Saturday 31 August 2019

‘సాహో’ డే-2 కలెక్షన్స్.. ప్రభాస్ బాక్సాఫీస్ ప్రభంజనం

‘బాహుబలి’గా ప్రపంచాన్ని గెలిచివచ్చిన ఇప్పడు ‘సాహో’ అంటూ మరో భారీ యాక్షన్ థ్రిల్లర్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అయితే ఆ సినిమాకి ఫస్ట్ డే ఫస్ట్ షో నుండే మిక్స్డ్ టాక్ వచ్చింది. అయినా ముందు నుండి ఉన్న ప్రీ రిలీజ్ హైప్ వల్ల ఆ సినిమా మొదటి రోజు అసాధారణమైన ఓపెనింగ్స్ తెచ్చుకుంది. అన్ని భాషలు, అన్ని స్క్రీన్స్ కలుపుకుని మొదటి రోజు ఏకంగా రూ. 130 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించింది. ఆ టాక్‌తో ఆక్యుపెన్సీ తగ్గకుండా ఈ రేంజ్ కలెక్షన్స్ తెచ్చుకోవడం అంటే మామూలు విషయం కాదు. అయితే ‘సాహో’ ప్రభంజనం మొదటిరోజుకే పరిమితం అనుకున్నారు అంతా. కానీ రెండో రోజు కూడా బాక్స్ ఆఫీస్‌ని కలెక్షన్స్ వరదతో ముంచెత్తింది ‘సాహో’. హిందీ వెర్షన్ వరకు మొదట రోజు రూ. 24 కోట్లకు పైగా కొల్లగొట్టిన ‘సాహో’ సెకండ్ డే చాలా వరకు డ్రాప్ చూపిస్తుంది అనుకున్నారు అంతా. కానీ, అందరి అంచనాలు తప్పని నిరూపిస్తూ వీకెండ్ అడ్వాంటేజ్‌ని వాడుకుంటూ ఏకంగా రూ. 26 కోట్ల షేర్‌‌ని రాబట్టింది. ఇదే ట్రెండ్ కొనసాగితే ఫస్ట్ వీకెండ్‌లో ‘సాహో’ హిందీ వెర్షన్ నుండే రూ. 70 కోట్లు రాబట్టే అవకాశం ఉంది. Also Read: అలాగే తెలుగులోనూ రెండో రోజు ‘సాహో’ ప్రభంజనం కొనసాగింది. రెండో రోజు తెలుగు రాష్ట్రాల్లో రూ. 10 కోట్లకి పైగా షేర్ రాబట్టింది. నైజాంలో మొదటిరోజే ‘బాహుబలి’ రికార్డ్‌ను దక్కించుకున్న ‘సాహో’.. రెండో రోజు అదే దూకుడు కొనసాగిస్తూ రూ. 5 కోట్ల 20 లక్షల షేర్‌ని రికార్డ్ చేసింది. కర్ణాటక, కేరళ, తమిళనాడులో రెండో రోజు డీసెంట్ ఆక్యుపెన్సీ దక్కించుకుంది. ఆ మూడు స్టేట్స్ వరకు రూ. 10 కోట్ల గ్రాస్ రాబట్టింది. ఓవరాల్‌గా చూసుకుంటే సెకండ్ డే ఇండియా మొత్తంగా రూ. 60 కోట్లకు పైగా గ్రాస్ కలెక్ట్ చేసింది. దీంతో రెండు రోజులకి సాహో కలెక్షన్స్ ఇండియా గ్రాస్ రూ. 164.9 కోట్లుగా ఉంది. షేర్ రూ. 99.4 కోట్లు. మూడో రోజు ఇదే ఊపు కొనసాగితే.. వినాకయ చవితి సెలవు కూడా కలిసివస్తుంది కాబట్టి బాక్స్ ఆఫీస్ దగ్గర ‘సాహో’ అద్భుతాలు చెయ్యకపోయినా సేఫ్ అయిపోవడం దాదాపు ఖాయం. అయితే ‘సాహో’కి వచ్చిన టాక్‌, క్రిటిక్స్ ఇచ్చిన రేటింగ్స్‌‌ని చూసి కూడా హిందీ వెర్షన్‌లో సెకండ్ డే ఆ రేంజ్ ఆక్యుపెన్సీ కనిపించింది అంటే బాలీవుడ్ ప్రేక్షకులు ప్రభాస్‌ని పాన్ ఇండియా స్టార్‌గా యాక్సెప్ట్ చేసారు అనుకోవాల్సిందే. ఒక మోస్తరు సినిమాకే ప్రభాస్ ప్రభంజనం ఇలా ఉంటే ఒక హిట్ పడితే ఆ తరువాత రేంజ్ వేరేగా ఉంటుంది. ఈ కలెక్షన్స్ చూసాక ప్రభాస్ నెక్స్ట్ సినిమా కూడా పాన్ ఇండియా మూవీగా రిలీజ్ అయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరంలేదు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2ZECQSx
v

Ganesh Chaturthi Songs: వినాయక చవితి స్పెషల్ సాంగ్స్

విఘ్నాలను పారద్రోలే విఘ్నేశ్వరుడి జన్మదినమే గణేష్ చతుర్థి. ఏ పని ప్రారంభించినా నిర్విఘ్నంగా పూర్తి కావాలని దేవుళ్లను మనం కోరుకుంటాం. అయితే వినాయక చవితి నాడు తమ పనిని ప్రారంభిస్తే విఘ్నాలకు అధిపతి వినాయకుడే తమకు కొండంత అండగా నిలుస్తాడని భక్తుల విశ్వాసం. ఈ పండుగ నాడు భక్తులు ఉండ్రాళ్లు చేసి వినాయకుడికి నైవేద్యం సమర్పించుకుంటారు. తమ బంధుమిత్రులకు పండుగ శుభాకాంక్షలు చెప్పుకుని తమ సంతోషాన్ని రెట్టింపు చేసుకునే భక్తులు విఘ్నాధిపతి భక్తి పాటలు విని పండుగ చేసుకోగలరు. 1) 'జై జై గణేషా..’ సాంగ్ - జై చిరంజీవ 2) ‘దండాలయ్య ఉండ్రాళ్లయ్యా’ పాట - కూలీ నెం.1 3) వక్రతుండ మహాకాయ.. - దేవుళ్లు 4) ‘తిరు తిరు గణనాథ’ సాంగ్ - 100% లవ్


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2NIvj32
v

Saaho Collections: ‘సాహో’ ఫస్ట్ డే వంద కోట్లు.. ప్రభాస్ వరుస రికార్డ్!

టాక్‌తో సంబంధం లేకుండా ‘సాహో’ తొలిరోజు రికార్డు కలెక్షన్లను కొల్లగొట్టింది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ప్యాన్ ఇండియా చిత్రంగా శుక్రవారం నాడు భారీగా విడుదలైన ‘సాహో’ చిత్రానికి నెగిటివ్ టాక్ వచ్చినప్పటికీ కలెక్షన్ల పరంగా రికార్డ్ ఓపెనింగ్స్ సాధించింది. దేశవ్యాప్తంగా ‘సాహో’ మూవీ తొలి రోజు వంద కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను రాబట్టింది. ప్రభాస్ కెరియర్‌లో వరుసగా రెండోసారి వందకోట్లు సాధించిన హీరోగా రికార్డ్ క్రియేట్ చేశారు. రాజమౌళి డైరెక్షన్‌లో వచ్చిన ‘బాహుబలి2’ కూడా తొలి రోజు వంద కోట్ల గ్రాస్ కలెక్షన్లు రాబట్టింది. దీంతో ప్రభాస్ వరస చిత్రాలతో వంద కోట్ల క్లబ్‌లో చేరారు. ఏరియాలవారిగా ఈ కలెక్షన్ల రిపోర్ట్ ఇలా ఉంది... నైజాం: 14. 1 కోట్లు ఆంధ్రప్రదేశ్: 42. 2 కోట్లు కర్ణాటక: 13. 9 కోట్లు తమిళనాడు: 3. 8 కోట్లు కేరళ: 1.2 కోట్లు హిందీ (బాలీవుడ్): 29.6 కోట్లు టోటల్ ఇండియా గ్రాస్ 104.8 కోట్లు టోటల్ ఇండియా షేర్ 68. 1 కోట్లు కాగా.. హిందీలో 29.6 కోట్లు షేర్ సాధించి 2019లో అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రంగా ‘సాహో’ సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. మరోవైపు నైజాం ఏరియాలో బాహుబలి రికార్డ్‌ను బీట్ చేసింది ‘సాహో’. ఫస్ట్ డే నైజాంలో రూ. 14. 1 కోట్లు సాధించిన చిత్రంగా ‘సాహో’ తొలిస్థానంలో నిలిచింది. మరి ఇదే ఊపును వీకెండ్‌లో కొనసాగితే ‘సాహో’ బాక్సాఫీస్ షేక్ చేయడం ఖాయమే.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2NNZG8h
v

RDX Love Teaser: అపరిచితులతో సెక్స్.. పాయల్ సేఫ్టీ టిప్స్‌కి మిలియన్ల వ్యూస్

‘ఇంట్లో పేరెంట్స్ లేనప్పుడు మన ఒంట్లో ఫీలింగ్స్ కంట్రోల్‌లో పెట్టుకోవాలి. తప్పుదు అనుకుంటే సేఫ్టీలైనా అందుబోటులో ఉంచుకోవాలి’.. ఇది స్వాతి పుస్తకంలో డాక్టర్ సమరం చెప్పే సెక్స్ టిప్స్ కాదూ.. వాత్సాయన కామసూత్రం అంతకంటే కాదు. ‘ఆర్ఎక్స్ 100’ హాట్ బ్యూటీ లేటెస్ట్ మూవీ ‘RDX Love’ చిత్రానికి సంబంధించిన టీజర్‌లోనూ బూతు పురణం ఇది. ఆర్ ఎక్స్ 100లో మితిమీరి అందాలను ప్రదర్శించి తెలుగు సినిమాను ఎక్కడికో తీసుకుపోతా అంటూ హిట్ కొట్టిన పాయల్.. ‘RDX Love’ మరోసారి గ్లామర్ డోస్ పెంచింది. గ్లామర్ డోస్ అంటే మితిమీరి అందాలు ప్రదర్శించడమే కాదు.. బరితెగించి సెక్స్‌లో సేఫ్టీలు కూడా వాడేస్తుంది. ముద్దులు, హగ్‌లకు లెక్కేలేదు.. ఎక్కడెక్కడో చేతులు పెట్టించుకుంటూ కామక్రీడలో బౌండరీలు దాటేస్తోంది పాయల్. ‘అలా అక్కడ ముద్దు పెట్టుకుంటే బాగుంటుందా? అని ఒక అమ్మాయి ఆసక్తిగా అడుగుతుంటే స్వర్గం కనిపిస్తుంది అని వాత్సాయనుడుకి నిలువెత్తు కటౌట్ లాంటి హీరో.. పాయల్‌తో రసకేళిలో పోటీ పడుతున్నాడు. అర్ధరాత్ర పూట తన బాయ్ ఫ్రెండ్‌తో కలిసి పోలీసులకు దొరికిన పాయల్‌ని.. ఎక్కడ నుండి వస్తున్నావ్ అంటే.. ‘తను సేఫ్టీ కావాలంటే తీసుకువస్తున్నాను అంటూ పచ్చిగా నిస్సిగ్గుగా చెబుతోంది పాయల్. ఇక సేఫ్టీల వాడకానికి అలవాటుపడ్డ ప్రియుడు ‘అర్జంట్‌గా నాకు నాలుగు సేఫ్టీలు కావాలండీ’ పచ్చిగా అడిగేస్తున్నాడు. ఇందులో ముసుగు వేసి ముద్దులుపెట్టడాలు.. సెక్స్ చేసుకుంటుంటే మంచం విరిగిపోవడాలు... అబ్బో ఇలాంటి బూతు బాగోతాలు చాలానే ఉన్నాయి పాయల్ రాజ్ పుత్ ‘RDX Love’ మూవీ టీజర్‌లో. ‘మీరు ఎప్పుడైనా అపరిచితులతో సెక్స్ చేశారా?’ అంటూ కండోమ్ యాడ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా మారింది పాయల్. ఒకే ఒక్క నిమిషం నిడివితో కట్ చేసిన ఈ టీజర్.. సెక్స్ సినిమాకు ఏ మాత్రం తీసుపోనిదానిలా పాయల్ అందాలతో మంచి కలర్ ఫుల్‌గా ఉండటంతో యూట్యూబ్‌లో 15 లక్షల మందికి పైగా వీక్షించారు. 2 మిలియన్స్‌కి పైగా డిజిటల్ వ్యూస్ రాబట్టిందంటే.. పాయల్ సెక్స్ సేఫ్టీ టిప్స్ బాగానే వర్కౌట్ అవుతున్నాయి. ఇక ఈ కళాఖండానికి శంకర్ భాను దర్శకత్వం వహించగా.. బడా ప్రొడ్యుసర్ సీ. కళ్యాణ్ నిర్మిస్తున్నారు. రాధన్ మ్యూజిక్ అందించిన ‘RDX Love’ మూవీ త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2Zw4EwD
v

తగ్గనంటున్న చిరు.. ఆ రోజు ‘వార్’కి సిద్ధమే!

మెగాస్టార్ డ్రీం ప్రాజెక్ట్ ‘సైరా నరసింహారెడ్డి’ షూటింగ్ ఎప్ప్పుడో కంప్లీట్ చేసుకుంది. సినిమాలో బలమైన కంటెంట్ ఉంది. బాలీవుడ్‌కి సైతం బాగా పట్టే పేట్రియాటిక్ కంటెంట్ ఉంది. అందుకే దాన్ని నేషనల్ ప్రాజెక్ట్‌గా మలచాలని భావించిన రామ్ చరణ్ అనుకున్నట్టుగానే 250 కోట్ల రూపాయల ఖర్చుతో ‘సైరా’ని నిర్మించాడు. మధ్యలో కొన్ని అవాంతరాలు వచ్చినా అనుకున్న టైంలోనే సినిమాని పూర్తి చేసారు. ఈ సినిమాని బాలీవుడ్‌లో రిలీజ్ చెయ్యడానికి ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ హౌస్ ఎక్సెల్ ఎంటర్టైన్మెంట్ కూడా ముందుకు వచ్చింది. పాన్ ఇండియా రిలీజ్ కాబట్టి ఆనవాయితీ ప్రకారం బాలీవుడ్‌లో ఒక ఈవెంట్ చేసి మరీ ఈ సినిమా టీజర్ రిలీజ్ చేసారు. ఆ టీజర్‌లోనే అక్టోబర్ 2న రిలీజ్ అని స్పష్టం చేశారు. అయితే బాలీవుడ్‌లో బడా ప్రొడక్షన్ హౌస్ అయిన యష్ రాజ్ ఫిలిమ్స్ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న బిగ్గెస్ట్ మల్టీస్టారర్ ‘వార్’ కూడా అదే రోజు రిలీజ్ అవుతుంది. యూత్‌లో, మాస్‌లో భారీ ఫాలోయింగ్ ఉన్న హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్ హీరోలుగా నటిస్తున్న ఈ సినిమా ట్రైలర్‌తోనే అంచనాలు పెంచేసింది. హాలీవుడ్ స్టైల్ మేకింగ్‌తో, హై‌వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్సెస్‌తో సూపర్ ఫీస్ట్ ఇచ్చేలా ఉంది. అంతేకాదు, ఈ సినిమాలో ఉన్న పాయింట్ కూడా ఆసక్తికరంగా ఉంది. ‘సైరా’లో అమితాబ్ ఉన్నా హృతిక్, టైగర్‌లు నటించిన సినిమాకే హిందీ ప్రేక్షకులు ప్రాధాన్యత ఇస్తారు. అంత పెద్ద సినిమాతో పోటీపడడం ఇష్టం లేక ‘సైరా’ని రేస్‌లో నుండి తప్పిస్తున్నారు అని వార్తలు వచ్చాయి. ఒక వారం లేటుగా, అంటే అక్టోబర్ 8న ‘సైరా’ రిలీజ్ కాబోతుంది అనే టాక్ గట్టిగా వినిపిస్తుంది. అయితే, ఈ విషయంపై సైరా పీఆర్ టీమ్ నుండి అఫీషియల్ కన్ఫర్మేషన్ వచ్చింది. దాని ప్రకారం సైరా వాయిదా అనే వార్తలో ఏ మాత్రం నిజం లేదు. అది బాలీవుడ్‌లో కావాలని పుట్టించిన ఫీలర్ అని తేల్చేసారు. చాలా ఆలోచించే, అన్నీ పరిగణనలోకి తీసునే ‘సైరా’ డేట్ అనౌన్స్ చేశారు. వీఎఫ్ఎక్స్ పనులు అనుకున్న టైంకి కంప్లీట్ కావడానికి ప్రత్యేకంగా ఒక టీమ్‌ని కూడా నియమించారు. ఇక మిగిలిన పోస్ట్‌ప్రొడక్షన్‌ని రెండు షిఫ్ట్స్‌లో పనిచేస్తూ కంప్లీట్ చేస్తున్నారు. తాము రిలీజ్ గురించి చాలా పకడ్బందీగా ఉన్నాం అని, ఆన్ టైంలో సైరా థియేటర్స్‌లోకి రావడం ఖాయం అని అంటున్నారు. అయితే రీ ఎంట్రీ మూవీ ‘ఖైదీ నెంబర్ 150’ కేవలం ఒకే భాషలో రూ.100 కోట్ల కలెక్షన్స్ కొల్లగోట్టడంతో, సైరా కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే రూ. 250 కోట్లు వసూలు చేయడం ఖాయమని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇక తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో, అలాగే ఓవర్సీస్‌లో సైతం ‘సైరా’ హవా కొనసాగబోతుంది. అందుకే కేవలం ఒక్క లాంగ్వేజ్ గురించి ‘సైరా’ని వాయిదా వేస్తారు అనుకోవడం అమాయకత్వమే. ‘వార్‌’కి ఏ మాత్రం నెగెటివ్ టాక్ వచ్చినా ఆల్టర్నేటివ్ ఆప్షన్ ‘సైరా’ మాత్రమే. అందుకే ఏది ఏమైనా ‘సైరా’ అక్టోబర్ 2న రావడానికి రెడీ అవుతుంది. ‘సైరా’ వెర్సస్ ‘వార్’ అనే ఆసక్తికరమైన పోరుకు ఫిక్స్ అయిపోవచ్చు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2UiiL3u
v

‘గూఢచారి’ని దాటేసిన ‘ఎవరు’.. అబద్ధమంటూ శేష్‌పై నిర్మాత ఫైర్!

హీరోగా, క్రియేటివ్ పార్ట్‌ను లీడ్ చేస్తూ నటించిన సినిమా ‘ఎవరు’. రెజీనా, నవీన్ చంద్ర కీలక పాత్రలు పోషించిన ఈ సినిమా ఆగస్టు 15న విడుదలైంది. ఆద్యంతం ఊహించని మలుపులతో సాగుతూ ఆకట్టుకున్న ఈ థ్రిల్లర్‌కి అన్ని వర్గాల నుండి మంచి ఆదరణ లభించింది. యూనానిమస్ హిట్ టాక్ రావడంతో ‘ఎవరు’ బిగ్గెస్ట్ కమర్షియల్ హిట్‌గా నిలిచింది. ఆ సినిమాతో పాటు విడుదలైన శర్వానంద్ ‘రణరంగం’కి ప్లాప్ టాక్ రావడం, థియేటర్స్‌లో వేరే ఏ సినిమా పోటీగా లేకపోవడంతో ‘ఎవరు’ కలెక్షన్స్ పరంగా సత్తా చాటింది. అయితే, రెండు వారాల గ్యాప్‌లో బరిలోకి దిగిన ‘సాహో’ అంచనాలు అందుకోకపోవడంతో అడివి శేష్ సోషల్ మీడియాలో మళ్ళీ తన సినిమాని ప్రమోట్ చేసుకోవడం మొదలు పెట్టాడు. దానిలో భాగంగా ‘ఎవరు’ తన గత సినిమా ‘గూఢచారి’ కలెక్షన్స్‌ను కూడా దాటేసి తన కెరీర్ బెస్ట్ కమర్షియల్ హిట్‌గా నిలిచింది అని ట్వీట్ చేసాడు. ఇక్కడి వరకు అంతా బాగానే ఉంది. అయితే అడివి శేష్ పెట్టిన ఈ ట్వీట్‌కి ఊహించని రిప్లై ఇచ్చాడు ‘గూఢచారి’ సినిమా నిర్మాత అభిషేక్ నామా. అడివి శేష్ కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్ ‘గూఢచారి’ సినిమానే అంటూ చెప్పుకొచ్చాడు. అలా కాకుండా ‘ఎవరు’ పెద్ద హిట్ అయితే ఆ సినిమా బాక్సాఫీసు కలెక్షన్స్ షేర్ చెయ్యగలవా అంటూ ప్రశించాడు. రెండు తెలుగు రాష్ట్రాల్లో అడివి శేష్‌కి బిగ్గెస్ట్ హిట్ ‘గూఢచారి’ అని కన్ఫర్మేషన్ ఇచ్చేసాడు. చూడడానికి ఇది ఒక ట్వీటే అయినా దీని వెనుక మాత్రం ఏదో ఒక సీక్రెట్ ఉంది. లేకపోతే అడివి శేష్ తన సినిమాని ప్రమోట్ చెయ్యడానికి ట్వీట్ చేస్తే.. అభిషేక్ నామా సవాల్ అన్నట్టుగా అంతగా రియాక్ట్ అవ్వాల్సిన అవసరం ఏముంది?.. పైగా అడివి శేష్ కెరీర్‌లో బిగ్ హిట్ ‘గూఢచారి’ అని చెప్పడం అంటే శేష్ అబద్ధం ఆడినట్టేగా? ‘గూఢచారి’ సినిమాకు నిర్మాత అభిషేక్ నామానే అయినా.. ఆ చిత్రాన్ని కొనుక్కుని డిస్ట్రిబ్యూట్ చేసింది మాత్రం అనీల్ సుంకర. అలాంటప్పుడు ‘ఎవరు’ సినిమా ప్రొమోషన్ కోసం ట్వీట్ చేసిన అడివి శేష్‌ని అంత బాహాటంగా కార్నర్ చేయాల్సిన అవసరం ఏమిటి? ఈ ప్రశ్నల క్రమంలో.. ‘గూఢచారి’ సీక్వెల్ విషయంలో వీళ్లిద్దరి మధ్య ఏమైనా జరిగిందా అనే గుసగుసలు స్టార్ట్ అయ్యాయి. ట్వీట్ చేసిన కాసేపటికే అభిషేక్ పిక్చర్స్ దాన్ని డిలీట్ చేయడం ఈ గుసగుసలకు ఊతమిస్తోంది. దీనికి శేష్ ఏం రిప్లై ఇస్తాడు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2Py48uj
v

saaho: 100 కోట్లు దాటేసిందహో...!

ఇదెక్కడి సినిమారా బాబూ అని కొందరు… ప్రభాస్ మళ్లీ గట్టిగా కొట్టాడని మరికొందరు.. ఇలా ఎవరికి వారు సొంతంగా రివ్యూలు రాసేసుకున్నారు. కానీ సినిమా మాత్రం బాక్సాఫీస్ వద్ద తన పనిని తాను చేసుకుపోయింది. తొలిరోజు కలెక్షన్ల వర్షం కురిపించింది. శుక్రవారం విడుదలైన ఈ సినిమా తొలిరోజు ప్రపంచవ్యాప్తంగా రూ.130 కోట్లు(గ్రాస్) వసూళ్లు రాబట్టిందని చిత్రవర్గాలు వెల్లడించాయి. ఈ సందర్భంగా ‘సాహో’ 130 కోట్ల స్పెషల్ పోస్టర్ కూడా బయటకు వచ్చేసింది. 2019 బిగ్గెస్ట్ యాక్షన్ థ్రిల్లర్‌గా నిలిచింది. సినిమా బాగాలేదన్న క్రిటిక్సే రూ.130కోట్లు వసూళ్లు సాధించని సోషల్ మీడియా ద్వారా వెల్లడిస్తుండడంతో అభిమానులు పండగ చేసుకుంటున్నారు. సుజీత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో బాలీవుడ్ భామ శ్రద్ధా కపూర్ కథానాయికగా నటించారు. నీల్ నితిన్ ముఖేశ్ ప్రతినాయకుడి పాత్రను పోషించారు. జాకీ ష్రాఫ్, మందిరా బేడీ, అరుణ్ విజయ్, ఎవ్లిన్ శర్మ, మురళీ శర్మ తదితరులు సహాయ పాత్రలు పోషించారు. మరో రెండు వారాలు కలెక్షన్ల జోరు ఇలాగే కొనసాగితే నిర్మాతలు పెట్టిన బడ్జెట్ తిరిగి వచ్చేసినట్లే..!


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/30Pp2Gq
v

Namratha: సమంత.. మహేశ్‌తో నా ఫొటో చూశావా..

సినీ ప్రముఖులు సోషల్‌మీడియాలో పోస్ట్ చేసే ఫొటోలకు అభిమానుల్లో విపరీతమైన క్రేజ్ ఉంటుంది. అందులోనూ మహేశ్ బాబు, సమంత, ఎన్టీఆర్ లాంటి స్టార్ సెలబ్రిటీలకు ఉండే క్రేజ్ గురించైతే ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తాజాగా సమంత తన భర్త నాగచైతన్యను ఆలింగనం చేసుకున్న ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ఫొటోకు ‘మై చై అక్కినేని’ అని క్యాప్షన్ ఇచ్చారు. ఈ ఫొటో చూసిన నమ్రత వెంటనే తన ఇన్‌స్టాగ్రామ్‌లో మహేశ్‌ను ఆలింగనం చేసుకున్న ఫొటోను పోస్ట్ చేశారు. దీనికి సమంత పేరుని ట్యాగ్ చేస్తూ.. ‘సేమ్ సేమ్’ అని క్యాప్షన్ ఇచ్చారు. ఇందుకు సమంత బదులిస్తూ.. ‘మీ ఇద్దరూ బెస్ట్ కపుల్’ అని కాంప్లిమెంట్ ఇచ్చారు. సమంత, మహేశ్ కలిసి ‘దూకుడు’, ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ చిత్రాల్లో నటించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం సామ్.. తన కుటుంబంతో కలిసి స్పెయిన్‌లోని ఐబిజాలో విహారయాత్రను ఎంజాయ్ చేస్తున్నారు. మరోపక్క సూపర్‌‌స్టార్ మహేశ్ బాబు ఫ్యామిలీ కశ్మీర్‌లో ఉన్నారు. మహేశ్ నటిస్తున్న ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా చిత్రీకరణ అక్కడే జరుగుతోంది. ఈరోజు మహేశ్ కుమారుడు గౌతమ్ ఘట్టమనేని 13వ పుట్టినరోజు జరుపుకొంటుడడంతో అక్కడే గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకోబోతున్నారట.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2PsG6AG
v

Saaho Review: కామన్ సెన్స్ లేదా.. ‘సాహో’ బాలేదంటారా? యాంకర్ రవి ఫైర్

‘సాహో’ సినిమా బాలేదంటూ నెగిటివ్ ప్రచారం చేసేవారిపై ఫైర్ అయ్యారు . దయచేసి సినిమా చూసి రివ్యూ ఇవ్వాలని.. వెయ్యిలో ఒకడికి సినిమా నచ్చకపోతే దాన్ని హైలైట్ చేయడం సరికాదని.. మీకు నచ్చకపోతే పోయేది రూ. 200 వందలే.. కాని కష్టపడి సినిమా తీసిన వాళ్లకు వందల కోట్లు నష్టం వస్తాయన్నారు’ యాంకర్ రవి. ఈ నెగిటివ్ రివ్యూస్‌పై ఫైర్ అవుతూ తన ఫేస్ బుక్‌ ద్వారా వీడియో వదిలారు రవి. ఇందులో రవి మాట్లాడుతూ.. ‘‘జై’ ..‘డార్లింగ్ ప్రభాస్ కంగ్రాట్స్, దర్శకుడు సుజీత్‌కి కంగ్రాట్స్.. యూవీ క్రియేషన్స్‌కి వారి ధైర్యానికి మెచ్చుకోవాలి. రూ. 350 కోట్లతో సినిమా తీయడం చిన్న విషయం కాదు. అయితే డార్లింగ్‌పై ఇంత ఖర్చుపెట్టారు కాబట్టి ఖచ్చితంగా తిరిగి వచ్చేస్తాయి. నేను సినిమా చూశా.. అదిరిపోయింది సాహో సినిమా నా స్నేహితులతో కలిసి చూశా. నాకు చాలా బాగా నచ్చింది. ఇంటర్నేషనల్ స్టాడర్డ్స్‌తో సినిమా చూపించారు. మన తెలుగు సినిమా ఈ స్థాయికి వెళ్లడం చాలా గర్వంగా ఉంది. నా గ్యాంగ్‌ని తీసుకుని ఈ సినిమాకు వెళ్లాను. నాతో పాటు వాళ్లందరికీ సినిమా చాలా బాగా నచ్చింది. ఈ వీడియో చేయడానికి రీజన్ ఇదే.. నేను ఈ మధ్య చాలా విషయాల్లో రియాక్ట్ కావడం మానేశా. వీడియోలు చేయడం మానేశా. కాని ఈరోజు నాకు మనసుకు చాలా బాధ కలిగింది. నేనెప్పుడూ పాజిటివ్ గురించే మాట్లాడుతుంటా. నేను హెయిర్ కట్ చేయించుకోవడానికి సెలూన్‌కి వెళ్లా.. అక్కడ చాలా మంది బాగుందని అంటుంటే.. ఒకడొచ్చి సినిమా బాలేదంట అన్నా తలనొప్పి అంట.. బోరింగ్ అంట అన్నాడు. సినిమాలో నీకు ఏం బాలేదు? ఎందుకు నచ్చలేదు అని అడిగా. ఏమో అన్నా నేను ఇంకా చూడలేదని అన్నాడు. మరి నువ్ ఎట్లా చెబుతావ్ బాలేదని అంత ఖచ్చితంగా ఎలా డిసైడ్ చేస్తావ్ అని అడిగా. లేదన్నా.. యూట్యూబ్‌లో చూశా.. ఎవరో రివ్యూ బాలేదని రాశారు. తలపోటు అంటున్నారు. అని ఆ వ్యక్తి చెప్పాడు. తప్పు వాళ్లదే.. క్లిక్స్ కోసం కక్కుర్తి.. ఎవడో ఏదో రాశాడని.. నువ్ సినిమా చూడకుండా బాలేదని చెప్పడం ఏంటో నాకు అర్ధం కాలేదు. అయితే ఇక్కడ తప్పు అతనిది అని నేను అనలేను. ఎవరైతే తప్పుడు రివ్యూలు పెడుతున్నారో.. పెద్ద పెద్ద హెడ్డింగ్స్‌తో యూట్యూబ్‌లో వ్యూస్ కోసం కక్కుర్తి పడుతున్నారో వాళ్లను అనాలి. సినిమా అందరికీ నచ్చాలని రూల్ లేదు. ఎవరో ఇద్దరు ఉంటారు.. వాళ్లకు సినిమా అర్ధం కాదు.. నచ్చలేదని చెప్తారు. వాళ్ల మాటను జనం నమ్ముతారు. ఎవరైతే మీడియాలో ఉండి.. యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తూ సినిమా బాలేదంటారో వాళ్లది తప్పు. మన తెలుగు సినిమా స్థాయి పెంచి.. ఇంటర్నేషనల్ స్థాయిలో యాక్షన్ సన్నివేశాలు చేస్తే సింపుల్‌గా బాలేదని అనేస్తున్నారు. వెయ్యిమందిలో ఒక్కడికి సినిమా నచ్చలేదంటే.. దాన్ని పరిగణలోకి తీసుకుంటున్నారు. కొంచెం అయినా కామన్‌సెన్స్ ఉందా? మీకు? యూట్యూబ్‌లో కామన్ సెన్స్ లేకుండా పిచ్చి పిచ్చి హెడ్డింగ్‌లు పెట్టి చెత్త రివ్యూలు రాస్తున్నారు. కొంచెమైనా పాజిటివ్ ఉండటం లేదు. మనకు వినోదాన్ని పంచడం కోసం వాళ్లు కోట్లు ఖర్చుపెట్టి రెండేళ్లు శ్రమపడి సినిమా తీస్తే.. వాళ్లపై నెగిటివ్‌గా చెప్తున్నావ్.. నువ్ పాజిటివ్‌గా మాట్లాడకపోయినా పర్లేదు. నెగిటివ్ మాత్రం వద్దు. ఎప్పటి నుండో దీనిపై మాట్లాడదాం అనుకున్నా.. యూట్యూబ్‌లో లైక్స్ కోసం ఏవోవే రాస్తున్నారు. ఇది చాలా తప్పు. ఇతడు బాలేదని చెప్పడం వల్ల చాలామంది థియేటర్స్‌కు వెళ్లడం లేదు. నేను మంచి సినిమా అభిమానిని. ఒక తెలుగు వాడిగా గర్వంగా ఫీల్ అవుతా. తెలుగోడు స్టామినా.. నేషనల్ నుండి ఇంటర్నేషనల్ స్థాయికి పెరగడం గర్వంగా ఫీల్ అవుతున్నా. ఇప్పుడు నా మాటల్ని కూడా తప్పు పట్టే వాళ్లు చాలా మంది ఉన్నారు. తప్పుపట్టుకోండి నాకు నష్టం లేదు. మనస్పూర్తిగా చెబుతున్నా.. ‘సాహో’ సినిమా చాలా బాగుంది. నాకు నచ్చింది. మీరు కూడా చూడండి. సినిమాను బతికిద్దాం.. చూసి బతికిద్దాం. సినిమా నచ్చకపోతే.. మీకు పోయేవి రూ. 200 మాత్రమే.. వాటికోసం దయచేసి సినిమా చూసే వాళ్లను చెడగొట్టకండి. సినిమా తీయడం అంటే అంత ఈజీ కాదు’ అంటూ ‘సాహో’ నెగిటివ్ రివ్యూస్‌పై ఫైర్ అయ్యారు రవి.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/32lu6mj
v

Disha patani: మా అన్నయ్య దిశాను ప్రేమించలేదు

టైగర్ ష్రాఫ్, .. ముంబయిలోని ఏ రెస్టారెంట్‌లో చూసినా ఈ జంట ఎక్కువగా కనిపిస్తోంది. దాంతో వీరిద్దరూ ప్రేమించుకుంటున్నారని ఎన్నో వార్తలు పుట్టుకొచ్చాయి. మీడియా వర్గాలు ప్రశ్నిస్తే.. అయ్యో మా ఇద్దరి మధ్య అలాంటిదేమీ లేదు అంటారు. కానీ కలిసి తిరగడం మాత్రం మానరు. ఈ నేపథ్యంలో టైగర్ సోదరి కృష్ణా ష్రాఫ్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తన సోదరుడి గురించి వస్తున్న వార్తలపై స్పందించారు. ‘నేను అస్సలు అబద్ధాలు చెప్పను. ముక్కుసూటిగా ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతాను. మా అన్నయ్య 100 పర్సెంట్ సింగిల్‌గానే ఉన్నాడు. ఒకవేళ నాకు అవకాశం ఉంటే.. దిశా పటానీని ఆదిత్య రాయ్ కపూర్‌తో జత చేయిస్తాను’ అని తెలిపారు. గతంలో టైగర్‌ను ఓ అభిమాని ప్రశ్నిస్తూ… ‘మీరు దిశా పటానీతో డేటింగ్‌లో ఉన్నారా?’ అని అడిగారు. ఇందుకు టైగర్ సమాధానమిస్తూ.. ‘నాకు అంత సీన్ లేదు’ అన్నారు. కొన్ని రోజుల తర్వాత ఈ ప్రశ్న దిశా పటానీకి ఎదురైంది. ‘మీరు టైగర్ ప్రేమలో ఉన్నారన్న విషయాన్న ఒప్పుకోవచ్చు కదా.. మీ జంట చూడటానికి బాగుంటుంది’ అని ఓ అభిమాని దిశాకు సలహా ఇచ్చాడు. ఇందుకు దిశా ఆన్సర్ ఇస్తూ.. ‘నేను చాలా కాలంగా టైగర్‌ను మనసు దోచుకోవడానికి ప్రయత్నిస్తున్నాను. తనని ఇంప్రెస్ చేయడానికి బ్యాక్ ఫ్లిప్ చేయడం నేర్చుకున్నాను. మేమిద్దరం కలిసి తినడానికి వెళ్తుంటాం. కానీ దాని అర్థం మేమిద్దరం ప్రేమలో ఉన్నామని కాదు. మీరు ఈ ప్రశ్న టైగర్‌నే అడగండి’ అని సెలవిచ్చారు. దిశా, టైగర్ గురించి ఆయన తండ్రి జాకీ ష్రాఫ్ కూడా స్పందించారు. ‘టైగర్, దిశాకు ఒకే ప్యాషన్ ఉంది. ఇద్దరికీ డ్యాన్స్ అంటే ఇష్టం. వర్కవుట్స్ చేయడం అంటే ఇష్టం. దిశా ఆర్మీ అధికారుల కుటుంబానికి చెందిన అమ్మాయి. కాబట్టి డిసిప్లైన్డ్‌గా ఉంటుంది. వారు భవిష్యత్తులో పెళ్లి చేసుకుంటారా? లేక స్నేహితులుగానే మిగిలిపోతారా? అని ఎవ్వరూ ఊహించలేరు’ అని తెలిపారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2MO5BKL
v

ఓవర్సీస్‌లో ఫుల్లుగా డల్లయిన డార్లింగ్.. ‘స్పైడర్’ తరవాతే ‘సాహో’!

ఈ మధ్యకాలంలో తెలుగు సినిమాలకి చాలా పెద్ద దన్నుగా మారింది ఓవర్సీస్ మార్కెట్. అక్కడ కూడా తెలుగు వాళ్ళ సంఖ్య పెరగడం, వాళ్ళలో ఎక్కువమందికి వీకెండ్ ఎంటర్టైన్మెంట్ డెస్టినీ సినిమానే కావడం, అక్కడ డిస్ట్రిబ్యూటర్స్ కూడా మన సినిమాలు రిలీజ్ చేస్తుండడానికి పోటీపడుతుండడంతో భారీ డిమాండ్ ఏర్పడుతుంది. స్టార్స్ సినిమాలు అయితే ఏకంగా ప్రీమియర్స్‌తోనే వన్ మిలియన్ డాలర్స్ కొల్లగొడుతున్నాయి. ఈ క్రమంలో ఓవర్సీస్ ప్రీమియర్స్‌ కలెక్షన్స్‌లో ప్రభాస్ నటించిన ‘సాహో’ సరికొత్త రికార్డ్స్ సృష్టిస్తుంది అని అంతా అంచనా వేసారు. నాన్ సాహో రికార్డ్స్ అనే పేరు రావడం ఖాయమనుకున్నారు. కానీ అలా జరగలేదు. ఇండియన్ సినిమాకి వరల్డ్‌క్లాస్ రేంజ్‌లో ఒక స్టాండర్డ్ సెట్ చేసిన ‘బాహుబలి’ టాప్‌ప్లేస్‌లోనే నిలిచింది. ప్రీమియర్స్‌తోనే 2.45 మిలియన్స్ కలెక్ట్ చేసిన ‘బాహుబలి-2’.. ‘సాహో’కి అందనంత ఎత్తులో నిలిచింది. ఓవర్‌సీస్‌ కలెక్షన్ రికార్డ్స్‌లో ‘సాహో’ కనీసం సెకండ్ ప్లేస్ కూడా దక్కించుకోలేకపోయింది. ఇంకా కరెక్ట్‌గా చెప్పాలంటే అసలు వన్ మిలియన్ మార్క్‌నే టచ్ చెయ్యలేకపోయింది. ఆల్‌టైం లిస్ట్‌లో టాప్-6 ప్లేస్‌తో సరిపెట్టుకుంది ‘సాహో’. పవన్ కళ్యాణ్-త్రివిక్రమ్‌ల కాంబో‌లో వచ్చిన ‘అజ్ఞాతవాసి’ ఒకటిన్నర మిలియన్ డాలర్స్ కలెక్ట్ చేసి ఆల్‌టైం టాప్ సెకండ్ ప్లేస్‌లో నిలిచింది. ‘బాహుబలి’, ‘ఖైదీ నెంబర్ 150’ సినిమాలు ఆ తరువాతి స్థానాల్లో ఉన్నాయి. Also Read: చివరికి మహేష్ బాబు కెరీర్‌లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ అనిపించుకున్న ‘స్పైడర్’ సైతం ప్రీమియర్స్‌తోనే వన్ మిలియన్ డాలర్స్ క్లబ్‌లో చేరింది. అయితే, ఆ తరువాత విపరీతమైన డ్రాప్‌తో భారీ నష్టాలు మిగిల్చింది. కానీ భారీ హైప్ ‌, ఆఫ్టర్ ‘బాహుబలి’ అనే స్ట్రాంగ్‌ట్యాగ్‌తో వచ్చిన సినిమా అయ్యుండి కూడా ‘సాహో’ కనీసం మిలియన్ డాలర్స్ కూడా కలెక్ట్ చెయ్యలేకపోవడం మాత్రం కాస్త ఆశ్చర్యం కలిగించే విషయమే. ఓవర్‌సీస్‌లో తెలుగు, తమిళ్, హిందీ వెర్షన్స్‌ కలుపుకుని కేవలం ఎనిమిదిన్నర లక్షల డాలర్స్‌కి కాస్త పైచిలుకు అమౌంట్ మాత్రమే కలెక్ట్ చేసింది ‘సాహో’. మరీ ఇంత పూర్‌గా పెర్ఫార్మ్ చెయ్యడానికి కారణం మాత్రం టికెట్ రేటు పెంచడమే అనే వాదన గట్టిగా వినిపిస్తోంది. ఆ ప్రభావం ప్రీమియర్ కలెక్షన్స్‌పై భారీగా పడిందని అంటున్నారు. తెలుగు వెర్షన్‌కి కాస్త బాగానే అడ్వాన్స్ బుకింగ్స్ వచ్చాయి. కానీ హిందీ, తమిళ్ వెర్షన్స్ చాలా తక్కువ అమౌంట్స్ కలెక్ట్ చేసాయి. ఇక డొమెస్టిక్ సర్క్యూట్స్‌లో వచ్చిన రెస్పాన్స్, రేటింగ్స్ ప్రభావం వల్ల ఓవర్సీస్‌లో చాలామంది టికెట్ క్యాన్సిలేషన్‌ని వాడుతున్నారు. సినిమాలో చెప్పినట్టు ఓవర్సీస్‌లో ఉన్న ప్రభాస్ ఫ్యాన్స్, డై హార్డ్ ఫ్యాన్స్ మాత్రం సినిమాకి మంచి మౌత్ టాక్ స్ప్రెడ్ చెయ్యడానికి ట్రై చేస్తున్నారు. సినిమాకి హిట్ టాక్ వచ్చుంటే ఆ దూకుడు వేరేలా ఉండేది. ఇప్పడు లాభాలు అనే మాట పక్కనబెట్టి కొన్న అమౌంట్ రాబట్టుకోటానికి డిస్కౌంట్స్, వన్ ప్లస్ వన్ ఆఫర్స్ లాంటివి ప్లాన్ చెయ్యాల్సి వస్తుంది. Also Read: మరి ఈ ప్రయత్నాలు ఎంతవరకు ఫలిస్తాయో..?, మొదటి వారంలో ‘సాహో’ ఏ మేరకు పెట్టుబడి రికవర్ చేస్తుంది అనేది అక్కడి డిస్ట్రిబ్యూటర్స్‌కి కాస్త ఆందోళన కలిగిస్తుంది అనే మాట మాత్రం నిజం. ఈ వీకెండ్‌లో అంచనాలకు మించి వసూళ్లు రాబడితేనే నష్టాల నుండి బయపటపడడం అనేది సాధ్యం అవుతుంది. మరి ‘సాహో’ ఫేట్ ఎలా ఉంది అనేది తెలియాలంటే ఈ వారాంతం వరకు వేచి చూడాల్సిందే.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2ZA75OJ
v

మంచువారి చిన్నమ్మాయి.. సెలబ్రేషన్స్ స్టార్ట్

తెలుగు సినీ పరిశ్రమలోని పెద్ద కుటుంబాల్లో మంచు ఫ్యామిలీ ఒకటి. మంచువారింట ఏ సంబరం జరిగినా అది ప్రత్యేకమే. మంచు విష్ణు, విరానికా దంపతులకు ఇటీవల నాలుగో సంతానంగా పాప జన్మించిన విషయం తెలిసిందే. ఈ పాపకు ఐరా విద్య అని నామకరణం చేశారు. తన మూడో కూతురు ఫొటోను ఇటీవల సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. అప్పుడే పేరు కూడా వెల్లడించారు. అయితే, తాజాగా విష్ణు భార్య విరానికా సోషల్ మీడియాలో కొన్ని ఫొటోలు పోస్ట్ చేశారు. మొత్తం నాలుగు ఫొటోలను విరానికా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ఈ ఫొటోల్లో తమ నలుగురు పిల్లలతో మంచు విష్ణు దంపతులు కనిపించారు. అలాగే నలుగురు తోబుట్టువులు కలిసి అందంగా ఫొటోలు దిగారు. ఈ ఫొటోలను ప్రముఖ ఫొటోగ్రాఫర్ స్మరిత విన్నకోట తీశారు. కుటుంబ సభ్యులంతా వైట్, లైట్ పింక్ డ్రెస్సుల్లో మెరిసిపోతున్నారు. ఐరా.. నాన్న భుజంపై హాయిగా నిద్రపోతోంది. అమ్మ హస్తాల్లో ఇమిడిపోయింది. అక్కల మధ్య హాయిగా బజ్జొని చూస్తోంది. Also Read: కాగా, విష్ణు దంపతులకు తొలి సంతానంగా కవల ఆడపిల్లలు వివియానా, అరియానా జన్మించిన సంగతి తెలిసిందే. ఆ తరవాత అవ్రామ్‌ జన్మించాడు. దీంతో, మంచువారింట వారసుడు పుట్టేశాడని అభిమానులు సంబరపడ్డారు. కానీ, విష్ణు దంపతులు మరోబిడ్డను కోరుకున్నారు. ఆగస్టు 9న మూడో ఆడబిడ్డకు విరానికా జన్మనిచ్చారు. ఇక సినిమాల విషయానికి వస్తే, ఈ ఏడాది విష్ణు ‘ఓటర్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఆ సినిమా ఆకట్టుకోలేకపోయింది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2ZuMiNa
v

‘సాహో’ రెస్పాన్స్.. అక్కడ లీస్ట్ 4 స్టార్స్!!

ప్రభాస్, శ్రద్ధ కపూర్ జంటగా నటించిన ‘సాహో’ శుక్రవారం ప్రేక్షకులముందుకు వచ్చింది. ఈ సినిమా పాన్ ఇండియా ఇమేజ్‌తో వరల్డ్‌వైడ్‌గా రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా రిజల్ట్ ఏంటి?, రెస్పాన్స్ ఏంటి? అంటే మాత్రం ఒక్కో దగ్గర ఒక్కో రకమైన మాట వినిపిస్తుంది. ఇది చాలా తక్కువ సినిమాలకు మాత్రమే ఇలా జరుగుతుంది. నేటివిటీ, లోకల్ లాంగ్వేజ్, డొమెస్టిక్ స్టార్డమ్ లాంటి ఫ్యాక్టర్స్ వల్ల సాధారణంగా ఇలాంటి టాక్ వస్తుంటుంది. కానీ ‘సాహో’ లాంటి యూనివర్సల్ అప్పీల్ ఉన్న కాన్సెప్ట్‌తో వచ్చిన సినిమాకు ఒక్కో దగ్గర ఒక్కో రకమయిన టాక్ రావడం మాత్రం విచిత్రం. తెలుగు నుండి నేషనల్ హీరోగా ఎదిగాడు కాబట్టి ఇక్కడ ప్రభాస్‌కి ఉండే ఫ్యాన్‌బేస్ వేరు. పైగా ప్రభాస్ ఫ్రెండ్లీ నేచర్ వల్ల అందరి హీరోల ఫ్యాన్స్ కూడా ప్రభాస్ సినిమాపై సాఫ్ట్ కార్నర్‌తో ఉంటారు. అందుకే అతని సినిమా మరీ బాగాలేకపోతే తప్ప ఫ్లాప్ అనే మాట అంత తొందరగా స్ప్రెడ్ కాదు. అయితే ‘సాహో’కి మాత్రం తెలుగు‌ స్టేట్స్‌లో మొదటి రెండు ఆటలకు టాక్ ఒక మోస్తరుగా ఉంది అనే వచ్చింది. సినిమా మరీ తీసికట్టుగా ఉంది అనే మాట ఎక్కడా పెద్దగా వినిపించలేదు. కానీ సాయంత్రం నుండి జనరల్ ఆడియన్స్ కూడా సినిమాకి వెళ్లడంతో టాక్‌లో చాలా తేడా కనిపించింది. Also Read: సెకండ్ హాఫ్‌లో ఉన్న కన్ఫ్యూషన్‌తో ఎవరికి వాళ్ళు సినిమా ఏమీ అర్థం కాలేదు అనే రిపోర్ట్ ఇచ్చారు. దాంతో అప్పటివరకు ఉన్న ఒక మోస్తరు సినిమా అనే టాక్ కూడా వీకైపోయింది. అయితే, ఈ సినిమాకి పంజాబ్‌లో మాత్రం ఊహించని టాక్ వచ్చింది. అక్కడ వాళ్ళు బాలీవుడ్ తప్ప మిగతా లోకల్ లాంగ్వేజ్ సినిమాలను పెద్దగా పట్టించుకోరు. కానీ, ‘బాహుబలి’ లాంటి ఎపిక్ సినిమాలో హీరో అయిన ప్రభాస్ నటించిన మూవీ కావడంతో పంజాబ్‌లో సైతం హౌస్‌ఫుల్స్‌తో ‘సాహో’ తన రన్ మొదలుపెట్టింది. విచిత్రంగా పంజాబ్ ఫ్యాన్స్‌కి, ప్రేక్షకులకి కూడా ‘సాహో’ బాగా నచ్చింది. ప్రతి ఒక్కరూ సినిమా సూపర్ అనేస్తున్నారు. రేటింగ్ ఎంత అంటే 5 స్టార్స్ అంటున్నారు. అక్కడ ‘సాహో’కి వచ్చిన లీస్ట్ రేటింగ్ 4 ‌‌స్టార్స్. అక్కడివాళ్లకు ఈ సినిమా ఎందుకు అంతలా కనెక్ట్ అయ్యింది అంటే వాళ్ళు పెద్దగా అంచనాలు పెట్టుకోలేదు అనే మాట తప్ప వేరే కారణం కనిపించట్లేదు. ఇక తెలుగు సినిమాల హవా‌ని పెద్దగా డైజెస్ట్ చేసుకోలేకపోతున్న బాలీవుడ్‌కి ‘సాహో’‌లో ఉన్న లోపాలు ఆయుధాలుగా మారాయి. దాంతో అక్కడి క్రిటిక్స్ అంతా ‘సాహో’ని చీల్చి చెండాడారు. ఆ ఎఫెక్ట్ బాలీవుడ్ వెర్షన్ కలెక్షన్స్‌పై కొంతవరకు ప్రభావం చూపించింది. దాంతో అక్కడ టాక్ కూడా పూర్తిగా నెగెటివ్‌గా స్ప్రెడ్ అయ్యింది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2PvJZFb
v

ఈ డ్రెస్‌లో వాణీ కపూర్ మతిపోగొట్టేస్తుందట

హీరోయిన్ అనగానే ముందుగా మనల్ని ఆకర్షించేది ఆమె ఫిగర్ ఆ తర్వాత దుస్తులు. ఈ విషయంలో మన భారతీయ నటీమణలు హాలీవుడ్ భామలకు ఏమాత్రం తీసిపోరు. ఇక వర్కవుట్స్ చేసే నటీమణుల ఫిగర్ గురించి ప్రత్యకంగా చెప్పాల్సిన పని లేదు. వారు ఎలాంటి దుస్తులు వేసుకున్నా సెక్సీగా కనిపిస్తారు. ఇప్పుడు నటి గౌను ఒకటి సోషల్‌మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ‘వార్’ సినిమాలో వాణి బ్లూ కలర్ గౌను ధరించే సన్నివేశం ఒకటి ఉంది. దానిని ఎలెక్టిక్ ఎల్లీ సాబ్ గౌను అంటారు. లెబనీస్‌కు చెందిన ఎల్లీ సాబ్ అనే ఐకానిక్ ఫ్యాషన్ డిజైనర్‌ ఈ గౌనును డిజైన్ చేశారు. ఈమె హాలీవుడ్ సెలెబ్రిటీస్ బియాన్సే, కేట్ మిడిల్టన్, నికోల్ కిడ్మన్, ఏంజిలినా జోలీ, ఎమీలియా క్లార్క్, కెండల్ జెన్నర్, టేలర్ స్విఫ్ట్‌లకు ఫ్యాషన్ డిజైనర్‌గా వ్యవహరిస్తుంటారు. ఆమె డిజైన్ చేసిన డ్రెస్‌నే బాలీవుడ్ ఫ్యాషన్ డిజైనర్ అనైతా ష్రాఫ్.. వాణీ కపూర్ కోసం తెప్పించారు. సినిమాలో ఈ గౌను ధరించే సన్నివేశం వాణీ కపూర్ ప్రేక్షకుల మతి పోగొట్టడం ఖాయమని అనైతా అంటున్నారు. ‘సినిమాలో వాణీ ఎల్లీ సాబ్ గౌను వేసుకుంటారు. ఆమెను సినిమాలో వీలైనంత సెక్సీగా చూపించాను. ఇందులో ఫ్యాషన్‌కు ఎక్కవ ప్రాధాన్యత ఇచ్చే అమ్మాయి పాత్రలో వాణి కనిపించనున్నారు. ఆమెను విభిన్న అవతారాల్లో చూస్తాం. ఆమె కోసం నేను చాలా మిక్సింగ్, మ్యాచింగ్ చేసి దుస్తులను ఎంపిక చేశాను’ అని తెలిపారు. బిగ్గెస్ట్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ‘వార్’ సినిమాను రూపొందిస్తున్నారు. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను యశ్ రాజ్ ఫిలింస్ సంస్థ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది. హిందీతో పాటు తెలుగు, తమిళం భాషల్లో గాంధీ జయంతి సందర్భంగా ఆగస్ట్ 2న సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/32rd3zl
v

హీరోయిన్స్ ఆ పని చెయ్యకతప్పదా..?

కథానాయిక.. సినిమాల్లో ఈ పదానికి చాలా ప్రాధాన్యత, ప్రాముఖ్యత ఉంటుంది. కానీ, ఇది ఒక్కప్పటి మాట. ఇప్పుడు మాత్రం హీరోయిన్ అంటే కేవలం అందాల ఆరబోతకు పరిమితం అవుతున్నారు అనేది నిజం. నటించే సత్తా ఉన్నా సరయిన అవకాశం రాక వచ్చిన గ్లామర్ పాత్రలు చేసే వాళ్ళు కొందరయితే, సినిమాల్లో ఉండాలి అనుకుని ఫిక్స్ అయ్యి నటన సరిగా రాక వచ్చిన పాత్రలే చేసుకుని పోయేవాళ్లు మరికొందరు. నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రల్లో నటించే కొద్ది మంది హీరోయిన్లలో సమంత, అనుష్క, నయనతార, కీర్తి సురేష్, సాయి పల్లవి లాంటి వాళ్ళను ఉదాహరణలుగా చూపించవచ్చు. కానీ వీళ్ళలో ఎక్కువమంది కెరీర్ చరమాంకంలో ఉన్నారు. పైగా వాళ్ళు తమ పెర్సనల్‌ లైఫ్‌ని కూడా బాలన్స్ చేసుకోవడానికి వచ్చిన సినిమాల్లో నుండి తమకి నచ్చిన పాత్రలు మాత్రమే ఎంచుకుని చేస్తున్నారు. అందరికి ఆ అవకాశం ఉండదు. Also Read: పూజా హెగ్డే ముందు ‘ముకుంద’, ‘ఓ లైలా కోసం’ సినిమాల్లో పెర్ఫార్మెన్స్ ఓరియెంటెడ్ రోల్స్ మాత్రమే చేసింది. కానీ ఆమెకి అప్పుడు గుర్తింపు రాలేదు, అవకాశాలు రాలేదు. కానీ ‘DJ’ సినిమాలో బికినీ వేసి మరీ మొహమాటపడకుండా అందాల ప్రదర్శన చెయ్యడంతో ఆ సినిమా రిజల్ట్‌తో సంబంధం లేకుండా వరుసగా అగ్రహీరోల సరసన వరుసగా నటించింది. ఇక ఇప్పుడు టాప్ హీరోయిన్‌గా వెలిగిపోతున్న రష్మిక కూడా ముందు ‘ఛలో’ సినిమాలో డీసెంట్‌గా కనిపించింది. కానీ, అప్పుడు ఆమె ఎవ్వరికీ పెద్దగా నచ్చలేదు. ‘గీత గోవిందం’లో విజయ్ దేవరకొండ‌తో రెండు ఘాటు లిప్ లాక్స్ చేసేసరికి మాత్రం అంతా ఆమెపై ఫోకస్ చేసారు. ఇప్పడు బన్నీ, మహేష్ సినిమాల్లో ఆమె హీరోయిన్. చివరికి ‘బాహుబలి’లో తమన్నా, ‘సాహో’లో శ్రద్ధా కపూర్.. సినిమా ఏదయినా, హీరోయిన్ ఎవరయినా కూడా అందాల విందు చేస్తేనే ఆఫర్లు వెల్లువెత్తుతాయి. ‘RX 100’ సినిమా హిట్ అవ్వడానికి కారణం ఆ సినిమాలో పాయల్ రాజపుత్ హీరోతో కలిసి పండించిన రొమాన్స్ అనేది ఒప్పుకుని తీరాలి. అయితే ఆ సినిమా తరువాత ఆమెకు మళ్ళీ అదే తరహా సినిమాలు, అదే తరహా రోల్స్ వచ్చాయి. చాలా కాలం వాటికి వద్దనుకుంటూ వచ్చిన ఆమె మళ్ళీ అదే తరహా రోల్ చెయ్యకతప్పలేదు. ‘RX 100’లోనే ఆమె ఎక్స్‌పోజింగ్ హద్దులు దాటింది అనుకుంటే.. ఇప్పడు చేస్తున్న ‘RDX లవ్’ అయితే బూతుకు మారుపేరులా ఉంది. బోల్డ్ అనేపదానికి ఎక్స్‌టెన్షన్ ఇచ్చి మరీ హీరోయిన్స్‌తో యథేచ్ఛగా బూతులు మాట్లాడించే కల్చర్ కూడా ఎక్కువైపోతోంది. కేవలం పాయల్ మాత్రమే కాదు రకుల్ ప్రీత్ సింగ్ ‘మన్మథుడు-2’లో చేసిన యాక్ట్స్ చూసాక చాలామందికి నోటమాట రాలేదు. మెహ్రీన్ కూడా నటన కంటే ఎక్కువగా స్కిన్ షోని నమ్ముకునే బండి నడిపిస్తుంది. స్కిన్ షోని నమ్ముకుని ముందుకు వెళ్లిన హెబ్బా పటేల్, రాశీ ఖన్నా, రెజీనా లాంటి వాళ్లకు సినిమాలు వచ్చాయి. కానీ కెరీర్ గ్రాఫ్ మాత్రం ఆశించిన స్థాయిలో లేదు. ఇక కెరీర్ ఎండ్‌కి వచ్చింది అని గుర్తించిన కాజల్ కూడా ఈ మధ్య ఎలాంటి సీన్స్ చెయ్యడానికి అయినా అభ్యంతరం చెప్పడం లేదు. ఆమె నటించిన ‘క్వీన్’ తమిళ్ రీమేక్ ‘పారిస్‌ పారిస్’లో సీన్స్ అయితే సెన్సార్ కత్తెరకి బలైపోయాయి. కానీ, అవి కట్ చేసినందుకు కాజల్ ఫీల్ అవ్వడం అసలు హైలైట్. ‘మహానటి’, ‘యూ టర్న్’, ‘ఓ బేబీ’, ‘కర్తవ్యం’ లాంటి సినిమాలు వేళ్ళమీద లెక్కేయ్యవచ్చు. కానీ హీరోయిన్స్ అందాలని, వాళ్ళ బోల్డ్ సీన్స్‌ని నమ్ముకుని తెరకెక్కే సినిమాలు మాత్రం బోలెడన్ని వచ్చాయి, వస్తున్నాయి. హీరోయిన్ అంటే ఎక్స్‌పోజింగ్ చెయ్యాలి అనేది తప్పనిసరిగా మారింది. ఈ ట్రెండ్‌కి ఇప్పట్లో బ్రేక్స్ పడే అవకాశం అయితే లేదు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2HygThJ
v

Friday 30 August 2019

సమంత వేసుకున్న పొట్టి డ్రెస్ అంత ఖరీదా..!

అక్కినేని వారి కోడలు ప్రస్తుతం ఫ్యామిలీతో కలిసి స్పెయిన్‌లోని ఇబిజా ఐల్యాండ్స్‌లో హాలీడేను ఎంజాయ్ చేస్తున్నారు. తన మావయ్య కింగ్ నాగార్జున బర్త్‌డే నిమిత్తం అక్కినేని ఫ్యామిలీ మొత్తం ఇబిజాకు వెళ్లిన సంగతి తెలిసిందే. గురువారం ఇబిజా కాల్మాలో నాగార్జున పుట్టినరోజు వేడుక జరిగింది. భార్య అమల, కుమారులు నాగచైతన్య, అఖిల్, కోడలు సమంతలతో కలిసి నాగార్జున తన 60వ పుట్టినరోజును జరుపుకున్నారు. అయితే, మావయ్య పుట్టినరోజు వేడుకలో సమంత వేసుకున్న డ్రెస్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. నాగార్జున బర్త్‌డే పార్టీలో సమంత పింక్ కలర్ వన్-షోల్డర్ షిమ్మర్ డ్రెస్‌ వేసుకున్నారు. ఈ పొట్టి డ్రెస్‌లో స్విమ్మింగ్ పూల్ వద్ద నిలబడి తీసుకున్న ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ఈ ఫొటోకు విపరీతమైన స్పందన వచ్చింది. అయితే, సమంత వేసుకున్న డ్రెస్ ఖరీదు ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఈ డ్రెస్ ఖరీదు అక్షరాలా రెండు లక్షల రూపాయలని అంటున్నారు. అందుకే ఈ డ్రెస్ హాట్ టాపిక్‌గా మారింది. సమంత ఇన్‌స్టాగ్రామ్‌లో తన ఫ్యామిలీ ఫొటోను కూడా షేర్ చేసినప్పటికీ తన ఫొటో మాత్రం బాగా వైరల్ అయ్యింది. ఇదిలా ఉంటే, తన మావయ్య నాగార్జునకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ కూడా సమంత ఒక పోస్ట్ చేశారు. ఈ పోస్టులో నాగార్జున ఫొటోను పొందుపరిచారు. ఈ ఫొటోలో నాగార్జున స్విమ్మింగ్ పూల్‌లో నిలబడి తన శరీర సౌష్టవాన్ని ప్రదర్శిస్తున్నారు. కాగా, సామ్‌ ఇటీవల ‘ఓ బేబీ’ సినిమాతో హిట్‌ అందుకున్నారు. ప్రస్తుతం ఆమె తమిళ హిట్‌ చిత్రం ‘96’ తెలుగు రీమేక్‌లో నటిస్తున్నారు. ఇందులో శర్వానంద్‌ హీరో. దిల్‌రాజు నిర్మాత. ఇది కాకుండా ఒక వెబ్ సిరీస్‌లో కూడా సమంత నటిస్తున్నారని ప్రచారం జరుగుతోంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2ZC0Fyz
v

Vidya balan: నా భర్తను డబ్బులు అడగలేను.. అందుకే..

ఇప్పటివరకు బాలీవుడ్ నటి ఎందరో దర్శక, నిర్మాతలతో కలిసి పనిచేశారు. ఆమె భర్త సిద్ధార్థ్ రాయ్ కపూర్ కూడా పేరున్న నిర్మాతే. కానీ ఆయన నిర్మాణంలో ఇప్పటివరకు విద్య ఒక్క సినిమాలో కూడా నటించింది లేదు. అలా ఎందుకు అని ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు ఆమె ఈ విధంగా సమాధానం ఇచ్చారు. ‘ఎందుకంటే.. అది టూ మచ్ అయిపోతుంది. నేను నటిస్తున్న సినిమా దర్శకుడు, నిర్మాతతో ఏవన్నా సమస్యలు వస్తే వారితో నేను వాదిస్తాను. గొడవపెట్టుకోను కానీ నా వాదనలో న్యాయం ఉంటుంది. ఒకవేళ నా భర్త నిర్మాణంలో పనిచేయాల్సి వస్తే ఆయనతో ఏదన్నా సమస్య ఎదురైనప్పుడు గొడవ పడుతూనే ఉంటాను. మా వివాహబంధంలో ఎలాంటి సమస్యలు రాకూడదన్నది నా అభిప్రాయం. మేం ఇద్దరం చాలా స్క్రిప్ట్స్ చేయాలని అనుకున్నాం. కానీ పారితోషికం విషయంలో మాత్రం ఆయనతో గొడవపడలేను. నా భర్తగా కాకుండా ఓ నిర్మాతగా.. విద్య నీకు ఇంతే పారితోషికం ఇస్తానని ఆయన అన్నప్పుడు.. కాదు నాకు ఎక్కువ కావాలని అడుగుతాను. ఒకవేళ ఆయన ఒప్పుకోకపోతే మాటా మాటా పెరిగి గొడవకు దారితీస్తుంది. అలాంటి సంఘటనలు మా మధ్య జరగకూడదని అనుకుంటున్నాను’ అని వెల్లడించారు విద్య. ఇటీవల విడుదలైన ‘మిషన్ మంగళ్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు విద్య. అక్షయ్ కుమార్, విద్యా బాలన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా దాదాపు రూ.100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ప్రస్తుతం విద్య హ్యూమన్ కంప్యూటర్‌గా పేరొందిన గణితవేత్తగా శకుంతలా దేవి బయోపిక్‌లో నటిస్తున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2MNidBY
v

సమంత లాస్ట్ సినిమా ఇదేనా

తన చేతిలో ఉన్న ప్రాజెక్ట్‌లన్నీ పూర్తి చేసుకుని పిల్లల కోసం రెండేళ్ల పాటు విరామం తీసుకోవాలనుకుంటున్నారట అగ్ర కథానాయిక . ప్రస్తుతం తన కుటుంబంతో కలిస స్పెయిన్‌లో విహరిస్తున్న సమంత.. తిరిగి భారత్ వచ్చాక ‘96’ రీమేక్‌లో నటిస్తారు. ఈ సినిమా తర్వాత ఆమె ప్రముఖ నటుడు సోనూ సూద్ తెరకెక్కిస్తున్న పీవీ సింధు బయోపిక్‌లో బ్యాడ్మింటన్ ఛాంపియన్ పాత్రలో నటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అదే నిజమైతే ఈ సినిమా తర్వాత పిల్లల కోసం సమంత తన కెరీర్‌కు టెంపరరీగా ఫుల్‌స్టాప్ పెడతారట. అదీకాకుండా నాగార్జున, నాగచైతన్య, సమంత కాంబినేషన్‌లో ఓ సినిమా రాబోతున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ వదంతులన్నింటికీ సమాధానం కావాలంటే సమంత హైదరాబాద్‌కు వచ్చే వరకు ఎదురుచూడాల్సిందే. తమిళంలో బ్లాక్ బస్టర్ విజయం అందుకున్న ‘96’ సినిమాను తెలుగులో దిల్ రాజు రీమేక్ చేస్తున్నారు. ఈ చిత్రంలో సమంతకు జోడీగా శర్వానంద్ నటిస్తున్నారు. ప్రేమ్ కుమార్ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2Ul6GdH
v

సాహో కలెక్షన్లు ఎంత రాబట్టిందో తెలుసా..

సినిమా రివ్యూల మాట ఎలా ఉన్నప్పటికీ కలెక్షన్లు మాత్రం బాగానే ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో సాహో తొలిరోజు రూ.23 కోట్ల వసూళ్లు రాబట్టింది. ముంబయి బాక్సాఫీస్ వద్ద రూ.24 కోట్లు రాబట్టినట్లు సినీ విశ్లేషకులు తెలిపారు. తమిళ వెర్షన్‌లో రూ.11 కోట్లు రాబట్టింది. మలయాళ వెర్షన్‌కు సంబంధించి కలెక్షన్ల వివరాలు తెలియాల్సి ఉంది. క్రిటిక్స్, ఆడియన్స్ నుంచి మిక్స్‌డ్ రివ్యూలు వచ్చినప్పటికీ కలెక్షన్లు ఆశాజనకంగానే ఉన్నాయి. అయితే సాహోపై నెగిటివ్ ప్రచారం జరిగితే మాత్రం రెండు వారాలు కూడా సినిమా థియేటర్‌లో నిలవదని ట్రేడ్ ఎక్స్‌పర్ట్స్ హెచ్చరిస్తున్నారు. సినిమా రిచ్‌గా ఉన్నప్పటికీ స్క్రీన్‌ప్లే దగ్గర బెడిసికొట్టిందని చాలా మంది అన్నారు. ముంబయి, గుజరాత్, మరాట్వాడా ప్రాంతాల్లో సాహోకు మంచి స్పందన వస్తోంది. ఎందుకంటే ఈ ప్రాంతాల్లో రెండు వేల ప్రింట్స్ ఆలస్యంగా వచ్చాయి. బాహుబలి తర్వాత హిందీలో బెస్ట్ డబ్డ్ వెర్షన్‌గా నిలిచింది. సుజీత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం స్వాతంత్ర దినోత్సవానికే విడుదల కావాల్సి ఉంది. కానీ పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తికాలేదని వాయిదా వేశారు. సాహో విడుదలకు ముందు మిషన్ మంగళ్, బాట్లా హౌస్ సినిమాలు విడుదలయ్యాయి. ఆ ప్రభావం సాహో మీదే పడే అవకాశం ఉందని ట్రేడ్ ఎనలిస్ట్‌లు అంటున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2Ug4UL8
v

Saaho: ప్రభాస్ దొంగ అంటున్న బాలీవుడ్ నటి

భారీ అంచనాల మధ్య సాహో సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. గుడ్, బ్యాడ్ రివ్యూలతో బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లను రాబడుతోంది. అయితే సినిమా విడుదలైన రోజే వివాదంలో పడింది. సినిమాలోని ‘బేబీ వోంట్ యూ టెల్ మీ’ అనే పాటలో బ్యాక్‌గ్రౌండ్‌లో డిజైన్ మీకు గుర్తుందా? ఆ డిజైన్‌ను షైలో శివ్ సులేమాన్ అనే ఆర్టిస్ట్ రూపొందించినదట. ఈ విషయాన్ని షైలో ఇన్‌స్టాగ్రామ్ ద్వారా వెల్లడిస్తూ.. తాను రూపొందించిన అసలు డిజైన్ ఫొటోను పోస్ట్ చేశారు. ఆ డిజైన్‌ను షైలో 2014లో రూపొందించారట. తన క్రియేటివిటీని దొంగిలించి కనీసం క్రెడిట్ కూడా ఇవ్వలేదని వాపోయారు. దీనిపై బాలీవుడ్ నటి లీసా రే స్పందిస్తూ.. ‘ఇలా ఒకరి పనితనాన్ని దొంగిలించేవారికి వ్యతిరేకంగా నిలబడి ఖండించాల్సిన సమయం వచ్చింది. ఇది మంచి పద్ధతి కాదు. భారీ సినిమాను తెరకెక్కించిన ఓ నిర్మాణ సంస్థ ఒకరి ఆర్ట్ వర్క్‌ను దొంగిలించడం కరెక్ట్ కాదు. దీనిని దొంగతనం అంటారు. ప్రపంచంలో ఎక్కడా వీటిని సహించరు’ ‘ఆర్ట్ వర్క్‌ను ఉపయోగించడానికి ముందు (నిర్మాణ సంస్థ) ఒక్కసారి కూడా షైలో అనుమతి తీసుకోలేదు. కనీసం ఆమె పనితనాన్ని వాడుకున్నందుకు క్రెడిట్ కూడా ఇవ్వలేదు. క్రియేటర్లను అందరూ దైవంగా భావిస్తారు. వారి ప్రతిభను దొంగలించకూడదు. మీ ఇంట్లోకి ఒక దొంగ చొరబడి మీ విలువైన వస్తువులను దొంగిలిస్తే ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి’ అని పేర్కొన్నారు. ఈ విషయంపై సాహో చిత్రబృందం స్పందించాల్సి ఉంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2zAuO2B
v

Samantha: సమంత బీచ్‌లో బికినీ.. అన్నీ వదిలేసి పిచ్చ హాట్‌గా!

అక్కినేని కోడలు ఆరబోతలో అస్సలు తగ్గడం లేదు.. మామ అక్కినేని నాగార్జున బర్త్ డే సందర్భంగా ఫ్యామిలీ ట్రిప్‌లో ఉన్న హాట్ అవతారం ఎత్తింది. సెగలు రేపే ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చూస్తూ తన ఫ్యాన్స్‌ను ఊరిస్తోంది. ఆగస్టు 29తో 60 ఏట అడుగుపెట్టిన తన మామ నాగార్జున బర్త్ డే వేడుకలను గ్రాండ్‌గా నిర్వహించింది సమంత. ఇందుకోసం నాగార్జునతో పాటు అమల, నాగచైతన్య, అఖిల్ అందరితో కలిసి స్పెయిన్‌లోని ఐబిజాకు వెళ్లారు. అక్కడ రిసార్ట్‌లో బస చేసిన సమంతకు బీచ్ గాలి చల్లగా తగిలే సరికి హాట్ అవతారంలోకి మారిపోయింది. బికినీతో బీచ్ పక్కనే ఉన్న రిసార్ట్‌లో ఓ కుర్చీపై కూర్చొని థైస్ షో చేసింది. తన విశాలమైన థైస్‌ను కెమెరాకు బంధీని చేసి ఆమె సముద్రపు గాలిని ఆస్వాదిస్తూ పోజు కొట్టింది. ఆ తరువాత ఈ పిచ్చ హాట్ ఫొటోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌లో చేసి లైక్‌లు, కామెంట్స్‌, షేర్‌లను రాబట్టే పనిలో పడింది. సమంత షేర్ చేసిన స్పెయిన్ వెకేషన్ హాట్ పిక్స్ ఇవే.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2zCF3mR
v

చిరంజీవి ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్.. తప్పిన ప్రమాదం

మెగాస్టార్ ప్రయాణిస్తున్న విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయ్యింది. నుంచి హైదరాబాద్ వస్తున్న విస్తారా ఎయిలైన్స్ విమానం సాంకేతిక లోపం రావడంతో పైలెట్ అప్రమత్తమయ్యారు. టేకాఫ్ అయిన అరగంటకే మళ్లీ విమానాన్ని వెనక్కు తిప్పి ముంబై ఎయిర్‌పోర్టులో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. ఆ సమయంలో ఫ్లైట్‌లో మొత్తం 120మంది ప్రయాణికులు ఉన్నారు. విమానంలో సాంకేతిక కారణంతోనే ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేసినట్లు తెలుస్తోంది.. పైలట్ వెంటనే సమస్యను గుర్తించడంతో పెద్ద ప్రమాదమే తప్పింది. ప్రయాణికులంతా విమానాశ్రాయంలోనే పడిగాపులు కాయగా.. తర్వాత మరో విమానం ఏర్పాటు చేసి వారిని హైదరాబాద్ పంపారు. అదే విమానంలో ప్రయాణిస్తున్న ఓ ప్రయాణికుడు చిరంజీవి ఫోటోను సోషల్ మీడియాతో పాటూ వాట్సాప్‌లో తన స్నేహితులకు షేర్ చేశారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/32enKVB
v

ప్రభాస్ ఫ్యాన్స్‌ ఆగ్రహం.. కుర్చీలను విరగొట్టి ధ్వంసం

అరెరె.. ఫ్యాన్స్‌కి కోపం వచ్చింది. అవును మరి.. ప్రభాస్ సినిమా అంటే ఏడాదికో.. రెండేళ్లకో విడుదల కాదు. ప్రభాస్ ఏదైనా ప్రాజెక్ట్ పట్టుకున్నారంటే రెండు నుండి ఐదేళ్లు పట్టేస్తుంది. ఇది ప్రభాస్ ఫ్యాన్స్‌కి కాస్త నిరుత్సాహమే అయినా.. ఈసారి నుండి ఏడాది ఒకటైనా సినిమా చేస్తానని ప్రామిస్ చేసిన ప్రభాస్ ‘సాహో’తో మళ్లీ మాట తప్పారు. ఈ సినిమాకి కూడా రెండేళ్లు టైం తీసుకున్నారు ప్రభాస్. పోని ఎట్టకేలకు సినిమా పూర్తైంది.. తమ అభిమాన నటుడ్ని రెండేళ్ల తరువాత వెండితెరపై చూసేందుకు థియేటర్స్‌కి వెళ్లిన ప్రేక్షకులకు షో క్యాన్సిల్ అనడంతో ఒళ్లుమండింది. సహనం కోల్పోయారు. దీంతో చేతికి అందిని కుర్చీలను గాల్లోకి ఎగరేశారు. కుర్చీలను ఇరగొట్టి, ఫర్నిచర్ ధ్వంసం చేసి బీభత్సం సృష్టించారు. ఈ ఘటన తెలంగాణలోని మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్రలో జరిగింది. బెనిఫిట్ షో క్యాన్సిల్ చేయడంతో సహనం కోల్పోయి తమ ప్రతాపం చూపించారు. కాగా భారీ అంచనాల నడుమ శుక్రవారం నాడు థియేటర్స్‌లో విడుదలైన ఈ మూవీకి మిశ్రమ స్పందన వస్తోంది. అభిమానుల అంచనాలకు అందుకోవడంలో ‘సాహో’ విఫలం అయ్యింది. ప్రభాస్, శ్రద్ధా కపూర్ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రానికి రన్ రాజా రన్ ఫేమ్ సుజీత్ దర్శకత్వం వహించారు. రూ. 350 కోట్ల భారీ బడ్జెట్‌తో యూవీ క్రియేషన్స్ ఈ చిత్రాన్ని రూపొందించింది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/30K8yza
v

Prabhas Next Movie: ‘సాహో’ సీక్వెల్.. ఏ ధైర్యంతో ప్రభాస్?

అవును మరి.. రూ. 50-60 కోట్లతో సినిమా ఎవరైనా తీస్తారు.. రూ. 350 కోట్లతో సినిమా తీయాలంటే ఓ రేంజ్‌ ఉండాలి. ‘బాహుబలి’ చిత్రంతో ప్రభాస్‌కి ఆ రేంజ్ వచ్చింది కాబట్టే.. ధైర్యం చేశారు. అది కూడా ఏదో చిన్నాచితకా షార్ట్ ఫిల్మ్ చేసుకుంటూ.. రన్ రాజా రన్‌తో హిట్ అందుకున్న 26 ఏళ్ల యువ దర్శకుడు సుజీత్‌కి బ్రహ్మాండమైన ఆఫర్ ఇచ్చాడు . చిన్న దర్శకుడితో ప్యాన్ ఇండియా మూవీ ప్లాన్ చేయాలంటే.. హీరోకి నిజంగానే గట్స్ ఉండాలి. సినిమా హిట్టా.. ఫట్టా.. యావరేజ్ అన్న విషయాన్ని కాసేపు పక్కన పెట్టేస్తే ధైర్యం చేసినోడో వెండితెరపై నిజమైన హీరో. క్లిక్ అయితే ఇంటర్నేషనల్ రేంజ్.. లేదంటే మళ్లీ హిట్ వేట మొదలుపెట్టాల్సిందే. తెలుగు సినిమా చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో రూ.350 కోట్లు భారీ బడ్జెట్ పెట్టి ‘సాహో’ చిత్రాన్ని రూపొందించారు యూవీ క్రియేషన్స్. డార్లింగ్‌పై ఉన్న నమ్మకంతో ముందు వెనుక ఆలోచించకుండా మనోడి మార్కెట్ స్టామినా చూసి భారీ ఖర్చుపెట్టేశారు. ఈ ఖర్చును తిరిగి రాబట్టేందుకు ప్యాన్ ఇండియా చిత్రంగా ‘సాహో’ను తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేశారు. Read Also: అయితే ఈ సినిమాను చూసిన మెజారిటీ ఆడియన్స్‌ నుండి పెదవి విరుపులు ఎక్కువగా ఉన్నాయి. భారీ అంచనాలతో థియేటర్స్‌కి వెళ్లడంతో పాటు.. చిత్ర యూనిట్ చేసిన భారీ ప్రమోషన్స్ కూడా ఈ పెదవి విరుపులకు కారణం. ఇదిలా ఉంటే.. ఒకవైపు ‘సాహో’ చిత్రానికి పెట్టిన ఖర్చు తిరిగి వస్తుందా? లాభాలు మిగుల్చుతుందా? లాంటి అంశాలపై ట్రేడ్ వర్గాలు తొలి ఆట నుండి లెక్కలు కడుతుండగా.. తెరపైకి ‘సాహో’ సీక్వెల్ అంశం వచ్చింది. Read Also: ఇటీవల ‘సాహో’ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా ప్రభాస్ మాట్లాడుతూ.. ‘అన్నీ కుదిరితే చిత్రానికి సీక్వెల్ ఉండబోతుందని అయితే అది ఇప్పుడే కాదని ఒక రెండేళ్ల తరువాత ‘సాహో’ సీక్వెల్ ఉండబోతుందని అన్నారు. ప్రస్తుతానికి అయితే సాహో తరువాత ‘జిల్’ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో పీరియాడిక్‌ లవ్ స్టోరీలో లవర్ బాయ్‌గా కనిపిస్తానన్నారు ప్రభాస్. అసలే ‘సాహో’ సినిమాకి మౌత్ టాక్ నెగిటివ్‌గా ఉండగా.. ‘సాహో’కి ప్రభాస్ నిజంగానే సీక్వెల్ చేస్తారా? మరో రూ.350 కోట్లు ఖర్చు పెట్టిస్తారా? అన్నది ప్రశ్నార్ధకంగా మారింది. ‘అన్నీ కుదిరితే.. రెండేళ్ల తరువాత సాహో సీక్వెల్’ అన్నారు కాబట్టి ఈ సీక్వెల్ ఆలోచన అటకెక్కినట్టే. అయితే ‘సాహో’ క్లైమాక్స్‌లో దర్శకుడు సుజీత్ మాత్రం సీక్వెల్‌ ఉంటుందనే హింట్ ఇచ్చారు. చూడాలి మరి.. ‘సాహో’ సీక్వెల్ కథ ఎవరి దరి చేరునో.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2Lh7psr
v

Saaho: షాకిచ్చిన అమెరికా బాక్సాఫీస్ కలెక్షన్లు

అయిపోయింది.. అంతా అయిపోయింది..ఏదైతే జరగకూడదు అని ప్రభాస్ అభిమానులు అనుకున్నారో అదే జరిగింది. భారీ అంచనాల మధ్య ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన సాహోకు అమెరికా బాక్సాఫీస్ కలెక్షన్లు షాక్ ఇచ్చాయని ట్రేడ్ ఎనలిస్ట్‌లు అంటున్నారు. తొలిరోజు(గురువారం) అమెరికా బాక్సాఫీస్ వద్ద ‘సాహో’ 820,000 డాలర్లు మాత్రమే రాబట్టింది. అంటే మన కరెన్సీలో దాదాపు రూ.5.8కోట్లు. సూపర్‌స్టార్ మహేశ్ బాబు కెరీర్‌లో అట్టర్ ఫ్లాప్‌గా నిలిచిన ‘స్పైడర్’ తొలిరోజు 1 మిలియన్ డాలర్లన్నా రాబట్టింది. కానీ ‘సాహో’ ఆ మాత్రం కూడా రాబట్టలేకపోయిందట. స్క్రీన్‌ ప్లే బాలేకపోవడం, అనవసరమైన ట్విస్ట్‌లు సినిమాకు మైనస్ పాయింట్‌గా నిలిచాయని విశ్లేషకులు అంటున్నారు. అయితే కలెక్షన్లు ఎలా ఉన్నా అమెరికన్ బాక్సాఫీస్ వద్ద సినిమాకు మంచి స్పందనే వస్తోందని మరికొందరు అంటున్నారు. బాహుబలి సినిమా తర్వాత రెండేళ్ల గ్యాప్ తీసుకుని ప్రభాస్ ఈ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. దాంతో సినిమాకు బీభత్సంగా హైప్ వచ్చేసింది. ఎంతకాదన్నా తొలిరోజు వసూళ్లు ఓ రేంజ్‌లో ఉంటాయని అనుకుంటారు అభిమానులు. వారు అనుకున్న కలెక్షన్‌కు రూపాయి తగ్గినా సినిమా ఫ్లాపైందన్న నిర్ణయానికి వచ్చేస్తారు. అమెరికాలో సినిమాకు మంచి వసూళ్లు రావాలని పంపిణీదార్లు స్పెషల్ ప్రీమియర్ షోలు కూడా నిర్వహించారు. ప్రివ్యూలకు వచ్చిన స్పందన విడుదలైన రోజు మాత్రం రాకపోవడం గమనార్హం. అయితే సినిమా తొలిరోజు వసూళ్లు ‘మహర్షి’ సినిమాను బీట్ చేశాయి. అయితే అందరి దృష్టి సాహో సినిమా బాహుబలిని బీట్ చేయాలన్న విషయంపైనే ఉంది. కానీ అది జరగేలా లేదని విశ్లేషకులు అంటున్నారు. మొత్తానికి సాహో చిత్రం అమెరికాలో ఆరో బిగ్గెస్ట్ ఓపెనర్‌గా నిలిచింది. మరో విషయం ఏంటంటే.. సాహో హిందీ థియేట్రికల్ రైట్స్‌ను ఫార్స్ ఫిలింస్ సంస్థ దాదాపు రూ.42 కోట్లకు విడుదల చేసింది. అమెరికాలో యశ్ రాజ్ ఫిలింస్ సంస్థ ద్వారా హిందీ వెర్షన్‌ను విడుదల చేసింది. కానీ సినిమాకు కావాల్సినంత ప్రచారాన్ని మాత్రం వారు కల్పించకపోవడం మరో మైనస్ పాయింట్‌గా నిలిచింది. అమెరికాలో తెలుగు వారి సంఖ్య ఎక్కువగా ఉంది. కాబట్టి తెలుగు వెర్షన్స్‌కు స్క్రీన్లు ఎక్కువగా ఉండాలి. కానీ వైఆరఎఫ్ సంస్థ తెలుగుకు బదులు హిందీ వెర్షన్‌కు ఎక్కువ స్క్రీన్లను ఏర్పాటుచేసింది. డిస్ట్రిబ్యూటర్లు తమిళ వెర్షన్‌కు కేటాయించిన స్క్రీన్లలో కొన్ని స్క్రీన్లను తెలుగు వెర్షన్ కోసం కేటాయించి ఉంటే కలెక్షన్లు బాగానే ఉండేవి. అమెరికాలో తమిళ్, హిందీ వెర్షన్ టికెట్ల ధర 20 నుంచి 25 డాలర్ల వరకు ఉంది. ఇది మరో మైనస్ పాయింట్. దాంతో అడ్వాన్స్ బుకింగ్స్ కూడా చతికిలపడ్డాయి. ఆదివారంలోపు అమెరికాలో సాహో ఏదన్నా రికార్డును నెలకొల్పుతుందో లేదో వేచి చూడాలి.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/32hDpnb
v

Saaho: తరణ్ ఆదర్శ్ అన్‌బేరబుల్ రివ్యూ.. ఏకేస్తోన్న రెబల్ ఫ్యాన్స్

బాలీవుడ్‌కు చెందిన సినీ విమర్శకుడు, విశ్లేషకుడు తరణ్ ఆదర్శ్ ఇచ్చే రివ్యూలకు ట్విట్టర్‌లో ఫాలోయింగ్ ఎక్కువే. ఆయన చాలా నిజాయతీగా తన నిర్ణయాన్ని చెబుతుంటారని టాక్. అలాంటి తరణ్ ఆదర్శ్ ఇప్పుడు ప్రభాస్ ఫ్యాన్స్‌కు ఆగ్రహం తెప్పించేలా ‘సాహో’ రివ్యూ ఇచ్చారు. అదొక పనికిమాలిన సినిమాగా తీసిపారేశారు. కేవలం 1.5 స్టార్ రేటింగ్ మాత్రమే ఇచ్చారు. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్‌కు కోపం కట్టలు తెంచుకుంది. ట్విట్టర్‌లో ఆదర్శ్‌ను ఏకిపారేస్తున్నారు. ప్రభాస్, శ్రద్ధ కపూర్ జంటగా నటించిన ‘సాహో’ చిత్రం భారీ అంచనాల నడుమ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాను చూసిన ప్రేక్షకులు అంచనాలకు తగ్గట్టుగా లేదంటున్నారు. సినిమాలో యాక్షన్ సన్నివేశాలు, భారీతనం ఉన్నా కథ, కథనం పెద్ద మైనస్‌గా మారాయని అంటున్నారు. మరీ అంత ఘోరంగా లేదని, ఒకసారి చూడదగిన సినిమా అని చెబుతున్నారు. ఇక ప్రభాస్ ఫ్యాన్స్‌కు అయితే ఈ సినిమా పిచ్చపిచ్చగా నచ్చేసింది. సినిమాలో ప్రభాస్ కటౌట్‌ను చూసి వాళ్లు ఊగిపోతున్నారు. ఇలాంటి సినిమాకు మరీ ఘోరంగా రివ్యూ ఇవ్వడం ఇప్పుడు ప్రభాస్ ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు. Also Read: ‘‘ఒక్క మాటలో చెప్పే రివ్యూ... సాహో: అస్సలు మింగుడుపడదు. రేటింగ్: 1.5 నైపుణ్యం, బోలెడంత డబ్బు, అవకాశాన్ని ఒక పసలేని కథ, తికమక పెట్టే కథనం, అనుభవంలేని దర్శకత్వంతో వృథా చేసేశారు’’. అని తన ట్వీట్‌లో తరణ్ ఆదర్శ్ పేర్కొన్నారు. ఇప్పుడు ఈ ట్వీట్ విపరీతంగా వైరల్ అవుతోంది. నాలుగు వేలకు పైగా రీట్వీట్‌లు, 2,500లకు పైగా కామెంట్లు. దక్షిణాది సినిమాపై పక్షపాతం చూపుతున్నారని ఒకరు, గతంలో ఆయన 4 స్టార్లు ఇచ్చినా ఫ్లాపైన బాలీవుడ్ సినిమాలను ఎత్తిచూపుతూ మరొకరు తరణ్ ఆదర్శ్‌ను తిట్టిపోస్తున్నారు. సల్మాన్ ఖాన్ హీరోగా జూన్‌లో విడుదలైన ‘భారత్’ సినిమాకు తరణ్ ఆదర్శ్ అప్పుడు 4 స్టార్లు ఇచ్చారు. సినిమా అద్భుతంగా ఉందని కొనియాడారు. దాన్ని ఎత్తి చూపుతూ ప్రభాస్ ఫ్యాన్స్ ప్రశ్నలు సంధిస్తున్నారు. ‘భారత్’ సినిమా బాక్సాఫీసు వద్ద అట్టర్ ఫ్లాప్ అయ్యిందని, దీనికి మీ సమాధానం ఏంటని ప్రశ్నిస్తున్నారు. వాస్తవానికి ‘భారత్’ సుమారు రూ.300 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. కానీ, సినిమానైతే అందరూ మెచ్చుకోలేదు. ఏదేమైనా, తరణ్ ఆదర్శ్ ఇచ్చిన రివ్యూ, రేటింగ్ తీవ్ర దుమారమే రేపింది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/32hA07T
v

Payal Rajput: అవకాశాల కోసం సెక్స్ చేసే టైప్ కాదు

టాలీవుడ్‌లో పాయల్ హాట్ కేక్‌లా మారిపోయారు. తొలి సినిమా ‘ఆర్ ఎక్స్ 100’ తోనే హిట్ అందుకున్నారు. ఇప్పుడు ఆమెను వరుస అవకాశాలు చుట్టుముడుతున్నాయి. ఆమె నటిస్తున్న ‘ఆర్ డీ ఎక్స్ లవ్’ సినిమా ట్రైలర్ ఇటీవల విడుదలైంది. ఈ సినిమాలో బోల్డ్ సీన్స్ మోతాదును మరింత పెంచేశారు. ఈ సినిమా ప్రచార కార్యక్రమంలో భాగంగా పాయల్ క్యాస్టింగ్ కౌచ్, మీటూ గురించి మాట్లాడారు. ‘ఆర్ ఎక్స్ 100 సినిమా విడుదలయ్యాక ఓ నిర్మాత పెద్ద చిత్రాల్లో అవకాశాలు ఇప్పిస్తానని చెప్పి కోరిక తీర్చమన్నాడు. కానీ నేను ఈ సెక్సువల్ ఫేవర్స్‌కు పూర్తి వ్యతిరేకిని. అందుకే వీటిని ఎప్పుడూ ఖండిస్తుంటాను. చెప్పాలంటే నేను పంజాబ్, ముంబయిలో ఉన్నప్పుడు కూడా ఇలాంటి అనుభవాలు ఎదురయ్యాయి. మున్ముందు కూడా ఎదురవుతుంటాయని అనుకుంటున్నాను. మీటూ ఉద్యమానికి తెరలేచినప్పటికీ క్యాస్టింగ్ కౌచ్ ఘటనలు ఇంకా జరుగుతున్నాయి. అయితే నాకు వీటి గురించి మాట్లాడే ధైర్యం ఉంది. ‘ఆర్ ఎక్స్ 100’లో బోల్డ్ సన్నివేశాల్లో నటించినంత మాత్రాన అవకాశాల కోసం వేరొకరితో సెక్స్‌కి ఒప్పుకొంటానని కాదు’ అని వెల్లడించారు. ‘ఆర్ డీ ఎక్స్ లవ్’తో పాటు పాయల్ ‘వెంకీ మామ’ చిత్రంలో వెంకటేశ్‌కు జోడీగా నటిస్తున్నారు. మాస్ మహారాజా రవితేజ ‘డిస్కో రాజా’ సినిమాతోనూ బిజీగా ఉన్నారు. అయితే పాయల్ నటించిన ‘ఆర్ డీ ఎక్స్ లవ్’ ట్రైలర్‌పై పలువురి నుంచి నెగిటివ్ కామెంట్స్ వస్తున్నాయి. సినిమాలో రొమాంటిక్ సీన్స్ ఉండొచ్చు కానీ మరీ సెక్స్ సినిమాలా తీయకూడదని విమర్శలు వస్తున్నాయి.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2LlcRKH
v

‘సాహో’ విషయంలో రుజువైన సెంటిమెంట్స్!!

ప్రభాస్ హీరోగా తెరకెక్కిన ‘సాహో’ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాపై ఏర్పడిన భారీ క్రేజ్ వల్ల మంచి ఓపెనింగ్స్ కూడా వస్తున్నాయి. కానీ, ఈ సినిమాపై విడుదలకు ముందు రోజు నుంచే కాస్త నెగెటివ్ టాక్ స్ప్రెడ్ అయ్యింది అన్నది వాస్తవం. అయితే, దానికి కారణం యాంటీ ఫ్యాన్సో, మరొకరో కాదు.. సినిమా ఇండస్ట్రీలో బలంగా నమ్మే సెంటిమెంట్స్.‌ ఇండస్ట్రీ జనాలతో పాటు సినిమాలపై ఎక్కువ ఇంట్రెస్ట్ ఉన్న ప్రేక్షలకు కూడా ఈ సెంటిమెంట్ అనే పదం ప్రభావం సినిమాపై ఎంతలా ఉంటుందో బాగా తెలుసు. ‘సాహో’ విషయంలో మాత్రం ఒక సెంటిమెంట్ కాదు, చాలా సెంటిమెంట్స్ రుజువయ్యాయి అనిపిస్తుంది. వాటిలో ముందుగా చెప్పుకోవాల్సింది రాజమౌళి హీరో‌కి హిట్ లేకపోవడం. క్లియర్‌గా చెప్పాలి అంటే రాజమౌళి డైరెక్షన్‌లో సినిమా చేసిన హీరోకి హిట్ రావడం అనేది ఆల్మోస్ట్ ఫిక్స్. ఇప్పటివరకు అదే జరిగింది. కానీ ఆ తరవాత ఆ హీరో చేసిన సినిమా హిట్ మార్క్‌ని అందుకోలేకపోవడం అనేది కూడా ఒక ఫిక్స్డ్ సెంటిమెంట్ అని ఒప్పుకోవాలి. దానికి కారణాలు ఏమైనా కానీ ఇప్పటివరకు ఇదే సెంటిమెంట్ కొనసాగింది. Also Read: రాజమౌళితో జూనియర్ ఎన్టీఆర్ మూడు సినిమాలు చేశారు. రాజమౌళితో చేసిన సినిమా తరవాత వచ్చిన ప్రతి చిత్రం డిజాస్టర్ అయ్యింది. ‘స్టూడెంట్ నం. 1’ తరవాత ‘సుబ్బు’, ‘సింహాద్రి’ తరవాత ‘ఆంధ్రావాలా’, ‘యమదొంగ’ తరవాత ‘కంత్రి’ ఫలితాలు ఏమిటో మీకు తెలిసిందే! రవితేజ, రామ్ చరణ్, నితిన్, సునీల్‌ల విషయంలోనూ ఇదే జరిగింది. ‌ఇప్పుడు ప్రభాస్‌కు కూడా ఇదే రిపీట్ అయ్యింది. దీంతో ఈ సెంటిమెంట్ బలపడిపోయింది. వాస్తవానికి ప్రభాస్‌కు ఇలా జరగడం ఇది రెండోసారి. గతంలో ‘ఛత్రపతి’ సినిమా తరవాత వచ్చిన ‘పౌర్ణమి’ ప్రేక్షకులను ఆకట్టుకోలేదు. ‘సాహో’ విషయంలో రుజువైన రెండో నెగెటివ్ సెంటిమెంట్.. టాలీవుడ్‌లో డైరెక్టర్స్‌కి ఉన్న సెకండ్ సినిమా సిండ్రోమ్. కొంతమంది తప్ప ఫస్ట్ సినిమాతో హిట్ కొట్టిన మహామహులు అయిన డైరెక్టర్స్ సైతం ఈ ఫెయిల్యూర్‌ని ఫేస్ చెయ్యకతప్పలేదు. సుజీత్‌కి కేవలం ఒక సినిమా అనుభవం మాత్రమే ఉండటంతో అతను సెకండ్ సినిమా సిండ్రోమ్‌ని దాటి ప్రభాస్ ఇమేజ్‌ని మ్యాచ్ చేస్తూ హిట్ అందించగలడా అనే డౌట్ చాలామందికి వచ్చింది. ఆ అనుమానమే ఇప్పుడు నిజమయింది. Also Read: ఏ ఒక్క నటుడివల్ల కూడా సినిమాలు ప్లాప్ అవ్వడం అనేది జరగదు. కానీ ఎందుకో కొంతమందికి మాత్రం ‘‘అతను ఉంటే సినిమా హిట్ అవ్వదు’’ అనే స్టాంప్ పడిపోతుంది. అలాంటి ఒక నెగెటివ్ స్టాంప్ బాలీవుడ్ నటుడు జాకీ ష్రాఫ్‌కి కూడా ఉంది. ఇప్పటివరకు ఆయన నటించిన ఏ ఒక్క తెలుగు సినిమా కూడా హిట్ అయిన దాఖలాలు లేవు. ఈ సినిమాలో జాకీ ష్రాఫ్ నటిస్తున్నాడు అనగానే ఫలితం ఎలా ఉంటుంది అన్న అనుమానం చాలామందికి కలిగింది. అయితే ఆ అనుమానం కాస్త ‘సాహో’ విషయంలో నిజమైపోయింది. ఇక సాహోపై ముందే నెగెటివ్ టాక్ స్ప్రెడ్ అయ్యేలా చేసిన ఇంకో ఫ్యాక్టర్ రిలీజ్‌కి చాలా ముందుగా బయటికి వచ్చిన పాజిటివ్ రివ్యూ. నిజానికి ఏ సినిమాకైనా, ఎవరైనా క్రిటిక్ పాజిటివ్ రివ్యూ ఇస్తే హ్యాపీగా ఫీల్ అవుతారు. కానీ ఉమైర్ సంధు అనే వ్యక్తి ఏ సినిమా అయినా చూసి అది బ్లాక్ బస్టర్ అన్నాడు అంటే కచ్చితంగా దాని గ్రాఫ్ ప్లాప్ నుండి యావరేజ్ వరకు మాత్రమే ఉంటుంది. అందుకే అతను సాహో సూపర్ హిట్ అనగానే అతని గురించి, అతని రివ్యూస్ గురించి తెలిసిన వాళ్ళకి ‘సాహో’ ఫలితం‌పై అప్పుడే అనుమానం కలిగింది. ఇప్పుడు అది వాస్తవం అని తేలిపోయింది. ఇలా ‘సాహో’ను ముందు నుండి వెంటాడుతున్న నెగెటివ్ సెంటిమెంట్స్ అన్నీ ఆ సినిమా ఫలితం విషయంలో నిజమయ్యాయి. దీంతో సినిమాల విషయంలో సెంటిమెంట్స్ ఎలాంటి పాత్ర ప్లే చేస్తాయి అనేది మరొకసారి రుజువయింది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2ZEwCSC
v

ఆత్మహత్య చేసుకున్న నటి

సినిమాల్లో నటించేందుకు ముంబయికి వచ్చిన పర్ల్ పంజాబీ అనే యువతి ఆత్మహత్య చేసుకుంది. ఎంతో కాలంగా అవకాశాల కోసం ఎదురుచూస్తున్నప్పటికీ ఏదీ రాకపోవడంతో తీవ్ర నిరాశకు గురైంది. అందులోనూ ఆర్థిక ఇబ్బందులు తలెత్తడంతో గురువారం అర్థరాత్రి ముంబయిలోని ఓషివారా ప్రాంతంలో తాను నివసిస్తున్న అపార్ట్‌మెంట్ నుంచి దూకి బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటన గురించి అపార్ట్‌మెంట్ సెక్యూరిటీ గార్డ్ మాట్లాడుతూ.. ‘గురువారం అర్థరాత్రి 12 నుంచి 12.30 గంటల సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. నాకు రోడ్డుపై ఎవరో అరుస్తున్నట్లుగా అనిపించింది. ఏం జరిగిందో తెలుసుకుందామని వెళ్లాను. నేను తిరిగి వచ్చేసరికి అపార్ట్‌మెంట్‌లోని మూడో అంతస్తు నుంచి అరుపులు వినిపించాయి. నేను పైకి వెళ్లేసరికి ఆ యువతి దూకేశారు’ అని తెలిపారు. పర్ల్ పంజాబీ మెంటల్‌గా డిస్టర్బ్ అయివున్నారని తరచూ ఆమె తన తల్లితో గొడవ పడుతండేవారని పోలీసులు తెలిపారు. గతంలోనూ రెండు మూడు సార్లు ఆత్మహత్యకు పాల్పడితే సకాలంలో హాస్పిటల్‌కు తరలించడం వల్ల బతికారని పేర్కొన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2Lg51SU
v

‘సాహో’.. భారీ బడ్జెట్ సినిమాలకు మోగిన అలారం!

చాలాకాలంగా జాతీయ స్థాయిలో విపరీతంగా ట్రెండ్ అవుతున్న సినిమా పేరు ‘సాహో’. ఆ సినిమాకి అంత హైప్ రావడానికి కారణం ‘బాహుబలి’ లాంటి భారీ విజయం అందుకున్న ప్రభాస్ నటించిన చిత్రం కావడం మాత్రమే కాదు.. ఈ సినిమాకి ‘బాహుబలి’కి మించి బడ్జెట్ పెట్టి, ‘బాహుబలి’ని దాటేలా మార్కెటింగ్ చెయ్యడం కూడా. అయితే ఎలాంటి సంచలనం సృష్టిస్తుందా అని ఎదురుచూసిన ప్రేక్షకుల నిరీక్షణకు తెర దించుతూ ‘సాహో’ థియేటర్లలో వచ్చింది. ‘సాహో’ ఎలాంటి ఫలితం అందుకుంది, ఎంత కలెక్ట్ చేస్తుంది అనే విషయాలు పక్కనబెడితే ఇది ఒక్క విషయంలో మాత్రం పెద్ద సినిమాల నిర్మాణానికి సంబంధించి ఒక స్ట్రాంగ్ హింట్ అయితే ఇచ్చింది. అదే బడ్జెట్ కంట్రోల్. ‘సాహో’కి రూ. 350 కోట్ల బడ్జెట్ అని స్వయంగా ప్రభాస్ చెప్పడంతో అసలు ఈ సినిమాలో అంత విషయం ఏముంది?, విజువల్ వండర్ అనే పదానికి న్యాయం చెయ్యదగ్గ కంటెంట్ ఏముంది? అనే ఆతృత అందరిలో పెరిగింది. కానీ తీరా సినిమా చూస్తే మాత్రం అంత ఖర్చు పెట్టాలని పెట్టారు తప్ప, ఆ రేంజ్ బడ్జెట్‌ని మోసే శక్తి ఆ కథకి లేదని అర్థమైంది. Also Read: వాస్తవానికి ‘సాహో’లో వాడిన విజువల్ ఎఫెక్ట్స్ ఆ స్క్రీన్‌ప్లే ఆర్డర్‌కి అవసరం లేదు అనిపిస్తుంది. ‘బాహుబలి’ అంటే స్టోరీ లైన్‌లోనే ఒక బలం ఉంది. కానీ ‘సాహో’ కావాలని భారీ బడ్జెట్‌తో తీసిన సినిమాగా కనిపిస్తుంది. ‘సాహో’ ఫలితం భారీ బడ్జెట్‌తో సినిమా తియ్యాలి అని కలలు కనే హీరోలు, నిర్మాతలు, డైరెక్టర్స్‌కి ఒక విషయం మాత్రం స్పష్టం చేస్తుంది. స్రిప్ట్ సరిగా ఉంటేనే పెట్టిన డబ్బుకు విలువ. భారీ లాభాలకు కూడా భరోసా ఉంటుంది. ‘సాహో’ ఫలితం వల్ల నెక్స్ట్ టాలీవుడ్ అంతా ఎదురుచూస్తున్న ‘సైరా’ అవుట్ ఫుట్ కూడా ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది అనేది స్పష్టమవుతుంది. ఇక ప్రొడక్షన్‌లో ఉన్న మహేష్ బాబు ‘సరిలేరు నీకెవ్వరూ’ సినిమా కూడా భారీ బడ్జెట్ సినిమానే. వాస్తవానికి ఈ సినిమా బడ్జెట్ కాస్త తక్కువే, కానీ తరువాత మళ్ళీ పెంచారు. అది స్క్రిప్ట్ డిమాండ్ చెయ్యడం వల్ల అయితే పర్లేదు, కానీ అనవసరమైన ఆర్భాటాల గురించి అయితే ఉపయోగం ఉండదు అనేది ‘సాహో’ వల్ల అర్థమవుతుంది. ఇక రూ.450 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ‘RRR’ జక్కన్న చేతిలో రూపుదిద్దుకుంటున్న సినిమా కాబట్టి భయంలేదు. ఎందుకంటే, టాలీవుడ్‌కి పాన్ ఇండియా సినిమా అనే ఫార్మాట్‌ని ఆపాదించింది ఆయనే కాబట్టి ‘RRR’పై అందరికి నమ్మకం ఉంది. Also Read: నిజానికి రాజమౌళి గ్రాండియర్ కోసం సినిమాలు తీయరు. తీసిన సినిమాలో గ్రాండియర్ ఉండేలా చూసుకుంటారు. సో, ఏది ఏమైనా స్క్రిప్ట్ డిమాండ్ చెయ్యడం వల్ల రిచ్‌నెస్ కోసం బడ్జెట్ పెట్టడం అనేది అందరికి సమ్మతమే. కానీ, ఆర్డినరీ కథలను తీసుకుని, వాటికి పాన్ ఇండియా అప్పీల్ తీసుకురావడానికి వందలకోట్ల బడ్జెట్ కేటాయించి, మంచి విజువల్స్‌తో ప్రోమోలు కట్ చేసి హైప్ తేవడం అనేది లాభమా?, నష్టమా? అనే ప్రశ్నకు సమాధానం టాలీవుడ్‌కి మేలు చేస్తుంది అనేది ప్రేక్షకుల అభిప్రాయం.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2UlY1I7
v

కన్నడ నటుడిని చితకబాదిన జనం

కన్నడ నటుడు వివాదాస్పదంలో చిక్కుకున్నారు. గురువారం కర్ణాటకలోని నాపోక్లు ప్రదేశంలో ఆయన న్యూసెన్స్ క్రియేట్ చేశారు. కేఎస్‌ఆర్టీసీ ఎదుట నిలిపి ఉన్న కారును ధ్వంసం చేశారు. అతని ప్రవర్తన చూసిన స్థానికులు నిలదీశారు. మాట వినకపోయేసరికి పట్టుకుని చితకబాదారు. విషయం తెలిసి స్థానిక మీడియా వర్గాలు అక్కడి చేరుకోవడంతో విషయం వెలుగులోకి వచ్చింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని అదుపు చేశారు. అయితే ఆయన ఎందుకు అలా ప్రవర్తించారన్న విషయం తెలియరాలేదు. ఒకవేళ తాగి అలా ప్రవర్తించారా.. లేక సదరు కారు యజమానితో వ్యక్తిగత కక్షలు ఏమన్నా ఉన్నాయా అన్న కోణంలో కర్ణాటక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వెంకట్‌ను కస్టడీలోకి తీసుకుని విచారణ జరుపుతున్నామని ఎస్పీ కొడాగు తెలిపారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2zyFVcc
v

కృతి సనన్‌కు అద్దె గర్భం కష్టాలు

టాలీవుడ్ అట్టర్ ఫ్లాప్ అయినా బాలీవుడ్‌లో మాత్రం మంచి స్టార్‌డంను సంపాదించుకున్నారు నటి కృతి సనన్. ‘బరైలీ కీ బర్ఫీ’, ‘లుకా చుప్పి’ వంటి మంచి కాన్సెప్ట్ ఉన్న సినిమాలతో మంచి పేరు తెచ్చుకున్నారు. ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. అదే.. ‘మిమి’. సరోగసీ (అద్దె గర్భం) అనే కాన్సెప్ట్‌తో ఈ సినిమా రాబోతోంది. ‘లుకా చుప్పి’ సినిమాకు దర్శకత్వం వహించిన లక్ష్మణ్ ఉతేకర్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఈ సినిమా ఫస్ట్‌లుక్ విడుదలైంది. ‘అనుకోకుండా జరిగే మిరాకిల్స్‌తో నిండినదే జీవితం. ముందెప్పుడూ చూడని మరో ప్రయాణానికి సిద్ధం కండి. ఈ సినిమా ఎంతో ప్రత్యేకంగా ఉండబోతోంది’ అని పేర్కొంటూ పోస్టర్‌ను విడుదల చేశారు. ఇందలో కృతి ఓ చిన్నారికి తల్లి పాత్రలో నటిస్తున్నారు. చూడబోతే మరోసారి లక్ష్మణ్, కృతి కలిసి బ్లాక్ బస్టర్‌ను తమ ఖాతాలో వేసుకోబోతున్నారనే అనిపిస్తోంది. ఈ మధ్యకాలంలో బాలీవుడ్‌లో సరోగసీ కేసులు బాగా ఎక్కువైపోయాయి. సన్నీ లియోనీ, ఫరా ఖాన్, షారుక్, గౌరీ దంపతులు, కరణ్ జోహార్ తదితరులు సరోగసీ ద్వారా పిల్లలను పొందారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2LfqHyt
v

‘సాహో’ మూవీ రివ్యూ

భారీ అంచనాల నడుమ ఈ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమాపై ఇటు ట్రేడ్ వర్గాలతో పాటు అటు అభిమానుల్లో భారీ అంచనాలున్నాయి.

from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2ZBR8Ym
v

Saaho Full Movie: రిలీజైన గంటల్లోనే ఆన్‌లైన్లో ‘సాహో’.. బుద్ధి చూపించిన తమిళ్ రాకర్స్!

ఇటీవల తెలుగులో వచ్చి విజయం సాధించిన మజిలీ, జెర్సీ సినిమాలను తమ వెబ్‌సైట్లో లీక్ చేశారు. ఇది ఆ సినిమా కలెక్షన్లపై ప్రభావం చూపింది. దీంతో ఇప్పుడు ‘మహర్షి’ సినిమా విషయంలోనూ కలెక్షన్లపై ప్రభావం చూపుతోందేమోనని నిర్మాతలు ఆందోళన పడుతున్నట్లు సమాచారం. భారీ బడ్జెట్ చిత్రాల నిర్మాతలకు నిద్రపట్టకుండా చేస్తోంది తమిళ్ రాకర్స్. సినిమా ఇండస్ట్రీలను పట్టి పీడిస్తున్న ఈ వెబ్‌ సైట్‌ను బ్లాక్ చేయాలని ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్ (ఐఎస్‌పీ)ను ఢిల్లీ హైకోర్టు ఇటీవల ఆదేశించినా ప్రయోజనం లేకపోయింది. ఇటీవల మహేష్ బాబు కెరీర్‌లో 25వ చిత్రంగా విడుదలైన ‘మహర్షి’ని థియేటర్లో విడుదలైన కొన్ని గంటలకే తమిళ్ రాకర్స్ ఆన్‌లైన్‌లో లీక్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా సాహో మూవీని సైతం విడుదలైన కొన్ని గంటలకే తమిళ్ రాకర్స్ లీక్ చేయడం గందరగోళానికి దారితీసింది. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, బాలీవుడ్ భామ శ్రద్ధాకపూర్ లేటెస్ట్ మూవీ సాహో నేడు(ఆగస్టు 30న) తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా 10 వేల థియేటర్స్‌లో విడుదలైంది. బాహుబలి మూవీ అనంతరం ప్రభాస్ నటించిన మూవీ కావడం, హాలీవుడ్ రేంజ్ టేకింగ్స్‌తో భారీ బడ్జెట్ మూవీగా రావడంతో ప్రేక్షకులలో భారీ అంచనాలున్నాయి. అయితే మూవీ విడుదలైన కొన్ని గంటలకే తమిళ్ రాకర్స్ తన బుద్ధి చూపించింది. హెచ్‌డీ ప్రింట్‌ను లీక్ చేసి మూవీ నిర్మాతలకు గట్టి షాకిచ్చింది. సాహో మూవీ సక్సెస్ కావాలని, యాక్షన్ సీన్లను ఎంజాయ్ చేయాలని కోరుతూ సినిమా విడుదలకు ముందే యూవీ క్రియేషన్స్ ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది. పైరసీ లాంటివి గమనిస్తే తమకు వాట్సాప్ ద్వారా సమాచారం అందించాలంటూ సాహో, వరల్డ్ సాహో డే అనే హ్యాట్ ట్యాగ్స్‌తో పోస్ట్ చేయడం గమనార్హం. కాగా, మహర్షి మూవీలో పాటు ఎన్టీఆర్ కథానాయకుడు, డియర్ కామ్రెడ్, వైఎస్సార్ బయోపిక్ ‘యాత్ర’ ఇలా ఎన్నో సినిమాలను తమిళ్ రాకర్స్ ఆన్‌లైన్లో లీక్ చేసి ఆ సినిమా నిర్మాతలకు, డిస్ట్రిబ్యూటర్లకు తీవ్ర నష్టాన్ని కలిగించిన విషయం తెలిసిందే.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2ZIRcFS
v

Thursday 29 August 2019

Kl Rahul: క్రికెటర్‌తో లింక్.. నటిని ఇరికించిన నిర్మాత

బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి కుమార్తె ఆథియా శెట్టి.. కేఎల్ రాహుల్‌కి మధ్య ఏదో ఉందని ఎప్పటి నుంచో జోరుగా ప్రచారం జరుగుతోంది. వీరిద్దరూ కలిసి దిగిన ఫొటోలు కూడా సోషల్‌మీడియాలో దర్శనమిస్తున్నాయి. ఈ నేపథ్యంలో నిర్మాత విక్రమ్ ఫడ్నిస్.. ఆథియాను ఆటపట్టించాలనుకున్నారు. ఆథియా తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ పెట్టారు. ‘మీ జీవితంలోని టైమింగ్‌ను నమ్మండి’ అని క్యాప్షన్ ఇచ్చారు. ఈ పోస్ట్‌పై విక్రమ్ కామెంట్ చేస్తూ.. ‘ఆథియా.. ఈ మధ్యకాలంలో నువ్వు బాగా హైపర్ అయిపోతున్నావ్. కేఎల్ వద్దకు వెళ్దామా. అదే.. కౌలాలంపూర్’ అని పరోక్షంగా రాహుల్ గురించి కామెంట్ చేశారు. దాంతో ఆథియాకు ఒళ్లుమండింది. ‘నిన్ను బ్లాక్ చేయాల్సిన సమయం వచ్చింది’ అని సమాధానం ఇచ్చారు. విక్రమ్ అక్కడితో ఆగలేదు. ‘నేను అంపైర్‌కు ఫిర్యాదు చేస్తాను. నీ వికెట్ పడిపోయాక పెవిలియన్‌కు చేరుకోవాల్సిందే’ అంటూ ఆటపట్టించారు. తనపై వస్తున్న వదంతులపై రాహుల్ మాట్లాడుతూ.. ‘నేను న్యూస్‌ పేపర్సే చదవను. కాబట్టి నా గురించి ఎవరేం రాస్తున్నారో తెలీదు. నా వ్యక్తిగత జీవితాన్ని పర్సనల్‌గానే ఉంచుకోవాలని అనుకుంటున్నాను. నా దృష్టంతా క్రికెట్ మీదే ఉంది. ఒకవేళ నేను ప్రేమలో ఉంటే ముందుగా మీకే చెప్తాను’ అన్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2ZAjKAZ
v

Sri Reddy: ‘సాహో’ని ఫ్లాప్ అంటున్నది ఆ హీరో ఫ్యాన్సే: పుల్ల పెట్టిందిగా!

దాదాపు రెండున్నరేళ్ల శ్రమ.. వందలాది కోట్లు.. స్టార్ క్యాస్టింగ్.. హాలీవుడ్ టెక్నీషియన్లతో ఇంటర్నేషనల్ స్టాండర్డ్‌తో ‘సాహో’ చిత్రాన్ని రూపొందించారు యువ దర్శకుడు సుజీత్. చిన్న చిన్న షార్ట్ ఫిల్మ్స్ చేసుకుంటూ ‘రన్ రాజా రన్’ చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న 26 ఏళ్ల అనంతపురం కుర్రాడి స్టఫ్ తెలుసుకుని పిలిచి మరీ సినిమా ఆఫర్ ఇచ్చారు ప్రభాస్. రెండో చిత్రంతోనే స్టార్ దర్శకులు ఎవ్వరూ సాహసం చేశారు దర్శకుడు సుజీత్. సుమారు రూ. 350 కోట్లతో భారీ యాక్షన్ ప్యాక్డ్ మూవీని హైటెక్నికల్ వాల్యూస్‌తో రూపొందించారు. ఇక భారీ అంచనాలతో నేడు విడుదలైన ఈ చిత్రానికి మిక్స్ టాక్ వస్తోంది. అయితే కొంతమంది ట్విట్టర్‌లో పనికట్టుకుని ‘సాహో’ ఫ్లాప్ అంటూ వరుస ట్వీట్లు చేస్తున్నారు. Read Also: ఈ నెగిటివ్ ట్వీట్లను తన వివాదానికి ఆయుధంగా మార్చుకుంది వివాదాస్పద నటి . ‘సాహో’ మూవీ ఎలా ఉంది అంటూనే.. కొంతమంది ఈ సినిమా ఫ్లాప్ అంటూ కామెంట్ చేస్తున్నారు.. వాళ్లు ఎవరో నాకు తెలుసు వాళ్లు పవన్ కళ్యాణ్ ఫ్యాన్’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. పీకే ఫ్యాన్స్ గొర్రెల్లారా? మారరా ఏంట్రా మీరు, ప్రభాస్ మూవీపై పడి ఏడుస్తున్నారు అంటూ తనదైన శైలిలో రెచ్చిపోయింది శ్రీరెడ్డి. అయితే ‘సాహో’ సినిమా బాగానే ఉంది అంటూ కొంతమంది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా ట్వీట్ చేస్తున్నారు. మరి అవి ఎందుకు కనిపించలేదో శ్రీరెడ్డికి. మొత్తానికి తన పోస్ట్‌తో ప్రభాస్ ఫ్యాన్స్‌కి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌కి మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నం చేసింది శ్రీరెడ్డి.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2Lj29o1
v

Saaho: ఫ్యాన్స్‌కు శ్రద్ధా కపూర్ వార్నింగ్

‘డై హార్డ్ ఫ్యాన్స్’ రచ్చ చేయడానికి సమయం ఆసన్నమైంది. ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ‘సాహో’ చిత్రం ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ నేపథ్యంలో పైరసీ బాబులకు శ్రద్ధా వార్నింగ్ ఇచ్చారు. ‘వరల్డ్ సాహో డే వచ్చేసింది. చెమట, రక్తం ధారపోసి ఈ భారీ చిత్రాన్ని ఎంతో నిబద్ధతతో చిత్రీకరించాం. ఇదంతా కేవలం రెప్పపాటు సమయంలో జరిగిపోలేదు. మీ ప్రేమాభిమానాలతో ఎన్నో అవాంతరాలను ఛేదించి పూర్తిచేయగలిగాం. ఇప్పుడు ‘సాహో’ సినిమా డై హార్డ్ ఫ్యాన్స్‌ది. స్పాయిలర్స్‌ని స్ప్రెడ్ చేయకండి. సాహో సినిమాను మీ దగ్గర్లోని థియేటర్లలోనే చూడండి. పైరసీకి నో చెప్పండి. ఒకవేళ ఎవరైనాసినిమా పైరసీ చేసినట్లు తెలిస్తే వెంటనే నేను ఇచ్చిన పైరసీ ఆర్గనైజేషన్‌కు సమాచారం అందించండి’ అని పేర్కొన్నారు. 2019లో విడుదలైన దాదాపు అన్ని బాలీవుడ్ చిత్రాలు పైరసీ బారిన పడినవే. సాహో సినిమాకు అలాంటి సమస్యలు ఎదురుకాకూడదని చిత్రబృందం అన్ని చర్యలను తీసుకుంది. సుజీత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని దాదాపు రూ.350 కోట్లు ఖర్చు పెట్టి తెరకెక్కించారు. ఇందులో నీల్ నితిన్ ముఖేష్, అరుణ్ విజయ్, జాకీ ష్రాఫ్, మహేశ్ మంజ్రేకర్, చుంకీ పాండే తదితరులు కీలక పాత్రలు పోషించారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2ZBtAPk
v

ఖుష్బూ మేడమ్.. తలైవా ఎలా ఉంటారో తెలీదా

సినీ నటి, కాంగ్రెస్ నేత ఖుష్బూపై నెటిజన్లు విపరీతంగా కామెంట్లు చేస్తున్నారు. ఎందుకంటే.. ఆమె తలైవా రజనీకాంత్‌నే గుర్తుపట్టలేకపోయారు. అసలేం జరిగిందంటే.. తన స్నేహితురాలితో కలిసి విహారయాత్ర నిమిత్తం లండన్ వెళ్లారు. అక్కడ ఓ షాపింగ్ సెంటర్‌కు వెళ్లగా.. మొబైల్ బ్యాక్ కవర్స్ కనిపించాయి. కవర్‌పై తమీమ్ బొమ్మ ఉంది. ఆ డిజైన్ కాస్త చూడటానికి రజనీకాంత్‌ను పోలి ఉంది. దాంతో వెంటనే ఖుష్బూ ఆ ఫోన్ బ్యాక్ కవర్ ఫొటో తీసి ట్విటర్‌లో పోస్ట్ చేశారు. ‘లండన్‌లోని ఆక్స్‌ఫోర్డ్ స్ట్రీట్‌లోని దుకాణంలో నాకు ఏం కనిపించిందో చూడండి.. మన సూపర్‌స్టార్ రజనీకాంత్’ అని పేర్కొంటూ.. రజనీ కూతురు సౌందర్య రజనీకాంత్‌ను కూడా ట్యాగ్ చేసింది. కానీ ఫోన్ కవర్ వెనక ఉన్నది తలైవా కాదు. తమీమ్. అది గుర్తించిన నెటిజన్లు.. ఖుష్బూని ఓ ఆటాడుకున్నారు. ‘చెన్నైలో ఉంటూ తలైవా ఎలా ఉంటారో కూడా తెలీదా?’ అంటూ తిట్టిపోశారు. తప్పు గమనించిన ఖుష్బూ వెంటనే ట్విటర్ వేదికగా క్షమాపణలు చెప్పారు. ‘ఓకే.. ఆయన మన రజనీకాంత్ కాదు. నన్ను సరిద్దిన స్నేహితులందరికీ ధన్యవాదాలు. తప్పుని ఒప్పుకుంటూ నేను, సరిదిద్దిన మీరు ఎదుగుతున్నాం. తప్పుల నుంచి నేర్చుకుంటున్నాను’ అని పేర్కొన్నారు. ఒకప్పుడు ఎన్నో సినిమాల్లో నటించి ఓ వెలుగు వెలిగిన ఖుష్బూ ప్రస్తుతం కాంగ్రెస్ సభ్యురాలిగా వ్యవహరిస్తూనే అతిథి పాత్రల్లో నటిస్తున్నారు. ఆమె చివరిగా పవన్ కల్యాణ్ నటించిన ‘అజ్ఞాతవాసి’ చిత్రంలో నటించారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2Zyldrx
v

Jacqueline Fernandez: ‘సాహో’.. బ్యాడ్‌ బాయ్‌ భామ రూ. 2 కోట్లుకు న్యాయం చేసిందా?

థియేటర్స్‌లో ‘సాహో’ మేనియా కొనసాగుతోంది. ప్రపంచ వ్యాప్తంగా ఏ థియేటర్స్ వద్ద చూసినా ప్రభాస్ అభిమానుల కోలాహలంతో సందడిగా ఉంది. బాహుబలి చిత్రం తరువాత ప్రభాస్ నటించిన మూవీ కావడంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇక ఈ చిత్రం ఇప్పటికే పలుచోట్ల ప్రదర్శితం కావడంతో సినిమా ఎలా ఉంది? ప్రభాస్ బాహుబలి రికార్డ్‌లను బ్రేక్ చేశాడా? సుజీత్ డైరెక్షన్ బాగుందా? యాక్షన్ సన్నివేశాలు ఎలా ఉన్నాయి? లాంటి చర్చలతో పాటు ఈ చిత్రంలో ఐటమ్ సాంగ్‌లో మెరిసిన శ్రీలంక సుందరి జాక్వలిన్‌ ఫెర్నాండెజ్‌‌పై కూడా ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. ‘సాహో’ చిత్రంలో బాగా పాపులర్ అయిన సాంగ్ ఏదైనా ఉంది అంటే.. అది ఆమె ప్రభాస్‌తో ఆడిపాడిన బ్యాడ్ బాయ్ సాంగ్. ‘సాహో’ ప్రీ రిలీజ్ సందర్భంగా విడుదల చేసిన ఈ సాంగ్ యూట్యూబ్‌ని షేక్ చేసింది. కాగా ఈ సాంగ్ కోసం ఈ భామ ఏకంగా రూ. 2 కోట్ల పారితోషికంగా తీసుకోవడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయ్యింది. ఒక్కసాంగ్‌కి రూ. 2 కోట్లా అంటూ చాలా మంది నోరెళ్లబెట్టారు. అయితే ఈ బ్యాడ్ బాయ్ సాంగ్‌ను వెండితెరపై చూసిన ప్రేక్షకులు అందచందాలకు ఫిదా అవుతున్నారు. తన అందచందాలతో అదరహో అనిపించింది జాక్వలిన్. తన ఒంపుసొంపుల వయ్యారాలతో మెలికలు తిరుగుతూ కనువిందు చేసింది. ప్రభాస్ పక్కన మరింత గ్లామరస్‌గా కనిపించింది. ఆమెతో పాటు అందమైన మోడల్స్‌తో సాంగ్ చాలా కలర్‌ఫుల్‌గా ఉంది. ఈ పాటను బాలీవుడ్ కంపోజర్ బాద్‌షా స్వరపరిచారు. నీతి మోహన్‌తో కలిసి ఆయనే ఆలపించారు. శ్రీజో సాహిత్యం అందించారు. మొత్తానికి తీసుకుంటే తీసుకుంది కాని.. రూ. 2 కోట్లు వాటికి న్యాయం చేసిందనే అంటున్నారు సినీ అభిమానులు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2UmxHxG
v

Vishal: పెళ్లి ఆగిందా.. కాబోయే భార్య పోస్ట్ ఇది

విశాల్, అనీశాల వివాహం రద్దైందని చాలా కాలంగా వదంతులు వెలువడుతున్నాయి. ఇందుకు కారణం అనీశా తమ నిశ్చితార్థానికి సంబంధించిన ఫొటోలను సోషల్‌మీడియా నుంచి డిలీట్ చేయడమే. పెళ్లి ఆగిపోయిందని ఎన్ని పుకార్లు వస్తున్నా వీరిద్దరూ స్పందించలేదు. అయితే విశాల్‌కు బర్త్‌డే విషెస్ చెప్పి ఈ వదంతులకు ఫుల్‌స్టాప్ పెట్టారు అనీశా. ‘హ్యాపీ బర్త్‌డే స్టార్. నువ్వు స్టార్‌గా మెరవడానికే పుట్టావు. నీకు జీవితంలో మంచి రోజులు రాబోతున్నాయి. నాకు ఆ నమ్మకం ఉంది. నిన్నెప్పటికీ ప్రేమిస్తూనే ఉంటాను’ అని పేర్కొంటూ విశాల్‌తో కలిసి దిగిన ఫొటోను ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో పోస్ట్ చేశారు. అయితే.. నడిగర్ సంఘానికి ఓ కార్యాలయం నిర్మించేంతవరకు పెళ్లి చేసుకోకూడదని నిర్ణయించుకున్నారు. ఈ విషయాన్ని అనీశాతో కూడా చర్చించానని ఇందుకు తాను కూడా ఒప్పుకుందని విశాల్ అన్నారు. అయితే ఇదే విషయంలో ఇద్దరికీ మనస్పర్ధలు వచ్చి పెళ్లిని రద్దు చేసుకున్నాయని కోలీవుడ్ వర్గాలు అన్నాయి. మొత్తానికి అనీశా ఒక్క పోస్ట్‌తో క్లారిటీ ఇచ్చేసింది. వర్క్ పరంగా ప్రస్తుతం విశాల్ ‘యాక్షన్’ చిత్రంలో నటిస్తున్నారు. సుందర్ సి దర్శకత్వం వహిస్తున్నారు. తమన్నా విశాల్‌కు జోడీగా నటిస్తున్నారు. ఆ తర్వాత మిస్కిన్ దర్శకత్వంలో ‘తుప్పరవాలన్ 2’ ‘ఇరుంబు థిరాయ్ 2’ చిత్రాల్లో నటిస్తారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2UeDhSu
v

Prabhas Saaho: ‘సాహో’ హైలైట్స్.. స్టేడియంలో సిక్స్ బాదాడా?

‘సాహో’.. ఫీల్ గుడ్ మూవీకి ముందు వచ్చే స్మోకింగ్ యాడ్ లాంటివాడు. కంటెంట్ కరెక్ట్‌గా ఉన్నా.. విజువల్ చాలా డిస్ట్రబింగ్‌గా ఉంటుంది అంటూ ట్రైలర్‌తో ఆసక్తిరేపి ప్రేక్షకుల్ని థియేటర్స్ వైపుకు తీసుకురాగలిగారు. ‘బాహుబలి’ చిత్రంతో తెలుగు సినిమా స్థాయిని ప్రపంచ దేశాలకు పరిచయం చేసి ఇంటర్నేషనల్ స్టార్‌గా మారారు . దీంతో ఆయన చిత్రాలకు భారీ క్రేజ్ ఏర్పడింది. ఈ క్రేజ్‌కు తగ్గట్టే ‘రన్ రజా రన్’ ఫేమ్ సుజీత్ ‘సాహో’ అనే భారీ ప్రాజెక్ట్‌కు మూవీని రూపొందించారు. యూవీ క్రియేషన్స్‌లో సుమారు రూ. 350 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన యాక్షన్ ప్యాక్డ్ మూవీ నేడు ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. గురువారం అర్ధరాత్రి నుండి పలుచోట్ల ‘సాహో’ మూవీ ప్రదర్శితం కావడంతో సోషల్ మీడియాలో ‘సాహో’ మేనియా నడుస్తోంది. Read Also: ‘సాహో’ మూవీ హైలైట్స్.. ✦ అండర్‌ కవర్‌ కాప్‌గా అశోక్‌ చక్రవర్తి పాత్రలో ప్రభాస్‌ ✦ క్రైమ్‌ బ్రాంచ్‌కు చెందిన అమృతా నాయర్‌ పాత్రలో శ్రద్ధ కపూర్‌ ✦ గ్యాంగ్‌స్టర్స్ నేపథ్యంలో యాక్షన్ థ్రిల్లర్ కథను అల్లిన దర్శకుడు సుజీత్. ✦ హాలీవుడ్ స్థాయిలో యాక్షన్ సన్నివేశాలు. ✦ ఛేజింగ్స్ సీన్స్, చివరి ఇరవై నిమిషాల యాక్షన్ పార్ట్ హైలైట్ ✦ ప్రభాస్ వన్ మ్యాన్ షో.. డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రలో ప్రభాస్. ✦ క్లైమాక్స్ ట్విస్ట్ సస్పెన్స్ థ్రిల్లింగ్ ✦ జాక్వెలైన్‌ ఫెర్నాండెజ్‌ ‘బ్యాడ్‌ బాయ్‌...’ సాంగ్ అదనపు ఆకర్షణ ✦ ప్రభాస్ రియల్ క్యారెక్టర్ బయటపడే ఇంటర్వెల్ సీన్ మైండ్ బ్లోయింగ్ ✦ క్లైమాక్స్‌లో హైవోల్టేజ్ యాక్షన్ సీన్స్ ✦ కుదిరిన ప్రభాస్, శ్రద్ధా జోడీ.. లవ్ ట్రాక్ ఇంట్రస్టింగ్ ✦ వినోదానికి దూరంగా ‘సాహో’.. కామెడీ లేకపోవడం మైనస్ ✦ గ్రిప్పింగ్ తప్పిన స్క్రీన్ ప్లే.. ✦ ఆకట్టుకోలేకపోయిన సాంగ్స్


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2zy6deE
v

‘సాహో’ ట్విట్టర్ రివ్యూ.. భయపెడుతోన్న ఆడియన్స్ టాక్!

బహుశా ఓ తెలుగు సినిమాకు ఇప్పటి వరకు ఈ స్థాయిలో హైప్ రాలేదు. ఒకప్పుడు తెలుగు సినిమా అంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రాంతాలకే పరిమితం. కానీ, ‘బాహుబలి’ తెలుగు సినిమా గమనాన్ని మార్చింది. పాన్-ఇండియా స్థాయికి తీసుకెళ్లింది. ‘బాహుబలి’ సిరీస్ ద్వారా ప్రభాస్‌ నేషనల్ హీరో అయిపోయారు. దేశ వ్యాప్తంగా ఆయనకు విపరీతంగా ఫ్యాన్స్ పెరిగారు. అందుకే, ఆయన తరవాత ‘సాహో’ మొదటి నుంచి వార్తల్లో నిలిచింది. విడుదల తేదీ దగ్గరపడుతున్నకొద్దీ సినిమాపై హైప్ బాగా పెరిగిపోయింది. విపరీతమైన బజ్ ఏర్పడింది. సుమారు రూ.350 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ‘సాహో’ సినిమా ప్రేక్షకుల భారీ అంచనాల నడుమ శుక్రవారం విడుదలైంది. ఇప్పటికే చాలా చోట్ల ప్రీమియర్ షోలు ప్రదర్శితమయ్యాయి. ప్రీమియర్ షోలు చూసిన ప్రేక్షకులు ట్విట్టర్ ద్వారా తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు. అయితే, ఆ ఫీడ్‌బ్యాక్ చూస్తుంటే నిజంగా భయమేస్తోంది. పాజిటివ్ కామెంట్ల కన్నా.. నెగిటివ్ ఫీడ్‌బ్యాకే ఎక్కువగా వస్తోంది. ఈ సినిమాకు రూ.350 కోట్లు ఎందుకు పెట్టారంటూ చాలా మంది ప్రశ్నిస్తున్నారు. అంత పెద్ద మొత్తంలో ఖర్చుపెట్టేంతగా కథ, కథనాలు దీనిలో ఏమున్నాయని అడుగుతున్నారు. అయితే, కొంత మంది మాత్రం సినిమా చాలా బాగుందని.. భారతీయ సినిమా స్థాయిని మరో మెట్టు ఎక్కించిందని అంటున్నారు. ఇప్పటి వరకు ఇలాంటి యాక్షన్ మూవీ చూడలేదని కామెంట్లు పెడుతున్నారు. సినిమాను ప్రభాస్ తన భుజస్కందాలపై మోశాడని కొనియాడుతున్నారు. జిబ్రాన్ నేపథ్య సంగీతం కూడా చాలా బాగుందని చెబుతున్నారు. ఇంటర్వెల్ ముందు వచ్చే యాక్షన్ సీన్స్, క్లైమాక్స్ యాక్షన్ పార్ట్ సినిమాకే హైలైట్ అట. అయితే పాటలు, రొటీన్ స్టోరీ, రన్‌టైమ్, పూర్ వీఎఫ్ఎక్స్ సినిమాకు మైనస్ అంటున్నారు. మొత్తం మీద ‘సాహో’ మిశ్రమ స్పందనను సొంతం చేసుకుంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2ZECLy9
v

‘మీకు మాత్రమే చెప్తా’.. ఫస్ట్‌లుక్ ఇదిగో..

రౌడీ బాయ్ తాను నిర్మిస్తున్న తొలి సినిమా టైటిల్ ఇలా ప్రకటించాడో లేదో అప్పుడే ఫస్ట్‌లుక్‌ని విడుదల చేసేశారు. ‘పెళ్లి చూపులు’ దర్శకుడు తరుణ్ భాస్కర్ సినిమాలో ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. లుక్‌లో తరుణ్‌తో పాటు మరో ఇద్దరు వ్యక్తులు ఫోన్‌ పట్టుకుని ఏదో షాకింగ్ న్యూస్ విన్నట్లుగా ఇచ్చిన ఎక్స్‌ప్రెషన్ చాలా ఫన్నీగా ఉంది. పోస్టర్‌ పైన ‘మై బెస్ట్ ఫ్రెండ్స్ సీక్రెట్’ అని రాసుంది. అంటే వీరి ముగ్గురి జీవితాలకు సంబంధించిన రహస్యాల నేపథ్యంలో ఈ సినిమా ఫన్నీగా ఉండబోతోందేమోనని తెలుస్తోంది. ఏదేమైనా విజయ్ హీరోగానే కాకుండా ఈ సినిమాతో మంచి నిర్మాతగా కూడా విజయం సాధించేలా ఉన్నాడు. సినిమా టైటిల్‌తోనే సగం మార్కులు కొట్టేశారు దేవరకొండ. ఇక సినిమా ఎంత ఫన్నీగా ఉంటుందో చెప్పనవసరం లేదు. షమీర్ సుల్తాన్ ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నారు. అయితే ఈ సినిమాలో విజయ్ నటించడం లేదని తెలుస్తోంది. బహుశా ఆయన అతిథి పాత్రలో కనిపించవచ్చని ఫిలిం వర్గాలు అంటున్నాయి. ఈ మధ్యకాలంలో కొందరు నటీనటులు తాము నిర్మించే సినిమాల్లో తామే నటిస్తున్నారు. మరి విజయ్ ఆ ట్రెండ్‌ని ఫాలో అవుతారా... లేక కేవలం పెట్టుబడి మాత్రమే పెడతారా అన్నది ఆయనే క్లారిటీ ఇవ్వాలి.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/349reKV
v

Saaho: శ్రద్ధా కపూర్.. ఇక్కడ హిట్టా ఫట్టా..!

యంగ్ రెబెల్‌స్టార్ ప్రభాస్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తు్న్న సమయం ఆసన్నమైంది. ఇండియాస్ బిగ్గెస్ట్ ఫిలిం ‘సాహో’ భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమా చూడటానికి ఫ్యాన్స్‌కు ఎన్నో కారణాలు ఉన్నాయి. ‘బాహుబలి’ సినిమా తర్వాత దాదాపు రెండేళ్లు కేటాయించి ప్రభాస్ నటించిన చిత్రమిది. పైగా ఇందులో హీరోయిన్ ఇక్కడి అమ్మాయి కాదు. భారీ బడ్జెట్‌లో సినిమాను తెరకెక్కిస్తున్నప్పుడు అందులోని నటీనటుల స్థాయి కూడా అదే రేంజ్‌లో ఉండాలి. అందుకే జోరు మీదున్న బాలీవుడ్ భామ శ్రద్ధా కపూర్‌ను ఎంపిక చేసుకున్నారు. అయితే తొలి తెలుగు సినిమా కావడంతో శ్రద్ధ కూడా తన స్థాయికి తగ్గట్టు పారితోషికం అడిగారు. ఈ సినిమా కోసం ఆమె తీసుకున్న రెమ్యునరేషన్ రూ.6 కోట్లని టాలీవుడ్ వర్గాల సమాచారం. ఆమె అందంతో ఎక్కడి అభిమానులనైనా ఆకట్టుకోగలరు కానీ.. పరిచయం లేని భాషలో నటించి ప్రాంతీయ ఫ్యాన్స్‌ను సంతృప్తి పరచడం అంత చిన్న విషయం కాదు. మొన్న విడుదలైన ట్రైలర్‌లో శ్రద్ధ నటన అభిమానులకు నచ్చిందనే అనిపిస్తోంది. అయితే సినిమా శ్రద్ధ వల్లే హిట్టవుతుందని చెప్పలేం. ఎందుకంటే ప్రభాస్ అక్కడ. అతన్ని డామినేట్ చేసేవారు సినిమాలో ఎవ్వరూ లేరు. సినిమా బ్లాక్ బస్టర్ విజయం అందుకుంటే శ్రద్ధకు టాలీవుడ్‌లోనూ ఫ్యూచర్ ఉంటుందని చెప్పలేం. ఎందుకంటే ఇలాంటి భారీ బడ్జెట్ సినిమాలు రెగ్యులర్‌గా విడుదల అవ్వవు. పైగా ‘సాహో’ సినిమా విజయం సాధించిందంటే.. శ్రద్ధ అమాంతం రెమ్యునరేషన్ పెంచేస్తారన్న సంగతి మన దర్శక, నిర్మాతలకు కూడా తెలుసు. కాబట్టి ఆమె విషయంలో ఇక్కడి వారు ఆచి తూచి వ్యవహరిస్తారు. ఒకవేళ శ్రద్ధ ఇక్కడ క్లిక్ అవ్వకపోయినా.. ఆమె నష్టపోయిదేమీ ఉండదు. ఎందుకంటే ఇప్పటికే ఆమె బాలీవుడ్‌ సక్సెస్‌ఫుల్ హీరోయిన్. పైగా అలనాటి నటుడు శక్తి కపూర్ గారాలపట్టి. ఏదేమైనా శ్రద్ధ మన తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలు అవ్వాలంటే మరిన్ని తెలుగు సినిమాల్లో నటించాలి. ఎందుకంటే మన ప్రేక్షకులకు ఏది ఎప్పుడు నచ్చుతుందో తెలీదు. శ్రద్ధను తెలుగు ఆడియన్స్ స్వీకరిస్తారో లేదో రేపటితో తెలిసిపోతుంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2LdvTmp
v

వేలల్లో పలుకుతున్న సాహో టికెట్ రేట్లు

‘సాహో’.. ఈ సినిమాకి ఉన్న స్పెషాలిటీ ఏంటి అనేది కొత్తగా చెప్పక్కర్లేదు. వందల కోట్ల బడ్జెట్‌తో టాలీవుడ్‌లో తెరకెక్కిన వరల్డ్ క్లాస్ ప్రోడక్ట్ ఇది. కేవలం యాక్షన్ సీక్వెన్సెస్ మాత్రమే కాదు, సినిమాలో అంతకుమించి మ్యాటర్ ఉంది అనే మాట ఒక రేంజ్‌లో హల్చల్ చేస్తుంది. ముఖ్యంగా ఈ సినిమా క్లయిమాక్స్ అయితే ఇప్పటివరకు చూడని నెక్స్ట్ లెవెల్ కంటెంట్‌తో రెడీ అయ్యింది అనేది టాక్. దీంతో ఈ సినిమాపై ఒక రేంజ్‌లో అంచనాలు ఉన్నాయి. అంచనాలకు ఆకాశానికి తాకడంతో ఈ సినిమా మొదటి రోజు, మొదటి ఆట చూసి ఆ మజా ఎంజాయ్ చెయ్యాలి అనే వాళ్ళ సంఖ్య పెరిగిపోయింది. సామాన్యుల నుండి సెలబ్రిటీల వరకు చాలా మంది ఈ లిస్ట్‌లో ఉన్నారు. అందుకే ఈ సినిమా ఫస్ట్ డే, ఫస్ట్ షో టికెట్స్‌కి ఒక రెక్కలు వచ్చాయి. హైదరాబాద్‌లోని భ్రమరాంభలో ఉదయం 5 గంటల షో టికెట్ కాస్ట్ అక్షరాలా రెండువేలు పలుకుతుంది. ఇక ప్రభాస్ సొంత ఊరు అయిన భీమవరంలో క్రేజ్ అనే మాట క్రేజీగా మారింది. అక్కడ సాహో సినిమా రిలీజ్ అవుతున్న సందర్భంగా ఆల్రెడీ ఊరంతా ఉల్లాసంగా, ఉత్సాహంగా ర్యాలీ చేసారు ప్రభాస్ అభిమానులు. అలాగే అక్కడ ఉదయం అయిదుగంటల ఆట ప్లాన్ చేస్తున్నారు. దాని టికెట్ కాస్ట్ ఏకంగా మూడువేలు. ఇది మిగతా వాళ్లకు ఎక్కువగా కనిపిస్తుంది. కానీ ఫ్యాన్స్ మాత్రం ప్రభాస్ సినిమా రిలీజ్ అవుతుండడాన్ని ఒక పండుగలా భావిస్తున్నారు. అందుకే రేటు పట్టించుకోకుండా అందరికంటే ముందే సినిమా చూసిన క్రెడిట్ కోసం ఎంతయినా ఖర్చు చేస్తున్నారు. అయినా రూ. 350 కోట్లతో తీసిన సినిమా చూడడానికి అంత ఖర్చు చెయ్యడంలో తప్పులేదు అని కూడా అంటున్నారు. మరోపక్క ఈ సినిమాకి మామూలుగానే టికెట్ రేట్లు పెంచారు. ఇక్కడ మాత్రమే కాదు ఓవర్సీస్ కూడా సాహో క్రేజ్ అలానే ఉంది. అక్కడ కూడా ఈ సినిమా టికెట్ రేట్లు పెంచడంవల్లే హిందీ అండ్ తమిళ్ వెర్షన్ ప్రీమియర్స్‌కి అనుకున్న రేంజ్‌లో రెస్పాన్స్ లేదు. బుకింగ్స్ చాలా తక్కువగా ఉన్నాయి. కానీ ఒక్క షో పడి హిట్ టాక్ వస్తే బాక్స్ ఆఫీస్ కౌంట్ మామూలుగా ఉండదు. పాత రికార్డ్స్ పగిలిపోవడం ఖాయం. ఇన్నాళ్లు నాన్ బాహుబలి అని మాట్లాడిన వాళ్ళే ఇక నుండి నాన్ సాహో కలెక్షన్స్ అని మాట్లాడవలసి ఉంటుంది. ఇంత అంచనాల మధ్య థియేటర్స్‌లోకి దిగబోతున్న సాహోకి ఈ రేంజ్ క్రేజ్ రావడంలో తప్పులేదు. సాహో దాన్ని నిలబెట్టుకోక తప్పదు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2L1lQ4S
v

KGF 2: కన్నడ స్టార్ యశ్‌కు షాక్

బ్లాక్ బస్టర్ విజయం అందుకు ‘కేజీఎఫ్’ సినిమాకు సీక్వెల్ రాబోతున్న చిత్రం ‘కేజీఎఫ్ చాప్టర్ 2’. కర్ణాటకలోని సెనైడ్ హిల్స్ ప్రాంతంలో ఈ సినిమా చిత్రీకరణ జరుగుతోంది. షూట్ కోసం భారీ సెట్‌ను ఏర్పాటుచేశారు. అయితే ఈ సినిమా చిత్రీకరణ కారణంగా వాతావరణం కాలుష్యం అవుతోందంటూ శ్రీనివాస్ అనే వ్యక్తి స్థానిక జేఎంఎఫ్‌సీ (జుడిషియల్ మెజిస్ట్రేట్ ఫస్ట్ క్లాస్) న్యాయస్థానంలో పిటిషన్ వేశారు. కేసును పరిశీలించిన న్యాయస్థానం వెంటనే చిత్రీకరణ నిలిపివేయాల్సిందిగా నోటీసులు జారీ చేసింది. దీనిపై చిత్రబృందం స్పందించాల్సి ఉంది. 2021 వేసవిలో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ అధీరా అనే కీలక పాత్రలో నటిస్తున్నారు. సినిమా గురించి సంజయ్ మాట్లాడుతూ.. ‘అధీరా సినిమాలో చాలా పవర్‌ఫుల్ క్యారెక్టర్. ‘అవెంజర్స్’ సినిమాలో థానోస్ ఎంత పవర్‌ఫుల్లో నా పాత్ర కూడా అలాగే ఉంటుంది. చాలా కాలంగా ఇలాంటి పాత్ర కోసమే ఎదురుస్తున్నాను’ అని వెల్లడించారు. అయితే కేజీఎఫ్ చాప్టర్ 1 చిత్రీకరణ కూడా కర్ణాటకలోని కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ల్‌లోనే జరిగింది. అప్పుడు రాని సమస్య ఇప్పుడు ఎందుకు వచ్చిందో అర్ధంకావడంలేదు. చూడబోతే యశ్‌పై కుట్ర పన్నేందకే ఇలా చేయిస్తున్నారని కోలీవుడ్ వర్గాలు అంటున్నాయి.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2L4YFGM
v

‘సాహో’ ఎందుకు చూడాలా..? ఈ కారణాలు తెలిస్తే ఆ ప్రశ్న అడగరు!

ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ‘సాహో’ మేనియా నడుస్తోంది. ప్రభాస్, శ్రద్ధా కపూర్ జంటగా నటించిన ఈ అత్యంత భారీ చిత్రంపై అటు బాలీవుడ్‌తో పాటు దక్షిణాది రాష్ట్రాల్లోనూ విపరీతమైన హైప్ ఉంది. ఇక తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరంలేదు. ఇప్పటికే టిక్కెట్లు హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి. ఏపీలో ఈరోజు అర్ధరాత్రి నుంచే ప్రత్యేక షోలు ప్రారంభమవుతున్నాయి. ఈ సినిమాకు ఎంత క్రేజ్ ఉన్నా కొంత మందికి మాత్రం ‘చూడాలా.. అవసరమా..’ అనే ఫీలింగ్ ఉండే ఉంటుంది. కానీ, కచ్చితంగా ఈ సినిమాను చూడాలి అనడానికి మా దగ్గర ఐదు ప్రధాన కారణాలున్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం.. వెండితెరపై ప్రభాస్ కబ్‌బ్యాక్ ‘బాహుబలి’ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తరవాత ప్రభాస్ హీరోగా నటించిన సినిమా ‘సాహో’. ‘బాహుబలి’తో ఇండియన్ సినిమాతో పాటు వరల్డ్ సినిమా హిస్టరీలో ప్రభాస్ తనకంటూ ఒక పేజీని లిఖించుకున్నారు. దీంతో సాధారణంగానే ‘సాహో’పై అంచనాలు పెరిగిపోయాయి. సుజీత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ప్రభాస్ గత సినిమాతో పోలిస్తే పూర్తిగా భిన్నమైన పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాలో ప్రభాస్ పాత్ర ఎలా ఉండబోతోందో ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌లో చూశాం. ప్రభాస్ చేసే యాక్షన్ సీక్వెన్సులు అదిరిపోయాయి. ఇవే సినిమాకు ప్రధాన ఆకర్షణ కానున్నాయి. Also Read: ప్రభాస్, శ్రద్ధ కపూర్ కెమిస్ట్రీ బాలీవుడ్ భామ శ్రద్ధా కపూర్ ‘సాహో’ ద్వారా టాలీవుడ్‌కు పరిచయమవుతున్నారు. ప్రభాస్‌తో కలిసి తొలిసారి స్క్రీన్ స్పేస్‌ను పంచుకున్నారు. ట్రైలర్, పాటల్లో వీరిద్దరి కెమిస్ట్రీ అద్భుతంగా ఉంది. కేవలం రొమాన్స్ మాత్రమే కాకుండా యాక్షన్ సన్నివేశాల్లోనూ వీరి జోడి బాగా కుదిరింది. ప్రభాస్ సరసన అనుష్క శెట్టి తరవాత అంత బాగా సూటైంది శ్రద్ధ కపూర్ అంటే అతిశయోక్తికాదు. ఈ విషయంలో దర్శకుడు సుజీత్‌ను అభినందించాలి. వాస్తవానికి ప్రభాస్, అనుష్క మధ్య ఏదో ఉందని బోలెడన్ని రూమర్లు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాతో శ్రద్ధ ఆ రూమర్లకు చెక్ పెడుతుందేమో చూడాలి. హై ఆక్టేన్ యాక్షన్ సీక్వెన్సులు ‘సాహో’ చిత్రంలోని ప్రభాస్ ఫస్ట్‌లుక్ వచ్చినప్పుడు ఆయన అభిమానులు పండగ చేసుకున్నారు. అయితే, ‘షేడ్స్ ఆఫ్ సాహో ఛాప్టర్ 1’ పేరిట మేకింగ్ వీడియో విడుదలైనప్పుడు దానిలోని విజువల్స్ చూసి ప్రభాస్ అభిమానులతో అంతా ఆశ్చర్యపోయారు. హాలీవుడ్ టెక్నీషియన్స్ ఈ యాక్షన్ సీక్వెన్సుల చిత్రీకరణలో పాల్గొనడంతో ‘సాహో’ ఒక్కసారిగా వార్తల్లో నిలిచింది. సుమారు రూ.70 కోట్లు ఖర్చుపెట్టి అబుదాబిలో ఈ యాక్షన్ సీక్వెన్స్‌ను చిత్రీకరించినట్లు సమాచారం. ఈ సన్నివేశాల్లో ప్రభాస్ చేసే స్టంట్స్ ప్రేక్షకుల్ని మెస్మరైజ్ చేస్తాయట. వీఎఫ్ఎక్స్, మ్యూజికల్ ట్రీట్ ‘సాహో’ను ప్రపంచ స్థాయి చిత్రంగా తీర్చిదిద్దడానికి యూవీ క్రియేషన్స్ సంస్థ ఏ మాత్రం వెనకాడలేదు. రూ.350 కోట్ల బడ్జెట్‌తో ప్రేక్షకులకు విజువల్ ట్రీట్‌ను అందిస్తోంది. ఈ భారీ చిత్రంలో వీఎఫ్ఎక్స్‌కు మంచి ప్రాధాన్యత ఉంది. అయితే, అవి వీఎఫ్ఎక్స్‌లా అనిపించకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. అందుకే సినిమా విడుదల కూడా ఆలస్యమైంది. ఈ సినిమాలో వీఎఫ్‌ఎక్స్‌తో పాటు పాటలకు కూడా ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. అందుకే, ఒక్కో పాటను ఒక్కో సంగీత దర్శకుడితో కంపోజ్ చేయించారు. ‘బ్యాడ్ బోయ్’ అనే పాటలో బాలీవుడ్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌ నర్తించింది. పాటలను మించి జిబ్రాన్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ప్రేక్షకులను అలరించనుంది. తారాగణం ఈ స్థాయి తారాగణాన్ని బహుశా ఇప్పటి వరకు ఏ తెలుగు సినిమాలో చూసుండం. బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్‌కు చెందిన మంచి నటీనటులంతా ‘సాహో’లో ఉన్నారు. అరుణ్ విజయ్, జాకీ ష్రాఫ్, నీల్ నితిన్ ముఖేశ్, మందిరా బేడి, మురళీ శర్మ, మహేష్ మంజ్రేకర్, ఎవెలిన్ శర్మ, వెన్నెల కిషోర్ లాంటి నటీనటులు ‘సాహో’లో నటించారు. ఇక లీడ్ పెయిర్ ప్రభాస్, శ్రద్ధా కపూర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరంలేదు. ఈ నటీనటులంతా ఒకరిని మించి మరొకరు సినిమాలో పెర్ఫార్మెన్స్ చేశారట. బాలీవుడ్ నటులు చాలా మంది డాన్ పాత్రల్లో కనిపించనున్నారు. తెలుగుతో పాటు హిందీ, తమిళం, మలయాళం‌లో విడుదలవుతోన్న ఈ చిత్రం ప్రేక్షకులను అలరించడం ఖాయం.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2zvHzvb
v

Prabhas Saaho: ‘సాహో’పై నెగిటివ్ టాక్.. ఎందుకిలా?

రెబల్ స్టార్ నటించిన ‘సాహో’ చిత్రం భారీ అంచనాల నడుమ రేపు ఆగస్టు 30న విడుదల కానుంది. ఈ మూవీ కోసం ప్రభాస్‌తో ఫ్యాన్స్‌తో పాటు మూవీ లవర్స్ కూడా ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. బాహుబలి చిత్రం తరువాత ప్రభాస్ మూవీ కావడం.. హాలీవుడ్ రేంజ్‌లో సుమారు రూ. 350 కోట్లతో భారీ బడ్జెట్‌తో తెరకెక్కించడం.. బాలీవుడ్ హీరోయిన్‌తో పాటు హాలీవుడ్ టెక్నీషియన్లు ఈ చిత్రానికి పనిచేయడంతో ఈ సినిమాపై విపరీతమైన అంచనాలు ఏర్పడ్డాయి. ఈ అంచనాలకు తగ్గట్టుగానే ప్రభాస్ కెరియర్‌లో ఎన్నడూ చేయనంతగా ఈ సినిమాకు భారీ ఎత్తున ప్రమోషన్స్ నిర్వహించారు. హిందీ, తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో సైతం విరివిగా ప్రమోషన్స్ నిర్వహించారు. ప్రభాస్‌తో పాటు దర్శకుడు సుజీత్, నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ ధీమాగానే ఉన్నారు. దీంతో పాటు ఈ భారీ బడ్జెట్ మూవీకి పాజిటివ్ బజ్ ఉండనే ఉంది. ఈ సందర్భంలో ‘సాహో’ చిత్రం విడుదలకు ముందే సోషల్ మీడియాలో నెగిటివ్ ప్రచారం మొదలైంది. సినిమాను ఎప్పుడు చూశారు ఎక్కడ చూశారో వివరాలను తెలియజేయకుండా అప్పుడే ట్విట్టర్‌లో నెగిటివ్ ట్వీట్స్ చేస్తున్నారు. కథ రొటీన్‌గానే ఉందని.. సాంగ్స్‌తో పాటు వీఎఫ్ఎక్స్ వర్క్ పేలవంగా ఉందంటున్నారు. సెకండాఫ్ బాగుందని.. ఫస్టాఫ్ యావరేజ్ అంటున్నారు. అయితే ప్రభాస్ యాక్షన్‌తో ఇంటర్వెల్‌కి ముందు వచ్చే 20 నిమిషాలు, క్లైమాక్స్‌లో వచ్చే 30 నిమిషాల యాక్షన్ సీక్వెన్స్ సినిమాకి హైలైట్ అంటున్నారు. ఇక హిందీ వర్షన్‌లో చూశామని చెప్తున్న ఇంకొంతమంది.. ప్రభాస్ డబ్బింగ్ అస్సలు కుదర్లేదని.. శ్రద్ధా కపూర్ యాక్టింగ్ కూడా బాలేదంటున్నారు. దీంతో పాటు దాదాపు సినిమా నిడివి బాగా ఎక్కువగా ఉందంటూ టోటల్‌గా సినిమా నచ్చలేదంటున్నారు. యాక్షన్ సన్నివేశాలు ఉన్నప్పటికీ.. సరైన కథలేదని, స్క్రీన్ ప్లేలోనూ విషయం లేదంటున్నారు. కామెడీ నిల్ అని.. విలన్లు మాత్రం ఫుల్‌గా ఉన్నారని సినిమా చాలా పెద్దగా ఉందంటూ ప్రభాస్ కోసం ఒక్కసారి చూడొచ్చంటూ 2/5 రేటింగ్‌తో సరిపెట్టేస్తున్నారు. అయితే ఈ ట్వీట్స్ అన్నీ ప్రభాస్ ఇమేజ్‌ను ఆయన క్రేజ్‌ను తట్టుకోలేక కొంతమంది పనికట్టుకుని నెటిటివ్ ప్రచారం చేస్తున్నారు. ‘సాహో’ సినిమా రేంజ్‌లో ఏంటో రేపు ఉదయం తెలుస్తుందంటున్నారు ప్రభాస్ ఫ్యాన్స్.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/30LMLHq
v

టీమిండియా లక్కీ గర్ల్ సోనమ్ కపూర్..!

జోయా సోలంకి... ఈమె పుట్టినరోజే భారత్ 1983లో ప్రపంచకప్‌ను గెలిచింది. అప్పటి నుంచి ఈమె టీమిండియాకు లక్కీ ఛార్మ్‌ అయిపోయింది. ఈమె జీవితాధారంగా అభిషేక్ శర్మ ‘ది జోయా ఫ్యాక్టర్‌’ అనే సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇందులో సోనమ్‌కు జోడీగా దుల్కర్ సల్మాన్ నటిస్తున్నారు. ఈ సినిమా ట్రైలర్ విడుదలైంది. 1983లోనే జోయా సోలంకి () జన్మించడం.. సరిగ్గే అదే రోజున టీమిండియా వరల్డ్ కప్‌ను సాధించడం జరుగుతాయి. ఆ తర్వాత జరిగిన ప్రపంచకప్ మ్యాచ్‌లలో టీమిండియా వరుసగా పరాజయం పాలవుతూ ఉంటుంది. దాంతో జోయా ఉంటేనే టీమిండియా గెలుస్తుందన్న నమ్మకం ప్రజల్లో కలుగుతుంది. అలా జోయా పేరు ప్రపంచమంతా మారుమోగిపోతుంది. ఆమెను క్రికెట్ దేవతగా పూజించడం మొదలుపెడతారు. చివరకు ఆమె వల్లే 2011లో భారత్ మరోసారి ప్రపంచకప్ సాధిస్తుంది. అదెలా సాధ్యమైంది? అన్నదే ఈ సినిమా కథ. ఇందులో దుల్కర్ సల్మాన్ టీమిండియా కెప్టెన్ పాత్రలో నటించారు. రచయిత్రి అనూజా చౌహాన్ రాసిన ‘ది జోయా ఫ్యాక్టర్’ నవల ఆధారంగా సినిమాను తెరకెక్కించారు. ఫాక్స్ స్టార్ స్టూడియోస్ నిర్మిస్తున్న ఈ చిత్రం సెప్టెంబర్ 20న ప్రేక్షకుల ముందుకు రానుంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2ZCgogU
v

‘మీకు మాత్రమే చెప్తా’ అంటున్న రౌడీ

అర్జున్‌రెడ్డి సినిమాతో విజయ్ దశ తిరిగింది. వరుస సినిమాలతో బిజీ అయిపోయారు. ఇప్పుడు నిర్మాతగానూ కొత్త ప్రయాణాన్ని మొదలుపెట్టారు. తొలి సినిమాకు మీకు మాత్రమే చెప్తా అనే ఆసక్తికర టైటిల్‌ను ఫిక్స్ చేశారు. ఈ విషయన్ని కూడా ఆయన ఆసక్తికరమైన వీడియె ద్వారా ప్రకటించారు. ‘సినిమా పరిశ్రమలోకి వచ్చి నిలదొక్కుకోవడానికి చాలా మంది కష్టపడుతుంటారు. నేను ఇండస్ట్రీకి వచ్చిన రోజే నిర్ణయించుకున్నాను నిర్మాణ సంస్థను ప్రారంభించాలని. అది ఎంత కష్టమో, ఎంత రిస్కో తెలిసొచ్చింది. నేను డబ్బులన్నీ సేవ్ చేసుకుని కింగ్ ఆఫ్ ది హిల్స్ పేరిట నిర్మాణ సంస్థను ప్రారంభించాను’ అని పేర్కొంటూ వీడియోను అభిమానులతో పంచుకున్నారు. మరో విషయం ఏంటంటే.. తనకు ‘పెళ్లి చూపులు’ సినిమాలో అవకాశం ఇచ్చిన తరుణ్ భాస్కర్‌నే తన సినిమాలో లీడ్ రోల్‌గా పెట్టుకున్నారు. ‘డియర్ కామ్రేడ్’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విజయ్.. ప్రస్తుతం ‘హీరో’ సినిమాతో బిజీగా ఉన్నారు. ఆనంద్ అన్నమలై దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో మాళవిక మోహనన్ కథానాయికగా నటిస్తున్నారు. దీంతో పాటు ఆయన పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో నటించనున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2NFVyXx
v

Kiccha Sudeep: సల్మాన్‌ను తన్నమన్నారు

దబాంగ్ ఫ్రాంచైజ్ నుంచి వస్తున్న మూడో చిత్రం దబాంగ్ 3. ప్రభుదేవా దర్శకత్వం వహిస్తున్నారు. చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. అయితే సినిమాలో సుదీప్.. సల్మాన్‌ను గుండెలపై తన్నే సన్నివేశం ఒకటుంది. ఈ సన్నివేశం చేయడానికి సుదీప్ చాలా భయపడిపోయారట. ఈ సన్నివేశంలో నటించలేనని ప్రభుదేవాకు చెప్పారట. ఈ విషయాన్ని సుదీప్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ‘సల్మాన్‌ను గుండెలపై తన్నమన్నారు. కానీ నా వల్ల కాలేదు. సల్మానేమో బడ్డీ కిక్ మీ అనేవారు. కానీ నేను చేయలేకపోయేవాడిని. నా సమస్య అర్థం చేసుకుని దర్శకుడు ప్రభుదేవా చిత్రీకరణ కొన్ని రోజులు వాయిదా వేశారు. ఆ తర్వాత తన్నే సన్నివేశంలో కొన్ని మార్పులు చేశారు. అప్పుడే నాకు తెలిసింది.. దక్షిణాదిలో నన్ను తన్నడానికి నటులు ఎందుకంత ఇబ్బంది పడేవారో’ ‘నా మరో సమస్య ఏంటంటే.. నాకు హిందీ రాదు. అందుకే నేను సెట్స్‌కు వెళ్లినప్పుడు నాకే ఒకేసారి అన్ని డైలాగులు ఇవ్వొద్దని ప్రభుదేవాకు చెప్పాను. దూరంగా నిలబడి సినిమాలు చూసేవాడిని. అలాంటిది ఇప్పుడు ఆయన సినిమాలో ప్రతినాయకుడిగా నటిస్తున్నాను. సల్మాన్‌ది బంగారం లాంటి మనసు. తనవారు అని ఆయన అనుకున్నారంటే ఎంతో నిజాయతీగా, ప్రేమగా చూసుకుంటారు’ అని తెలిపారు సుదీప్. ఈ చిత్రంలో సల్మాన్‌కు జోడీగా సోనాక్షి సిన్హా నటిస్తున్నారు. డిసెంబర్ 20న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. మరోపక్క సుదీప్ పెహల్వాన్ చిత్రంతో బిజీగా ఉంది. కన్నడతో పాటు తెలుగు, హిందీ, తమిళం, మలయాళం భాషల్లో సెప్టెంబర్ 12న 2,500 స్క్రీన్లపై విడుదల కాబోతోంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2ZqIc8U
v

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...