Friday 30 August 2019

‘సాహో’.. భారీ బడ్జెట్ సినిమాలకు మోగిన అలారం!

చాలాకాలంగా జాతీయ స్థాయిలో విపరీతంగా ట్రెండ్ అవుతున్న సినిమా పేరు ‘సాహో’. ఆ సినిమాకి అంత హైప్ రావడానికి కారణం ‘బాహుబలి’ లాంటి భారీ విజయం అందుకున్న ప్రభాస్ నటించిన చిత్రం కావడం మాత్రమే కాదు.. ఈ సినిమాకి ‘బాహుబలి’కి మించి బడ్జెట్ పెట్టి, ‘బాహుబలి’ని దాటేలా మార్కెటింగ్ చెయ్యడం కూడా. అయితే ఎలాంటి సంచలనం సృష్టిస్తుందా అని ఎదురుచూసిన ప్రేక్షకుల నిరీక్షణకు తెర దించుతూ ‘సాహో’ థియేటర్లలో వచ్చింది. ‘సాహో’ ఎలాంటి ఫలితం అందుకుంది, ఎంత కలెక్ట్ చేస్తుంది అనే విషయాలు పక్కనబెడితే ఇది ఒక్క విషయంలో మాత్రం పెద్ద సినిమాల నిర్మాణానికి సంబంధించి ఒక స్ట్రాంగ్ హింట్ అయితే ఇచ్చింది. అదే బడ్జెట్ కంట్రోల్. ‘సాహో’కి రూ. 350 కోట్ల బడ్జెట్ అని స్వయంగా ప్రభాస్ చెప్పడంతో అసలు ఈ సినిమాలో అంత విషయం ఏముంది?, విజువల్ వండర్ అనే పదానికి న్యాయం చెయ్యదగ్గ కంటెంట్ ఏముంది? అనే ఆతృత అందరిలో పెరిగింది. కానీ తీరా సినిమా చూస్తే మాత్రం అంత ఖర్చు పెట్టాలని పెట్టారు తప్ప, ఆ రేంజ్ బడ్జెట్‌ని మోసే శక్తి ఆ కథకి లేదని అర్థమైంది. Also Read: వాస్తవానికి ‘సాహో’లో వాడిన విజువల్ ఎఫెక్ట్స్ ఆ స్క్రీన్‌ప్లే ఆర్డర్‌కి అవసరం లేదు అనిపిస్తుంది. ‘బాహుబలి’ అంటే స్టోరీ లైన్‌లోనే ఒక బలం ఉంది. కానీ ‘సాహో’ కావాలని భారీ బడ్జెట్‌తో తీసిన సినిమాగా కనిపిస్తుంది. ‘సాహో’ ఫలితం భారీ బడ్జెట్‌తో సినిమా తియ్యాలి అని కలలు కనే హీరోలు, నిర్మాతలు, డైరెక్టర్స్‌కి ఒక విషయం మాత్రం స్పష్టం చేస్తుంది. స్రిప్ట్ సరిగా ఉంటేనే పెట్టిన డబ్బుకు విలువ. భారీ లాభాలకు కూడా భరోసా ఉంటుంది. ‘సాహో’ ఫలితం వల్ల నెక్స్ట్ టాలీవుడ్ అంతా ఎదురుచూస్తున్న ‘సైరా’ అవుట్ ఫుట్ కూడా ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది అనేది స్పష్టమవుతుంది. ఇక ప్రొడక్షన్‌లో ఉన్న మహేష్ బాబు ‘సరిలేరు నీకెవ్వరూ’ సినిమా కూడా భారీ బడ్జెట్ సినిమానే. వాస్తవానికి ఈ సినిమా బడ్జెట్ కాస్త తక్కువే, కానీ తరువాత మళ్ళీ పెంచారు. అది స్క్రిప్ట్ డిమాండ్ చెయ్యడం వల్ల అయితే పర్లేదు, కానీ అనవసరమైన ఆర్భాటాల గురించి అయితే ఉపయోగం ఉండదు అనేది ‘సాహో’ వల్ల అర్థమవుతుంది. ఇక రూ.450 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ‘RRR’ జక్కన్న చేతిలో రూపుదిద్దుకుంటున్న సినిమా కాబట్టి భయంలేదు. ఎందుకంటే, టాలీవుడ్‌కి పాన్ ఇండియా సినిమా అనే ఫార్మాట్‌ని ఆపాదించింది ఆయనే కాబట్టి ‘RRR’పై అందరికి నమ్మకం ఉంది. Also Read: నిజానికి రాజమౌళి గ్రాండియర్ కోసం సినిమాలు తీయరు. తీసిన సినిమాలో గ్రాండియర్ ఉండేలా చూసుకుంటారు. సో, ఏది ఏమైనా స్క్రిప్ట్ డిమాండ్ చెయ్యడం వల్ల రిచ్‌నెస్ కోసం బడ్జెట్ పెట్టడం అనేది అందరికి సమ్మతమే. కానీ, ఆర్డినరీ కథలను తీసుకుని, వాటికి పాన్ ఇండియా అప్పీల్ తీసుకురావడానికి వందలకోట్ల బడ్జెట్ కేటాయించి, మంచి విజువల్స్‌తో ప్రోమోలు కట్ చేసి హైప్ తేవడం అనేది లాభమా?, నష్టమా? అనే ప్రశ్నకు సమాధానం టాలీవుడ్‌కి మేలు చేస్తుంది అనేది ప్రేక్షకుల అభిప్రాయం.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2UlY1I7
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...