క్రేజ్ వచ్చింది. ఈ పాత్ర ద్వారా వచ్చిన క్రేజ్‌తో సినిమాల్లోకి కూడా అడుగుపెట్టారు . 2011లో ‘మిస్టర్ పర్ఫెక్ట్’ సినిమాలో ప్రభాస్ ఫ్రెండ్‌గా కనిపించారు. ఆ తరవాత ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ సినిమాతో హీరోగా మారారు. కానీ, పెద్దగా ఆకట్టుకోలేకపోయారు. 2016లో ‘సిద్ధార్థ’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఆ తరవాత మళ్లీ వెండితెరపై కనిపించలేదు. సుమారు ఐదేళ్ల విరామం తరవాత ఇప్పుడు మరోసారి హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నారు సాగర్. అది కూడా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ వంటి ప్రతిష్టాత్మక బ్యానర్‌లో. , శిరీష్ నిర్మాతలు. ఔట్‌ అండ్‌ ఔట్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌‌గా రూపుదిద్దుకుంటోన్న ఈ సినిమాకు ‘షాదీ ముబారక్‌’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను బుధవారం విడుదల చేశారు. ఈ పోస్టర్‌లో సాగర్ లవర్ బోయ్‌లా కనిపిస్తున్నారు. సాగర్‌ సరసన దృశ్యా రఘునాథ్‌ హీరోయిన్‌గా నటించారు. ఈ చిత్రానికి పద్మశ్రీ దర్శకత్వం వహించారు. ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించే ఈ సినిమా చిత్రీకరణ ఇప్పటికే పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు జరుగుతున్నాయి. త్వరలోనే సినిమాను విడుదల చేయడానికి దర్శక నిర్మాతలు ప్లాన్‌ చేస్తున్నారు. కాగా, ఈ చిత్రంలో అదితి, ఝాన్సీ, హేమ, రాజశ్రీనాయర్‌, ప్రియదర్శి రామ్‌, హేమంత్‌, శత్రు, భద్రమ్‌, మధునందన్‌, అజయ్‌ ఘోష్ ముఖ్య పాత్రలు పోషించారు. సునీల్ కశ్యప్ సంగీతం సమకూరుస్తున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/36htpzp
v

వితికా షెరు కొత్త ఇన్నింగ్స్: కల నెరవేరింది.. సుమ, అనసూయల పోటీ తట్టుకోగలదా!!

హీరో వరుణ్ సందేశ్ తన భార్య వితికా షెరుతో కలిసి బిగ్ బాస్ సీజన్ 3లో పాల్గొన్నారు. వరుణ్ సందేశ్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే అయినా వితిక పెద్దగా ఎవరికీ తెలీదు. ఆమె కూడా హీరోయిన్‌గా సినిమాలు చేసినప్పటికీ పెద్దగా గుర్తింపు తెచ్చుకోలేదు. కానీ, బిగ్ బాస్‌ షోలో పాల్గొన్న తరవాత వితికాకు మంచి గుర్తింపు వచ్చింది. ఇక బిగ్ బాస్ షో నుంచి బయటికి వచ్చిన తరవాత ఇంటర్వ్యూలతో బిజీ అయిపోవడమే కాకుండా ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు. బిగ్ బాస్ షోలో పాల్గొన్న సుమారు ఏడాదిన్నర తరవాత ఇప్పుడు వితికా సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెడుతున్నారు. అది కూడా తనకు ఎంతో ఇష్టమైన యాంకర్‌గా. యాంకరింగ్ అంటే తనకు చాలా ఇష్టమని, యాంకర్ కావడం తన గోల్ అని గత ఇంటర్వ్యూలలో వితిక చెప్పారు. ఇప్పుడు ఆ కలను ఆమె నెరవేర్చుకున్నారు. ఈటీవీలో ప్రతి ఆదివారం రాత్రి 7 గంటలకు ప్రసారం కానున్న ‘సామజవరగమన’ షోకి వితిక యాంకర్‌గా వ్యవహరిస్తున్నారు. వచ్చే ఆదివారం (అక్టోబర్ 4) నుంచి ఈ షో ప్రసారం కానుంది. ఇదిలా ఉంటే, ప్రస్తుతం యాంకర్ సుమ, అనసూయ బుల్లితెరను ఏలుతున్నారు. శ్రీముఖి, రష్మి కూడా సత్తా చాటుతున్నారు. వీళ్ల మధ్య పోటీని తట్టుకోగలరా లేదా చూడాలి. వీళ్ల కన్నా కొత్తగా ఉంటేనే వితికను ప్రేక్షకులు ఆదరిస్తారు. వితిక అందానికి ఆమె వాక్‌చాతుర్యం జత అయితే ఒక మంచి యాంకర్‌గా ఎదగడానికి ఎంతో సమయం పట్టదు. కాగా, వితిక అచ్చ తెలుగు అమ్మాయి. ఆమె స్వస్థలం పశ్చిమ గోదావరి జిల్లాలోని భీమవరం. హైదరాబాద్‌లో ఫ్యాషన్ డిజైనింగ్‌లో పోస్ట్‌గ్రాడ్యుయేట్ డిప్లమా చేశారు. 11 ఏళ్ల వయసులో టీవీ సీరియళ్లలో బాలనటిగా నటించిన వితికా.. 15 ఏళ్లకు హీరోయిన్ అయ్యారు. కన్నడ సినీ పరిశ్రమ ద్వారా తెరంగేట్రం చేశారు. తెలుగులో ఆరు సినిమాలు చేశారు. వీటిలో ‘ఝుమ్మంది నాదం’, ‘భీమిలి కబడ్డీ జట్టు’ సినిమాలు చెప్పుకోదగినవి. వరుణ్ సందేశ్‌తో కలిసి ‘పడ్డానండి ప్రేమలో మరి’ చిత్రంలో వితిక నటించారు. ఆ సినిమా సమయంలోనే వరుణ్‌తో ప్రేమలో పడ్డారు. 2015లో వరుణ్ సందేశ్‌ను వితిక వివాహం చేసుకున్నారు. Also Read:


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3l0mjn7
v

Tuesday 29 September 2020

‘మోసగాళ్ళు’ స్కామ్‌ను బయటపెట్టనున్న అల్లు అర్జున్!

మంచు విష్ణు హీరోగా నటిస్తూ ఆయనే స్వయంగా నిర్మిస్తోన్న చిత్రం ‘మోసగాళ్ళు’. కాజల్ అగర్వాల్, బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పోస్టర్లు, మోషన్ పోస్టర్, థీమ్ మ్యూజిక్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. అయితే, ఈ సినిమాను ప్రజల్లోకి మరింతగా తీసుకెళ్లేందుకు మంచు విష్ణు ప్రయత్నాలు మొదలుపెట్టారు. దీని కోసం స్టైలిష్ స్టార్ సహాయం తీసుకుంటున్నారు విష్ణు. ఇంత‌కుముందు టైటిల్ కీ థీమ్ మ్యూజిక్‌ను విక్టరీ వెంక‌టేష్ రిలీజ్ చేయ‌గా.. దానికి అనూహ్యమైన స్పందన వ‌చ్చింది. మ్యూజిక్ డైరెక్టర్ శ్యామ్ సీఎస్ ప‌నిత‌నానికి స‌ర్వత్రా ప్రశంస‌లు ల‌భించాయి. ఇప్పుడు ‘మోస‌గాళ్ళు’ చేసిన స్కామ్ ఏ స్థాయిలో ఉందో బ‌య‌ట‌పెట్టేందుకు అల్లు అర్జున్ రెడీ అవుతున్నారు. అక్టోబ‌ర్ 3న‌ ఈ విష‌యాన్ని ఆయ‌న వెల్లడించ‌నున్నారు. ఈ విషయాన్ని మంచు విష్ణు స్వయంగా ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. భారీ బ‌డ్జెట్‌తో ప్రతిష్ఠాత్మకంగా రూపొందుతోన్న ఈ క్రాస్-ఓవ‌ర్ ఫిల్మ్‌ను విల‌క్షణంగా, విస్తృతంగా ప్రమోట్ చేస్తున్నారు. భార‌త్‌లో మొద‌లై, అమెరికాను వ‌ణికించిన చ‌రిత్రలోనే అతి పెద్ద ఐటీ కుంభ‌కోణం నేప‌థ్యంలో వాస్తవ ఘ‌ట‌న‌ల ఆధారంగా ‘మోస‌గాళ్ళు’ చిత్రం రూపొందుతోంది. విష్ణు లీడ్ రోల్ చేస్తూ నిర్మిస్తోన్న ఈ సినిమాని జెఫ్రీ గీ చిన్ డైరెక్ట్ చేస్తున్నారు. విష్ణు సోద‌రిగా కాజ‌ల్ అగ‌ర్వాల్ క‌నిపించ‌నుండ‌టం విశేషం. ఇంకా.. సునీల్ శెట్టి, న‌వ‌దీప్‌, న‌వీన్ చంద్ర, రుహీ సింగ్‌ ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాకు షెల్డన్ చౌ సినిమాటోగ్రఫి అందిస్తున్నారు. Also Read:


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2GeuBZL
v

‘పుష్ప’ విలన్ రూమర్స్.. కొట్టిపారేసిన సీనియర్ నటుడు

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్‌లో వస్తోన్న చిత్రం ‘పుష్ప’. వీరిద్దరి కాంబోలో వస్తోన్న మూడో చిత్రమింది. రష్మికా మందన హీరోయిన్. ‘పుష్ప’ ద్వారా హిందీ మార్కెట్‌లోకి అడుగుపెడుతున్నారు. ‘పుష్ప’ను పాన్ ఇండియా మూవీగా తెలుగుతో పాటు హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో విడుదల చేయనున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూరున్న ఈ సినిమాను ముత్తంశెట్టి మీడియాతో కలిసి మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్నారు. గందపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో ఈ సినిమా కథ సాగుతుంది. ఈ సినిమాలో అల్లు అర్జున్ మేకోవర్ సైతం కొత్తగా ఉంది. అయితే, కరోనా వైరస్ కారణంగా సినిమా షూటింగ్ ముందుకు కదలడం లేదు. అడవుల్లో షూటింగ్ చేయడానికి సుకుమార్ ప్లాన్ చేస్తున్నారు. దీని కోసం కేరళ వెళ్తున్నట్టు ఇప్పటికే రూమర్లు వచ్చాయి. నిజానికి ఈ సినిమాను ప్రకటించినప్పటి నుంచీ ఏదో రూమర్ వస్తూనే ఉంది. తాజాగా ఈ సినిమాలో విలన్‌కు సంబంధించి ఒక వదంతు చక్కర్లు కొడుతోంది. సీనియర్ హీరో ఆర్.మాధవన్.. బన్నీకి విలన్‌గా నటించబోతున్నారని ప్రచారం జరుగుతోంది. అయితే, ఈ రూమర్‌పై మాధవన్ స్పందించారు. ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని ట్విట్టర్ ద్వారా ఆయన స్పష్టం చేశారు. దీంతో ‘పుష్ప’లో ఎవరు విలన్‌గా నటిస్తారు అనే విషయంలో మరోసారి ఆసక్తి నెలకొంది. Also Read:


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/345Eb9k
v

డ్రగ్ కేసు: బెయిల్ నిరాకరణ.. హైకోర్టుకు వెళ్తున్న హీరోయిన్లు

కన్నడ సినీ పరిశ్రమలో కలకలం సృష్టించిన డ్రగ్స్ కేసులో హీరోయిన్లు గల్రాని, ద్వివేది అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. వీరి బెయిల్ పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది. సంజన, రాగిణికి బెయిల్ మంజూరు చేయడానికి ప్రత్యేక (నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్‌స్టాన్సస్ యాక్ట్) కోర్టు నిరాకరించింది. ఇదే కేసులో నిందితులుగా ఉన్న మరికొంత మంది బెయిల్ పిటిషన్లను ఈరోజు (సెప్టెంబర్ 30న) కోర్టు విచారించనుంది. మరోవైపు ఇదే కేసులో నిందితులుగా ఉన్న శివప్రకాష్, వినయ్ కుమార్‌ల యాంటిసిపేటరీ బెయిల్ పిటిషన్‌ను కూడా కోర్టు తిరస్కరించింది. అలాగే, ఈవెంట్ మేనేజర్ విరేన్ ఖన్నా, వ్యాపారవేత్త ప్రశాంత్ రంక, టెకీ ప్రతీక్ శెట్టి, మోడల్ నియాస్ మహమ్మద్, బులియన్ ట్రేడర్ వైభవ్ జైన్‌ల బెయిల్ పిటిషన్లను కోర్టు వాయిదా వేసింది. ఖన్నా బెయిల్ పిటిషన్‌ విచారణను అక్టోబర్ 1కి వాయిదా వేయగా మిగిలిన వారందరి పిటిషన్లను ఈరోజు విచారించనుంది. కాగా, బెయిల్ కోసం సంజన, రాగిణి హైకోర్టుకు వెళ్లనున్నట్టు డిఫెన్స్ అడ్వకేట్స్ వెల్లడించారు. ‘‘ఆర్డర్స్ కాపీల కోసం మేం దరఖాస్తు చేసుకోవాలి. వాటిని పరిశీలించిన తరవాత కొన్ని రోజుల్లో హైకోర్టును ఆశ్రయిస్తాం’’ అని చెప్పారు. డ్రగ్ కేసులో సంజన గల్రాని, ఆమె తల్లి ప్రమేయం ఉందని గుర్తించిన బెంగళూరు సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ (సీసీబీ) పోలీసులు.. సెప్టెంబర్ 9న వారిని అరెస్ట్ చేశారు. తదుపరి విచారణ నిమిత్తం చమ్రాపేట్‌లో ఉన్న సీసీబీ కార్యాలయానికి తల్లీకూతుళ్లను తరలించారు. అంతకుముందే సెప్టెంబర్ 7న రాగిణిని అరెస్ట్ చేశారు. ఇదే కేసులో కన్నడ దర్శకుడు ఇంద్రజిత్ లంకేష్‌తో పాటు మరికొంత మంది నటీనటులను సీసీబీ ప్రశ్నించినట్టు తెలుస్తోంది. అంతేకాదు, కన్నడ ఇండస్ట్రీలో డ్రగ్స్ వాడకం గురించి లంకేష్ కీలక విషయాలు పోలీసులకు చెప్పినట్టు సమాచారం. Also Read:


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3495OhU
v

విజయ్‌తో సినిమా.. భారీ మొత్తంలో సుకుమార్‌కు అడ్వాన్స్ రెమ్యునరేషన్!

క్రియేటివ్ డైరెక్టర్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నట్టు సెన్సేషనల్ హీరో రెండు రోజుల క్రితం ప్రకటించారు. ఈ ఆసక్తికర చిత్రం ద్వారా కేదార్ సెలగంశెట్టి అనే యువ నిర్మాత టాలీవుడ్‌కు పరిచయం అవుతున్నారు. తన సంస్థ ఫాల్కన్ క్రియేషన్స్ ఎల్‌ఎల్‌పి బ్యానర్‌పై ఆయన ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. 2022లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. సుకుమార్‌తో కలిసి పనిచేయడం కోసం ఆత్రతగా ఎదురుచూస్తున్నానని విజయ్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ఇదిలా ఉంటే, వచ్చే ఏడాది ఆఖరిలో సెట్స్‌పైకి వెళ్లే ఈ సినిమా కోసం సుకుమార్‌కు అప్పుడు భారీ మొత్తంలో రెమ్యునరేషన్‌ను అడ్వాన్స్‌గా ఇచ్చినట్టు వదంతులు వినిపిస్తున్నాయి. ఇండస్ట్రీ నుంచి వస్తున్న సమాచారం ప్రకారం సుకుమార్‌కు కేదార్ సెలగంశెట్టి రూ.10 కోట్లు అడ్వాన్స్‌గా చెల్లించారట. ఇంకో విషయం ఏంటంటే ఈ సినిమా లాభాల్లో సుకుమార్‌కు కూడా షేర్ ఉందని అంటున్నారు. ప్రస్తుతం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ‘ఇస్మార్ట్ శంకర్’ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తరవాత విజయ్ దేవరకొండతో పూరి చేస్తున్న సినిమా కావడంతో భారీ అంచనాలు ఉన్నాయి. ‘ఫైటర్’ అనే టైటిల్ ప్రచారంలో ఉంది. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిస్తోన్న ఈ చిత్రాన్ని పూరి జగన్నాథ్, కరణ్ జోహార్, అపూర్వ మెహత సంయుక్తంగా నిర్మిస్తున్నారు. విజయ్ సరసన అనన్య పాండే హీరోయిన్‌గా నటిస్తోంది. కరోనా వైరస్ కారణంగా ప్రస్తుతం షూటింగ్‌కు బ్రేక్ పడింది. Also Read:


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3jgvlfk
v

మెగాస్టార్‌ రీమేక్ సినిమాలో రమ్యకృష్ణ?

వెండితెరపై మెగాస్టార్ చిరంజీవి, రమ్యకృష్ణ జోడీకి మంచి ఫాలోయింగ్ ఉంది. వీళ్లిద్దరు నటించిన సినిమాలు చాలావరకు విజయం సాధించాయి. వీళ్లిద్దరిని సినిమాలో జంటగా చూసి చాలాకాలమే అయింది. దీంతో వీరు కలిసి మళ్లీ ఎప్పుడు నటిస్తారా? అని ప్రేక్షకులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నాయి. అలాంటి వారి ఆశలు ఫలించేలా ఓ న్యూస్ బయటికి వచ్చింది. మలయాళంలో మోహన్‌లాన్ నటించిన ‘లూసిఫర్’ సినిమాను మెగాస్టార్ రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఎన్వీ ప్రసాద్ నిర్మించనున్న ఈ సినిమాకు వి.వి.వినాయక్ దర్శకత్వం వహించనున్నారు. ఈ సినిమా షూటింగ్ వచ్చే ఏడాది ప్రారంభమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ చిత్రంలో ఓ కీలక పాత్ర కోసం రమ్యకృష్ణను సంప్రదించబోతున్నట్లు తెలుస్తోంది. మలయాళంలో ప్రముఖ నటి మంజు వారియర్ పోషించిన పాత్రలో రమ్యకృష్ణ అయితే బాగుంటుందని యూనిట్ భావిస్తోందట. ఆ రోల్‌ను ఆమె చేతే చేయించాలని వినాయక్ అనుకుంటున్నారని, దీనిపై త్వరలోనే రమ్యకృష్ణను కలిసి పాత్ర గురించి చర్చించనున్నట్లు తెలుస్తోంది. ఈ రోల్‌ పోషించేందుకు రమ్యకృష్ణ అంగీకరిస్తే ఈ సినిమాపై మరింత హైప్ క్రియేట్ కావడం మాత్రం పక్కా. Also Read:


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2GddyHF
v

‘ఆదిపురుష్’లో సీతగా అనుష్క.. రూమర్స్‌కు చెక్ పెట్టిన దేవసేన

యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌, ఓం రౌత్‌ దర్శకత్వంలో త్వరలో సెట్స్‌ పైకి వెళ్లనున్న పాన్ ఇండియా చిత్రం 'ఆదిపురుష్‌'. ఈ సినిమాలో సీత పాత్రలో నటించే హీరోయిన్ గురించి కొద్దిరోజులుగా అనేక పుకార్లు వస్తూ ఉన్నాయి. కీర్తి సురేష్‌, కియారా అద్వానీ, ప్రియాంకా చోప్రా, శర్మ వంటి వారి పేర్లు ప్రముఖంగా వినిపించాయి. తాజాగా సౌత్ స్టార్ హీరోయిన్ అనుష్క పేరు ప్రముఖంగా వినిపించింది. బాహుబలి సినిమాలో అలరించిన ఈ జంట ‘’ మళ్లీ జతకట్టనుందన్న వార్తలో అభిమానులు ఫుల్ ఖుషీ అయిపోయారు. తన తాజా సినిమా ‘నిశ్శబ్దం’ అక్టోబర్ 2వ తేదీన అమెజాన్ ప్రైమ్ ద్వారా ఓటీటీ ప్లాట్‌పామ్‌లో విడుదల కానుంది. ఈ సందర్భంగా అనుష్క ప్రమోషన్లలో పాల్గొంటోంది. ఈ సందర్భంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆదిపురుష్‌కు సంబంధించి వస్తున్న రూమర్‌పై ఆమె స్పందించారు. ‘''నాకు అలాంటి ఆఫర్‌ ఏమీ రాలేదు. నేను ఆదిపురుష్ చిత్రంలో నటించడం లేదు. ఆ వార్తల్లో నిజం లేదు.." అని అనుష్క తెలిపారు. దీంతో ఈ సినిమాపై వస్తున్న రూమర్లకు అనుష్క చెక్ పెట్టేసింది. Also Read: టాలీవుడ్‌లో బెస్ట్ పెయిర్లలో , అనుష్కది అగ్రస్థానం. వీరిద్దరు కలిసి బిల్లా, మిర్చి, బాహుబలి-1, బాహుబలి-2 సినిమాల్లో నటించగా.. అన్ని సినిమాలు హిట్ అయ్యాయి. దీంతో ఈ జంటను వెండితెరపై మరోసారి చూడాలని ప్రేక్షకులు కోరుకుంటున్నారు. ‘ఆదిపురుష్’‌లో రావణుడిగా బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ నటిస్తున్నారు. Also Read:


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/33cGojU
v

అమ్మాయిలు చాలా క్లియర్.. వాళ్లనే ప్రేమిస్తారు.. దమ్ముంటే నీ సత్తా చూపించు: పూరి జగన్నాథ్

మగాడు అన్నాక పనిచేయాలని, సంపాదించాలని, సత్తా చాటాలని అంటున్నారు ప్రముఖ దర్శకుడు . పూరి మ్యూజింగ్స్ ద్వారా రోజుకో అంశంపై మాట్లాడుతున్న పూరి జగన్నాథ్.. మంగళవారం మగాడు ఎలా ఉండాలి అనే అంశపై మాట్లాడారు. మగాడు ఎలా ఉంటే అమ్మాయిలు ఇష్టపడతారో చెప్పారు. మగాడికి ఎలాంటి లక్ష్యం ఉండాలో వెల్లడించారు. ప్రతి మగాడు తన బ్యాంక్ బ్యాలెన్స్ అతడి మొబైల్ నంబర్ అంత అయ్యేలా కష్టపడాలని అన్నారు. ఈ క్రమంలో తనదైన శైలిలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు పూరి. ‘‘అందమైన ఆడపిల్లలను చూస్తే ఎవరికైనా ఇష్టమే. అందుకే అందరూ వాళ్లతో ప్రేమలో పడిపోతుంటారు. కానీ, మగాళ్లను మాత్రం చూడగానే ఎవరూ లవ్ చేయరు. ఎవరూ ఎత్తుకోరు, ఎవరూ ముద్దుపెట్టుకోరు. సో స్వీట్ అని మన బుగ్గ పట్టుకుని ఎవరూ గిల్లరు. ఎందుకు.. అంటే సమాధానం లేదు. మగాడు ఏదైనా చేయాలి, ఏదైనా తేవాలి, ఏదైనా ఇవ్వాలి లేదా ఏమైనా అయిపోవాలి. ఏమీ చేయకుండా మనల్ని ఎవ్వరూ ఎత్తుకోరు. ముద్దు పెట్టుకోరు. అందుకే ఏదైనా చేయండి. ఖాళీగా ఉండొద్దు. నువ్వు ఎంత అందగాడివైనా ఏ అమ్మాయి నీ మొహం చూడదు. నీకు సిక్స్ ప్యాక్ ఉన్నా నీ ఫోన్ నంబర్ అడగదు. అమ్మాయిలు చాలా క్లియర్‌గా ఉంటారు. సత్తా ఉన్నవాడినే ప్రేమిస్తారు. దమ్ముంటే నీ సత్తా ఏంటో చూపించు. ఒక సామెత ఉంది.. ఎందుకూ పనికిరాని మొగుడు మంచం నిండా ఉన్నాడని. ఆరున్నర అడుగులు ఉంటాడు. ఆడు పడుకుంటే కాళ్లు మంచం దాటి బయటికి కూడా వస్తుంటాయి. కానీ, ఏమీ చేయడు. ఎందుకు మరి.. వేస్ట్ కదా. అందుకే మగాడన్నాక కష్టపడాలి’’ అని పూరి జగన్నాథ్ అన్నారు. Also Read: మన మొబైల్ నంబర్ మన బ్యాంక్ బ్యాలెన్స్ అయిపోయేలా టార్గెట్ పెట్టుకోవాలని పూరి సలహా ఇచ్చారు. అనుకుంటే అన్నీ అవుతాయన్నారు. ‘‘నేను మొదటిసారి హైదరాబాద్ వచ్చినప్పుడు ఓ రాత్రి అన్నపూర్ణ స్టూడియో పైనుండి హైదరాబాద్‌ను చూశాను. సిటీ మొత్తం ఎన్నో లక్షల ఇళ్లు. అన్ని ఇళ్లలో లైట్లు వెలుగుతున్నాయి. నగరం మొత్తం దీపావళిలా ఉంది. ఎక్కడ చూసినా ఇళ్లే. ఇంత పెద్ద సిటీలో ఇల్లు కట్టినవాళ్లందరూ బాగా తెలియనవాళ్లా అని నన్ను నేను అడిగాను. లోపల నుంచి కాదు అని ఆన్సర్ వచ్చింది. అంటే, యావరేజ్ మైండ్స్, బిలో యావరేజ్ మైండ్స్ ఉన్నవాళ్లు కూడా ఇక్కడ ఇల్లు కట్టుకోగలిగారు. అలా అయితే మనం ఒకరోజు కట్టేద్దాంలే అనుకొని కొండ దిగి కృష్ణానగర్ నడుచుకుంటూ పోయా’’ అని పూరి చెప్పుకొచ్చారు. నేడు వేల వేల కోట్లు సంపాదించిన వాళ్లందరూ పుట్టికతోనే జీనియస్‌లు కాదని, కానీ లైఫ్‌లో ఎంతో కష్టపడ్డారని పూరి అన్నారు. వాళ్లలానే మనమూ కష్టపడదామని ఏదో ఒక రోజు మన మొబైల్ నంబర్‌ని మన బ్యాంక్ బ్యాలెన్స్ చేసేద్దామని పూరి సలహా ఇచ్చారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3487Ajb
v

ఓటీటీ డ్రాబ్యాక్ అదే.. ఆ క్వాలిటీని ఆడియన్స్ మిస్ అవుతారు: అనుష్క

‘నిశ్శబ్దం’ సినిమా కోసం ప్రేక్షకులకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ థ్రిల్లర్ మూవీని థియేటర్‌లో చూద్దామని ఆశపడిన ప్రేక్షకులు మొత్తానికి ఈ కరోనా టైమ్‌లో ఇంట్లోనే అమెజాన్ ప్రైమ్ వీడియోలో చూడబోతున్నారు. అక్టోబర్ 2న నుంచి ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులోకి రానుంది. మాధవన్, అంజలి, షాలిని పాండే, సుబ్బరాజు, అవసరాల శ్రీనివాస్ ముఖ్య పాత్రలు పోషించిన ఈ సినిమాకు హేమంత్ మధుకర్ దర్శకత్వం వహించారు. కోన వెంకట్, టీజీ విశ్వప్రసాద్ నిర్మాతలు. గోపీ సుందర్ సంగీతం సమకూర్చారు. చిత్ర విడుదల తేదీ దగ్గరపడుతుండటంతో ప్రచారంలో భాగంగా అనుష్క మంగళవారం మీడియా ముందుకు వచ్చారు. మీడియా ప్రతినిధులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు. ఆ ముచ్చట్లే ఇవి.. ✦ మీ ‘నిశ్శబ్దం’ ఎలా మైద‌లైంది? ‘భాగ‌మ‌తి’ త‌రువాత కావాల‌ని గ్యాప్ తీసుకున్నా. ఆ స‌మయంలో కోన‌ వెంక‌ట్ గారు హేమంత్ గారితో ఈ స్టోరీ నెరేష‌న్ ఇప్పించారు. ఇందులో నా క్యారెక్టర్ ఢిప‌రెంట్‌గా ఉండ‌టంతో పాటు సినిమా కూడా వ‌ర్కౌట్ అవుతుంద‌ని నాకు బ‌లంగా అనిపించింది. అందుకే ఈ ప్రాజెక్ట్‌లో న‌టించ‌డానికి ఒప్పుకున్నాను. అనుకోకుండా నా ద‌గ్గర‌కు వ‌చ్చిన స్టోరీ ఇది. అంతేకాదు, అనుకోకుండానే నచ్చేసింది. ✦ ఈ సినిమా కోసం ‘మ్యూట్’గా న‌టించారు. అందుకోసం సైన్ లాంగ్వేజస్ నేర్చుకున్నార‌ట నిజ‌మేనా? నా క్యారెక్టర్ డంబ్, డెఫ్‌గా ఉంటుంద‌ని ముందుగానే డైరెక్టర్ హేమంత్ చెప్పారు. న‌న్ను ఈ సినిమాలోకి వచ్చేలా చేసింది కూడా నా క్యారెక్టర్‌కి ఉన్న ఈ స్పెషాలిటినే. ఇందుకోసం నేను కొన్నాళ్ల పాటు ఇండియ‌న్ సైన్ లాగ్వెంజ్ నేర్చుకున్నాను. అయితే, ఆ త‌రువాత షూటింగ్‌కి అమెరికా వెళ్లాక అక్కడ సైన్ లాంగ్వేజ్ వేరుగా ఉంటుంద‌ని తెలిసింది. అంతర్జాతీయంగా అంద‌రూ ఎక్కువుగా వాడే సైన్ లాంగ్వేజ్ కూడా అదే కావ‌డంతో మ‌ళ్లీ అమెరికాలో ఓ 14 ఏళ్ల అమ్మాయి ద‌గ్గర ఇంట‌ర్నేష‌న‌ల్ సైన్ లాంగ్వేజ్‌లో ట్రైనింగ్ తీసుకుని న‌టించాను. ✦ మీ కెరీర్‌లో తొలిసారిగా మీరు న‌టించిన సినిమా డైరెక్ట్‌గా ఓటిటిలో విడుద‌ల అవుతుంది. ఎలా ఫీల్ అవుతున్నారు? ఓటిటి, థియేట‌ర్ రెండు వేరు వేరుగా ఉన్నప్పటికీ, ఓటిటిలో సినిమాలు విడుద‌ల చేయ‌డాన్ని కూడా అంతా పాజిటివ్‌గా చూడాల్సిన అవ‌స‌రం ఉంది. ప్రస్తుత ప‌రిస్థితుల రీత్య, సినిమా ఇండ‌స్ట్రీ ఎటువంటి ఆటంకాలు లేకుండా ముందుకు వెళ్లాలంటే టెక్నాల‌జీ ప‌రంగా ఆడియెన్స్‌కి ఎంట‌ర్‌టైన్మెంట్ ఇవ్వడంలో ఇలాంటి మార్పులు రావ‌డం అవ‌సరం. వాటిని అంతా సంపూర్ణంగా స్వాగ‌తించ‌డం కూడా అత్యవ‌స‌రం. ఇక తొలిసారిగా నేను న‌టించిన సినిమా ఇలా విడుద‌లవ్వడం నాకు కాస్త కొత్తగా అనిపిస్తోంది. అలానే మేము చేసిన ఈ కొత్త ప్రయ‌త్నాని ఆడియెన్స్ స్వాగ‌తిస్తారు అని ఆశిస్తున్నాను. ✦ ‘నిశ్శబ్దం’లో మీరు మాధ‌వ‌న్‌తో మరోసారి క‌లిసి న‌టించారు. ఆయనతో మీ వ‌ర్కింగ్ ఎక్స్‌పీరియెన్స్ ఎలా ఉంది? మాధ‌వ‌న్ గారితో నా కెరీర్ తొలినాళ్లలో క‌లిసి న‌టించాను. మ‌ళ్లీ ఇన్నాళ్ల త‌రువాత క‌లిసి న‌టించ‌డం చాలా అద్భుతంగా అనిపించింది. ఇద్దరం ఈ సినిమాలో ఛాలెంజింగ్ రోల్స్ చేశాం. అలానే సినిమాలో ఉన్న పాత్రకి చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. ఈ క‌థ కేవలం మా ఇద్దరి చుట్టూనే తిరిగుతూ ఉండదు. స్క్రీప్‌ప్లే ముందుకు న‌డిపించ‌డంలో మిగ‌తా పాత్రలు కూడా కీల‌కంగా మారుతుంటాయి. ఈ థ్రిల్లింగ్ రైడ్‌ని ఆడియెన్స్ ఎంజాయ్ చేస్తార‌ని క‌చ్చితంగా చెప్పగ‌ల‌ను. ✦ థ్రిల్లర్స్‌లో బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌కి చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. ఈ సినిమాలో మ్యూజిక్ గురించి ఏం చెబుతారు? ఓటిటిలో విడుద‌ల అవ్వడంలో ఉన్న ఒకే ఒక డ్రాబ్యాక్ ఇదే. థియేట‌ర్స్‌లో ఉండే సౌండ్ సిస్టమ్, ఆడియో క్వాలిటీని ఆడియెన్స్ మిస్ అవుతారు. అయితే, హెడ్ ఫోన్స్, హోమ్ థియేట‌ర్స్ ఈ లోపాన్ని దాదాపుగా క‌వ‌ర్ చేస్తాయి. ఇక ఈ సినిమాకు మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్స్ పెద్ద ఎస్సెట్స్. మ‌రీ ముఖ్యంగా గోపీ సుంద‌ర్ ఇచ్చిన ఆర్‌ఆర్ సినిమాను మ‌రింత ఆస‌క్తిక‌రంగా మార్చేసింది. ✦ ఈ సినిమా ద‌ర్శక‌, నిర్మాత‌లు గురించి చెప్పండి. ద‌ర్శకుడు హేమంత్ ఫుల్ క్లారిటీతో వ‌ర్క్ చేసుకుంటూ పోతారు. త‌న‌కు ఏం కావ‌ల‌న్నది యాక్టర్స్ నుంచి తీసుకోవ‌డం హేమంత్ స్పెషాలిటి. ఆయ‌న డైరెక్షన్‌లో ఈ ప్రాజెక్ట్ అత్యద్భుతంగా వ‌చ్చింది. ఇక నిర్మాణ సంస్థలు కోన ఫిల్మ్ కార్పోరేష‌న్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ గురించి వేరే చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. ఈ ప్రయోగాత్మక కథను అమెరికా బ్యాక్‌డ్రాప్‌లో ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా నిర్మించడం అంత సులువు కాదు. దానికి చాలా ప్యాష‌న్ అలానే ధైర్యం కావాలి. ఆ రెండూ ఉన్న నిర్మాత‌లు కోన వెంకట్, టీజీ విశ్వప్రసాద్. చివరిగా ఒక విషయం.. ఈ సినిమాను ఫార్వాడ్ చేయకుండా ఆడియెన్స్ అంతా ఓ ఫ్లోలో చూడాల‌ని మ‌న‌వి చేస్తున్నా.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3jfz7W6
v

ఆ బ్యూటీతో నేచురల్ స్టార్‌తో మరోసారి రొమాన్స్?

ఇటీవలే ‘వి’ సినిమాతో ఓటీటీ ప్రేక్షకులను అలరించిన జోరు పెంచారు. ప్రస్తుతం శివ నిర్వాణ దర్శకత్వంలో ‘టక్ జగదీష్’ మూవీలో నటిస్తోన్న నాని.. ఆ తర్వాత టాక్సీవాలా ఫేమ్ రాహుల్ సాంకృత్యాన్ డైరెక్షన్‌లో ‘శ్యామ్ సింగరాయ్’ అనే చిత్రంలో నటిస్తున్నారు. కోల్‌కతా బ్యాక్‌డ్రాప్‌లో పీరియాడికల్ డ్రామాగా తెరకెక్కనున్న ఈ మూవీ షూటింగ్ ఈ ఏడాది చివర్లో గానీ, వచ్చే ఏడాది ప్రారంభంలో గానీ స్టార్ట్ చేయనున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమాలో నటీనటులను ఎంపిక చేసే పనిలో పడ్డారు దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్. ఇందులో నెగిటివ్ ఛాయలున్న ఓ హీరోయిన్‌ పాత్రకు సాయిపల్లవిని ఫిక్స్ చేసినట్లు వార్తలొస్తున్నాయి. మరో హీరోయిన్‌గా కన్నడ బ్యూటీ రష్మిక మందానాను సంప్రదించినట్లు తెలుస్తోంది. ఈ ప్రాజెక్టుకు ఆమె ఒప్పుకుంటే నానితో రెండోసారి రొమాన్స్ చేయనుంది. Also Read: గతంలో ‘దేవదాస్’ సినిమాలో నాని సరసన రష్మిక నటించింది. ఈ సినిమా అనుకున్నంత విజయం సాధించలేదు. మరోవైపు ‘శ్యామ్ సింగరాయ్’ సినిమాకు సంగీత దర్శకుడిగా ఏఆర్ రెహమాన్‌ను తీసుకోనున్నట్లు డైరెక్టర్ రాహుల్ సాంకృత్యాన్ ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే జరిగితే ఈ సినిమా అంచనాలు భారీగా పెరగడం ఖాయం. Also Read:


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3cF2DSO
v

టీవీ నటుడు అక్షత్ ఉత్కర్ష్ ఆత్మహత్య.. పేరెంట్స్ సంచలన ఆరోపణలు

హీరో సుశాంత్‌ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్యపై ఓ వైపు వివాదం కొనసాగుతుండగానే ముంబయిలో మరో నటుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. పలు హిందీ సీరియళ్లలో నటించిన అక్షత్ ఉత్కర్ష్‌(26) ముంబయిలోని తన ఫ్లాట్‌లో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బీహార్‌కు చెందిన అక్షత్ కొన్నాళ్ల క్రితం ముంబయికి వచ్చి టీవీ సీరియళ్లలో నటిస్తున్నాడు. తనతో పాటు నటించే ఓ యువతితో కలిసి ఓ ఫ్లాట్‌లో నివసిస్తున్నాడు. Also Read: ఆదివారం రాత్రి 11.30 గంటల సమయంలో బాత్రూమ్‌కి వెళ్లిన అక్షత్ ఎంతసేపటికి రాకపోవడంతో స్నేహితురాలు పోలీసులకు సమాచారం ఇచ్చింది. వాళ్లు వచ్చి బాత్రూమ్ తలుపు తీసి చూడగా అతడు విగతజీవిగా పడివున్నాడు. దీంతో పోలీసులు అక్షత్ మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కరోనా కారణంగా షూటింగులు నిలిచిపోవడంతో తీవ్ర మానసిక ఒత్తిడికి గురయ్యే అతడు ఆత్మహత్య చేసుకున్నట్లు తమ విచారణలో వెల్లడైనట్లు పోలీసులు తెలిపారు. Also Read: అయితే తమ కుమారుడు ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదని అక్షత్ తల్లిదండ్రులు అంటున్నారు. అతడు మానసిక ఒత్తిడికి గురై చనిపోలేదని, ఎవరో హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని ఆరోపిస్తున్నారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పోస్టుమార్టం అనంతరం అక్షత్ మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. Also Read:


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2G8neDe
v

ముమైత్ ఖాన్ నన్ను మోసం చేసింది: హైదరాబాద్ క్యాబ్ డ్రైవర్ ఆరోపణలు

టాలీవుడ్‌లో నటిగా, డ్యాన్సర్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఇప్పుడు ఒక వివాదంలో చిక్కుకుంది. ముమైత్ ఖాన్ తనను మోసం చేసిందని హైదరాబాద్‌కు చెందిన క్యాబ్ డ్రైవర్ రాజు ఆరోపిస్తున్నాడు. మూడు రోజుల ట్రిప్ కోసం తీసుకెళ్లి తనకు రావాల్సిన డబ్బు ఇవ్వకుండా మోసం చేసిందని అంటున్నాడు. ఈ మేరకు క్యాబ్ డ్రైవర్స్ అసోసియేషన్‌కు రాజు ఫిర్యాదు చేశాడు. అసోసియేషన్‌లో చర్చించిన తరవాత పోలీసులకు ఫిర్యాదు చేస్తానని అంటున్నాడు. రాజు ఆరోపణలు.. ముమైత్ ఖాన్ మూడు రోజుల గోవా ట్రిప్ కోసం కారు బుక్ చేసుకుంది. గోవాకు వెళ్ళిన తర్వాత ముమైత్ ఖాన్ మూడు రోజుల ట్రిప్‌ను ఎనిమిది రోజులకు పొడిగించింది. ఈ ఎనిమిది రోజులపాటు గోవా మొత్తం తిరిగినా ఎక్కడా టోల్ గేట్‌కు, డ్రైవర్ వసతికి డబ్బులు ఇవ్వలేదు. ఈ మొత్తం కలిపి రూ.15 వేల వరకు ముమైత్ ఇవ్వాలని రాజు ఆరోపిస్తున్నాడు. మరో డ్రైవర్‌కు ఇలా జరగకూడదన్న ఉద్దేశంతోనే తాను ఈ విషయాన్ని క్యాబ్ డ్రైవర్స్ అసోసియేషన్‌కు తెలియజేశానని రాజు వెల్లడించాడు. అసోసియేషన్ సభ్యుల సూచన మేరకు పోలీసులకు ఫిర్యాదు చేస్తానని అన్నాడు. కాగా, ‘పోకిరి’ సినిమాలో ‘ఇప్పటికింకా నా వయసు నిండా పదహారే’ పాటతో ముమైత్ ఖాన్ మంచి పాపులారిటీ సంపాదించింది. ఆ తరవాత చాలా సినిమాల్లో ఐటమ్ సాంగ్స్ చేసింది. అలాగే, ప్రత్యేక పాత్రల్లోనూ మెరిసింది. పోలీస్ ఆఫీసర్‌గానూ నటించింది. ‘ఆపరేషన్ దుర్యోధన’, ‘ఎవడైతే నాకేంటి’, ‘మైసమ్మ ఐపీఎస్’ వంటి చిత్రాల్లో పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించింది. ఇక, ఆమె అందాల ఆరబోత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అలాగే, బిగ్ బాస్ తెలుగు సీజన్ 1లోనూ పాల్గొని రచ్చ చేసింది. తెలుగు, తమిళం, హిందీ, కన్నడ తదితర భాషల్లో కలుపుకుని సుమారు 200 సినిమాల్లో ముమైత్ నటించింది. Also Read:


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3cO5b1a
v

Lust Stories: శృతి హాసన్ స్వయంతృప్తి.. కెమెరాలే షేక్ అయ్యాయట.. అడల్ట్ కిక్!!

నేటితరం ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లుగా సినిమాలు రూపొందిస్తున్నారు దర్శకనిర్మాతలు. ఎక్కువగా బోల్డ్ కంటెంట్ జొప్పిస్తూ యూత్ ఆడియన్స్‌కి వల వేస్తుండటం చూస్తూనే ఉన్నాం. ఇదే కంటెంట్ బేస్ చేసుకొని కాస్త కొత్తగా 'లస్ట్ స్టోరీస్' వెబ్ సిరీస్ రిలీజ్ చేయడంతో సోషల్ మీడియా వేడెక్కిపోయింది. ఇందులో స్వయంతృప్తి పొందే మహిళగా స్టార్ హీరోయిన్ కియారా అద్వానీ నటించడంతో భారీ రెస్పాన్స్ వచ్చింది. దీంతో అదే సిరీస్ తెలుగులో ప్లాన్ చేసిన దర్శకనిర్మాతలు స్టార్ కిడ్, హీరోయిన్ శృతి హాసన్‌తో బోల్డ్ కిక్ ఇవ్వబోతున్నారట. ‘లస్ట్ స్టోరీస్’ వెబ్ సిరీస్ హిందీ వర్షన్‌లో కియారా అద్వానీ పోషించిన రోల్ సెన్సేషన్ క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. ఆమె పోషించిన ఈ పాత్ర దేశవ్యాప్తంగా ఉన్న యూత్ ఆడియన్స్‌ని మత్తెక్కించింది. ఇప్పుడు ఈ వెబ్ సిరీస్ తెలుగు రీమేక్‌లో అదే స్వయంతృప్తి పొందే మహిళగా నటిస్తోందట. పలు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సిరీస్‌లో ఇప్పటికే ఓ భాగంలో ఈషా రెబ్బా నటించగా.. మరో భాగం కోసం శృతిని తీసుకొని షూట్ చేస్తున్నారట. Also Read: తెలుగు లస్ట్ స్టోరీస్ కోసం డైరెక్టర్లు సంకల్ప్ రెడ్డి, తరుణ్ భాస్కర్, నందినిరెడ్డి పలు భాగాలకు దర్శకత్వం వహిస్తుండగా.. తాజాగా మరో ఎపిసోడ్ కోసం నాగ్ అశ్విన్ రంగంలోకి దిగడమే గాక శృతి హాసన్‌తో శృంగారం పండిస్తున్నారట. భ‌ర్త ద్వారా శృంగారంలో సంతృప్తి చెంద‌ని ఓ గృహిణి పాత్ర‌లో నటిస్తున్న శృతి.. స్వయంతృప్తి పొందే మహిళగా అడల్ట్ కిక్కివ్వబోతోందట. ఈ మేరకు ఇప్పటికే ఈ ఎపిసోడ్ షూట్ కొంతభాగం పూర్తయిందని, అందులో కెమెరాలు షేక్ అయ్యేలా శృతి పర్‌ఫార్మ్ చేసిందని టాక్. ఇకపోతే కెరీర్ ఆరంభంలోనే సత్తా చాటుతూ పలు అవకాశాలు దక్కించుకున్న శృతి హాసన్.. ఆ తర్వాత ప్రేమలో పడి కొద్దిరోజుల పాటు కెమెరాకు దూరంగా ఉంది. అయితే ఇటీవలే తన ప్రేమకు బ్రేకప్ చెప్పేసి తిరిగి సెట్స్ పైకి వచ్చిన ఈ బ్యూటీ.. ఇప్పటికే రవితేజతో 'క్రాక్' మూవీ ఫినిష్ చేసింది. అతిత్వరలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. Also Read:


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3iimh8d
v

‘హీరోలతో దెబ్బలు తింటేనే డబ్బులొస్తాయ్’.. 20ఏళ్ల సినీ కెరీర్‌‌పై అజయ్ స్పందన

తెలుగు సినీ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక స్థానం దక్కించుకున్నారు అజయ్. హీరో ఫ్రెండ్‌గా, కమెడియన్‌గా, విలన్‌గా.. ఇలా అన్ని పాత్రల్లో ఒదిగిపోయే నటుడాయన. ‘కౌరవుడు’తో సినీ రంగ ప్రవేశం చేసిన ఇటీవలే 20ఏళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో తన కెరీర్‌ గురించి ఆయన వివరించారు. Also Read: ‘‘విజయవాడలో పుట్టి పెరిగిన నేను చదువు మధ్యలో ఆపేసి ఫిల్మ్‌ ఇన్‌స్టిట్యూల్‌లో చేరిపోయా. 2000 సంవత్సరంలో వచ్చిన కౌరవుడు సినిమాలో ఎంట్రీ ఇచ్చాను. ఆ మరుసటి ఏడాది వచ్చిన ఖుషీ, స్టూడెంట్ నం.1 చిత్రాలతో ఇండస్ట్రీలో నిలదొక్కుకోగలనన్న నమ్మకం వచ్చింది. ఆ తర్వాత ఒక్కడు, వర్షం, సై సినిమాలు మంచిపేరు తెచ్చాయి. ఎస్ఎస్ రాజమౌళి, రవితేజ కాంబినేషన్లో వచ్చిన ‘విక్రమార్కుడు’లో విలన్‌గా నటించడం మరిచిపోలేని విషయం. టిట్లా పాత్ర కోసం నేను పడిన కష్టం కంటే ఎక్కువ పేరు తెచ్చిందా సినిమా. Also Read: ఈ సినీ ప్రయాణంలో నా తల్లిదండ్రులు, భార్య శ్వేత ప్రోత్సాహం ఎంతో ఉంది. మాకు ఇద్దరు అబ్బాయిలు. వారు నా సినిమాలు చూసినప్పుడల్లా.. డాడీ ఎందుకు హీరోలతో ఎప్పుడూ దెబ్బలు తింటుంటావు? అని అడుగుంటారు. మా చిన్నబ్బాయి ఇదే విషయంపై ఎప్పుడూ పేచీ పెడుతుంటాడు. దెబ్బులు తింటేనే మనకు డబ్బులొస్తాయిరా... అని వాళ్లకు సరదాగా చెబుతుంటా’’ అని చెప్పుకొచ్చారు అజయ్. తన కెరీర్లో ‘ఇష్క్‌’, ‘అతనొక్కడే’, ‘ఆర్య 2’, ‘పోకిరి’, ‘దిక్కులు చూడకు రామయ్య’, ‘అఆ’, ‘24’, ‘జనతా గ్యారేజ్‌’ సినిమాల్లోని పాత్రలూ నటుడిగా నాకెంతో సంతృప్తినిచ్చాయని తెలిపారు. Also Read: నటుడిగా తనకు సవాల్‌ విసిరే విభిన్నమైన పాత్రలెన్నో వస్తున్నాయని అజయ్ తెలిపారు. ఈ ప్రయాణం ఇలా కొనసాగితే చాలని, భవిష్యత్‌లో దర్శకత్వం, నిర్మాణం జోలికి వెళ్లే ఆలోచన అస్సలు లేదని వెల్లడించారు. ప్రస్తుతం చిరంజీవి ‘ఆచార్య’ చిత్రంలో ఓ విభిన్నమైన పాత్రలో నటిస్తున్నానని, అల్లు అర్జున్‌ ‘పుష్ప’ చిత్ర విషయమై చర్చలు జరిగాయని తెలిపారు. వీటితో పాటు సుధీర్‌ వర్మ నిర్మాణంలో ‘ఆహా’ ఓటీటీ కోసం ఓ వెబ్‌సిరీస్‌లో, చందు మొండేటి దర్శకత్వంలో మరో వెబ్‌సిరీస్‌‌లో నటిస్తున్నట్లు అజయ్ వెల్లడించారు. Also Read:


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3kUXzwz
v

Casting Couch: ఇండస్ట్రీలో లైంగిక వేధింపులపై సీరత్ కపూర్ షాకింగ్ రియాక్షన్.. అమ్మడి టార్గెట్ హీరోయిన్లే!

సినీ ఇండస్ట్రీలో అవకాశాల పేరుతో మహిళలను లైంగికంగా వాడుకుంటున్నారంటూ ఎంతోమంది హీరోయిన్స్ ఓపెన్‌గా చెప్పేశారు. దీనిపై క్యాస్టింగ్ కౌచ్, మీటూ లాంటి ఉద్యమాలు కూడా తీసుకొచ్చి పలువురు హీరోయిన్లు తమకు జరిగిన అన్యాయాలను బయటపెట్టారు. దీంతో ఇండస్ట్రీలో ఎలాంటి సమస్య వచ్చినా ముందుగా అంశం తెరపైకి వస్తోంది. అయితే లైంగిక దాడుల విషయమై కొందరు నటీమణులు ఆధారాలు లేని కామెంట్స్ చేయడంతో ఇదో పబ్లిసిటీ స్టంట్ అనే విమర్శలు కూడా ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో ఇండస్ట్రీలో లైంగిక వేధింపులపై హాట్ హీరోయిన్ స్పందిస్తూ నటీమణులకే చురకలంటించింది. క్యాస్టింగ్ కౌచ్ అనేది ఒక్క సినీ ఇండస్ట్రీలోనే కాదు ప్రతిచోట ఉందని అంటోంది సీరత్ కపూర్. కాకపోతే సెలబ్రెటీలకు ఉన్న పాపులారిటీ కారణంగా సినిమా ఇండస్ట్రీలో నే క్యాస్టింగ్ కౌచ్ అనేది ఫోకస్ అవుతూ ఉంటుందంటూ తనదైన కోణంలో వివరణ ఇచ్చింది. క్యాస్టింగ్ కౌచ్ అనుభవాలపై ఇష్టమొచ్చినట్లు అరిస్తే ఎలాంటి ప్రయోజనం ఉండదంటూ లైంగిక ఆరోపణలు చేస్తున్న నటీమణులపైనే సెటైర్స్ వేసింది. Also Read: తమపై లైంగిక దాడి జరిగిందని ఊరికే ఆరోపణలు చేస్తే లాభం లేదని, సందర్భం ఏదైనా క్యాస్టింగ్ కౌచ్ ఎదురైనప్పుడు ఆ అనుభవం ద్వారా మనం నేర్చుకున్నదేంటి? అనేదే ముఖ్యమని చెబుతూ లాజిక్స్ మాట్లాడింది సీరత్. అలాంటి పరిస్థితులలో మనం ఏ విధంగా బయటపడాలనే విషయం బయటకు చెబితే జనాలకు ఎంతో కొంత జాగ్రత్తలు చెప్పినవాళ్ళం అవుతాం కానీ.. ఆరోపణలు చేయడం వేస్ట్ అంటూ కాస్త కొత్తగా ట్రై చేసింది ఈ ముద్దుగుమ్మ. దీంతో సీరత్ వ్యాఖ్యలను సమర్థిస్తున్నారు కొందరు నెటిజన్లు. ఇప్పటిదాకా క్యాస్టింగ్ కౌచ్ ఆరోపణలు చేసిన వారికి పెద్దగా ఒరిగిందేమీ లేదని, మరోవైపు క్యాస్టింగ్ కౌచ్‌కి వ్యతిరేకంగా యుద్ధం చేసిన శ్రీ రెడ్డి లాంటి ఫైరింగ్ బ్యూటీలే పెట్టె సర్దుకున్నారు తప్ప చేసిందేమీ లేదని అంటున్నారు. దీంతో ఈ ఇష్యూపై కొత్త కోణంలో చర్చలు స్టార్ట్ అయ్యాయి. మరి సీరత్ వ్యాఖ్యలపై లైంగిక వేధింపులకు గురైన నటీమణులు ఎలా రియాక్ట్ అవుతారనేది చూడాలి మరి. Also Read:


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3jfKGN1
v

సోనూ సూద్‌కు ప్రెస్టీజియస్ అవార్డ్: సేవలకు గుర్తింపు.. దిగ్గజాల సరసన చోటు

కరోనా భయానక పరిస్థితుల్లో నిస్వార్థంతో కొన్ని లక్షల మంది వలస కార్మికులను వారి ఇళ్లకు పంపడమే కాకుండా ఆపదలో ఉన్నాం ఆదుకోండి అని అడిగిన ప్రతి ఒక్కరికీ సాయం చేసిన ప్రముఖ నటుడు, రియల్ హీరో సోనూ సూద్‌ను ఐక్యరాజ్య సమితి గౌరవించింది. ప్రతిష్టాత్మక ‘ఎస్‌డీజీ స్పెషల్ హ్యుమనిటేరియన్ యాక్షన్’ అవార్డును యునైటెడ్ నేషన్స్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ () సోనూ సూద్‌కు ప్రకటించింది. ఈ అవార్డును సోమవారం (సెప్టెంబర్ 29న) ఆన్‌లైన్‌లో నిర్వహించిన వేడుక ద్వారా సోనూ సూద్‌కు అందజేసింది. ఈ అవార్డును స్వీకరించడం ద్వారా ఏంజెలినా జూలీ, డేవిడ్ బెక్‌హామ్, లీయోనార్డో డికాప్రియో, ఎమ్మా వాట్సన్, లియామ్ నీసన్, కేట్ బ్లాంకెట్, ఆంటోనియో బాండెరస్, నికోలెస్ కిడ్మన్, ప్రియాంక చోప్రా సరసన నిలిచారు. సినిమా, క్రీడలు తదితర రంగాలకు చెందిన వీరంతా పలు యూఎన్ బాడీస్ నుంచి ఇలాంటి గౌరవాన్నే పొందారు. కాగా, యూఎన్ అవార్డును పొందడంపై సోనూ సూద్ ఆనందం వ్యక్తం చేశారు. ‘‘ఇది అరుదైన గౌరవం. యూఎన్ గుర్తింపు అనేది ఎంతో ప్రత్యేకం. ఏమీ ఆశించకుండా నా దేశ ప్రజలకు నాకు తోచినంత సాయం చేశాను. ఆ సేవలకు గుర్తింపు రావడం, అవార్డు తీసుకోవడం చాలా గొప్పగా అనిపిస్తోంది. 2030 నాటికి యూఎన్‌డీపీ తన రాయబారుల ద్వారా లక్ష్యాలను అందుకోవడానికి నా పూర్తి సహకారం అందిస్తాను. ఈ లక్ష్యాలను అమలులోకి తీసుకొస్తే ఈ భూమి, జీవికోటికే లాభం’’ అని సోనూ సూద్ వెల్లడించారు. ప్రపంచంలో పేదరికాన్ని నిర్మూలించాలని, భూగోళాన్ని రక్షించాలని పిలుపునిచ్చిన ఐక్యరాజ్య సమితి.. 2030 నాటికి ఈ భూమి మీద ఉన్న ప్రజలకు శాంతి, శ్రేయస్సు‌ను అందించడమే ధ్యేయంగా పెట్టుకుంది. Also Read:


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/34bAq1Y
v

నాని ఫుల్ బిజీ: టాలెంటెడ్ డైరెక్టర్స్‌తో సినిమాలు.. 2021 చివరి వరకు షెడ్యూల్ ఇదే!

‘జెర్సీ’, ‘గ్యాంగ్ లీడర్’ సినిమాలతో గతేడాదిని విజయవంతంగా ముగించిన నేచురల్ స్టార్ నాని.. ఈ ఏడాది ‘V’ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. కరోనా వల్ల థియేటర్లు మూతబడటంతో ఓటీటీ ద్వారా డైరెక్ట్‌గా ఆడియన్స్ ఇళ్లకే వచ్చేశారు అండ్ టీం. గతంలో ఎన్నడూ చూడని విధంగా కొత్త అవతారంలో ఈ సినిమాలో నాని కనిపించారు. రివేంజ్ తీర్చుకునే సీరియల్ కిల్లర్‌గా తనలోని మరో నటుడిని ఆవిష్కరించారు. ఈ సినిమాలో నటీనటులకు మంచి మార్కులు పడినా సినిమా మాత్రం పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ప్రస్తుతం నాని ‘టక్ జగదీశ్’ సినిమా షూటింగ్‌ను తిరిగి ప్రారంభించడానికి సిద్ధమవుతున్నారు. శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా చిత్రీకరణ లాక్‌డౌన్‌కు ముందు చాలా వరకు పూర్తయింది. త్వరలోనే షూటింగ్‌ను తిరిగి ప్రారంభించి మిగిలిన భాగాన్ని పూర్తిచేయనున్నారు. ఈ చిత్రంలో నాని సరసన రీతూ వర్మ, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. 2017లో వచ్చిన హిట్ మూవీ ‘నిన్ను కోరి’ తరవాత నాని, శివ నిర్వాణ కాంబినేషన్‌లో వస్తోన్న సినిమా కావడంలో ‘టక్ జగదీశ్’పై అంచనాలు భారీగానే ఉన్నాయి. Also Read: ‘టక్ జగదీశ్’తో పాటు మరికొన్ని ఆసక్తికర ప్రాజెక్ట్‌లను నాని లైన్‌లో పెట్టారు. ప్రతిభావంతులైన దర్శకులతో నాని ఈ సినిమాలు చేస్తున్నారు. ‘టాక్సీవాలా’ దర్శకుడు రాహుల్ సంకృత్యాన్‌తో ‘శ్యామ్ సింగ రాయ్’ అనే సినిమాను నాని చేస్తున్నారు. ఇది నాని కెరీర్‌లో భారీ బడ్జెట్ మూవీ కాబోతోంది. కోల్‌కతా బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కనున్న ఈ సినిమాలో నేచురల్ స్టార్ సరికొత్తగా కనిపించనున్నారట. ఈ పాత్ర కోసం నాని లుక్ టోటల్‌గా మారనుందని సమాచారం. ఇక, తన 28వ సినిమాను ‘బ్రోచేవారెవరురా’ దర్శకుడు వివేక్ ఆత్రేయతో నాని చేస్తున్నారు. ఔట్ అండ్ ఔట్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించనుంది. ఈ ప్రాజెక్ట్‌లు అటుంచుతే నాని తన 29వ సినిమాను కూడా అంగీకరించినట్టు సమాచారం. ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ దర్శకుడు స్వరూప్ ఆర్‌జేఎస్‌తో ఈ సినిమాను నాని చేయనున్నారు. ఈ ప్రాజెక్ట్ 2021 ఆఖరిలో సెట్స్‌పైకి వెళ్లనుందని తెలిసింది. ప్రస్తుతం స్వరూప్ నిధి అన్వేషణ నేపథ్యంలో ఒక సినిమా చేస్తున్నారు. అది పూర్తికాగానే నాని సినిమా చేసే అవకాశం ఉంది. అలాగే, ‘సాయి శ్రీనివాస్ ఆత్రేయ’ను ట్రైలజీగా కూడా తెరకెక్కించే పనిలో స్వరూప్ ఉన్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/30iKsgP
v

చిరంజీవితో ఆ ఛాన్స్ మిస్సయ్యా.. ఇప్పటికీ థ్యాంక్స్ చెబుతుంటా: ఎస్వీ కృష్ణారెడ్డి

ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ సినిమాలకు పెట్టింది పేరు . 1990 దశకంలో ఆయన సినిమా వస్తుందంటే ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసేశారు. మాయలోడు, రాజేంద్రుడు గజేంద్రుడు, శుభలగ్నం, మావిచిగురు, యమలీల వంటి అద్భుతమైన చిత్రాలకు ఆయన దర్శకత్వం వహించారు. హీరోగా ఉగాది, అభిషేకం సినిమాల్లో మెరిశారు. తాను దర్శకత్వం వహించిన అన్ని సినిమాలకు ఆయనే సంగీతం అందించేవారు. ఇలా బహుముఖ ప్రజ్ఞాశాలిగా గుర్తింపు పొందిన ఆయన కొత్తతరం దర్శకులు రాకతో పూర్తిగా కనుమరుగైపోయారు. అయితే ఇన్నేళ్లైనా ఆయన సినిమాలు ప్రేక్షకులను ఇంకా అలరిస్తూనే ఉన్నాయి. తాజాగా ఎస్వీ కృష్ణారెడ్డి గురించి ఓ ఇంట్రస్టింగ్ న్యూస్ వెలుగులోకి వచ్చింది. 90వ దశకంలో మెగాస్టార్ చిరంజీవి సినిమాకు ఎస్వీ కృష్ణారెడ్డి మ్యూజిక్ అందించేందుకు ప్రయత్నించారట రాఘవేంద్రరావు. చిరంజీవి-రాఘవేంద్రరావు కాంబినేషన్లో వచ్చిన సినిమాకు సంగీతం అందించే తనకు ఛాన్స్ వచ్చిందని తాజాగా ఎస్వీ కృష్ణారెడ్డి తెలిపారు. అయితే అప్పట్లో తాను మ్యూజిక్‌తో పాటు అన్ని విభాగాల్లో వర్క్ చేయడం వల్ల చిరంజీవి సినిమాకు పనిచేసే ఛాన్స్ కోల్పోయానని ఆమె వెల్లడించారు. Also Read: "చిరంజీవి సినిమాకు మ్యూజిక్ ఇవ్వాలని దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు నన్ను కోరారు. కానీ ఆ సమయంలో బిజీగా ఉండటం వల్ల చేయలేకపోయాను. అలా చిరంజీవి గారితో పనిచేసే ఛాన్స్ కోల్పోయా. అయితే ఆయన సినిమాకు పనిచేసే టాలెంట్ నాలో ఉందని గుర్తించిన రాఘవేంద్రరావు గారికి ఇప్పటికీ మనసులో థ్యాంక్స్ చెబుతూనే ఉంటా’ అని తెలిపారు. తాను వెండితెరకు దూరం కాలేదని ఎస్వీ కృష్ణారెడ్డి చెప్పుకొచ్చారు. నటకిరీటి రాజేంద్రప్రసాద్ లీడ్ రోల్‌గా ఓ కథ రాస్తున్నట్లు తెలిపారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3kOWZjY
v

చిన్న సూదికే భయపడతా.. నన్ను ట్రోల్ చేయడం అన్యాయం: పాయల్ ఆవేదన

తాను కొవిడ్-19 టెస్ట్ చేయించుకుంటున్న వీడియోను శనివారం సోషల్ మీడియాలో పెట్టడంతో ఆమెను నెటిజన్లు విపరీతంగా ట్రోల్ చేశారు. ఆరు నెలల తరవాత తిరిగి షూటింగ్‌లో పాల్గొన్న పాయల్.. సెట్స్‌లోకి వెళ్లడానికి ముందు తప్పనిసరి అయిన కరోనా టెస్ట్ చేయించుకున్నారు. అయితే, పాయల్ సోషల్ మీడియాలో షేర్ చేసిన వీడియోలో ఆమె టెస్ట్ చేయించుకోవడానికి భయపడిపోతూ ఏడ్చేశారు. పాయల్ ఆ వీడియోను సోషల్ మీడియాలో పెట్టిన కొన్ని నిమిషాల్లోనే ఆమెపై ట్రోలింగ్ మొదలైపోయింది. పాయల్ ఓవరాక్టింగ్ చేస్తున్నారని, మరీ అంత అవసరమా అని కామెంట్లు పెట్టారు. అయితే, నెటిజన్లు తనను ట్రోల్ చేయడంపై పాయల్ స్పందించారు. తాను నిజంగానే భయపడ్డానని, నటించాల్సిన అవసరం తనకు లేదని తనను ట్రోల్ చేసిన వారికి గట్టిగానే సమాధానం చెప్పారు పాయల్. ఈ మేరకు ఆమె ‘హైదరాబాద్ టైమ్స్‌’తో మాట్లాడారు. ‘‘నాకు సూదులంటేనే భయం. మందులన్నా, ఇంజక్షన్ అన్నా ఆమడ దూరం పారిపోతా. అందుకే, కొవిడ్-19 కోసం చేసిన స్వాబ్ టెస్ట్ నాకు చాలా ఇబ్బందికరంగా అనిపించింది. ఈ మాత్రం దానికి నన్ను ట్రోల్ చేయడం అన్యాయం, దారుణం’’ అని పాయల్ వెల్లడించారు. పాయల్ రాజ్‌పుత్ శుక్రవారం నుంచి రామోజీ ఫిల్మ్ సిటీలో షూటింగ్‌లో పాల్గొంటున్నారు. కొవిడ్ -19 నిబంధనలను పాటిస్తూ ఆమె షూటింగ్ చేస్తున్నారు. కొవిడ్-19 టెస్ట్ చేయించుకోకుండానే షూటింగ్‌లో పాల్గొనాలని ప్రయత్నించానని.. కానీ కుదరలేదని పాయల్ తెలిపారు. ‘‘మొత్తం యూనిట్‌కు టెస్టులు నిర్వహించడానికి ముగ్గురు డాక్టర్లను పిలిపించారు. నేను చాలా భయపడటంతో నాకు ఆఖరిగా టెస్ట్ చేశారు. నేను బాగానే ఉన్నానని, నాకు టెస్ట్ అవసరం లేదని వాళ్లకు చెబుతూనే ఉన్నాను. కానీ, సెట్స్‌లో ఉన్న వాళ్లందరి భద్రత ముఖ్యమని తరవాత నాకే అనిపించింది. నా భయానికి మొత్తం యూనిట్‌ను బలి చేయకూడదని భావించి టెస్ట్ చేయించుకున్నాను’’ అని పాయల్ వెల్లడించారు. Also Read:


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2GgesTw
v

సుశాంత్‌ మృతి కేసు: ఎయిమ్స్‌ రిపోర్టులో సంచలన విషయాలు

బాలీవుడ్‌ హీరో సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ మృతి కేసులో ఎయిమ్స్ కీలక రిపోర్టను సమర్పించింది. సుశాంత్‌ శరీరంలో ఎలాంటి విషం లేదని, ఆయన మృతికి ఉరేసుకోవడమే కారణమని ఎయిమ్స్‌ వర్గాలు ధృవీకరించాయి. అతడి డీఎన్‌ఏను పూర్తిగా పరిశీలించిన తర్వాతే నివేదికను సమర్పిస్తున్నామని, దీనిలో ఎలాంటి సందేహాలు అవసరం లేదని నివేదికలో పేర్కొంది. తాజా నివేదిక ఆధారంగా సుశాంత్ మానసిక ఒత్తిడి కారణంగానే ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని డాక్టర్లు భావిస్తున్నారు. Also Read: సుశాంత్‌ సింగ్ రాజ్‌పుత్ జూన్‌ 14న ముంబైలోని తన నివాసంలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే. తమ కుమారుడి మృతిపై అనుమానాలున్నాయని, ఎవరో గొంతు నులిమి హత్య చేసి ఉండొచ్చని సుశాంత్ తండ్రి బీహార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలోనే అనేక మలుపులు తిరిగిన ఈ కేసు విచారణను కేంద్ర ప్రభుత్వం సీబీఐకి అప్పగించింది. దర్యాప్తులో భాగంగా సుశాంత్ ప్రియురాలు రియా చక్రవర్తిని పోలీసులు అరెస్ట్ చేయగా.. డ్రగ్స్ కోణం వెలుగులోకి వచ్చింది. రియా చెప్పిన వివరాలతో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు హీరోయిన్లు రకుల్‌ప్రీత్ సింగ్, దీపికా పదుకొనే, సారా అలీఖాన్, శ్రద్ధా కపూర్‌లను విచారించారు. Also Read: ఈ క్రమంలోనే ఎయిమ్స్ తన రిపోర్టు సమర్పించడం కీలకంగా మారింది. సుశాంత్‌ది ముమ్మాటికి ఆత్మహత్యేనని తేలడంతో ఇప్పుడు డ్రగ్స్ కేసుపైనే విచారణ కొనసాగనుంది. మరోవైపు గొంతు నులమడం వల్లనే సుశాంత్‌ చనిపోయాడని ఆయన ఫ్యామిలీ లాయర్‌ వికాస్‌ సింగ్‌ ఆరోపిస్తున్నారు. తాను పంపిన సుశాంత్‌ మృతదేహం ఫొటోలు చూసి ఎయిమ్స్‌ సీనియర్‌ డాక్టర్‌ ఒకరు ఈ విషయాన్ని నిర్ధారించారని పేర్కొన్నారు. ఈ కేసు దర్యాప్తును సీబీఐ జాప్యం చేయడం తగదన్నారు. Also Read:


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3cEnSEi
v

Urvashi Rautela: అల్లు అర్జున్‌పై కన్నేసిన హాట్ బ్యూటీ.. ఆ తిప్పుడేంది బాబోయ్! వీడియో వైరల్

డాన్స్ ఫ్లోర్స్‌పై చిందేయడంలో టాలీవుడ్ హీరోల్లోకెల్లా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. పాట ఏదైనా సరే ఆయన వేసే స్టైలిష్ స్పెప్పులతో డాన్స్ ఫ్లోర్స్‌ దద్దరిల్లిపోవాల్సిందే. అందుకే బన్నీ డాన్స్ అంటే ఇటు ప్రేక్షకులతో పాటు అటు సినీ సెలబ్రిటీలు సైతం యమ లైక్ చేస్తుంటారు. ఈ నేపథ్యంలోనే అల్లు అర్జున్‌పై కన్నేసింది హాట్ బ్యూటీ, మాజీ మిస్ యూనివర్స్ . డాన్సింగ్‌లో ఆయనే తనకు స్ఫూర్తి అని పేర్కొంటూ తన డాన్స్ వీడియో షేర్ చేసింది. తనకు తానే ‘లేడి అల్లు అర్జున్’ అని ప్రకటించుకుంటూ తన డాన్స్ పర్‌ఫార్‌మెన్స్ వీడియోను ప్రేక్షకుల ముందుంచింది. తన కొత్త చిత్రం ‘బ్లాక్ రోజ్’ నుంచి సౌత్ ఇండియన్ డ్యాన్స్ స్టైల్‌ను మీకు పరిచయం చేస్తున్నా అంటూ ఈ వీడియోను తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసింది. ఇందులో.. రెండు చేతులు ఫ్లోర్ మీద ఉంచి ఊర్వశి చేసిన మూమెంట్, ఆ తిప్పుడు చూసి షాకవుతున్నారు నెటిజన్లు. పైగా అల్లు అర్జున్ స్టైల్ అంటూ తెగ తిప్పేయడంతో ఈ వీడియో కూడా నెట్టింట అంతకుమించి తిరుగుతోంది. సరదాగా ఈ వీడియో షేర్ చేసుకుంటూ ఊర్వశి గ్లామర్ ట్రీట్ చూసి ఎంజాయ్ చేస్తున్నారు బన్నీ ఫ్యాన్స్. Also Read: స‌న‌మ్‌రే, గ్రేట్ గ్రాండ్ మ‌స్తీ, హేట్ స్టోరీ 4 లాంటి సినిమాలతో బాలీవుడ్‌ని షేక్ చేసిన ఊర్వశి రౌతేలా.. ప్రస్తుతం తెలుగులో ‘బ్లాక్ రోజ్’ సినిమా చేస్తోంది. ద‌ర్శ‌కుడు సంప‌త్‌నంది అందించిన కథతో మోహ‌న్ భ‌ర‌ద్వాజ్ ద‌ర్శ‌కుడిగా తెలుగు తెర‌కు ప‌రిచ‌యం అవుతున్నాడు. ఎమోష‌న‌ల్ థ్రిల్ల‌ర్‌గా ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాలో ఊర్వశి రౌతేలా లీడ్ రోల్ పోషిస్తోంది. ఇటీవలే విడుదలైన ఈమె ఫస్ట్‌లుక్ భారీ ప్రేక్షకాదరణ పొందింది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3l2jH8t
v

స్నేహారెడ్డి బర్త్‌డే సెలబ్రేషన్స్: చుట్టూ అమ్మాయిలు.. మధ్యలో బన్నీ!

నిన్న మొన్నటి వరకు సెలబ్రిటీలు పుట్టినరోజు వేడుకలను తమ కుటుంబ సభ్యులతో మాత్రమే జరుపుకుంటున్నారు. దీనికి కారణం కరోనా. ఇప్పుడు కరోనా భయం కాస్త తగ్గడంతో స్నేహితులు, శ్రేయోభిలాషుల సమక్షంలో జరుపుకుంటున్నారు. సైతం భర్త అల్లు అర్జున్, స్నేహితురాళ్లు, కజిన్స్ సమక్షంలో తన 35వ పుట్టినరోజును సోమవారం అర్ధరాత్రి జరుపుకున్నారు. ఈ మేరకు తన భార్య కేక్ కట్ చేస్తున్న ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. భార్యకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ‘‘నా జీవితంలో ఎంతో ప్రత్యేకమైన వ్యక్తివైన నువ్వు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలి. నీతో ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో, మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటున్నాను. హ్యాపీ బర్త్‌డే క్యూటీ’’ అని బన్నీ తన పోస్ట్‌లో పేర్కొన్నారు. మరోవైపు స్నేహారెడ్డి కూడా ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ఫొటోలు షేర్ చేశారు. ఇవి చూస్తుంటే చుట్టూ స్నేహారెడ్డి గర్ల్ గ్యాంగ్.. మధ్యలో బన్నీ ఒక్కరే ఉన్నట్టు అనిపిస్తోంది. ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో పోస్ట్‌ చేసిన ఫొటోల్లో స్నేహారెడ్డి ట్రెండీ డ్రెస్‌లో మెరిసిపోతున్నారు. అల్లు అర్జున్, స్నేహారెడ్డి ఇటీవల నిహారిక కొణిదెల, చైతన్య జొన్నలగడ్డ నిశ్చితార్థ వేడుకలో మెరిసిన సంగతి తెలిసిందే. చేతిలో చేయి వేసుకుని భర్తతో కలిసి స్నేహారెడ్డి వస్తోన్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. జంట అదిరిపోయింది అంటూ ఫ్యాన్స్ ఈ ఫొటోలను తెగ షేర్ చేశారు. అల్లు అర్జున్, స్నేహారెడ్డి ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. స్నేహాను బన్నీ తొలిచూపులోనే ప్రేమించారు. ఇద్దరూ తమ పెద్దలను ఒప్పించి 2011లో వివాహ బంధంతో ఒక్కటయ్యారు. వీరికి అయాన్, అర్హ ఇద్దరు పిల్లలు. Also Read:
  • ..!


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3cMtHQ7
v

Bigg Boss: ఛీ ఛీ.. అదో బ్రతుకేనా? ఇంకొకరి మరుగుదొడ్లు కడుగుతూ! బిగ్‌ బాస్‌‌‌పై యంగ్ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్

బుల్లితెర పాపులారిటీ షో బిగ్‌బాస్‌పై నెగెటివ్ కామెంట్స్ రావడం కొత్తేమీకాదు. కాస్టింగ్ కౌచ్ మొదలుకొని షోలో ఇచ్చే టాస్కుల వరకు ఎన్నో అంశాలు వివాదాస్పదం అయ్యాయి. బిగ్‌బాస్‌కి వెళ్లొచ్చిన కంటిస్టెంట్స్ సైతం ఆ షోపై దుమ్మెత్తిపోసిన సందర్భాలున్నాయి. ఇక షోలో పాల్గొనకుండానే బిగ్ బాస్‌‌‌పై విరుచుకుపడిన వారైతే చాలామందే ఉన్నారు. అదే బాటలో ఇప్పుడు తమిళ హీరోయిన్ బిగ్ బాస్‌‌‌పై షాకింగ్ కామెంట్స్ చేసి వార్తల్లో నిలిచింది. ఎన్ని వివాదాలు చుట్టుముట్టినా, నెగెటివ్ కామెంట్స్ వచ్చినా తెలుగుతో పాటు పలు భాషల్లో బుల్లితెరపై హంగామా చేస్తూనే ఉంది బిగ్‌బాస్ ప్రోగ్రాం. ప్రతి ఏడాది కొత్త కొత్త పార్టిసిపెంట్స్, సరికొత్త టాస్కులతో అలరిస్తోంది. ఇప్పటికే తెలుగులో బిగ్‌బాస్ సీజన్ 4 స్టార్ట్ కాగా.. తమిళ బిగ్‌బాస్ ప్రారంభానికి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. అక్కడ కూడా సీజన్ 4 గానే ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ షోకు ఎప్పటిలాగే కమల్ హాసన్ హోస్ట్‌గా వ్యవహరించనున్నారు. Also Read: ఈ క్రమంలో తమిళ బిగ్‌బాస్ సీజన్ 4లో పాల్గొనబోయే కంటిస్టెంట్స్ లిస్ట్ ఇదే అంటూ సోషల్ మీడియాలో కొందరి పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. ఇందులో హీరోయిన్ లక్ష్మీ మీనన్ కూడా పార్టిసిపేట్ చేయనున్నట్లు టాక్ రావడంతో ఆమె వెంటనే ఘాటుగా రియాక్ట్ అయింది. తాను బిగ్‌బాస్ పాల్గొనడం లేదని చెబుతూనే ఈ షోపై సంచలన వ్యాఖ్యలు చేస్తూ రెచ్చిపోవడం సినీ వర్గాల్లో హాట్ టాపిక్ అయింది. తాను బిగ్‌బాస్ సీజన్ 4లో పాల్గొనడం లేదని.. అందులో పాల్గొని ఇతరుల ప్లేట్లు కడగడం, టాయ్‌లెట్లు శుభ్రం చేయడం లాంటి పనులు చేయనని చెప్పింది లక్ష్మీ మీనన్. అలాంటి దుస్థితి కూడా తనకు పట్టలేదంటూ బిగ్‌బాస్ పరువు తీసేసింది. దీంతో ఆమె చేసిన ఈ వ్యాఖ్యలు, కంటిస్టెంట్స్‌కి బిగ్‌బాస్ ఇస్తున్న టాస్కులపై జనాల్లో చర్చ మొదలైంది. సో.. చూడాలి మరి ఇప్పటికే పాల్గొన్న కంటిస్టెంట్స్ ఎవరైనా లక్ష్మీ మీనన్ కామెంట్స్‌పై రియాక్ట్ అవుతారా? లేదా.. అనేది. 'వేదాళం' సినిమాలో అజిత్ సోదరిగా నటించి క్రేజ్ కొట్టేసిన లక్ష్మీ మీనన్.. పలు తమిళ సినిమాలతో భారీ పాపులారిటీ కూడగట్టుకుంది. అలాంటి ఈ హీరోయిన్ బిగ్ బాస్‌‌‌పై ఇలా మాట్లాడటం చూసి తమిళ సినీ వర్గాలు షాకయ్యాయి. ఇదిలాఉంటే మరో హీరోయిన్ మీరా మిథున్ బిగ్‌బాస్‌ని అడ్డుకుంటానని శపథం చేస్తుండటం ఈ షో ప్రారంభంపై అనుమానాలు రేకెత్తిస్తోంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3jf2U19
v

Pawan Kalyan: పాఠాలు చెప్పేందుకు రెడీ అవుతున్న పవన్ కళ్యాణ్.. పక్కా ప్లాన్! విద్యార్థులకు హితబోధ

రెండేళ్ల రాజకీయ ప్రయాణం తర్వాత పవర్ స్టార్ తిరిగి కెమెరా ముందుకొచ్చిన సంగతి తెలిసిందే. బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ 'పింక్' రీమేక్‌తో షూటింగ్‌లో అడుగుపెట్టిన ఆయన.. వరుస సినిమాలకు కమిట్ అయ్యారు. అందులో ఓ మూవీ స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్‌తో చేయబోతున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఆసక్తికర అప్‌డేట్ బయటకొచ్చింది. ప్రస్తుతం పవన్ సినిమా కథపై కసరత్తులు చేస్తున్న హరీష్ శంకర్.. ఈ సినిమాలో ఆయన్ను ఓ విలక్షణ పాత్రలో చూపించబోతున్నారని తెలుస్తోంది. లెక్చరర్‌ రోల్‌లో చూపిస్తారనే వార్తలు సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తున్నాయి. పాఠాలు చెబుతూ విద్యార్థులకు భవిష్యత్ గైడ్ చేసే మాస్టర్‌గా పవన్‌ని చూపించాలని పక్కాగా ప్లాన్ చేస్తున్నారట హరీష్. మైత్రీమూవీ మేకర్స్‌ బ్యానర్‌పై హరీశంకర్‌ రూపొందించనున్న ఈ చిత్రం ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌ పనులు జరుపుకుంటోంది. గతంలో పవన్ ‌కళ్యాణ్- హరీశ్‌ శంకర్‌ కాంబో‌లో రూపొందిన 'గబ్బర్‌సింగ్‌' ఇండస్ట్రీ హిట్‌ సాధించిన నేపథ్యంలో ఈ సినిమాపై భారీగా అంచనాలు పెట్టుకున్నారు ప్రేక్షకులు. Also Read: మరోవైపు పవన్ హీరోగా వేణు శ్రీరామ్ దర్శత్వంలో రూపొందుతున్న పింక్ రీమేక్ 'వకీల్ సాబ్' మూవీ ఇప్పటికే 80 శాతం షూటింగ్ ఫినిష్ చేసుకుంది. ఈ మూవీలో లాయర్‌గా నటిస్తున్నారు పవన్. అయన సరసన సరసన అంజలి, నివేత థామస్, అనన్య నాగేళ్ల హీరోయిన్లుగా నటిస్తున్నారు. దీంతో పాటు క్రిష్ దర్శకత్వంలో మరో సినిమాకు ఇప్పటికే కమిట్ అయ్యారు పవర్ స్టార్. సో.. చూస్తుంటే వచ్చే ఏడాది పవన్ హంగామాతో థియేటర్స్ హోరెత్తిపోవడం ఖాయమే అనిపిస్తోంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2GbFKul
v

Monday 28 September 2020

Sri Reddy: టాలీవుడ్‌పై ఉమ్మేసిన శ్రీ రెడ్డి.. బాలు చనిపోతే ఒక్కడైనా వచ్చాడ్రా? తూ.. శివాలెత్తిన హాట్ బాంబ్

ఏ చిన్న అవకాశం దొరికినా టాలీవుడ్‌ పెద్దలపై విరుచుకుపడుతున్న హాట్ బాంబ్ మరోసారి రెచ్చిపోయింది. లెజెండరీ సింగర్ అంత్యక్రియలకు టాలీవుడ్ సినీ ప్రముఖులు హాజరు కాకపోవడాన్ని తప్పుబడుతూ శివాలెత్తిపోయింది. టాలీవుడ్ స్టార్ హీరోలు దొంగ కన్నీరు కార్చుతున్నారంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది. ఉమ్మేస్తున్నారిక్కడ అంటూ ఆవేదన చెందిన శ్రీ రెడ్డి.. టాలీవుడ్ నటిని అని చెప్పుకోవడానికే సిగ్గుగా ఉందంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. ఈ మేరకు ఆమె విడుదల చేసిన వీడియో నెట్టింట రచ్చ చేస్తోంది. ఈ వీడియోలో శ్రీ రెడ్డి మాట్లాడుతూ.. ''ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మరణంతో తెలుగు సినీ పరిశ్రమ మూల స్తంభాన్ని కోల్పోయింది. ఆయన గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. అయితే ఆయన మరణం తర్వాత ప్రతి ఒక్కరూ రియాక్ట్ అవుతూ అన్నయ్యా.. వెళ్లిపోయావా? అంటూ దొంగ కన్నీరు కార్చారు తప్ప కడసారి చూపు కోసం రాలేదు. ఆయన వాయిస్ లేనిదే మెగాస్టార్లు టాలీవుడ్‌లో అనేవాళ్ళే లేరు. ఆయన గాత్రంతోనే వాళ్ళను స్టార్స్ చేశారు. అయితే ఓ స్టేజ్ వచ్చాక అదే స్టార్స్ మళ్ళీ ఆయనను ఇబ్బందులు పెట్టడమే గాక.. ఆ గాన గంధర్వుడి మరణం తర్వాత టాలీవుడ్ నుంచి ఒక్కడు కూడా రాకపోవడం సిగ్గుచేటు. Also Read: మా అసోసియేషన్ నుంచి కూడా ఒక్కడూ రాలేదు. రావాలనే ఉద్దేశ్యమే ఉంటే చిరంజీవి లాంటి హీరోలు రాలేరా? ఆ బోడి గుండులు ఫోటోలు తీసుకుంటూ పబ్లిసిటీ చేసుకుంటున్నారు కానీ బాలు అంత్యక్రియలకు మాత్రం రాలేరా? మీ కొడుకులను, మేనల్లుళ్ళను ప్రమోట్ చేయడంలో ఉన్న శ్రద్ద.. ఇంతపెద్ద గాన గంధర్వుడు పోతే రాకపోవడం సిగ్గుగా ఉంది. ఒక్కనాకొడుకు రాలేదని తమిళనాడులో టాలీవుడ్‌పై ఉమ్మేస్తున్నారు. టాలీవుడ్ ప్రముఖులకు ఓ గౌరవం తెలియదు.. ఓ పద్దతి తెలియదు. ఎప్పుడూ వేదికలపై కొట్టుకుంటూ నీచానికి దిగజారి పోయారు. అందరూ డబ్బు మాయలో పడిపోయారు. పెద్ద పెద్ద వాళ్ళ అంత్యక్రియలకు వెళతారు కానీ మీ కెరీర్ నిలబెట్టిన వారిని చివరిచూపు చూడలేరా? షేమ్ షేమ్.. చెన్నైలో నా పరువు పోయింది. నేను బాలు గారి అంత్యక్రియలకు వెళ్ళా కానీ టాలీవుడ్ తరుపున కాదు.. కోలీవుడ్ తరుపున. తెలుగు అమ్మాయిగా గర్వపడుతున్న నేను.. తెలుగు యాక్టర్‌గా చెప్పుకోవడాని సిగ్గుపడుతున్నా. మీకూ మరణం వస్తుంది. అది గుర్తు పెట్టుకోండి.. చేసిన పాపాలకు అనుభవించి మరీ పోతారు ఒక్కొక్కరు. ఇక్కడికొస్తే కాదురా.. మీరు గుమ్మం దాటి బయటకొచ్చినా కరోనా వస్తుంది. తూ'' అంటూ ఓ రేంజ్‌లో ఫైర్ అయింది శ్రీ రెడ్డి. ఆమె చేసిన ఈ కామెంట్స్‌పై నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన వస్తోంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3cDyWkY
v

బడా పొలిటీషియన్ కుమార్తెతో యాంకర్ ప్రదీప్ మ్యారేజ్.. ఇదీ మనోడి ప్లాన్! రహస్యం బయటపడిందిలా..

లాక్‌డౌన్ కారణంగా వెండితెర హంగామా కోల్పోయినా తారల పెళ్లి ముచ్చట్లు మాత్రం జనాలను ఖుషీ చేశాయి. వరుసపెట్టి వెండితెర, బుల్లితెర స్టార్స్ పెళ్లి పీటలెక్కడం ఓ కిక్కిచ్చింది. ఇప్పటికే నిఖిల్, నితిన్, రానా లాంటి యంగ్ హీరోలతో పాటు పలువురు టీవీ ఆర్టిస్టులు కూడా పెళ్లి చేసుకోగా.. తాజాగా యంగ్ యాంకర్స్ రష్మీ గౌతమ్, శ్రీముఖి మూడుముళ్ళ బంధానికి రెడీ అయ్యారని తెలుస్తుండటం హాట్ టాపిక్ అయ్యింది. ఇంతలో మరో ఎనర్జిటిక్ మ్యాటర్ కూడా బయటకురావడంతో సినీ సర్కిల్స్ మొత్తంలో వీళ్ళ పెళ్లి గురించిన చర్చలే వినిపిస్తున్నాయి. యాంకర్‌గా ఫుల్ పాపులారిటీ సంపాదించాడు ప్రదీప్ మాచిరాజు. బుల్లితెరపై వినోదాల విందిస్తూ పలు షోస్ ద్వారా ఆకట్టుకుంటున్నాడు. ఎంతోమంది మేల్ యాంకర్స్ ఉన్నా కూడా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకొని దూసుకుపోతున్నాడు. అయితే మనోడికి ఇప్పటికే 33 ఏళ్ళు మీదపడటంతో అంతా ఆయన పెళ్లి మ్యాటర్ పైనే ఫోకస్ పెట్టారు. పలు ఇంటర్వ్యూల్లో అతనికి పెళ్లిపై ఎన్నో ప్రశ్నలు ఎదురవుతుండేవి. ఈ నేపథ్యంలో గతంలో ఓ ఇంటర్వ్యూలో తన లవ్ సీక్రెట్స్ కూడా చెప్పిన ప్రదీప్.. ఆమెకు ఇప్పటికే పెళ్ళై పోయిందని అన్నాడు. Also Read: దీంతో అప్పటినుంచి ప్రదీప్ పెళ్లి మ్యాటర్ వైరల్ అవుతూ వస్తోంది. అయితే ఇప్పుడు మాత్రం మనోడు నిజంగానే పెళ్లికి సిద్ధమయ్యాడని ఆయన సన్నిహిత వర్గాలు పేర్కొంటున్నాయి. పెళ్లికి మనకు చాలా దూరం అని సరదా కామెంట్స్ చేస్తూ బుల్లితెర హంగామా చేసే ప్రదీప్ మరో రెండు మూడు నెలల్లోనే పెళ్లి చేసుకోబోతున్నాడని తెలుస్తోంది. ఓ బడా రాజకీయ నాయకుడి కుమార్తెతో ప్రదీప్ మ్యారేజ్ ఫిక్స్ అయిందని, కాకపోతే దాన్ని సీక్రెట్ గానే ఉంచారని అంటున్నారు. ప్రస్తుతం ఆయన కుటుంబం పెళ్లి పనుల్లో నిమగ్నమై ఉందని టాక్. చూడాలి దీనిపై ప్రదీప్ ఎలా రియాక్ట్ అవుతాడనేది. ఇకపోతే వెండితెరపై హీరోగా ఎంట్రీ ఇస్తున్న ప్రదీప్.. ఇప్పటికే '30 రోజుల్లో ప్రేమించడం ఎలా' సినిమాను కంప్లీట్ చేశాడు. మున్నా దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో ప్రదీప్‌ సరసన అమృత అయ్యర్‌ హీరోయిన్‌గా నటించింది. అతిత్వరలో ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3kVG2nT
v

సుశాంత్‌తో డేటింగ్ చేశా.. రెగ్యులర్‌గా ఆ అలవాటు! నిజం ఒప్పుకున్న సారా అలీఖాన్.. సీక్రెట్స్ రివీల్

ఆత్మహత్య కేసు ఊహించని మలుపులు తిరుగుతోంది. ఈ కేసు విచారణ భాగంగా సుశాంత్ ప్రేయసి రియా చక్రవర్తిని అదుపులోకి తీసుకున్న పోలీసులు కూపీ లాగుతున్నారు. ఈ క్రమంలోనే డ్రగ్స్ ఇష్యూ తెరపై వచ్చి పలువురు హీరోయిన్ల మెడకు చుట్టుకుంది. సారా అలీ ఖాన్, దీపికా పదుకునే, రకుల్ ప్రీత్ సింగ్, శ్రద్ధా కపూర్, ఫ్యాషన్ డిజైనర్ సిమోనీ, దీపిక మేనేజర్ కరిష్మా ప్రకాశ్‌లను ఎన్సీబీ అధికారులు విచారిస్తున్నారు. ఈ విచారణలో భాగంగా సారా అలీ ఖాన్ నిజం ఒప్పుకున్నట్లు బీటౌన్ మీడియా సమాచారం. మొదట రకుల్ ప్రీత్ సింగ్‌ని విచారించిన ఎన్సీబీ అధికారులు.. ఆ తర్వాత దీపికా పదుకునే, శ్రద్ధా కపూర్‌లను విచారించారు. ఆ వెంటనే బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ కుమార్తె, హీరోయిన్ సారా అలీఖాన్‌పై లోతుగా విచారణ చేపట్టారు. ఈ విచారణలో ఆమె పలు కీలక విషయాలపై రియాక్ట్ అయ్యిందని, సుశాంత్‌తో కొంత కాలం డేటింగ్ చేసిన మాట వాస్తవమే అని ఒప్పుకుందని తెలుస్తోంది. సుశాంత్ డ్రగ్స్ తీసుకునేవాడని, ఆయనతో కలిసి థాయ్‌లాండ్ పర్యటనకు కూడా వెళ్లానని ఆమె చెప్పినట్లు సమాచారం. అయితే తనకు రెగ్యులర్‌గా సిగరెట్ తాగే అలవాటు మాత్రనే ఉందని, డ్రగ్స్ ఎప్పుడూ తీసుకోలేదని ఆమె తెలిపిందట. Also Read: కేదార్‌నాథ్ సినిమాలో సుశాంత్, కలిసి నటించారు. ఈ సినిమా షూటింగ్ సమయంలోనే వీరిద్దరూ ప్రేమలో పడ్డారని కొద్దిరోజుల క్రితమే సుశాంత్ స్నేహితుడు శామ్యూల్ హోకిప్ పోలీసులకు చెప్పాడు. అయితే సుశాంత్, సారా బ్రేకప్‌కి కారణం రియా చక్రవర్తే అని ఆయన చెప్పడం మరిన్ని అనుమానాలు రేకెత్తించింది. మరోవైపు దీపికా పదుకొనే కూడా తనపై వచ్చిన డ్రగ్స్ ఆరోపణలు అబద్ధమని.. ఆరోగ్య రీత్యా అలాంటి వాటికి దూరంగా ఉంటానని ఆమె వివరణ ఇచ్చినట్లు సమాచారం. అధికారులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పకుండా కన్నీరు పెట్టుకుందట దీపికా. అయినప్పటికీ ఆమె నుంచి సమాచారం సేకరించిన ఎన్సీబీ అధికారులు సారా అలీ ఖాన్, దీపికా పదుకునే, రకుల్ ప్రీత్ సింగ్, శ్రద్ధా కపూర్ ఫోన్లు స్వాధీనం చేసుకొని పరిశీలిస్తున్నారు. వారి వారి బ్యాంక్ స్టేట్‌మెంట్స్‌పై దృష్టి సారించారట ఎన్సీబీ ఆఫీసర్స్.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/33bLDRa
v

హీరో సూర్య ఆఫీసుకు బాంబు బెదిరింపు.. చెన్నైలో కలకలం

తమిళ‌ హీరోలను బాంబు బెదిరింపులు కలవరపరుస్తున్నాయి. ఇటీవల కాలంలో సూప‌ర్‌స్టార్ రజినీకాంత్‌, అజిత్‌, మ‌ణిర‌త్నం, విజ‌య్ త‌దిత‌రుల ఇళ్లు, ఆఫీసుల్లో బాంబులు పెట్టామంటూ పోలీసుల‌కు ఫోన్స్ వ‌చ్చాయి. దీంతో పోలీసులు వెంటనే అక్కడ తనిఖీలు చేయగా అవన్నీ ఫేక్ కాల్స్ అని తేలింది. ఈ నేపథ్యంలో తమిళంతో పాటు తెలుగులోనూ స్టార్ హీరోగా కొనసాగుతున్న సూర్యను కేటుగాళ్లు టార్గెట్ చేశారు. చెన్నై అల్వార్‌పేట ప్రాంతంలో ఉన్న ఆఫీసులో బాంబు పెట్టినట్లు సోమవారం పోలీసులకు ఫోన్‌కాల్ వచ్చింది. దీంతో అప్రమత్తమైన పోలీసులు వెంటనే డాగ్‌స్వ్కాడ్‌ను తీసుకెళ్లి తనిఖీలు చేశారు. ఆ ప్రాంతంలో ఎక్కడా బాంబు కనిపించకపోవడంతో అది ఫేక్‌ కాల్ అని నిర్ధారించుకున్నారు. అయితే ఈ కాల్ ఎవరు చేశారు, ఎక్కడి నుంచి చేశారు అన్న దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2S2PQjI
v

53 ఏళ్ల వయసులో నటి హేమ కీలక నిర్ణయం.. ఆమెను అభినందిచాల్సిందే!

క్యారెక్టర్ ఆర్టిస్టుగా, కమెడియన్‌గా టాలీవుడ్‌లో తనదైన ముద్ర వేశారు. కొన్ని వందల చిత్రాల్లో గుర్తుండిపోయే పాత్రలు పోషించారామె. బిగ్ బాస్ షోలో పాల్గొనడం ద్వారా ప్రస్తుతం యూత్‌లోనూ మంచి పాపులారిటీ సంపాదించారు. ఇన్నాళ్లు సినిమాలతో బిజీగా ఉన్న హేమ.. ఇప్పుడు చదువుకోవాలని నిర్ణయించుకున్నారు. అందుకే, దూరవిద్యలో డిగ్రీ పూర్తిచేసేందుకు ఆమె అర్హత పరీక్ష రాశారు. నల్లగొండలోని నాగార్జున ప్రభుత్వ కళాశాలలో ఇటీవల జరిగిన అర్హత పరీక్షకు ఆమె హాజరయ్యారు. ప్రస్తుతం ఆ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ విశ్వవిద్యాలయం ద్వారా హేమ తన డిగ్రీని పూర్తి చేయనున్నారు. పరీక్ష ఫలితాలు ఆన్‌లైన్‌లో పెడతామని యూనివర్సిటీ డిప్యూటీ డైరెక్టర్‌ డాక్టర్‌ బి.ధర్మానాయక్‌ తెలిపారు. అర్హత సాధించిన అభ్యర్థులు వెంటనే తమకు నచ్చిన అధ్యయన కేంద్రంలో ఆన్‌లైన్‌ ద్వారా అడ్మిషన్‌ పొందవచ్చని తెలిపారు. అంటే, హేమ త్వరలోనే డిగ్రీలో చేరతారన్నమాట. 53 ఏళ్ల వయసులోనూ చదువు కోసం ఆరాటపడుతోన్న హేమను అభినందించాల్సిందే. ప్రస్తుతం హేమ రామోజీ ఫిల్మ్‌సిటీలో ‘కొండాపురం’ సినిమా చిత్రీకరణలో ఉన్నారు. అందుకే పరీక్ష కేంద్రంగా నల్గొండ ఎంచుకొన్నట్లు ఆమె మీడియాతో మాట్లాడుతూ అన్నారు. గత రెండేళ్లుగా డిగ్రీ ప్రవేశం కోసం అర్హత పరీక్ష రాసేందుకు ప్రయత్నిస్తున్నా వీలు కాలేదన్నారు. డిగ్రీతోపాటు కంప్యూటర్‌ కోర్సులు నేర్చుకోనున్నట్లు ఆమె తెలిపారు. డిగ్రీ పూర్తిచేయడం తన కల అని చెప్పారు. తూర్పుగోదావరి జిల్లా రాజోలుకు చెందిన హేమ చిన్నతనంలోనే చదువును పక్కనబెట్టారు. ఆ తరవాత సినిమాల్లోకి వచ్చేశారు. అందుకే, ఇప్పుడు దూరవిద్య ద్వారా డిగ్రీ పూర్తిచేయాలని నిర్ణయించుకున్నారు. Also Read:


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/339IEIP
v

డ్రగ్స్ కేసులో ఇద్దరు హీరోయిన్లకు షాక్... అప్పటివరకు జైల్లోనే

శాండల్‌వుడ్ డ్రగ్స్ కేసులో హీరోయిన్లు , సంజనా గల్రానీలకు కోర్టు మరోసారి షాకిచ్చింది. ప్రస్తుతం రిమాండ్‌లో ఉన్న వీరిద్దరి బెయిల్ పిటిషన్‌ను మరోసారి తిరస్కరించింది. దీంతో కొద్దిరోజులుగా జైల్లో ఉంటూ బయటి ప్రపంచంలోకి అడుగు పెట్టాలని ఎదురుచూస్తున్న వారిపై ఆశలపై కోర్టు నీళ్లు చల్లింది. కర్ణాటకలో వెలుగులోకి వచ్చిన డ్రగ్స్ వ్యవహారం సినీ పరిశ్రమనే కాకుండా, బుల్లితెరను కూడా తాకింది. కన్నడ టీవీ యాంకర్ అనుశ్రీని మంగళూరు సీసీబీ పోలీసులు అరెస్ట్ చేసి విచారించారు. సీసీబీ పోలీసుల విచారణలో మరికొంత మంది సెలబ్రెటీల పేర్లు వెలుగులోకి వస్తుండటంతో కన్నడ సినీ పరిశ్రమలో కలకలం రేపుతోంది. మరోవైపు ఇతర ప్రాంతాల నుంచి డ్రగ్స్ సేకరించి వాటిని ఫైవ్‌స్టార్ హోటళ్లు, క్లబ్బులు, పబ్బుల్లో విక్రయించేదని ఆరోపణలున్నాయి. డ్రగ్స్‌ కేసులో రాగిణి ద్వివేదికి సెప్టెంబర్‌ 3న సమన్లు పంపిన సీసీబీ అధికారులు మరుసటి రోజే ఆమె ఇంట్లో సోదాలు జరిపారు. విచారణకు సహకరించడం లేదంటూ అదే రోజు ఆమెను అరెస్ట్ చేశారు. 8వ తేదీన సంజన ఇంట్లో కూడా సోదాలు జరిపి ఆమెను కూడా అదుపులోకి తీసుకున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3kT6Epv
v

Hemanth Avanti: రెడ్డోళ్లు లక్ష్మారెడ్డికి మద్దతుగా ర్యాలీ చేస్తే ఏం చేస్తారు? హేమంత్ కులోన్మాద హత్య‌పై మాధవీలత షాకింగ్ పోస్ట్

కులరక్కసి కాటుకి ఒక్కో ప్రేమ జంట బలైపోతూనే ఉన్నారు.. తన కులం కాని వాడిని ప్రేమించిందనే కారణంతో ఆ ప్రేమ జంటను విడదీయడం.. కుదరకపోతే అల్లుడని కూడా చూడకుండా క్రూరంగా చంపేయడం. అప్పట్లో ప్రణయ్.. ఇప్పుడు హేమంత్. హైదరాబాద్ చందానగర్‌కు చెందిన హేమంత్.. అవంతిలు పెద్దల్ని ఎదిరించి కులాంతర వివాహం చేసుకోవడం.. కూతురు లవ్ మ్యారేజ్ చేసుకోవడంతో అవమానంగా భావించిన అవంతి తల్లిదండ్రులు లక్ష్మారెడ్డి, అర్చన తీవ్ర మనోవేదన చెందారు. హేమంత్ మీద కక్ష పెంచుకున్నారు. గచ్చిబౌలిలో నివాసం ఉంటున్న యువ జంటను కిడ్నాప్ చేసి దుండగులు సంగారెడ్డిలో భర్త హేమంత్‌ను దారుణంగా హతమార్చారు. జిల్లాలోని కొండాపూర్ మండలం కిష్టాయగూడెం శివాయలోని చెట్ల పొదల్లో హేమంత్ మృతదేహాన్ని పడేశారు. ఈ కులోన్మాద హత్య సంచలనంగా మారగా.. దీన్ని ఖండిస్తూ ఫేస్ బుక్‌లో షాకింగ్ పోస్ట్ పెట్టింది హీరోయిన్, బీజేపీ లీడర్ . ‘మరో పరువు హత్య.. అమ్మాయి తన కులం వాడినే ప్రేమించి పెళ్లి చేసుకుంటే చంపిన వారు ఉంటే.. చూపించండి నాకు.. కులం పరువు, హోదా, డబ్బు, దర్పం మనుషులుగా మరణించిన మృగాలు. ఈ భూమి మీద ఇప్పటి రాజ్యాంగం ప్రకారం మేజర్ అయ్యాక ఎవరి హక్కులు వారివే.. ఔను కొడుకు ప్రేమ పెళ్లి చేసుకుంటే పరువుకి ఏం కాదు.. కాని కూతురు మాత్రం పరువు ఎందుకు అవుద్ది? ఆడపిల్ల ఎమన్నా ఆస్థినా? ఏం మనుషులు ఛీ.. అమ్మ నాన్న ప్రేమ గొప్పదే .. అది ఎవరు తక్కువ చేసేది కాదు.. కానీ తనకి నచ్చిన వాడిని చేసుకుంటే చంపే హక్కు లేదు. ఇంకెందుకు ఈ చట్టాలు.. ఈ న్యాయం.. కోర్ట్ పద్ధతులు, సిద్ధాంతాలు. ఎవడికి నచ్చినట్లు వాడు రాసుకుంటే తగలబెట్టండి రాజ్యాంగాన్ని?? ప్రేమ పెళ్లి తప్పు కాదు.. పెద్దలు చుసినా అన్ని సంబంధాలు ఏం చక్కగా లేవు. అన్నీ ఫెయిల్యూర్స్. ఇండియాలో 80% అన్నిపెళ్లిళ్లు ఎపుడో పోయాయి. మన అమ్మ నాన్నల బంధం కూడా బిడ్డలా కోసమే. 70% అమ్మల బాధ బిడ్డల కోసమే.. భర్త కోసం కాదు.. అంతా సర్వమంగళ మేళం సంబంధాలే. ఇష్టం లేని పెళ్లి చేసుకుంటే అమ్మ నాన్న మనసుకి గాయం అవుద్ది.. గాయం చేయకూడదు ఒకవేళ చేస్తే చంపడం మనుష్య నీతి నా? జంతువులు కూడా ఇలా చంపవు. కులం, డబ్బు, స్టేటస్ అంటూ దళితుడిని‌ చేసుకుందనే కోపంతో అమృత భర్త ప్రణయ్‌ను చంపించాడు ఆర్యవైశ్యుడు మారుతీరావు. ఇప్పుడు ఆర్య వైశ్యుడిని పెళ్లి చేసుకుందనే కోపంతో అవంతి భర్త హేమంత్‌ను చంపించాడు రెడ్డి కులస్థుడు లక్ష్మారెడ్డి. మారుతీరావుకు మద్దతుగా ర్యాలీలు తీసినోళ్లు, సోషల్ మీడియాలో అమృతను దూషిస్తూ రెచ్చిపోయిన సైకోలు, కల్నల్ సంతోష్ బాబు మావోడే అని క్యాండిల్ ర్యాలీలు తీశారు కోమటోళ్లు. ఇప్పుడు రెడ్డోళ్లు అంతా లక్ష్మారెడ్డికి మద్దతుగా ర్యాలీలు తీస్తే ఎం చేస్తారు’ అంటూ కులరక్కసిపై ప్రశ్నల వర్షం కురిపించింది మాధవీలత. ఇప్పటికీ ఈ కులపిచ్చి ఏంటో అర్థం కాలేదని.. ఇండియాలో పుట్టడం వల్ల తనకు ఒక కులం ఉంది కాని.. కులపిచ్చి లేదన్నారు మాధవీలత. తన పేరెంట్స్ ఎప్పుడూ ఈ కులపిచ్చిని నేర్పించలేదన్నారు. అన్ని కులాలతో కలిసే ఉంటున్నానన్నారు మాధవీలత.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3kVwvxi
v

‘మోస‌గాళ్ళు’ టైటిల్ థీమ్ మ్యూజిక్‌.. శ్యామ్ సిఎస్‌‌పై ప్రశంసల జల్లు

విష్ణు హీరోగా న‌టిస్తోన్న ‘మోస‌గాళ్ళు’ టైటిల్ మోషన్ పోస్టర్‌ను ఇటీవల విడుదల చేశారు. ‘ద రైజ్ ఆఫ్ మోసగాళ్ళు’ పేరిట విడుదలైన ఈ మోషన్ పోస్టర్‌కు ప్రేక్షకులను నుంచి మంచి స్పందన వచ్చింది. ముఖ్యంగా మోషన్ పోస్టర్‌కు ఇచ్చిన థీమ్ మ్యూజిక్ చాలా బాగుందని కామెంట్స్ వచ్చాయి. ఆస‌క్తిక‌రంగా ఉన్న ఆ థీమ్ మ్యూజిక్ బాగా పాపుల‌ర్ అయ్యింది. ద‌క్షిణ భార‌త సినీ రంగంలోని ప్రముఖ సంగీత ద‌ర్శకుల్లో ఒక‌రిగా పేరుపొందిన శ్యామ్ సిఎస్ ఈ చిత్రానికి సంగీతం స‌మ‌కూరుస్తున్నారు. థీమ్ మ్యూజిక్‌తో అంద‌రి మ‌న‌సుల్నీ గెలుచుకున్న ఆయ‌న‌, ఆ ఎక్స్‌పెక్టేష‌న్స్‌కు మ్యాచ్ అయ్యేలా ఈ సినిమాకు సంబంధించిన త‌దుప‌రి ప్రమోష‌న‌ల్ కంటెంట్‌కు వ‌ర్క్ చేస్తున్నారు. అలాగే సినిమాకు బెస్ట్ మ్యూజిక్ ఇవ్వడానికి కృషి చేస్తున్నారు. హీరోగా న‌టిస్తూ విష్ణు మంచు నిర్మిస్తోన్న ‘మోస‌గాళ్ళు’ సినిమాకు జెఫ్రీ గీ చిన్ ద‌ర్శక‌త్వం వ‌హిస్తున్నారు. విష్ణు సోద‌రిగా ఆయ‌న పాత్రతో స‌మాన ప్రాధాన్యం ఉన్న పాత్రను కాజ‌ల్ అగ‌ర్వాల్ చేస్తున్నారు. భార‌త్‌లో మొద‌లై, అమెరికాను వ‌ణికించిన చ‌రిత్రలోనే అతి పెద్ద ఐటీ కుంభ‌కోణం నేప‌థ్యంలో వాస్తవ ఘ‌ట‌న‌ల ఆధారంగా ‘మోస‌గాళ్ళు’ చిత్రం రూపొందుతోంది. బాలీవుడ్ సీనియ‌ర్ స్టార్ యాక్టర్ సునీల్ శెట్టి ఈ చిత్రంతో టాలీవుడ్‌కు ప‌రిచ‌య‌మ‌వుతున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/36fltyK
v

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...