Wednesday 31 July 2019

Swetha Reddy: సెక్సువల్ హరాస్మెంట్ చేస్తే తొక్క తీస్తాం.. కొడకల్లారా!: రెడ్డి సిస్టర్స్ రచ్చ

ఆహా.. ఫొటో అదిరింది కదూ!! ఏమన్నా ఉన్నారా ఇద్దరూ. ఒకర్ని మించి మరొకరు.. ఏ రకంగా చూసినా ఇద్దరూ ఇద్దరే. వాళ్లే రెడ్డి సిస్టర్స్. ఒకరు కాంట్రవర్శీ క్వీన్ అయితే.. మరొకరు కేరాఫ్ కాంట్రవర్శీ . ఈ ఇద్దరూ కలిసి సింగిల్ ఫ్రేమ్‌లో దర్శనం ఇచ్చారు. టాలీవుడ్ క్యాస్టింగ్ కౌచ్ ఉదంతంతో వెలుగులోకి వచ్చి ఇండస్ట్రీ రసికరాజుల కంటిపై కునుకు లేకుండా చేసిన శ్రీరెడ్డి.. తరచూ సెక్సువల్ హరాస్మెంట్‌పై తన వాయిస్‌ని వినిపిస్తూనే ఉంది. ఇక యాంకర్‌గా పలు ఛానల్స్‌లో పనిచేసి యూట్యూబ్ సంచలనంగా మారిన శ్వేతారెడ్డి.. గత ఎన్నికల్లో కేఏ పాల్‌పై సంచలన ఆరోపణలతో సినీ, రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది. అనంతరం ఇటీవల బిగ్ బాస్‌ నిర్వాహకులపై లైంగిక వేధింపుల ఆరోపణలతో సంచలనంగా మారింది. గాయిత్రి గుప్తాతో కలిసి ఢిల్లీ స్థాయిలో షోపై నిరసన తెలిపింది. బిగ్ బాస్‌లో క్యాస్టింగ్ కౌచ్ ఉందంటూ ఈ షోను నిలిపివేయాలని నిర్వహకులపై కేసులే వేసే వరకూ వెళ్లింది శ్వేతారెడ్డి. అటు శ్రీరెడ్డి.. ఇటు శ్వేతారెడ్డి మార్గం ఒకటే కావడంతో ఈ ఇద్దరూ జతకలిశారు. ‘లైంగిక వేధింపులకు మేము ఎప్పుడూ మద్దతు ఇవ్వము.. అలా చేస్తే రెడ్డి సిస్టర్స్ తొక్కతీస్తారు కొడుకులది’ అంటూ ఘాటైన పోస్ట్ వదిలారు ఈ రెడ్డి సిస్టర్స్.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2yp26RG
v

YS Jagan: జగన్‌ని అడుక్కోను.. పృథ్వీ తప్పు చేశాడు: పోసాని పరోక్ష విసుర్లు

ఇండస్ట్రీ తరుపున తొలి నుండి జగన్ వెంట నడిచారు పోసాని. ఎలక్షన్స్ సమయంలోనూ ఎన్నికలకు దూరంగా ఉన్న ఆయన.. నామినేట్ పదవిపై ఆశలు పెట్టుకున్నారు. అయితే ఇటీవల ఆయన అనారోగ్యం పాలు కావడంతో రకరకాల వార్తలు హల్ చల్ చేశాయి. వాటిపై స్పందిస్తూ బుధవారం నాడు ప్రెస్ మీట్ నిర్వహించారు పోసాని. ఇండస్ట్రీలోనో.. రాజకీయాల్లోనో నేను చేయాల్సిన పనులు మిగిలి ఉండటం వల్లే తిరిగి బతకగలిగానని లేదంటే చనిపోయి ఉండే వాడినన్నారు ప్రముఖ నటుడు, దర్శకుడు, రచయిత . తన ఆరోగ్యంపై మీడియాలో వస్తున్న వరుస కథనాలపై స్పందిస్తూ.. బుధవారం నాడు హైదరాబాద్‌లో ప్రెస్ మీట్ నిర్వహించారు పోసాని. ఈ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈరోజు నేను క్షేమంగా ఉన్నాను. నాకు జరిగిన తొలి ఆపరేషన్ ఫెయిల్ కావడంతో పొట్టలో ఇన్‌ఫెక్షన్ వచ్చి చావు వరకూ వెళ్లా.. నా చీటీ చినిగిపోద్ది అనుకున్నా. అయితే డాక్టర్ల కృషితో బతికి బట్టకట్టా. అంతే తప్ప ఇతరత్రా రోగాలేం నాకు లేవు. అన్నం లేకుండా చాలా రోజులు బెడ్ మీదే ఉన్నా. యూరిన్‌కి పోవాలన్నా నా భార్య, అక్క ఎత్తుకుని తీసుకువెళ్లేవారు. అయితే రెండో సారి ఆపరేషన్ జరిగిన తరువాత సంపూర్ణ ఆరోగ్యంతో డాక్టర్ ఎమ్.వి రావు నన్ను ఇంటికి పంపించారు. నేను ఈరోజు బతికానంటే ఆ డాక్టర్ వల్లే. 2011లో జగన్ పార్టీ పెట్టారు. కాంగ్రెస్ ద్వారా వచ్చిన ఎంపీలతో రాజీనామా చేయించి మళ్లీ గెలిచారు. విజయమ్మ కూడా రాజీనామా చేసి మళ్లీ గెలిచారు. జగన్ పార్టీ పెట్టినప్పుడు ఆయన వెంట సినిమా ఇండస్ట్రీకి సంబంధించి నేను, రోజా మాత్రమే మిగిలాము. అప్పుడు ఇండస్ట్రీ నుండి ఎవరూ ఆయన వెనుకరాలేదు. ఆయన వెంట పలు దీక్షల్లో పాల్గొన్నా. అప్పటి నుండి ఇప్పఏ: చేన్నా. తొమ్మిదేళ్లుగా ఆయనతో నడిచా. ఆయన పార్టీకి నా నుండి ఎంత చేయాలో అంత చేశా. అయితే ఎన్నికల్లో మీకు ఏం కావాలి? ఎంపీ కావాలా? ఎమ్మెల్యే కావాలా అని అడిగారు. నేను ఏం కావాలనుకోవడం లేదు. అది జగన్ గారి ఇష్టం. ఆయన ఏం చేసినా నాకు ఇష్టమే. నాకు కావాల్సింది ఆయన ముఖ్యమంత్రి కావడమే అన్నా. నేను అన్నట్టుగానే ఆయన గెలిచారు. చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు ఆయన పదవి ఇస్తా అంటే.. తప్పకుండా చేస్తా. అందులో ఇగో ఏం లేదు. నేను ఇప్పటి వరకూ ఎవర్నీ ఏం అడుక్కోలేదు. నా మూతి మీద మీసం మొలిచాక.. సినిమా ఇండస్ట్రీలో కాని బయటకాని ఎవర్నీ వెళ్లి అడుక్కున్నది లేదు. అంతేతప్ప ఎగబడి నాకు పదవి కావాలని అడగను. మురళి చేయగలడు అని వాళ్లు నమ్మి నాకు ఏదైనా పదవి అప్పగిస్తే చేస్తా. నామినేట్ పదవులపై నాకు ఆశలేదు. పదవి కోసం నేను గుంటకాడ నక్కలా ఎదురుచూడటం లేదు. కొంతమంది పదవులు ఇష్టపడతారు. నాకు అంత ఇష్టం లేదు. నాకంటే జూనియర్స్‌కి పదవులు ఇచ్చారని నాకు కోపమేం లేదు. వాళ్లకి పదవి అంటే ఇష్టం. పైగా జూనియర్ అయినా ఎక్కువ కష్టపడినందుకు పదవులు ఇవ్వవచ్చు. వాళ్లు ఒంటి భుజంపై పార్టీని మోశారేమో. ఈరోజు నాకు పదవి ఎందుకు రాలేదంటే నేను అడగలేదు కాబట్టి. సినిమా ఇండస్ట్రీ వాళ్లకు జగన్ ముఖ్యమంత్రి కావడం ఇష్టం లేదని నటుడు పృథ్వీ అనడం తప్పు. పృథ్వీ అలా అనకూడదు. నేను సినిమా ఇండస్ట్రీలో 34 ఏళ్ల నుండి ఉంటున్నా. జగన్ దగ్గరకు వెళ్లి ఆయనకు ఒక దండ వేసి అభినందిస్తే ఆయనపై ప్రేమ ఉన్నట్టు కాదు. సురేష్ బాబు ఫోన్ చేసి జగన్ అపాయింట్‌మెంట్ కోసం ట్రై చేశారు. అది పృథ్వీకి తెలియకపోవచ్చు. ఇండస్ట్రీ తరుపున పేపర్ స్టేట్ మెంట్ కూడా ఇచ్చారు. క్రిష్ణ, క్రిష్ణంరాజు, చిరంజీవి లాంటి వాళ్లకు జగన్ గెలిస్తే నష్టం లేదు. ఈ విషయంలో పృథ్వీ నన్ను క్షమించాలి. మీరు తొందరపడి ఈ స్టేట్ మెంట్ ఇచ్చారని నేను భావిస్తున్నా’ అంటూ చెప్పుకొచ్చారు పోసాని. మొత్తానికి తనకంటే వెనుక వైసీపీ పార్టీలో చేరి స్వీబీసీ ఛానెల్ చైర్మన్‌గా నామినేట్ పోస్ట్ సాధించిన 30 ఇయర్స్ పృథ్వీకి పరోక్షంగానే కౌంటర్ ఇచ్చారు పోసాని.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2Yh7DJe
v

‘మగధీర’ జ్ఞాపకాలు.. రెండు సెకెన్ల సీన్ ‘బొమ్మ’ చూపించింది!

తెలుగు సినిమా మార్కెట్‌ను, లెక్కలను మార్చేసిన చిత్రం ‘మగధీర’. అప్పటి వరకు ఉన్న లెక్కలు వేరు.. ‘మగధీర’ వచ్చిన తరవాత లెక్కలు వేరు. చిరంజీవి సినీ వారసుడిగా ‘చిరుత’ చిత్రంలో తెరంగేట్రం చేసిన రామ్ చరణ్ ‘మగధీర’ సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నారు. స్టార్ హీరో హోదాను పొందారు. రాజమౌళి కెరీర్‌లో చిరస్థాయిగా నిలిచిపోయే చిత్రం ‘మగధీర’ అంటే అతిశయోక్తికాదు. ఎస్.ఎస్.రాజమౌళి తన దర్శక ప్రతిభ ఏపాటిదో ఈ చిత్రంతో మరోసారి నిరూపించారు. ఇలాంటి గొప్ప చిత్రం వచ్చి పదేళ్లు గడిచిపోయింది. ‘మగధీర’ పదేళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా ఈ చిత్ర నిర్మాణ సంస్థల్లో ఒకటైన గీతా ఆర్ట్స్ ఒక ఆసక్తికర వీడియోను యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేసింది. ‘మగధీర’లో ‘పంచదార బొమ్మ’ పాట ఎంత పాపులరో అందరికీ తెలిసిందే. ఈ మెలోడీ ఇప్పటికీ మెగా అభిమానులకు ఫేవరేటే. ఈ పాటలో జలపాతాన్ని చీల్చుకుంటూ రామ్ చరణ్ బయటకు వచ్చే సన్నివేశం ఉంటుంది. వాస్తవానికి ఇది రెండు సెకెన్ల సీన్. ఈ సీన్ కోసం దర్శకుడు రాజమౌళితో పాటు చిత్ర యూనిట్ చాలా కష్టపడాల్సి వచ్చింది. ఈ సీన్ మేకింగ్ వీడియోను గీతా ఆర్ట్స్ యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేసింది. ఈ వీడియో చూస్తుంటే పర్ఫెక్షన్ కోసం రాజమౌళి ఎంత కష్టపడతారో, ఎంత కష్టపెడతారో అర్థమవుతుంది. ఈ పాటను హైదరాబాద్‌లోని గోల్కొండ కోటలో చిత్రీకరించారు. యం.యం.కీరవాణి స్వరపరిచిన ఈ పాటకు చంద్రబోస్ సాహిత్యం అందించారు. అనూజ్ గుర్వారా, రీటా ఆలపించారు. కాగా, 2009 జూలై 31న ‘మగధీర’ చిత్రం విడుదలైంది. కాళ భైరవుడిగా రామ్ చరణ్ తన విశ్వరూపాన్ని చూపించారు. ఈ సినిమాతో కాజల్ అగర్వాల్ స్టార్ హీరోయిన్‌గా మారిపోయింది. సుమారు రూ.40 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రూ.80 కోట్లకు పైగా షేర్ వసూలు చేసింది. ఈ చిత్రంతో తన స్టామినాను రాజమౌళి మరోసారి నిరూపించుకున్నారు. అంతేకాదు, తెలుగు సినిమా మార్కెట్‌ను మరో స్థాయికి తీసుకెళ్లారు. కీరవాణి సంగీతం, సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫీ, పీటర్ హెయిన్ ఫైట్స్, ప్రేమ్ రక్షిత్ కొరియోగ్రఫీ ఇలా ఈ సినిమాలో ప్రతి అంశం ఎంతో ప్రత్యేకం.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2Ovp8B6
v

నేను అలాంటి వ్యక్తిని కాదు.. చెత్త ప్రశ్నలు ఆపండి: రేణు దేశాయ్

రేణు దేశాయ్.. తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరంలేని పేరు. పవన్ కళ్యాణ్ మాజీ భార్యగా ఈమె గురించి అందరికీ తెలిసిందే. నటిగా, రచయితగా, దర్శకురాలిగా తన ప్రతిభను చాటుకున్న మహిళ రేణు దేశాయ్. ప్రస్తుతం మరాఠీలో దర్శకురాలిగా సినిమాలు చేస్తూ.. మరోవైపు తన ఇద్దరు పిల్లలను చూసుకుంటూ చాలా బిజీగా గడుపుతున్నారు రేణు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఎప్పటికప్పుడు ఫొటోలు పోస్టు చేస్తూ అభిమానులకూ దగ్గరగానే ఉంటున్నారు. కామెంట్లతో తనను ఇబ్బంది పెట్టే నెటిజన్లపై కూడా ఇన్‌స్టాగ్రామ్ ద్వారానే రేణు విరుచుకుపడుతుంటారు. ఇలాంటి అనుభవం రేణు దేశాయ్‌కు తాజాగా మరోసారి ఎదురైంది. యూట్యూబ్‌లో అందుబాటులో ఉన్న ఒక వీడియో ఆధారంగా ఇటీవల రేణు దేశాయ్ సోషల్ మీడియాలో లైవ్ నిర్వహించినట్టు అర్థమవుతోంది. ఈ లైవ్ ఇంటరాక్షన్‌లో చాలా మంది రేణుని రకరకాల ప్రశ్నలు అడిగారు. దీనిలో భాగంగా బిగ్ బాస్ ప్రస్తావన కూడా వచ్చింది. ‘‘బిగ్ బాస్‌లోకి రావచ్చుగా మేడమ్’’ అని ఒక యూజర్ అడిగిన ప్రశ్నకు రేణు స్పందిస్తూ.. ‘‘నేను బిగ్ బాస్ కంటెస్టెంట్ టైపు వ్యక్తిని కాదు. లైవ్ కూడా ఎప్పుడో రెండు నెలలకు ఒకసారి చేస్తుంటాను. నాకు చాలా సిగ్గు ఎక్కువ’’ అని చెప్పారు. వెంటనే రేణు దేశాయ్ పక్కన ఉన్న మహిళ.. ‘‘వంద రోజులపాటు అకీరా, ఆద్యను వదిలిపెట్టి ఉండగలవా’’ అని అడిగారు. దీనికి రేణు స్పందిస్తూ.. ‘‘దీని గురించి చర్చే అవసరంలేదు. వాళ్లను వదిలిపెట్టి ఒక్కరోజు కూడా ఉండలేను. కంటెస్టెంటుగా కాకపోయినా 24 గంటలపాటు అతిథిగా అయినా వెళ్లొచ్చు కదా అని అడుగుతున్నారు. కానీ, నేను అలాంటి వ్యక్తిని కాదు. కెమెరా ముందు 24 గంటల పాటు మాట్లాడుతూ ఉండలేను. ఈ లైవ్‌కు కూడా చాలా సిగ్గుపడుతూ వస్తుంటాను’’ అని వివరణ ఇచ్చారు. అంతకు ముందుకు ఒక యూజర్ ‘‘మీరు మాట్లాడే తెలుగు చాలా క్యూట్‌గా ఉంది మేడమ్’’ అని కామెంట్ చేశారు. దీనికి రేణు స్పందిస్తూ.. ‘‘నాకు తెలుగు మాట్లాడాలంటే భయమేస్తుంది. ఏదైనా తప్పు మాట్లాడతానేమోనని. కానీ, ఏ ఊరులో ఉంటే ఆ భాష మాట్లాడాలి. రోమ్‌లో ఉంటే రోమన్‌లానే ఉండాలి. తెలుగు నేలపై ఉంటే తెలుగులో మాట్లాడాలి. తెలుగు ఇండస్ట్రీకి వచ్చి నేను తెలుగు మాట్లాడను, నేను ఇంగ్లిష్‌లోనే మాట్లాడతాను అంటే బాగుండదు’’ అని వెల్లడించారు. అయితే, ఒక యూజర్ అడిగిన ప్రశ్న రేణు దేశాయ్‌కు కోపం తెప్పించింది. ఆ ప్రశ్నను ఆమె బయటికి చదవకపోయినా.. ఆ యూజర్‌పై మాత్రం ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘మీకు బుద్ధిలేదు. లైవ్‌లో కొంచెం ఆలోచించి టైప్ చేయండి. బుద్ధిలేకుండా వచ్చేస్తారు. చెత్త ప్రశ్నలు టైప్ చేస్తారు’’ అంటూ నవ్వుతూనే క్లాస్ పీకారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2YdUVLr
v

అమ్మా.. అందరూ చూస్తున్నారు, ఏంటిది: ఇబ్బందిగా ఫీలైన రష్మిక

విజయ్ దేవరకొండ, రష్మిక మందన జంటగా నటించిన చిత్రం ‘డియర్ కామ్రేడ్’ బాక్సాఫీసు వద్ద మంచి వసూళ్లు రాబడుతోంది. ఈనెల 26న విడుదలైన ఈ చిత్రంపై మిశ్రమ స్పందన వచ్చినా కలెక్షన్లు మాత్రం బాగానే ఉన్నాయి. సినిమా విషయం ఎలా ఉన్నా విజయ్, రష్మికల నటన అద్భుతంగా ఉందంటూ అంతా కొనియాడుతున్నారు. ముఖ్యంగా రష్మిక జీవించేసిందని, భావోద్వేగ సన్నివేశాల్లో ఆమె నటన అద్భుతమని ప్రశంసలు కురిపిస్తున్నారు. రష్మిక తల్లి సుమన్ మందన కూడా తన కూతురుపై ప్రశంసల వర్షం కురిపించారు. ఇటీవల ‘డియర్ కామ్రేడ్’ సినిమా చూసిన సుమన్ తన కుమార్తెను పొడుగుతూ ట్వీట్ చేశారు. ‘డియర్ లిల్లీ, నువ్వు నీ తల్లిదండ్రులను గర్వపడేలా చేశావు. నువ్వు ఎంచుకున్న ఫీల్డ్‌లో అద్భుతంగా రాణిస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది! ఐ లవ్ యూ బేబీ. విజయ్ దేవరకొండ.. నువ్వు చాలా అద్భుతంగా చేశావు. నీ భవిష్యత్తు ఎంతో బాగుండాలని కోరుకుంటున్నాను. భరత్ - బ్రిల్లియంట్. ఆల్ ది బెస్ట్. మైత్రీ మూవీ మేకర్స్‌కి కృతజ్ఞతలు’ అని సుమన్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు. ఈ ట్వీట్‌కు రష్మిక స్పందించారు. ‘మమ్మీ థాంక్యూ.. ఐ లవ్ యూ టూ. సినిమాను ఇంకోసారి చూడు. కొత్త వర్షన్ నీకు ఎంతబాగా నచ్చిందో నాకు, టీమ్‌కి చెప్పు’ అని రష్మిక పేర్కొన్నారు. రష్మిక రిప్లైకి ఆమె తల్లి స్పందించారు. ఇంకా ఎక్కువగా కష్టపడి అందరి ఆశీర్వాదాలు పొందాలని, ఇంకా ఎక్కువ సంతోషంగా ఉండాలని కూతురుని దీవించారు. ప్రస్తుతం రష్మిక చేస్తున్న జర్నీని ఎంజాయ్ చేయమని సూచించారు. ఆ తరవాత రష్మిక ఇచ్చిన రిప్లై ఆసక్తికరంగా ఉంది. అందరూ ఈ ట్వీట్ కాన్వర్జేషన్‌ వైపు చూసేలా చేసింది. ‘అమ్మా.. నువ్వొక విషయం తెలుసుకోవాలి. నీకు ఫోన్ ఉంది.. నాకూ ఫోన్ ఉంది. నువ్వెప్పుడైనా నాకు కాల్ చేయొచ్చు. జనాలు ట్వీట్లు చదువుతున్నారు. చాలా ఇబ్బందిగా ఉంది’ అని రష్మిక పేర్కొ్న్నారు. ఆశ్చర్యం వ్యక్తపరిచే ఒక ఎమోజీని కూడా పెట్టారు. ఇలా తల్లీకూతుళ్ల మధ్య జరిగిన సంభాషణ బాగా హైలైట్ అయ్యింది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2YaZs18
v

AA19: రావు రమేష్ వదిలేసిన పాత్రలో హర్షవర్థన్.. ఇంతకీ గొడవేంటి?

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్‌లో సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఇది అల్లు అర్జున్‌కు 19వ సినిమా. ఇంకా టైటిల్ ఖరారు కాలేదు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమాలో ప్రముఖ నటుడు ఒక ముఖ్య పాత్ర పోషించాల్సి ఉంది. ఇప్పటికే కొంత మేర తన షూటింగ్ పార్ట్‌ను పూర్తిచేశారు. అయితే, కొన్ని కారణాల చేత ఆయన ఈ సినిమా నుంచి తప్పుకున్నారు. కాల్షీట్ల విషయంలో దర్శకుడు త్రివిక్రమ్, రావు రమేష్‌కు మధ్య విభేదాలు రావడంతోనే ఆయన తప్పుకున్నారని అంటున్నారు. అనుకోని కారణాల వల్ల ఈ సినిమా షూటింగ్ ఆలస్యమవుతూ వస్తోందట. ఈ సినిమాలో పాత్ర కోసం గతంలో రావు రమేష్ నుంచి వరుస తేదీలు దర్శకుడు త్రివిక్రమ్ తీసుకున్నారట. అయితే, ఈ తేదీల లోపల రావు రమేష్ షూటింగ్ పార్ట్‌ను పూర్తిచేయలేదని టాక్. దీంతో మరోసారి ఆయన్ని చిత్ర యూనిట్ తేదీలు అడిగిందని అంటున్నారు. కానీ, రావు రమేష్ మరోవైపు మహేష్‌బాబు ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాలో నటిస్తున్నారు. దాని కోసం ఇప్పటికే తేదీలు ఇచ్చేశారట. ఇప్పుడు త్రివిక్రమ్ టీమ్ మరోసారి తేదీలు అడగడంతో రావు రమేష్ అసహనం వ్యక్తం చేశారట. తాను ఈ సినిమాలో చేయలేనని తప్పుకున్నారని తెలిసింది. వాస్తవానికి రావు రమేష్‌కు త్రివిక్రమ్ ఇప్పటి వరకు చాలా మంచి పాత్రలు ఇచ్చారు. కానీ, ఏ విధంగానూ తేదీలు సర్దుబాటు చేసుకోలేక రావు రమేష్ తప్పుకున్నారని సమాచారం. ఈ విషయంలో త్రివిక్రమ్ పట్ల రావు రమేష్ కాస్త అసహనం కూడా వ్యక్తం చేశారని అంటున్నారు. ఇక రావు రమేష్ స్థానాన్ని భర్తీ చేయడానికి వేట మొదలుపెట్టిన త్రివిక్రమ్.. ‘బ్రోచేవారెవరురా’ చిత్రంలో హర్షవర్థన్ నటన చూసి ఇంప్రస్ అయ్యారట. వెంటనే హర్షవర్థన్ సంప్రదించడంతో ఆయన ఎంతో ఆనందంగా అంగీకరించారని చెబుతున్నారు. మళ్లీ ఇప్పుడు రావు రమేష్‌తో చేసిన కొన్ని సన్నివేశాలను హర్షవర్థన్‌తో రీషూట్ చేయనున్నారని అంటున్నారు. చూద్దాం ఈ పాత్రను హర్షవర్థన్ ఎలా పండిస్తారో!


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2Kki7hc
v

Tuesday 30 July 2019

మరోసారి తెరను పంచుకుంటున్న చిరంజీవి, రామ్ చరణ్!

మెగాస్టార్ తన 152వ సినిమాను దర్శకుడు కొరటాల శివతో చేయనున్న సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు సందేశాత్మక చిత్రాలను తెరకెక్కించిన కొరటాల శివ.. చిరంజీవితో సినిమా చేస్తున్నారనగానే అంచనాలు పెరిగిపోయాయి. ఈ సినిమా కోసం మెగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే, ఈ చిత్రం చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఆగస్టు 22న లాంఛనంగా ప్రారంభమవుతుందని సినీ వర్గాల ద్వారా తెలిసింది. ఇంకో ఆసక్తికర విషయం ఏంటంటే ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ అతిథి పాత్రలో నటించనున్నారట. ఇది ఒక మంచి సందేశంతో కూడి కమర్షియల్ సినిమా అట. దీనిలో ఒక ముఖ్యమైన అతిథి పాత్ర ఉందట. ఈ పాత్రను రామ్ చరణ్‌తో చేయిస్తే బాగుంటుందని దర్శకుడు కొరటాల భావించారట. దీనికి రామ్ చరణ్ కూడా అంగీకారం తెలిపారని టాక్. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వెలువడుతుందని చెబుతున్నారు. గతంలో ‘మగధీర, బ్రూస్ లీ, ఖైదీ నెం.150’ సినిమాల్లో తండ్రీకొడుకులిద్దరూ కలిసి నటించారు. కాగా, ప్రస్తుతం దర్శకుడు హీరోయిన్ వేటలో ఉన్నారు. ఈ సినిమాలో చిరంజీవి సరసన నయనతార లేదంటే శృతిహాసన్ నటిస్తారని వార్తలు వచ్చాయి. కానీ, కొరటాల మాత్రం ఐశ్వర్యరాయ్ బచ్చన్‌ను ఈ ప్రాజెక్ట్‌లోకి తీసుకురావాలని చూస్తున్నారట. ఆ విధంగా ప్రయత్నాలు కూడా మొదులుపెట్టారని అంటున్నారు. ఇంకో ఆసక్తికర విషయం ఏంటంటే.. ఈ సినిమా కోసం చిరంజీవి బరువు తగ్గనున్నారట. దీనికోసం ఆయన విశాఖపట్నం వెళ్తున్నారని సినీ వర్గాల సమాచారం. అక్కడ ఫిట్‌నెస్‌కి సంబంధించిన కసరత్తులు చేస్తారట. ఇక, చిరంజీవి 151వ సినిమా ‘సైరా నరసింహారెడ్డి’ నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. రాయలసీమకు చెందిన తొలితరం స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతోన్న ఈ చిత్రం అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు రానుంది. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమాను కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్‌పై రామ్ చరణ్ నిర్మిస్తున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2K4gbuk
v

'డియర్ కామ్రేడ్' మలయాళంలో మస్త్ ఖుషీ.. మరో సాంగ్‌తో

విజ‌య్ దేవ‌ర‌కొండ‌, ర‌ష్మిక మంద‌న్నా జంట‌గా న‌టించిన చిత్రం `డియ‌ర్ కామ్రేడ్‌`. `ఫైట్ ఫ‌ర్ వాట్ యు ల‌వ్‌` అనేది ట్యాగ్ లైన్‌. భ‌ర‌త్ క‌మ్మ ద‌ర్శ‌కకుడు. మైత్రీ మూవీ మేక‌ర్స్‌, బిగ్ బెన్ సినిమాస్ ప‌తాకాల‌పై తెరకెక్కిన ఈనెల 26న తెలుగు, త‌మిళ‌, మ‌ల‌యాళ‌, క‌న్న‌డ భాష‌ల్లో విడుద‌ల చేశారు. విడుదలైన అన్ని కేంద్రాలలో సక్సెస్ ఫుల్‌గా రన్ అవుతున్న సందర్బంగా నిర్మాతలు సోమవారం పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేసారు. ఈ సందర్బంగా నిర్మాత నవీన్ యెర్నేని మాట్లాడుతూ .. విడుదలైన ఈ మూడు రోజుల్లో మంచి వసూళ్లు వచ్చాయి. మూడు రోజులకు గాను రూ. 21 కోట్లు దక్కింది. గ్రాస్‌లో చూసుకుంటే 30 కోట్లవరకు రాబట్టింది. హీరో విజయ్ కున్న క్రేజ్ నేపథ్యంలో భారీ వసూళ్లు రావడం నిర్మాతలుగా మాకు ఆనందంగా ఉంది. అటు ఓవర్ సీస్2లో కూడా భారీ కలక్షన్స్ అందుకున్నాయి. అలాగే ఇతర భాషల్లో కూడా మంచి వసూళ్లు రావడం .. ఈ రోజు వీకెండ్ తరువాత కూడా అదే కలక్షన్స్ రావడం, బయ్యర్స్ కూడా హ్యాపీగా ఉన్నారు. అలాగే ఈ సినిమా నిడివి విషయంలో స్లో గా ఉందంటూ కామెంట్స్ రావడమతొ 13 నిమిషాల సినిమాను కట్ చేసాం. అలాగే ఇప్పటికే ఇందులోని క్యాంటీన్ సాంగ్ బాగా పాపులర్ అయింది. నిడివి దృష్ట్యా దాన్ని పెట్టలేదు. చాలా మంది కావాలని కోరుకోవడంతో నేటినుండి ఆ సాంగ్‌ని జోడించాం. ఆ పాట సినిమాకు ఇంకాస్త ఊపు ఇస్తుందని భావిస్తున్నాం అన్నారు. మరో నిర్మాత య‌ష్ రంగినేని మాట్లాడుతూ - ``రెస్పాన్స్ చాలా హ్యూజ్‌గా ఉంది. యు.ఎస్‌. , యు.కె ల్లో మంచి క‌లెక్ష‌న్స్ ఉన్నాయ‌ని ప్రూవ్ అయింది. ఫ్యామిలీ ఆడియెన్స్ సినిమాను బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఈ కథను పెళ్లి చూపులు తరువాత విజయ్ విని నాకు వినిపించాడు అప్పటికి అర్జున్ రెడ్డి రాలేదు .. ఆ తరువాత సినిమా మొదలు పెట్టాం. అర్జున్ రెడ్డి పెద్ద హిట్ అవ్వడంతో ఈ స్క్రిప్ట్ విషయంలో ఏ మార్పులు చేయలేదు కానీ .. అనుకున్నాం. అప్పుడే మైత్రి నిర్మాతలు అప్రోచ్ అయ్యారు. వారివల్ల సినిమా రేంజ్ పెరిగింది. దానికి తగ్గట్టుగా మంచి వసూళ్లు అందుకోవడం ఆనందంగా ఉంది అన్నారు. నిర్మాత యలమంచిలి రవి మాట్లాడుతూ .. కలక్షన్స్ బాగున్నాయి. వరల్డ్ వైడ్ గా రిపోర్ట్ బాగుంది. ముఖ్యంగా తెలుగు సినిమాను మలయాళంలో బాగా ఆదరిస్తున్నారు. ఇప్పటికే అక్కడ వసూళ్లు వచ్చాయి. అలాగే తమిళ్, కన్నడ కూడా బాగా ఆడుతుంది. ఈ సినిమా తరువాత విజయ్ హీరోగా చేస్తున్న కొత్త ప్రాజెక్ట్ ‘హీరో’ సినిమా మరో షెడ్యూల్ మొదలు పెట్టనున్నాం అన్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/31aqgMd
v

‘ఇస్మార్ట్ శంకర్’ బ్లాక్ బస్టర్ కలెక్షన్స్.. ఫుల్ ప్రాఫిట్!

డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ నిర్మాతగా మరోసారి సక్సెస్ అయ్యారు. 13 ఏళ్ల క్రితం ‘పోకిరి’ సినిమాతో కోట్లు ఆర్జించిన పూరి.. మళ్లీ ఇన్నాళ్లకు నిర్మాతగా లాభాలను పొందుతున్నారు. పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించి నిర్మించిన చిత్రం ‘ఇస్మార్ట్ శంకర్’. ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా నటించారు. నభా నటేశ్, నిధి అగర్వాల్ హీరోయిన్లు. మణిశర్మ సంగీతం సమకూర్చారు. హై ఓల్టేజ్ మాస్ మసాలా సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘ఇస్మార్ట్ శంకర్’.. పూరి జగన్నాథ్‌కు గెలుపు దాహాన్ని తీర్చింది. గత కొంత కాలంగా వరుస ఫ్లాపులతో ఢీలా పడిన పూరీకి ‘ఇస్మార్ట్ శంకర్’ విజయం ఉపశమనాన్ని ఇచ్చింది. తొలి రోజు నుంచి మంచి కలెక్షన్లు రాబడుతోన్న ‘ఇస్మార్ట్ శంకర్’ 12 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా రూ.29.93 కోట్ల డిస్ట్రిబ్యూటర్ల షేర్‌ను వసూలు చేసిందని సినీ వర్గాలు చెబుతున్నాయి. మొత్తం గ్రాస్ సుమారు రూ.65 కోట్లని అంటున్నారు. 12 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో రూ.26.68 కోట్ల షేర్‌ను ‘ఇస్మార్ట్ శంకర్’ వసూలు చేసిందట. ఇక ఓవర్సీస్‌లో సుమారుగా రూ. 1.15 కోట్లు రాబట్టిందని అంటున్నారు. ఈ చిత్ర థియేట్రికల్ హక్కులను పూరి జగన్నాథ్ రూ.17 కోట్లకు విక్రయించారట. ప్రస్తుత కలెక్షన్లు బట్టి చూస్తే ఇప్పటికే లాభం రూ.12 కోట్లు దాటింది. దీంతో ‘ఇస్మార్ట్ శంకర్’ పూరీకి బ్లాక్ బస్టర్ కలెక్షన్స్ తెచ్చిపెడుతోందని అంటున్నారు. ప్రాంతాల వారీగా ‘ఇస్మార్ట్ శంకర్’ 12 రోజుల షేర్ కలెక్షన్స్ నైజాం - రూ. 9.92 కోట్లు సీడెడ్ - రూ. 5.25 కోట్లు నెల్లూరు - రూ. 1.03 కోట్లు గుంటూరు - రూ. 1.78 కోట్లు కృష్ణా - రూ. 1.85 కోట్లు పశ్చిమ గోదావరి - రూ. 1.55 కోట్లు తూర్పు గోదావరి - రూ. 1.80 కోట్లు ఉత్తరాంధ్ర - రూ. 3.50 కోట్లు మొత్తం ఏపీ, తెలంగాణ షేర్: రూ. 26.68 కోట్లు దేశంలోని ఇతర ప్రాంతాల్లో - రూ. 2.10 కోట్లు ఓవర్సీర్ - రూ. 1.15 కోట్లు 12 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా ‘ఇస్మార్ట్ శంకర్’ బాక్సాఫీసు కలెక్షన్స్ (షేర్): రూ. 29.93 కోట్లు


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/311bqHN
v

నా కన్యత్వం పోయింది అప్పుడే.. అమ్మే దగ్గరుండి మరీ: షకీలా నగ్నసత్యాలు

ఏ తల్లైనా తనకు పుట్టిన పిల్లల్ని ఒకేలా చూస్తుంది.. అమ్మ ప్రేమను సమానంగా పంచుతుంది. ఒకరు ఎక్కువ, ఒకరు తక్కువ కాదు అమ్మ ప్రేమకు. అయితే విషయంలో మాత్రం ఆ అమ్మ ప్రేమ నేటికీ ప్రశ్నార్ధకమే. ఒక కూతుర్ని ఏ తల్లైనా ఎలాంటి పరిస్థితుల్లో చూడకూడదని అనుకుంటుందో అలాంటి నీచమైన బతుకుపై ఆశలు కల్పించేలా.. అటువైపు అడుగులు పడేలా చేసి అమ్మతనానికే మచ్చ తెచ్చింది ఆ మహా తల్లి. షకీలా అంటే ఓ శృంగార తారగానే పరిచయం.. కాని ఆమె జీవితంలో ఎన్నో ఆటు పోట్లు.. మరెన్నో వంచనలు.. అక్క, అక్క, తమ్ముడు వీళ్లే కాదు.. ప్రేమించి వాళ్లు కూడా షకీలాను వాడుకున్నారే తప్ప అండగా నిలవలేకపోయారు. ఒక్కరు కాదు ఇద్దరు కాదు.. ఏకంగా ఎనిమిది మంది ప్రేమ పేరుతో ఆమెను నయ వంచనకు గురిచేశారు. వీటన్నింటినీ తట్టుకుని నిలిచే సరికి ఆమె పక్కన ఇప్పుడు ఎవరూ లేదు. ఒక్కరుగానే మిగిలింది. కోట్లు సంపాదించినప్పుడు ఆమె పక్కన నిలిచిన నా అనుకునే వాళ్ల నమ్మక ద్రోహానికి బలైపోయి ఇప్పుడు సాదాసీదా జీవితం గడుపుతోంది షకీలా. అయితే ఇంత నమ్మకద్రోహానికి గురైనా.. ఆమె ఆత్మవిశ్వాసాన్ని కోల్పోలేదు. పరిస్థితుల్ని చూసి పారిపోలేదు. తనకు ఎక్కడైతే అవమానం జరిగిందే అక్కడే ఎదురొడ్డి నిలబడతానంటోంది. మరో జన్మంటూ ఉంటే మళ్లీ షకీలానే పుడతానంటోంది. తాజాగా ఆమె టీఎన్ఆర్ ఇంటర్వ్యూలో అనేక నగ్నసత్యాలను పంచుకున్నారు. వాటిలో ఆమె తన తల్లి గురించి చెప్పిన విషయాలు కంటతడి పెట్టించేవిగా ఉన్నాయి. షకీలా మాట్లాడుతూ.. ‘పిల్లలంటే ఏ అమ్మ అయినా అందర్నీ ఒకేలా చేస్తారు. కాని మా అమ్మ నన్ను చిన్నప్పటి నుండీ సెపరేట్‌గా చూసేవారు. నేను సంపాదించినప్పుడు కూడా వ్యత్యాసం చూపించేవారు. ఆమె ఎందుకు అలా చేసేదో నాకు ఇప్పటికీ అర్ధం కాదు. ఆ పాడు పనికి అమ్మే దగ్గరుండి నన్ను పంపేది.. ఈ విషయం చాలా మందికి తెలుసు. సినిమాల్లోకి వద్దాం అనుకుంటున్న నన్ను.. అమ్మ హోటల్ రూంకి దగ్గరుండి పంపించేది. అప్పటికి నేను హీరోయిన్ కాలేదు. అప్పుడప్పుడే కెరియర్ స్టార్ట్ చేస్తున్నా.. ‘ప్లే గర్ల్’ అనే సినిమా మొదలైంది. నెక్స్ట్ సినిమాకి ఎలా వెళ్లాలో రూటు నాకు తెలియదు. ఆ టైంలో అమ్మ ఈ పని చేయించింది. ఇంట్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి.. వెళ్లు అని చెప్పింది. అమ్మ హోటల్ రూంకి వెళ్లమంది.. ఫస్ట్ అక్కతోనే వెళ్లాను. ఫస్ట్ టైం ఏం జరగలేదు.. వద్దంటే వదిలేశారాయన హోటల్ రూంకి వెళ్లిన తరువాత ప్లీజ్.. ప్లీజ్ వదిలేయండి అని అడిగితే ఆయన వదిలేశారు. కాని నాతో ప్రామిస్ చేయించుకున్నారు. నెక్స్ట్ టైం నేను వచ్చి నిన్ను కలుస్తాను అప్పటి వరకూ నువ్ వర్జిన్‌గానే ఉండాలని కండిషన్ పెట్టారు. అప్పుడు నేను ఓకే అని చెప్పి.. అమ్మతో మాత్రం పని అయిపోయిందని చెప్పండి అన్నాను. కాని అయిపోయిందని చెప్పగానే అమ్మ సెకండ్ దానికి రెడీ చేసేశారు. ఫస్ట్ ది తప్పింది అంతే. ఆ తరువాత అది కంటిన్యూ అయ్యింది. ఫిల్మ్స్ రాగానే అవన్నీ తగ్గిపోయినవి. నా కన్యత్వం కావాలనుకున్నప్పుడు లేదు.. నేను ఎవరితో ఉండాలనుకున్నప్పుడు కన్యత్వం కావాలనుకున్నానో అప్పుడు లేకుండా పోయింది. నా వర్జినిటీ ఎప్పుడు పోయిందో నాకే తెలియదని గతంలో అన్నాను దానికి అర్ధం.. నేను కావాలనుకున్నప్పుడు లేదు అని. నేను వర్జినిటీతో ఎవర్ని కలవాలనుకున్నానో అది అప్పుడు లేదు. ప్రేమించిన వాళ్లతో నేను చాలా స్ట్రాంగ్ రిలేషన్ షిప్‌లో ఉండేదాన్ని. ఇంచుమించు ఏడెనిమిది మందితో లవ్‌లో ఉన్నా. కాని ఎవరూ పెళ్లి చేసుకునే ధైర్యం చేయలేదు. Read Also:


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2Ms5vXZ
v

‘అర్జున్ రెడ్డి’లా మారిపోయిన ‘RX 100’ హీరోయిన్.. ఒకేసారి రెండు సిగరెట్లు!

పాయల్ రాజ్‌పుత్.. ‘RX 100’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ పంజాబీ బ్యూటీ తొలి చిత్రంతోనే చెరగని ముద్ర వేసింది. ప్రేమ పేరుతో అబ్బాయిని మోసం చేసి శారీరకంగా వాడుకునే అమ్మాయి పాత్రలో అద్భుతంగా నటించింది. ఈ సినిమా తరవాత పాయల్‌కు తెలుగులో వరుసగా అవకాశాలు వస్తున్నాయి. ఇటీవల ‘సీత’ సినిమాలో ‘బుల్‌రెడ్డి’ ఐటమ్ సాంగ్‌లో నర్తించింది. ప్రస్తుతం ‘డిస్కో రాజా’లో రవితేజ సరసన నటిస్తోంది. అలాగే, ‘వెంకీ మామ’లో హీరోయిన్‌గా చేస్తోంది. ఇంకోవైపు ‘ఆర్డీఎక్స్’ అనే చిన్న సినిమాలోనూ ప్రధాన పాత్ర పోషిస్తోంది. సినిమాలతో బిజీగా గడుపుతోన్న ఈ బ్యూటీ సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటుంది. ఎప్పటికప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌లో ఫొటోలు పోస్ట్ చేస్తూ అభిమానులకు టచ్‌లో ఉంటుంది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఈమెకు 1.4 మిలియన్ ఫాలోవర్లు ఉన్నారు. ఇదిలా ఉంటే, ఈరోజు పాయల్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఫొటో ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఒకేసారి రెండు సిగరెట్లను లాగిపారేస్తోంది పాయల్. కళ్లకు బ్లాక్ కూలింగ్ గ్లాస్‌ పెట్టుకుని చేతిలో రెండు సిగరెట్లతో పొగ వదులుతూ పాయల్ చాలా స్టైలిష్‌గా ఉంది. ఈ కిరాక్‌ లుక్‌కు క్యాప్షన్ కూడా ఇచ్చింది. ‘‘ఇంకా కబీర్ సింగ్ / అర్జున్ రెడ్డి మోడ్‌లోనే ఉన్నా. ఇది షూటింగ్‌లో భాగంగా చేసింది. నా రాబోయే చిత్రంలో ఒక సన్నివేశం ఇది. పొగతాగడం ఆరోగ్యానికి హానికరం’’ అని పాయల్ పేర్కొంది. రాబోయే చిత్రం అని చెప్పింది కానీ.. ఆ సినిమా పేరేమిటో పాయల్ చెప్పలేదు. వాస్తవానికి పాయల్‌ను స్మోకింగ్ లుక్‌లో చూడటం ఇది మొదటిసారి కాదు. ‘RX 100’ సినిమాలోనూ పాయల్ స్మోకింగ్ చేస్తూ కనిపించింది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2MrSayU
v

మూడు భారీ ప్రాజెక్టులతో సిద్ధంగా ఉన్న మైత్రీ మూవీ మేకర్స్

సరిగ్గా ఐదేళ్ల క్రితం నవీన్ యెర్నేని, రవి శంకర్ యలమంచిలి, మోహన్ చెరుకూరి కలిసి మైత్రీ మూవీ మేకర్స్ పేరిట నిర్మాణ సంస్థను ప్రారంభించారు. అనతికాలంలోనే ఈ సంస్థ టాలీవుడ్‌లోని టాప్ ప్రొడక్షన్ హౌజుల్లో ఒకటిగా నిలిచింది. వరుసగా సూపర్ హిట్ సినిమాలు తీసిన ఈ ముగ్గురూ మంచి అభిరుచి కలిగిన నిర్మాతలుగా గుర్తింపు తెచ్చుకున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ నుంచి సినిమా వస్తుందంటే కచ్చితంగా బాగుంటుందనే నమ్మకాన్ని ప్రేక్షకుల్లో కలిగించారు. ‘‘శ్రీమంతుడు, జనతా గ్యారేజ్, రంగస్థలం, చిత్రలహరి, డియర్ కామ్రేడ్’’ ఇలా వరసగా అన్నీ మంచి సినిమాలే. టాలీవుడ్‌లోని టాప్ లిస్టులో ఉన్న హీరోలను ఎంపిక చేసుకుని.. కొత్త దర్శకులకు అవకాశాలు ఇస్తూ వచ్చారు. వీళ్లు చేసిన ప్రయోగాలన్నీ ఇప్పటి వరకు మంచి ఫలితాలను ఇచ్చాయి. ప్రస్తుతం నానితో తీసిన ‘‘గ్యాంగ్ లీడర్’’ విడుదలకు సిద్ధమవుతోంది. ఇది కాకుండా విజయ్ దేవరకొండతో ‘హీరో’ అనే బహుభాషా చిత్రాన్ని కూడా మొదలుపెట్టారు. మాళవికా మోహన్ ఇందులో హీరోయిన్. అలాగే సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ 20వ సినిమాను తాము నిర్మిస్తున్నట్లు మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ప్రకటించింది. ఇదిలా ఉంటే, ఇప్పటికే సూపర్ స్టార్ మహేష్‌బాబు, యంగ్ టైగర్ ఎన్టీఆర్ మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ఒక్కో సినిమా చేసింది. తమకు బ్లాక్ బస్టర్ హిట్లు ఇచ్చిన ఈ ఇద్దరు హీరోలతో మరోసారి సినిమాలు చేస్తున్నారట. మహేష్‌బాబు సినిమా 2020లో సెట్స్‌పైకి వెళ్లనుందని సమాచారం. ఇక ‘కేజీఎఫ్’ వంటి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన దర్శకుడు ప్రశాంత్ నీల్‌తో కూడా మైత్రీ మూవీ మేకర్స్ ఒక చిత్రాన్ని నిర్మించనుందని తెలిసింది. ఈ సినిమాలో ఎన్టీఆర్ హీరోగా నటిస్తారట. ఈ సినిమా కూడా 2020లో ప్రారంభమవుతుందని సమాచారం. ప్రస్తుతం మహేష్‌బాబు, ఎన్టీఆర్, అల్లు అర్జున్ వారివారి ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ఈ సినిమాల షూటింగ్‌లు పూర్తికాగానే వీరి నెక్ట్స్ ప్రాజెక్టులు మైత్రీ మూవీ మేకర్స్‌తోనే. మొత్తానికి వచ్చే ఏడాదికి సంబంధించి మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ పక్కా ప్రణాళికను సిద్ధం చేసుకుంది. త్వరలోనే విజయ్ దేవరకొండ ‘హీరో’ షూటింగ్ ప్రారంభమైపోతుంది. బహుశా వచ్చే ఏడాది ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రావచ్చు. ప్రస్తుతం ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాతో బిజీగా ఉన్న మహేష్.. వచ్చే ఏడాది మైత్రీ మూవీ మేకర్స్ సినిమా చేస్తారు. ఈ సినిమా దర్శకుడు ఎవరో ఇంకా తెలియరాలేదు. ప్రస్తుతం ‘‘RRR’’తో ఎన్టీఆర్, ‘‘కేజీఎఫ్ ఛాప్టర్ 2’’తో ప్రశాంత్ నీల్ బిజీగా ఉన్నారు. ఈ ప్రాజెక్టులు పూర్తికాగానే వీరిద్దరూ జతకడతారు. మరోవైపు, త్రివిక్రమ్ సినిమాలో నటిస్తోన్న అల్లు అర్జున్.. ఈ ప్రాజెక్టు పూర్తికాగానే సుకుమార్ దర్శకత్వంలో సినిమా చేస్తారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2ZkuaSb
v

‘సాహో’ రెండో పాట టీజర్.. లవ్ ఆంథమ్ ఆఫ్ దిస్ ఇయరట!!

ఈ ఏడాది మోస్ట్ వాంటెడ్ యాక్షన్ మూవీస్‌లో ‘సాహో’ ఒకటి. రెబల్ స్టార్ ప్రభాస్, బాలీవుడ్ భామ శ్రద్ధా కపూర్ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ ప్రతిష్టాత్మక చిత్రంపై భారీ అంచనాలున్నాయి. సుజీత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఆగస్టు 30న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ లోపల ‘సాహో’పై ఉన్న అంచనాలను రెట్టింపు చేసేందుకు చిత్ర ప్రచార కార్యక్రమాలపై దర్శక నిర్మాతలు దృష్టి పెట్టారు. ఇప్పటికే టీజర్, ‘సైయా సైకో’ అనే పాటను విడుదల చేశారు. వీటికి ప్రేక్షకుల నుంచి విశేష స్పందన వచ్చింది. ఇప్పుడు ఈ చిత్రంలో రెండో పాటను విడుదల చేస్తున్నారు. ఆగస్టు 2న విడుదల చేసే ఈ పాట టీజర్‌ను మంగళవారం యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేశారు. Also Read: ‘యే చోట నువ్వున్నా’ అంటూ సాగే ఈ లవ్ ట్రాక్‌ టీజర్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఈ టీజర్‌లో ప్రభాస్, శ్రద్ధా లుక్ అదిరిపోయింది. ముఖ్యంగా ప్రభాస్ వైట్ సూట్‌లో నడుచుకుంటూ వచ్చే సీన్ ఆయన అభిమానులకు విపరీతంగా నచ్చేస్తుంది. మంచు కొండలు, సరస్సు, లొకేషన్స్ చాలా బాగున్నాయి. పిక్చరైజేషన్ అయితే పైస్థాయిలో ఉంది. ఇవన్నీ బాగున్నా.. పాటలోనే అంత ఎట్రాక్షన్ కనిపించడం లేదు. ఏదో హిందీ పాటను అనువాదం చేసినట్టుగా ఉంది. ఈ టీజర్‌లో ‘లవ్ ఆంథమ్ ఆఫ్ దిస్ ఇయర్’ అంటూ పేర్కొన్నారు. కానీ, టీజర్ చూస్తుంటే అంతలేదనిపిస్తోంది. ‘సైయ్యా సైకో’ పాట వచ్చినప్పుడే చాలా మంది పెదవి విరిచారు. తెలుగు ప్రాంతీయతకు తగ్గట్టుగా ఈ పాట లేదని విమర్శించారు. మరి ఆగస్టు 2న ‘యే చోట నువ్వున్నా’ పూర్తి పాట విడుదలైతే ఏమంటారో. తొలి పాటను తనిష్క్ బాగ్చి స్వరపరచగా.. ఈ పాటను పంజాబీ కంపోజర్ గురు రంధవ కంపోజ్ చేశారు. హరిచరణ్ శేషాద్రి, తులసి కుమార్ ఆలపించిన ఈ పాటకు కృష్ణకాంత్ సాహిత్యం అందించారు. ‘నిన్నలు మరిచేలా నిను ప్రేమిస్తాలే.. నీ కన్నులు అలిసేలా నీక్కనిపిస్తాలే’ అంటూ పాట మొదలైంది. ‘సాహో’ సినిమా స్థాయిలో ఈ పాట లేదని అనిపిస్తోంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2LPTtZi
v

దయచేసి హార్దిక్ పాండ్య మాజీ ప్రేయసి అని అనకండి.. నాకూ కుటుంబం ఉంది!

భారత క్రికెటర్ హార్దిక్ పాండ్య, బాలీవుడ్ హీరోయిన్ ఊర్వశి రౌతెలాకు ముడిపెడుతూ యూట్యూబ్‌లో బోలెడన్ని వీడియోలు ఉన్నాయి. తాజాగా ఒక యూట్యూబ్ ఛానెల్ ఊర్వశిని మాజీ ప్రేయసి అని పేర్కొంటూ ఒక వీడియోను అప్‌లోడ్ చేసింది. ఈ వీడియోను చూసిన ఊర్వశి తీవ్ర ఆగ్రహానికి లోనైంది. తన ప్రతిష్ఠను దిగజార్చే ఇలాంటి వీడియోలను దయచేసి పోస్ట్ చేయొద్దంటూ యూట్యూబ్ ఛానెళ్లను ఊర్వశి వేడుకుంది. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో అలాంటి ఒక వీడియో స్క్రీన్ షాట్‌ను షేర్ చేసింది. ఇలాంటి వీడియోల వల్ల తన కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదనకు గురవుతారని పేర్కొంది. ఆ వీడియో స్క్రీన్ షాట్‌ను ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ఉంచిన ఊర్వశి.. ‘‘యూట్యూబ్‌లో ఉన్న మీడియా ఛానెల్స్‌కు నేను ఎంతో విధేయతతో విజ్ఞప్తి చేస్తున్నాను. దయచేసి ఇలాంటి చెత్త వీడియోలను అప్‌లోడ్ చేయడం మానేయండి. నాకొక కుటుంబం ఉంది, వాళ్లకు నేను సమాధానం చెప్పుకోవాలి. ఈ వీడియోలు నాకు సమస్యలు తెచ్చిపెడతాయి’’ అని పేర్కొన్నారు. ఒక సహాయం నిమిత్తం తన మాజీ ప్రియుడు, క్రికెటర్ హార్దిక్ పాండ్యాను కలిశారని ఆ వీడియోలో ఉంది. ఇదొక హిందీ మీడియా సంస్థకు చెందిన యూట్యూబ్ ఛానెల్. కాగా, కిందటేడాది ఊర్వశి, హార్దిక్ పాండ్య ఒక పార్టీకి కలిసి వెళ్లారు. పారిశ్రామికవేత్త గౌతమ్ సింఘానియా ముంబైలోని తన బ్రీచ్ క్యాండీ హోమ్‌లో ఈ పార్టీ ఇచ్చారని అప్పట్లో వార్తలు వచ్చాయి. హార్దిక్ పాండ్య సోదరుడు కృనాల్ పాండ్య కూడా ఈ పార్టీకి వచ్చాడు. అయితే, పార్టీలో హార్దిక్ పాండ్యతో ఊర్వశి సన్నిహితంగా మెలగడంతో వాళ్లిద్దరి మధ్య ఏదో ఉందంటూ ప్రచారం జరిగింది. ప్రస్తుతం హార్దిక్ ‘మికీ వైరస్’ నటి ఎల్లి అవ్‌రామ్‌తో డేటింగ్‌లో ఉన్నాడంటూ ప్రచారం జరుగుతోంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2GBDoSG
v

ప్రభాస్, శ్రద్ధా కపూర్.. మధ్యలో మహేష్.. ఫ్యాన్స్ అప్సెట్!!

రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన ప్రతిష్టాత్మక చిత్రం ‘సాహో’. బాలీవుడ్ భామ శ్రద్ధా కపూర్ ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమా కోసం ఇటు ప్రభాస్ అభిమానులతో పాటు దేశ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ‘బాహుబలి’ సిరీస్‌తో బాలీవుడ్‌లోనూ మంచి గుర్తింపు తెచ్చుకున్న ప్రభాస్ అక్కడ కూడా ఫ్యాన్ ఫాలోయింగ్‌ను సంపాదించుకున్నారు. ప్రస్తుతం బాలీవుడ్‌లో మంచి క్రేజ్ ఉన్న ఏకైక హీరో ప్రభాస్ అనడంలో ఎలాంటి సందేహంలేదు. అయితే, ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించిన శ్రద్ధా కపూర్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు ప్రభాస్ అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేశాయట. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న శ్రద్ధా కపూర్‌ను తెలుగులో మీ అభిమాన నటుడు ఎవరని అడిగారు. వెంటనే శ్రద్ధా సూపర్ స్టార్ పేరు చెప్పారు. ప్రభాస్ గురించి అడిగినప్పుడు అతను తనకు మంచి స్నేహితుడని వెల్లడించారు. శ్రద్ధా కపూర్ ఇచ్చిన ఈ సమాధానాలు ప్రభాస్ ఫ్యాన్స్‌ని ఆగ్రహానికి లోను చేశాయట. వాస్తవానికి ఒక హీరోతో నటిస్తున్నప్పుడు ఆయనే తన అభిమాన నటుడని హీరోయిన్ చెప్పాలని ఆ హీరో అభిమానులు కోరుకోవడం కరెక్ట్ కాదు. ఎందుకంటే ఎవరి ఇష్టాలు వారికి ఉంటాయి. వాటిని మనం గౌరవించాలి. శ్రద్ధాకపూర్ మహేష్‌బాబును ఇష్టపడుతున్నంత మాత్రాన ప్రభాస్ క్రేజ్ ఏమైనా తగ్గిపోతుందా? కానీ, శ్రద్ధా కపూర్ చెప్పిన సమాధానం ప్రస్తుతం హాట్ టాపిక్ అయిపోయింది. కాగా, ‘సాహో’ ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. సుజీత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఆగస్టు 30న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్నారు. హిందీలో ఈ చిత్రాన్ని టి-సిరీస్ అధినేత భూషణ్ కుమార్ విడుదల చేస్తున్నారు. జిబ్రాన్ ఈ చిత్రానికి నేపథ్య సంగీతం సమకూరుస్తున్నారు. బాలీవుడ్ కంపోజర్ తనిష్క్ బాగ్చి పాటలు అందిస్తున్నారు. నీల్ నితిన్ ముఖేష్, జాకీ ష్రాఫ్, అరుణ్ విజయ్, లాల్, చంకీ పాండే, మందిరా బేడి ఈ సినిమాలో ముఖ్య పాత్రలు పోషించారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2LNuGoB
v

Monday 29 July 2019

ముదురు వయసులో పెళ్లికూతురుగా రాఖీ సావంత్.. ఆ రూమర్లకు చెక్!

బాలీవుడ్ హాట్ బ్యూటీ ఎప్పుడూ వార్తల్లో ఉండటానికి ప్రయత్నిస్తుంటారు. ఓవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ తన అభిమానులకు కనువిందు చేస్తుంటారు. 40 ఏళ్లు ఒంటిమీదికి వచ్చినా ఇంకా పెళ్లిచేసుకోని ఈ ముదురు భామపై ఇప్పటికే బోలెడన్ని రూమర్లు, గ్యాసిప్పులు. తాజాగా ఆమె పెళ్లిపై ఒక రూమర్ సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. రాఖీ సావంత్ ఒక ఎన్‌ఐఆర్‌ను రహస్యంగా పెళ్లిచేసుకున్నారని, ఈ వివాహం ఈనెల 28న జరిగిందని ప్రచారం చేశారు. ఈ వివాహానికి రాఖీ ఆప్తమిత్రులు, కుటుంబ సభ్యులు మాత్రమే పాల్గొన్నారని చెప్పారు. అయితే, ఈ వార్తల్లో నిజంలేదని రాఖీ సావంత్ తేల్చేశారు. షూటింగ్‌లో భాగంగా తాను పెళ్లికూతురులా సిద్ధమయ్యానని పేర్కొన్నారు. తాను ఇప్పటికీ సింగిల్‌గానే ఉన్నానని స్పష్టం చేశారు. ఈ రూమర్‌పై మీడియాతో మాట్లాడిన రాఖీ సావంత్.. ‘‘జేడబ్ల్యూ మారియట్‌లో నేను పెళ్లి షూట్‌లో పాల్గొన్నాను. ఈ మాత్రం దానికి నాకు పెళ్లైపోయిందని ఈ జనం ఎందుకు ప్రచారం చేస్తున్నారో అర్థం కావడంలేదు. నాకు పెళ్లికాలేదు. నేను ఎలాంటి రిలేషన్‌షిప్‌లో లేను. నేను ఇప్పటికీ సింగిల్‌గానే ఉన్నాను’’ అని రాఖీ వెల్లడించారు. అలాగే, తాను పెళ్లికూతురు మేకప్‌లో ఉన్న ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్ ద్వారా రాఖీ అభిమానులతో పంచుకున్నారు. ఈ ఫొటోల్లో రాఖీ చాలా కలర్‌ఫుల్‌గా కనిపిస్తున్నారు. ముత్యంలా మెరిసిపోయే లాంగ్ ఫ్రాక్, చేతిలో వైలెట్ కలర్ పూలు, ఆ పూల రంగులోనే పెదాలకు లిప్‌స్టిక్‌తో రాఖీ సావంత్ మెరిసిపోయారు. ‘బ్రైడల్ షూటింగ్’ అనే క్యాప్షన్‌ను ఈ పోస్టుకు పెట్టారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/310F8fY
v

‘డియర్ కామ్రేడ్’కు 30 నిమిషాల కోత.. సూటిగా సుత్తిలేకుండా!

సినిమా బాగుంది.. కాకపోతే బాగా సాగదీశారు.. ఇది ‘డియర్ కామ్రేడ్’ సినిమా చూసిన చాలా మంది ప్రేక్షకుల స్పందన. సినిమాలో అనవసరపు సన్నివేశాలు ఉన్నాయని, అవి ప్రేక్షకుడిని విసిగిస్తాయని ఇప్పటికే విమర్శకులు రివ్యూలు రాశారు. ఈ స్పందనను పరిగణనలోకి తీసుకున్న దర్శక నిర్మాతలు.. చిత్ర నిడివిని 30 నిమిషాలపాటు తగ్గించారు. ఈ మేరకు చిత్ర నిర్మాత నవీన్ ఎర్నేని ఈ విషయాన్ని సోమవారం వెల్లడించారు. విజ‌య్ దేవ‌ర‌కొండ‌, ర‌ష్మిక మంద‌న జంట‌గా న‌టించిన చిత్రం ‘డియ‌ర్ కామ్రేడ్‌’. ‘ఫైట్ ఫ‌ర్ వాట్ యు ల‌వ్‌’ అనేది ట్యాగ్ లైన్‌. భ‌ర‌త్ క‌మ్మ ద‌ర్శకుడు. మైత్రీ మూవీ మేక‌ర్స్‌, బిగ్ బెన్ సినిమాస్ ప‌తాకాల‌పై తెరకెక్కిన ఈ చిత్రం ఈనెల 26న తెలుగు, త‌మిళ‌ం, మ‌ల‌యాళ‌, క‌న్నడ భాష‌ల్లో విడుదలైంది. మంచి ఓపెనింగ్స్ రాబట్టింది. ఈ నేపథ్యంలో చిత్ర నిర్మాతలు సోమవారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్మాత నవీన్ ఎర్నేని మాట్లాడుతూ.. ‘‘విడుదలైన మూడు రోజుల్లో మంచి వసూళ్లు వచ్చాయి. మూడు రోజులకు గాను రూ.21 కోట్లు వసూలు చేసింది. గ్రాస్‌లో చూసుకుంటే రూ.30 కోట్ల వరకు రాబట్టింది. హీరో విజయ్‌కు ఉన్న క్రేజ్ నేపథ్యంలో భారీ వసూళ్లు రావడం నిర్మాతలుగా మాకు ఆనందంగా ఉంది. అటు ఓవర్‌సీస్‌లో కూడా భారీ కలెక్షన్స్ వచ్చాయి. వీకెండ్ తరవాత ఈరోజు కూడా మంచి కలెక్షన్స్ రావడం పట్ల బయ్యర్లు హ్యాపీగా ఉన్నారు. అలాగే, ఈ సినిమా నిడివి ఎక్కువగా ఉందని, స్లోగా ఉందంటూ కామెంట్స్ రావడంతో 30 నిమిషాల సినిమాను కట్ చేసాం. మరోవైపు, క్యాంటీన్ సాంగ్ బాగా పాపులర్ అయ్యింది. నిడివి దృష్ట్యా దాన్ని పెట్టలేదు. చాలా మంది కావాలని కోరుకోవడంతో నేటి నుంచి ఆ సాంగ్‌ని జోడించాం. ఆ పాట సినిమాకు ఇంకాస్త ఊపు ఇస్తుందని భావిస్తున్నాం’ అని అన్నారు. మరో నిర్మాత య‌ష్ రంగినేని మాట్లాడుతూ.. ‘‘రెస్పాన్స్ చాలా బాగుంది. యూఎస్, యూకేల్లో మంచి క‌లెక్షన్స్ వస్తు్న్నాయి. ఫ్యామిలీ ఆడియెన్స్ సినిమాను బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఈ కథను ‘పెళ్ళిచూపులు’ తరువాత విజయ్ విని, నాకు వినిపించాడు. అప్పటికి ‘అర్జున్ రెడ్డి’ రాలేదు. ఆ తరువాత సినిమా మొదలుపెట్టాం. ‘అర్జున్ రెడ్డి’ పెద్ద హిట్ అవ్వడంతో ఈ స్క్రిప్ట్‌లో ఎలాంటి మార్పులు చేయలేదు. కానీ, సినిమా మాత్రం చేయాలని అనుకున్నాం. ఆ సమయంలోనే మైత్రి నిర్మాతలు నన్ను కలిశారు. వారివల్ల సినిమా స్థాయి పెరిగింది. అంచనాలకు తగ్గట్టుగా మంచి వసూళ్లు అందుకోవడం ఆనందంగా ఉంది’’ అని చెప్పారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2OqtkCm
v

‘పిల్లా పిక్చర్ పర్ఫెక్ట్’ వీడియో సాంగ్.. కాజల్ పర్ఫెక్ట్ గురూ!

శర్వానంద్, అగర్వాల్, కళ్యాణి ప్రియదర్శిన్ హీరోహీరోయిన్లుగా సుధీర్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘రణరంగం’. సితార ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఆగస్టు 15న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఇప్పటి ఈ సినిమాలోని రెండు పాటలను విడుదల చేశారు. ఈ పాటలకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. తాజాగా మూడో పాటను విడుదల చేశారు. ‘పిల్లా పిక్చర్ పర్ఫెక్ట్’ అంటూ సాగే వీడియో పాటను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. కృష్ణ చైతన్య సాహిత్యం అందించిన ఈ పాటను నిఖితా గాంధీ ఆలపించారు. సన్నీ ఎం.ఆర్. స్వరపరిచారు. హీరో శర్వానంద్, కాజల్ అగర్వాల్‌లపై ఈ పాటను చిత్రీకరించారు. సాహిత్యానికి తగ్గట్టుగానే కాజల్ పిక్చర్ పర్ఫెక్ట్‌గా ఉంది. కాజలే కాదు.. లుక్ కూడా అదిరిపోయింది. గుబురు గెడ్డంలో శర్వానంద్ స్టైలిష్‌గా ఉన్నారు. కాగా, ఈ చిత్రం నిర్మాణానంతర కార్యక్రమాలు ముగింపు దశలో ఉన్నాయి. త్వరలోనే సెన్సార్‌కు వెళ్లనుంది. ఈ చిత్రానికి అర్జున్ - కార్తీక్ మాటలు అందించారు. ప్రశాంత్ పిళ్ళై సంగీతం సమకూరుస్తున్నారు. దివాకర్ మణి సినిమాటోగ్రఫీ అందించారు. రామజోగయ్య శాస్త్రి, కృష్ణ చైతన్య పాటలు రచించారు. నవీన్ నూలి ఎడిటర్. వెంకట్ స్టంట్స్ డిజైన్ చేశారు. బృంద, శోభి, శేఖర్ కొరియోగ్రఫీ అందంచారు. ఈ చిత్రానికి పి.డి.వి.ప్రసాద్ సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. సూర్యదేవర నాగవంశీ నిర్మాత. రచన-దర్శకత్వం సుధీర్ వర్మ.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/331qlUi
v

Shakeela: షకీలా భర్తగా కత్తి మహేష్.. ఈ అరాచకం చూశారా?

దక్షిణాది శృంగార తారగా ఓ వెలుగు వెలికి.. స్టార్ హీరోలకు సైతం చెమటల పట్టించిన మలయాళ హాట్ బాంబ్ షకీలాకి తెలుగులోనూ మంచి ఫాలోయింగ్ ఉంది. ఒకప్పుడు ఆమె సినిమా రిలీజ్ అవుతుందంటే.. మమ్ముట్టి, మోహన్‌ లాల్ లాంటి మలయాళ స్టార్ హీరోలు సైతం తమ సినిమాలను వాయిదా వేసుకునేవారంటే ఆమె క్రేజ్ ఏంటో అర్ధం చేసుకోవచ్చు. ఎంతో మంది శృంగార ప్రేమికులకు నయనానందం కలిగించిన తరువాత కాలంలో కనీసం ఖర్చులకు కూడా డబ్బులు లేని పరిస్థితికి వచ్చేసింది. తాజాగా ఆమె తెలుగులో ‘కొబ్బరిమట్ట’ చిత్రంతో రీ ఎంట్రీ ఇస్తున్నారు. ఈ చిత్రంలో ఆమె టాలీవుడ్ కాంట్రివర్శీ కింగ్, మూవీ క్రిటిక్ మహేష్ కత్తితో జోడీ కట్టడం ఆసక్తిగా మారింది. బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు హీరోగా నటించిన మూడో చిత్రం ‘కొబ్బరి మట్ట’. రూపక్ రొనాల్డ్‌సన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే, డైలాగులు స్టీవెన్ శంకర్ అందించారు. ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్‌ను విడుదల చేయగా.. ఇందులో 3.27 నిమిషాల భారీ డైలాగ్‌ను సింగిల్ టేక్‌లో చెప్పి ప్రపంచ రికార్డ్ నెలకొల్పారు సంపూర్ణేష్ బాబు. స్టార్ హీరోలకు సైతం వరుణుపుట్టేలా.. ప్రపంచ సినీ చరిత్రలోనే ఇప్పటి వరకు ఎవరూ చెప్పనంత పెద్ద డైలాగును సింగిల్ టేక్‌లో చెప్పి సంపూ వరల్డ్ రికార్డ్ నెలకొల్పారు. ఆండ్రాయిడు పేరిట విడుదలైన ఈ తాజా ట్రైలర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇదిలాఉంటే.. కత్తి మహేష్‌‌కి పెయిర్‌గా నటించడంపై స్పందించారు షకీలా.. ‘కొబ్బరిమట్ట’ సినిమాలో కత్తి మహేష్ ఎవరన్నది నాకు తెలియదు. ఇప్పుడు అతను ఎంత కాంట్రవర్శీ కింగ్.. అన్నది విన్నాను. ఇక కొబ్బరి మట్ట సినిమా చేస్తున్నప్పుడు ఇతను సంపూర్ణేష్ బాబు.. సినిమాలో హీరో ఇతనే అని పరిచయం చేశారు. నేను వెంటనే.. వాట్? హీరోనా? అనేశాను’ అంటూ పెదవి విరిచారు షకీలా.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2LJzfA8
v

దూసుకెళ్తున్న దేవరకొండ.. ‘డియర్ కామ్రేడ్’కు డీసెంట్ కలెక్షన్స్

సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ తన స్టామినా ఏంటో మరోసారి చూపిస్తున్నారు. విజయ్, రష్మిక మందన హీరోహీరోయిన్లుగా నటించిన ‘డియర్ కామ్రేడ్’ సినిమా ఈనెల 26న విడుదలైన విషయం తెలిసిందే. అయితే, ప్రేక్షకుల నుంచి ఈ సినిమాకు మిశ్రమ స్పందన వచ్చింది. అయినప్పటికీ ఆ ప్రభావం సినిమా వసూళ్లపై పడలేదు. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో ఒకేసారి విడుదలైన ఈ చిత్రం తొలిరోజు రూ.11 కోట్లు వసూలు చేసింది. యూఎస్‌లో సైతం తొలిరోజు ప్రీమియర్ల ద్వారా సుమారు 3 లక్షల డాలర్లు (సుమారు రూ.2 కోట్లు) రాబట్టింది. అయితే.. శని, ఆదివారాల్లో ఈ సినిమా కలెక్షన్లు కాస్త తగ్గినట్టు తెలుస్తోంది. మూడు రోజుల్లో ‘డియర్ కామ్రేడ్’ ప్రపంచ వ్యాప్తంగా సుమారు రూ.35 కోట్ల గ్రాస్ వసూలు చేసిందని అంటున్నారు. దీనిలో డిస్ట్రిబ్యూటర్ల షేర్ రూ.19.28 కోట్లుగా ఉందని సమాచారం. శని, ఆదివారాల్లో తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం సుమారు రూ.3 కోట్ల చొప్పున గ్రాస్ వసూలు చేసిందని తెలిసింది. మరోవైపు, యూఎస్‌లో ‘డియర్ కామ్రేడ్’ మంచి వసూళ్లు రాబడుతోంది. ఇప్పటి వరకు 7 లక్షల డాలర్లకు పైగా (సుమారు రూ.5 కోట్లు) వసూలు చేసినట్లు యూఎస్‌లో ఈ సినిమాను విడుదల చేసిన ‘సరిగమ సినిమాస్’ ట్వీట్ చేసింది. ప్రాంతాల వారీగా ‘డియర్ కామ్రేడ్’ షేర్ వివరాలు నైజాం - రూ. 5.66 కోట్లు సీడెడ్ - రూ. 1.34 కోట్లు నెల్లూరు - రూ. 0.48 కోట్లు గుంటూరు - రూ. 1.03 కోట్లు కృష్ణా - రూ. 0.73 కోట్లు పశ్చిమ గోదావరి - రూ. 0.83 కోట్లు తూర్పు గోదావరి - రూ. 1.20 కోట్లు ఉత్తరాంధ్ర - రూ. 1.56 కోట్లు దేశంలో ఇతర ప్రాంతాలు - రూ. 3.30 కోట్లు ఓవర్సీస్ - రూ. 3.15 కోట్లు మొత్తం మూడు రోజుల్లో ‘డియర్ కామ్రేడ్’ షేర్ కలెక్షన్: రూ. 19.28 కోట్లు


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2KaoELA
v

‘కేజీఎఫ్ ఛాప్టర్ 2’లో సంజయ్ దత్.. అధీరా ఫస్ట్‌లుక్ అదిరింది

కన్నడ రాకింగ్ స్టార్ యశ్ హీరోగా నటించిన ‘కేజీఎఫ్ ఛాప్టర్ 1’ సినిమా బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. కిందటేడాది వచ్చిన ఈ శాండిల్‌వుడ్ సినిమా తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లోకి అనువాదమైంది. విడుదలైన అన్ని భాషల్లో రికార్డు స్థాయిలో వసూళ్లు రాబట్టింది. బాక్సాఫీసు వద్ద ఈ సినిమా సుమారు రూ.240 కోట్లు రాబట్టినట్లు లెక్కలున్నాయి. ఈ సినిమాకు కొనసాగింపుగా ‘కేజీఎఫ్ ఛాప్టర్ 2’ వస్తోంది. తొలి భాగానికి మించి ఈ సినిమాను దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా స్థాయిని పెంచేందుకు బాలీవుడ్ నటుడు సంజయ్ దత్‌ను రంగంలోకి దించారు. ‘కేజీఎఫ్ ఛాప్టర్ 2’లో నటిస్తున్నట్లు చాలా రోజులుగా వార్తలు వస్తున్నాయి. మొత్తానికి ఆయన పుట్టినరోజు సందర్భంగా సోమవారం (జూలై 29న) సంజయ్ దత్ ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. అధీరాగా సంజయ్ లుక్ అదిరిపోయింది. తన అధీరా లుక్‌ను ఇన్‌స్టాగ్రామ్ ద్వారా సంజయ్ దత్ అభిమానులతో పంచుకున్నారు. ఈ సందర్భంగా హీరో యశ్‌కు కృతజ్ఞతలు తెలిపారు. అధీరాగా ‘కేజీఎఫ్ ఛాప్టర్ 2’లో నటిస్తుండటం చాలా ఆనందంగా ఉందని పేర్కొన్నారు. త్వరలోనే వెండితెరపై మహాబలుడిని చూస్తామంటూ హింట్ ఇచ్చారు. ఈ సినిమా మార్చిలో విడుదలకు సిద్ధమవుతోంది. ఇదిలా ఉంటే, అధీరాగా సంజయ్ దత్ లుక్‌కి బాలీవుడ్ నటుడు ఫర్హాన్ అక్తర్ ఫిదా అయిపోయారు. తన పాత రోజుల్ని గుర్తుచేసుకున్నారు. తన చిన్నతనంలో సంజయ్ దత్ తొలి సినిమా ‘రాకీ’ షూటింగ్ జరుగుతున్నప్పుడు దూరంగా నిలబడి చూడటం ఇప్పటికీ గుర్తుందని ఫర్హాన్ అక్తర్ సోషల్ మీడియాలో పేర్కొన్నారు. మళ్లీ ఇన్నేళ్ల తరవాత ఆయనతో కలిసి పనిచేస్తుండటం ఎంతో ప్రత్యేకమని వెల్లడించారు. సంజయ్ దత్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు కూడా చెప్పారు. ‘కేజీఎఫ్ ఛాప్టర్ 2’ను హిందీలో విడుదల చేస్తున్న నిర్మాతల్లో ఫర్హాన్ అక్తర్ కూడా ఒకరు. కాగా, ఈ సినిమాలో రవీనా టాండన్ కూడా ముఖ్య పాత్ర పోషిస్తు్న్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2Yc2OB6
v

‘డియర్ కామ్రేడ్’ రీమేక్‌కు భారీ ధర.. బాలీవుడ్‌లో ఇదో రికార్డ్!

సెన్సేషనల్ స్టార్ , కన్నడ బ్యూటీ రష్మిక మందన జంటగా నటించిన ‘డియర్ కామ్రేడ్’ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన వచ్చింది. సినిమా బాగుందని కొంత మంది అంటే.. బాలేదని మరికొందరు అంటున్నారు. సినిమా టాక్ ఎలా ఉన్నా దీని హిందీ రీమేక్ హక్కులకు పలికిన ధర ఆశ్చర్యానికి గురిచేస్తోంది. విడుదలకు ముందే ఈ సినిమాను చూసిన బాలీవుడ్ దర్శక నిర్మాత కరణ్ జోహార్.. ‘డియర్ కామ్రేడ్’ చాలా బాగుందంటూ కొనియాడారు. ఈ చిత్రాన్ని హిందీలో తానే రీమేక్ చేయబోతున్నట్లు ప్రకటించారు. అయితే, ‘డియర్ కామ్రేడ్’ హిందీ రీమేక్ హక్కుల కోసం కరణ్ జోహార్ ఏకంగా రూ.6 కోట్లు చెల్లించారని ఫిల్మ్ నగర్ టాక్. ఇదే నిజమైతే.. ఇప్పటి వరకు బాలీవుడ్‌లో ఏ రీమేక్‌కు చెల్లించనంత ఎక్కువ మొత్తం కరణ్ జోహార్ చెల్లించినట్లవుతుంది. ఎన్టీఆర్ ‘టెంపర్’ సినిమా ‘సింబా’గా రీమేక్ చేశారు. ఇప్పుడు లారెన్స్ ‘కాంచన’ చిత్రాన్ని ‘లక్ష్మీ బాంబ్’గా తెరకెక్కిస్తున్నారు. ఈ రెండు సినిమాల రీమేక్ హక్కులకు చెల్లించిన మొత్తం ప్రస్తుతం కరణ్ జోహార్ చెల్లించనదాని కన్నా చాలా తక్కువ అని అంటున్నారు. వాస్తవానికి సాజిద్ నడియాద్వాలా, భూషణ్ కుమార్, మురద్ ఖేతాని, విజయ్ గలాని వంటి బడా నిర్మాతలు ‘డియర్ కామ్రేడ్’ రీమేక్ హక్కుల కోసం పోటీపడ్డారట. వీరందరికీ షాక్ ఇస్తూ కరణ్ జోహార్ రూ.6 కోట్ల భారీ ధరకు ‘డియర్ కామ్రేడ్’ రీమేక్ హక్కులు సొంతం చేసుకున్నారట. విజయ్ దేవరకొండ, కరణ్ జోహార్ మధ్య ఉన్న స్నేహం కూడా ఈ రీమేక్ హక్కులు కరణ్‌కు అందేలా చేసిందట. ఈ సినిమా హిందీ రీమేక్‌లో ఇషాన్ ఖట్టర్, జాన్వి కపూర్ హీరోహీరోయిన్లుగా నటించనున్నారని వార్తలు వచ్చాయి. అయితే, ఈ సినిమా కోసం ఇంకా హీరోహీరోయిన్లను ఖరారు చేయలేదుని ఇటీవల కరణ్ జోహార్ ట్వీట్ చేశారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2ykgyKL
v

‘నా... లోనా’ అంటూ తీయని మెలోడీతో వచ్చిన మన్మథుడు

అక్కినేని నాగార్జున హీరోగా నటించిన ‘మన్మథుడు’ సినిమాలో పాటలు ఎంత బాగుంటాయో అందరికీ తెలిసిందే. దేవీశ్రీ ప్రసాద్ ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో ఇచ్చిన పాటలవి. ఈ సినిమా మ్యూజిక్‌తో దేవీకి కూడా మంచి పేరు వచ్చింది. ఇప్పుడు ‘మన్మథుడు 2’ పాటలతో మరో కొత్త సంగీత దర్శకుడు చైతన్ భరద్వాజ్‌కు మంచి గుర్తింపు వస్తుందనిపిస్తుంది. ‘RX 100’ సినిమాతో పరిచయమైన చైతన్ భరద్వాజ్.. ‘పిల్లా రా’ పాటతో కుర్రాళ్ల గుండెల్ని కొల్లగొట్టారు. ఈ సినిమాకు మంచి సంగీతాన్ని అందించారు. ఇప్పుడు ‘మన్మథుడు 2’కు కూడా మంచి మెలోడీలు కంపోజ్ చేస్తున్నారు. కింగ్ నాగార్జున, రకుల్ ప్రీత్ సింగ్ హీరోహీరోయిన్లుగా నటించిన ‘మన్మథుడు 2’ నుంచి రెండో పాట విడుదలైంది. ‘నా... లోనా’ అంటూ సాగే ఈ పాట చాలా బాగుంది. ఈ తీయని మెలోడీని ఈ చిత్ర దర్శకుడు రాహుల్ రవీంద్రన్ భార్య చిన్మయి శ్రీపాద ఆలపించారు. శుభం విశ్వనాథ్ సాహిత్యం అందించారు. ఈ మెలోడీ సాంగ్‌ను విన్న అక్కినేని అభిమానులు తమ మన్మథుడు హిట్టు కొట్టడం ఖాయం అంటున్నారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ సినిమాపై అంచనాలను భారీగా పెంచేసింది. ఇటీవల విడుదలైన ‘హే మెనీనా’ సాంగ్ ఆకట్టుకుంది. ఇప్పుడు ఈ రెండో పాట అద్భుతంగా ఉండటంతో అంచనాలు రెట్టింపు అవుతున్నాయి. ఆగస్టు 9న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకురానుంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2K3TlBO
v

మహేష్‌బాబు కొత్త వ్యాపారం.. ది హంబల్ కంపెనీ!

సూపర్ స్టార్ ఓ వైపు సినిమాలు చేస్తూనే మరోవైపు వ్యాపారాలు మొదలుపెడుతున్నారు. ఇటీవల మల్టీప్లెక్స్ బిజినెస్‌లోకి అడుగుపెట్టిన మహేష్.. ఇప్పుడు బట్టల వ్యాపారంలోకి దిగారు. మహేష్‌బాబు సొంతంగా క్లోతింగ్ బ్రాండ్‌ను స్థాపించనున్నట్లు కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారాన్ని నిజం చేస్తూ తన క్లోతింగ్ బ్రాండ్‌ను మహేష్‌బాబు ప్రకటించారు. ‘ది హంబల్ కో.’ పేరుతో గార్మెంట్ బ్రాండ్‌ను మహేష్ స్టాపించారు. ఆగస్టు 7న దీన్ని లాంఛనంగా ప్రారంభించబోతున్నారు. ఈ విషయాన్ని మహేష్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ‘మా హంబుల్ ప్రయత్నాన్ని ఈరోజు ప్రకటిస్తున్నాం. అద్భుతంగా స్పందించిన అందరికీ కృతజ్ఞతలు. ది హంబుల్ కో. కేవలం క్లోతింగ్ మాత్రమే కాదు, ఇదొక జీవన విధానం. ది హంబుల్ కంపెనీ కుటుంబంలోకి మీ అందరికీ స్వాగతం పలుకుతున్నాం. ఆగస్టు 7న ప్రారంభోత్సవం కోసం వేచి చూస్తూ ఉండండి’ అని మహేష్‌బాబు ట్వీట్ చేశారు. కంపెనీ లోగో, కొత్త దుస్తుల్లో మహేష్‌బాబు లుక్‌ను కూడా విడుదల చేశారు. ‘‘HUMBL’’ అనే లోగోలో ‘‘MB’’ని అండర్‌లైన్ చేశారు. అంటే మహేష్‌బాబు అనే అర్థం వచ్చేలా లోగోను డిజైన్ చేశారు. కాగా, ప్రస్తుతం మహేష్‌బాబు ‘‘సరిలేరు నీకెవ్వరు’’ సినిమాతో బిజీగా ఉన్నారు. అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఇప్పటికే కశ్మీర్ షెడ్యూల్‌ను పూర్తిచేసుకున్న చిత్ర యూనిట్.. త్వరలో హైదరాబాద్‌లో వేసిన సెట్‌లో పలు కీలక సన్నివేశాలను చిత్రీకరించనుంది. ఈ చిత్రంలో రష్మిక మందన హీరోయిన్‌గా నటిస్తోంది. విజయశాంతి కీలక పాత్ర పోషిస్తున్నారు. దేవీశ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2SMHrjP
v

Sunday 28 July 2019

‘వైఫ్, ఐ’ మూవీ టీజర్.. రొమాంటిక్‌కు ఎక్కువ, బ్లూ ఫిల్మ్‌కి తక్కువ!

‘ఏడు చేపల కథ’ అనే అడల్ట్ కామెడీ ఫిల్మ్ గుర్తుంది కదా..! కిందటేడాది వచ్చింది. ఆ సినిమాలో టెంప్ట్ రవి.. తాను టెంప్ట్ అయిపోయి, సినిమా చూస్తున్న ప్రేక్షకులను కూడా బాగా టెంప్ట్ చేసేశాడు. శృతిమించిన శృంగారం, డబుల్ మీనింగ్ డైలాగులతో బూతు సినిమా చూపించేశాడు. ఇప్పుడు మరో సినిమాతో బూతు పురాణానికి సిద్ధమైపోయాడు. ఇంతకీ ఈ టెంప్ట్ రవి పాత్రలో నటించిన హీరో అభిషేక్ రెడ్డి. మళ్లీ ఆయనే హీరోగా.. గుంజన్, ఫిదా గిల్, కావ్య హీరోయిన్లుగా ‘వైఫ్, ఐ’ అనే సినిమా వస్తోంది. ఇది కూడా అడల్ట్ సినిమానే. ‘వైఫ్, ఐ’ టీజర్‌ను తాజాగా విడుదల చేశారు. ఈ సినిమాలోనూ శృంగారం శృతిమించిపోయింది. బ్లూ ఫిల్మ్‌ను తలపిస్తోంది. మొగుడు కళ్లుగప్పి పెళ్లాం చేసే రాసలీలలు ఈ సినిమాలో చూపించినట్టు టీజర్ చూస్తుంటే అర్థమవుతోంది. దీనికి తోడు పోస్టర్లపై ‘నైఫ్ ఈజ్ బెటర్ దేన్ వైఫ్’ అని రాశారు. అంటే, పెళ్లాం కంటే కత్తె మేలట. ఇంతలా ఏం చేసిందో ఈయనగారి పెళ్లాం. టీజరే ఇంత ఘాటుగా ఉందంటే, ఇక సినిమాలో అన్నీ చూపించేస్తారనుకుంటా. ఈ చిత్రాన్ని లక్ష్మీ చరిత ఆర్ట్స్, జీఎస్ఎస్‌పీకే స్టూడియోజ్ బ్యానర్లపై జి.చరితారెడ్డి నిర్మిస్తున్నారు. రచన, కెమెరా, డైరెక్షన్, ఎడిటింగ్ జీఎస్ఎస్‌పీ కళ్యాణ్. వినోద్ యాజమన్య సంగీతం సమకూర్చారు. రాంబాబు గోసాల సాహిత్యం అందించారు. సునీల్ నగరం, సూర్య ఆకొండి, మహేష్ విట్ట, అపర్ణ ఇతర పాత్రల్లో నటించారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/32ZDMnC
v

RRR: రాజమౌళికి నో చెప్పిన మరో హాలీవుడ్ భామ!

‘బాహుబలి’ సిరీస్‌తో దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి అంతర్జాతీయ మార్కెట్‌ను ఆకర్షించారు. ఆయన ప్రతిభ హాలీవుడ్ వరకు వెళ్లింది. ఈ సినిమాతో విపరీతమైన క్రేజ్ సంపాదించిన రాజమౌళి.. ‘‘RRR’’ ప్రాజెక్ట్‌తో మరో సెన్సేషన్‌కు తెరలేపారు. ఇద్దరు స్టార్ హీరోలు యంగ్ టైగర్ ఎన్టీర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌లతో సినిమాను ప్రకటించి మళ్లీ అందరి దృష్టిని ఆకర్షించారు. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ప్రస్తుతం హైదరాబాద్‌లో షూటింగ్ జరుగుతోంది. తరవాత షెడ్యూల్ కోసం చిత్ర యూనిట్ తమిళనాడు వెళ్లనున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే, ఈ చిత్రంలో కొమురం భీమ్ పాత్రను పోషిస్తోన్న ఎన్టీఆర్ సరసన ఒక ఇంగ్లిష్ బ్యూటీ హీరోయిన్‌గా నటించనున్న సంగతి తెలిసిందే. సినిమాను ప్రకటించినప్పుడే ఈ పాత్ర కోసం లండన్ బ్యూటీ డైసీ ఎడ్గర్ జోన్స్ పేరును రాజమౌళి ప్రకటించారు. అయితే, వ్యక్తిగత కారణాల వల్ల ఈమె ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంది. ఆ తరవాత అమెరికన్ నటి, సింగర్ ఎమ్మా రాబర్ట్స్‌ను రాజమౌళి ఫైనల్ చేసినట్టు వార్తలు వచ్చాయి. కానీ, తాజా సమాచారం ప్రకారం ఎమ్మా కూడా రాజమౌళికి నో చెప్పినట్టు తెలుస్తోంది. ఈ పాత్ర చేయడం కోసం ఎక్కువ రోజులపాటు షూటింగ్‌లో పాల్గొనాల్సి ఉంటుందట. అన్ని రోజులు తేదీలు ఇవ్వలేకే ఎమ్మా రాబర్ట్స్‌ తప్పుకున్నట్లు సమాచారం. దీంతో రాజమౌళి మరో ఇంగ్లిష్ భామ కోసం వేట మొదలుపెట్టారని అంటున్నారు. రాజమౌళి అడిగితే చేయము అనే నటీనటులు మన దేశంలో ఉండరు. కానీ, హాలీవుడ్ నటీమణులకు కొన్ని ఇబ్బందులు ఉంటాయి. అక్కడి నుంచి ఇక్కడి వచ్చి అన్ని రోజులపాటు పనిచేయాలంటే కష్టమే. బహుశా అందుకే వారు వెనకడుగు వేస్తున్నారేమో! మరో హీరో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని డీవీవీ దానయ్య భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2ZjdgDg
v

కాకినాడలో ‘రణరంగం’.. అల్లు అర్జున్ ప్రత్యేక ఆకర్షణ!

శర్వానంద్ హీరోగా నటించిన ‘రణరంగం’ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సినిమాలో శర్వానంద్ గ్యాంగ్ స్టర్‌గా నటించారు. ఇప్పటికే ఈ చిత్ర ప్రచార కార్యక్రమాలను మొదలుపెట్టారు. అయితే, చిత్రాన్ని ప్రేక్షకుల్లోకి మరింతగా తీసుకెళ్లడానికి, సినిమాపై అంచాలను పెంచడానికి ప్రీ రిలీజ్ వేడుకను త్వరలోనే నిర్వహిస్తున్నారు. తాజా ఫిల్మ్ నగర్ సమాచారం ప్రకారం.. ‘రణరంగం’ ప్రీ రిలీజ్ వేడుకను ఆగస్టు 4న కాకినాడలో నిర్వహిస్తారు. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడుతుందని చెబుతున్నారు. ‘రణరంగం’ సినిమాను అత్యధిక భాగం కాకినాడ పరిసర ప్రాంతాల్లోనే తెరకెక్కించారు. దీంతో ఈ చిత్ర ప్రీ రిలీజ్ వేడుకను అక్కడే నిర్వహించాలని నిర్ణయించారట. ఈ వేడుకకు చీఫ్ గెస్టులుగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ హాజరుకాబోతున్నట్లు సమాచారం. ఇదే నిజమైతే కాకినాడలో ఆగస్టు 4న పండగ వాతావరణం నెలకొంటుంది. ఈ వేడుకకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తారు. కాగా, ‘కేశవ’ ఫేమ్ సుధీర్ వర్మ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. సితార ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మించారు. కాజల్ అగర్వాల్, కళ్యాణి ప్రియదర్శన్ హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాకి ప్రశాంత్ పిళ్లై సంగీతం సమకూర్చారు. దివాకర్ మణి సినిమాటోగ్రఫీ అందించారు. ఈ సినిమాలోని ‘పిల్లా పిక్చర్ పర్‌ఫెక్ట్’ అనే పాటను సోమవారం విడుదల చేస్తున్నారు. ఈ పాటలో కాజల్ చాలా హాట్‌గా కనిపించనుంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2Onecpl
v

‘కొబ్బరి మట్ట’: సంపూ వరల్డ్ రికార్డ్.. సింగిల్ టేక్‌లో అతిపెద్ద డైలాగ్

బర్నింగ్ స్టార్ హీరోగా నటించిన మూడో చిత్రం ‘కొబ్బరి మట్ట’. ఈ సినిమాలో సంపూ మూడు విభిన్న పాత్రల్లో నటించారు. ఒకటి పాపారాయుడు, మరొకటి పెదరాయుడు కాగా.. ఇంకొకటి ఆండ్రాయిడు. ఇప్పటికే పాపారాయుడు, పెదరాయుడు పాత్రలను పరిచయం చేశారు. మహిళ గొప్పతనాన్ని వివరిస్తూ నిమిషానికి పైగా నిడివితో పెదరాయుడు (సంపూర్ణేష్ బాబు) టీజర్‌లో చెప్పిన డైలాగ్‌కు ప్రశంసలు అందాయి. ఆ డైలాగులో వెటకారాన్ని ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేశారు. ఇప్పుడు ఆ పెదరాయుడికి పోటీగా ఆండ్రాయిడు చాంతాడంత డైలాగుతో వచ్చాడు. ప్రపంచ సినీ చరిత్రలోనే ఇప్పటి వరకు ఎవరూ చెప్పనంత పెద్ద డైలాగును సింగిల్ టేక్‌లో చెప్పి సంపూ వరల్డ్ రికార్డ్ నెలకొల్పారు. తాజాగా విడుదలైన ఆండ్రాయిడు పరిచయ ట్రైలర్‌లో 3.27 నిమిషాల నిడివితో నాన్ స్టాప్ డైలాగ్ ఉంది. ఈ డైలాగును సంపూర్ణేష్ బాబు సింగిల్ టేక్‌లో చెప్పారట. ఈ విషయాన్ని హైలైట్ చేస్తూ సంపూర్ణేష్‌ను ఆండ్రాయిడ్‌గా పరిచయం చేస్తూ ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ ట్రైలర్‌లో ఆండ్రాయిడుగా సంపూ చించేశాడు. తన డైలాగ్ పవర్‌ను చూపించాడు. ‘‘ఎవడిని చూడాలంటే మీ నవరంధ్రాలు కళ్లుగా మారాలో వాడు రాబోతున్నాడు! చెప్పి వచ్చే తుఫాను కాదు వాడు! వచ్చాక చెప్పుకునే సునామీ వాడు! సో అయామ్ ప్రెజెంటింగ్ యు ద వన్ అండ్ ఓన్లీ ఆండ్రాయిడు!’’ అనే ఇంట్రడక్షన్‌తో సంపూర్ణేష్ యంగ్ అవతారంలో దర్శనమిచ్చాడు. ఇక అక్కడి నుంచి రాయుడి మీద డైలాగుతో విరుచుకుపడ్డాడు. సంపూ డైలాగ్ చెబుతున్నప్పుడు టైమర్‌ను కూడా స్క్రీన్‌పై రన్ చేశారు. కరెక్ట్‌గా 3.27 నిమిషాల డైలాగ్. ఇంతకీ ఈ ఆండ్రాయిడు.. పెదరాయుడు కొడుకే. తండ్రి మీద ఇతగాడి యుద్ధమెందుకో సినిమాలోనే చూడాలి! కాగా, ఈ చిత్రాన్ని అమృత ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నీలం సాయి రాజేష్ నిర్మించారు. ఈ సినిమాకు కథ, స్క్రీన్‌ప్లే, డైలాగులు స్టీవెన్ శంకర్ అందించారు. రూపక్ రొనాల్డ్‌సన్ దర్శకత్వం వహించారు. కమ్రాన్ సంగీతం సమకూర్చారు. ఆగస్టు 10న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తోంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2Ya3kjc
v

విజయ్ దేవరకొండను చూసి భావోద్వేగం.. హత్తుకుని ఏడ్చేసిన అమ్మాయి!

సెన్సేషనల్ స్టార్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరంలేదు. ‘అర్జున్ రెడ్డి’ సినిమాతో అమ్మాయిల హృదయాలను ఈ యంగ్ హీరో కొల్లగొట్టారు. ఆ తరవాత ‘గీత గోవిందం’తో అమ్మాయిల్లో ఆయన క్రేజ్ మరింత పెరిగిపోయింది. ఇప్పుడు ‘డియర్ కామ్రేడ్’తో విజయ్ క్రేజ్ నాలుగు దక్షిణాది రాష్ట్రాలకు పాకేసింది. విజయ్ కోసం కేవలం తెలుగు అమ్మాయిలే కాదు తమిళం, కన్నడ, మలయాళం అమ్మాయిలు పడిచచ్చిపోతున్నారు. దీనికి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న వీడియోనే సాక్ష్యం. తన అభిమాన హీరో విజయ్ దేవరకొండను అకస్మాత్తుగా చూసిన ఒక అమ్మాయి ఆనందాన్ని తట్టుకోలేకపోయింది. తీవ్ర భావోద్వేగానికి గురైంది. ఆయన్ని గట్టిగా హత్తుగా ఏడ్చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఏడుస్తోన్న తన అభిమానిని దగ్గరకు తీసుకుని విజయ్ ఓదార్చారు. అయితే, ఈ సంఘటన ఎక్కడ చోటుచేసుకుంది అనే విషయంలో స్పష్టత లేదు. బహుశా ఇటీవల ‘డియర్ కామ్రేడ్’ మ్యూజిక్ ఫెస్టివల్‌లో విజయ్ దేవరకొండ పాల్గొన్న సమయంలో ఈ సంఘటన చోటు చేసుకుని ఉండొచ్చు. ‘డియర్ కామ్రేడ్’ సినిమా ప్రచారంలో భాగంగా నాలుగు దక్షిణాది రాష్ట్రాల్లోనూ మ్యూజిక్ ఫెస్టివల్స్ నిర్వహించిన సంగతి తెలిసిందే. చెన్నై, బెంగళూరు, కొచ్చి, హైదరాబాద్‌లో ఈ మ్యూజిక్ ఫెస్టివల్స్ జరిగాయి. అయితే చెన్నై, బెంగళూరు, కొచ్చి.. ఈ మూడు నగరాల్లో ఏదో ఒక చోటుకి వెళ్లిన సమయంలో ఈ సంఘటన చోటుచేసుకుని ఉండొచ్చు. ఏదేమైనా ఈ వీడియో విజయ్ క్రేజ్‌కు అద్దం పడుతోంది. దగ్గరకు వచ్చిన అభిమానిని అవైడ్ చేయకుండా విజయ్ దేవరకొండ ఓదార్చడం అందరినీ ఆకట్టుకుంటోంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2ygKKGA
v

నాగార్జున పాలిటిక్స్.. బిగ్ బాస్ గాడు ఒక ఎదవ: శ్రీరెడ్డి హాట్ కామెంట్స్

‘బిగ్ బాస్’ రియాలిటీ షో సీజన్ 3 ఆసక్తికరంగా ముందుకు సాగుతోంది. గత వారం రోజులుగా తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు వినోదం పంచుతోన్న ‘బిగ్ బాస్’ షో తొలి ఎలిమినేషన్‌కు సిద్ధమైంది. హోస్ట్ అక్కినేని శనివారం హౌజ్‌లోని కంటెస్టెంట్లను మన టీవీ ద్వారా పలకరించి వారిలో జోష్ నింపారు. అయితే, ఎలిమినేషన్ టైమ్ వచ్చిందని నామినేట్ అయిన ఆరుగురు కంటెస్టెంట్ల గుండెల్లో గుబులు పుట్టించారు. మొత్తానికి డేంజర్ జోన్‌లో ఉన్న ఆరుగురిలో ఇద్దరిని సేఫ్ జోన్‌లో వేశారు. ఎలిమినేషన్‌కు నామినేట్ అయిన ఆరుగురు సభ్యుల్లో హిమజ, పునర్నవి సేఫ్ జోన్‌లో ఉన్నట్టు నాగార్జున ప్రకటించారు. ఆనందం పట్టలేక హిమజ ఏడ్చేసింది కూడా. డేంజర్ జోన్‌లో మిగిలిన నలుగురు కంటెస్టెంట్లు రాహుల్, వితికా, జాఫర్, హేమలలో హౌజ్ నుంచి బయటికి వెళ్లిపోయేది ఎవరో ఆదివారం తెలిసిపోతుంది. ‘బిగ్ బాస్’ అభిమానులు ఎలిమినేషన్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తోన్న ఈ సమయంలో సోషల్ మీడియా సెన్సేషన్, వివాదాస్పద నటి హాట్ కామెంట్స్ చేశారు. హోస్ట్ నాగార్జున పాలిటిక్స్ మామూలుగా లేవంటూ ఫేస్‌బుక్‌లో పోస్ట్ పెట్టారు. ‘‘నాగార్జున గారికి తెలిసినన్ని పాలిటిక్స్ చంద్రబాబు గారికి కూడా తెలీవు. డబ్బిస్తే బిగ్ బాస్ హీరో. ఇవ్వకపోతే బిగ్ బాస్ గాడు ఒక ఎదవ’’ అని తన పోస్ట్‌లో శ్రీరెడ్డి పేర్కొన్నారు. ఇటీవల ‘బిగ్ బాస్’పై వివాదం చెలరేగడం, దానిపై నాగార్జున స్పందించిన నేపథ్యంలో శ్రీరెడ్డి ఈ కామెంట్స్ చేసినట్లు స్పష్టమవుతోంది. నిజానికి, శ్రీరెడ్డి ‘బిగ్ బాస్’ షోలోకి వస్తారంటూ ప్రచారం జరిగింది. 15 మంది కంటెస్టెంట్లలో ఆమె పేరు లేకపోవడంతో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తారంటూ ఈ మధ్య వార్తలు వచ్చాయి. కానీ, ఈ వార్తల్లో నిజంలేదని శ్రీరెడ్డి పోస్టులు చూస్తుంటే అర్థమవుతోంది. బిగ్ బాస్ హౌజ్‌లోకి శ్రీరెడ్డి వెళ్లడం నిజమే అయితే ఇలాంటి వివాదాస్పద పోస్టులు ఎందుకు పెడతారు? ఏదేమైనా ఈ పోస్టుల ద్వారా ‘బిగ్ బాస్’ షోకి పరోక్షంగా శ్రీరెడ్డి ప్రచారం కల్పిస్తున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2JYq2Sn
v

పంచెకట్టులో ‘వెంకీ మామ’.. లుక్ అదిరింది!

విక్టరీ వెంకటేష్, అక్కినేని నాగచైతన్య హీరోలుగా తెరకెక్కుతోన్న మల్టీస్టారర్ మూవీ ‘వెంకీ మామ’. రాశీ ఖన్నా, పాయల్ రాజ్‌పుత్ హీరోయిన్లు. కె.ఎస్.రవీంద్ర (బాబీ) దర్శకత్వం వహిస్తున్నారు. అనూప్ రూబెన్స్ సంగీతం సమకూరుస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇటీవల నెలరోజులపాటు కాశ్మీర్ షెడ్యూల్‌ను పూర్తిచేసుకుని వచ్చిన చిత్ర యూనిట్ ప్రస్తుతం హైదరాబాద్‌లో షూటింగ్‌ జరుపుతోంది. గత ఫిబ్రవరిలో తూర్పుగోదవారి జిల్లాలో గోదావరి ఒడ్డున ప్రారంభమైన ఈ సినిమా షూటింగ్ త్వరలోనే ముగియనుంది. షూటింగ్ చివరి దశకు చేరుకున్నా ఈ సినిమాకు సంబంధించి ఇంకా ఫస్ట్ లుక్ కూడా విడుదల చేయలేదు. ఇలాంటి సమయంలో ఇటు వెంకటేష్ అభిమానులకు, అటు అక్కినేని ఫ్యాన్స్‌కు కిక్ ఇచ్చే ఫొటోలు కొన్ని సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. హైదరాబాద్‌లో ప్రస్తుతం జరుగుతోన్న షూటింగ్‌లో పాల్గొంటున్న వెంకటేష్, రాశీఖన్నా లుక్స్ లీకయ్యాయి. వెంకటేష్ పంచెకట్టులో అదరగొడుతున్నారు. పంచెలో ఆయన వాకింగ్ స్టైల్ సింప్లీ సూపర్బ్. రాశీఖన్నా పసుపు రంగు లెహెంగాలో చూడముచ్చటగా ఉన్నారు. ఇదిలా ఉంటే, మామా అల్లుళ్లు వెంకటేష్, నాగచైతన్య తొలిసారి కలిసి నటిస్తుండటంతో ‘వెంకీ మామ’ సినిమాపై అంచనాలు ఏర్పడ్డాయి. ‘జై లవ కుశ’ సినిమా హిట్‌తో మంచి జోష్ మీదున్న దర్శకుడు బాబీ ఈ చిత్రాన్ని ఔట్ అండ్ ఔట్ ఎంటర్‌టైనర్‌గా తీర్చిదిద్దుతున్నారు. ప్రసాద్ మూరెళ్ల సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తోన్న ఈ సినిమాను సురేష్ ప్రొడక్షన్స్, బ్లూ ప్లానెట్ ఎంటర్‌టైన్మెంట్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2Ok9lFg
v

‘పెద్దన్న’కు భయపడిన నిఖిల్.. ‘అర్జున్ సురవరం’ ఇప్పట్లో రాదు!

హీరోగా సినిమా వచ్చి ఏడాది దాటిపోయింది. కిందటేడాది ‘కిర్రాక్ పార్టీ’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన నిఖిల్.. దాని తరవాత ‘ముద్ర’ చిత్రాన్ని మొదలుపెట్టారు. ఇదే పేరుతో మరో సినిమా రావడంతో వివాదమైంది. మొత్తం మీద టైటిల్‌ను మార్చి ‘అర్జున్ సురవరం’గా విడుదల చేసేందుకు సన్నాహాలు మొదలుపెట్టారు. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుని కార్మిక దినోత్సవం సందర్భంగా మే 1న విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. కానీ, ఆ తేదీకి సినిమా విడుదల కాలేదు. అదే టైమ్‌లో ‘అవెంజర్స్’ విడుదలవుతుండటంతో వెనక్కి తగ్గారు. అప్పటి నుంచి మూడు నెలలు గడిచిపోయాయి కానీ విడుదల తేదీని మాత్రం ఇప్పటికీ ఖరారు చేయలేదు. ఏదో ఒక కారణం చూపుతూ వాయిదా వేస్తూ వస్తున్నారు. మే 9న సూపర్ స్టార్ మహేష్ బాబు ‘మహర్షి’ విడుదల కావడంతో ఆ సమయంలో ‘అర్జున్ సురవరం’ను విడుదల చేసే ధైర్యం చేయలేదు. ఇప్పుడు ‘సాహో’కు భయపడుతున్నారు. ఆ సినిమా విడుదలైన తరవాతే ‘అర్జున్ సురవరం’ను విడుదల చేస్తారట. ఈ విషయాన్ని స్వయంగా హీరో నిఖిల్ సిద్ధార్థ వెల్లడించారు. ‘అర్జున్ సురవరం’ కోసం వేచిచూస్తోన్న ఓ అభిమాని ట్విట్టర్ ద్వారా నిఖిల్‌ను ప్రశ్నించారు. ‘16 నెలలు అవుతుంది అన్న నీ మూవీ కిర్రాక్ పార్టీ రిలీజ్ అయ్యి.. అర్జున్ సురవరం కోసం వెయిటింగ్’ అని నిఖిల్‌ని ట్యాగ్ చేసి ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌కు నిఖిల్ స్పందించారు. ‘నిరీక్షణకు ప్రతిఫలం దక్కుతుంది. పెద్దన్న ‘సాహో’ తరవాత ‘అర్జున్ సురవరం’ విడుదల ఉంటుంది’ అని ట్వీట్‌లో నిఖిల్ పేర్కొన్నారు. ఇలా ఎప్పటి వరకు వాయిదా వేసుకుంటూ వెళ్తారో అర్థం కావడంలేదు. వాస్తవానికి ఈ సినిమాపై నిఖిల్‌కు చాలా నమ్మకం ఉంది. స్టూడెంట్స్ కోసం పోరాడే జర్నలిస్ట్ అర్జున్ సురవరం కథ ఇది. సినిమాపై నిఖిల్‌కు ఉన్న నమ్మకం డిస్ట్రిబ్యూటర్లకు లేనట్టుంది. ఎందుకంటే డిస్ట్రిబ్యూటర్ల సలహా మేరకే సినిమా విడుదలను వాయిదా వేస్తున్నట్లు తొలిసారి నిఖిల్ ప్రకటించారు. ఇక అప్పటి నుంచి సినిమా వాయిదా పడుతూనే వస్తోంది. విడుదలయ్యే ప్రతి సినిమాకు భయపడితే ఇంకెప్పుడు విడుదల చేస్తారు ఈ ‘అర్జున్ సురవరం’ను అనే మాట ప్రేక్షకుల నుంచి రాకముందే ఈ చిత్రాన్ని విడుదల చేస్తే మంచిది. కాగా, ‘సాహో’ ఆగస్టు 30న విడుదలవుతోంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2MlXc08
v

దిల్ రాజుతో చిరంజీవి సినిమా.. గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు!

ప్రస్తుతం టాలీవుడ్‌లో ఉన్న బడా నిర్మాతల్లో ఒకరు. డిస్ట్రిబ్యూటర్ స్థాయి నుంచి నిర్మాతగా ఎదిగి శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌ను స్థాపించి అద్భుతమైన సినిమాలు తీశారాయన. దిల్ రాజు సినిమా అంటే హిట్టు ఖాయమనే నమ్మకాన్ని ప్రేక్షకుల్లో కలిగించారు. ఇప్పటి వరకు టాలీవుడ్‌లోని స్టార్ హీరోలు, యువ హీరోలందరితోనూ సినిమాలు చేశారు దిల్ రాజు. అయితే, టాలీవుడ్‌కు నాలుగు పిల్లర్లుగా చెప్పుకునే మెగాస్టార్ , నటసింహం బాలకృష్ణ, కింగ్ నాగార్జున, విక్టరీ వెంకటేష్‌లలో ఇద్దరితో మాత్రమే దిల్ రాజు సినిమాలు చేశారు. అక్కినేని నాగార్జునతో ‘గగనం’ వంటి ప్రయోగాత్మక చిత్రాన్ని నిర్మించిన దిల్ రాజు.. వెంకటేష్‌తో ‘ఎఫ్2’ లాంటి బ్లాక్ బస్టర్‌ను తెరకెక్కించారు. చిరంజీవి, బాలకృష్ణతో కూడా సినిమాలు నిర్మించాలని దిల్ రాజు కోరికట. అయితే, వీటిలో ఒక కోరిక తీరబోతోందని ఫిల్మ్ నగర్ టాక్. దిల్ రాజుతో సినిమా చేయడానికి మెగాస్టార్ చిరంజీవి అంగీకరించారట. ఇటీవల చిరంజీవిని దిల్ రాజు కలిశారని, సినిమా చేయాలని కోరుకుంటున్న విషయాన్ని ఆయనతో చెప్పారని సినీ వర్గాల ద్వారా తెలిసింది. దిల్ రాజు కోరిక పట్ల చిరంజీవి కూడా సానుకూలంగా స్పందించారట. చిరంజీవి తరవాత సినిమా (153వ సినిమా)ను దిల్ రాజు నిర్మించే అవకాశం ఉందని అంటున్నారు. ఈ వార్తలో నిజమెంతో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చేంత వరకు ఆగాల్సిందే. చిరంజీవి ఇటీవలే ‘సైరా’ షూటింగ్‌ను పూర్తిచేసుకున్నారు. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. రామ్ చరణ్ నిర్మాతగా వ్యవహరిస్తోన్న ఈ సినిమా అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు రానుంది. మరోవైపు, కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న తన 152వ చిత్రం కోసం చిరంజీవి సిద్ధమవుతున్నారు. త్వరలోనే ఈ చిత్రం ప్రారంభంకానుంది. ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తిచేసుకున్న ఈ చిత్రం సెట్స్‌పైకి వెళ్లడానికి సిద్ధంగా ఉంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2JZSP9s
v

Saturday 27 July 2019

సినీ నటుడు శివాజీకి షాక్.. దుబాయ్‌ నుంచి వెనక్కి వెళ్లాలన్న ఇమ్మిగ్రేషన్ అధికారులు

సినీ నటుడు, టీవీ9 మాజీ సీఈవో రవి ప్రకాశ్ సన్నిహితుడైన శివాజీకి అధికారులు షాకిచ్చారు. టీవీ9 వాటాల కొనుగోలు వ్యవహారంలో విచారణకు హాజరుకాకపోవడంతో.. ఆయనపై పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. దీంతో దుబాయ్‌‌లో ఇమ్మిగ్రేషన్ అధికారులు ఆయన్ను అడ్డుకున్నారు. తిరిగి హైదరాబాద్‌ వెళ్లిపోవాలని సూచించారు. దుబాయ్ మీదుగా అమెరికా వెళ్తున్నారని తెలుస్తోంది. గత నెలలో శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ నుంచి అమెరికా వెళ్లడానికి శివాజీ ప్రయత్నించారు. కానీ పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. టీవీ9 యాజమాన్యం అలంద మీడియా కేసులో శివాజీ ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. రవి ప్రకాశ్ టీవీ9 సీఈఓగా ఉన్న సమయంలో సంతకాలు ఫోర్జరీ చేశారని.. ఆ ఛానెల్‌లో మెజార్టీ వాటాలు దక్కించుకున్న అలంద మీడియా పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ కేసులో శివాజీకి కూడా ప్రమేయం ఉన్నట్టు ఆరోపించింది. దీంతో ఆయనపై లుకౌట్ నోటీసులు జారీ చేసిన పోలీసులు దేశం దాటి పోవద్దంటూ ఆంక్షలు విధించారు. తర్వాత ఆయనపై ఆంక్షలను తొలగించారు. ఏపీ ఎన్నికలకు చాలా రోజుల ముందే.. ఓ జాతీయ పార్టీ ‘ఆపరేషన్ గరుడ’కు శ్రీకారం చుట్టిందని శివాజీ ఆరోపించారు. ఆ పార్టీ ఎలాంటి వ్యూహాన్ని అమలు చేయబోతుందనేది ఆయన పూసగుచ్చినట్టుగా వివరించారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2GxPj3R
v

ఊరికే ఎందుకు ఏడుస్తున్నావ్ అంటున్నారు.. కారణం ఇదే: విజయ్ దేవరకొండ

విజ‌య్ దేవ‌ర‌కొండ‌, ర‌ష్మిక మంద‌న్నా జంట‌గా న‌టించిన చిత్రం ‘డియ‌ర్ కామ్రేడ్‌’. ‘ఫైట్ ఫ‌ర్ వాట్ యు ల‌వ్‌’ అనేది ట్యాగ్ లైన్‌. భ‌ర‌త్ క‌మ్మ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. మైత్రీ మూవీ మేక‌ర్స్‌, బిగ్ బెన్ సినిమాస్ ప‌తాకాల‌పై న‌వీన్ ఎర్నేని, య‌ల‌మంచిలి ర‌విశంక‌ర్‌, మోహ‌న్ చెరుకూరి(సి.వి.ఎం), య‌ష్ రంగినేని సంయుక్త‌ంగా నిర్మించారు. ఈ చిత్రాన్ని జూలై 26న తెలుగు, త‌మిళ‌, మ‌ల‌యాళ‌, క‌న్న‌డ భాష‌ల్లో విడుద‌ల చేశారు. ఈ చిత్రానికి పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో హైదరాబాద్‌లో థాంక్స్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా మరోసారి ఎమోషనల్ స్పీచ్ ఇచ్చారు . విజ‌య్ దేవ‌ర‌కొండ మాట్లాడుతూ.. ‘నిన్న‌, ఈరోజు, రేపు థియేట‌ర్స్ నింపిన అంద‌రూ నా స్వీట్ కామ్రేడ్సే. నిన్న నాకెంతో ఇంపార్టెంట్ అయిన రోజు. నాకు స్పెష‌ల్ మూవీ. ప‌ర్స‌న‌ల్ మూవీ. ఏడాది పాటు నా ఎమోషన్స్ అన్ని ఇందులో పెట్టేసి చేశాను. ఈ సినిమా కంటెంట్‌.. నా పర్శనల్ లైఫ్‌కి దగ్గరగా ఉంది. బాబీ, లిల్లీ జ‌ర్నీ.. వారి డ్రీమ్స్‌.. వారి ప్రేమ‌.. రిలేష‌న్ షిప్స్‌.. వారు ప‌డే క‌ష్టాలు.. క‌ష్టాల దాట‌డానికి ఫైట్ చేసే జ‌ర్నీ నాకు ఎంతో ప‌ర్స‌న‌ల్‌గా నిలిచింది. నేను ఎమోష‌న‌ల్ ప‌ర్స‌న్ అయిపోయాను. మా త‌మ్ముడు ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్‌లో కూడా ఏడ్చేశాను. నా ఫ్రెండ్స్ అంద‌రూ ఊరికే ఏడుస్తున్నావెందుకు? నువ్వేంది ఇట్లా? అని అంటున్నారు. అందుకు కార‌ణం డియ‌ర్ కామ్రేడ్‌. ఆ సినిమా నా ఎమోష‌న‌ల్ సైడ్‌ను ఎక్స్‌ప్లోర్ చేసింది. చాలా గ‌ర్వంగా ఉంది. నాకు క‌లెక్ష‌న్స్ గురించి పెద్ద‌గా తెలియ‌వు. కాని ఈ సినిమా నా కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్. అంత మంది తెలుగు, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ‌, త‌మిళ ప్రేక్ష‌కులు నా సినిమాను చూశార‌నేదే నాకు ఇంపార్టెంట్‌. ఇంత రియాక్ష‌న్‌, ప్రేమ ఇచ్చినందుకు థ్యాంక్స్‌. తొలిసారి నాలుగు భాష‌ల్లో సినిమాను విడుద‌ల చేస్తున్న‌ప్పుడు ప్రేక్ష‌కుల‌ను థియేట‌ర్స్‌కు ర‌ప్పించ‌డం నా రెస్పాన్సిబిలిటీగా భావించాను. నేను చేయ‌గ‌లిగినంతా చేశాను. ఇంత మందికి సినిమా రీచ్ కావడాన్నిని కెరీర్‌లోనే ఫ్రౌడ్‌గా ఫీల‌వుతున్నాను. మొమ‌ర‌బుల్ జ‌ర్నీ. నా ఫేవ‌రేట్ ఫిలిం. ఈ సినిమాను నా కామ్రేడ్స్‌కి, భ‌ర‌త్ వాళ్ల నాన్న‌గారికి డేడికేట్ చేస్తున్నామ‌ని చెప్పాను. భ‌ర‌త్ వాళ్ల నాన్న‌గారు కూడా ఇంత మందికి న‌చ్చేసినిమాను తీసిన నిన్ను చూసిన గ‌ర్వ‌ప‌డ‌తాడు. నేష‌న‌ల్ వైడ్ రివ్యూరైట‌ర్స్ సినిమా గురించి అప్రిషియేట్ చేస్తూ రాశారు. చాలా మంది ట‌చ్ చేశావంటూ మెసేజ్‌లు పెట్టారు. ట్వీట్స్ పెట్టారు. ఈ క‌థ‌ను ఇలానే చెప్పాల‌ని అనుకున్నాం. బాబీ, లిల్లీ లైఫ్‌లో నాలుగేళ్ల జ‌ర్నీని చూపించే సినిమా ఇది. మ‌న లైఫ్‌కు ఓ ఇబ్బంది వ‌చ్చే వ‌ర‌కు అంతా బాగానే ఉంటుంది. స‌మ‌స్య రాగానే, త‌ర్వాత లైఫ్ ట‌ర్న్ అయ్యి ఫైట్ స్టార్ట్ అవుతుంది. అదే మా సినిమా. ఫ‌స్టాఫ్ వ‌ర‌కు బ్యూటీఫుల్‌గా ఉంటుంది. సెకండాఫ్ అంతా ఎమోష‌నల్‌గా ఉంటుంది. నా టీమ్‌ను చూసి గ‌ర్వ‌ప‌డుతున్నాను. జ‌ర్నీ ఆఫ్ డియ‌ర్ కామ్రేడ్‌ను విప‌రీతంగా మిస్ అవుతున్నాను. లిల్లీగా ర‌ష్మిక మంద‌న్న అద్భుతంగా చేసింది. సినిమా స్లోగా ఉన్నా.. బ్యూటీఫుల్ ఫిలిం. పక్కా వెళ్లి సినిమా చూడండి. ఈ సినిమా అలా వెళ్లిపోతుంటుంది. మీరు త‌ప్ప‌కుండా సినిమాను ప్రేమిస్తారు. కాకినాడ‌లో స‌క్సెస్ మీట్ పెడ‌తాన‌ని ప్రీ రిలీజ్ రోజున ప్రామిస్ చేశాను. అక్క‌డే మాట్లాడుతాను’ అన్నారు విజయ్ దేవరకొండ.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2yfGKGj
v

ఒక్క నైట్‌కి 15 లక్షల ఆఫర్.. ఫోర్న్ చేయను కాని..: షకీలా సంచలన కామెంట్స్

అంటే కొవ్వొత్తి అని అర్ధం.. తాను కరిగిపోతూ లోకానికి వెలుగునివ్వడమే కొవ్వొత్తి లక్షణం. తాను కూడా అంతే అంటోంది ఈ దక్షిణాది శృంగార తార. ఒకప్పుడు టాప్ హీరోలతో సమానంగా క్రేజ్ సంపాదించిన షకీలా.. హీరోయిన్‌గా ఎదగాలని ఆశపడిన ... చివరికి శృంగార తార‌గా ఎలా మారిందో ఇప్పటికే ఆమె పలు ఇంటర్వ్యూల్లో తెలిపారు. తాజాగా ఆమె టీఎన్ఆర్‌ (ఐడ్రీమ్స్)కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికరమైన విషయాలను షేర్ చేసుకున్నారు. ఆస్తులు అన్నీ పోవడానికి కారణం ఆమెనే.. ఒకప్పుడు హీరోలతో సమానంగా రెమ్యూనరేషన్ తీసుకున్న నేను ఆస్తులు పోగొట్టుకోవడానికి, సంపాదించకపోవడానికి కారణం అందర్నీ నమ్మడమే. నమ్మకమే నన్ను ఈ పరిస్థితికి తీసుకువచ్చింది. చిన్నప్పటి నుండి నేను మా అక్క లేకుండా ఏదీ చేసేదాన్ని కాదు. నేను డ్రెస్ కొనుక్కోవాలన్నా అక్కదే ఫైనల్ నిర్ణయం. అలాంటిది ఏదైనా ఆస్తులు కొనాలనుకున్నప్పుడు ఏదో ఒక కారణంతో ఆపేసేది. నేను ఏ తప్పు చేయలేదని ఆమెకూ తెలుసు. ఆమె చదువు కోవాలంటే ఉన్న కాస్త ఆస్తిని ఆమెకు ఇచ్చేశా. వాళ్లను గుర్తు చేసుకుని చాలాసార్లు ఏడ్చా. అమ్మని అమ్మా అని పిలిస్తే.. అక్కని మమ్మీ అనేదాన్ని. నేను ఏ తప్పూ చేయలేదని రోజుకైనా వాళ్లు అది తెలుసుకుంటారనే నమ్మకం అయితే ఉంది. అమ్మ కూడా నన్ను మోసం చేసింది.. అమ్మ అంటే అందర్నీ ఒకేలా చూడాలి. కాని నన్ను మాత్రం వేరేలా చూసేది. నేను సంపాదించినప్పుడు కూడా నన్ను తక్కువగా చూసింది. నేను ఆ పని చేశానంటే ఆమె ప్రోద్భలం ఎక్కువ. ఆమే దగ్గర ఉండి నన్ను పంపించేది. నా కన్యత్వం ఎప్పుడు పోయిందంటే.. మొదటి సారి నన్ను ఒకతనిదగ్గరకు పంపినప్పుడు అతన్ని బతిమిలాడితే ఏం చేయకుండా వదిలేశాడు. నాకు అది ఎప్పుడు కావాలనుకున్నానో.. ఎవరితో ఉండాలనుకున్నానో అప్పుడు నాకు కన్యత్వం లేదు. నితీష్ కుమార్ నాకు లాస్ట్ వాడు.. మా అమ్మ, అక్క, అన్నలతో విభేదాలు వచ్చాయి. ఇక నా లవ్ స్టోరీస్ చాలానే ఉన్నాయి. ఇంచుమించు ఏడెనిమిది మందితో రిలేషన్‌లో ఉన్నా. ఒక్కొక్కడితో పదేళ్లు, ఏడేళ్లు, నాలుగేళ్లు ఇలా ఉండేదాన్ని. నా లాస్ట్ వాడు నితీష్ కుమార్ అతనితో పదేళ్లు ఉన్నా. నేను ఇప్పటికీ కాంప్రమైజ్ అయ్యి ఉంటే పెళ్లి అయ్యేది. నా వయసు 43.. నో బ్యాంక్ బ్యాలెన్స్ ఇప్పుడు నేను కంఫర్టబుల్‌ లైఫ్‌లో ఉన్నా. పెద్దగా ఆస్తులు లేవు. మందు పార్టీలు జరిగితే అమ్మాయిల కంపెనీనే కోరుకుంటా. ఎందుకంటే.. అబ్బాయిలతో మందు పార్టీ చివర ఏం అడుగుతారో నాకు తెలుసు. ఆ నిర్మాత వస్తావా? అన్నాడు. క్యాస్టింగ్ కౌచ్ ఆ ఒక్క సినిమాకే.. నేను చాలా సినిమాలు చేసినప్పటికీ ఎవరూ పెద్దగా ఇబ్బంది పెట్టలేదు. అయితే ఒక నిర్మాత సినిమా షూటింగ్ అయిపోయిన తరవాత అడిగాడు. అతని పేరు చెప్పడం ఇష్టం లేదు. గతంలో డబ్బుల కోసమే ఆ పని చేశా.. నాకు షూటింగ్‌లో రోజుకి రూ. 10 వేలు దొరికితే ఎప్పుడూ ఆ పని చేయనని ప్రామిస్ చేసుకున్నా. కాని నాకు ఒక్కరోజుకి రూ.3 లక్షలు ఇచ్చే టైంలో.. నైట్‌కి వస్తే రూ. 15 లక్షలకి అడిగారు. ఆ టైంలో మూడు లక్షలా? 15 లక్షలా అనుకున్నప్పుడు 15 లక్షలు చాలా ఈజీ. కాని దేవుడ్ని మోసం చేయలేంగా. ఆ భయంతో వద్దని అనేదాన్ని. 23 లోనే మొత్తం చూపించేశా.. పోర్న్ చేయను ఇప్పుడు నా వయసు 43 సంవత్సరాలు. 23లోనే పూర్తిగా ఎక్స్‌పోజింగ్ చేసి మొత్తం చూపించేశా. ఈ వయసులో మంచి యాక్టింగ్ చూపించాలని అనుకుంటున్నా. అందుకే ‘కొబ్బరి మట్ట’ చిత్రంలో నటించా’ అంటూ తన మనోగతాన్ని పంచుకున్నారు షకీలా.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2GwzQ4e
v

దర్శకుడితో విజయ్ దేవరకొండకు విభేదాలు.. ఆగిపోయిన కొత్త సినిమా!

‘ఇండస్ట్రీలో ఎవరిపని వాళ్లు చేసుకోవాలి.. ఒకరి పనిలో ఒకరు వేలు పెడితే అవుట్ పుట్ అట్టర్ ఫ్లాప్ అవుతుంది. అందుకే నా పని నేను చూసుకుంటా.. దర్శకుడి దర్శకుడు, నిర్మాత పని నిర్మాత చూసుకుంటారు’ అంటుంటారు మహేష్ బాబు. అందుకే ఆయన సూపర్ స్టార్ అయ్యారు. అయితే సెన్సేషన్ స్టార్ ఆ టైపు కాదు. ఆయన అన్నింట్లోనూ ఉంటారు. కథ విన్నామా? ఓకే చేశామా? రెమ్యునరేషన్ తీసుకున్నామా? అన్నట్టుగా కాకుండా.. కథ విన్నది మొదలు ప్రమోషన్స్ మొత్తం భుజాలపై వేసుకుంటారు. ఇక కథ, ప్రొడక్షన్ విషయాల్లో కూడా పర్సనల్ ప్లానింగ్‌తో ముందుకు వెళ్తుంటారు. అయితే ఇది కొన్ని సందర్భాల్లో ఈ వేలుపెట్టే కార్యక్రమం వరం అయితే మరికొన్ని సందర్భాల్లో శాపం అవుతుంది. ఆ ఉపోద్ఘాతం అంతా ఆయన అప్ కమింగ్ మూవీ ‘హీరో’కి సంబంధించినదే. విజయ్ దేవరకొండ నటించిన ‘డియర్ కామ్రేడ్’ శుక్రవారం నాడు విడుదలై మిక్స్ టాక్‌‌తో రన్ అవుతోంది. ఈ సినిమా తరువాత విజయ్ దేవరకొండ.. తమిళ దర్శకుడు ఆనంద్‌ అన్నామలైతో ‘హీరో’ అనే చిత్రంలో నటిస్తున్నారు. మాళవికా మోహన్‌ ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తుండగా.. ఇటీవల రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించి మేజర్ సీన్స్ చిత్రీకరించారు. అయితే దర్శకుడు ఆనంద్ అన్నామలైతో స్క్రిప్ట్ విషయంలో విభేదాలు తలెత్తడంతో విజయ్ దేవరకొండ ‘హీరో’ చిత్రం ఆగిపోయినట్టు తెలుస్తోంది. కథ విషయంలో మార్పులు చేర్పులతో పాటు డైరెక్షన్‌లో కూడా విజయ్ దేవరకొండ కల్పించుకోవడంతో దర్శకుడు ఆనంద్ వ్యతిరేకించారట. ఇద్దరికీ సఖ్యత కుదరకపోవడంతో ఈ ప్రాజెక్ట్‌ను ఆపేస్తేనే మంచిదనే నిర్ణయానికి వచ్చిందట నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్. అయితే ఈ చిత్రానికి ఇప్పటికే రూ. 15 కోట్లకు పైగా ఖర్చు చేయడంతో.. అదే దర్శకుడితో ఈ చిత్రాన్ని కొనసాగిస్తారా? లేక దర్శకుడ్ని మార్చి విజయ్‌తో కొనసాగిస్తారా? అన్నది తెలియాల్సి ఉంది. ఈ ఇష్యూపై మైత్రి మూవీస్ ఎలాంటి ప్రకటన చేయలేదు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2yepGjV
v

Dear Comrade Download: డియర్ కామ్రేడ్ మూవీ ఆన్ లైన్‌లో.. దెబ్బకొట్టింది వాళ్లే!

సినిమా ఇండస్ట్రీని ఎన్నాళ్ల నుండో పట్టి పీడిస్తున్న పైరసీ భూతం మరోసారి తన ప్రతాపం చూపించింది. విజయ్ దేవరకొండ, రష్మిక మందన జంటగా నటించిన ‘డియర్ కామ్రేడ్’ చిత్రాన్ని పైరసీ భూతం గట్టి దెబ్బకొట్టింది. ఈ సినిమా శుక్రవారం నాడు (జూలై 26)న విడుదల కాగా.. ఈ మూవీ వస్తున్న ఆదరణ పట్ల సంతోషంగా ఉన్న యూనిట్‌‌కు తమిళ రాకర్స్ షాకిచ్చారు. ‘డియర్ కామ్రేడ్’ థియేటర్లలో షోలు ప్రారంభమైన కొద్ది గంటల్లోనే సినిమా హెచ్‌డీ రిజల్యూషన్‌తో క్వాలిటీ పైరసీ ప్రింట్‌ను తమిళ రాకర్స్ వెబ్‌సైట్‌లో లీక్ చేశారు. ఎలాంటి సినిమానైనా ముందే లీక్ చేస్తామంటూ చెప్పి మరీ పైరసీకి పాల్పడుతున్న తమిళ్ రాకర్స్ మరోసారి తమ వక్రబుద్ధిని చూపించారు. తమిళ రాకర్స్ కొత్త సినిమాలను పైరసీ చేయడం ఇదే తొలిసారి కాదు. విడుదలైన ప్రతి చిత్రాన్ని, విడుదలకు సిద్ధంగా ఉన్న చిత్రాలను సైతం తమ వెబ్ సైట్‌లో లీక్ చేసి నిర్మాతల్ని కోలుకోలేని దెబ్బకొడుతున్నారు. తెలుగు, తమిళం, మళయాళం, ఇంగ్లీష్ భాషలకి చెందిన సినిమాలని పైరసీ చేసి ఆన్ లైన్‌లో అప్ లోడ్ చేస్తున్న ఈ ముఠాను యాంటీ పైరసీ సెల్ చట్టం కింద పలుమార్లు అరెస్ట్ అయినప్పటికీ వాళ్ల పాత అలవాట్లను మార్చుకోవడం లేదు. వీరికి పలు అంతర్జాతీయ పైరసీ ముఠాలతో సంబంధాలు ఉండటంతో యదేచ్ఛగా పైరసీకి పాల్పడుతున్నారు. తమిళ్ రాకర్స్ . కామ్ తరచూ డొమెయిన్ పేర్లు మార్చుకుంటూ సైబర్ నేరాలకు పాల్పడుతోంది. .cc, Tamilrockers.to, Tamilrockers.pm, Tamilrockers.ws, Tamilrockers.lu, ఇలా పలు డొమెయిన్‌లతో కొత్త సినిమాలను లీక్ చేస్తున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2OilLNU
v

Friday 26 July 2019

పుల్లేటుకుర్రులో మోక్షజ్ఞతో కలిసి బాలయ్య ప్రత్యేక పూజలు.. కారణం ఇదే!

హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే, ప్రముఖ కథానాయకుడు నందమూరి బాలకృష్ణ తూర్పు గోదావరి జిల్లాలోని పుల్లేటికుర్రు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంబాజీపేట మండలం పుల్లేటికుర్రులోని చౌడేశ్వరి సమేత శ్రీ రామలింగేశ్వరస్వామి ఆలయంలో తనయుడు మోక్షజ్ఞతో కలిసి బాలయ్య గురువారం ప్రత్యేక పూజలు చేశారు. త్వరలో కొత్త సినిమా ప్రారంభం కానున్న సందర్భంగా ఆలయంలో చండీ హోమం, సుదర్శన హోమం, రామలింగేశ్వరస్వామికి రుద్రాభిషేకం చేయించారు. పుల్లేటికుర్రుకు చెందిన ప్రముఖ వేద పండితులు, బాలకృష్ణ ఆధ్యాత్మిక గురువు కారుపర్తి నాగ మల్లేశ్వరరావు సిద్దాంతి ఆధ్వర్యంలో ఈ ప్రత్యేక పూజలు,హోమాలు అభిషేకాలు నిర్వహించారు. కారుపర్తి నాగ మల్లేశ్వరరావు సిద్దాంతిగారి జ్యోతిషం అంటే బాలయ్యకు అపార నమ్మకం. తాను ఏ కార్యక్రమం ప్రారంభించినా ఆయన సలహా తీసుకుంటారు. కుమార్తెల వివాహాల విషయంలో ఆయన సూచనలు, సలహాలను పాటించారని అంటారు. బాలకృష్ణ తన కొత్త చిత్రం ప్రారంభించే ముందు ఇక్కడకు వచ్చి హోమాలు, ప్రత్యేక పూజలు నిర్వహిస్తుంటారు. బాలయ్య ఇక్కడికి వచ్చిన విషయాన్ని గోప్యంగా ఉంచారు. చౌడేశ్వరీ సమేత రామలింగేశ్వరస్వామి ఆలయంతోపాటు సిద్ధాంతి ఇంటి వద్దకు కూడా అభిమానులు, ప్రజలను అనుమతించలేదు. పుల్లేటికుర్రు చౌడేశ్వరి ఆలయంలో అనేక మంది సినీ, రాజకీయ ప్రముఖలు పూజలు నిర్వహిస్తారు. ఏకాదశ రుద్రుల్లో ఒకరైన అభినవ వ్యాఘ్రేశ్వరస్వామి ఈ గ్రామంలో ఉండేవారి అంటారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2OmH54P
v

Dear Comrade Telugu Jukebox


Dear Comrade Telugu Jukebox

from BharatStudent - Telugu - Actor Actress|Photo,Picture Galleries|Wallpapers|Screensavers|Movie Trailers|Film News and Gossips https://ift.tt/2ZhQWtY

Dear Comrade Telugu Jukebox


Dear Comrade Telugu Jukebox

from BharatStudent - Telugu - Actor Actress|Photo,Picture Galleries|Wallpapers|Screensavers|Movie Trailers|Film News and Gossips https://ift.tt/2ydmS6R

Dear Comrade Telugu Jukebox


Dear Comrade Telugu Jukebox

from BharatStudent - Telugu - Actor Actress|Photo,Picture Galleries|Wallpapers|Screensavers|Movie Trailers|Film News and Gossips https://ift.tt/2GwajYM

Sahore Saho Lyrical Video Song | Kurukshetram


Sahore Saho Lyrical Video Song | Kurukshetram

from BharatStudent - Telugu - Actor Actress|Photo,Picture Galleries|Wallpapers|Screensavers|Movie Trailers|Film News and Gossips https://ift.tt/2YmpI46

‘ఇస్మార్ట్ శంకర్’ కలెక్షన్స్.. బాక్సాఫీసు దుమ్ముదులుపుతోన్న ఉస్తాద్

‘‘శంకర్.. ఉస్తాద్ ఇస్మార్ట్ శంకర్’’ అంటూ ఎనర్జిటిక్ స్టార్ రామ్ వెండితెరను షేక్ చేస్తున్నారు. పక్కా హైదరాబాద్ స్టైల్లో తొలిసారి ఆయన తెలంగాణ యాసలో మాట్లాడుతూ నటించిన ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమా బాక్సాఫీసు దుమ్ముదులుపుతోంది. ఇన్నాళ్లూ హిట్టులేక ఢీలా పడిన డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దాహాన్ని ఈ చిత్రం తీర్చింది. ఈనెల 19న విడుదలైన ఈ సినిమా తొలి నాలుగు రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా రూ.48 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఆ తరవాత కూడా కలెక్షన్ల వేగం తగ్గలేదు. ఆరు రోజుల్లో రూ.56 కోట్లు వసూలు చేసిన ఈ సినిమా.. 8 రోజుల్లో రూ.61 కోట్లు రాబట్టింది. ఈ మేరకు చిత్ర నిర్మాణ సంస్థ పూరి కనెక్ట్స్ ట్వీట్ చేసింది. ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 8 రోజుల్లో రూ.61 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసినట్లు ట్వీట్‌లో పేర్కొంది. ‘బ్లాక్‌బస్టర్ ఇస్మార్ట్ శంకర్’ అనే క్యాప్షన్ కూడా పెట్టింది. వాస్తవానికి ఈ సినిమాకు తొలిరోజు మిశ్రమ స్పందన వచ్చింది. ఊరమాస్ సినిమా అంటూ విశ్లేషకులు సైతం పెదవి విరిచారు. అయితే, ఇవేవీ కలెక్షన్లపై ప్రభావం చూపలేదు. వారం రోజులు గడిచినా కలెక్షన్లు మాత్రం తగ్గలేదు. శుక్రవారం ‘డియర్ కామ్రేడ్’ విడుదలైంది కాబట్టి ఆ ప్రభావం ‘ఇస్మార్ట్ శంకర్’పై పడొచ్చు. కాగా, తెలుగు రాష్ట్రాల్లో ‘ఇస్మార్ట్ శంకర్’ దూసుకుపోతోంది. ఏపీ, తెలంగాణలో ఏడు రోజుల్లో రూ.26.13 కోట్లు రాబట్టినట్లు సమాచారం. తెలుగు రాష్ట్రాల్లో ప్రాంతాల వారీగా ‘ఇస్మార్ట్ శంకర్’ షేర్ లెక్కలు ఇలా ఉన్నాయి.. నైజాం - రూ. 11.60 కోట్లు సీడెడ్ - రూ.4.50 కోట్లు నెల్లూరు - రూ.90 లక్షలు గుంటూరు - రూ.1.62 కోట్లు కృష్ణా - రూ.1.59 కోట్లు పశ్చిమ గోదావరి - రూ.1.33 కోట్లు తూర్పు గోదావరి - రూ.1.61 కోట్లు ఉత్తరాంధ్ర - రూ.2.98 కోట్లు 7 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా ‘ఇస్మార్ట్ శంకర్’ షేర్ - రూ.29.13 కోట్లు


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2YksaIb
v

‘ఇస్మార్ట్ శంకర్’కు రామ్ చరణ్ ప్రశంస.. ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్!

ఎనర్జిటిక్ స్టార్ రామ్, డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబినేషన్‌లో వచ్చిన మాస్ మసాలా మూవీ ‘ఇస్మార్ట్ శంకర్’. ఈనెల 19న విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకుల మన్ననలు అందుకుంటోంది. బాక్సాఫీసు వద్ద మంచి కలెక్షన్లు రాబడుతోంది. అంతేకాకుండా, చాలా కాలంగా హిట్టుకు దూరమైన పూరీకి ఆ దాహాన్ని తీర్చింది. ‘ఇస్మార్ట్ శంకర్’ సక్సెస్ కావడంతో పూరి గురువు రాంగోపాల్ వర్మ ఇటీవల చిత్ర యూనిట్‌కు అదిరిపోయే పార్టీ ఇచ్చారు. పూరి అండ్ టీమ్‌ను పొగడ్తలతో ముంచెత్తారు. సినీ పరిశ్రమకు చెందిన చాలా మంది ప్రముఖులు ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమా పట్ల పాజిటివ్‌గా స్పందించారు. ఇప్పుడు ఈ కోవలో మెగా పవర్ స్టార్ చేరారు. తాజాగా ఈ సినిమాను చూసిన రామ్ చరణ్.. హీరో రామ్‌తో పాటు దర్శకుడు పూరి జగన్నాథ్‌పై ప్రశంసలు కురిపించారు. ఈ మేరకు ఆయన ఫేస్‌బుక్ ద్వారా అభినందనలు తెలిపారు. ‘‘రామ్‌తోపాటు ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాలోని మిగిలిన నటీనటులంతా చాలా ఎనర్జిటిక్‌గా నటించారు. ఈ విజయానికి కారకులైన పూరి గారికి అభినందనలు’’ అని రామ్ చరణ్ పోస్ట్ చేశారు. రామ్ చరణ్ పోస్ట్‌కు హీరో రామ్ కూడా స్పందించారు. ఫేస్‌బుక్ పోస్ట్ స్క్రీన్ షాట్ తీసి.. దాన్ని ట్వీట్ చేశారు. ‘థాంక్యూ సో మచ్ మై బ్రదర్’ అని పేర్కొన్నారు. కాగా, రామ్ చరణ్‌ను వెండితెరకు పరిచయం చేసిన దర్శకుడు పూరి జగన్నాథ్ అన్న విషయం అందరికీ తెలిసిందే. వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన ‘చిరుత’ రామ్ చరణ్‌కు మొదటి సినిమా. తనను లాంచ్ చేసిన దర్శకుడు తాజాగా హిట్ అందుకోవడంతో చరణ్ ఆయనికి అభినందనలు తెలిపారు. అలాగే, నటుడు సుమంత్‌ కూడా పూరీకి అభినందనలు తెలిపారు. ‘‘ఇస్మార్ట్‌ శంకర్‌’ విజయం అందుకున్నందుకు రామ్‌, పూరి, ఛార్మిలకు శుభాకాంక్షలు. చాలా సంతోషంగా ఉంది’ అని ట్వీట్‌ చేశారు. ఆయనకు కూడా రామ్‌ థాంక్స్‌ చెప్పారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/32Q20kd
v

2 గంటల ప్రేమలో రెచ్చిపోయి ముద్దులు.. చివరికి ఏమయ్యారు?

ఒక అమ్మాయి అబ్బాయి కలిసి రెండు గంటల పాటు బస్‌లో జర్నీ చేశారు. ఈ రెండు గంటల్లో ఎలా ప్రేమలో పడ్డారు. వారి మధ్య ఏం జరిగింది? అన్నది కథ. ఇలాంటి కథలో ఇప్పటికే చాలానే వచ్చాయి. కాని.. ఇది అలాంటి కథ కాదు.. ఇది చాలా కొత్తగా ఉంటాది. అదేంటంటే.. ఈ కథలో హీరో హీరోయిన్లు రోజుకి రెండు గంటలు మాత్రమే ప్రేమించుకుంటారు. వినడానికి కొత్తగా ఉన్న ఈ కథ పేరే ‘2 అవర్స్ లవ్’. కాన్సెప్ట్‌‌తో పాటు టైటిల్, ఆ టైటిల్ డిజైన్, క్యారెక్టర్లు, కథ నెరేషన్ ఇలా అన్నీ కొత్తగానే ఉన్నాయి. అంతెందుకు తాజాగా విడుదలైన ‘2 అవర్స్ లవ్’ ట్రైలర్‌ కూడా డిఫరెంట్‌గా కట్ చేశారు. నేను డైలీ 4 PM-6PM మాత్రమే ఖాళీగా ఉంటాను. ఆ టైంలో ప్రేమించు అని కండిషన్ పెట్టే హీరోయిన్‌ని ఇదిగో ఇప్పుడే చూసి ఉంటాము. ఆరు దాటిందంటే లవర్‌తో ఒక్కమాట కూడదు ఈ పెంకుపిల్ల. అంతెందుకు ఇద్దరూ కలిసి ముద్దుపెట్టుకునేప్పుడు కూడా ఆరు దాటిందంటే.. ఇక మరుసటి రోజు కోసం చూడాల్సిందే ఆ అమర ప్రేమికుడు. సుకుమార్ సినిమాలో హీరోల బిహేవ్ చేసే ఈ హీరోయిన్ ‘2 అవర్స్ లవ్’ వెనుక బలమైన ఫ్లాష్ బ్యాక్ కూడా ఉంది. దాన్ని హీరో తెలుసుకుని రెండు గంటలు మాత్రమే ప్రేమించే ప్రేయసితో 24 గంటలు ప్రేమించేలా ఎలా చేశాడన్నదే ‘2 అవర్స్ లవ్’. ఇది అన్ని ప్రేమకథల్లాంటి ప్రేమకథ కాదు కాకపోయినా.. రోజులో రెండు గంటల లవ్ స్టోరీనే అయినే.. ఈ రెండు గంటల్లో హీరో హీరోయిన్ల మధ్య ఘాటు ముద్దులు చాలానే ఉన్నాయి. ఇక హీరో హీరోయిన్లు ఇద్దరూ స్క్రీన్‌పై బాగున్నారు. కామెడీ టైమింగ్ కూడా బాగుంది. సంథింగ్ డిఫరెంట్ అనిపిస్తున్న ఈ చిత్రానికి శ్రీ పవార్ రచన, దర్శకత్వం వహించడంతో పాటు ఆయనే హీరోగా నటించారు. క్రితి హీరోయిన్‌గా నటించింది. ఇక గ్యాని సింగ్ మంచి మ్యూజిక్ అందించారని ట్రైలర్‌ని బట్టి చెప్పేయొచ్చు. నేపథ్య సంగీతం కథకు అనుగుణంగా ఉంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2Zo4gg4
v

‘తూనీగ’ చిత్రానికి త‌నికెళ్ల భ‌ర‌ణి అభినంద‌న

తూనీగ..ఒక దైవ ర‌హ‌స్యం పేరిట వ‌ర్థ‌మాన ద‌ర్శ‌కులు ప్రేమ్ సుప్రీం రూపొందిన ప్ర‌యోగాత్మ‌క చిత్రం. భారీ చిత్రాల‌ను స్ఫురింపజేసేలా అత్యున్న‌త సాంకేతిక అంశాల‌తో రూపొందిన ఓ పురాణేతిహాస ప్ర‌ధాన చిత్రం.భార‌తీయ పురాస్మృతిలో అత్యంత ఆస‌క్తిదాయ‌క క‌థావస్తువుతో రూపొందిన ఈ చిత్ర పోస్ట‌ర్ ను ప్ర‌ముఖ క‌వి, ర‌చ‌యిత, ద‌ర్శ‌కులు త‌నికెళ్ల భ‌ర‌ణి ఆవిష్క‌రించారు. వ‌ర్థ‌మాన ర‌చ‌యిత,ద‌ర్శ‌కులు ప్రేమ్ సుప్రీం రూపొందించిన తూనీగ (ఒక దైవ‌రహ‌స్యం) చిత్ర పోస్ట‌ర్ ను ప్ర‌ముఖ ర‌చ‌యిత, క‌వి, నటు లు, ద‌ర్శ‌కులు త‌నికెళ్ల భ‌రణి ఆవిష్క‌రించారు.హైద్రాబాద్ లో ఆయ‌న స్వ‌గృహం వ‌ద్ద ఈ పోస్ట‌ర్ ను విడుద‌ల చేసి, చిత్ర రూప‌క‌ర్త‌నూ, ఇత‌ర బృందా న్నీ అభినందించారు. తాత్విక చింత‌న నేప‌థ్యంలో సాగే ఈ చిత్రం ఘ‌న విజ‌యం సాధించాల‌ని ఆకాంక్షించారు.దేవ‌ర‌హ‌స్యం వెల్ల‌డించే క్ర‌మంలో ఉ త్కంఠ‌త‌ను పెంపొందించే క‌థాంశాన్ని తీసుకుని తెరకెక్కిన ఈ చిత్రంపై అంచ‌నాలు పెంచేలా పోస్ట‌ర్ ను డిజైన్ చేసిన తీరు బాగుంద‌ని అభినందించా రు. భార‌తీయ సంస్కృతిలో అనేకానేక తాత్విక ప‌ర అంశాల‌కు చ‌ర్చ‌కు రాద‌గ్గ అర్హ‌త ఉంద‌ని, ఆ కోవ‌లోనే ఓ ఆస‌క్తిక‌ర అంశాన్ని తీసుకుని ఈ తూ నీగ చిత్రం రూపొందింద‌ని,విజువ‌ల్ ఎఫెక్ట్స్ ప‌రంగా కూడా ఉన్న‌త సాంకేతిక విలువ‌లను పాటించార‌ని వెల్ల‌డించారు.ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు ఎస్‌.ఎస్‌. రా జ‌మౌళి స్ఫూర్తితో ఆయ‌న‌కో గురుద‌క్షిణ అన్న రీ తిలో తెర‌కెక్కిన ఈ చిత్రం కొత్త ఆలోచ‌న‌ల‌కు చిరునామా నిలుస్తుంద‌న్న న‌మ్మ‌కం త‌న‌కుం దని అన్నారు.ద‌ర్శ‌కులు ప్రేమ్ సుప్రీం మాట్లాడుతూ..శ్రీ‌కాకుళం త‌న స్వ‌స్థ‌లం అని,ఇప్ప‌టికే అనేకానేక ల‌ఘు చిత్రాలు రూపొందించాన‌ని, తొ లిసారి పూర్తి నిడివి ఉన్న చిత్రాన్ని రూపొందించడం ఆనం దంగా ఉంద‌ని అన్నారు. క్రౌడ్ ఫండింగ్ ద్వారా ప్రేమ్ పెయింటింగ్స్ ప‌తాకంపై ఈ ప్ర‌యో గాత్మ‌క ప్రాజెక్టు చేపట్టామ‌ని,ఈ చిత్రానికి సంగీతం సిద్ధార్థ్ స‌దాశివుని,ఛాయాగ్ర‌హ‌ణం రిషి ఎదిగ అందించారని, ప‌బ్లిసిటీ డిజైన‌ర్ గా ఎంకేఎస్ మ‌నోజ్ వ్యవ‌హరించార‌ని వెల్ల‌డించారు.ఆగ‌స్టు మొద‌టివారంలో ఆడియో విడుద‌ల కానుంది.ఈ చిత్రానికి పాట సాహిత్యాన్ని బాలాజీ, విశ్వ‌ప్ర‌గ‌డ, కిట్టు త‌ది త‌రులు అందించారన్నారు. వినీత్, దేవయానీ శ‌ర్మ హీరో, హీరోయిన్లుగా ప‌రిచ‌యం అవుతున్న ఈ ప్ర‌యోగాత్మ‌క చిత్రాన్ని అతి త్వ‌ర‌లో విడుద‌ల చేయ‌నున్నామ‌ని తెలిపారు. ప‌ద్మ దేవీ ప్ర‌భ సమ‌ర్ప‌ణ‌లో రూపొందిన ఈ చిత్రానికి శ్రీ‌కాకుళం జిల్లాకు చెందిన ప‌లువురు స‌హ నిర్మాత లుగా వ్య‌వ హ‌రించార‌ని పేర్కొన్నారు. విశాఖ‌ప‌ట్నం,హైద్రాబాద్, బెంగ‌ళూరు న‌గ‌రాల‌తో స‌హా శ్రీ‌కాకుళం జిల్లాలో సీతంపేట మ‌న్యం ప‌రిస‌ర ప్రాంతా ల‌లో చిత్రీకర‌ణ సాగిందన్నారు.పోస్ట‌ర్ విడుద‌ల వేడుక‌లో హీరో వినీత్, సినిమాటోగ్ర‌ఫ‌ర్ రిషి ఎదిగ‌, ప‌బ్లిసిటీ డిజైన‌ర్ ఎంకేఎస్ మ‌నోజ్ త‌దిత‌రులు పాల్గొన్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2MmQero
v

వాణి కపూర్ బికినీ ‘వార్’.. స్టన్నింగ్!

బాలీవుడ్ యాక్షన్ హీరోలు హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్ నటించిన పవర్‌ఫుల్ యాక్షన్ మూవీ ‘వార్’. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్నారు. యష్ రాజ్ ఫిలిమ్స్ బ్యానర్‌పై ఆదిత్య చోప్రా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా తెలుగులో కూడా అనువాదమై వస్తోంది. ఇటీవల విడుదలైన ‘వార్’ టీజర్‌కు విశేష స్పందన వచ్చింది. హృతిక్, టైగర్ యాక్షన్ స్టంట్లు చూసి ప్రేక్షకులు వహ్వా అన్నారు. టీజరే ఇలా ఉంటే ఇక సినిమా ఎలా ఉంటుందో అని ఆశ్చర్యపోయారు. ఈ అంచనాలకు ఎక్కడా తగ్గకుండా బిగ్గెస్ట్ యాక్షన్ ఫిల్మ్ ఆఫ్ ది ఇయర్‌గా ‘వార్’ను తెరకెక్కిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న ఈ సినిమా అక్టోబర్ 2న విడుదలకు సిద్ధమవుతోంది. కాగా, ఈ సినిమాలో హృతిక్ రోషన్‌కు జోడిగా నటిస్తోంది. టీజర్‌లో సముద్రపు ఒడ్డున బికినీలో మెరిసింది కూడా ఈమెనే. ఇప్పుడు ఆ లుక్‌ను పోస్టర్ రూపంలో విడుదల చేశారు. బికినీలో వాణి స్టన్నింగ్ లుక్‌కు ప్రశంసలు అందుతున్నాయి. సోషల్ మీడియాలో ఆమె అందాన్ని పొగుడుతూ పోస్టులు పెడుతున్నారు. తన బికినీ లుక్‌‌కు ఇంత మంచి ఫీడ్ బ్యాక్ రావడంపై వాణి స్పందించారు. ‘‘ప్రేక్షకుల నుంచి ఎప్పుడు పాజిటివ్ ఫీడ్‌బ్యాక్ వచ్చినా ఆనందంగానే ఉంటుంది. ఈసారి అలాంటి స్పందన రావడం చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమా కోసం నేను చాలా కష్టపడ్డాను. యోగా, పైలేట్స్, వెయిట్ ట్రైనింగ్‌తో పాటు ఎన్నో గంటలు జిమ్‌లో గడిపి ఇలా ఫిట్‌గా తయారయ్యాను. ఈ ప్రాజెక్ట్ విషయంలో నేను ఎగ్జైటెడ్‌గా ఉన్నాను. నన్ను సినిమాలో సిద్ ఎలా చూపించాలనుకున్నారనే విషయంలో ఆయన చాలా క్లియర్‌గా ఉన్నారు. ఈ పాత్ర కోసం తీసుకుంటోన్న డైట్ చాలా కష్టంగా ఉన్నా అది పాత్రకు లాభం చేకూరుస్తుందనే ఆనందం ఉంది’’ అని వాణి కపూర్ వెల్లడించారు. వాణి కపూర్ పాత్ర గురించి డైరెక్టర్ సిద్ధార్థ్ ఆనంద్ మాట్లాడుతూ.. ‘‘దేశంలోనే హ్యాండ్‌సమ్ హీరోగా పేరొందిన హృతిక్ రోషన్ పక్కన నటించడానికి స్టన్నింగ్, సూపర్ ఫిట్ గర్ల్ కావాలని మేం కోరుకున్నాం. మేం అనుకున్న లక్షణాలన్నీ వాణిలో ఉన్నాయి. ఆమె పాత్రకు పూర్తి న్యాయం చేసింది. సినిమాలో ఈ విధంగా కనిపించడానికి ఆమె ఎంతో కష్టపడింది. టీజర్‌లో ఆమెను చూసిన ప్రేక్షకులు ప్రశంసల వర్షం కురిపిస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది’’ అని అన్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2YjAwjh
v

Dear Comrade Day 1 Collections: అర్జున్ రెడ్డిని మించి ‘డియర్ కామ్రేడ్’.. ఫస్ట్ డే ఫసక్

‘కష్టపడు.. ఫలితం ఆశించు’.. ఈ సూత్రాన్ని విజయ్ దేవరకొండ తూచా తప్పకుండా పాటిస్తున్నాడు. స్టార్ ఇమేజ్ వచ్చాక.. మన రెమ్యూనరేషన్ మనకు వస్తుంది కదా అని సైలెంట్‌ అయిపోతుంటారు మన హీరోలు. అయితే విజయ్ దేవరకొండ ఆ టైప్ కాదు.. కథ విన్నప్పటి నుండే సినిమా నాది అనుకుంటారు. నా అనుకున్న సినిమాను నిర్మాతలు, దర్శకులపై వదిలేయకుండా సినిమా ప్రమోషన్స్‌ భూజాలపై వేసుకుని శక్తివంచన లేకుండా కష్టపడతాడు.. ఆ కష్టానికి తగ్గ ఫలితమే ఈ ‘డియర్ కామ్రేడ్’ కలెక్షన్లు. ‘గీతగోవిందం’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న విజయ్ దేవరకొండ, రష్మిక మందన జోడీ టాలీవుడ్‌లోనే బెస్ట్ రొమాంటిక్ జోడీగా మారింది. ఈ ఇద్దరూ మళ్లీ కలిసి నటింస్తే బావుండు అనేంతగా కెమెస్ట్రీని వర్కౌట్ చేశారు. ఈ ఇద్దరి కాంబినేషన్‌లో యువ దర్శకుడు భరత్ కమ్మ ‘డియర్ కామ్రేడ్’ అనే రొమాంటిక్ ఎంటర్ టైనర్ చిత్రాన్ని రూపొందించారు. ఈ చిత్రంతో భరత్ కమ్మ ఇండస్ట్రీకి పరిచయం కాగా.. మైత్రీ మూవీమేక‌ర్స్, బిగ్ బెన్ సినిమాస్ ప‌తాకాల‌పై న‌వీన్ ఎర్నేని, య‌ల‌మంచిలి ర‌విశంక‌ర్‌, మోహ‌న్ చెరుకూరి(సి.వి.ఎం), య‌శ్ రంగినేని ఈ చిత్రాన్ని నిర్మించారు. శుక్రవారం భారీ అంచనాలతో తెలుగు, తమిళ, మలయాళం, కన్నడ భాషల్లో ఒకేసారి విడుదల చేశారు. విడుదలకు ముందు ఈ నాలుగు రాష్ట్రాల్లో సినిమా ప్రమోషన్స్ విరివిగా నిర్వహించి పాజిటివ్ బజ్ క్రియేట్ చేశారు. గీత, గోవిందంగా వెండితెరపై రొమాన్స్ పండించిన విజయ్ దేవరకొండ, రష్మికలు.. ఈ చిత్రంలో బాబీ, లిల్లీగా మెస్మరైజ్ చేస్తున్నారు. భారీ అంచనాలతో విడుదలైన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుండి పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కర్ణాటక, కేరళలో భారీగా విడుదల కాగా.. ఓవర్సీస్‌లో సైతం అత్యధిక థియేటర్స్‌లో విడుదలై కాసుల వర్షం కురిపిస్తోంది. యూఎస్‌లో గురువారం నాడు (నిన్న) 171 పైగా స్క్రీన్స్‌లలో విడుదలైన ఈ చిత్రం విజయ్ దేవరకొండ కెరియర్‌లోనే బెస్ట్ త్రీ ఓపెనింగ్స్ రాబట్టింది. ప్రీమియర్ షోల ద్వారా 2,05,066 డాలర్లు రాబట్టి అర్జున్ రెడ్డి, టాక్సీవాలా, నోటా చిత్రాలను బీట్ చేసింది. మొత్తంగా 3,00,066 డాలర్లులకు చేరువైనట్టు తెలుస్తోంది. అయితే శుక్రవారం నాడు కూడా భారీగా ఈ చిత్రానికి ఆక్యుపెన్సీ ఉండటంతో ఈ కలెక్షన్లు రెట్టింపయ్యే అవకాశం కనిపిస్తుంది. అయితే తెలుగు రాష్ట్రాల్లో మాత్రం టాక్ పరంగా డియర్ కామ్రేడ్‌కి మిశ్రమ స్పందన లభిస్తోంది. విజయ్ గత చిత్రాలు... టాక్సీవాలా, అర్జున్ రెడ్డి, గీత గోవిందం సినిమాలకంటే బెటర్ అనేలా ‘డియర్ కామ్రేడ్’ లేదని. థియేటర్స్ వచ్చిన ప్రేక్షకుడ్ని నిరుత్సాహ పరచకుండా చేశారు తప్ప.. అంచనాలను ‘డియర్ కామ్రేడ్’ అందుకోలేకపోయాడనే టాక్ ఎక్కువగా వినిపిస్తోంది. ఇప్పటి వరకూ విజయ్ దేవరకొండ కెరియర్ బెస్ట్ ప్రీమియర్ కలెక్షన్లు, సినిమాలు ఇలా ఉన్నాయి. 1. గీత గోవిందం 377,930 డాలర్లు 2. మహానటి 303,456 డాలర్లు 3. డియర్ కామ్రేడ్ 273,000 డాలర్లు 4. అర్జున్ రెడ్డి 194,051 డాలర్లు 5 నోటా 128,760 డాలర్లు 6. టాక్సీవాలా 94,270 డాలర్లు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2ZfSep4
v

‘డియర్ కామ్రేడ్’ మూవీ రివ్యూ

తాను ప్రేమించిన అమ్మాయిని గెలిపించడానికి ఆమెలో ధైర్యం నింపుతూ జీవితాంతం తోడుండే ఏ కుర్రాడైనా కామ్రేడే. అలాంటి ఓ కామ్రేడ్ కథే ఈ సినిమా.

from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2SHV3g5
v

Uppal Balu: శ్రీరెడ్డితో ఉప్పల్ బాలు ‘కసి’ .. ఏం తిప్పుతున్నార్రా బాబోయ్

సరిపోయింది సంబరం.. ఇద్దరికీ ఇద్దరే.. ఒకరేమో కాంట్రవర్శీ అండ్ హాట్ నెస్‌కు కేరాఫ్ అడ్రస్.. ఇంకొకరేమో టిక్ టాక్ యాప్‌కే హార్ట్ ఎటాక్ రప్పించే మెలికల మాంత్రికుడు. వీళ్లిద్దరే , . శ్రీరెడ్డి గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు.. సోషల్ మీడియా ఫాలోవర్స్‌కి, తెలుగు, తమిళ ఇండస్ట్రీలకు సుపరిచితమే. చేసినవి రెండు మూడు సినిమాలే అయినా.. ఆమె టాలీవుడ్ క్యాస్టింగ్ కౌచ్‌తో తెలుగు, తమిళ ఇండస్ట్రీల్లోని రసిక రాజులకు వణుకు పుట్టించింది. ఎప్పుడూ ఏదో సంచలన వార్తతో వార్తల్లో ఉండే శ్రీరెడ్డికి ఫేస్ బుక్‌లో ఆరు మిలియన్ల మంది ఫాలోవర్స్‌ ఉన్నారంటే ఆమె ఫాలోయింగ్ ఏంటో అర్ధం చేసుకోవచ్చు. ఇక ఉప్పల్ బాలు.. నాకు చాన్స్ వస్తే ‘నా కసి మొత్తం చేర్చేసుకుంటా’ అంటూ ఈమధ్య కాలంలో సోషల్ మీడియాలో బాగా పాపులర్ అయిన ఉప్పల్ బాలు... టిక్ టాక్‌కే తోపులా మారాడు. అటు అమ్మాయి.. ఇటు అబ్బాయి అని కాకుండా అమ్మాయి అబ్బాయిని మిక్స్ చేసి వీరలెవల్లో ‘కసి’ ఫెర్ఫామెన్స్ ఇస్తూ వీడియోలు వదలుతుంటాడు. ఈ మధ్య జబర్దస్త్ కార్యక్రమంలోనూ తన ‘కసి’ చూపించేశాడు. ఈ ఇద్దరూ కలిసి ఓ వీడియో వదిలారు. ఈ వీడియోను తన ఫేస్ బుక్‌లో షేర్ చేసింది శ్రీరెడ్డి. ఇద్దరూ మెలికలు తిరుగుతూ.. నడుముని బొంగరం గింగిరాలు తిప్పుతూ హుషారైన పాటకు ఊపునిచ్చే స్టెప్పులు వేస్తూ రచ్చ చేస్తూ టిక్ టాక్ వీడియో రూపొందించారు. అసలే కోతి ఆపై కల్లు తాగింది అన్నంత రేంజ్‌లో ఈ వీడియో వీడియో ఉంది. ఈ రచ్చపై మీరూ ఓ లుక్కేయండి.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/32RH3VY
v

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...