Monday 31 January 2022

కృష్ణ మైల్‌స్టోన్ మూవీపై కన్నేసిన మహేష్ బాబు! ఫ్యాన్స్‌కి ఇది బిగ్గెస్ట్ న్యూస్

క్రమంగా టాలీవుడ్ క్రేజ్ దేశ వ్యాప్తంగా విస్తరిస్తోంది. బాహుబలి సిరీస్ ఇచ్చిన బూస్టింగ్‌తో స్టార్ డైరెక్టర్లు, హీరోలు పాన్ ఇండియా సినిమాలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఈ క్రమంలోనే ప్రస్తుతం బిగ్గెస్ట్ తెలుగు సినిమాల నిర్మాణం జరుగుతోంది. అయితే తాజాగా టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుకి సంబంధించి ఓ ఆసక్తికర అప్‌డేట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుండటం ఆయన అభిమానులను హుషారెత్తిస్తోంది. దాదాపు 5 దశాబ్దాల క్రిందట సూపర్ స్టార్ కృష్ణ హీరోగా రూపొందిన 'అల్లూరి సీతారామరాజు' సినిమాను రీమేక్ చేయబోతున్నారనే టాక్ బయటకొచ్చింది. తన తండ్రి కృష్ణ కెరీర్‌లో మైల్ స్టోన్‌గా నిలిచిన ఈ సినిమాతో తాను కూడా సరికొత్తగా అలరించాలని, నేటితరం ప్రేక్షకులకు 'అల్లూరి సీతారామరాజు'ను దగ్గర చేయాలని మహేష్ ఫిక్సయ్యారట. ఈ మేరకు టైటిల్ పాత్రలో నటించేందుకు మహేష్ ఆసక్తి చూపిస్తున్నారని సమాచారం. ఇప్పటికే ఈ విషయమై ఓ బిగ్గెస్ట్ డైరెక్టర్‌తో చర్చించారనేది ఇన్‌సైడ్ టాక్. ఇదిలాఉంటే తన తండ్రి కృష్ణ నటించిన అద్భుతమైన చిత్రాలను అస్సలు ముట్టుకోకూడదని మహేష్ అభిప్రాయపడిన సందర్భాలు కూడా ఉన్నాయి. కాబట్టి 'అల్లూరి సీతారామరాజు' రీమేక్‌కు సంబంధించి ప్రస్తుతం వైరల్ అవుతున్న వార్తలపై ఎలా రియాక్ట్ అవుతారు? ఒకవేళ 'అల్లూరి సీతారామరాజు' రీమేక్‌‌లో మహేష్ నటించడమే నిజమైతే ఇంతకన్నా బిగ్గెస్ట్ ట్రీట్ ఇంకేముంటుంది అని జనం చర్చించుకుంటున్నారు. ఇకపోతే ప్రస్తుతం పరశురామ్ దర్శకత్వంలో 'సర్కారు వారి పాట' సినిమా చేస్తున్నారు మహేష్ బాబు. కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. మే 12వ తేదీన ఈ సినిమా రిలీజ్ కానుంది. దీని తరవాత త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ సినిమా, అలాగే రాజమౌళి దర్శకత్వంలో మరో సినిమా లైన్‌లో పెట్టారు మహేష్ బాబు. సో.. చూడాలి మరి ఈ 'అల్లూరి సీతారామరాజు' రీమేక్‌‌ పట్టాలెక్కుతుందా? లేదా అనేది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/OngJIS5VM
v

లావణ్య త్రిపాఠిని చౌకబారు నటి అంటూ కామెంట్... స్ట్రాంగ్ రిప్లయ్ ఇచ్చిన హీరోయిన్ !

సోష‌ల్ మీడియా ప్రభావం పెరిగిన త‌ర్వాత సినీ సెల‌బ్రిటీలు త‌మ భావాల‌ను ఫ్యాన్స్‌, ఫాలోవ‌ర్స్‌తో నేరుగా చెప్పుకునే అవ‌కాశం క‌లిగింద‌న‌డంలో ఎలాంటి సందేహం లేదు. అయితే ఒక్కోసారి ఈ సోష‌ల్ మీడియా కార‌ణంగానే సెల‌బ్రిటీలు ఇబ్బందులు ప‌డుతున్నారు. వివాదాల ఉచ్చులో చిక్కుకుంటున్నారు. నెటిజ‌న్స్ సెల‌బ్రిటీల‌ను నేరుగా విమ‌ర్శ‌లు చేస్తున్నారు. దానికి ప్ర‌తిగా సెల‌బ్రిటీలు సైతం అంతే గ‌ట్టిగా కౌంట‌ర్ ఇచ్చేస్తున్నారు. ఇప్పుడు హీరోయిన్ లావ‌ణ్య త్రిపాఠి విష‌యంలోనూ ఓ నెటిజ‌న్ అలాగే నోరు జారాడు. అయితే లావ‌ణ్య త్రిపాఠి సైతం అంతే గ‌ట్టిగా రిటార్ట్ ఇవ్వ‌డం కొస మెరుపు. అస‌లేం జ‌రిగింది అనే వివ‌రాల్లోకి వెళితే, త‌మిళ‌నాడులో క్రైస్త‌వ మ‌తం స్వీక‌రించ‌నందుకు కొంద‌రు లావ‌ణ్య అనే మైన‌ర్ బాలిక‌ను వేధింపుల‌కు గురి చేశారు. స‌ద‌రు బాలిక ఆత్మ‌హ‌త్య చేసుకుంది. మ‌త మార్పిళ్ల‌కు వ్య‌తిరేకంగా సోష‌ల్ మీడియాలో కొంద‌రు పోస్టులు చేస్తున్నారు. వారిలో కొంద‌రు చనిపోయిన మైన‌ర్ బాలిక‌కు న్యాయం జ‌ర‌గాలంటూ వాదిస్తున్నారు. ఈ క్ర‌మంలో సోష‌ల్ మీడియాలో లావ‌ణ్య పేరుతో హ్యాష్ ట్యాగుల‌ను క్రియేట్ చేసి పోస్టులు చేశారు. అందులో కొంద‌రు తెలిసో తెలియ‌క‌నో లావ‌ణ్య త్రిపాఠి హ్యాష్ ట్యాగును కూడా షేర్ చేశారు. హీరోయిన్ లావ‌ణ్య త్రిపాఠి హ్యాష్ ట్యాగును షేర్ చేయడం వెనుక ఓ నెటిజ‌న్ రియాక్ట్ అవుతూ చ‌నిపోయిన మైన‌ర్ బాలిక ధ‌ర్మం కోసం చ‌నిపోతే, ఆమెను చౌక బారు న‌టితో ఎందుకు పోలుస్తున్నారు అంటూ కామెంట్స్ చేశాడు. ఈ ట్వీట్‌పై హీరోయిన్ లావ‌ణ్య త్రిపాఠి గ‌ట్టిగానే రియాక్ట్ అయ్యింది. ‘‘ఏదైనా చెడు ఘటన జరిగినప్పుడు మాత్రమే నీలాంటి వాళ్లు మహిళలను గౌరవిస్తారు. అంతకు ముందు నీలాంటి వాళ్లే మహిళలను చౌక బారు అంటారు. అంద‌రినీ గౌర‌వించ‌డం నేర్చుకో. ఇది చాలా బాధాక‌ర‌మైన ఘ‌ట‌న‌. కానీ స‌మాజంలో వాస్త‌వ ప‌రిస్థితి ఇదే’’ అంటూ లావ‌ణ్య త్రిపాఠి స‌ద‌రు నెటిజ‌న్‌కు స్ట్రాంగ్‌గా రిప్ల‌య్ ఇచ్చారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/YCqTBSLnG
v

మాల్దీవుల్లో మాళవికా మోహనన్ అందాల ఆరబోత.. వైరల్ అవుతున్న ఫొటోలు

మ‌ల‌యాళ బ్యూటీ మాళ‌వికా మోహ‌న‌న్ క‌న్న‌డ‌, మ‌ల‌యాళ, త‌మిళ‌, హిందీ చిత్రాల్లో న‌టిస్తూ బిజీగా ఉంటుంది. ఎందుక‌నో ఆమె తెలుగులో మాత్రం క‌నిపించ‌డం లేదు. మ‌రి తెలుగులో అవ‌కాశాలు రావ‌డం లేదో, లేక వ‌చ్చినా చేయ‌డం లేదో తెలియ‌డం లేదు. సినిమాల్లోనే కాదు.. సోష‌ల్ మీడియాలోనూ ఈ అమ్మ‌డు తెగ యాక్టివ్‌గా ఉంటుంది. ముఖ్యంగా గ్లామ‌ర్ షో చేయ‌డంలో ఈమె త‌ర్వాతే ఎవరైనా అనేంత‌గా హాటు అందాల‌తో ఈమె సోష‌ల్ మీడియాలో కుర్ర కారుని రెచ్చగొడుతుంది. ఇప్పుడు మాళ‌వికా మోహ‌నన్ మాల్దీవుల్లో విహార యాత్ర చేస్తూ బిజీగా ఉంది. దానికి సంబంధించిన ఫొటోలు, వీడియోల‌ను ఆమె త‌న సోష‌ల్ మీడియాలో షేర్ చేసింది. అయితే రీసెంట్‌గా ఆమె స్విమ్ సూట్ వేసుకుని నాభి అందాల‌ను ప్ర‌ద‌ర్శిస్తూ షేర్ చేసిన కొన్ని ఫొటోలు మాత్రం నెట్టింట తెగ వైర‌ల్ అవుతున్నాయి. 2013లో ప‌ట్టం పోలే అనే మ‌ల‌యాళ చిత్రంతో సినీ రంగ ప్ర‌వేశం చేసింది మాళ‌వికా మోహ‌న‌న్‌. త‌ర్వాత రెండేళ్లు గ్యాప్ తీస‌కుని నిర్ణ‌యాకం అనే మ‌రో మ‌లయాళ సినిమాలో యాక్ట్ చేసింది. త‌దుప‌రి నాను మ‌ట్టు వ‌ర‌ల‌క్ష్మి అనే క‌న్న‌డ సినిమాలో సంద‌డి చేసింది. త‌మిళంలో ర‌జ‌నీకాంత్ హీరోగా చేసిన‌ పేట‌, ద‌ళ‌ప‌తి విజ‌య్ హీరోగా చేసిన మాస్ట‌ర్ చిత్రాల్లో న‌టించింది. ధ‌నుష్‌తో చేసిన మార‌న్ మూవీ విడుద‌ల కావాల్సి ఉంది. ఇక‌ బాలీవుడ్‌లో బియాండ్ ది క్లౌడ్స్‌, యుద్ర సినిమాల్లో న‌టించింది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/AhTWaowek
v

మలయాళ రీమేక్‌లో వెంక‌టేష్ - రానా.. సురేష్ బాబు ప్ర‌య‌త్నాలు ఫ‌లించేనా?

విజ‌య‌వంత‌మైన చిత్రాల‌ను మ‌న తెలుగు హీరోలు నెటివిటీని మార్చి తెలుగు ప్రేక్ష‌కుల‌కు అందించ‌డం జ‌రుగుతూనే ఉంది. ఇప్పుడు ఈ కోవ‌లో ఓ మ‌ల‌యాళ చిత్రం తెలుగులో రీమేక్ కానుందంటూ వార్త‌లు వినిపిస్తున్నాయి. ఇంత‌కీ ఆ సినిమా ఏదో కాదు.. . మోహ‌న్ లాల్‌, పృథ్వీరాజ్ హీరోలుగా న‌టించిన ఈ చిత్రాన్ని పృథ్వీరాజ్ డైరెక్ట్ చేశారు. ఇంత‌కు ముందు వీరిద్ద‌రు క‌లిసి చేసిన లూసిఫ‌ర్ మ‌ల‌యాళంలో విజ‌య‌వంత‌మైన ఈ చిత్రాన్ని ఇప్పుడు తెలుగులో చిరంజీవి గాడ్ ఫాద‌ర్ పేరుతో రీమేక్ చేస్తున్నారు. ఇప్పుడు మ‌ళ్లీ వీళ్లిద్ద‌రూ క‌లిసి చేసిన బ్రో డాడీని కూడా తెలుగులో రీమేక్ చేయ‌డానికి ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయ‌ట‌. సీనియ‌ర్ నిర్మాత డి.సురేష్ బాబు ఈ సినిమా రీమేక్ హ‌క్కుల కోసం గ‌ట్టిగానే ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. అంతా ఓకే సీనియ‌ర్ హీరో వెంక‌టేష్‌, రానా ద‌గ్గుబాటిల‌తో సినిమాను తెలుగులో రీమేక్ చేయాల‌నేది ఆలోచ‌న‌గా క‌నిపిస్తోంది. బ్రో డాడీ రీసెంట్‌గా డిస్నీ హాట్ స్టార్‌లో డైరెక్ట్‌గా రిలీజ్ అయ్యింది. మీనా, క‌ళ్యాణి ప్రియ‌ద‌ర్శ‌న్ హీరోయిన్స్‌గా న‌టించారు. తండ్రి పాత్ర‌లో మోహ‌న్ లాల్‌, కొడుకు పాత్ర‌లో పృథ్వీరాజ్ న‌టించారు. ఇప్పుడు వెంక‌టేష్, రానా ద‌గ్గుబాటి క‌లిసి రానా నాయుడు అనే వెబ్ సిరీస్‌లో న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే. అయితే వీరిద్ద‌రూ క‌లిసి పూర్తి స్థాయి సినిమాలో ఇప్ప‌టి వ‌ర‌కు క‌లిసి న‌టించ‌లేదు. అంతా అనుకున్న‌ట్లు జ‌రిగితే బ్రో డాడీ తెలుగు రీమేక్‌లో వీరిద్ద‌రూ క‌లిసి న‌టించే అవ‌కాశం ఉంద‌నే వార్త‌లు సోష‌ల్ మీడియాలో వినిపిస్తున్నాయి. ఈ మ‌ధ్య కాలంలో సురేష్ బాబు ఎక్కువ‌గా రీమేక్ చిత్రాల‌పైనే ఫోక‌స్‌గా ఉన్నారు. ఓ బేబి సినిమాను రీమేక్ చేసిన ఆయ‌న రీసెంట్‌గా మానాడు సినిమా రీమేక్ హ‌క్కుల‌ను సొంతం చేసుకున్నారు. ఇప్పుడు బ్రో డాడీ కోసం ప్ర‌య‌త్నాలు ప్రారంభించారు. ఇక సినిమాల విష‌యానికి వ‌స్తే గ‌త ఏడాది నార‌ప్ప‌, దృశ్యం 2 సినిమాల్లో వెంక‌టేష్ న‌టించ‌గా.. రానా హీరోగా చేసిన 1945 ఎప్పుడు వ‌చ్చిందో పోయిందో తెలియ‌ద‌న్న‌ట్లు అలా వ‌చ్చి వెళ్లిపోయింది. ఇప్పుడు వెంక‌టేష్ ఎఫ్ 3 సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు రానుంటే, రానా ఏమో విరాట ప‌ర్వంను సిద్ధం చేసే ప‌నిలో ఉన్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/yiZ8zbSPt
v

విష్ణు మంచు యాక్షన్ ఎంటర్ టైనర్ ..!

టాలీవుడ్ హీరో మోస‌గాళ్లు సినిమాతో గ‌త ఏడాది ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చారు. కానీ ఆ సినిమా ఆశించిన స్థాయిలో విజ‌యాన్ని అందుకోలేదు. త‌ర్వాత మంచు విష్ణు.. శ్రీనువైట్ల కాంబినేష‌న్‌లో ఢీ అంటే ఢీ అనే సినిమాను అనౌన్స్ చేసిన సంగ‌తి తెలిసిందే. ఇంత‌కు ముందుకు వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో వ‌చ్చిన ఢీ చిత్రం సూప‌ర్ సెన్సేష‌న‌ల్ అయ్యింది. కామెడీ ఎంట‌ర్‌టైన‌ర్ చిత్రాల‌కు ఓ ఫార్ములాను శ్రీనువైట్ల ఈ సినిమాతోనే స్టార్ట్ చేస్తే చాలా మంది ద‌ర్శ‌కులు దాన్ని ఫాలో అయ్యారు. చాలా ఏళ్ల త‌ర్వాత వీరిద్ద‌రూ క‌లిసి సినిమా చేస్తున్నారు. ఢీ అంటే ఢీ సినిమాను అనౌన్స్ చేసి చాలా రోజులే అవుతున్నా సినిమా సెట్స్ పైకి మాత్రం వెళ్ల‌డం లేదు. శ్రీనువైట్ల ఎలాగైనా హిట్ కొట్టాల‌నే ఉద్దేశంతో స్క్రిప్ట్ విష‌యంలో అస‌లు కాంప్రమైజ్ కావ‌డం లేదు. ఈ సినిమా స్టార్ట్ కావ‌డానికి ఇంకాస్త స‌మ‌యం ఉండ‌టంతో విష్ణు ఈ గ్యాప్‌లో మ‌రో సినిమా చేయ‌డానికి రెడీ అయిపోయార‌ట‌. రాజేంద్ర అనే కొత్త దర్శ‌కుడు తెర‌కెక్కించ‌బోతున్న ఈ సినిమా యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్ అని స‌మాచారం. ఇందులో విష్ణు మంచు .. రా ఆఫీస‌ర్‌గా క‌నిపిస్తార‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. ఇప్ప‌టికే చాలా మంది హీరోలు రా, ఎన్ఐఏ ఆఫీస‌ర్స్‌గా క‌నిపించి మెప్పించారు. ఇప్పుడు విష్ణు కూడా వారి బాట‌లోకే అడుగు పెట్టారు. త్వ‌ర‌లోనే విష్ణు కొత్త సినిమాకు సంబంధించిన ప్ర‌క‌ట‌న రావ‌చ్చుని టాక్ వినిపిస్తోంది. మ‌రి యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్ మూవీ.. అందులోనూ కొత్త ద‌ర్శ‌కుడితో సినిమా అంటే ఎంత మేర‌కు వ‌ర్క‌వుట్ అవుతుందో తెలియ‌దు కానీ.. విష్ణు మంచు సినిమా చేయ‌డానికి రెడీ అవుతున్నార‌ట‌. ప్ర‌స్తుతం విష్ణు మంచు సినిమాల‌తో పాటు త‌న ఎడ్యుకేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూట్స్ బాధ్య‌త‌లు నిర్వ‌హిస్తున్నారు. అలాగే ఇప్పుడు మూవీ ఆర్టిస్ట్ అసోసియేష‌న్ అధ్య‌క్షుడిగానూ బాధ్య‌త‌లు నిర్వ‌హిస్తున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/BcdJDYym6
v

హిందీలో అల్లు అర్జున్ ‘పుష్ప‌’ రికార్డ్‌.. త‌గ్గేదే లే అంటున్న ఐకాన్ స్టార్‌!

ఐకాన్ స్టార్ ఇప్పుడు పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగారు. సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ‘పుష్ప ది రైజ్’ చిత్రం దక్షిణాదితో పాటు బాలీవుడ్‌లో సాధించిన స‌క్సెస్‌తో అల్లు అర్జున్ హీరోగా నెక్ట్స్ రేంజ్‌కు చేరుకున్నారు. ఇక పుష్పరాజ్ విష‌యానికి వ‌స్తే ఈ సినిమా ఇప్ప‌టి వ‌ర‌కు రూ. 300 కోట్ల‌కు పైగానే వ‌సూళ్ల‌ను సాధించింది. ముఖ్యంగా దక్షిణాది కంటే బాలీవుడ్‌లో పుష్ప సినిమా .. క‌లెక్ష‌న్స్ రాబ‌ట్ట‌డంలో స‌క్సెస్ కావ‌డం గొప్ప విష‌యం. ఎందుకంటే విడుద‌లైన రోజు అంటే డిసెంబ‌ర్ 17న బాలీవుడ్‌లో సినిమా మూడు కోట్ల రూపాయ‌ల పైచిలుకు వ‌సూళ్ల‌ను ద‌క్కించుకుంది. ఇది చాలా త‌క్కువ‌. ఇంకేముంది సినిమా పోయిన‌ట్లేన‌ని అంద‌రూ అనుకున్నారు. అయితే పుష్ప ది రైజ్ రోజు రోజుకీ వ‌సూళ్ల‌ను పెంచుకుంటూ వ‌చ్చింది. ఇప్పుడు రూ. 100 కోట్ల మార్క్‌ను చేరుకోవ‌డం అనేది బాలీవుడ్ ట్రేడ్ వ‌ర్గాల‌కు షాక్‌. ఇక ద‌క్షిణాది నుంచి హిందీలోకి డ‌బ్బింగ్ అయ్యి వంద కోట్ల రూపాయ‌ల మార్కును చేరుకున్న చిత్రాల్లో పుష్ప ది రైజ్ ఐదో స్థానాన్ని ద‌క్కించుకుంది. బాలీవుడ్‌లో వంద కోట్ల రూపాయ‌ల సాధించి ద‌క్షిణాది సినిమాల లిస్టు చూస్తే... 1. బాహుబ‌లి ది క‌న్ క్లూజ‌న్ - రూ. 510.99 కోట్లు2. 2.0 - రూ.189.55 కోట్లు3. సాహో - 142.95 కోట్లు4. బాహుబ‌లి ది బిగినింగ్ - 118.70 కోట్లు5. పుష్ప ది రైజ్ - 100.38 కోట్లు వ‌చ్చాయి. పుష్ప ది రైజ్‌కి కొన‌సాగింపుగా రూపొంద‌నున్న పుష్ప ది రూల్ చిత్రం ఫిబ్ర‌వ‌రి లేదా మార్చి నుంచి రెగ్యుల‌ర్‌గా చిత్రీక‌ర‌ణ‌ను జ‌రుపుకోనుంది. ర‌ష్మిక మంద‌న్న హీరోయిన్‌గా న‌టిస్తున్న ఈ చిత్రంలో మ‌ల‌యాళ స్టార్ హీరో ఫ‌హాద్ ఫాజిల్ విల‌న్‌గా న‌టిస్తున్నారు. మైత్రీ మూవీ మేక‌ర్స్‌, ముత్తం శెట్టి మీడియా సంస్థ‌లు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శేషాచ‌ల అడ‌వుల్లో జ‌రిగే ఎర్ర చంద‌నం స్మ‌గ్లింగ్ నేప‌థ్యంలో పుష్ప సినిమా వ‌చ్చింది. సునీల్‌, అన‌సూయ, ధ‌నంజ‌య్ త‌దిత‌రులు ఇత‌ర కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/g7VdxBhNG
v

అనసూయ డబుల్ యాక్షన్.. మొదట అలా తర్వాత ఇలా!!

బుల్లితెరపై జబర్దస్త్ బ్యూటీగా ఫేమస్ అయిన యాంకర్ అనసూయ.. క్రమంగా వెండితెరపై బిజీ అవుతోంది. రంగస్థలం సినిమాలో రంగమ్మత క్యారెక్టర్‌తో తెలుగు ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయిన ఆమె, ప్రస్తుతం వరుస ఆఫర్స్‌తో దూసుకుపోతోంది. లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో కూడా నటించి తన మార్క్ చూపించిన ఈ సారి తన ఫ్యాన్స్‌కి రెండు డిఫరెంట్ షేడ్స్‌తో సూపర్ ట్రీట్ ఇవ్వబోతోందని తెలుస్తోంది. వెండితెరపై విలక్షణ పాత్రలతో అలరిస్తున్న అనసూయ.. రీసెంట్‌గా 'పుష్ప' సినిమాలో పవర్‌ఫుల్ రోల్ చేసి మరోసారి అట్రాక్ట్ చేసింది. ఇందులో సునీల్ భార్య ద్రాక్షాయని పాత్రలో నటించి మెప్పించింది. ఈ క్రమంలోనే రవితేజ హీరోగా తెరకెక్కుతున్న ‘’ సినిమాలో కూడా యాంకర్ అనసూయ సర్‌ప్రైజింగ్ రోల్ చేస్తోందని ఫిలిం నగర్ టాక్. ఈ చిత్రంలో డబుల్ యాక్షన్ చేస్తోందట ఈ యంగ్ యాంకర్. అందులో ఓ పాత్ర బ్రాహ్మణ మహిళ పాత్ర అని తెలుస్తుండగా.. రెండో పాత్ర కాస్త పవర్‌ఫుల్ పాత్ర అని తెలుస్తోంది. ఇది సినిమాలో ఫుల్ లెంగ్త్ రోల్ అని అంటున్నారు. డైరెక్టర్ రాసుకున్న కథ ప్రకారం ఒక పాత్ర చనిపోతుందట. ఆ తర్వాత రెండో పాత్ర ఎంటరై సినిమా మొత్తం కనిపిస్తుందని సమాచారం. ఈ న్యూస్ బయటకు రావడంతో ఒకే తెరపై అనసూయ డ్యూయల్ రోల్‌లో చూడాలనే కుతూహలం జనాల్లో పెరిగింది. ఇక ఖిలాడి సినిమా విషయానికొస్తే.. జయంతిలాల్‌ గడ సమర్పణలో హ‌వీష్ ప్రొడ‌క్ష‌న్‌, పెన్ స్టూడియోస్ బ్యానర్‌పై రూపుదిద్దుకుంటున్న ఈ మూవీకి 'ప్లే స్మార్ట్' అనేది ట్యాగ్‌ లైన్‌. డింపుల్ హయాతి, మీనాక్షి చైదరీ హీరోయిన్లుగా నటిస్తున్నారు. సీనియర్ హీరో అర్జున్ కీలక పాత్రలో నటించారు. రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. జీవితంలో డబ్బుకే ప్రాధాన్యం ఇవ్వాలా? భావోద్వేగాలకు ప్రాధాన్యం ఇవ్వాలా? లేక రెండూ ముఖ్యమా? అనే అంశాన్ని ఈ సినిమాలో టచ్ చేయబోతున్నారట.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/VD0xrLiuN
v

Sunday 30 January 2022

ప‌వ‌న్‌గారూ! ద‌య‌చేసి అది నిరూపించండి.. క‌న్నీటితో రామ్ గోపాల్ వ‌ర్మ రిక్వెస్ట్‌!

వివాద‌స్ప‌ద ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ సోష‌ల్ మీడియాలో ప్రశ్నించ‌డానికి ఎప్పుడూ ముందుంటారు. సోష‌ల్ మీడియాను ఆయ‌న వాడుకున్నంత గొప్ప‌గా మరొక‌రు వాడుకోవ‌డం లేదంటే అందులో అతిశ‌యోక్తి లేదు. మొన్న‌టి వ‌ర‌కు ఏపీలో సినిమా టికెట్ రేట్స్ గురించి ట్విట్టర్‌లో ప్ర‌శ్న‌ల‌డ‌గ‌డం, యూట్యూబ్‌లో వీడియో విడుద‌ల చేయడం, టీవీల్లో ఇంట‌ర్వ్యూలు ఇవ్వ‌డం వంటి చేసిన వ‌ర్మ కొన్ని రోజులు సైలెంట్‌గా ఉన్నారు. ఇప్ప‌డు మ‌ళ్లీ ట్విట్ట‌ర్ వేదిక‌గా త‌న‌దైన పంథాలో ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు రిక్వెస్ట్‌లు పెట్టారు. సాధార‌ణంగా ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ను, ఆయ‌న ఫ్యాన్స్‌ని, మెగా ఫ్యాన్స్‌ని గిల్లిన‌ట్లు వ‌ర్మ ట్వీట్స్ చేస్తుంటారు. అదేంటి? అని ఎవ‌రైనా ప్ర‌శ్నిస్తే నేను మెగా ఫ్యామిలీకి, ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కి పెద్ద అభిమాని అంటూ బ‌దులిస్తారు. ఇప్పుడు కూడా మ‌రోసారి ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఫ్యాన్‌లా ఆయ‌న్ని ప్ర‌శ్నిస్తున్నారో లేక రిక్వెస్టులు చేస్తున్నారో తెలియ‌న‌ట్లు కొన్ని ట్వీట్స్ చేశారు. ‘‘పవన్ కళ్యాణ్‌గారు.. ఆ రోజు సర్దార్ గబ్బర్ సింగ్‌ని హిందీలో రిలీజ్ చెయ్యొద్దు వర్కవుట్ అవ్వదు, అని ఈ ట్రిట్టర్ సాక్షిగా ఎంత మొత్తుకున్నా మీరు వినలేదు.. ఫలితం చూసారు...ఇప్పుడు మళ్లీ చెప్తున్నా .. ఏ మాత్రం తగ్గకుండా పాన్ ఇండియా రిలీజ్ చెయ్యండి..పవర్ ప్రూవ్ చెయ్యండి. పుష్ప యే అంత చేస్తే పవర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ అయిన మీరు నటించిన భీమ్లా నాయక్ ఇంకా ఎంత కలెక్ట్ చెయ్యాలి? ..పాన్ ఇండియా సినిమా లాగా రిలీజ్ చెయ్యకపోతే మీ ఫ్యాన్స్ అయిన మేమంతా బన్నీ ఫ్యాన్స్ కి ఆన్సర్ చెయ్యలేం. అల్లు అర్జున్ గురించి నా ట్వీట్స్ అన్నీ నా వోడ్కా టైం లో పెట్టాను కానీ నేను ఇప్పుడు పెట్టిన ఈ ట్వీట్స్ నా కాఫీ టైం లో పెడుతున్నా. దీన్ని బట్టి నా సీరియస్ నెస్ ని అర్థం చేసుకోండి. ఎప్పుడో మీ తర్వాత వచ్చిన పిల్లలు తార‌క్‌, రామ్ చ‌ర‌ణ్ కూడా పాన్ ఇండియా స్టార్స్ అయిపోతూ ఉంటే, మీరు ఇంకా ఒట్టి తెలుగు ని పట్టుకుని వేలాడటం మీ ఫ్యాన్స్ అయిన మాకు కన్నీటి ప్రాయంగా ఉంది. దయచేసి భీమ్లా నాయక్ ని పాన్ ఇండియా తీసుకెళ్ళి మీరే సబ్‌కా బాప్ అని ప్రూవ్ చెయ్యండి. ఇంటీరియర్ ఆంధ్ర లో జరిగిన పుష్ప సబ్జెక్ట్ పాన్ ఇండియా సబ్జెక్ట్ అయినప్పుడు, కొమరం భీమ్, అల్లూరి లాంటి తెలుగు వీరుల సబ్జెక్ట్ పాన్ ఇండియా అయినప్పుడు, భీమ్లా నాయక్ సబ్జెక్ట్ పాన్ వరల్డ్ సబ్జెక్ట్ కాదంటారా ? ప‌వ‌న్ క‌ళ్యాణ్‌గారూ? ’’ అని ట్వీట్స్ చేశారు. మ‌రి దీనిపై ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఎలాగూ రియాక్ట్ కారు. మ‌రి భీమ్లా నాయ‌క్ మేక‌ర్స్ ఏమైనా రియాక్ట్ అవుతారేమో చూడాలి.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/S6zFurCVp
v

ఆ సినిమా నుంచి రాజ‌శేఖ‌ర్‌ను తొలగించారా?

సీనియ‌ర్ క‌థానాయ‌కుడు డాక్ట‌ర్ రాజ‌శేఖ‌ర్ ప్ర‌స్తుతం త‌న లేటెస్ట్ మూవీ ‘శేఖర్’ మూవీతో బిజీగా ఉన్నారు. ఒకానొక స్టేజ్‌లో రాజ‌శేఖ‌ర్ వ‌రుస ప‌రాజ‌యాల‌ను మూగ గ‌ట్టుకున్న‌ప్పుడు ఆయ‌న‌కు సినిమా అవ‌కాశాలు ఇక‌పై రావ‌నే అనుకున్నారు. అయితే గ‌రుడ‌వేగ సినిమా స‌క్సెస్‌తో ట్రాక్‌లోకి వ‌చ్చిన రాజ‌శేఖ‌ర్ ఇప్పుడు డిఫ‌రెంట్ సినిమాలు చేస్తూ వస్తున్నారు. హీరోగా సీనియ‌ర్ అయ్యారు. జ‌గ‌ప‌తిబాబు, శ్రీకాంత్ వంటి చాలా మంది సీనియ‌ర్ స్టార్స్ కీల‌క పాత్ర‌లు, విల‌న్స్‌గా న‌టిస్తున్నారుగా! అని ఓ సంద‌ర్భంలో అడిగితే, మంచి పాత్ర అనిపిస్తే కీ రోల్ అయినా, విల‌న్‌గా అయినా న‌టించ‌డానికి తాను సిద్ధ‌మ‌ని తెలిపారు. అందుకు త‌గిన‌ట్లే రీసెంట్‌గా ఓ ప్ర‌ముఖ హీరో గోపీచంద్‌ సినిమాలో కీల‌క పాత్ర‌లో న‌టించ‌డానికి ఆయ‌న ఓకే చెప్పారు. ఈ సినిమాను డైరెక్ట్ చేయ‌డానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ల‌క్ష్యం, లౌక్యం చిత్రాల త‌ర్వాత - శ్రీవాస్ కాంబినేష‌న్లో రూపొందుతోన్న చిత్ర‌మిది. సినిమా మేకింగ్‌లో భాగంగా సినిమాలో కీల‌క‌మైన పాత్ర‌లో న‌టింప చేయ‌డానికి రాజ‌శేఖ‌ర్‌ను సంప్రందించార‌ని, ఆయ‌న కూడా న‌టించ‌డానికి ఒప్పుకున్నార‌ని కొన్నాళ్లు ముందు వార్త‌లు కూడా వ‌చ్చాయి. అయితే లేటెస్ట్ స‌మాచారం మేర‌కు గోపీ చంద్ - శ్రీవాస్ సినిమాలో రాజ‌శేఖ‌ర్ న‌టించ‌డం లేద‌ట‌. కార‌ణాలు బ‌య‌ట‌కు తెలియ‌డం లేదు. కానీ, మేక‌ర్స్ రాజ‌శేఖ‌ర్‌ను వ‌ద్ద‌నుకుని మ‌రో సీనియ‌ర్ న‌టుడ్ని అందులో న‌టింప చేయాల‌ని చూస్తున్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి. మ‌రి సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్న ఈ వార్త‌ల‌పై జీవిత‌, రాజ‌శేఖ‌ర్ ఏమైనా స్పందిస్తారేమో చూడాలి. ప్ర‌స్తుతం మ‌ల‌యాళ చిత్రం జోసెఫ్‌ను తెలుగులో శేఖ‌ర్ పేరుతో రీమేక్ చేశారు. ఈ సినిమాను జీవిత‌నే డైరెక్ట్ చేశారు. ఈ సంక్రాంతికి శేఖ‌ర్ సినిమాను విడుద‌ల చేయాల‌ని అనుకున్నారు. కానీ.. థియేట‌ర్స్ అందుబాటులో లేక‌పోవ‌డం వంటి కార‌ణాల‌తో ఇంకా సినిమాను విడుద‌ల చేయ‌లేదు. త్వ‌ర‌లోనే ఈ సినిమా విడుద‌ల విష‌యంలో ఓ ప్ర‌క‌ట‌న వెలువ‌డే అవ‌కాశం ఉంద‌ని సినీ స‌ర్కిల్స్‌లో వినిపిస్తోన్న స‌మాచారం. శేఖ‌ర్ సినిమాలో రాజ‌శేఖ‌ర్ వాలంట‌రీ రిటైర్‌మెంట్ తీసుకున్న పోలీస్ ఆఫీస‌ర్ పాత్ర‌లో క‌నిపించ‌బోతున్నారు. సినిమా కోసం ఆయ‌న కొత్త‌గా మేకోవ‌ర్ అయ్యారు. మ‌రి శేఖ‌ర్ సినిమా రాజ‌శేఖ‌ర్‌కు ఎలాంటి స‌క్సెస్‌ను అందిస్తుందో తెలుసుకోవాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/aQEbNImT0
v

పవన్ కళ్యాణ్‌ని గుర్తించ‌ని మొగిల‌య్య‌.. ప‌వ‌ర్ స్టార్‌ రియాక్ష‌న్ ఏంటంటే?

గ‌ణ తంత్ర వేడుక‌లకు ముందు కేంద్ర ప్ర‌భుత్వం ప‌ద్మ అవార్డుల‌ను ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. ఇందులో తెలంగాణ ప్రాంతానికి చెందిన మొగిల‌య్య కూడా ఉన్నారు. ఆయ‌న‌కు ప్ర‌భుత్వం ప‌ద్మ శ్రీ అవార్డును ప్ర‌క‌టించింది. కిన్నెర 12 మెట్ల ఆఖ‌రి త‌రం క‌ళాకారుడైన మొగిల‌య్య‌ను తెలంగాణ ప్ర‌భుత్వం కూడా త‌గు రీతిలో గౌర‌వించుకుంది. ఆయ‌న‌కు ఇంటి స్థ‌లంతో పాటు ఇంటి నిర్మాణానికి, ఇత‌ర ఖ‌ర్చుల‌కు కోటి రూపాయ‌ల‌ను సీఎం కేసీఆర్ ఇస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. అయితే అంత‌కు కొన్నాళ్లు ముందు మొగిల‌య్య‌తో ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ త‌న సినిమా ‘భీమ్లా నాయ‌క్‌’లో టైటిల్ సాంగ్‌ను పాడించుకున్నారు. ఆర్థికంగా స‌పోర్ట్ కూడా చేశారు. ఈ సినిమాలో పాట పాడినందుకు మొగిల‌య్య‌కు చాలా మంచి గుర్తింపు వ‌చ్చింద‌న‌డంలో సందేహం లేదు. రీసెంట్‌గా ఇచ్చిన ఓ ఇంట‌ర్వ్యూలో, ‘భీమ్లా నాయ‌క్’ సినిమా గురించి.. అందులో పాట పాడిన సంద‌ర్బం గురించి మొగిల‌య్య ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాన్ని తెలియ‌జేశారు.‘‘ పీఏ నాకు ఫోన్ చేసి ఇలా ప‌వ‌న్ క‌ళ్యాణ్‌గారు మీతో మాట్లాడాల‌ని అనుకుంటున్నారు అన్నారు. నేను కూడా స‌రేన‌ని అన్నాను. అప్పుడు ఆయ‌న భీమ్లా నాయ‌క్ షూటింగ్‌లో ఉన్నారు. న‌న్ను ఆ లొకేష‌న్‌కు తీసుకెళ్లారు. అక్క‌డ కోలాహ‌లంగా ఉంది. పెద్ద ఇల్లు లాంటి వాహ‌నం ఉంది. అందులో నుంచి కాసేప‌య్యాక ప‌వ‌న్ క‌ళ్యాణ్ కిందికి దిగారు. ఆయ‌న బూట్లు, సూట్లు వేసుకోలేదు. తెల్ల పైజ‌మా వేసుకున్నారు. ఆయ‌నే ప‌వ‌న్ క‌ళ్యాణ్ అని నాకు తెలియ‌దు. నేను గుర్తు ప‌ట్ట‌లేదు. ప‌వ‌న్ క‌ళ్యాణ్ అంటే సూటు, బూటు వేసుకుని ఉంటార‌ని నేను అనుకున్నాను. కానీ ఆయ‌న చాలా సింపుల్‌గా ఉన్నారు. ఆయ‌న రాగానే న‌మ‌స్కారం మొగిల‌య్య‌గారు అన్నారు. నేను ఎవ‌రో నాకు న‌మ‌స్కారం చేస్తున్నార‌ని అనుకుని నేను కూడా న‌మ‌స్కారం పెట్టాను. త‌ర్వాత ప‌క్క‌నున్న పీఏ ఆయ‌నే ప‌వ‌న్ క‌ళ్యాణ్‌గారు అనగానే ఆశ్చ‌ర్య‌పోయాను. సార్‌.. మిమ్మ‌ల్ని గుర్తు ప‌ట్ట‌లేక‌పోయాను అని అప్పుడు అన్నాను. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌గారు నాతో బాగా మాట్లాడారు. మా సినిమాలో పాట ఉంది పాడుతారా? మొగిల‌య్య‌గారు అన్నారు. పాడుతానండి అన్నాను. త‌ర్వాత న‌న్ను వాళ్లు హోటల్‌కి తీసుకెళ్లారు’’ అంటూ పవన్‌ను క‌లిసిన సంద‌ర్భంగా గురించి మొగిల‌య్య చెప్పుకొచ్చారు. అలా తొలిసారి ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ను చూసిన‌ప్పుడు తాను ఎందుకు ఆయ‌న్ని గుర్తు ప‌ట్ట‌లేదు అనే విష‌యాన్ని విష‌యాన్ని ద‌ర్శ‌నం మొగిల‌య్య ఇంట‌ర్వ్యూలో చెప్పుకొచ్చారు. మొగిలయ్య పాట పాడిన భీమ్లా నాయ‌క్ మూవీ ఫిబ్ర‌వ‌రి 25న విడుద‌ల‌కు సిద్ద‌మ‌వుతుంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3Ojgvktlh
v

న‌టిస్తున్నందుకు త‌న‌ను తాను ఆస‌హ్యించుకున్న హీరోయిన్‌!

సాధార‌ణంగా బుల్లి తెర‌, వెండి తెర‌పై న‌టిగా మెరిసి పోవాల‌ని కావాల్సినంత గుర్తింపు రావాలని ఎవ‌రైనా కోరుకుంటారు. అయితే ఓ హీరోయిన్ మాత్రం త‌న‌ను తాను ఆస‌హ్యించుకుంద‌ట‌. ఆ విష‌యాన్ని ఎవ‌రో కాదు.. ఆమె స్వ‌యంగా ఓ ఇంట‌ర్వ్యూలో చెప్ప‌డం విశేషం. ఇంత‌కీ ఆ హీరోయిన్ ఎవ‌రో కాదు.. అవికా గోర్‌. ఈమె బాలికా వ‌ధు అనే సీరియ‌ల్ ద్వారా బుల్లి తెర ప్రేక్ష‌కుల హృద‌యాల‌ను దోచుకుంది. ఈ సీరియ‌ల్ స‌క్సెస్ కావడంతో దీన్ని చిన్నారి పెళ్లి కూతురు పేరుతో డ‌బ్బింగ్ చేసి తెలుగులోనూ ప్ర‌సారం చేశారు. ఇక్క‌డ కూడా ఆ సీరియ‌ల్ మంచి ఆద‌ర‌ణ‌ను ద‌క్కించుకోగా అవికా గోర్‌కు మంచి పేరు వ‌చ్చింది. అయితే రీసెంట్‌గా ఓ ఇంట‌ర్వ్యూలో త‌న చిన్నారి పెళ్లి కూతురు సీరియ‌ల్ గురించి మాట్లాడుతూ ఆ సీరియ‌ల్ చేసే స‌మ‌యంలో తానంత హ్యాపీగా లేన‌ని, ప‌లు సంద‌ర్భాల్లో త‌న‌ని తాను ఆస‌హ్యించుకున్నా అని తెలియజేసింది. అంతే కాదండోయ్ స్క్రీన్‌పై చ‌క్క‌గా క‌నిపిస్తున్నానా..లేదా? అనే విష‌యాన్ని కూడా ప‌ట్టిచుకునే దాన్ని కాన‌ని ఆమె తెలియ‌జేసింది. త‌ర్వాత ఈమె ఉయ్యాలా జంపాల సినిమాతో హీరోయిన్‌గా తెలుగు ప్రేక్ష‌కుల‌ను ప‌క‌ల‌రించింది. ఆ సినిమా చాలా పెద్ద హిట్ కావడంతో ఆమెకు అవ‌కాశాలు బాగానే వ‌చ్చాయి. అయితే గ్లామ‌ర్ రోల్స్‌కు ఆమె నో చెప్ప‌డ‌మో ఏమో కానీ.. కొన్ని సినిమాల్లో న‌టించింది. అదే స‌మ‌యంలో ఫిల్మ్ కోర్సు చేయ‌డానికి ఆమె కొన్ని రోజులు సినిమాల‌కు కూడా దూర‌మైంది. అదే స‌మ‌యంలో చ‌బ్బీగా ఉండే ఆమె బ‌రువు త‌గ్గి కాస్త స‌న్న‌బ‌డింది. రాజుగారిగ‌ది 3 చిత్రంతో మ‌ళ్లీ తెలుగు ప్రేక్ష‌కుల‌కు ప‌ల‌క‌రించారు అవికాగోర్‌. సామాజిక కార్యకర్త, ఎన్జీఓను నిర్వహిస్తున్న మిలింద్ చంద్వానీతో అవికా గోర్ ప్రేమలో ఉన్నారు. ఆ విషయాన్ని ఆమె పలు సందర్భాల్లో తెలియజేసిన సంగతి కూడా తెలిసిందే. అయితే వెంటనే పెళ్లి చేసుకోవాలనే ఆలోచనలో తాను లేనని అవికా గోర్ చెప్పింది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/7ajKBuri9
v

డిజిట‌ల్ ఎంట్రీకి ర‌కుల్ ప్రీత్ సింగ్ రెడీ.. కానీ కండీష‌న్ ఏంటంటే?

మారుతున్న ట్రెండ్‌కి అనుగుణంగా ఇప్పుడు మ‌న స్టార్స్ డిజిట‌ల్ ఎంట్రీ ఇస్తున్నారు. హీరోలు, హీరోయిన్సే కాదు.. స్టార్ టెక్నీషియ‌న్స్‌, నిర్మాణ సంస్థ‌లు అన్నీ డిజిటల్ వైపుకు చూస్తున్నారు. ద‌క్షిణాదిన అగ్ర హీరోయిన్స్ సైతం ఓటీటీల‌కు ఓటేస్తున్నారు. ఇప్ప‌టికే స‌మంత‌, త‌మ‌న్నా వంటి వారు ఓటీటీల్లో అడుగు పెట్టేశారు. వెబ్ సిరీస్‌లు, టాక్‌షోలు, వంట‌ల ప్రోగ్రామ్స్ చేసి అంద‌రినీ అల‌రించేశారు. ఇప్పుడు వీరి బాట‌లోకి మ‌రో ముద్దుగుమ్మ కూడా అడుగు పెట్టేయ‌డానికి రెడీ అంటోంది. ఇంత‌కీ ఆమె ఎవ‌రో తెలుసా? ర‌కుల్ ప్రీత్ సింగ్‌. ‘‘ఇంట్రెస్టింగ్‌గా ఉండే కంటెంట్‌ను ప్రేక్ష‌కులు ఎప్పుడూ ఆదరిస్తారు. ఓటీటీల‌కు ప్ర‌జ‌ల్లో ప్రాధాన్య‌త పెరుగుతుంది. ముఖ్యంగా ఓటీటీల కార‌ణంగా రీజ‌న‌ల్ సినిమాలు, కంటెంట్ అనేది ఎక్కువ మందికి చేరువ అవుతుంది. ప్ర‌పంచ వ్యాప్తంగా మంచి ఆద‌ర‌ణ ద‌క్కుతుంది. బాహుబ‌లి సినిమా వ‌ల్ల పాన్ ఇండియా మార్కెట్ క్రియేట్ అయ్యింది. ఇప్పుడు మ‌న ద‌గ్గ‌ర సినిమాల ప‌రంగా భాషా ప‌ర‌మైన స‌మ‌స్య‌లు ఉండ‌టం లేదు. కంటెంట్ బావుంటే చాలు. అంద‌రూ చూస్తున్నారు. డిజిట‌ల్ కంటెంట్‌కు ఆద‌ర‌ణ పెరుగుతుంది. నేను కూడా డిజిట‌ల్ మాధ్య‌మంలో న‌టించానికి రెడీ. అయితే నా పాత్ర ప్ర‌ధానంగా ఉండాలి. క‌థ‌ను న‌డిపించాలి. కంటెంట్ ఆస‌క్తిక‌రంగా, ఎగ్జయిటింగ్‌గా ఉండాలి’’ అన్నారు ర‌కుల్ ప్రీత్ సింగ్‌. మ‌రి ర‌కుల్‌కి డిజిట‌ల్ ఎంట్రీకి ఏ నిర్మాత అవ‌కాశం ఇస్తారో చూడాలి మ‌రి. ద‌క్షిణాదిన ఇటు తెలుగు, అటు త‌మిళంతో పాటు బాలీవుడ్‌లోనూ వ‌రుస సినిమాలు చేస్తూ బిజీగా ఉంటోంది ర‌కుల్ ప్రీత్ సింగ్. ప్ర‌స్తుతం ఈమెకు బాలీవుడ్ ప్రాజెక్ట్స్‌తోనే బిజీగా ఉంటుంది. సినిమాలు కాకుండా ఎఫ్ 45 అనే జిమ్స్ నిర్వ‌హ‌ణ‌తో ఈ ఫిట్ నెస్ ఫ్రీక్ బిజీగా ఉంటుంద‌నే సంగ‌తి మ‌నంద‌రికీ తెలిసిందే. ప్ర‌స్తుతం బాలీవుడ్ న‌టుడు జాకీ భ‌గ్నానీతో ప్రేమ‌లో ఉంది. ప్ర‌స్తుతం సినిమాల‌తో బిజీగా ఉన్న ర‌కుల్‌, జాకీ భ‌గ్నానీ త్వ‌ర‌లోనే పెళ్లి చేసుకోబోతున్నారు. తెలుగులో కెరటం సినిమాతో హీరోయిన్‌గా కెరీర్‌ను స్టార్ట్ చేసిన ర‌కుల్ ప్రీత్ సింగ్, అతి కొద్ది కాలంలోనే అగ్ర హీరోయిన్ రేంజ్‌కు చేరుకుంది. నాగార్జున‌, ఎన్టీఆర్‌, చ‌ర‌ణ్, నాగ చైత‌న్య‌ చూద్దాం వంటి స్టార్స్‌తో ఈమె న‌టించింది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/mu4b1ZkDx
v

అదంతా తూచ్.. ప్రేమ, పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన సురేఖా వాణి కుమార్తె సుప్రిత‌..!

సోషల్ మీడియాలో యమా యాక్టివ్‌గా ఉంటూ క్రేజ్ పెంచుకుంటున్న వారిలో న‌టి ఒక‌రు. ఆమెతో పాటు ఆమె త‌న‌య కూడా సామాజిక మాధ్యమాల్లో చురుకుగా ఉంటున్నారు. గ్లామ‌ర‌స్ ఫొటోలు, వీడియోల‌తో ఇద్ద‌రూ హ‌ల్ చ‌ల్ చేస్తుంటారు. వీరు చేసే ప‌నికి కొంద‌రు ట్రోల్ చేసినా, వీరివురూ త‌మ‌కు న‌చ్చిన ప‌ని చేసుకుంటూ పోతున్నారు. లేటెస్ట్‌గా సుప్రితతో రాఖీ జోర్డాన్, సుప్రిత క‌లిసి ఓ ప్రైవేట్ వీడియో ఆల్బ‌మ్‌లో న‌టించారు. త‌న‌తో ప్రేమ‌కు ఎస్ చెప్పానంటూ కూడా ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్ పోస్ట్ చేశారు. దాని తర్వాత విడుదలైన వీడియో ఆల్బమ్ చూసిన వాళ్లు సుప్రిత పెళ్లి చేసుకుందంటూ సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సందర్భంగా సుప్రిత మాట్లాడుతూ ‘‘నా పెళ్లి గురించి విషయాన్ని ఏదైనా మా అమ్మగారే అధికారికంగా చెబుతారు. సాంగ్ ప్రమోషన్స్‌లో భాగంగానే నేను యాక్ట్ చేశాను. అంద‌రూ నాకు ఫోన్ చేసి పెళ్లి చేసుకుంటున్నావా? అని అడుగుతున్నారు. నేనేం పెళ్లి చేసుకోవ‌డం లేదు. నా పెళ్లి వార్త ఇంత వైర‌ల్ అవుతుంద‌ని అనుకోలేదు. అంద‌రూ నాకు ఫోన్స్ చేశారు. నేను ప్రేమ‌లో కూడా లేను. సోష‌ల్ మీడియాలో, ఎల‌క్ట్రానిక్ మీడియాలో నా పెళ్లి వార్త వైర‌ల్ అయ్యింది. సోష‌ల్ మీడియాలో నెగటివ్ కామెంట్స్ చేశారు. కొంద‌రు పాజిటివ్‌గానే స్పందించారు. నెగ‌టివ్‌గా స్పందించిన వారికి నేను చెప్పేదొక్క‌టే.. పెళ్లి అనేది నా వ్య‌క్తిగ‌త విష‌యం. నేను ఏంట‌నే విష‌యం మా అమ్మ‌కు, స్నేహితుల‌కు తెలుసు. రేపు న‌న్ను పెళ్లి చేసుకోబోయే వ్య‌క్తికి తెలిస్తే చాలు’’ అన్నారు. దీంతో రాఖీ జోర్డాన్‌తో సుప్రిత చేసిన వీడియో సాంగ్‌, అంత‌కు ముందు ఆమె పెట్టిన మెసేజ్‌ల‌న్నీ ఉత్త‌వేన‌ని తేలిపోయింది. అంతే కాకుండా సుప్రిత త‌న పెళ్లి గురించిన నిర్ణ‌యాన్ని త‌ల్లి సురేఖా వాణియే తీసుకుంటుంద‌ని తేల్చేసింది. కొందరు నెటిజన్స్, ఫాలోవర్స్ ఇలా సుప్రిత క్లారిటీ ఇవ్వడంపై చాలా హ్యాపీగా ఫీలయ్యారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/EXvDUndek
v

రేణు దేశాయ్ క్రేజీ స్టెప్.. బాగా ఆలోచించి నిర్ణయం తీసుకున్న పవన్ మాజీ వైఫ్!

హీరోయిన్‌గానే కాకుండా దర్శకనిర్మాతగా అందరికీ సుపరిచితం . పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాజీ భార్య అయిన ఆమె తాజాగా రవితేజతో న్యూ స్టెప్ వేయబోతోందనే టాక్ బలంగా వినిపిస్తోంది. పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన 'జానీ' సినిమా తర్వాత మళ్లీ సినిమాల్లో కనిపించని రేణు దేశాయ్.. తిరిగి ఇప్పుడు కెమెరా ముందుకు రాబోతోందట. అది కూడా సోదరి పాత్రలో. ఈ విషయం బయటకు రావడంతో జనాల్లో ఆసక్తి మొదలైంది. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న మాస్ మహారాజ్ రవితేజ.. '' బయోపిక్ చేస్తున్న సంగతి తెలిసిందే. టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు అనే ఒక గ‌జ‌దొంగ క‌థ ఆధారంగా ఈ సినిమాను తెర‌కెక్కించ‌నున్నారట. కెరీర్‌లో 71వ సినిమాగా రూపొందుతున్న ఈ సినిమాకు వంశీ కృష్ణ ఆకెళ్ల దర్శకత్వం వహిస్తుండగా.. భారీ బడ్జెట్ కేటాయించి అన్ని హంగులతో అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా సినిమాగా తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ఈ సినిమాను రిలీజ్ చేయబోతున్నారు. అయితే ఈ 'టైగర్ నాగేశ్వరరావు' మూవీలో రవితేజ సోదరిగా ఓ కీలక పాత్ర ఉందట. ఈ రోల్ కోసం పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్‌ని సంప్రదించగా ఆమె బాగా ఆలోచించి ఓకే చెప్పిందని సమాచారం. త్వరలో దీనిపై క్లారిటీ అఫీషియల్ స్టేట్‌మెంట్ కూడా ఇవ్వనున్నారని తెలుస్తోంది. దీంతో ఈ విషయం టాలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్ అయింది. రేణుని సిల్వర్ స్క్రీన్‌పై చూడాలని ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. ఇకపోతే మరికొద్ది రోజుల్లో 'ఖిలాడి' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న రవితేజ.. 'ధమాకా, రామారావు ఆన్‌డ్యూటీ' సినిమాలను లైన్‌లో పెట్టారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/cHiGedE0D
v

Saturday 29 January 2022

నాపై అలాంటి ప్రచారం జరిగింది.. చాలా బాధపడ్డా: కీర్తి సురేష్ ఎమోషనల్ కామెంట్స్

సినిమా అనే రంగుల ప్రపంచంలో ఎప్పుడు ఎవ్వరి కెరీర్ ఎలా టర్న్ తీసుకుంటుంది అనేది ఎవ్వరూ ఊహించలేరు. కొందరికి తొలి సినిమాతోనే దక్కే క్రేజ్ ఇంకొందరికి ఎంత టాలెంట్ ఉన్నప్పటికీ దరిచేరదు. ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కున్నాక అప్పుడు విజయం వరిస్తుంది. ఇది చాలామంది తారల కెరీర్‌లో అప్లై అయింది. అదే లిస్టులో ఉంది సౌత్ ఇండియన్ బ్యూటిఫుల్ హీరోయిన్ . 'నేను శైలజ' సినిమాతో తెలుగు తెరపై కాలుమోపి ఆ తర్వాత 'మహానటి' సినిమాతో ఏకంగా నేషనల్ అవార్డు అందుకుంది కీర్తి. దీంతో దెబ్బకు సౌత్ ఇండియన్ స్టార్ హీరోయిన్ అయిపోయింది. తెలుగుతో పాటు తమిళ, మళయాళ సినిమాలతో అలరిస్తున్న ఆమె.. రీసెంట్‌గా గుడ్ లక్ సఖి సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ నేపథ్యంలో తాజాగా ఓ మీడియా సమావేశంలో పాల్గొని తన కెరీర్ విషయాలను, కెరీర్ తొలినాళ్లలో ఎదుర్కొన్న ఇబ్బందులను వివరించింది. కెరీర్‌ ఆరంభంలో తాను చాలా అవమానాలు ఎదుర్కొన్నాని తెలుపుతూ ఆ విషయాలను ప్రస్తావించింది. హీరోయిన్‌గా మలయాళ చిత్ర పరిశ్రమతో తన కెరీర్ మొదలైందని, అయితే ఫస్ట్‌ మూవీ సెట్స్‌ మీదకి వెళ్లిన తర్వాత కొన్ని కారణాల వల్ల ఆగిపోవడం.. అలాగే రెండో సినిమా విషయంలోనూ అదే జరగడంతో ఇండస్ట్రీలో తనపై ఐరన్‌ లెగ్‌ అనే ముద్ర వేశారని చెప్పింది. అప్పట్లో ఓ స్టూడియోకి వెళితే అక్కడ తనను చూసిన కొంతమంది.. ఈ కొత్తమ్మాయిని పెట్టుకుంటే సినిమా ఆగిపోతుందని కామెంట్స్ చేశారని చెబుతూ ఎమోషనల్ కామెంట్స్ చేసింది. అలా కొన్ని అవకాశాలు కూడా చేజారాయని చెప్పుకొచ్చింది. తొలుత అలాంటి కామెంట్స్ బాధగా అనిపించినా క్రమంగా వాటికి అలవాటు పడ్డానని, ఆ విమర్శలను పట్టించుకోకుండా ముందుకెళ్ళి ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నానని కీర్తి చెప్పింది. సక్సెస్‌ మాత్రమే అవమానాలను ప్రశంసలుగా మార్చగలదని భావించి కష్టపడ్డానని తెలిపింది. ప్రస్తుతం మహేష్ బాబు 'సర్కారు వారి పాట', చిరంజీవి 'భోళా శంకర్' సినిమాల్లో నటిస్తోంది కీర్తి సురేష్.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/4Jp9gtae5
v

Bigg Boss OTT: అరియానా రీ- ఎంట్రీ! ఈ సారి బ్యూటీ టార్గెట్ అదేనట..

బుల్లితెరపై ఓ స్పెషల్ మార్క్ క్రియేట్ చేసింది బిగ్ బాస్ షో. ప్రేక్షక లోకాన్ని బాగా అలరిస్తున్న రియాలిటీ షోగా ఫుల్ పాపులారిటీ సంపాదించింది. ఓ వైపు బోలెడన్ని విమర్శలు, అనుమానాలు తలెల్లినా కూడా అన్ని భాషల్లోనూ సూపర్ రెస్పాన్స్ అందుకుంటూ ఛానెల్స్ యాజమాన్యాలకు భారీ టీఆర్ఫీ తెచ్చిపెడుతోంది. దీంతో ఈ షోకి ఉన్న డిమాండ్ దృష్ట్యా వర్షన్‌కి తెరలేపారు. ఇప్పటికే హిందీలో బిగ్ బాస్ ఓటీటీ ప్రసారం కాగా.. తెలుగు బిగ్ బాస్ ఓటీటీ పనులు చకచకా నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇందులో మరోసారి అరియనా తళుకులు చూడబోతున్నామనే ఓ క్రేజీ విషయం బయటకొచ్చింది. తెలుగులో ఇప్పటివరకు 5 సీజన్లను సక్సెస్‌ఫుల్‌గా పూర్తి చేసుకుంది బిగ్ బాస్. ఇక నుంచి బిగ్ బాస్ OTTపై కూడా ప్రసారం కాబోతోంది. దీనికి కూడా నాగార్జుననే హోస్ట్‌ బాధ్యతలు స్వీకరించనున్నారు. ఫిబ్రవరి చివరి వారంలో ఈ షోకి ముహూర్తం ఫిక్స్ చేశారని తెలుస్తోంది. డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌ OTT ప్లాట్‌ఫామ్‌పై 24 గంటలపాటు ఈ షోని స్ట్రీమింగ్ చేసేలా ప్లాన్ చేసి పెట్టారు. 15 మంది కంటెస్టెంట్లతో 82 రోజుల పాటు ఈ షో ప్రసారం కానుందట. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఇందులో పాల్గొనబోయే కంటెస్టెంట్ల ఎంపిక చివరి దశకు చేరిందని తెలుస్తోంది. ఇందులో భాగంగా ముగ్గురు మాజీ కంటెస్టెంట్లను తీసుకున్నారని, ఆ ముగ్గురిలో ఒకరే అరియానా గ్లోరీ అనే టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే ఆమెతో మంతనాలు పూర్తయ్యాయని, మరోసారి బిగ్ బాస్ హౌస్ లోకి రావడానికి అరియనా నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిందని సమాచారం. అయితే ఈ సారి సరికొత్త వ్యూహంతో బిగ్ బాస్ ట్రోఫీ టార్గెట్‌గా ఆమె బరిలోకి దిగుతోందని అంటున్నారు. సో.. చూడాలి మరి ఇదే నిజమైతే అరియనా ఈ సారైనా ప్లాన్ వర్కవుటవుతుందా అనేది!.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/X3EFdasou
v

రామ్ చరణ్ వెంట ముంబైకి శ్రీజ.. క్లిష్ట పరిస్థితుల్లో అన్నయ్య సాయం?

గత కొన్ని రోజులుగా మెగాస్టార్ చిరంజీవి కూతురు శ్రీజకు సంబంధించిన వార్తలు వైరల్ అవుతున్నాయి. చిరు కూతురు మరోసారి విడాకుల బాట పట్టిందని వార్తలు వస్తుండటంతో సినీ వర్గాల్లో ఈ ఇష్యూ హాట్ టాపిక్ అయింది. ఈ పరిస్థితుల నడుమ తాజాగా చెల్లెలు శ్రీజను వెంట బెట్టుకొని ముంబై విమానాశ్రయంలో కనిపించడంతో మెగా శిభిరంలో ఏదో జరుగుతోందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అచ్చం సమంత లాగే శ్రీజ కూడా తన సోషల్ మీడియా ఖాతా నుంచి భర్త పేరును తొలగించి తనపై వస్తున్న రూమర్లకు రెక్కలు కట్టింది. విడాకుల రూమర్స్ షికారు చేస్తుండగానే శ్రీజ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాకు సంబంధించిన పేరును మార్చడంతో అందరిలో డౌట్స్ రెట్టింపయ్యాయి. క‌ళ్యాణ్ దేవ్‌ను పెళ్లి చేసుకున్న త‌ర్వాత త‌న ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ఐడీని శ్రీజా క‌ళ్యాణ్‌గా మార్చుకున్న ఆమె.. రీసెంట్‌గా ఆ పేరును శ్రీజా కొణిదెల‌గా మార్చేసింది. మరోవైపు శ్రీజ- కళ్యాణ్ దేవ్ మ‌ధ్య మ‌న‌స్ప‌ర్ధ‌లు వచ్చాయని, గతేడాది ఆగస్టు నెలలోనే వాళ్లిద్దరూ విడిపోయారనే టాక్ ముదిరింది. పైగా కళ్యణ్ దేవ్ హీరోగా రూపొందిన 'సూపర్ మచ్చి' సినిమాను ప్రమోషన్స్‌లో మెగా ఫ్యామిలీ కనిపించకపోవడం, అలాగే రీసెంట్‌గా జరిగిన మెగా ఫ్యామిలీ మీట్స్‌కి కళ్యాణ్ దేవ్ రాకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఓ పక్క ఇదంతా నడుస్తున్నా మెగా ఫ్యామిలీ మౌనం వహించడం కూడా జనాల్లో ఉన్న అనుమానాలకు రెక్కలు కట్టింది. ఇంతలో సోదరుడు రామ్ చరణ్‌తో ముంబై విమానాశ్రయంలో శ్రీజ కనిపించడంతో ఆ వీడియో వైరల్ కావడమే గాక ఇంతకీ మెగా శిభిరంలో ఏం జరుగుతోంది? అనే చర్చలు ఊపందుకున్నాయి. తన విడాకుల విషయంపై వస్తున్న వార్తల నేపథ్యంలో శ్రీజ వ్యక్తిగతంగా చాలా డిప్రెషన్‌కి వెళ్లిపోయిందని, ఈ క్లిష్ట పరిస్థితుల్లో రామ్ చరణ్ తన సోదరి పట్ల స్పెషల్ కేర్ తీసుకుంటున్నారని చెప్పుకుంటున్నారు. అందుకే తనతో పాటే షూటింగ్ లొకేషన్స్ తిప్పుతూ ఆమె మనసు ప్రశాంతంగా ఉంచేలా ప్రయత్నాలు చేస్తున్నారనే చర్చలు నడుస్తున్నాయి. శ్రీజ- కళ్యాణ్ దేవ్ విడాకుల విషయంపై ఎలాంటి అధికారిక సమాచారం లేనప్పటికీ తాజా పరిస్థితులు చూసి జనం రకరకాలుగా చెప్పుకుంటున్నారు. మొదట 2007 సంవత్సరంలో శిరీష్ భ‌ర‌ద్వాజ్‌ అనే వ్యక్తిని ఆర్య స‌మాజ్‌లో ప్రేమ వివాహం చేసుకున్న శ్రీజ.. అతనితో 2014లో విడాకులు తీసుకుంది. ఆ త‌ర్వాత 2016 సంవత్సరంలో క‌ళ్యాణ్ దేవ్‌‌ని పెళ్లాడింది. వీరికి నవిష్క ఓ పాప కూడా పుట్టింది. శ్రీజను పెళ్లి చేసుకొని మెగా కాంపౌండ్‌లో అడుగుపెట్టాక హీరోగా 'విజేత' సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు కళ్యాణ్ దేవ్. సో.. చూడాలి మరి శ్రీజ- కళ్యాణ్ దేవ్ విడాకుల వ్యవహారంపై వస్తున్న వార్తలకు ఎలాంటి ముగింపు లభిస్తుందనేది!.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/rX6apVKti
v

RC15: రామ్ చరణ్ మూవీలో పవన్ కళ్యాణ్ మార్క్‌! మెగా ఫ్యాన్స్‌కి కిక్కే కిక్కు..

మెగా పవర్ స్టార్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ RRR అన్ని కార్యక్రమాలు ఫినిష్ చేసుకొని విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ మూవీ కోసం యావత్ సినీ లోకం ఎంతగానో ఎదురుచూస్తోంది. ఇదిలా ఉంటే RRR తర్వాత రామ్ చరణ్ మరో భారీ ప్రాజెక్టుతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. బడా డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో ఓ పాన్ ఇండియా మూవీ చేస్తున్నారు చెర్రీ. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ కూడా ప్రారంభమైంది. ఈ నేసథ్యంలో తాజాగా ఈ మూవీ గురించిన ఓ ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ నెట్టింట వైరల్ అవుతోంది. రామ్ చరణ్ కెరీర్‌లో 15వ సినిమాగా రాబోతున్న ఈ సినిమాలో మార్క్‌ కనిపించనుందనే టాక్ నడుస్తోంది. ఇందులో ఓ స్పెషల్ సాంగ్ ప్లాన్ చేశారట. అదే పవన్ కళ్యాణ్- రేణు దేశాయ్ హీరోహీరోయిన్లుగా నటించిన 'జాని' సినిమాలోని ''ఈ రేయి తీయనిది.. ఈ చిరుగాలి మనసైనది'' సాంగ్ రీమేక్. ఇప్పటివరకు తన తండ్రి పాటలను మాత్రమే రీమేక్ చేసిన రామ్ చరణ్ మొదటిసారి బాబాయ్ పవన్ కళ్యాణ్ పాటను రీమేక్ చేయబోతున్నారని తెలుస్తోంది. ఈ సాంగ్ షూట్ చేయడానికి తగిన ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంస్థ 50వ చిత్రంగా రూపొందుతున్న ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తోంది. చిత్రంలో అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ ఉండేలా కథ రాసుకున్న శంకర్.. ఈ సినిమా చెర్రీ కెరీర్‌లోనే ప్రత్యేకమైన సినిమాగా నిలవాలని భావిస్తూ, అందుకు తగ్గ ప్లాన్స్ చేస్తున్నారట. చిత్రాన్ని భారీ విజువల్ వండర్‌గా రూపొందించాలని తీర్చిదిద్దాలని నిర్మాత దిల్ రాజు సైతం శంకర్‌తో పలు కీలక విషయాలు చర్చిస్తున్నారట. శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్‌ నుంచి రాబోతున్న 50వ సినిమా కావడంతో బడ్జెట్ విషయంలో దిల్ రాజు ఎక్కడా కాంప్రమైజ్ కావడం లేదట. తమ బ్యానర్‌కి ఈ సినిమా చాలా స్పెషల్ కావాలని ఆయన భావిస్తున్నారట.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/bdBLmcH34
v

Friday 28 January 2022

‘అఖండ’ ఎఫెక్ట్... NBK 107 కోసం ప్లానింగ్ మార్చిన బాలకృష్ణ!

నంద‌మూరి బాల‌కృష్ణ లేటెస్ట్ మూవీ ‘అఖండ‌’. డిసెంబ‌ర్ 2న విడుద‌లైన ఈ చిత్రం బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అయ్యింది. రూ.200 కోట్ల క్ల‌బ్‌లో జాయిన్ అయ్యింది. కేవ‌లం మాస్ ప్రేక్ష‌కుల‌కే బాల‌య్య సినిమాలు న‌చ్చుతాయ‌నే ఓ భావ‌న‌ను అఖండ చేరిపేసింది. థియేట‌ర్స్‌లో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అయిన ఈ చిత్రం రీసెంట్‌గా ఓటీటీలో విడుద‌లై కూడా హ‌య్య‌స్ట్ వ్యూస్‌ను సాధించి అందులోనూ రికార్డ్ చేసిన సంగ‌తి తెలిసిందే. ఇప్పుడు అంద‌రి దృష్టి బాల‌కృష్ణ చేయ‌బోతున్న 107వ సినిమాపై ప‌డింది. అఖండ వంటి భారీ విజ‌యం త‌ర్వాత బాల‌కృష్ణ‌.. క్రాక్ వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ కొట్టిన డైరెక్ట‌ర్ గోపీచంద్ మ‌లినేని కాంబినేష‌న్‌లో సినిమా రూపొందుతుండ‌టంతో సినిమాపై ఎక్స్‌పెక్టేష‌న్స్ పీక్స్‌గానే ఉన్నాయి. అయితే తెలుగు మార్కెట్ పెర‌గ‌డం.. బాల‌య్య అఖండ‌కు ద‌క్కిన ఆద‌ర‌ణ‌ను దృష్టిలో పెట్టుకున్న నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేక‌ర్స్ స‌రికొత్త ప్లానింగ్ చేసింద‌ట‌. ఏదో ఆషామాషీగా కాకుండా NBK 107ను నాలుగు భాష‌ల్లో విడుద‌ల చేయ‌డానికి నిర్మాత‌లు ప్లాన్ చేస్తున్నార‌ట‌. మ‌రి ఈ నాలుగు భాష‌ల్లో హిందీ వెర్ష‌న్ ఉంటుందా? లేక త‌ర్వాత ఏమైనా అనువాదం చేసి రిలీజ్ చేస్తారా? అనేది తెలియ‌డం లేదు. అయితే NBK 107 కోసం భారీ ప్లానింగ్ జ‌రుగుతుంద‌నేది నిజం. NBK 107లో శ్రుతి హాస‌న్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. అలాగే క‌న్న‌డ న‌టుడు దునియా విజ‌య్ ఇందులో కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నారు. బాల‌కృష్ణ ద్విపాత్రాభిన‌యం చేస్తున్నార‌నేది టాక్‌. ఈ చిత్రానికి జై బాల‌య్య‌.. వేటపాలెం అనే అనుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. నిజ ఘటలను ఆధారంగా చేసుకుని NBK 107 చిత్రీకరణను చేస్తున్నారట. త్వరలోనే సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. ఇంతకు ముందు క్రాక్ సినిమాను డైరెక్టర్ గోపీచంద్ మ‌లినేని, వేట పాలెం బ్యాక్ డ్రాప్‌లోనే తెర‌కెక్కించారు. మ‌రోసారి అదే సెంటిమెంటును ఫాలో అవుతూ మ‌రోసారి అదే బ్యాక్ డ్రాప్‌లో సినిమా చేస్తున్నార‌ట‌. క‌థ‌ను అనుస‌రించే వేట పాలెం అనే టైటిల్‌ను నిర్ణ‌యించార‌ని కూడా ఇది వరకు వార్తలు వినిపించాయి.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://bit.ly/3uaAiPa
v

మ‌రో స్టార్ హీరో సినిమాలో పాట పాడుతున్న మొగిల‌య్య‌..!

కేంద్ర ప్ర‌భుత్వం నుంచి ప‌ద్మ‌శ్రీ అవార్డు పొందిన తెలంగాణ ప్రాంతానికిచెందిన క‌ళాకారుడు ద‌ర్శ‌నం మొగిలయ్య‌. 12 మెట్ల కిన్నెర‌తో పాటలు పాడుతూ ముత్తాల కాలం నాటి క‌ళ‌కు ప్రాణం పోస్తూ వస్తున్నారు మొగిల‌య్య‌. ఈ మ‌ధ్య కాలంలో ఆయ‌న సినీ రంగ ప్ర‌వేశం కూడా చేశారు. ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ హీరోగా న‌టిస్తున్న లేటెస్ట్ మూవీ ‘భీమ్లా నాయ‌క్‌’ సినిమాలో టైటిల్ పాట‌ను ఆయ‌నే పాడారు. అప్పుడు మొగిల‌య్య‌కు మ‌రింత గుర్తింపు దొరికిన‌ట్లు అయ్యింది. తాజాగా సినీ వ‌ర్గాల్లో ఓ ఆస‌క్తిక‌ర‌మైన వార్తొక‌టి వినిపిస్తోంది. అదేంటంటే మొగిల‌య్య మ‌రో సినిమా కోసం పాట పాడ‌బోతున్నార‌ని. ఇంత‌కీ ఎవ‌రా? హీరో అనే ఇంట్రెస్ట్ అంద‌రిలోనూ క‌లుగుతుంద‌న‌డంలో సందేహం లేదు. ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో వినిపిస్తోన్న వార్త‌ల మేర‌కు ఆ హీరో ఎవ‌రో కాదు. యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌. ఈయ‌న క‌థానాయ‌కుడితో త్వ‌ర‌లోనే కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేయ‌బోతున్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు జ‌రుగుతున్నాయి. అందులో భాగంగానే - కొర‌టాల శివ.. మొగిల‌య్య‌తో ఓ పాట‌ను పాడించాల‌నుకుంటున్న‌ట్లు టాక్‌. మ‌రి దీనిపై చిత్ర‌యూనిట్ ఏమైనా స్పందిస్తుందేమో చూడాలి. పాన్ ఇండియా మూవీగా ఎన్టీఆర్, మూవీ తెరకెక్కుతోంది. దీనికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ద‌ర్శ‌నం మొగిల‌య్య‌కు తెలంగాణ ప్ర‌భుత్వం కూడా అండ‌గా నిల‌బ‌డింది. క‌ళ‌కారుల‌కు అందించే గౌర‌వ వేత‌నాన్ని అందిస్తున్నారు. అలాగే ప‌ద్మ‌శ్రీ అవార్డు ప్ర‌క‌టించిన త‌ర్వాత‌ శుక్ర‌వారం మొగిల‌య్య వెళ్లి కేసీఆర్‌ను ప్ర‌త్యేకంగా క‌లిశారు. కేసీఆర్ ఆయ‌న్ని శాలువాతో స‌త్క‌రించ‌డ‌మే కాకుండా, ఆయ‌నకు హైద‌రాబాద్‌లో నివాస యోగ్య‌మైన ప్రాంతంలో ఇంటి స్థ‌లంతో పాటు ఇంటి నిర్మాణం ఇత‌ర‌త్రా ఖ‌ర్చుల కోసం కోటి రూపాయ‌ల‌ను ప్ర‌క‌టించిన సంగ‌తి విదిత‌మే.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://bit.ly/3rUFYdg
v

ప్రభాస్ ‘రాధే శ్యామ్’ కొత్త రిలీజ్ డేట్ ఇదేనా?

పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ లేటెస్ట్ మూవీ ‘’. పీరియాడిక్ ల‌వ్ స్టోరి. హీరోయిన్‌. యూర‌ప్ బ్యాక్ డ్రాప్‌లో సాగే ఈ ల‌వ్‌స్టోరిని ‘జిల్‌’ ఫేమ్ రాధా కృష్ణ కుమార్ డైరెక్ట్ చేశారు. ఈ ఏడాది సంక్రాంతికి విడుద‌ల కావాల్సిన ఈ చిత్రం క‌రోనా ధ‌ర్డ్ వేవ్ కార‌ణంగా వాయిదా ప‌డింది. మార్చి 18న ‘రాధే శ్యామ్’ విడుద‌ల‌వుతుంద‌ని ఈ మ‌ధ్య వార్త‌లు వ‌చ్చిన‌ప్ప‌టికీ అదే రోజున RRR మూవీ వ‌స్తున్న‌ట్లు ప్ర‌క‌టించ‌డంతో ‘రాధే శ్యామ్’ రిలీజ్ ఎప్పుడు ఉంటుందో తెలియ‌ని కన్‌ఫ్యూజ‌న్ మొద‌లైంది. ఇదే గ్యాప్‌లో ‘రాధే శ్యామ్’ డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ కానుందంటూ కూడా వార్త‌లు హ‌ల్ చ‌ల్ చేశాయి. అయితే అలాంటిదేమీ లేద‌ని సినిమా థియేట‌ర్స్‌లోనే విడుద‌ల‌వుతుందంటూ డైరెక్ట‌ర్ రాధా కృష్ణ‌కుమార్ క్లారిటీ ఇచ్చేశారు. ‘రాధే శ్యామ్’ థియేట‌ర్స్‌లో రావ‌డం ప‌క్కా అయితే, ఎప్పుడా? అనే సందేహం అంద‌రిలోనూ నెల‌కొంది. ప్ర‌భాస్ అండ్ టీమ్ ఈ విష‌యంపై సైలెంట్‌గానే ఉంటూ వ‌స్తున్నారు. అందుకు కార‌ణం.. ప‌రిస్థితి వారి చేతుల్లో లేదు మ‌రి. ఈ నేప‌థ్యంలో ‘రాధే శ్యామ్’ రిలీజ్ డేట్‌పై ఆస‌క్తిక‌ర‌మైన విష‌య‌మొక‌టి తెలిసింది. ఇప్పుడిప్పుడే ఢిల్లీ, త‌మిళ‌నాడు స‌హా ప‌లు ఉత్త‌రాది రాష్ట్రాల్లో లాక్‌డౌన్ ఎత్తివేస్తున్నారు. థియేట‌ర్స్ ఆక్యుపెన్సీ విష‌యంలోనూ స‌డ‌లింపులు మొద‌ల‌య్యాయి. దీంతో ‘రాధే శ్యామ్’ మేక‌ర్స్ మార్చి 4న సినిమాను విడుద‌ల చేయాల‌ని అనుకుంటున్నార‌ట‌. ఫిబ్ర‌వ‌రిలో లాక్ డౌన్ స‌డ‌లింపులు త‌దిత‌ర అంశాల‌పై మ‌రింత క్లారిటీ వ‌స్తుంద‌న‌డంలో సందేహం లేదు. దీంతో ఫిబ్ర‌వ‌రిలో సినిమా రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేసే అవ‌కాశం ఉంద‌ని స‌మాచారం. సాహో త‌ర్వాత థియేట‌ర్స్‌లోకి ప్ర‌భాస్ సినిమా వ‌చ్చి రెండున్న‌రేళ్లు అవుతుంది. ప్ర‌భాస్ ఫ్యాన్స్ ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. ‘రాధే శ్యామ్’కి సంబంధించిన టీజ‌ర్‌, ట్రైల‌ర్ అన్నీ ప్రేక్ష‌కుల్లో మ‌రింత బ‌జ్‌ను పెంచేశాయి. ‘రాధే శ్యామ్’లో ప్ర‌భాస్ విక్ర‌మాదిత్య అనే హ‌స్త సాముద్రికా నిపుణుడి పాత్ర‌లో క‌నిపించనున్నారు. ప్రేర‌ణ అనే మ్యూజిక్ టీచ‌ర్ పాత్ర‌లో పూజా హెగ్డే క‌నిపించ‌నుంది. రెబల్ స్టార్ కృష్ణంరాజు కీల‌క పాత్ర‌లో న‌టించారు. కృష్ణంరాజు స‌మ‌ర్ప‌ణ‌లో యువీ క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై వంశీ, ప్ర‌మోద్‌, ప్ర‌శీద ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://bit.ly/3o8a38i
v

యాక్ష‌న్‌లోకి దిగుతున్న నాగార్జున‌.. దుబాయ్ వెళుతున్న అక్కినేని హీరో!

టాలీవుడ్ సీనియ‌ర్ అగ్ర క‌థ‌నాయ‌కుడు త‌న నెక్ట్స్ ప్రాజెక్ట్‌పై ఫోక‌స్ పెట్ట‌డానికి రెడీ అయిపోయారు. ఇంత‌కీ నాగార్జున చేస్తున్న నెక్ట్స్ మూవీ ఏంటో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు..‘’. ఫుల్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌. గ‌రుడ‌వేగ ఫేమ్ ప్ర‌వీణ్ స‌త్తారు డైరెక్ట్ చేస్తున్న చిత్ర‌మిది. ఇందులో నాగార్జున రిటైర్డ్‌ రా ఏజెంట్‌గా క‌నిపించనున్నారు. ఆయ‌న లుక్ కూడా ఇది వ‌ర‌కటి చిత్రాల కంటే డిఫ‌రెంట్‌గా ఉంటుంది. గుబురు గ‌డ్డం, మెలితిప్పిన మీసాల‌తో నాగార్జున ఇందులో క‌నిపించ‌నున్నారు. ఈ సినిమా కొంత మేర‌కు చిత్రీక‌ర‌ణ‌ను జ‌రుపుకున్న త‌ర్వాత కాస్త గ్యాప్ రావ‌డం ఆ గ్యాప్‌లో నాగార్జున బంగార్రాజు సినిమాను పూర్తిచేసి విడుద‌ల చేయ‌డం. సంక్రాంతికి విడుద‌లైన బంగార్రాజు సెన్సేష‌న‌ల్ హిట్ అయిన సంగ‌తి తెలిసిందే. ఇప్పుడు నాగ్‌.. ‘ది ఘోస్ట్’పై ఫోక‌స్ పెట్టారు. యాక్ష‌న్ స‌న్నివేశాల‌ను దుబాయ్‌లో చిత్రీక‌రించ‌నున్నారు. ఫిబ్ర‌వ‌రి 3 నుంచి టీమ్ దుబాయ్ చేరుకుంటుంది. అక్క‌డ యాక్ష‌న్ కొరియోగ్రాఫ‌ర్ నుంగ్ అండ్ టీమ్ నేతృత్వంలో యాక్ష‌న్ స‌న్నివేశాల‌ను చిత్రీక‌రించ‌నున్నారు. నాగార్జున‌తో పాటు సోనాల్‌చౌహాన్ ఇందులో పాల్గొన‌బోతున్నారు. నిజానికి ఈ చిత్రంలో ముందుగా కాజ‌ల్ అగ‌ర్వాల్‌ను హీరోయిన్‌గా అనుకున్నారు. కానీ, ఆమె గౌత‌మ్ కిచ్లుని పెళ్లి చేసుకుంది. ప్రెగ్నెన్సీ రావ‌డంతో ఆమె ఘోస్ట్ నుంచి త‌ప్పుకుంది. దీంతో కాజ‌ల్ స్థానంలో అమ‌లాపాల్, మెహ‌రీన్ కౌర్ స‌హా కొంత మంది హీరోయిన్స్ పేర్లు ప‌రిశీల‌న‌లోకి వ‌చ్చాయి. కానీ చిత్ర యూనిట్ చివ‌ర‌కు సోనాల్ చౌహాన్‌ను హీరోయిన్‌గా ఫిక్స్ చేసుకుంది. ది ఘోస్ట్ చిత్రంలో అనైక సురేంద్రన్, గుల్ పనాగ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. నారాయణ దాస్ కె.నారంగ్, పుస్కూరు రామ్మోహన్ రావు, శరత్ మరార్ నిర్మాతలు. ఈ ఏడాది సంక్రాంతికి విడుదలైన ‘బంగార్రాజు’ చిత్రంతో అక్కినేని నాగార్జున బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు. అందులో నాగ చైతన్యతో కలిసి నటించిన సంగతి తెలిసిందే. అలాగే మరో వైపు 2017లో రాజవేఖర్‌తో గరుడ వేగ చిత్రాన్ని చేసి హిట్ కొట్టారు. మధ్య లెవన్త్ అవర్ అనే వెబ్ సిరీస్‌ను తమన్నాతో చేశారు. ఇప్పుడు ది ఘోస్ట్ సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు. నాగార్జునను ప్రవీణ్ సత్తారు ఎంత కొత్తగా చూపిస్తారనేది ఆయన అభిమానులు ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3oaJkIa
v

ఊపు మీదున్న ఖిలాడీ.. దెబ్బకు బేరాలు ఖతం

మాస్ మహారాజా రవితేజ ఇప్పుడు ఎంత స్పీడు మీదున్నాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. రవితేజ లైన్‌లో పెట్టినన్ని సినిమాలు ఇప్పుడు తెలుగులో మరేతర సీనియర్ హీరోలు పెట్టి ఉండరు. దాదాపు ఐదారు సినిమాలు రెడీగా ఉన్నాయి. ఒకదాని వెంట మరొకటి స్టార్ట్ చేస్తూనే ఉన్నాడు. ఇక ఫిబ్రవరి నెలలో రవితేజ సినిమా విడుల కానుంది. రమేష్ వర్మ దర్శకత్వంలో రాబోతోన్న ఈ సినిమాను కోనేరు సత్య నారాయణ నిర్మిస్తున్నారు. ఫిబ్రవరి 11న రాబోతోన్న ఈ మూవీ ప్రి రిలీజ్ బిజినెస్ ఓ రేంజ్‌లోజరిగిందట. అన్ని ఏరియాల్లో మంచి రేటుకు అమ్ముడుపోయింది. మొత్తానికి రవితేజ మార్కెట్ ఇప్పుడు మంచి స్వింగులో ఉంది. క్రాక్ ఇచ్చిన సక్సెస్‌తో ఖిలాడీని మంచి రేటుకే కొనేశారని తెలుస్తోంది. అలా ఖిలాడీ కోసం డిస్ట్రిబ్యూటర్లు ఫ్యాన్సీ రేట్లకే కొనుగోలు చేశారట. ఆల్రెడీ సినిమా మీద పాజిటివ్ బజ్ ఏర్పడింది. మ్యూజికల్ ప్రమోషన్స్‌లో భాగంగా రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ అందించిన పాటలను ఇప్పటికే ఆడియెన్స్ ఎంజాయ్ చేస్తున్నారు. రవితేజ, డింపుల్ హయతి కాంబినేషన్, ఆ జోడి కెమిస్ట్రీకి అందరూ ఫిదా అవుతున్నారు. రీసెంట్‌గా విడుదల చేసిన ఫుల్ కిక్ సాంగ్ మాస్ ప్రేక్షకులను టార్గెట్ చేసినట్టుంది. మొత్తానికి రవితేజ ఖిలాడీ సినిమాతో ఫిబ్రవరి బాక్సాఫీస్ ఎలా ఉంటుందో చూడాలి. ఇప్పటికే ఫిబ్రవరి నెలలో పెద్ద సినిమాలు రావాలని ప్లాన్ చేస్తున్నాయట. ఇకపై ఫిబ్రవరి నుంచి ప్రతీ రెండు వారాలకు ఒక పెద్ద సినిమాను విడుదల చేయాలని నిర్మాతలు భావిస్తున్నారట. ఈ క్రమంలో ఖిలాడీ సినిమా కూడా భారీ ఎత్తున రిలీజ్ చేయబోతోన్నారట.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3KU1Y0s
v

పెళ్లి, విడాకుల వార్తలపై హిమజ రియాక్షన్

సోషల్ మీడియాలో రూమర్స్ రావడం అనేది కామన్. ముఖ్యంగా సెలబ్రిటీల విషయంలో ఎన్నో రకాల వార్తలు తెరపైకి వస్తుంటాయి. సినీ సర్కిల్స్‌లో వినిపిస్తున్న టాక్ ఆధారంగా వార్తలు పుట్టుకొస్తుంటాయి. ఈ క్రమంలోనే బిగ్ బాస్ బ్యూటీ, సినీ నటి హిమజపై గత రెండు రోజులుగా వస్తున్న వార్తలు వైరల్ అయ్యాయి. తీసుకోనుందా? అనే సందేహాలు వ్యక్తం చేస్తూ వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఇట్టి వార్తపై స్వయంగా రియాక్ట్ అయింది హిమజ. హిమజ తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతా నుంచి భర్తను అన్‌ఫాలో చేసిందని, త్వరలోనే విడాకులు ఇవ్వబోతున్నట్లు ఇలా హింటిచ్చిందనే రూమర్స్ స్ప్రెడ్ అయ్యాయి. దీంతో ఒకింత అయోమయం నెలకొంది. ఈ నేపథ్యంలో దీనిపై వివరణ ఇచ్చిన హిమజ.. తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో వీడియో పోస్ట్ చేస్తూ ఫుల్ క్లారిటీ ఇచ్చింది. ''నేనేదో నా పని నేను చేసుకుంటూ పోతుంటే నా పెళ్లి గురించి, నా డివోర్స్ గురించి చాలామంది లింక్స్ షేర్ చేస్తున్నారు. నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా నా పెళ్ళికి నన్ను పిలవండి ప్లీజ్. నా డివోర్స్‌కి కూడా నన్ను పిలవండి. అదేంటో ఈ మధ్య యూట్యూబ్‌లోనే పెళ్లిళ్లు, విడాకులు చేసేస్తున్నారు. సాధారణంగా నేనైతే ఇలాంటివి పట్టించుకోను. కానీ మా పేరెంట్స్‌ కాస్త సున్నితంగా ఉంటారు కదా. ఇలాంటి వార్తల వల్ల వాళ్లు ఎక్కువ బాధపడతారు. దయచేసి ఇలాంటి ఫేక్‌ న్యూస్‌లు ప్రచారం చేయకండి. 3-4 ఏళ్లలో తప్పకుండా పెళ్లి చేసుకోవాలనే ఆలోచన ఉంది. ఒకవేళ చేసుకుంటే అందరికి చెప్పి చాలా గ్రాండ్‌గా పెళ్లి చేసుకుంటా. మంచి సంబంధాలు ఉంటే కాస్త మీరు కూడా రిఫర్ చేయండి'' అంటూ తనపై వస్తున్న రూమర్స్‌కి చెక్ పెట్టింది హిమజ.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3KT7RLy
v

Pushpa: ఇది బాలీవుడ్ తారలకు చెంపపెట్టు! అల్లు అర్జున్‌పై సినీ క్రిటిక్ కామెంట్స్

బాలీవుడ్‌ సినీ క్రిటిక్‌గా గుర్తింపు పొందిన కమల్‌ ఆర్‌ ఖాన్‌ తరచూ వివాదస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలుస్తుంటారు. ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ రోల్ పోషిస్తూ బాలీవుడ్ తారలపై విరుచుకుపడుతుంటారు. ఈ నేపథ్యంలోనే తాజాగా బాలీవుడ్ తెరపై '' సినిమా కలెక్షన్స్, అల్లు అర్జున్ సత్తాను హైలైట్ చేస్తూ బాలీవుడ్ యాక్టర్స్‌పై తనదైన కోణంలో కామెంట్స్ చేశారు కమల్‌ ఆర్‌ ఖాన్‌. దీంతో ఆయన చేసిన ట్వీట్స్ వైరల్ అవుతున్నాయి. అల్లు అర్జున్- సుకుమార్ కాంబోలో రూపొందిన 'పుష్ప' సినిమా పలు రికార్డులు తిరగరాసింది. తెలుగు, హిందీతో పాటు పలు భాషల్లో ప్యాన్ ఇండియా సినిమాగా ప్రేక్షకుల ముందుకొచ్చి బాక్సాఫీస్ దుమ్ముదులిపింది. ఈ చిత్రంలో అల్లు అర్జున్, రష్మిక మందన నటనకు తోడు సమంత చేసిన ఐటెం సాంగ్ అన్ని వర్గాల ఆడియన్స్ నుంచి సూపర్ రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. సౌత్ ఇండియన్ తెరపై సత్తా చాటి ఓటీటీ వేదికపై బన్నీ అభిమానులను అలరిస్తున్న ఈ సినిమా బీటౌన్‌లో మాత్రం ఇంకా థియేటర్ రన్ కొనసాగిస్తూ కాసుల వర్షం కురిపిస్తోంది. ఈ నేపథ్యంలో 'పుష్ప' హిందీ వెర్షన్ 100 కోట్ల రూపాయల కలెక్షన్స్ రాబట్టిందని తెలుపుతూ బాలీవుడ్‌ సినీ క్రిటిక్‌ కమల్‌ ఆర్‌ ఖాన్‌ ట్వీట్ చేశారు. ఈ మేరకు బన్నీకి ప్రత్యేకంగా అభినందనలు తెలిపిన ఆయన.. బన్నీ నెలకొల్పిన ఈ రికార్డు బాలీవుడ్ సూపర్ స్టార్స్ అని చెప్పుకునే ఎంతో మందికి చెంపపెట్టు లాంటిదని పేర్కొన్నారు. బీటౌన్ స్టార్స్ స్ట్రెయిట్ సినిమాలు కేవలం 25 కోట్ల వసూళ్లు సాధించడానికి కూడా ఇబ్బంది పడుతుంటే ఓ తెలుగు డబ్బింగ్ చిత్రం 100 కోట్ల కలెక్షన్లను రాబట్టడం గ్రేట్ అచీవ్‌మెంట్ అని ఆయన పేర్కొన్నారు. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంతో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ముత్తంశెట్టి మీడియాతో కలిసి మైత్రి మూవీ మేకర్స్ గ్రాండ్‌గా నిర్మించింది. విడుదల తర్వాత ఈ సినిమాకు అంచనాలను మించిన రెస్పాన్స్ రావడంతో చిత్రయూనిట్ సంబరాలు చేసుకుంది. అతిత్వరలో పుష్ప రెండో భాగం సెట్స్ మీదకు రానుంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3o6wmuS
v

Salaar సర్‌ప్రైజింగ్ అనౌన్స్‌‌మెంట్.. ఆధ్య రోల్‌లో శృతి హాసన్

కమల్ హాసన్ కూతురుగా సినీ ఎంట్రీ ఇచ్చిన .. తమిళం, తెలుగు, హిందీ భాషా చిత్రాల్లో నటించి స్టార్ స్టేటస్ పట్టేసింది. త‌న‌కంటూ స్పెష‌ల్ ఫ్యాన్ ఫాలోయింగ్‌ క్రియేట్ చేసుకొని ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తోంది. నేడు (జ‌నవ‌రి 28) ఆమె పుట్టిన రోజు. ఈ సంద‌ర్భంగా ఆమెకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలుపుతూ సర్‌ప్రైజింగ్ అనౌన్స్‌‌మెంట్ ఇచ్చారు '' దర్శకుడు ప్రశాంత్ నీల్. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ సినిమా 'సలార్'. ఎంతో ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్ కేటాయించి హోంబలే ఫిల్మ్స్‌ సంస్థ ఈ 'సలార్' సినిమాను నిర్మిస్తోంది. ఈ చిత్రంలో ప్రభాస్ సరసన శృతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తోంది. గతేడాది శృతి పుట్టినరోజున ఆమెను సలార్ సెట్స్ మీదకు స్వాగతించిన డైరెక్టర్ ప్రశాంత్ నీల్.. తాజాగా ఈ చిత్రంలో శృతి క్యారెక్టర్ రివీల్ చేస్తూ కొత్త పోస్టర్ రిలీజ్ చేశారు. ఆధ్య రోల్‌లో శృతి నటిస్తోందని పేర్కొన్నారు. ఈ మూవీలో భారీ కాస్టింగ్ ఉండేలా నటీనటుల విషయంలో ప్రత్యేకంగా కేర్ తీసుకున్న డైరెక్టర్ ప్రశాంత్ నీల్.. కేజీఎఫ్ హీరోయిన్ శ్రీనిధి శెట్టితో ఓ స్పెషల్ సాంగ్ ప్లాన్ చేశారని సమాచారం. ఏప్రిల్ 14న ఈ చిత్రాన్ని విడుద‌ల చేయ‌బోతున్న‌ట్లు చిత్ర యూనిట్ ఇప్పటికే ప్రకటించేసింది. భారీ యాక్షన్ ఎపిసోడ్స్‌తో రాబోతున్న ఈ సినిమాపై రెబల్ స్టార్ ఫ్యాన్స్ ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు. ఇకపోతే కెరీర్ పరంగా దాదాపు మూడేళ్ళ గ్యాప్ తీసుకున్న శృతి హాసన్.. రీసెంట్‌గా వచ్చిన ''క్రాక్, వకీల్ సాబ్'' సినిమాలతో తిరిగి ట్రాక్ ఎక్కింది. స్టార్ హీరోలకు బెటర్ చాయిస్ అవుతూ వరుస సినిమాలకు కమిటవుతోంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3rZwm0J
v

కనీసం బెడ్‌పై నుంచి లేవలేని స్థితిలో ఉన్నా.. సింగర్ కౌసల్య పోస్ట్ వైరల్

సినీ ఇండస్ట్రీని కరోనా భయం వెంటాడుతూనే ఉంది. ఫస్ట్ వేవ్ నుంచి థర్డ్ వేవ్ వరకు పలువురు సినీ నటులు కరోనా బారిన పడ్డారు. ఈ మహమ్మారి వైరస్ కొంత మంది సినీ ప్రముఖులను మనకు దూరం చేసింది కూడా. ప్రస్తుతం కొనసాగుతున్న థర్డ్ వేవ్‌లో ఇటీవలే చిరంజీవి, శ్రీకాంత్ సహా పలువురు సినీ నటులకు కరోనా సోకి చికిత్స పొందుతుండగా.. తాజాగా ప్రముఖ కరోనా బారిన పడ్డారు. సోషల్ మీడియా వేదికగా స్వయంగా ఈ విషయాన్ని వెల్లడిస్తూ తన తాజా పరిస్థితిని తెలిపారు. ''కరోనా పరీక్షల్లో నాకు కొవిడ్ పాజిటివ్ అని నిర్ధార‌ణ అయింది. నాలో ఈ వైరస్ ల‌క్ష‌ణాలు తీవ్రంగానే ఉన్నాయి. రెండు రోజుల నుంచి జ్వరం వస్తోంది. ప్రస్తుతం క‌నీసం బెడ్‌పై నుంచి కూడా లేవ‌లేక‌పోతున్నాను. గొంతు నొప్పి మరింత ఇబ్బంది పెడుతోంది. నిన్న‌టి నుంచి మందులు తీసుకోవడం మొద‌లు పెట్టాను. త్వరలోనే పూర్తి ఆరోగ్యంతో మీ ముందుకు వస్తాను. ద‌య‌చేసి అంద‌రూ జాగ్ర‌త్త‌గా ఉండండి'' అని పేర్కొంది కౌసల్య. ఆమె పెట్టిన ఈ పోస్ట్ చూసి మీరు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాం అంటూ సినీ ప్రముఖులు, నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. థర్డ్ వేవ్‌లో కరోనా వైరస్ వీరవిహారం చేప్తోంది. ప్రస్తుతం దేశం మెత్తం మీద 22 లక్షలకు పైగా యాక్టివ్ కేసులు ఉండగా.. కర్ణాటక, మహారాష్ట్ర, కేరళలో 3 లక్షలకు పైగా యాక్టివ్ కేసులు ఉన్నట్లు గురువారం కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్, గుజరాత్, తమిళనాడు రాష్ట్రాల్లో లక్షకు పైగా యాక్టివ్ కేసులున్నాయి.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3u5YcLz
v

ATM దొంగతనం పక్కా.. హరీష్ శంకర్‌తో దిల్ రాజు పర్ఫెక్ట్ ప్లాన్

టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతుండటంతో క్రమంగా వెబ్ సిరీస్‌‌లకు ఆదరణ పెరుగుతోంది. కరోనా ఎఫెక్ట్ థియేటర్లపై పడటం వెబ్ సిరీస్‌‌లకు, ఓటీటీ వేదికలకు వరంగా మారింది. దీంతో బడా దర్శకనిర్మాతలు సైతం వెబ్ సిరీస్‌‌లు రూపొందించడానికి ఆసక్తి చూపుతున్నారు. ఈ క్రమంలోనే టాలీవుడ్ స్టార్ దర్శకనిర్మాతలు హరీష్ శంకర్- ఓ పర్ఫెక్ట్ ప్లాన్‌తో రంగంలోకి దిగుతున్నారు. ATM అనే పేరుతో క్రైమ్ వెబ్ సిరీస్‌కు శ్రీకారం చుట్టారు హరీష్ శంకర్- దిల్ రాజు. దీన్ని ప్రముఖ ఓటీటీ సంస్థ జీ5 లో స్ట్రీమ్ చేయడానికి ఒప్పందం కుదుర్చుకున్నారు. గతంలో ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’, ‘దువ్వాడ జగన్నాథం’ లాంటి సూపర్ హిట్ సినిమాలు అందించిన ఈ కాంబో ఈ సారి ATM అనే వెబ్ సిరీస్‌తో ఓటీటీ వేదికపై మ్యాజిక్ చేసేందుకు స్కెచ్చేశారు. త్వరలోనే ఈ వెబ్ సిరీస్‌ షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ మేరకు అధికారిక ప్రకటన ఇస్తూ కొత్త పోస్టర్ వదిలారు. ‘రాబరీ బిగిన్స్ సూన్’ (దోపిడీ త్వరలో మొదలు కాబోతుంది) అంటూ ఆ పోస్టర్‌పై రాసిన లైన్ ప్రేక్షకులను బాగా అట్రాక్ట్ చేస్తోంది. ఇకపోతే ఈ సినిమా ప్రమోషన్స్ విషయమై ఇప్పటినుంచే కేర్ తీసుకుంటున్న .. 'దొంగతనం పక్కా' అంటూ చాలా డిఫరెంట్ వేలో ఈ వెబ్ సిరీస్ అనౌన్స్ చేశారు. దిల్ రాజు, హరీశ్ శంకర్, హర్షిత్ రెడ్డి, హన్షితా రెడ్డి సంయుక్త నిర్మాణంలో రూపొందనున్న ఈ వెబ్ సిరీస్‌కి చంద్ర మోహన్ దర్శకత్వం వహించనున్నారు. హైదరాబాద్ నగరంలో జరిగిన అతిపెద్ద దొంగతనం నేపథ్యంలో ఈ సినిమా కథ ఉండనుందట. నటీనటులు, ఇతర వివరాలను అతిత్వరలో ప్రకటించనున్నారు మేకర్స్.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3IQ74cx
v

పబ్‌లో హీరోయిన్‌తో ఆర్జీవీ! ఆ వీడియోలతో మరోసారి చర్చల్లో నిలిచిన కాంట్రవర్సీ కింగ్

అనుకున్నది చేస్తా.. అనిపించింది మాట్లాడతా అనే నైజం రామ్ గోపాల్ వర్మది అని ఇప్పటికే పలుసార్లు ప్రూవ్ అయింది. అందుకే ప్రతి క్షణం ఆయన పేరు జనం నోళ్ళలో నానుతూ ఉంటుంది. ముఖ్యంగా అమ్మాయిలతో మెదిలే తీరు నిత్యం చర్చల్లో నిలుస్తుంది. లేడీ యాంకర్‌తో ఇంటర్వ్యూ అంటే వర్మ ఎలాంటి బోల్డ్ కామెంట్స్ చేస్తారా? అని పనికట్టుకు చూసేవాళ్ళు చాలామందే ఉన్నారు. ఈ క్రమంలోనే రీసెంట్‌గా అరియానా, అషు రెడ్డి ఇంటర్వ్యూలు ఎంతలా వైరల్ అయ్యాయో మనందరికీ తెలుసు. ఇక వర్మ లోని మరో కోణం హీరోయిన్లతో కలిసి చిందులేస్తూ ఎంజాయ్ చేయడం. గతంలో చాలాసార్లు ఇలాంటి వీడియోలు బయటకొచ్చి హాట్ టాపిక్ అయ్యాయి. తాజాగా మరోసారి అదే జరిగింది. పబ్‌లో అమ్మాయిలతో చిందులేస్తున్న వీడియోని స్వయంగా తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసి వార్తల్లో నిలిచారు . ఈ వీడియోలో హీరోయిన్ ఇనయా సుల్తానాతో కలిసి ఎంజాయ్ చేస్తూ కనిపించారు ఆర్జీవీ. ఇద్దరూ సిగరెట్ తాగుతూ సన్నిహితంగా కనిపించడంతో ఈ వీడియో క్షణాల్లో వైరల్ అయింది. ఒక చేతిలో మందు బాటిల్ పట్టుకున్న వర్మ.. మరో చేతితో అమ్మాయిని ఘాడంగా హత్తుకుని ముద్దు పెట్టుకోవడం కనిపిస్తోంది. దీంతో ఈ వీడియో చూసిన నెటిజన్లు మిశ్రమంగా స్పందిస్తున్నారు. అనుభవించు రాజా, బతికితే నీలానే బతకాలి బాసూ అని కొందరు కామెంట్స్ చేస్తుండగా.. ఏంటి వర్మ మాకీ ఖర్మ అంటూ ఆర్జీవీపై ఇంకొందరు విరుచుకుపడుతున్నారు. అయితే జీవితాన్ని అనుభవించడం కూడా ఒక కళే అన్నట్లుగా ఇలాంటి వీడియోలు పబ్లిక్‌గా వదులుతుండటం వర్మ వ్యక్తిత్వానికి అద్దం పడుతోంది. గతంలో కూడా ఇలాంటి వీడియోలతో వర్మపై ట్రోల్ జరగగా.. ఇద్దరు వ్యక్తులు పార్టీ ఎంజాయ్ చేస్తుంటే మూడో వాడికి ఏం సంబంధం? ఆ ఇద్దరికీ లేని ఇబ్బంది ఈ మూడో వాడికి ఏంటి? అంటూ చురకలంటించారు వర్మ. తాను అమ్మాయి అందాన్ని విపరీతంగా ఆరాధిస్తానని ఓపెన్ అయ్యారు. తాను స్వేచ్ఛగా ఉంటానని, లీగల్‌గా ఎలాంటి తప్పు చేయను. అలాగని సమాజం ఏదో అనుకుంటుందని తాను అస్సలు పట్టించుకోనని వర్మ చెప్పారు. అదే బాటలో వెళ్తూ లైఫ్ ఎంజాయ్ చేస్తున్నారు. ఎంతైనా వర్మ రూటే సపరేటు లెండి!.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3HaiEi8
v

Thursday 27 January 2022

రామ్ గోపాల్ వర్మ మోసాన్ని బయటపెట్టిన మహేశ్వరి.. అర్ధరాత్రి వేళ ధైర్యం చేశా కానీ!!

దాదాపు 20 ఏళ్ల క్రితం వెండితెరపై కొత్త టేస్ట్ చూపించింది హీరోయిన్ మహేశ్వరి. సిల్వర్ స్క్రీన్ మీద ఆమెను చూసి ఆ నాటి కుర్రకారు ఊగిపోయింది. చేసింది తక్కువ సినిమాలే అయినా నేటికీ మహేశ్వరికి ఉన్న క్రేజే వేరు. శ్రీదేవి బంధువుగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన మహేశ్వరి.. తెలుగుతో పాటు తమిళ, కన్నడ భాషల్లో సినిమాలు చేసి తన అందం, అభినయంతో ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకుంది. పేరు వినగానే తెలుగు ప్రేక్షకులకు గుర్తొచ్చే సినిమాలు ''గులాబి, పెళ్లి''. ఈ రెండు సినిమాలు ఆమె కెరీర్‌లో ఓ మైలురాయిగా నిలిచాయి. కాగా తాజాగా మహేశ్వరి తన సినీ కెరీర్‌లో ఎదుర్కొన్న అనుభవాలు చెబుతూ ఆర్జీవీపై చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఆలీతో సరదాగా ముచ్చట్లు పెడుతూ పలు కీలక విషయాలపై ఓపెన్ అయింది మహేశ్వరి. అప్పట్లో సినిమాలతో బిజీ బిజీగా గడిపిన తాను ప్రస్తుతం ఏమీ చేయడంలేదని, డాగ్ రిస్క్యూ, యానిమల్ రిస్క్యూ, వీధికుక్కల అడాప్షన్ లాంటివి చేస్తున్నానని చెప్పింది. అమల గారి స్పూర్తితో ఈ కార్యక్రమాలు చేస్తున్నానని తెలిపింది. ఇకపోతే ఆ నాటి కెరీర్ విషయాలు కూడా చెబుతూ తనను ఎలా మోసం చేశారనే విషయాన్ని బయటపెట్టింది. రామ్ గోపాల్ వర్మ నిర్మాణంలో కృష్ణవంశీ దర్శకత్వంలో చేసిన ‘గులాబి’ తనకు సరికొత్త ఇమేజ్ తీసుకొచ్చిందని మహేశ్వరి చెప్పింది. హీరోను అల్లరి పెట్టే అమ్మాయి పాత్రలో నటించిన తాను ఈ సినిమాకు తొలిసారి డబ్బింగ్ చెప్పుకున్నానని తెలిపింది. అరుకులో 'గులాబి' సినిమాలోని మేఘాలలో తేలిపోతూ సాంగ్ చేస్తున్నపుడు బైక్ స్కిడ్ అయి లోయలో పడ్డామని, అదృష్ణవశాత్తు బయటపడ్డాం కానీ చాలా భయమేసిందని చెప్పింది. సినీ ఇండస్ట్రీలో తనకు మీనా, సంగీత బెస్ట్ ఫ్రెండ్స్ అని పేర్కొంది. పనిలో పనిగా అప్పట్లో ఓ పెద్దాయన మీకు 50 వేలు ఇవ్వాల్సి ఉండగా ఇవ్వలేదట నిజమేనా? అని ఆలీ అడగడంతో మహేశ్వరి అసలు విషయం చెప్పేసింది. ఆయన ఎవరో కాదు రామ్ గోపాల్ వర్మ అని చెబుతూ అప్పట్లో జేడీ చక్రవర్తి హీరోగా ‘దెయ్యం’ సినిమా షూటింగ్ సమయంలో ఓ ఛాలెంజ్ చేసి వర్మ తనకు బాకీ పడ్డారని చెప్పింది. ఆ సినిమా షూటింగ్ మేడ్చల్‌లో ఉన్న ఓ ఫామ్ హౌస్‌లో షూట్ చేశామని, లొకేషన్ కాస్త భయంకరంగా ఉండేదని తెలుపుతూ సీక్రెట్ బయటపెట్టింది. ఆ ఫామ్ హౌస్ మెయిన్ రోడ్డు నుంచి 2 కిలోమీటర్ల దూరంలో ఉండేదని చెప్పిన మహేశ్వరి.. ఓ రోజు అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో షూటింగ్ జరుగుతుండగా ఆర్జీవీ సరదాగా ఓ ఛాలెంజ్ చేశారని, ఎవరైనా ఈ సమయంలో మెయిన్ రోడ్ వరకు వెళ్లి వస్తే 50 వేలు ఇస్తా అనడంతో తాను మాత్రమే ధైర్యం చేసి ఎంత భయమేసినా మెయిన్ రోడ్డుకి వెళ్లి వచ్చానని చెప్పింది. కానీ వర్మ మాత్రం ఆ డబ్బులు ఇప్పటికీ ఇవ్వలేదని, ఇది చాలా అన్యాయమని అనేసింది. అలా తనను ఆర్జీవీ మోసం చేశారంటూ సరదాగా చెప్పుకొచ్చింది మహేశ్వరి.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3H1Qgyy
v

నాగ చైతన్య ‘థాంక్యూ’ కోసం మైనస్ టెంపరేచ‌ర్‌లో రాశీ ఖన్నా!

అక్కినేని నాగచైతన్య, మైనస్ డిగ్రీల టెంపరేచర్‌లో క‌ష్ట‌ప‌డుతున్నారు. ఇంత‌కీ అంత ఎముక‌లు కొరికే చ‌లిలో నాగ చైత‌న్య‌, రాశీఖ‌న్నా ఏం చేస్తున్నార‌నే సందేహం రాక మాన‌దు. ఏం చేస్తారండి బాబూ.. సినిమా షూటింగ్‌ను అనుకున్న స‌మ‌యంలో పూర్తి చేయ‌డానికి నానా ఇబ్బందులు ప‌డుతున్నారు. త‌ప్ప‌దు క‌దా.. మ‌రి సినిమా కోసం. నాగ చైత‌న్య హీరోగా విక్ర‌మ్ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం ‘’. రాశీ ఖన్నా, అవికా గోర్‌, మాళ‌వికా నాయ‌ర్ హీరోయిన్స్‌గా న‌టిస్తున్నారు. ఈ సినిమా రెండు వారాల చిత్రీక‌ర‌ణ మిగిలి ఉంది. ఈ చిత్రీక‌ర‌ణ కోసం నాగ చైత‌న్య, రాశీ ఖ‌న్నా అండ్ టీమ్‌.. ర‌ష్యాలోని మాస్కోకు చేరుకున్నారు. ఇప్పుడు అక్క‌డ టెంప‌రేచ‌ర్ -14 డిగ్రీలు ఉంద‌ట‌. ఈ చ‌లిలో షూటింగ్‌ను జ‌రుపుకుతున్నారు. ఇంత‌కు ముందు షెడ్యూల్‌ చిత్రీక‌ర‌ణ ఇట‌లీలో జ‌రిగింది. ఆ షెడ్యూల్‌కి కొన‌సాగింపుగానే థాంక్యూ ఇప్పుడు ర‌ష్యాలో చిత్రీక‌ర‌ణ‌ను జ‌రుపుకుంటోంది. మైన‌స్ డిగ్రీల టెంప‌రేచ‌ర్‌లో చిత్రీక‌ర‌ణ జ‌రుపుతున్నామ‌ని రాశీఖ‌న్నా ఫొటోను షేర్ చేయ‌డం ద్వారా తెలియ‌జేసింది. బీవీఎస్ ర‌వి అందించిన క‌థ‌తో విక్ర‌మ్ కుమార్ ఈ సినిమాను తెర‌కెక్కిస్తున్నారు. దిల్ రాజు, శిరీష్ క‌లిసి శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌లో సినిమాను నిర్మిస్తున్నారు. ఈ ఏడాది వేస‌విలో సినిమాను విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రంలో నాగ చైత‌న్య మూడు వేరియేష‌న్స్‌తో.. మూడు లుక్స్‌లో క‌నిపించ‌బోతున్నారు. గత ఏడాది లవ్ స్టోరితో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన నాగ చైతన్య.. ఈ ఏడాది సంక్రాంతికి విడుదలైన బంగార్రాజుతో మరో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు. ఇప్పుడు థాంక్యూ సినిమాతో నెక్ట్స్ రేంజ్ హిట్ అందుకోవాలని అక్కినేని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. దీని తర్వాత.. డిజిటల్ మాధ్యమంలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు. విక్రమ్ కుమార్ దర్శతక్వంలోనే, హారర్ వెబ్ సిరీస్‌లో యాక్ట్ చేయబోతున్నారు. త్వరలోనే దీనికి సంబంధించిన ప్రకటన వెలువడుతుందని వార్తలు నెట్టింట వైరల్ వినిపిస్తున్నాయి.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3IEy2Uj
v

ఇండస్ట్రీ పెద్దరికం.. ఏపీలో టికెట్ రేట్స్‌పై దిల్ రాజు వ్యాఖ్యలు...!

చాలా రోజులుగా తెలుగు ఇండ‌స్ట్రీలో వైర‌ల్ అవుతున్న ప్ర‌శ్న సినీ ఇండ‌స్ట్రీలో దాసరి నారాయ‌ణ‌రావు స్థానాన్ని భ‌ర్తీ చేయ‌బోయే వ్య‌క్తి ఎవ‌రు?. దీనిపై ఇప్ప‌టికే పలు మార్లు ప‌లువురు డిబేట్స్‌లో, ఇంట‌ర్వ్యూస్‌లో త‌మ త‌మ అభిప్రాయాల‌ను తెలిపారు. ఒకానొక సంద‌ర్భంలో ఇటు చిరంజీవి, అటు మోహ‌న్ బాబు ఎవ‌రు ఇండ‌స్ట్రీ పెద్ద‌గా ఉంటారు? అనే దానిపై కూడా తెలియ‌ని యుద్ధ‌మే న‌డిచింద‌నాలి. చివ‌ర‌కు ఓ రోజున తాను ఇండ‌స్ట్రీకి పెద్ద‌గా ఉండ‌న‌ని, కావాల్సి వ‌స్తే.. ఇండ‌స్ట్రీ బిడ్డ‌గా సినీ పరిశ్ర‌మ‌లో ఏదైనా స‌మ‌స్య ఉంటే త‌న వంతు సాయాన్ని అందించడానికి ఎప్పుడూ ముందు ఉంటాన‌ని చెప్పేశారు. అదే రోజున మోహ‌న్‌బాబు ఇండ‌స్ట్రీ అంటే న‌లుగురు వ్య‌క్తులు కార‌ని.. అంద‌రూ క‌లిసి ముందుకు వెళ్తేనే సినీ ప‌రిశ్ర‌మలోని స‌మ‌స్య‌లు తీరుతాయ‌ని లెటర్‌ను త‌న సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేయ‌డం అప్ప‌ట్లో టాక్ ఆఫ్ ది ఇండ‌స్ట్రీగా మారింది. ఇప్పుడు రీసెంట్‌గా తెలుగు చిత్ర సీమ అగ్ర నిర్మాత‌ల్లో ఒక‌రైన దిల్‌రాజుని ఇండ‌స్ట్రీ పెద్ద‌గా ఎవ‌రు ఉంటారు చిరంజీవిగారు ఉండే అవ‌కాశం ఉందా? ఏపీలో టికెట్ రేట్స్ గురించి మీరేమంటారు అంటూ ప్ర‌శ్నిస్తే.. బదులిస్తూ ‘‘టికెట్ రేట్స్ వ్య‌వ‌హారంలో ఒక్కొక్క‌రి వాదన ఒక్కోలా ఉంది. ప్ర‌భుత్వం, సినిమా దానికి సంబంధించిన టికెట్ రేట్స్ అనేది ఒక‌దానికొక‌టి ముడిప‌డిన అంశాలు. ప్రారంభం నుంచి సినిమాకు సంబంధించిన టికెట్ రేట్స్‌పై ప్ర‌భుత్వ‌మే నిర్ణ‌యం తీసుకుంటూ వ‌చ్చింది. ఒక‌వేళ ప్ర‌భుత్వం రేట్స్ పెంచుకుంటే కోర్టుకు వెళ్లి రేట్స్ పెంచుకుని వ‌చ్చే వాళ్లం. కోర్టుకు వెళ్లినా, కోర్టు ప్ర‌భుత్వానికి ఆదేశాల‌ను మ‌ళ్లీ జారీ చేస్తుంది. మ‌ళ్లీ ప్ర‌భుత్వం ఓ క‌మిటీనో ఏదో ఒక‌దాన్ని ఏర్పాటు చేస్తుంది. ఇదంతా సైకిల్‌లా న‌డించింది. దాస‌రి నారాయ‌ణ‌రావుగారు ప్రాబ్లెమ్ ఏదైనా వ‌స్తే.. నేరుగా ఫోన్ చేసి మాట్లాడేసేవారు. అలాగ‌ని ఆయన ఇప్పుడు ఈ స‌మ‌స్య‌లు లేవా? అంటే ఉన్నాయి. రాష్ట్రం విడిపోక ముందు ఒకే ప్ర‌భుత్వం ఉండింది. ఉమ్మ‌డి రాష్ట్రంలో స‌మ‌స్య ఉన్నా కాస్త ఈజీగా ఉండేది. కానీ ఇప్పుడు రెండు రాష్ట్రాలు అయ్యాయి. ఇండ‌స్ట్రీ పెద్ద‌గా ఉండ‌టం అనేది వారి వారి వ్య‌క్తిగ‌తం... వారి ఇష్టానికి సంబంధించిన వ్య‌వ‌హారం. ఇండ‌స్ట్రీ త‌ర‌పున అడిగిన‌ప్పుడ‌ల్లా చిరంజీవిగారు ముందుకు వ‌చ్చి త‌న వంతు ప్ర‌య‌త్నం చేస్తూనే ఉన్నారు. క‌రోనా మొద‌టి వేవ్ స‌మ‌యంలో సీసీసీ స్టార్ట్ చేసి కార్మికుల‌కు స‌పోర్ట్ చేశారు. బాధ్య‌త తీసుకోవ‌డం తీసుకోక‌పోవ‌డం అనేది ఇంట్రెస్ట్ మీద ఆధార‌ప‌డి ఉంటుంది. ఇప్పుడు చిరంజీవిగారు ఇంట్రెస్ట్‌గా ముందుకొచ్చి చేస్తున్నారుగా’’ అంటూ టికెట్ రేట్స్‌, ఇండ‌స్ట్రీ పెద్ద‌రికంపై మాట్లాడారు. టాలీవుడ్ నిర్మాత‌గా త‌న జ‌ర్నీని స్టార్ట్ చేసిన దిల్ రాజు ఇప్పుడు టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్‌లోనూ సినిమాలు చేస్తున్నారు. పాన్ ఇండియా సినిమాల‌ను చేస్తున్నారు. డిస్ట్రిబ్యూట‌ర్‌గా, ఎగ్జిబిట‌ర్‌గానూ బాధ్య‌త‌ల‌ను నిర్వ‌హిస్తున్నారు. రామ్ చ‌ర‌ణ్‌, శంక‌ర్ కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న పాన్ ఇండియా సినిమాకు దిల్‌రాజు, శిరీష్ నిర్మాత‌లుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3G75MYy
v

ఫొటో షేర్ చేసిన ఉపాస‌న కొణిదెల .. మెగా కోడ‌లిపై ఫైర్ అవుతున్న నెటిజ‌న్స్‌!

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ స‌తీమ‌ణి ఉపాస‌న కొణిదెల గురించి తెలుగు వారికి ప్ర‌త్యేక‌మైన ప‌రిచయం అక్క‌ర్లేదు. అపోలో హాస్పిట‌ల్స్ బాధ్య‌త‌ల్లో త‌న వంతు బాధ్య‌త‌ల‌ను ఉపాస‌న కొణిదెల నిర్వ‌హిస్తున్నారు. అలాగే సోష‌ల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారు. సినిమా రంగంతో ట‌చ్ లేక‌పోయినా సినీ సెల‌బ్రిటీలతో ఉపాస‌న‌కు మంచి అనుబంధ‌మే ఉంది. ఫిట్‌నెస్‌కు సంబంధించిన మ్యాగ‌జైన్‌ను నిర్వ‌హిస్తూ సినీ సెల‌బ్రిటీస్ అయిన స‌మంత‌, ర‌కుల్ వంటి వారితో ప్ర‌త్యేక‌మైన వీడియో ప్రోగ్రామ్స్ కూడా చేయించారు ఉపాస‌న కొణిదెల‌. త‌న‌కు న‌చ్చిన ఫొటోలు, వీడియోల‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసే ఉపాస‌న కొణిదెల గుడి గోపురం పోస్ట్‌ను షేర్ చేశారు. సాధార‌ణంగా గుడి గోపురాల‌పై దేవుళ్ల ఫొటోలు మాత్ర‌మే ఉంటాయి. కానీ ఉపాస‌న షేర్ చేసిన గోపురం పోస్ట్‌లో సినీ తార‌ల బొమ్మ‌లున్నాయి. ఇండియ‌న్ సినిమాకు సంబంధించిన తార‌లంద‌రూ ఆ గుడిగోపురంపై ఉన్నారని, తాను, రామ్ చ‌ర‌ణ్ కూడా అందులో కనిపిస్తామ‌ని, శోభ‌నా కామినేని త‌న‌కు ఈ ఫొటోను ఇచ్చార‌ని, గుడి గోపురం ఫొటోను రూపొందిన వ్య‌క్తిని తాను అభినందిస్తున్నాన‌ని ఉపాస‌న పోస్ట్‌తో పాటు కామెంట్స్ కూడా షేర్ చేశారు. అయితే ఈ పోస్ట‌ర్‌పై నెటిజ‌న్స్ ఉపాస‌న‌పై విమ‌ర్శ‌లు చేస్తున్నారు. ఇలాంటి పోస్టుల‌ను షేర్ చేయ‌డం వ‌ల్ల మీ గౌర‌వం త‌గ్గిపోతుందే త‌ప్ప పెర‌గ‌దని, హిందు దేవుళ్ల‌పై మీకు ఉన్న గౌర‌వం అర్థ‌మ‌వుతుందంటూ కామెంట్స్ పెట్టారు. నెగిటివ్ కామెంట్స్ వ‌చ్చినా ఉపాస‌న ఫొటోను డిలీట్ చేయ‌లేదు. ఇక ఉపాస‌న భ‌ర్త‌, హీరో రామ్ చ‌ర‌ణ్ వ‌రుస సినిమాల‌తో సంద‌డి చేయ‌డానికి రెడీ అవుతున్నారు. ఇప్ప‌టికే ఆర్ఆర్ఆర్, ఆచార్య సినిమాలు విడుద‌ల‌కు సిద్ధంగా ఉన్నాయి. ఈ రెండు సినిమాలు మ‌ల్టీస్టార‌ర్ సినిమాలే. ఇక శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో రామ్ చ‌ర‌ణ్ మ‌రో పాన్ ఇండియా మూవీలో న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఇది వ‌చ్చే ఏడాది సంక్రాంతికి విడుద‌ల కానుంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3u0XkI8
v

Wednesday 26 January 2022

RRRలో అల్లూరి పాత్ర చేయాల్సి వ‌స్తే.. ఎన్టీఆర్ ఏం చెప్పారో తెలుసా?

ఎంటైర్ ఇండియ‌న్ సినీ ఇండ‌స్ట్రీ ఆతృత‌గా ఎదురుచూస్తోన్న పాన్ ఇండియా మూవీ RRR. టాలీవుడ్ టాప్ స్టార్స్ అయిన యంగ్ టైగర్ ఎన్టీఆర్‌.. మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ హీరోలుగా ద‌ర్శ‌క ధీరుడు రాజ‌మౌళి తెర‌కెక్కించిన ఈ సినిమా సంక్రాంతి సంద‌ర్భంగా జ‌న‌వ‌రి 7న విడుద‌ల కావాల్సింది. కానీ క‌రోనా ప్ర‌భావంతో మార్చి 18న లేదా ఏప్రిల్ 28కి వాయిదా ప‌డింది. ఇందులో తెలంగాణ ప్రాంతానికి చెందిన గోండు వీరుడు కొమురం భీమ్‌గా ఎన్టీఆర్‌.. ఆంధ్ర ప్రాంతానికి చెందిన మ‌న్యం వీరుడు అల్లూరి సీతారామ‌రాజుగా రామ్ చ‌ర‌ణ్ క‌నిపించున్న సంగ‌తి తెలిసిందే. RRRకు సంబంధించి ఓ ఇంట‌ర్వ్యూలో రామ్ చ‌ర‌ణ్ చేసిన అల్లూరి సీతారామ‌రాజు పాత్ర‌ గురించి మాట్లాడుతూ, ‘‘నాకు రామ‌రాజు పాత్రను ట్రైల‌ర్‌లో చూస్తే.. నిప్పుల మ‌ధ్య నుంచి దూకుతూ బాణం సంధించే స‌న్నివేశం బాగా న‌చ్చింది. ఎంత బాగా అంటే ఆ ప‌ర్టికుల‌ర్ స‌న్నివేశంలో నేను న‌టించాల‌నంతేగా. ఆ స‌న్నివేశంలో బ్యాగ్రౌండ్ స్కోర్‌, ట్రైల‌ర్‌లో ఆ స‌న్నివేశాన్ని చూపించిన సంద‌ర్భం కావ‌చ్చు’’ అన్నారు సినిమాలోని ఇన్‌టెన్సిటీని స‌ద‌రు స‌న్నివేశం చెప్పేస్తుందంటూ ఎన్టీఆర్ రామరాజు పాత్ర గురించి మాట్లాడారు. 1920 బ్యాక్ డ్రాప్‌తో సాగే RRR సినిమా ఫిక్ష‌న‌ల్ పీరియాడిక్ మూవీ. చ‌రిత్ర‌లో ఎన్న‌డూ క‌లుసుకోని ఇద్ద‌రు యోధులు క‌లుసుకుని బ్రిటీష్ వారిపై పోరాటం చేస్తే ఎలా ఉంటుంద‌నేదే ఈ సినిమా. ఎన్టీఆర్‌, చ‌ర‌ణ్‌ల‌తో పాటు ఆలియా భ‌ట్‌, అజ‌య్ దేవ‌గ‌ణ్ వంటి బాలీవుడ్ స్టార్స్‌.. ఒలివియా మోరిస్‌, రే స్టీవెన్ స‌న్‌, అలిస‌న్ డూడి వంటి హాలీవుడ్ స్టార్స్ న‌టించారు. డివివి ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్‌పై డివివి దాన‌య్య ఈ చిత్రాన్ని దాదాపు ఆరు వంద‌ల కోట్లకు పైగా బ‌డ్జెట్‌తో నిర్మించారు. బాహుబ‌లి త‌ర్వాత రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన చిత్రం కావ‌డంతో RRRపై భారీ అంచ‌నాలున్నాయి.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3u9xZvP
v

క్రికెట్ పాఠాలు నేర్చుకుంటున్న జాన్వీ కపూర్!

దివంగ‌త అందాల న‌టి శ్రీదేవి త‌న‌య జాన్వీ క‌పూర్‌.. ‘ధడక్’ చిత్రంతో సినీ రంగ ప్ర‌వేశం చేశారు. తొలి చిత్రంతోనే న‌టిగా మంచి గుర్తింపు సంపాదించుకున్న జాన్వీ క‌పూర్ త‌ర్వాత ‘గుంజ‌న్ స‌క్సేనా - ది కార్గిల్ గ‌ర్ల్‌’ సినిమాతో ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. ప్రస్తుతం జాన్వీ క‌పూర్ న‌టించిన‌ మిలి, గుడ్ ల‌క్ జెర్రీ చిత్రాలు విడుద‌ల‌కు సిద్ధమ‌వుతున్నాయి. మ‌రో వైపు దోస్తానా 2 చిత్రం సెట్స్‌పై ఉంది. వీట‌న్నింటికీ డిఫ‌రెంట్‌గా స్పోర్ట్స్ మూవీలో ఇప్పుడు జాన్వీ క‌పూర్ న‌టించ‌డానికి సిద్ధ‌మ‌య్యారు. ఆ చిత్ర‌మే ‘’. ‘మిస్టర్ అండ్ మిసెస్ మహి’ చిత్రం క్రికెట్ బ్యాక్ డ్రాప్‌లో తెర‌కెక్క‌బోతున్న చిత్రం.కాబ‌ట్టి ఆషామాషీగా తీసుకోకుండా ఈ సినిమాకు సంబంధించిన జాన్వీ క‌పూర్ స‌న్న‌ద్ధ‌మ‌వుతున్నారు. ఇందులో రాజ్ కుమార్ రావు కూడా న‌టిస్తున్నారు. దీనికి సంబంధించి క్రికెట్ ఆట‌ను ప్ర‌త్యేకంగా నేర్చుకుంటున్నారు జాన్వీ క‌పూర్‌. ప్ర‌ముఖ క్రికెట‌ర్ వీరికి క్రికెట్‌కు సంబంధించిన పాఠాల‌ను నేర్పిస్తున్నారు. దీనికి సంబంధించిన ఫొటోల‌ను క్రికెట్ క్యాంప్ ఎట్ మిస్ట‌ర్ అండ్ మిసెస్ మ‌హి అంటూ జాన్వీ త‌న సోష‌ల్ మీడియాలో షేర్ చేశారు. అందులో చిత్ర యూనిట్ స‌భ్యులు, దినేష్ కార్తీక్ క‌నిపిస్తున్నారు. కొన్ని ఫొటోల్లో జాన్వీ క‌పూర్ క్రికెట్ ఆడుతుండ‌టాన్ని కూడా మ‌నం గ‌మ‌నించ‌వ‌చ్చు. ‘మిస్టర్ అండ్ మిసెస్ మహి’ చిత్రానికి శ‌ర్మ‌న్ శ‌ర్మ డైరెక్ట‌ర్‌. అక్టోబ‌ర్ 7న మూవీ రిలీజ్ అవుతుంది. సినిమాల‌తో పాటు జాన్వీ క‌పూర్ సోష‌ల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటుంటారు. ఆమె జిమ్ ఫొటోలు, డాన్సింగ్ వీడియోల‌ను షేర్ చేస్తూ అభిమానుల‌ను అల‌రిస్తుంటారు. ఇప్పుడిప్పుడే హీరోయిన్‌గా ఎదుగుతున్న జాన్వీ క‌పూర్ సౌత్ ఇండ‌స్ట్రీలోకి ఎప్పుడు ఎంట్రీ ఇస్తారా? అని ఇక్క‌డి వారు కూడా ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3491kLJ
v

మ‌హేష్ సినిమాలో ‘భీమ్లా నాయక్’ బ్యూటీ..!

సూప‌ర్ స్టార్ మ‌హేష్ ప్ర‌స్తుతం ‘స‌ర్కారు వారి పాట‌’ సినిమాను పూర్తి చేసే పనిలో ఉన్నారు. సినిమా ఫైన‌ల్ స్టేజ్‌కు చేరుకుంది. ఈ సినిమా ఏప్రిల్ 1న విడుద‌ల‌వుతుంద‌ని చిత్ర యూనిట్ ప్ర‌క‌టించిన‌ప్ప‌టికీ తాజా స‌మాచారం మేర‌కు మ‌రింత ఆల‌స్య‌మ‌య్యే అవ‌కాశాలున్నాయ‌ని, స‌మ‌ర్మ్‌కి పోస్ట్ పోన్ కావ‌చ్చున‌నే వార్త‌లు హ‌ల్ చ‌ల్ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా పూర్త‌యిన వెంట‌నే మ‌హేష్‌.. త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ ద‌ర్శ‌క‌త్వంలో సినిమా చేయ‌డానికి రెడీ అయిపోతారు. ఇప్ప‌టికే వెయిటింగ్‌లో ఉన్న ఫ్యాన్స్ కోసం వీలైనంత త్వ‌ర‌గా సినిమాలు పూర్తి చేయ‌డానికి త్రివిక్ర‌మ్ మూవీని ట్రాక్ ఎక్కించే ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయి. మ‌హేష్ - త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్‌లో రూపొంద‌బోయే చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. ఇందులో పూజా హెగ్డే పేరు హీరోయిన్‌గా వినిపిస్తోంది. ఈమెతో పాటు స‌మంత పేరు కూడా ప్ర‌ముఖంగా వినిపిస్తోంది. అలాగే ఇప్పుడు లిస్టులో మ‌రో హీరోయిన్ పేరు కూడా యాడ్ అయ్యింద‌ని టాక్‌. ఆమె ఎవ‌రో కాదు.. మ‌ల‌యాళ బ్యూటీ సంయుక్తా మీన‌న్‌. ఈ అమ్మ‌డు ‘భీమ్లా నాయక్’ ద్వారా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తోంది. అందులో రానా ద‌గ్గుబాటి స‌ర‌స‌న నటిస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఇప్పుడు మ‌హేష్ మ‌ర‌ద‌లి పాత్ర‌లో క‌నిపించ‌నుందంటూ వార్త‌లు వినిపిస్తున్నాయి. మ‌రి ఈ వార్త‌ల్లో నిజా నిజాలు తెలియాలంటే కొన్నిరోజులు ఆగాల్సిందే. అత‌డు, జ‌లేజా చిత్రాల త‌ర్వాత మ‌హేష్‌, త్రివిక్ర‌మ్ క‌ల‌యిక‌లో రూపొందుతోన్న చిత్ర‌మిది. హారిక అండ్ హాసిని క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై సూర్య‌దేవ‌ర నాగ‌వంశీ రాధాకృష్ణ అలియాస్ చిన‌బాబు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా త‌ర్వాత‌నే రాజ‌మౌళితో మ‌హేష్ సినిమా ఉంటుంది. నిజానికి స‌ర్కారు వారి పాట త‌ర్వాత‌నే రాజ‌మౌళి సినిమా ఉంటుంద‌ని భావించినా, ట్రిపుల్ ఆర్ వాయిదా ప‌డ‌టంతో నెక్ట్స్ మూవీకి జ‌క్క‌న్న స‌మ‌యం తీసుకున్నార‌ట‌. దీంతో ఆ గ్యాప్‌లో త్రివిక్ర‌మ్ సినిమాను పూర్తి చేయాల‌నేది మ‌హేష్ ప్లాన్‌గా క‌నిపిస్తోంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3FYK5tO
v

రామ్ చ‌ర‌ణ్‌తో కీర్తి సురేష్ నాటు నాటు స్టెప్.. వీడియో వైరల్!

ఎన్టీఆర్‌, రామ్ చ‌ర‌ణ్ క‌లిసి న‌టించిన పాన్ ఇండియా మూవీ RRR. కోవిడ్ కార‌ణంగా సంక్రాంతికి విడుద‌ల కావాల్సిన ఈ చిత్రం వాయిదా ప‌డిన సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాలో ప్ర‌తి ప్రోమో, టీజ‌ర్‌, ట్రైల‌ర్, సాంగ్స్ ఆడియెన్స్‌కు బాగా న‌చ్చాయి. ముఖ్యంగా ఎన్టీఆర్‌, రామ్ చ‌ర‌ణ్ క‌లిసి స్టెప్పులేసిన ‘నాటు నాటు.. ’ సాంగ్‌కి అమేజింగ్ రెస్పాన్స్ వ‌చ్చింది. ఇందులో తార‌క్ - చ‌ర‌ణ్ క‌లిసి చేసిన స్టెప్పుల‌ను అంద‌రూ వేసి ఆ వీడియోల‌ను సోష‌ల్ మీడియాలో షేర్ చేసుకున్నారు. ఎన్టీఆర్ - చ‌ర‌ణ్ క‌లిసి దుమ్ము రేపిన నాటు నాటు సాంగ్‌ని రామ్ చ‌ర‌ణ్ - క‌లిసి చేస్తే ఎలా ఉంటుంది! బాగానే ఉంటుంది. హ్యాండ్స‌మ్ హీరో, క్యూట్ హీరోయిన్ క‌లిసి స్టెప్పేస్తే బాగానే ఉంటుంది. రామ్ చ‌ర‌ణ్ బుధ‌వారం గుడ్ ల‌క్ స‌ఖి ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా విచ్చేశారు. నిజానికి మెగాస్టార్ చిరంజీవ‌వి ఈ వేడుక‌కి ముఖ్య అతిథిగా రావాల్సింది. కానీ ఆయ‌న‌కు క‌రోనా పాజిటివ్ అని నిర్దార‌ణ కావ‌డంతో ఆయ‌న స్థానంలో మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ గెస్ట్‌గా విచ్చేశారు. అజ్ఞాత‌వాసిలో కీర్తి సురేష్ న‌ట‌న బావుంటుందని, ‘మ‌హా న‌టి’ సినిమా చూసిన త‌ర్వాత కీర్తి సురేష్ న‌ట‌న‌కు ఫిదా అయ్యాన‌ని చెప్పిన రామ్ చ‌ర‌ణ్. ‘’ సినిమా చిన్న‌ సినిమా కాద‌ని.. ఒక వైపు మ‌హాన‌టితో జాతీయ అవార్డు అందుకున్న న‌టి కీర్తిసురేష్‌.. మ‌రో వైపు జాతీయ అవార్డ్ అందుకున్న డైరెక్ట‌ర్ న‌గేష్ ఉన్న‌ప్పుడు దాన్ని చిన్న అనడం కరెక్ట్ కాదని చెప్పిన రామ్ చరణ్..మూవీ పెద్ద హిట్ కావాలని చెబుతూ డైరెక్టర్ నగేష్ కుకునూర్ అండ్ టీమ్‌ను అభినందించారు. అనంత‌రం కీర్తి సురేష్ స్టేజ్ పైకి వ‌చ్చి నాటు నాటు స్టెప్ వేయాల‌ని ఉంద‌ని రామ్ చ‌ర‌ణ్‌ను కోరారు. ‘ఎవ‌రితో అయినా అద్భుతంగా న‌టించ‌గ‌ల‌, నాకెంతో ఇష్టమైన మహానటి కీర్తి సురేష్ అడిగారు కాబట్టి ఏమాత్రం ఆలోచించ‌కుండా ఒప్పుకుంటున్నా’ అని చెప్పిన చరణ్.. ‘కీర్తితో మీకు ఆ స్టెప్ వ‌చ్చా ఓసారి అయితే లైట్‌గా వేసి చూపించండి’ అని చెప్పి, ఆమె వేసిన త‌ర్వాత స‌ర‌దాగా కీర్తితో క‌లిసి నాటు నాటు స్టెప్పు వేశారు. ఇప్పుడు ఆ వీడియో నెట్టింట తెగ వైర‌ల్ అవుతుంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/35lOZUZ
v

హీరో శ్రీకాంత్‌కు కరోనా పాజిటివ్

చిత్రసీమను మరోసారి భయం వెంటాడుతోంది. వరుసపెట్టి చాలా మంది సినీ ప్ర‌ముఖులు క‌రోనా ఎఫెక్ట్‌కి గురవుతుండటం సినీ లోకంలో ఆందోళన నెలకొల్పుతోంది. తగ్గినట్లే తగ్గిన కరోనా తిరిగి థర్డ్ వేవ్‌లో వీరవిహారం చేస్తోంది. కొద్దిసేపటి క్రితమే మెగాస్టార్ చిరంజీవికి క‌రోనా సోకిందని అధికారిక ప్రకటన రాగా.. ఆ వెంటనే మరో సీనియర్ హీరో శ్రీకాంత్ కరోనా బారిన పడ్డారని తెలిసింది. తనకు కరోనా సోకినట్లు స్వయంగా పేర్కొన్నారు హీరో శ్రీకాంత్. తాను ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ తనని కరోనా వదిలిపెట్టలేదని.. తాజాగా కోవిడ్ పరీక్షలు చేయించుకోగా కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని ఆయన తెలిపారు. తనతో గత కొన్నిరోజులుగా సన్నిహితంగా ఉన్నవారందరూ జాగ్రత్తగా ఉండాలని, ఎలాంటి కరోనా లక్షణాలు కనిపించినా వెంటనే వైద్యులను సంప్రదించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని శ్రీకాంత్ అన్నారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ పెట్టారు శ్రీకాంత్. ఈ విషయం తెలిసి ఆయన త్వరగా కోలుకోవాలంటూ కామెంట్స్ పెడుతున్నారు నెటిజన్లు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3FYuhap
v

ఓటీటీలో ప్ర‌భాస్ ‘రాధే శ్యామ్’ ఫిక్స్ అయినట్లేనా!.. రిలీజ్ డేట్‌పై లేటెస్ట్ అప్ డేట్

బాహుబలితో పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిన ప్ర‌భాస్ వ‌రుస పాన్ ఇండియా సినిమాల‌తో సందడి చేస్తున్నారు. ఈ క్ర‌మంలో ఆయ‌న గ‌త చిత్రం సాహో విడుద‌లై రెండున్న‌రేళ్లు అవుతుంది. ఆయ‌న అభిమానులేమో ప్ర‌భాస్‌ను సిల్వ‌ర్ స్క్రీన్‌పై చూడ‌టానికి ఆతృత‌గా ఎదురుచూస్తున్నారు. కోవిడ్ కార‌ణంగా ప్ర‌భాస్ తాజా చిత్రం ‘రాధే శ్యామ్‌’ సంక్రాంతి బ‌రి నుంచి త‌ప్పుకుంది. మార్చి నెల‌లో విడుద‌ల‌య్యే అవ‌కాశాలున్నాయ‌ని వార్త‌లు ఇటీవ‌ల బ‌లంగా వినిపించాయి. కాగా.. ఇప్పుడు ‘’ మేక‌ర్స్ పాన్ ఇండియా రేంజ్‌లో సినిమాను అందుబాటులోకి వీలైనంత త్వ‌ర‌గా తీసుకు రావాల‌ని భావిస్తున్నార‌ట‌. అయితే ఇప్ప‌ట్లో థియేట‌ర్స్ విష‌యంలో క్లారిటీ రావ‌డం లేద‌ట‌. దీంతో ‘రాధే శ్యామ్’ నిర్మాత‌లు త‌మ సినిమాను డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ చేయాల‌ని నిర్ణ‌యించుకున్నార‌ని టాక్. ఒకవేళ ఇది నిజమే అయితే.. ప్రభాస్‌ను వెండితెరపై చూడాలనుకుంటున్న ఫ్యాన్స్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి. ‘రాధే శ్యామ్’ పీరియాడిక్ లవ్ స్టోరి. పూజా హెగ్డే హీరోయిన్. యూరప్ బ్యాక్ డ్రాప్‌లో సాగే చిత్రం. ప్రేమ క‌థా చిత్రం కాబ‌ట్టి వేలంటైన్స్ డే సంద‌ర్భంగా ఫిబ్ర‌వరి 14న ‘రాధే శ్యామ్’ ను రిలీజ్ చేస్తే బావుంటుంద‌ని నిర్మాత‌లు అనుకుంటున్న‌ట్లు సినీ వ‌ర్గాల్లో వార్త‌లు వినిపిస్తున్నాయి. ప్ర‌స్తుతం చ‌ర్చ‌లు చాలా బ‌లంగా జ‌ర‌గుతున్నాయ‌ని టాక్ న‌డుస్తోంది. త్వ‌ర‌లోనే దీనికి సంబంధించిన అధికారిక ప్ర‌క‌ట‌న వెలువ‌డొచ్చున‌ని అంటున్నారు. మ‌రి ఈ వార్త‌ల‌పై చిత్ర యూనిట్ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి. ఈ చిత్రంలో ప్ర‌భాస్ హ‌స్త సాముద్రిక తెలిసిన ఎక్స్‌ప‌ర్ట్‌గా క‌నిపించ‌నున్నారు. పూజా హెగ్డే ఇందులో మ్యూజిక్ డైరెక్ట‌ర్‌గా క‌నిపించ‌నున్నారు. వీరి మ‌ధ్య సాగే రొమాంటిక్ ల‌వ్ స్టోరిగా ‘రాధే శ్యామ్’ అల‌రించ‌నుంది. యువీ క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై కృష్ణంరాజు స‌మ‌ర్ప‌ణ‌లో ప్ర‌మోద్‌, వంశీ, ప్ర‌శీద ‘రాధే శ్యామ్’ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రాధా కృష్ణ కుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. సీనియ‌ర్ న‌టుడు కృష్ణంరాజు ఇందులో స్వామిజీ పాత్ర‌లో క‌నిపించ‌నున్నారు. బాలీవుడ్ న‌టి భాగ్య శ్రీ ఇందులో ప్ర‌భాస్ త‌ల్లి పాత్ర‌లో న‌టించారు. హీరోయిన్ పూజా హెగ్డే చేతి రేఖ‌ల‌ను అనుస‌రించి ఆమె ఎదుర్కోబోయే ప్ర‌మాదాల‌ను గుర్తించిన ప్ర‌భాస్ ఆమెను ఎలా ర‌క్షించుకుంటాడనేదే ఈ సినిమా క‌థాంశం.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/34bTAbG
v

Tuesday 25 January 2022

Mahesh Babu: సర్కారు వారి పాట గుడ్ న్యూస్.. అనుకున్నదే చెప్పేశారుగా..!

సూపర్ స్టార్ అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది '' టీమ్. గత కొన్ని రోజులుగా ఈ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఇస్తున్న హింట్స్‌పై కీలక అప్‌డేట్ ఇచ్చారు మేకర్స్. రిపబ్లిక్ డే కానుకగా కొత్త పోస్టర్‌తో మహేష్ అభిమానుల్లో జోష్ నింపారు. అందరూ ఊహించినట్లుగానే ప్రేమికుల రోజున 'సర్కారు వారి పాట' సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్ కానుందని అధికారికంగా పేర్కొన్నారు. వాలెంటైన్స్ డే సందర్భంగా ఫిబ్రవరి 14వ తేదీన 'సర్కారు వారి పాట' మొదటి పాట విడుదలవుతుందని పేర్కొంటూ మ్యూజిక్ డైరెక్టర్ తమన్‌తో కూడిన పోస్టర్ రిలీజ్ చేశారు. మెలోడీ సాంగ్ అఫ్ ది ఇయర్‌తో ప్రేమలో పడండి అని పేర్కొన్నారు. మహేష్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న ఈ ప్రకటన రావడంతో 'సర్కారు వారి పాట మ్యూజిక్' హ్యాష్ టాగ్ నేషనల్ వైడ్ ట్రెండ్ అవుతోంది. ఈ మ్యూజిక్ కోసం ఈగర్లీ వెయిటింగ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. మైత్రీ మూవీ మేకర్స్, జీఎంబీ ఎంటర్టైన్మెంట్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌ల మీద నవీన్ యెర్నేని, వై. రవి శంకర్, రామ్ ఆచంట, గోపీ ఆచంట, మహేష్ బాబు సంయుక్తంగా కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తమన్ బాణీలు కడుతున్నారు. చిత్రంలో మహేష్ సరసన కీర్తి సురేష్ నటిస్తుండగా.. వెన్నెల కిషోర్, సుబ్బరాజు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్‌, ఇతర అప్‌డేట్స్ భారీ రెస్పాన్స్ తెచ్చుకొని సినిమాపై బోలెడన్ని అంచనాలు క్రియేట్ చేశాయి. ఏప్రిల్ నెలలో గ్రాండ్‌గా ఈ సినిమాను రిలీజ్ చేయబోతున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3KDHnxv
v

క‌మ‌ర్షియల్ సినిమాల‌కు కేరాఫ్ అడ్ర‌స్ మాస్ మ‌హ‌రాజా ర‌వితేజ‌

మాస్ మ‌హారాజా ర‌వితేజ‌.. ఈ పేరులో తెలియ‌ని ఎన‌ర్జీ ఉంటుంది. సినీ ప‌రిశ్ర‌మ‌లో క‌ష్ట‌ప‌డి న‌టుడి స్థాయి నుంచి స్టార్ రేంజ్‌కు ఎదిగిన అతి కొద్ది మందిలో ర‌వితేజ ఒక‌రు. షోలో సినిమాతో సినీ రంగంపై ఆస‌క్తి పెంచుకున్న ర‌వితేజ‌కు చిత్ర సీమ రెడ్ కార్పెట్ వేయ‌లేదు. అవ‌కాశాల కోసం ఆయ‌న అనేక ఇబ్బందులు ప‌డ్డారు. అసిస్టెంట్ డైరెక్ట‌ర్‌గా వ‌ర్క్ చేశారు. అలా వ‌ర్క్ చేస్తున్న స‌మ‌యంలోనే ఆయ‌న న‌టుడిగా మారారు. హీరో ఫ్రెండ్స్ గ్రూపులో ఒక‌డిగా, విల‌న్ గ్యాంగ్‌లో ఓ స‌భ్యుడిగా క‌నిపించ‌టం ఇలా చిన్నా చిత‌కా వేషాలు వేసుకుంటూ వ‌చ్చారు. అయితే ఆయ‌న లైఫ్‌ని ట‌ర్న్ చేసిన సినిమా ‘నీకోసం’. ఈ సినిమా అనౌన్స్ చేసిన‌ప్పుడు హీరోగా సినిమానా? అని అనుకున్న‌వాళ్లూ లేక‌పోలేదు మ‌రి. కొన్ని ఇబ్బందుల‌ను ప‌డి సినిమా విడుద‌లైంది. సినిమాకు చాలా మంచి పేరు వ‌చ్చింది. శ్రీనువైట్లకే కాదు.. హీరోగా ర‌వితేజ‌కు మంచి గుర్తింపును తెచ్చి పెట్టిన చిత్ర‌మిది. అలాంటి త‌రుణంలో ర‌వితేజ‌కు హీరోగా బ్రేక్ ఇచ్చింది మాత్రం పూరీ జ‌గ‌న్నాథ్‌. హీరోయిజాన్ని డిఫ‌రెంట్ బాడీ లాంగ్వేజ్‌లో ప్రెజెంట్ చేస్తూ సినిమాలు చేసే పూరీ చేతిలో ర‌వితేజ ప‌డ‌గానే ఎవ‌రూ ఊహించ‌ని స్థాయికి ఎదిగారు. పూరీ త‌న హీరో ఎలా ఉండాల‌నుకుంటారో.. అంత‌కు ప‌ది రెట్లు ఉండేలా త‌న న‌ట‌న‌తో వెండితెర‌పై ఎస్టాబ్లిష్ చేశారు ర‌వితేజ‌. వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో ఇట్లు శ్రావ‌ణి సుబ్ర‌మ‌ణ్యం హిట్ అయితే ఆ త‌ర్వాత వ‌చ్చిన ఇడియ‌ట్‌, అమ్మ నాన్న ఓ త‌మిళ అమ్మాయి చిత్రాలు బ్లాక్ బ‌స్ట‌ర్ అయ్యి బాక్సాఫీస్‌ను షేక్ చేశాయి. ఈ రెండు సినిమాల స‌క్సెస్‌తో ర‌వితేజ స్టార్ హీరోగా మారిపోయారు. ఖ‌డ్గం, వెంకీ, భ‌ద్ర, విక్క‌మార్కుడు, దుబాయ్ శీను, కృష్ణ‌, కిక్‌, మిర‌ప‌కాయ్‌, బ‌లుపు, క్రాక్ వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రాల‌తో ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకున్నారు. ఒక వైపు క‌మ‌ర్షియ‌ల్ సినిమాలు చేస్తూనే నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమొరీస్‌, శంభో శివ శంభో వంటి డిఫ‌రెంట్ మూవీస్‌లోనూ న‌టించారు. కొన్ని సినిమాల్లో పాత్ర‌ల‌కు నెరేట్‌గా కొత్త జీవం తెచ్చిన ర‌వితేజ‌.. గాయ‌కుడిగానూ పాటలు పాడిన సంద‌ర్భాల్లు కోకొల్ల‌లు. కొత్త ద‌ర్శ‌కుల‌ను, యంగ్ టాలెంట్‌ను ర‌వితేజ బాగా ఎంక‌రేజ్ చేస్తుంటారు. శ్రీనువైట్ల‌, గోపీ చంద్ మ‌లినేని, బోయ‌పాటి శ్రీను, కె.ఎస్‌.ర‌వీంద్ర‌, అనీల్ రావిపూడి వంటి ద‌ర్శ‌కుల‌తో ర‌వితేజ ప‌నిచేసి విజ‌య‌వంత‌మైన సినిమాల‌ను అందించారు. 2021లో క్రాక్‌తో బ్లాక్ బ‌స్ట‌ర్ కొట్టిన ర‌వితేజ ఇప్పుడు వ‌రుస సినిమాల‌తో బిజి బిజీగా ఉన్నారు. ఆయ‌న హీరోగా న‌టించిన ఖిలాడి, రామారావు ఆన్ డ్యూటీ చిత్రాల‌కు విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతుంటే ధ‌మాకా, రావ‌ణాసుర సినిమాలు సెట్స్‌పై ఉన్నాయి. ఇవి కాకుండా టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు అనే కొత్త సినిమాను అనౌన్స్ చేశారు ర‌వితేజ. ప్రేక్ష‌కుల‌ను ఎంట‌ర్‌టైన్ చేయ‌డ‌మే గోల్‌గా దూసుకెళ్తున్న ర‌వితేజ పుట్టిన‌రోజు నేడు (జ‌న‌వ‌రి 26). ఈ సంద‌ర్భంగా ఆయ‌న ఇదే ఎన‌ర్జీతో మ‌రెన్నో పుట్టిన‌రోజుల‌ను సెల‌బ్రేట్ చేసుకోవాల‌ని మ‌న‌స్ఫూర్తిగా కోరుకుంటోంది ‘స‌మ‌యం తెలుగు’.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3IHQ2gB
v

మహేష్ బాబుతో మోహన్ బాబు.. ఇన్నేళ్లకు మళ్ళీ అలా కలవబోతున్నారా?

వరుస హిట్ సినిమాలతో సత్తా చాటుతూ టాలీవుడ్ టాప్ హీరోల్లో ఒకరిగా దూసుకుపోతున్న సూపర్ స్టార్ మహేష్ బాబు.. తన తదుపరి సినిమాలో మోహన్ బాబుతో తెర పంచుకోబోతున్నారని తెలుస్తోంది. దర్శకనిర్మాతలతో పాటు నేటితరం ప్రేక్షకులు విలక్షణ కాంబోలపై ఇంట్రెస్ట్ పెడుతున్నారు. ఈ క్రమంలోనే కలెక్షన్ కింగ్ , సూపర్ స్టార్ కాంబో సెట్ చేశారని సమాచారం. వరుస హిట్లతో సూపర్ ఫామ్‌లో ఉన్న మహేష్ బాబు తన మార్కెట్‌ను గణనీయంగా పెంచుకుంటున్నారు. ప్రస్తుతం ఆయన పరశురామ్ దర్శకత్వంలో 'సర్కారు వారి పాట' సినిమా చేస్తున్నారు. ఇప్పటికే 60 శాతం మేర ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ అయింది. ఈ మూవీ తర్వాత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మహేష్ సినిమా ఉండనుంది. ఈ మూవీ కోసమే మహేష్ బాబు- మోహన్ బాబు కలవబోతున్నట్లు ఫిలిం నగర్‌లో టాక్ నడుస్తోంది. త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో మహేష్ బాబు చేయాల్సిన మూవీ ఎప్పుడో మొదలు కావాల్సి ఉండగా 'సర్కారు వారి పాట' సినిమా ఆలస్యమవుతూ రావడంతో ఈ సినిమా షూట్ కూడా వాయిదా పడుతూ వస్తోంది. అయితే ఈ గ్యాప్‌లో కథపై కసరత్తులు చేస్తూ పక్కా వ్యూహరచన చేశారట త్రివిక్రమ్. ఈ మేరకు సీనియర్ నటుడు మోహన్ బాబు కోసం ఓ ముఖ్య పాత్ర డిజైన్ చేశారట. ఇందులో మహేష్ బాబు మేనమామగా మోహన్ బాబును చూపించబోతున్నారని తెలుస్తోంది. ఈ పాత్ర గురించి చెప్పగానే వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారట మోహన్ బాబు. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన ఇవ్వనున్నారట మేకర్స్. మహేష్- త్రివిక్రమ్ క్రేజీ కాంబోలో రాబోతున్న ఈ చిత్రాన్ని హారిక హాసినీ క్రియేషన్స్ బ్యానర్‌పై రాధాకృష్ణ నిర్మించనున్నారు. 1989లో సూపర్ స్టార్ కృష్ణ హీరోగా తెరకెక్కిన 'కొడుకు దిద్దిన కాపురం'లో మోహన్ బాబు విలన్గా నటించారు. ఈ సినిమాలో మహేష్ బాబు బాలనటుడిగా కనిపించారు. అయితే మళ్లీ 33 సంవత్సరాల తర్వాత మరోసారి మోహన్ బాబు- మహేష్ బాబు కలిసి నటించనున్నారని తెలుస్తుండటం ఆసక్తికర అంశం.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3KFECvH
v

మెగాస్టార్ చిరంజీవికి కరోనా పాజిటివ్..!

థ‌ర్డ్ వేవ్ ప్ర‌భావం చాలా ఎక్కువ‌గా ఉంది. సామాన్యులు, సెల‌బ్రిటీలు చాలా మంది క‌రోనా బారిన ప‌డుతున్నారు. తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌లో చాలా మంది ప్ర‌ముఖులు క‌రోనా ఎఫెక్ట్‌కి గుర‌య్యారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి క‌రోనా బారిన ప‌డ్డారు. ఈ విష‌యాన్ని ఆయ‌న త‌న ట్విట్టర్ ద్వారా తెలియ‌జేశారు. ‘‘కరోనా బారిన పడకుండా అన్నీ జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కరోనా పాటిటివ్‌గా నిర్దార‌ణ అయ్యింది. స్వ‌ల్పంగా ల‌క్ష‌ణాలున్నాయి. ఇంట్లోనే క్వారంటైన్ అయ్యాను. ఈ మ‌ధ్య కాలంలో న‌న్ను క‌లిసిన వారంద‌రూ క‌రోనా టెస్టులు చేయించుకోండి. త్వ‌ర‌లోనే మీ అంద‌రినీ క‌లుస్తాను’’ అని తెలిపారు. ఇంతక ముందు ఓసారి ఇలాగే చిరంజీవికి కరోనా సోకినట్లు వార్తలు వచ్చాయి. అయితే అప్పుడు చిరంజీవి వెంటనే తన సోషల్ మీడియాలో స్పందిస్తూ..తప్పుడు కరోనా కిట్‌తో పరీక్షించుకోవడం వల్ల పాజిటివ్ ఫలితం వచ్చిందని తను బాగానే ఉన్నానంటూ తెలియజేసిన సంగతి తెలిసిందే. చిరంజీవి వీలైనన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. ముఖ్యమైన పనులతో బయటకు వచ్చినప్పుడు కూడా ఆయన సామాజిక దూరం పాటించేవారు. అయితే ఎలాగో ఆయన ఇప్పుడు కరోనా బారిన పడ్డారు. సినిమాల విషయానికి వస్తే.. చిరంజీవి ఆచార్య విడుదలకు సిద్ధంగా ఉండగా.. సెట్స్‌పై గాడ్ ఫాదర్, భోళా శంకర్, బాబీ సినిమాలున్నాయి. ఇవి కాకుండా వెంకీ కుడుముల సినిమాల చేయడానికి ఆయన రీసెంట్‌గానే ఓకే చెప్పారు. ప్రస్తుతం మెహర్ రమేష్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘భోళా శంకర్’ సినిమా చిత్రీకరణలో చిరంజీవి పాల్గొంటున్నారు. చిరంజీకి కరోనా రావడంతో దాదాపు రెండు వారాల పాటు ఆయన సినిమా షూటింగ్స్ అన్నీ వెనక్కి వెళ్లినట్లే.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/35eKaNe
v

Padma Shri: అలనాటి నటి షావుకారు జానకి కీర్తి కిరీటంలో పద్మ పురస్కారం

రిపబ్లిక్ డే సందర్భంగా ఈ ఏడాది 128 మందికి పద్మ అవార్డులను ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. ఇందులో నలుగురికి పద్మ విభూషణ్, 17 మందికి పద్మభూషణ్ అవార్డులు, 107 మందికి అవార్డులు వరించాయి. దేశంలోని వివిధ రంగాల్లో విశేష సేవలు అందించిన ప్రముఖులు, వ్యక్తులను కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డులతో సత్కరిస్తుంది. భారత 73వ గణతంత్ర వేడుకలను పురస్కరించుకుని ఈ అవార్డులను ప్రదానం చేయనున్నారు. అయితే తమిళనాడు ప్రభుత్వం సిఫారసు మేరకు అలనాటి విలక్షణ నటి పద్మశ్రీ పురస్కారానికి ఎంపికయ్యారు. 90 ఏళ్ల వయసులో ఆమెకు ఈ అత్యున్నత పురస్కారం దక్కడం విశేషం. ఒకానొక సమయంలో బిజీ ఆర్టిస్ట్‌గా ఉంటూ తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ సినిమా రంగాల ప్రేక్షకులను తన నటనతో ఆకట్టుకున్నారు షావుకారు జానకి. 18 ఏళ్ల వయసులో చిత్ర సీమలో అడుగుపెట్టిన షావుకారు జానకి.. సీనియర్‌ ఎన్టీఆర్‌ మొదలుకొని నేటితరం హీరోల తోనూ తెరపంచుకున్నారు. 1931 డిసెంబర్‌ 12న తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో సాంప్రదాయ కుటుంబంలో పుట్టిన ఆమె.. చిన్నతనం నుంచే నటనపై ఆసక్తితో సినీ రంగ ప్రవేశం చేసి 500 పైగా చిత్రాల్లో నటించారు. సినిమాల్లోకి రాకముందే ఆమె వివాహం జరిగింది. ఆ తర్వాత రేడియో నాట‌కాల్లో, రంగ‌స్థలం మీద ప‌లు ప్రదర్శనలు ఇస్తూ సినీ గడప తొక్కారు. దర్శక నిర్మాత బి.ఎన్‌. రెడ్డి రికమండేషన్‌‌తో ఆమెకు 'షావుకారు' అనే చిత్రంలో హీరోయిన్‌ అవకాశం ఇచ్చారు నాగిరెడ్డి, చక్రపాణి. ఎల్వీ ప్రసాద్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో ఎన్టీఆర్ హీరోగా నటించారు. ఇదే ఆమె తొలి సినిమా. ఈ మూవీతో మంచి పేరు రావడంతో 'షావుకారు' అనే పేరే జానకి ఇంటిపేరుగా మారిపోయింది. ఆ తర్వాత కెరీర్ పరంగా పలు సినిమాల్లో భాగమైన ఆమె తెలుగులో ఎన్టీఆర్‌, ఏఎన్నార్, తమిళంలో ఎంజీఆర్‌ ,శివాజీ గణేశన్‌ సరసన నటించారు. ''వద్దంటే డబ్బు, కన్యాశుల్కం, సొంతం ఊరు, జయం మనదే, రోజులు మారాయి, డాక్టర్‌ చక్రవర్తి, అక్కాచెల్లెళ్లు, మంచి కుటుంబం'' లాంటి సినిమాలు షావుకారు జానకికి మంచి పేరు తెచ్చిపెట్టాయి. నటిగానే కాకుండా మంచి వ్యాఖ్యాతగా వ్యవహరించిన ఆమె ప్రస్తుతం 90 ఏళ్ల వయసులో కూడా చాలా చలాకీగా ఉన్నారు. షావుకారు జానకికి పద్మశ్రీ అవార్డు రావడం పట్ల ప్రేక్షకులతో పాటు పలువురు సినీ ప్రముఖులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/33RHtRw
v

Monday 24 January 2022

రవికృష్ణ ప్రేమకు గుడ్ బై చెప్పిన నవ్య స్వామి.. తనకు వేరే ఆప్షన్ లేదంటూ ఓపెన్!

సెలబ్రిటీల లవ్ ట్రాక్స్‌ అనే టాపిక్‌కి కేరాఫ్ అడ్డాగా ఉంటుంది సోషల్ మీడియా. సినిమాలతో పాటు సీరియల్ నటుల ప్రేమ సంగతులు, డేటింగ్ విషయాలపై నిత్యం ఏదో ఒకరమైన చర్చ నడుస్తూనే ఉంటుంది. ఇదిగోపులి అంటే అదిగో తోక అనే వాళ్ళు చాలామందే ఉంటారు. అలా ప్రేమ కహానీతో ఫేమస్ అయిన జోడీల్లో నవ్య స్వామి- జోడీ ఒకటి. సీరియల్ నటులే అయినా ఇద్దరి మధ్య నడిచిన కెమిస్ట్రీ, క్లోజ్ రిలేషన్ చూసి వాళ్ళ లవ్ ఎఫైర్ గురించి బోలెడన్ని వార్తలు షికారు చేశాయి. ఈ పరిస్థితుల నడుమ ఈ రీల్ కపుల్‌తో మ్యాజిక్స్ చేసింది యాంకర్ సుమ. తాను హోస్ట్‌గా చేస్తున్న క్యాష్ షో కోసం నవ్య స్వామి- రవికృష్ణ జోడీతో పాటు సిద్దార్థ్- విష్ణుప్రియ జోడీలను వేదికపై తీసుకొచ్చి వాళ్ళతో డిఫరెంట్‌గా రొమాంటిక్ టాస్కులు చేయించింది సుమ. అయితే జనవరి 29న ఈ ఎపిసోడ్ ప్రసారం కానున్న నేపథ్యంలో తాజాగా ఇందుకు సంబంధించిన ప్రోమో వీడియో రిలీజ్ చేశారు. ఇందులో నవ్య స్వామి- రవికృష్ణ బ్రేకప్ సీన్ హైలైట్ అయింది. తన లవ్ విషయమై రవికృష్ణను ఎంతో హర్ట్ చేస్తూ ఓపెన్ అయింది . సిద్దార్థ్- విష్ణుప్రియలతో ముద్దుల టాస్క్ చేయించిన సుమ.. నవ్య స్వామి- రవికృష్ణ రొమాంటిక్ మూమెంట్స్ చూసి మీరు రియల్ లైఫ్ కపుల్ కాదు రీల్ లైఫ్ కపుల్ అంటూ పంచ్ విసిరింది. నీకు గెడ్డం ఉండే బాయ్స్ ఇష్టమా? లేక గెడ్డం లేని బాయ్స్ ఇష్టమా? అని సుమ అడిగిన ప్రశ్నకు గెడ్డం ఉంటేనే బాగుంటారు అంటూ రవికృష్ణను చూస్తూ సమాధానం చెప్పింది నవ్య స్వామి. ఇక చివరగా నవ్య స్వామి- రవికృష్ణ బ్రేకప్ సీన్ చూపించి ఆసక్తి రేకెత్తించారు. రవికృష్ణ దగ్గరకు వచ్చిన నవ్య స్వామి.. నీపై నాకు చెప్పలేనంత ప్రేమ ఉందని చెబుతూనే మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవడం లేదని, నా పేరెంట్స్‌ని హర్ట్ చేయలేను. ప్లీజ్ వేరేలా అనుకోకు. నాకు వేరే ఆప్షన్ లేదంటూ వెళ్ళిపోయింది. ఇది నిజమైన సంఘటన కాకపోయినా ఆ సీన్ చూసి సుమ కూడా కాస్త ఫీల్ అయినట్లు కనిపించింది. కాగా రవికృష్ణతో లవ్ ట్రాక్ విషయమై బోలెడన్ని వార్తలు రావడంతో గతంలోనే దీనిపై ఓ క్లారిటీ ఇచ్చేసింది నవ్య స్వామి. తమ మధ్య ఉన్నది 100% ఫ్రెండ్‌షిప్ తప్ప ఎలాంటి రిలేషన్ లేదని చెబుతూ ఫుల్ క్లారిటీ ఇచ్చేసింది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/33IN8td
v

రవితేజని కొట్టిన బాలకృష్ణ.. ఆ హీరోయిన్ కోసం గొడవ నిజమేనా.. అసలేమైంది?

నందమూరి చాలా ముక్కుసూటి మనిషి. చిన్నపిల్లాడి మనస్తత్వం.. ఎలాంటి మాస్క్‌లు లేకుండా ఉన్నది ఉన్నట్టు కుండబద్దలు కొట్టినట్టు మాట్లాడేస్తారు. మంచి అయినా చెడు అయినా ఆన్ ది స్పాట్ రియాక్షన్ ఉంటుంది. అంతేతప్ప కవర్ కోటింగ్‌లు బాలయ్య దగ్గర ఉండవు అనేది ఆయన్ని బాగా దగ్గర నుంచి చూసిన వాళ్లు చెప్పే మాట. నచ్చితే గుండెల్లో పెట్టుకుంటారు.. నచ్చకపోతే చెంపలు వాయించేస్తారు. చివరికి ప్రాణం ప్రేమించే అభిమానులైతే హద్దులు దాటితే దవడపగిలిపోవాల్సిందే. ఇదే ఆయన సూత్రం. బాలకృష్ణ కొడతారు అనేది అందరికీ తెలిసిన విషయమే.. సెట్స్‌లోనూ అలాగే బయట జనం మధ్యకి వచ్చినప్పుడు బాలయ్య కొట్టిన సందర్భాలు చాలానే ఉన్నాయి. అయితే బాలయ్య కొట్టిన వాళ్ల లిస్ట్‌లో సామాన్యులే కాదు.. స్టార్ హీరోలు కూడా ఉన్నారా? హీరో రవితేజను కూడా బాలకృష్ణ కొట్టారా? ఓ హీరోయిన్ విషయంలో బాలకృష్ణ.. రవితేజపై చేయి చేసుకున్నారనే రూమర్ ఎప్పటి నుంచో ఇండస్ట్రీలో ఉంది. దానికి సంబంధించిన రకరకాల కారణాలు చెప్తూ ఉంటారు.. ఫిల్మ్ జర్నలిస్ట్‌లు కూడా నిప్పులేనిదే పొగరాదుగా.. కొట్టే ఉంటారులే అని ఈ రూమర్‌కి పొగ ఊదుతూ వచ్చారు. అయితే ఇటీవల బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న ‘అన్ స్టాపబుల్’ టాక్‌ షోకి గెస్ట్‌గా వచ్చారు . ఈ కార్యక్రమంలో ఈ ఇష్యూపై క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఇంతకీ బాలయ్య రవితేజను కొట్టిన మాట నిజమేనా? అంటే దానిపై క్లారిటీ ఇచ్చారు ‘అన్ స్టాపబుల్’ టాక్‌ షో రైటర్ బీవీఎస్ రవి.. అలియాస్ మచ్చా రవి. ప్రముఖ సీనియర్ ఫిల్మ్ జర్నలిస్ట్ ప్రభుకి ఇచ్చిన ఇంటర్వ్యూలో పాల్గొన్న బీవీఎస్ రవి.. బాలకృష్ణ రవితేజను కొట్టారనే రూమర్లను ఖండిస్తూ వివరణ ఇచ్చారు. ఆయన మాట్లాడుతూ.. రవితేజ‌ గారితో చేసిన ‘అన్ స్టాపబుల్’ ఎపిసోడ్ చాలా ఇంట్రస్టింగ్. రవితేజ గారికి బాలకృష్ణ గారికి పడదని వాళ్లిద్దరూ కొట్టుకున్నారని బయట టాక్ ఉంది. బాలకృష్ణ గారు రవితేజ కొట్టారనే దానిపై షోలో క్లారిటీ ఇచ్చాం. నేను రవితేజ గారితో నేను గత 20 ఏళ్లుగా జర్నీ చేస్తున్నా.. మేం ఇద్దరం రోజు విడిచి రోజైనా మాట్లాడుకుంటాం.. మా ఇద్దరికీ అంతా చనువు ఉంది. అంత క్లోజ్‌గా ఉన్న నాకే ఈ విషయం తెలియలేదంటే బాలకృష్ణ గారు రవితేజని కొట్టింది నిజం కాదని అర్ధం. బాలకృష్ణ గారిని రవితేజ చాలాసార్లు కలిశారు. కలిసి మాట్లాడుకున్న సందర్భాలు.. ఎంజాయ్ చేసిన ఈవెంట్లు చాలా ఉన్నాయి. నిజంగా బాలకృష్ణ గారు రవితేజ కొడితే ఇవన్నీ జరిగేవా? ఎంత స్నేహం అయినా రిలేషన్ అయినా పింగానీ బొమ్మలాంటిది కిందపడితే పగిలిపోతుంది.. తిరిగి అతికించవచ్చు కానీ ఆ గీత అలాగే ఉండిపోతుంది. వాళ్లిద్దరి మధ్య ఎలాంటి గీత లేదు అనడానికి సాక్ష్యమే ఆ ఎపిసోడ్. మేం రవితేజని మేం ఎపిసోడ్‌లో పిలవాలని అనుకున్నప్పుడు మ్యాటర్ లీక్ అయ్యింది. దీంతో వీళ్లిద్దరికీ పడదు.. రవితేజ రాడు అంటూ సోషల్ మీడియాలో పోస్ట్‌లు కనిపించాయి. వాళ్లిద్దరి మధ్య గొడవ అయ్యింది అని విపరీతమైన చర్చ నడిచింది. తీరా.. రవితేజ గురించి బాలయ్య దగ్గర చెప్పేసరికి.. వెంటనే ఆయన.. ‘నేను ఫోన్ చేయనా రవికి.. నా దగ్గర నెంబర్ ఉందిలే అని అన్నారు. ఇక రవితేజ దగ్గరకు వెళ్లి షో గురించి చెప్పాను.. రాకపోతే బయట రూమర్స్ నిజం అయ్యేవి. ఆయన ఫుల్ టైట్‌ షెడ్యూల్‌లో ఉన్నారు. నాలుగైదు సినిమాలు అనౌన్స్ చేసి ఫుల్ బిజీగా ఉన్నారు. అయినప్పటికీ బాలకృష్ణ పిలిచారు అనేసరికి.. నేను తప్పకుండా వస్తాను.. కానీ షెడ్యూల్ అడ్జస్ట్ చేసుకుని టైం నేను చెప్తా అని అన్నారు. అన్నట్టుగానే రవితేజ వచ్చారు.. సెట్‌లోకి రాగానే బాలకృష్ణ గారు రండి రవితేజ గారు అని అన్నారు. ఆ మాటకి రవితేజ.. ‘సార్.. రవితేజ గారు ఏంటండీ.. మీరు నన్ను రవితేజ అని పిలవాలి’.. అని అన్నారు.. అదీ వాళ్లిద్దరి మధ్య ఫస్ట్ డైలాగ్.. వాళ్లిద్దరూ చాలా హ్యాపీగా మాట్లాడుకున్నారు. షో అయిపోయిన తరువాత కూడా రవితేజ మాతో చాలాసేపు ఉన్నారు. మాతో కలిసి భోజనం చేసి వెళ్లారు.. నిజంగా బాలకృష్ణతో గొడవే అయితే ఇంతలా ఉండేవారా? అంటూ చెప్పుకొచ్చారు రైటర్ బీవీఎస్ రవి. ఇదిలా ఉంటే.. విక్రమార్కుడు తరువాత బాక్సాఫీస్ వద్ద రవితేజ వర్సెస్ బాలయ్య చాలాసార్లు పోటీపడ్డారు. ఒక్కమగాడు- కృష్ణ బాక్సాఫీస్ వద్ద పోటీపడగా.. ఒక్కమగాడు ఫ్లాప్ అయ్యింది.. కృష్ణ హిట్ అయ్యింది. అలాగే బాలయ్య ‘మిత్రుడు’.. రవితేజ ‘కిక్’ ఒకేసారి విడుదల కాగా.. కిక్ పెద్ద హిట్ కాగా.. మిత్రుడు ఫ్లాప్ అయ్యింది. ఇక సింహా, శంభో శివ శంభో చిత్రాల మధ్య పోటీ సాగింది. సింహా బ్లాక్ బస్టర్ హిట్ అయితే.. శంభో శివ శంభో ఓ మోస్తరు విజయాన్ని అందుకుంది. ఇంతకీ ఏ హీరోయిన్ విషయంలో వీళ్లిద్దరి మధ్య గొడవ జరిగింది? ఏమిటా రూమర్ అంటే.. రవితేజతో భద్ర సినిమా చేసింది మీరా జాస్మిన్. ఆ తరువాత ఆమెకు బాలయ్యతో నటించే అవకాశం రావడంతో... రవితేజ వద్దన్నాడని అందుకే బాలయ్య రవితేజని పిలిపించి మరీ కొట్టారనే పుకార్లు అప్పట్లో షికారు చేశాయి. ఇదిలా ఉంటే.. విక్రమార్కుడు తరువాత బాక్సాఫీస్ వద్ద రవితేజ వర్సెస్ బాలయ్య చాలాసార్లు పోటీపడ్డారు. ఒక్కమగాడు- కృష్ణ బాక్సాఫీస్ వద్ద పోటీపడగా.. ఒక్కమగాడు ఫ్లాప్ అయ్యింది.. కృష్ణ హిట్ అయ్యింది. అలాగే బాలయ్య ‘మిత్రుడు’.. రవితేజ ‘కిక్’ ఒకేసారి విడుదల కాగా.. కిక్ పెద్ద హిట్ కాగా.. మిత్రుడు ఫ్లాప్ అయ్యింది. ఇక సింహా, శంభో శివ శంభో చిత్రాల మధ్య పోటీ సాగింది. సింహా బ్లాక్ బస్టర్ హిట్ అయితే.. శంభో శివ శంభో ఓ మోస్తరు విజయాన్ని అందుకుంది. ఇంతకీ ఏ హీరోయిన్ విషయంలో వీళ్లిద్దరి మధ్య గొడవ జరిగింది? ఏమిటా రూమర్ అంటే.. రవితేజతో భద్ర సినిమా చేసింది మీరా జాస్మిన్. ఆ తరువాత ఆమెకు బాలయ్యతో నటించే అవకాశం రావడంతో... రవితేజ వద్దన్నాడని అందుకే బాలయ్య రవితేజని పిలిపించి మరీ కొట్టారనే పుకార్లు అప్పట్లో షికారు చేశాయి.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/33GsNVr
v

Rajasekhar : సినిమా నుంచి త‌ప్పించాల‌ని జీవిత‌, రాజ‌శేఖ‌ర్ ప్లాన్ చేసి ఇబ్బంది పెట్టారు : సముద్ర‌

తెలుగులో సింహరాశి, శివ రామ‌రాజు, సూర్యం, మ‌హా నంది, ఎవ‌డైతే నాకేంటి.. ఇలా ప‌లు చిత్రాల‌ను ఆయ‌న డైరెక్ట్ చేశారు. ఈయ‌న డైరెక్ట్ చేసిన చిత్రాల్లో సింహ‌రాశి, ఎవ‌డైతే నాకేంటి చిత్రాలను రాజ‌శేఖ‌ర్‌తో ఆయ‌న రూపొందించారు. ఈ రెండు సినిమాలు మంచి విజ‌యాన్ని సాధించాయి. డైరెక్ట‌ర్‌గా ఈయ‌న త‌న కెరీర్‌ను ప్రారంభించి రెండు ద‌శాబ్దాలు అయ్యాయి. ఈ సంద‌ర్భ‌లో ఈయ‌న రీసెంట్‌గా ఓ ఇంట‌ర్వ్యూలో త‌న కెరీర్‌లో ఎదుర్కొన్న ఆటు పోట్లు గురించి ప‌లు ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాల‌ను తెలియ‌జేశారు. హీరో రాజ శేఖ‌ర్‌, ఆయ‌న స‌తీమ‌ణి, సీనియ‌ర్ న‌టి జీవితలతో జర్నీలో వచ్చిన పొరపచ్చాలు గురించి స‌ముద్ర మాట్లాడుతూ ‘‘నా ప్రయాణంలో పొరపచ్చాలు అంటే రాజశేఖర్‌తో వ‌చ్చింది. నేను ఆయ‌న‌తో ‘ఎవ‌డైతే నాకేంటి’ సినిమాను డైరెక్ట్ చేస్తున్నాను. అంత‌కు ముందు ఆయ‌న‌తోనే నేను డైరెక్ట్ చేసిన ‘సింహ రాశి’ సినిమా మంచి విజ‌యాన్ని సాధించింది. త‌ర్వాత రాజ‌శేఖ‌ర్‌కు స‌రైన హిట్స్ లేవు. మ‌ధ్య‌లో కొన్ని సినిమాల‌ను డైరెక్ట్‌చేయ‌మ‌ని నన్ను అడిగారు. అయితే ఆ క‌థ‌లు నాకు న‌చ్చ‌లేదు. దాంతో నేను వ‌ద్ద‌ని అన్నాను. కానీ రాజ‌శేఖ‌ర్ త‌న‌తో నేను సినిమా చేయ‌డం ఇష్టం లేక వ‌ద్దంటున్నాన‌ని అనుకునేవారు. త‌ర్వాత ‘ఎవ‌డైతే నాకేంటి’ సినిమా కథ విన్నాను. అది నచ్చడంతో సినిమా డైరెక్ట్ చేయడానికి ఒప్పుకున్నాను. సినిమా దాదాపు 70-80 శాతం చిత్రీక‌ర‌ణ పూర్త‌య్యింది. సినిమా బాగా వ‌చ్చింద‌ని, సినిమా పెద్ద హిట్ అవుతుంద‌ని ఓ న‌మ్మ‌కం వ‌చ్చింది. దాంతో జీవిత‌, రాజ‌శేఖ‌ర్ డైరెక్ట‌ర్‌గా నా పేరు తీసేసి.. వాళ్ల పేర్లు వేసుకోవాల‌ని అనుకున్నారు. దాంతో స్పాట్‌లో నన్ను ఇరిటేట్ చేయ‌డం.. త‌క్కువ చేసి మాట్లాడ‌టం చేశారు. స‌రే! వీళ్ల గొడ‌వ ఇదే క‌దా.. ఎందుకొచ్చిన ఇబ్బంది అని నాకు అనిపించింది. ‘సినిమాలో నా పేరు తీసేసి మీ పేరు వేసుకోవాల‌ని అనుకుంటున్నారు. మీరే వేసుకోండి, నా కొద్దు సినిమా.. నాకేం ప్రాబ్లెమ్ లేదు. నేను వెళ్లిపోతా. రేప‌టి నుంచి నేను రాను’ అని చెప్పేసి వెళ్లిపోయాను. నాకు అలాంటి అనుభవం ఎదురుకావ‌డం అదే తొలిసారి. నేను వెళ్లిపోయిన త‌ర్వాత వాళ్లు రియ‌లైజ్ అయ్యారు. తర్వాత ‘లేదండి మీరే చేయండి ’అని జీవిత‌గారు నాతో మాట్లాడారు. అలాగే ‘నువ్వు నాకు బ్ర‌ద‌ర్‌లాంటోడివి’ అని రాజ‌శేఖ‌ర్ మాట్లాడారు. దాంతో సరేనని నేను అనుకున్నాను. త‌ర్వాత నాతోనే ఆ సినిమాను పూర్తి చేయించారు. చివ‌ర‌కు నా పేరు కింద వాళ్ల పేర్లు వేసుకున్నారు’’ అన్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/34aQxAU
v

నవీన్ పోలిశెట్టితో పెళ్లి సందD బ్యూటీ.. ఎస్ అనేసిన అందాల రాణి!

నేటితరం యువ హీరోల్లో తనకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు హైదరాబాదీ కుర్రోడు . 'లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్' సినిమాతో తెలుగుతెరపై కాలుమోపి రీసెంట్‌గా వచ్చిన 'జాతి రత్నాలు' సినిమాతో తెగ పాపులారిటీ సంపాదించాడు. దీంతో ఆయనకు వరుస అవకాశాలు తలుపుతడుతున్నాయి. ఈ క్రమంలోనే నవీన్ చేయబోతున్న ఓ కొత్త సినిమాలో పెళ్లి సందD బ్యూటీ శ్రీ లీలను హీరోయిన్‌గా తీసుకున్నారని తెలుస్తోంది. ఇటీవలే నవీన్ పోలిశెట్టి కొత్త సినిమా అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చ్యూన్‌ 4 సినిమాస్‌ బ్యానర్ల సంయుక్త సమర్పణలో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. కళ్యాణ్ శంకర్ దర్శకత్వంలో పెళ్లి నేపథ్యంలో కలర్‌ఫుల్ కామెడీ ఎంటర్టైనర్‌గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. దీనికి ‘’ అనే టైటిల్ కన్ఫర్మ్ చేసి ఫస్ట్ లుక్, గ్లింప్స్ రిలీజ్ చేసి ప్రేక్షకుల నుంచి విశేష స్పందన అందుకున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ సినిమా నుంచి మరో ఆసక్తికర అప్‌డేట్ బయటకొచ్చింది. ఈ సినిమాలో హీరోయిన్‌గా పెళ్లి సందD బ్యూటీ శ్రీ లీలను ఎంపిక చేశారని అంటున్నారు. ఇప్పటికే ఆమెతో సంప్రదింపులు కూడా జరపగా.. ఆమె 'ఎస్' అనేసిందని తెలుస్తోంది. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన రానుందని ఫిలిం నగర్ టాక్. అదేవిధంగా ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులతో బిజీగా ఉన్న యూనిట్.. అతి త్వరలో ఈ మూవీ షూటింగ్ ప్రారంభించనున్నారట. ఇకపోతే యమ స్పీడుగా అడుగులేస్తున్న నవీన్ పోలిశెట్టి మరో సినిమాలో స్టార్ హీరోయిన్ అనుష్కతో తెర పంచుకోబోతున్నారు. రా రా కృష్ణయ్య దర్శకుడు మహేష్ దర్శకత్వంలో రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా రూపొందనుంది. సో.. చూస్తుంటే ఈ ఏడాది వెండితెరపై 'జాతి రత్నం' కలరింగ్ బాగానే ఉంటుందని తెలుస్తోంది కదూ!.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3H1w5Rc
v

'అఖండ'పై బీ టౌన్ పీపుల్ డిమాండ్స్.. ఇది కదా బాలయ్య క్రేజ్ అంటే!!

నందమూరి నటసింహం క్రేజ్ అంటే ఇదీ మరి అని 'అఖండ' సినిమాతో మరోసారి నిరూపణ అయింది. 'ప్యాన్ ఇండియా సినిమా తీయడం వేరు.. తీశాక ప్యాన్ ఇండియా క్రేజ్ రావడం వేరు' ఈ రెండిటికీ ఉన్న తేడానే సదరు సినిమా లెవెల్ ఏంటనేది స్పష్టం చేస్తుంది. ఇప్పుడు బాలకృష్ణ సినిమా విషయంలో అదే జరుగుతోంది. మూవీ కోసం బాలీవుడ్ తెరలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. ఈ సినిమా హిందీ వర్షన్ కావాలంటూ సోషల్ మీడియాలో బీ టౌన్ పీపుల్ పెద్ద ఎత్తున కామెంట్లు పెడుతున్నారు. ‘అఖండ’ మూవీని హిందీలో రిలీజ్ చేయాలంటూ నార్త్ ఇండియన్ ఆడియన్స్ సోషల్ మీడియా ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నారు. ''అఖండ మూవీ ప్రౌడ్ ఫర్ సనాతన్'' ధర్మ అంటూ హిందీ వర్షన్ ఈ మూవీ కోరుతున్నారు. ఈ మేరకు #WeWantAKHANDAInHindi హ్యాష్ ట్యాగ్‌ని ట్రెండ్ చేస్తున్నారు. అఖండ పోస్టర్స్ షేర్ చేస్తూ తమ తమ డిమాండ్స్ పోస్ట్ చేస్తున్నారు. దీంతో విడుదలై 50 రోజులు పూర్తయ్యాక కూడా అఖండ మూవీ ట్రెండ్ అవుతుండటం విశేషం. బాలకృష్ణ- బోయపాటి హాట్రిక్ కాంబోలో వచ్చిన 'అఖండ' సినిమా డిసెంబర్ 2వ తేదీన విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ సాధించింది. ఇటీవలే 103 సెంటర్లలో విజయవంతంగా 50 రోజులు పూర్తి చేసుకుంది. మరోవైపు ఓటీటీలో విడుదలై భారీ రెస్పాన్స్ తెచ్చుకుంటోంది. జనవరి 21 సాయంత్రం 6 గంటలకు ప్రీమియర్స్ స్టార్ట్ కాగా తొలి 24 గంటల్లో పది లక్షల స్ట్రీమింగ్స్ సాధించి డిజిటల్ రంగంలోనూ సరికొత్త రికార్డ్ సృష్టించింది. చిత్రంలో బాలయ్య నటన, బోయపాటి టేకింగ్ ప్రేక్షకులను బాగా అట్రాక్ట్ చేశాయి. ప్రస్తుతం ఉన్న డిమాండ్ దృష్ట్యా త్వరలో యూట్యూబ్‌లో హిందీ వర్షన్ రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3qW7Can
v

జీవితంలో ఇంతకన్నా బెస్ట్ ఆప్షన్ లేదు.. నమ్రత ఎమోషనల్ పోస్ట్

మహేష్ బాబు సతీమణి, హీరోయిన్ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటారో మనందరికీ తెలుసు. ఎప్పటికప్పుడు తన ఫ్యామిలీ విశేషాలతో పాటు మహేష్ బాబు సినిమా సంగతులను నెటిజన్ల ముందుంచుతూ సూపర్ స్టార్ అభిమానులను ఖుషీ చేస్తుంటారు. ముఖ్యంగా ఫ్యామీలీ ట్రిప్స్, కుటుంబంతో జరుపుకున్న స్పెషల్ ఈవెంట్ ఫొటోస్ అందరితో పంచుకోవడమంటే నమ్రతకు మహా సరదా. ఈ క్రమంలోనే తాజాగా తన పిల్లలిద్దరితో ఓ స్పెషల్ మూమెంట్ షేర్ చేస్తూ ఎమోషనల్ కామెంట్స్ చేశారు నమ్రత. రీసెంట్‌గా జనవరి 22న తన 50వ పుట్టినరోజు జరుపుకున్నారు నమ్రత శిరోద్కర్. ఈ సందర్భంగా తనకెంతో ఇష్టమైన మహేష్, ఇద్దరు పిల్లలు సితార, గౌతమ్‌లతో ఎంజాయ్ చేశారు. అయితే ఆ సంబరాల నుంచి ఓ ర్యాండమ్ పిక్‌ని తన ఇన్స్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసిన నమ్రత.. ''ప్రతి రోజు.. పిల్లలతో జాలీగా గడపడం కంటే బెస్ట్ ఆప్షన్ ఇంకొకటి లేదు'' అంటూ తన ఇద్దరు పిల్లలపై ఉన్న అపారమైన ప్రేమను మరోసారి బయట పెట్టారు. దీంతో ఎప్పటిలాగే ఆమె పోస్ట్ చేసిన ఈ ఫొటో క్షణాల్లో వైరల్ కావడమే గాక దీనిపై లైకుల వర్షం కురుస్తోంది. కొడుకు, కూతురు అంటే అటు మహేష్ బాబు, ఇటు నమ్రత చాలా ఇష్టంగా ఉంటారు. ఓ వైపు తమ తమ ప్రెఫెషనల్ లైఫ్ లీడ్ చేస్తూనే ఏ మాత్రం గ్యాప్ దొరికినా పిల్లలిద్దరితో కలిసి వెకేషన్ ట్రిప్స్ వేయడం మహేష్- నమ్రత హ్యాబీ. దీంతో ఈ సెలబ్రిటీ ఫ్యామిలీ బాండింగ్, ప్రేమానురాగాలు చూసి 'ది కంప్లీట్ ఫ్యామిలీ, బెస్ట్ ఫ్యామిలీ, క్యూట్ కపుల్' ఇలా పలు రకాలుగా రియాక్ట్ అవుతుంటారు నెటిజన్లు. ఇకపోతే పెళ్లికి ముందు సినిమా హీరోయిన్ అయినప్పటికీ పెళ్లి తర్వాత సినిమాలకు దూరంగా ఉంటూ తన భర్త వ్యాపార కార్యకలాపాల్లో భాగమవుతున్నారు నమ్రత శిరోద్కర్. గృహిణిగా పిల్లల బాధ్యతతో పాటు మహేష్ బాబుకు సంబంధించిన బిజినెస్ వ్యవహారాలన్నీ ఆమెనే దగ్గరుండి చూసుకుంటున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3nRvKJq
v

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...