Friday 31 December 2021

మెగా, నందమూరి ఫ్యాన్స్‌కి నిరాశ .. RRR వాయిదా.. కొత్త రిలీజ్ డేట్ ఇదే.. సోషల్ మీడియా వైరల్ అవుతున్న వార్త

ఇదెక్క‌డి క‌రోనా వైరస్ బాబూ.. మ‌నల్ని ప్ర‌శాంతంగా ఉండ‌నివ్వ‌డం లేదు. మ‌న ప‌నుల‌ను మ‌నం నింపాదిగా అనుకున్న ప్లానింగ్ ప్ర‌కారం చేసుకోలేక‌పోతున్నామ‌ని ప్ర‌పంచ‌మంతా అనుకుంటున్న మాట‌. నిజ‌మే మ‌రి!. సినీ ఇండ‌స్ట్రీ విష‌యానికి వ‌స్తే.. నూటికి రెండు వంద‌ల శాతం ఇది నిజ‌మ‌ని అంద‌రూ అంటారు. ఎందుకంటే భారీ చిత్రాలు, మీడియం బ‌డ్జెట్ చిత్రాలు, చిన్న బ‌డ్జెట్ చిత్రాలు ఇలా అన్నీ పోస్ట్ పోన్ అవుతున్నాయి. ఈ కోవ‌లో భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్కించిన మూవీ వాయిదా ప‌డుతుంద‌ని వార్త‌లు బ‌లంగా సినీ వ‌ర్గాల్లో వినిపిస్తున్నాయి. నిజానికి RRR..2020 జూలై 30న విడుద‌ల కావాల్సిన చిత్రం. అప్ప‌టి నుంచి వాయిదా ప‌డుతూనే వ‌స్తుంది. చివ‌ర‌కు జ‌న‌వ‌రి 7, 2022న RRR ను థియేట‌ర్స్‌లో విడుద‌ల చేయాల‌ని అంద‌రూ ఫిక్స్ అయ్యారు. పెద్ద రేంజ్‌లో రూపొందిన చిత్రం. రాజ‌మౌళి తెరకెక్కించిన చిత్రం కావ‌డంతో హీరోలంద‌రూ RRR సినిమాకు దారి ఇచ్చారు. సినిమా యూనిట్ కూడా ప్ర‌మోష‌న‌ల్ యాక్టివిటీస్‌తో ఫుల్ బిజీగా మారిపోయింది. ఇక విడుద‌ల‌కు ప‌ది రోజులు కూడా లేవు. మ‌న అభిమాన హీరోల‌ను వెండితెర‌పై చూడొచ్చున‌ని ఇటు మెగా ఫ్యాన్స్‌, అటు నంద‌మూరి ఫ్యాన్స్ సంబర‌ప‌డ్డారు. కానీ.. ఇప్పుడు వారికి నిరాశ ఎదురుకాక త‌ప్పేలా లేదు. అందుకు కార‌ణం కోవిడ్ మ‌ళ్లీ త‌న పంజా విసర‌డం ప్రారంభించింది. ఒమిక్రాన్ కేసులు క్ర‌మంగా పెరుగుతుండ‌టంతో ప‌రిస్థితులు అదుపు త‌ప్ప‌కుండా ఉండ‌టానికి ప‌లు రాష్ట్ర ప్ర‌భుత్వాలు లాక్‌డౌన్ విధిస్తూ వ‌స్తున్నాయి. అందులో భాగంగా థియేట‌ర్స్‌ను త‌గు జాగ్ర‌త్త‌లు తీసుకుని పూర్తిగా కాకుండా 50 శాతం ఆక్యుపెన్సీతో ర‌న్ చేసుకోమ‌ని అంటున్నారు. ఇప్ప‌టికే ఢిల్లీలో లాక్డౌన్ విధించారు. మ‌హారాష్ట్ర‌, యూపీ వంటి రాష్ట్రాల్లోనూ అదే ప‌రిస్థితి. థియేట‌ర్స్ విష‌యానికి వ‌స్తే 50 శాతం ఆక్యుపెన్సీతో సినిమా థియేట‌ర్స్‌ను ర‌న్ చేయ‌వ‌చ్చున‌ని అన్నారు. ఇప్పుడు ద‌క్షిణాదిన త‌మిళ‌నాడులో కూడా లాక్ డౌన్ పెట్టారు. ఈ నెలాఖ‌రు వ‌ర‌కు లాక్‌డౌన్ అంక్ష‌లు కొన‌సాగుతాయి. థియేట‌ర్స్ 50 శాతం ఆక్యుపెన్సీతో ర‌న్ చేసుకోవ‌చ్చున‌ని రూల్స్ పెట్టేశారు. ఇలాంటి క‌ఠిన ప‌రిస్థితుల్లో RRR సినిమాను విడుద‌ల చేస్తే డిస్ట్రిబ్యూట‌ర్స్ చాలా న‌ష్టాల‌ను ఎదుర్కోవాల్సి వ‌స్తుంద‌న‌డంలో సందేహం లేదు. దీంతో చిత్ర యూనిట్‌, మేక‌ర్స్ త‌ర్జ‌న‌భ‌ర్జ‌నలు ప‌డుతున్నారు. ఇప్ప‌టికే దాదాపు RRR రిలీజ్‌ను వాయిదా వేయాలని ఫిక్స్ అయ్యార‌ట‌. త్వ‌ర‌లోనే అధికారిక ప్ర‌క‌ట‌న వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని స‌మాచారం. ప‌రిస్థితులు చ‌క్క‌బ‌డిన త‌ర్వాత జూన్‌లో RRR ను థియేట‌ర్స్‌లో విడుద‌ల చేసే అవ‌కాశం ఉంద‌ని గుస‌గుస‌లు ఎక్కువ‌గా వినిపిస్తున్నాయి. మ‌రి ఈ వార్త‌ల‌పై చిత్ర యూనిట్ ఎలా స్పందిస్తుందో చూడాలి.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3Hi10bU
v

ఫ్యాన్స్‌కు మెగా ట్రీట్‌.. ఊర‌మాస్ లుక్‌లో చిరంజీవి.. ‘భోళా శంక‌ర్’ మోష‌న్ పోస్ట‌ర్ విడుద‌ల‌

మెగాస్టార్ తన ఫ్యాన్స్, సినీ ప్రేక్షకులకు కొత్త సంవత్సరం ట్రీట్‌ను ఇచ్చారు. ప్ర‌స్తుతం వ‌రుస సినిమాలు చేస్తున్న మెగాస్టార్ చిరంజీవి.. లిస్టులో భోళా శంక‌ర్ సినిమా కూడా ఉన్న సంగ‌తి తెలిసిందే. ఎ.కె.ఎంట‌ర్‌టైన్మెంట్స్ బ్యాన‌ర్‌పై అనీల్ సుంక‌ర ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. మెహ‌ర్ ర‌మేష్ ద‌ర్శ‌కుడు. ప్ర‌స్తుతం సినిమా సెకండ్ షెడ్యూల్ చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో ఉంది. ఈ సినిమా నుంచి కొత్త సంవ‌త్స‌రం సంద‌ర్భంగా చిత్ర యూనిట్ మోష‌న్ పోస్ట‌ర్‌ను విడుద‌ల చేసింది. మోష‌న్ పోస్ట‌ర్‌లో చిరంజీవి యంగ్ లుక్‌లో ఆక‌ట్టుకుంటున్నారు. చేతికి క‌డియం, తాయెత్తులు క‌ట్టుకుని ప‌క్కా ఊర‌మాస్ లుక్‌లో క‌నిపిస్తున్నారు. సిస్ట‌ర్ సెంటిమెంట్ నేప‌థ్యంలో సాగే సినిమా ఇది. ఇందులో రివేంజ్ డ్రామా కూడా న‌డుస్తుంటుంది. చిరంజీవి చెల్లెలు పాత్ర‌లో ప్ర‌ముఖ హీరోయిన్ కీర్తి సురేష్ న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే. అలాగే చిరంజీవికి జోడీగా మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా భాటియా క‌నిపించ‌నుంది. కోల్‌క‌త్తా బ్యాక్‌డ్రాప్‌లో సాగే చిత్ర‌మిది. ఇందులో చిరంజీవి రెండు షేడ్స్ ఉన్న పాత్ర‌లో క‌నిపించ‌నున్నారు. అందులో ఓ మాస్ లుక్‌కి సంబంధించిన మోష‌న్ పోస్ట‌ర్‌ను కొత్త సంవ‌త్స‌రం సంద‌ర్భంగా త‌యారు చేసి చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది. ఈ సినిమాలో కీర్తి సురేష్‌కు కాబోయే భ‌ర్త పాత్ర‌లో హీరో నాగ‌శౌర్య క‌నిపించ‌నున్నార‌నే వార్త‌లు కూడా రీసెంట్‌గా వినిపించాయి. త‌మిళ చిత్రం వేదాళంకు ఇది రీమేక్‌. అజిత్ హీరోగా నటించిన ఈ సినిమాను తెలుగులో చిరంజీవి హీరోగా పేరుతో రీమేక్ చేస్తున్నారు. వచ్చే ఏడాది వేసవిలో సినిమాను విడుదల చేస్తామని ఇప్ప‌టికే నిర్మాత‌లు ప్ర‌క‌టించారు. మ‌రో వైపు బాబీ డైరెక్ష‌న్‌లోనూ రూపొందుతోన్న చిత్రంలో చిరంజీవి హీరోగా న‌టిస్తున్నారు. మోహ‌న్ రాజా ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న గాడ్ ఫాద‌ర్ షూటింగ్ సెట్స్‌పై ఉంది. ఇవ‌న్నీ కాకుండా వెంకీ కుడుముల ద‌ర్శ‌క‌త్వంలోనూ ఓ సినిమా చేయ‌డానికి చిరం.జీవి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేశారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3sOcfF5
v

నిర్మాత‌కు అండ‌గా నాని.. రెమ్యున‌రేష‌న్ విష‌యంలో డేరింగ్ స్టెప్‌.. మిగ‌తా హీరోలు చేస్తారా ?

నేచుర‌ల్ స్టార్ క‌థానాయ‌కుడిగా న‌టించిన చిత్రం ‘శ్యామ్ సింగరాయ్’. క్రిస్మస్ సందర్భంగా సినిమా విడుదలైంది. నాని కెరీర్లోనే భారీ బడ్జెట్ మూవీగా తెరకెక్కింది. సినీ వర్గాల్లో వినిపిస్తోన్న సమాచారం మేరకు దాదాపు అరవై కోట్లకు పైగానే ఖర్చు పెట్టినట్లు టాక్. విడుదల తర్వాత పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. అయితే వ‌సూళ్ల ప‌రంగా సినిమాకు రూ.22 కోట్లు మాత్ర‌మే వ‌చ్చాయి. ఏపీలో నెల‌కొన్న థియేట‌ర్ ప‌రిస్థితులు, త‌గ్గించిన టికెట్ రేట్స్ అన్నింటి కార‌ణంగా శ్యామ్ సింగ‌రాయ్ క‌లెక్ష‌న్స్‌పై ప్ర‌భావాన్ని చూపాయ‌న‌డంలో సందేహం లేదు. శ్యామ్ సింగ‌రాయ్‌ ఇలాంటి ప‌రిస్థితుల్లో విడుద‌లై మంచి టాక్‌తో మంచి వ‌సూళ్ల‌ను సంపాదించుకున్నా, నిర్మాత‌కు ఇబ్బందే క‌దా. ఈ విష‌యాన్ని హీరో నాని గుర్తించారు. ఎందుకంటే ఆయ‌న కూడా ఓ నిర్మాతే మ‌రి. అందుక‌నే ఆయ‌న రెమ్యున‌రేష‌న్‌లో ఎక్కువ భాగాన్ని వెన‌క్కి ఇచ్చేశాడ‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. సినీ వ‌ర్గాల్లో వినిపిస్తోన్న గుస‌గుస‌ల మేర‌కు నాని తను తీసుకున్న రెమ్యునరేషన్‌లో రూ.5కోట్ల‌ను నిర్మాత‌కు తిరిగి ఇచ్చేశార‌ట‌. రెమ్యున‌రేష‌న్ తీసుకున్న త‌ర్వాత నిర్మాత‌ల‌ను హీరోలు పెద్ద‌గా ప‌ట్టించుకోరు. అలాంటిది నిర్మాత కోసం నాని రెమ్యున‌రేష‌న్‌లో కొంత భాగాన్ని వెన‌క్కి ఇవ్వ‌డం చాలా మంచి విష‌య‌మ‌ని అంద‌రూ అనుకుంటున్నారు. ఇప్పుడున్న కోవిడ్ ప‌రిస్థితులు, ఏపీలో సినిమా టికెట్ త‌గ్గ‌డం వంటి కార‌ణాల‌తో నిర్మాత‌లు సినిమాలు రిలీజ్ చేయ‌డానికి వెనుకా ముందు అవుతున్నారు. ఇలాంటి నేప‌థ్యంలో సినిమాను ధైర్యంగా విడుద‌ల చేసిన నిర్మాత‌ల‌కు త‌న వంతు స‌పోర్ట్ అవ‌స‌రం అని భావించి నాని అలా చేశార‌ట. మ‌రి మిగ‌తా హీరోలు కూడా అలా చేస్తారా? అని నాని అభిమాల‌ను వేస్తున్న ప్ర‌శ్న‌. ఓ ర‌కంగా వారు వేస్తున్న ప్ర‌శ్న కూడా నిజ‌మే. ఎందుకంటే ఇలాంటి ప‌రిస్థితుల్లో సినిమా ఇండ‌స్ట్రీ నిల‌బ‌డాలంటే హీరోలు స‌హా అంద‌రూ నిర్మాత‌ల‌కు అండ‌గా నిల‌బ‌డాలి. దేవ‌దాసీ వ్య‌వ‌స్థ‌పై ధైర్యంగా పోరాటం చేసిన వ్య‌క్తి క‌థాంశంతో శ్యామ్ సింగ‌రాయ్ సినిమాను రూపొందించారు. సాయి ప‌ల్ల‌వి, కృతిశెట్టి, మ‌డోన్నా హీరోయిన్స్‌గా న‌టించారు. రాహుల్ సాంకృత్యాన్ ద‌ర్శ‌కుడు. నిహారిక ఎంట‌ర్‌టైన్మెంట్స్ బ్యాన‌ర్‌పై వెంక‌ట్ బోయ‌న‌ప‌ల్లి ఈ చిత్రాన్ని నిర్మించారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3mIGVna
v

ఫ్యాన్స్‌కు ‘భీమ్లా నాయ‌క్’ ట్రీట్‌.. ‘లాలా భీమ్లా..’ డీజే వెర్ష‌న్ రిలీజ్‌.. సూప‌ర్బ్ రెస్పాన్స్‌

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్, రానా ద‌గ్గుబాటి హీరోలుగా రూపొందుతోన్న లేటెస్ట్ మూవీ ‘భీమ్లా నాయ‌క్‌’. ఈ సినిమాను వ‌చ్చే ఏడాది సంక్రాంతికి విడుద‌ల‌వుతుంద‌ని ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఫ్యాన్స్ ఎంతో ఆతృత‌గా, ఆశ‌గా, ఆస‌క్తిగా ఎదురు చూశారు. అయితే పాన్ ఇండియా సినిమాలైన RRR, రాధే శ్యామ్ వంటి సినిమాలు ఉండ‌టంతో బాక్సాఫీస్ ద‌గ్గ‌ర పోరు ఇబ్బందిగా మారి క‌లెక్ష‌న్స్‌పై ప్ర‌భావం చూపే అవ‌కాశం ఉండ‌టంతో ప‌వ‌న్ క‌ళ్యాణ్ పెద్ద మ‌న‌సు చేసుకుని త‌న భీమ్లా నాయ‌క్‌ను శివ రాత్రి సంద‌ర్భంగా ఫిబ్ర‌వ‌రి 25న విడుద‌ల చేయ‌డానికి నిర్ణ‌యించుకున్నారు. త‌మ అభిమాన స్టార్ హీరో మూవీ అనుకున్న తేదికి రిలీజ్ కాక‌పోవ‌డంతో ప‌వ‌న్ ఫ్యాన్స్ కాస్త నిరాశ‌కు లోన‌య్యారు. అయితే వారిని కూల్ చేయ‌డానికి భీమ్లా నాయ‌క్ యూనిట్ ప్లాన్ చేసి, కొత్త సంవ‌త్స‌రం సంద‌ర్భంగా ఈ సినిమాలో పెద్ద హిట్ అయిన పాట ‘లాలా భీమ్లా..’ సాంగ్‌కు డీజే వెర్షన్‌ను రూపొందించి విడుద‌ల చేసింది. విడుద‌లైన కొన్ని నిమిషాల‌కే ఈ పాట మిలియ‌న్ వ్యూస్ దిశ‌గా ప‌రుగులు తీస్తోంది. పాట‌కు ఒక ల‌క్షా డెబ్బై వేలు లైక్స్ కూడా వ‌చ్చాయి. ఈ పాట‌తో ప‌వ‌న్ ఫ్యాన్స్ కొత్త సంవ‌త్స‌రం హుషారు వ‌చ్చింది. మ‌ల‌యాళ చిత్రం అయ్య‌ప్ప‌నుమ్ కోశియ‌మ్ సినిమాకు రీమేక్‌గా భీమ్లా నాయ‌క్ సినిమాను రూపొందిస్తున్నారు. ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై సూర్య దేవ‌ర నాగ వంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సాగ‌ర్ కె.చంద్ర ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు, ర‌చ‌యిత త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందించ‌డంతో పాటు లాలా భీమ్లా సాంగ్‌ను కూడా రాయ‌డం విశేషం. ప‌వ‌న్ క‌ళ్యాణ్ జోడీగా ఇందులో నిత్యా మీన‌న్ న‌టిస్తే.. రానా ద‌గ్గుబాటి జోడీగా సంయుక్తా మీన‌న్ న‌టించారు. ఇప్పటి వరకు ఈ సినిమా నుంచి విడుదలైన పాటలు, ప్రోమోలకు ప్రేక్షకుల నుంచి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. పవన్ ఇందులో పాత్రలో నటిస్తే.. డానియల్ శేఖర్ అనే పాత్రలో రానా దగ్గుబాటి నటించారు. ఇద్దరు వ్యక్తుల ఇగోల కారణంగా వారి జీవితాల్లో చోటు చేసుకున్న మార్పులే ఈ సినిమా కథాంశం.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/31hilCu
v

అదృష్టం, కష్టం కాదు.. నన్ను నేను నమ్ముకుంటా: 'గాలోడు' సుడిగాలి సుధీర్!!

'జబర్దస్త్' షోతో కమెడియన్‌గా తనకంటూ ప్రత్యేకమైన ఫాలోయింగ్ కూడగట్టుకున్నాడు . బుల్లితెరపై రాణిస్తూ కూడా స్టార్ హీరో రేంజ్ పాపులారిటీ సంపాదించవచ్చు అని నిరూపించిన ఆయన ఆ క్రేజ్ క్యాచ్ చేసుకుంటూ వీలు చిక్కినప్పుడల్లా వెండితెరపై అలరిస్తున్నాడు. మొదట చిన్న చిన్న పాత్రలు చేస్తూ వచ్చిన ఈ సుడిగాడు హీరో అవతరమెత్తి 'గాలోడు' మూవీ చేస్తున్నాడు. బుల్లితెరపై వచ్చిన క్రేజ్ వెండితెరపై కూడా రావాలని ఆరాటపడుతూ విలక్షణ కథలతో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు. ఈ క్రమంలోనే 'గాలోడు' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అయ్యాడు. తాజాగా ఈ సినిమా టీజర్ రిలీజ్ చేయగా ఇందులో డిఫరెంట్ మాస్ లుక్‌లో కనిపించి సడెన్ షాకిచ్చాడు ఈ సుడిగాలి సుధీర్. కేవలం 52 సెకనుల నిడివితో కట్ చేసిన ఈ టీజర్‌లో సుధీర్ లుక్స్, హీరోయిజం బాగా ఎలివేట్ చేసి చూపించారు. "అదృష్టాన్ని నమ్ముకున్నవాడు కష్టాల పాలవుతాడు .. కష్టాన్ని నమ్ముకున్నవాడు అదృష్టవంతుడవుతాడు. కానీ నేను ఈ రెండిటినీ నమ్ముకోను.. నన్ను నేను నమ్ముకుంటాను" అనే డైలాగ్‌తో అదరగొట్టేశాడు సుధీర్. ఇది పక్కా మాస్ మూవీ అని టీజర్ ద్వారా చెప్పకనే చెప్పిన గాలోడు యూనిట్ స్పెషల్ విజువల్స్‌తో సినిమాపై ఆసక్తి పెంచేశారు. ఈ సినిమాలో మాస్ యాక్షన్ సీన్స్ మెండుగా ఉంటాయని, ఇది సుధీర్ కెరీర్‌కి టర్నింగ్ పాయింట్ అవుతుందని ఈ వీడియో చూస్తుంటే అర్థమవుతోంది. రాజశేఖర్ రెడ్డి పులిచర్ల దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాను సంస్కృతి ఫిలిమ్స్ బ్యానర్‌పై రూపొందిస్తున్నారు. చిత్రంలో ఇతర ముఖ్య పాత్రల్లో సప్తగిరి, పృథ్వీ కనిపించనున్నారు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3sMTQbG
v

ఆ వంద కోట్లు ఎక్కడున్నాయి? తాజా ఇష్యూపై రామ్ చరణ్ ఫన్నీ రియాక్షన్

సినీ ఇండస్ట్రీలో హీరోహీరోయిన్ల రెమ్మ్యూనరేషన్ మ్యాటర్స్ ఎప్పుడూ హాట్ టాపికే. హీరోగాని, హీరోయిన్ గాని ఓ సినిమాతో భారీ హిట్ రాబట్టారంటే చాలు వారి వారి రెమ్మ్యూనరేషన్ మ్యాటర్స్ వెలుగులోకి వస్తుంటాయి. కొందరు డైరెక్టుగా పారితోషికం పెంచేస్తే.. ఇంకొందరి విషయంలో మాత్రం ఓ రేంజ్ రూమర్స్ పుట్టుకొస్తుంటాయి. గత కొన్ని రోజులుగా మెగా పవర్ స్టార్ విషయంలో అదే జరుగుతోంది. రామ్ చరణ్ రెమ్మ్యూనరేషన్ మ్యాటర్ సినీ వర్గాల్లో హాట్ టాపిక్ అవుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ ఇష్యూపై ఫన్నీ రియాక్షన్ ఇచ్చారు చెర్రీ. విడుదలకు ముందే రామ్ చరణ్ రేంజ్ పెరిగిందని.. ఆయన తన తదుపరి సినిమాకు వంద కోట్ల పారితోషికం తీసుకుంటున్నాడంటూ వార్తలు షికారు చేస్తున్నాయి. దీంతో ఇదే విషయమై చెర్రీని ఓ మీడియా వారు ప్రశ్నించగా ఆయన ఫన్నీగా రియాక్ట్ అయ్యారట. అసలు వంద కోట్లు ఎక్కడున్నాయి? ఉన్నా కూడా నాకెవరిస్తారు? అని రిటర్న్ క్వశ్చన్ వేస్తూ తన రెమ్మ్యూనరేషన్ విషయమై వస్తున్న వార్తలన్నీ పుకార్లేనని కొట్టిపారేశారట. ప్రస్తుతం రామ్ చరణ్ RRR సినిమా ప్రమోషన్స్‌తో బిజీ బిజీగా ఉన్నారు. దర్శక ధీరుడు రాజమౌళి రూపొందించిన ఈ సినిమా జనవరి 7న పలు భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ భారీ చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్ మరో హీరోగా నటించగా.. ఆలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా నటించారు. దీంతో పాటు మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'ఆచార్య' సినిమాలో కీలకపాత్రలో నటిస్తున్నారు రామ్ చరణ్. అలాగే బిగ్గెస్ట్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ అయిన డైరెక్టర్ శంకర్‌ దర్శకత్వంలో తన 15వ ప్రాజెక్టు చేస్తున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/32M63lS
v

Thursday 30 December 2021

మా నాన్నని మోసం చేశా.. ప్రేమ మైకంలో కళ్ళు మూసుకుపోయి అలా! యాంకర్ లాస్య కన్నీటి పర్యంతం

బుల్లితెర యాంక‌ర్‌గా లాస్యది ఓ ప్రత్యేకమైన జర్నీ. 'సంథింగ్ స్పెషల్' రూపంలో యాంకరింగ్ చేయడంలో కొత్త కోణాన్ని ఆవిష్కరించింది లాస్య. అయితే ఆ తర్వాత క్రమంగా బుల్లితెరకు దూరమైన లాస్య తిరిగి ఈ మధ్య కెమెరా ముందుకొస్తోంది. బిగ్ బాస్ సీజన్ 4లో పాల్గొని త‌నదైన ఆట, మాట‌ తీరుతో అట్రాక్ట్ చేసిన ఆమె.. వీలు కుదిరినప్పుడల్లా స్పెషల్ ప్రోగ్రామ్స్‌లో తళుక్కుమంటోంది. ఈ నేపథ్యంలోనే న్యూ ఇయర్ స్పెషల్ ఎపిసోడ్ 'పెళ్ళాం వద్దు పార్టీ ముద్దు' షోకి తన భర్తతో సహా విచ్చేసిన లాస్య వేదికపై కన్నీటి పర్యంతమైంది. తాజాగా ఈ స్పెషల్ ప్రోగ్రామ్ ప్రోమో విడుదల చేయగా.. ఈ వీడియోలో రష్మీ గౌతమ్ డాన్స్ పెర్ఫార్మన్స్, కన్నీళ్లు పెట్టుకున్న సీన్స్ హైలైట్ అయ్యాయి. తన ప్రేమకు తండ్రి నుంచి అంగీకారం లభించకపోవడంతో ఇంట్లో నుంచి వెళ్లిపోయిన అమ్మాయిగా రష్మీ గౌతమ్ కనిపించింది. 'నాన్నా.. నేనొక అబ్బాయిని ప్రేమిస్తున్నాను. మీరు ఒప్పుకుంటే తననే పెళ్లి చేసుకుంటా' అని రష్మీ అంటే, 'నా గురించి నీకు తెలియదు. పరువు కోసం నేను ప్రాణం ఇవ్వడానికి అయినా తీయడానికి అయినా నేను సిద్ధం' అంటూ నాన్న పాత్ర పోషించిన 'రాకెట్' రాఘవ 'అనడం, ఆ తర్వాత 'నాన్న నిన్ను అర్థం చేసుకుంటారని నేను చాలా ట్రై చేశాను. ఐ యామ్ సారీ నాన్న!' అని చెబుతూ రష్మీ గౌతమ్ ఇంట్లో నుంచి వెళ్లిపోవడం చూపించారు. ఇది చూసి లాస్య ఒక్కసారిగా ఎమోషనల్ అయింది. తాను కూడా ఇలాగే చేశానని చెబుతూ ఓపెన్ అయింది. "నేను అలాగే చేసి వచ్చాను మా నాన్నకు! మా నాన్న గుర్తొచ్చారు" అంటూ కన్నీళ్లు పెట్టుకున్న లాస్య.. మనల్ని ప్రేమించే వాళ్ళను ఎంత బాధ పెడుతున్నాం అనేది తెలుసుకోం. ఎందుకంటే అప్పుడు కళ్లు మూసుకుపోయి ఉంటాయి కదా.. అప్పుడు ప్రేమలో ఉంటాం కదా! నేను అలాగే చేశాను. ఇప్పుడు రష్మీ పెర్ఫార్మెన్స్ చూస్తుంటే మా నాన్న గుర్తొచ్చారంటూ కన్నీళ్లు పెట్టుకుంది లాస్య.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/31buMQ2
v

LIGER Glimpse: వి ఆర్ ఇండియన్స్ అంటూ గర్జించిన విజయ్ దేవరకొండ.. వీడియో అదుర్స్

హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందుతున్న 'లైగర్' మూవీ నుంచి న్యూ ఇయర్ గిఫ్ట్ ఇచ్చారు మేకర్స్. చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా వదిలి విజయ్ దేవరకొండ అభిమానుల్లో జోష్ నింపారు. పూరీ మార్క్ యాక్షన్ సన్నివేశాలతో కట్ చేసిన ఈ వీడియో విడుదలైన క్షణాల్లోనే వైరల్‌గా మారింది. ఈ వీడియోలో ఇండియన్ బాక్సర్‌గా విజయ్ దేవరకొండ పవర్‌ఫుల్ ఎంట్రీ హైలైట్ అయింది. ముంబై చాయ్ వాలా బాక్సింగ్ పోటీకి వెళ్లి 'వి ఆర్ ఇండియన్స్' అంటూ గొంతెత్తి చెప్పడం సినిమాపై ఉన్న ఆసక్తిని రెట్టింపు చేస్తోంది. పవర్‌‌ఫుల్‌ బాడీతో విజయ్ దేవరకొండ రింగ్‌ లోకి దిగే సీన్‌ రోమాలు నిక్కబొడిచేలా ఉంది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్, విజయ్ మ్యానరిజం ఈ వీడియోలో స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచాయి. మొత్తానికి విజయ్ దేవరకొండ కొత్త సంవత్సర కానుక అదిరిందని చెప్పుకోవచ్చు. ప్యాన్ ఇండియా మూవీగా రూపొందుతున్న లైగర్ సినిమాకు 'సాలా క్రాస్ బ్రీడ్' అనే పవర్‌ఫుల్ ట్యాగ్ లైన్‌ పెట్టారు పూరి. బాక్సింగ్ నేపథ్యంలో భారీ రేంజ్‌లో ఈ సినిమాను రూపొందించారని తాజాగా విడుదలైన గ్లింప్స్‌తో అర్థమవుతోంది. చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్‌గా నటిస్తుండగా.. బాక్సింగ్ దిగ్గజం మైక్ టైసన్‌ను కీలక పాత్ర కోసం తీసుకున్నారు. సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ మరో ముఖ్యపాత్రలో కనిపించనుంది. బాలీవుడ్‌లో ప్రముఖ నిర్మాణ సంస్థ అయిన ధర్మ ప్రొడక్షన్స్‌తో కలిసి పూరి కనెక్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ లైగర్ సినిమా నిర్మాణంలో ఛార్మి భాగమైంది. వచ్చే ఆగస్టు 25వ తేదీన ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ చేయబోతున్నారు. ఈ మూవీపై విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ ఓ రేంజ్ అంచనాలు పెట్టుకున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3FUnH5q
v

అఖండ OTT స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్! టీవీలో కూడా.. గెట్ రెడీ ఆడియన్స్

నందమూరి నటసింహం హీరోగా మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన సినిమా ''. డిసెంబర్ 2వ తేదీన విడుదలైన ఈ సినిమా తొలిరోజే పాజిటివ్ టాక్ తెచ్చుకొని థియేటర్స్‌లో సక్సెస్‌ఫుల్ రన్ కొనసాగిస్తోంది. కరోనా విపత్కర పరిస్థితుల తర్వాత వచ్చిన పెద్ద సినిమా ఇదే కావడం, పైగా ఈ సినిమా భారీ సక్సెస్ కావడంతో చిత్రసీమకు పూర్వ వైభవం వచ్చినట్లయింది. ఈ చిత్రంలో పూనకాలు తెప్పించే నటనా ప్రతిభ కనబర్చారు బాలయ్య బాబు. దీంతో నందమూరి అభిమాన లోకం ఈ సినిమా సక్సెస్ ఎంజాయ్ చేస్తుండగా చిత్రానికి సంబంధించి మరో ఆసక్తికర వార్త బయటకొచ్చింది. అఖండ డిజిటల్ రైట్స్‌ డిస్నీ హాట్ స్టార్ చేతిలో ఉన్న సంగతి తెలిసిందే. అయితే థియేటర్ రన్ క్రమంగా స్లో డౌన్ అవుతుండటంతో ఈ సినిమాను OTTలో రిలీజ్ చేయాలని ఫిక్సయ్యారట. సంక్రాంతి కానుకగా జనవరి 12 నుంచి అందుబాటులోకి తీసుకురావాలని ప్లాన్ చేశారట. అతి త్వరలో దీనిపై అధికారిక ప్రకటన కూడా రానుందని అంటున్నారు. అదేవిధంగా అఖండ టెలివిజన్ ప్రిమియర్ విషయంలో కూడా ఓ డేట్ ప్రచారంలోకి వచ్చింది. శాటిలైట్స్ రైట్స్ దక్కించుకున్న స్టార్ మా వారు ఈ 'అఖండ' సినిమాను ఫిబ్రవరి 27న ప్రసారం చేయనున్నట్లు తెలుస్తోంది. బోయపాటి- బాలకృష్ణ కాంబోలో వస్తున్న హాట్రిక్ మూవీగా భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ మూవీ ఆరంభం నుంచే పాజిటివ్ టాక్‌ తెచ్చుకొని నిర్మాతలకు లాభాల పంట పండిస్తోంది. విడుదలైన కొద్ది రోజుల్లోనే టార్గెట్‌ దాటేసి సూపర్ డూపర్ హిట్‌గా నిలిచింది. ఇప్పటివరకు ప్రపంచ వ్యాప్తంగా ఈ మూవీ 70.61 కోట్ల షేర్, 124.45 కోట్లు గ్రాస్‌ వసూళ్లు రాబట్టింది అఖండ. ఇకపోతే అఖండ సక్సెస్‌తో జోష్‌లో ఉన్న బాలయ్య బాబు.. తన తదుపరి సినిమాను 'క్రాక్' డైరెక్టర్ గోపీచంద్‌ మలినేనితో చేయనున్నారు. శృతి హాసన్ హీరోయిన్‌గా నటించనున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ నిర్మించనుంది. అతి త్వరలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3mGQYJq
v

RRR: టైటిల్ సీక్రెట్ రివీల్.. అందుకే ఆ పేరు పెట్టామంటూ రాజమౌళి ఓపెన్

ఇండియాస్ మోస్ట్ అవైటెడ్ మూవీ ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. భారీ బడ్జెట్ కేటాయించి ఎంతో గ్రాండ్‌గా తెరక్కెక్కించిన ఈ సినిమాను జనవరి 7న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. ఈ నేపథ్యంలో డైరెక్టర్ సినిమా పట్ల ఉన్న క్రేజ్ రెట్టింపు చేస్తూ వరుస అప్‌డేట్స్ ఇస్తున్నారు. అన్ని భాషల్లోని ఆడియన్స్‌ని అట్రాక్ట్ చేస్తూ తనదైన ప్రమోషన్ స్ట్రాటజీతో వెళ్తున్నారు. ఈ క్రమంలో ఓ హిందీ షోలో పాల్గొన్న రాజమౌళి.. RRR టైటిల్ సీక్రెట్స్ వెల్లడించారు. ఈ మూవీ ప్రారంభించినపుడు ఏ టైటిల్‌ పెట్టాలో అర్థం కాలేదని, ఆ తర్వాత కొన్ని రోజులకు RRR అనుకున్నామని రాజమౌళి తెలిపారు. , , రాజమౌళి పేర్లు కలిసొచ్చేలా ఈ ప్రాజెక్టును RRR అని పిలవాలనుకున్నామని, అదే కోణంలో RRR హ్యాష్‌ట్యాగ్‌తో సినిమాకు సంబంధించిన అప్‌డేట్స్‌ ఇచ్చామని, అయితే ఈ పేరుకు అన్ని భాషల ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభించడంతో సినిమాకు అదే పేరు కన్ఫర్మ్ చేశామని రాజమౌళి చెప్పారు. RRR అంటే 'రౌద్రం రణం రుథిరం' అని ఫుల్ చెప్పారు జక్కన్న. డీవీవీ దానయ్య సమర్పణలో భారీ రేంజ్‌లో ఈ మూవీ రూపొందించారు. ఇప్పటికే విడుదల చేసిన అన్ని అప్‌డేట్స్ రికార్డులు తిరగరాస్తూ మూవీ రిలీజ్‌కి ముందే RRR సత్తా ఏంటనేది తెలియజేశాయి. పీరియాడికల్ డ్రామాగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాలో కొమురం భీం పాత్రలో ఎన్టీఆర్, అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్ చరణ్ నటించారు. ఆలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా నటించగా అజయ్ దేవగన్, శ్రీయ కీలకపాత్రలు పోషించారు. ఈ సినిమా వాయిదా పడుతుందనే రూమర్స్ షికారు చేస్తున్నప్పటికీ అలాంటిదేమీ లేదని అంటోంది చిత్రయూనిట్.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3mGJ1UA
v

ఏజ్ ఎంత అని అడిగాడు బన్నీ.. ఏంటి ఇలా అడిగాడు అనుకుని నాకు ఇద్దరు కూతుళ్లన్నా..: పుష్ప తల్లి కల్పలత

‘పుష్ప’ సినిమాలో అల్లు అర్జున్‌కి తల్లిగా అద్భుత నటనతో ఆకట్టుకున్నారు . బన్నీ కాంబినేషన్స్‌లో వచ్చే మదర్ సెంటిమెంట్ సీన్లు సినిమాకే హైలైట్ అయ్యాయి. దాదాపుగా 50 పైగా సినిమాలు.. 10 సీరియల్స్‌లో నటించినా రాని గుర్తింపు పుష్ప సినిమాతో అందిపుచ్చుకుంది కల్పలత. బన్నీకి తల్లి పాత్రలో ఒదిగిపోయిందామె. ఎమోషనల్ సీన్లలో కళ్లు చెమ్మగిల్లేట్టు చేసింది. అయితే సినిమాలో పుష్పరాజ్‌కి తల్లి క్యారెక్టర్ చేసినప్పటికీ.. ఏజ్‌లో పుష్పరాజ్ కంటే పెద్ద ఎక్కువ కాదంటూ.. తన ఏజ్‌పై అల్లు అర్జున్ తనతో జరిపిన చర్చనంతా చెప్పుకొచ్చిందామె. ‘పుష్ప’ కారు కొని ఇంటికి తీసుకుని వచ్చే సీన్ షూట్‌లో బన్నీ నన్ను.. ‘అమ్మా మీ ఏజ్ ఎంత?’ అని అడిగాడు.. నేను షాక్ అయ్యా.. ఏంటి ఇలా అడిగాడు అనుకున్నా.. సార్ అని అనేసరికి.. మీ ఏజ్ ఎంత అని అడుగున్నా.. కంగారు పడమాకు అన్నారు. సార్ నాకు 42 అనేసరికి .. హా 42 ఏళ్లేనా?? అని ఆశ్చర్యంగా చూసి.. ఎంతమంది పిల్లలని అడిగారు. ఇద్దరు పిల్లలు అనేసరికి.. వాళ్లు ఏం చదువుకుంటున్నారని అడిగారు. సార్ వాళ్లిద్దరూ జాబ్ అనేసరికి.. ఆయన ఎక్స్ ప్రెషన్ ఛేంజ్ అయిపోయింది. జాబ్ చేయడం ఏంటమ్మా.. ఇంతకీ పెళ్లి ఎప్పుడైంది అని అడిగారు. 14 ఏళ్లకే పెళ్లైందని చెప్పాను. ఇంతలో సుకుమార్ సార్ వచ్చేసరికి షాట్ చేశాం.. ఆ షాట్ అయిపోయిన తరువాత మళ్లీ బన్నీ సార్.. నా ఏజ్ గురించే మాట్లాడారు. నాకు నీకు ఏజ్‌లో ఎంత తేడానో తెలుసా? రెండు సంవత్సరాలే తేడా.. అని అన్నారు. ఆయనతో ఏం మాట్లాడాలో తెలియలేదు. ఎందుకంటే ఆయన వయసులో నాకంటే పెద్దతను కాకపోయినా.. అనుభవంలో పెద్దవాడు. అందుకే ఓకే సార్ ఓకే సార్ అనేదాన్ని. ఆయన నా ఏజ్ తలుచుకుని నావైపు చూస్తాడు నవ్వుతాడు.. చూస్తాడు నవ్వుతాడు షూట్‌లో ఇలాగే జరిగేది. మరి ఆయన ఎందుకు అలా అనిపించిందో తెలియదు కానీ.. సుకుమార్ సార్ వచ్చేసరికి డార్లింగ్.. మా అమ్మకి నాకు రెండు సంవత్సరాలే తేడా తెలుసా? అని చెప్పారు. అవునయ్యా.. ఇప్పుడు నన్నేం చేయమంటావ్.. నా వయసు చెప్పమంటావా? అని సుకుమార్ సార్ నవ్వేవారు. ఎక్కువ డిస్కషన్ మా ఏజ్‌ గురించే జరిగేది.. లొకేషన్ మొత్తం సందడి సందడిగా ఉండేది. పుష్ఫ సినిమాలో నాకు బన్నీకి మధ్య లెంగ్తీ డైలాగ్‌లు ఉన్నాయి.. చివరికి ట్రిమ్ చేసీ చేసీ.. చిన్నగా అయ్యాయి’ అంటూ చెప్పుకొచ్చారు కల్పలత. పుష్ప సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా పాపులర్ అవుతున్న కల్పలత స్వస్థలం తెలంగాణలోని ఖమ్మంజిల్లా మణుగూరు. పదో తరగతిలోనే కల్పలతకి పెళ్లైంది. ఆమె భర్త రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుండగా.. వీరికి ఇద్దరు కూతుళ్లు. వీళ్లిద్దరూ అమెరికాలో చదువుకుంటున్నారు. ఇప్పుడు పుష్ప చిత్రంలో నటించిన కల్పలత.. అంతకుముందు బాహుబలి, వకీల్ సాబ్, ఎక్ప్‌ ప్రెస్ రాజా, నేనే రాజు నేనే మంత్రి, అర్జున్ రెడ్డి, భాగమతి, హిట్ వంటి విజయవంతమైన చిత్రాల్లో నటించింది. అయితే పుష్ప చిత్రంతో ఆమెకు గుర్తింపు లభించింది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3pEZYkb
v

NBK 107.... బాలయ్యను ఢీ కొట్టనున్న సీనియర్ హీరో!

2021 ఏడాది బాల‌కృష్ణ అభిమానుల‌కు పెద్ద పండ‌గే అని చెప్పాలి. ఎందుకంటే ఆయ‌న హీరోగా న‌టించిన అఖండ చిత్రం బ్లాక్ బ‌స్ట‌ర్ అయ్యింది. ఈ స‌క్సెస్ వారిలో స‌రికొత్త ఎన‌ర్జీని నింపింద‌న‌డంలో సందేహం లేదు. ఇదే స్పీడులో ఇప్పుడు బాల‌కృష్ణ త‌న త‌దుప‌రి చిత్రాన్ని సెట్స్ పైకి తీసుకెళ్ల‌డానికి రెడీ అయిపోయారు. ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేక‌ర్స్ బ్యాన‌ర్‌పై NBK 107గా ఈ సినిమాను తెర‌కెక్కిస్తున్నారు. గోపీచంద్ మ‌లినేని ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఇటు బాల‌కృష్ణ అఖండ‌తో స‌న్సేష‌నల్ హిట్ కొట్ట‌గా, గోపీచంద్ మ‌లినేని కూడా ఈ ఏడాది క్రాక్‌తో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ కొట్టాడు. ఇక నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ పుష్ప ది రైజ్‌తో మ‌రో విజ‌యాన్ని ద‌క్కించుకుంది. ఇలా మూడు హిట్ కాంబినేష‌న్స్ చేస్తున్న సినిమా కావ‌డంతో సినిమాపై భారీ అంచ‌నాలున్నాయి. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. లేటెస్ట్ స‌మాచారం మేర‌కు ఈ సినిమాలో సీనియ‌ర్ హీరో, క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్ విల‌న్‌గా క‌నిపించ‌బోతున్నార‌ట‌. ఇంత‌కీ ఎవ‌రా సీనియ‌ర్ హీరో అని అనుకుంటున్నారా? జ‌గ‌ప‌తిబాబు కాదులెండి.. యాక్ష‌న్ కింగ్ అర్జున్‌. తెలుగు, త‌మిళ‌, క‌న్న‌డ సినీ ప్రేక్ష‌కుల‌కు సుప‌రిచితుడైన అర్జున్ ఈ మ‌ధ్య క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌గా, విల‌న్‌గానూ న‌టిస్తూ ఆక‌ట్టుకుంటున్నారు. నితిన్ హీరోగా చేసిన లై, విశాల్ మూవీ అభిమన్యుడు చిత్రాల్లో విల‌న్‌గా ఆక‌ట్టుకున్న అర్జున్‌.. ఇప్పుడు సూప‌ర్ స్టార్ మ‌హేష్ తాజా చిత్రం స‌ర్కారు వారి పాట‌లోనూ విల‌న్‌గా క‌నిపించ‌నున్నార‌నే సంగ‌తి తెలిసిందే. కాగా.. ఇప్పుడు అర్జున్‌ లిస్టులో మ‌రో క్రేజీ ప్రాజెక్ట్ చేరింది. అదే . జ‌న‌వ‌రి 20 నుంచి NBK 107 రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభం కానుంది. శ్రుతి హాస‌న్ హీరోయిన్‌గా న‌టించ‌నుంది. ఈ చిత్రానికి వేట‌పాలెం అనే టైటిల్ ప‌రిశీల‌న‌లో ఉన్న‌ట్లు వార్త‌లు సినీ వ‌ర్గాల్లో హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి. మ‌రో వైపు బాల‌కృష్ణ తెలుగు ఓటీటీ ఆహా కోసం చేస్తున్న అన్‌స్టాప‌బుల్ టాక్ షోను నాన్ స్టాప్‌గా పూర్తి చేసే ప‌నిలో బిజీగా ఉన్నారు. NBK 107లోనూ గోపీచంద్ మ‌లినేని బాల‌కృష్ణ‌ను డ్యూయెల్ రోల్‌లో చూపించ‌బోతున్నార‌నే వార్త‌లు నెట్టింట తెగ హ‌ల్ చేస్తున్నాయి.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3FFocAd
v

శ్యామ్ సింగ రాయ్ 6 డేస్ కలెక్షన్స్.. ఆల్‌మోస్ట్ సంగం వసూళ్లు డ్రాప్..! ఇదీ టోటల్ రిపోర్ట్

నాని హీరోగా రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో తెరకెక్కిన 'శ్యామ్ సింగ రాయ్' సినిమా డిసెంబర్ 24వ తేదీన విడుదలై విజయవంతంగా ప్రదర్శించబడుతోంది. తొలి రోజే ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ తెచ్చుకున్న ఈ సినిమా బ్రేక్ ఈవెన్ దగ్గరకు చేరుకుంది. కాకపోతే 5వ రోజుతో పోల్చితే 6వ రోజు కలెక్షన్స్‌లో 45 శాతం మేర డ్రాప్ కనిపిస్తోంది. ట్రేడ్ వర్గాల లెక్కల ప్రకారం ఈ సినిమా 6 రోజుల వసూళ్లు ఎలా ఉన్నాయో ఓ లుక్కేద్దామా.. రెండు తెలుగు రాష్ట్రాల్లో 6వ రోజు కలెక్షన్ వివరాలు నైజాం: 20 లక్షలు సీడెడ్: 6 లక్షలు ఉత్తరాంధ్ర: 4 లక్షలు ఈస్ట్ గోదావరి: 4 లక్షలు వెస్ట్ గోదావరి: 2 లక్షలు గుంటూరు: 2 లక్షలు కృష్ణా: 2 లక్షలు నెల్లూరు: 2 లక్షలు AP-TG డే 6 కలెక్షన్స్: 42 లక్షలు (68 లక్షల గ్రాస్) మొత్తంగా చూస్తే ఈ 6 రోజుల్లో శ్యామ్ సింగ రాయ్ వసూళ్ల వివరాలు నైజాం: 7.46 కోట్లు సీడెడ్: 1.97 కోట్లు ఉత్తరాంధ్ర: 1.67 కోట్లు ఈస్ట్ గోదావరి: 77 లక్షలు వెస్ట్ గోదావారి: 62 లక్షలు గుంటూరు: 92 లక్షలు కృష్ణా: 70 లక్షలు నెల్లూరు: 48 లక్షలు మొత్తంగా AP-TG 6 డేస్ కలెక్షన్స్: 14.61 కోట్లు (24.78 కోట్ల గ్రాస్) కర్ణాటక+ రెస్ట్ ఆఫ్ ఇండియా కలుపుకొని మరో 2.48 కోట్లు, ఓవర్సీస్ 3.36 కోట్లు వసూలు చేసిన శ్యామ్ సింగరాయ్ ప్రపంచవ్యాప్తంగా చూస్తే 20.47 కోట్ల షేర్ (36.28 కోట్ల గ్రాస్) రాబట్టింది. విడుదలకు ముందు ఈ శ్యామ్ సింగ రాయ్ చిత్రానికి ప్రపంచ వ్యాప్తంగా 22 కోట్ల బిజినెస్ జరిగింది. దీంతో 22.50 కోట్ల అబ్రెక్ ఈవెన్ టార్గెట్‌తో బరిలోకి దిగిన ఈ సినిమా మరో 2.03 కోట్లు వసూలు చేసిందంటే క్లీన్ హిట్ సాధించినట్లే.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3mLymrJ
v

Year Ender 2021: టాలీవుడ్‌ని హీటెక్కించిన వివాదాలు.. జనాల్లో హాట్ ఇష్యూ అయిన టాపిక్స్ ఇవే..

2020లో కరోనా అంటూ ఓ మహమ్మారి వైరస్ భారతదేశంలోకి ప్రవేశించి 2021లో కూడా ప్రజలందరినీ భయాందోళనకు గురిచేసింది. ముఖ్యంగా సినీ ఇండస్ట్రీ కరోనా దెబ్బకు అతలాకుతలమైంది. అయినప్పటికీ ఏ చిన్న అవకాశం దొరికినా షూట్స్ కంప్లీట్ చేస్తూ ఎలాగోలా ఈ ఏడాది కొన్ని బిగ్గెస్ట్ మూవీస్ ప్రేక్షకుల ముందుకు తెచ్చారు టాలీవుడ్ దర్శకనిర్మాతలు. ఈ క్రమంలో నెలకొన్న కొన్ని ఇబ్బందులు, వివాదాలు, కొంతమంది సెలబ్రిటీల పర్సనల్ విషయాలు జనాల్లో చర్చనీయాంశం అయ్యాయి. అవేంటో ఓ సారి చూద్దామా.. వకీల్ సాబ్ ఎంట్రీ- ఏపీ ప్రభుత్వ తీరు రెండేళ్ల రాజకీయ ప్రయాణం చేసిన అనంతరం 2021- ఏప్రిల్ 9న 'వకీల్ సాబ్' సినిమాతో తిరిగి వెండితెరపై అలరించారు పవన్ కళ్యాణ్. అయితే ఈ సినిమా టికెట్ రేట్స్ విషయంలో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం వ్యవహరించిన తీరు వివాదాస్పదం అయింది. ఈ చిత్ర బెనిఫిట్ షోలకు అనుమతి ఇవ్వకపోవడమే గాక, టికెట్ రేట్లను పెంచుకునే అవకాశాన్ని లేకుండా చేయడంతో వివాదం రాజుకుంది. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ హర్ట్ అయ్యారు. ఈ ఇష్యూపై బండ్ల గణేష్ రియాక్ట్ అవుతూ వకీల్‌ సాబ్‌ విషయంలో ఏపీ ప్రభుత్వ తీరుపై సినీ పెద్దలెవరూ స్పందించరా? అని కామెంట్ చేయడం చర్చల్లో నిలిచింది. అయితే అప్పుడు నెలకొన్న ఈ టికెట్స్ ఇష్యూ నేటికీ సద్దుమణగక పోవడం గమనార్హం. సాయి ధరమ్ తేజ్ యాక్సిడెంట్ యంగ్ హీరో సాయి ధరమ్ తేజ్ బైక్ యాక్సిడెంట్‌కి గురి కావడం టాలీవుడ్ ఇండస్ట్రీలో తీవ్ర చర్చనీయాంశం అయింది. ఈ ప్రమాద ఘటన టాలీవుడ్ లోకంలో ఆందోళన నింపింది. బైక్ యాక్సిడెంట్ జరిగిన విధానం, ఆ తర్వాత సాయి ధరమ్ తేజ్ కోమాలోకి వెళ్లడం, నెల రోజుల వరకు ఆయన కోలుకోలేక పోవడం లాంటి పరిణామాలు జనాల్లో హాట్ టాపిక్ అయ్యాయి. సాయి ధరమ్‌ తేజ్‌ నడిపిన స్పోర్ట్స్ బైక్ వివరాలు, యాక్సిడెంట్ స్పాట్‌లో రోడ్డు ఎలా ఉందనే విషయాలు చర్చల్లోకి వచ్చాయి. వివాదాస్పదం అయిన 'మా' ఎన్నికలు ఎప్పటిలాగే ఈ సారి 'మా' ఎన్నికలు ఇండస్ట్రీ వాతావరణాన్ని వేడెక్కించాయి. ‘మా’ అధ్యక్ష పీఠం కోసం మంచు విష్ణు, ప్రకాశ్ రాజ్‌ల మధ్య జరిగిన పోరు యుద్ధ వాతావరణాన్ని తలపెట్టింది. ఈ పోటీలో ఒక వర్గంపై మరో వర్గం చేసుకున్న ఆరోపణలు, వాదోపవాదాలు వివాదాస్పదమయ్యాయి. ఎన్నికల అధికారి ప్రవర్తన, హేమ హంగామా, మోహన్‌ బాబు వ్యవహారశైలి ఇలా ప్రతి ఒక్క అంశం హాట్ టాపిక్ అయింది. చివరకు మంచు విష్ణు అధ్యక్ష పీఠం దక్కించుకున్నారు. సమంత డివోర్స్ ఇష్యూ నాగ చైతన్యను ప్రేమించి పెళ్లాడిన సమంత ఆ వివాహ బంధానికి ఫుల్‌స్టాప్ పెడుతూ విడాకుల విషయాన్ని అధికారికంగా ప్రకటించడంతో టాలీవుడ్ లోకం ఒక్కసారిగా ఆశ్చర్యపోయింది. ఈ ఇష్యూ గురించి సోషల్ మీడియాలో పెద్ద చర్చనే నడిచింది. సమంతపై రకరకాల పుకార్లు షికారు చేయడం, దీనిపై సమంత కోర్టుకెక్కడం లాంటి పరిణామాలు చోటుచేసుకున్నాయి. దీంతో చై- సామ్ విడాకుల వ్యవహారం జనాల్లో హాట్ టాపిక్ అయింది. సమంత ఐటెం సాంగ్ ఇష్యూ ఇకపోతే విడాకుల అనంతరం తన ఫోకస్ అంతా సినిమాలపైనే పెట్టిన సమంత.. పుష్ప సినిమాలో ఐటెం సాంగ్ చేసింది. తొలిసారి ఐటెం సాంగ్ చేసిన ఈ బ్యూటీ 'ఉ అంటావా మావ.. ఉఊ అంటావా మావ' అంటూ హుషారెత్తించింది. అయితే ఈ పాటలో వాడిన పదాలు, సాహిత్యం మగవారి మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయంటూ పురుష సంఘం ఫైర్ అయింది. మరోవైపు ఈ పాట స్పూఫ్ వీడియోలతో సోషల్ మీడియా షేక్ అవుతోంది. అలా సమంత సాంగ్ జనాల్లో చర్చల్లో నిలిచింది. ఏపీ టికెట్ రేట్స్ ఇష్యూ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రలో సినిమా టికెట్ల రగడ కొనసాగుతోంది. ఈ ఇష్యూపై తన శ్యామ్ సింగరాయ్ సినిమా రిలీజ్‌కి ముందు రియాక్ట్ అయిన నాని.. ''థియేటర్స్ కలెక్షన్స్ కంటే కిరాణాకొట్టు కలెక్షన్స్ బటర్‌గా ఉన్నాయి'' అని కామెంట్ చేయడంతో దుమారం రేగింది. పలువురు రాజకీయ నాయకులు నాని మాటలపై ఫైర్ అయ్యారు. దీంతో సినీ ఇండీస్ట్రీ Vs వైసీపీ గవర్నమెంట్ అన్నట్లుగా మారిన ఈ ఇష్యూ జనాల్లో హాట్ టాపిక్ అయింది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/348C5t3
v

కిన్నెరసాని ట్రైలర్: కారణం లేని ప్రేమ, గమ్యం లేని ప్రయాణం చాలా గొప్పవి కదా!!

'విజేత' సినిమాతో సినీ ఎంట్రీ ఇచ్చిన చిరంజీవి అల్లుడు కళ్యాణ్ దేవ్.. 'కిన్నెరసాని' అనే మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. రొమాంటిక్ సస్పెన్స్ థ్రిల్లర్‌‌గా అన్ని వర్గాల ఆడియన్స్‌ని ఆకట్టుకునేలా ఈ సినిమా రూపొందుతోంది. SRT ఎంటర్‌టైన్‌మెంట్స్, శుభమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకాలపై నిర్మిస్తున్న ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. మహతి సాగర్‌ సంగీతం అందిస్తున్నారు. 2022 జనవరి 26న థియేటర్లలో ఈ సినిమా విడుదల కానున్న నేపథ్యంలో చిత్ర ప్రమోషన్స్‌ చేపడుతున్నారు. ఇందులో భాగంగా తాజాగా కిన్నెరసాని ట్రైలర్ రిలీజ్ చేశారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా గ్లింప్స్ వీడియో ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ తెచ్చుకోగా తాజాగా విడుదల చేసిన ట్రైలర్ సినిమా పట్ల ఆసక్తి నెలకొల్పింది. ఈ ట్రైలర్ చూస్తుంటే మర్డర్ మిస్టరీ ప్రధానంగా ఈ సినిమా రూపొందించారని అర్థమవుతోంది. రెండు నిమిషాల 7 సెకనుల నిధితో కూడిన ఈ ట్రైలర్‌లో డైలాగ్స్ హైలైట్ అయ్యాయి. ''నీ ముందున్న సముద్రపు అలలను చూడు. కోపగించుకొని సముద్రాన్ని వదిలి వెళ్లి పోతున్నట్లున్నాయి. కానీ సముద్రం వాటిని వదలదు.. నేను కూడా అంతే'' అంటూ ట్రైలర్ ఓపెనింగ్‌లో వచ్చిన డైలాగ్, ''కారణం లేని ప్రేమ, గమ్యం లేని ప్రయాణం చాలా గొప్పవి కదా'' అంటూ హీరోయిన్ చెప్పిన డైలాగ్ సినిమాలో లవ్ అండ్ ఎమోషన్స్ ఏ రేంజ్‌లో ఉంటాయో చెబుతున్నాయి. ట్రైలర్ చివర్లో రవీంద్ర అజయ్ ‘మీకో రహస్యం చెప్పనా.. ఇది కథ కాదు.. ప్రతి అక్షరం నిజం’ అనే డైలాగ్ సినిమాపై హైప్ పెంచేసింది. ఆసక్తి రేకెత్తిస్తున్న సన్నివేశాలకు తోడు మహతి స్వర సాగర్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మరో హైలెట్‌గా నిలిచింది. ఈ సినిమాతో కళ్యాణ్ దేవ్ మరో మెట్టు ఎక్కబోతున్నట్లు తెలుస్తోంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/348CcEZ
v

Wednesday 29 December 2021

నమస్కారం! నా నుంచి దూరంగా ఉండు.. సుడిగాలి సుధీర్‌ గాలి తీసిన ‌స్టార్ హీరోయిన్

జబర్దస్త్ కమెడియన్‌గా భారీ పాపులారిటీ సంపాదించాడు సుడిగాలి సుధీర్. తనదైన కామెడీ టైమింగ్‌తో కితకితలు పెట్టడమే కాదు తన మాటలకు మసాలా దట్టిస్తూ హీటెక్కిచడం కూడా మనోడికి బాగా తెలుసు. అమ్మాయి కనిపిస్తే చాలు సుధీర్ ఫీలింగ్స్ ఎలా ఉంటాయి? వాళ్లపై ఆయన వేసే కౌంటర్స్ ఏ అర్థాలతో నవ్విస్తుంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. అలా అలా పులిహోర రాజాగా ఫేమస్ అయిన ఆయన్ను కమెడియన్స్ అంతా అలానే ట్రీట్ చేస్తుంటారు. సుధీర్ కనిపిస్తే చాలు అదే కోణంలో పంచులేస్తుంటారు. అయితే తాజాగా ఓ స్టార్ హీరోయిన్ కూడా సుధీర్‌ని అదే దృష్టితో చూడటం ఆసక్తికరంగా మారింది. బుల్లితెరపై కెమెడియన్‌గా అలరిస్తూనే '' ప్రోగ్రామ్ హోస్ట్‌గా చేస్తున్నాడు సుడిగాలి సుధీర్. అయితే కొత్త సంవత్సరం రాబోతున్న సందర్భంగా స్వర్గంలో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అంటూ న్యూ కాన్సెప్ట్‌తో ఎపిసోడ్ ప్లాన్ చేశారు. ఈ ఎపిసోడ్‌కి సీనియర్ హీరోయిన్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. తాజాగా ఈ ఎపిసోడ్ ప్రోమో రిలీజ్ చేయగా సుధీర్, మహేశ్వరి నడుమ జరిగిన సంభాషణ, ఆ సీన్స్ హైలైట్ అయ్యాయి. మహేశ్వరి వేదికపై వచ్చి రాగానే 'మేడం హాయ్' అంటూ చేయి కలపబోయాడు సుడిగాలి సుధీర్. దానికి ఆమె నమస్కారం మాత్రమే పెడుతూ చేయి ఇవ్వకపోవడంతో ఆశ్చర్యపోయిన సుధీర్.. 'ఏంటి? నమస్కారం పెడుతున్నారు' అని అడిగేశాడు. దీంతో 'వద్దు బాబు నేను చేతులు కలిపితే నువ్వు ఏ పులిహోరో కలుపుతావు' అనేస్తూ సుధీర్‌కి జబర్దస్త్ పంచ్ ఇచ్చింది మహేశ్వరి. ఆ మాటతో ఇంద్రజ సహా అక్కడున్న వారంతా తెగ నవ్వేశారు. ఆ తర్వాత మేడం.. ఇంతకీ నన్ను ఎక్కడ ఉండమంటాడు? అని సుధీర్ అడగడంతో నా నుంచి మాత్రం దూరంగా ఉండమంటూ మరోసారి గాలి తీసేసింది మహేశ్వరి. దీంతో ఫేస్ అదోలా పెట్టుకొని తెగ ఫీలై పోయాడు సుడిగాలి సుధీర్. ప్రస్తుతం ఈ ప్రోమో వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. పూర్తి ఎపిసోడ్ జనవరి 2వ తేదీన ప్రసారం కానుంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3mKOcTo
v

టికెట్స్ రేట్లు తగ్గించడం కాదు.. రాజమౌళికి రివార్డ్ ఇవ్వాలి: ఆర్జీవీ ఇంట్రస్టింగ్ కామెంట్స్

తెలుగోడి సత్తా ఏంటనేది ప్రూవ్ చేస్తూ తెలుగు సినిమా ఖ్యాతిని ఎల్లలు దాటించిన ఘటన సొంతం. తెలుగు కళాకారుల్లో ఎంతో టాలెంట్ ఉందని, భారీ బడ్జెట్ సినిమాలు రూపొందించి భారీ వసూళ్లు రాబట్టవచ్చని 'బాహుబలి' సినిమాతో ప్రతి ఒక్కరికీ అర్థమయ్యేలా చేశారు జక్కన్న. ఇదే విషయాన్ని ప్రస్తావనకు తెస్తూ ఆంధ్ర ప్రదేశ్ టికెట్స్ రేట్స్ ఇష్యూపై తనదైన స్టైల్‌లో రియాక్ట్ అయ్యారు . ఈ మేరకు రాజమౌళిపై చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. గత కొన్ని రోజులుగా ఆంధ్ర ప్రదేశ్ టికెట్స్ రేట్స్ ఇష్యూ జనాల్లో చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఏపీలో సినిమా టికెట్ రేట్లు తగ్గిస్తూ అక్కడి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో నాని లాంటి సినీ ప్రముఖులు చేసిన వ్యాఖ్యలు, వాటిపై ఏపీ పొలిటీషియన్స్ వేసిన కౌంటర్స్ తీవ్ర దుమారం రేపాయి. అయితే ఈ ఇష్యూ లోకి ఎంటరైన రామ్ గోపాల్ వర్మ.. ఎప్పటిలాగే లాజిక్స్ మాట్లాడుతూ ఏపీ టికెట్ రేట్స్‌కి దర్శక ధీరుడు రాజమౌళికి లింక్ పెడుతూ మాట్లాడారు. హాలీవుడ్ బిగ్గెస్ట్ మూవీ స్పైడర్ మ్యాన్‌కి పెట్టిన ఖర్చులో 100వ వంతుతో రాజమౌళి బాహుబలి సినిమా తీశాడు. ఈ సినిమాతో తన బాహుబలి సినిమా హాలీవుడ్ బిగ్గెస్ట్ మూవీని మించిన రెస్పాన్స్ తెచ్చుకుందని ప్రూవ్ చేశాడాయన. ప్రొడ్యూసర్‌తో ఖర్చు పెట్టించడంలో ఆ రోజు తెలుగు సినిమాకు ఉన్న కెపాసిటీని రెండు మూడంతలు చేస్తూ ధైర్యం చేశారు. అది ఫ్లాప్ అయితే నిర్మాతకు నష్టపోతాడు, రాజమౌళికి కాస్త బ్రాండ్ ఇమేజ్ తగ్గుతుంది. కానీ అది సక్సెస్ కావడం వల్ల ఈ రోజు తెలుగు సినిమా గురించి యావత్ ప్రపంచం చెప్పుకుంటోంది. మంచి సినిమా చేస్తే సక్సెస్ అవుతుందని రాజమౌళి ప్రూవ్ చేయడం వల్లే మొన్నటి కేజీఎఫ్, పుష్ప లాంటి సినిమాలకు దారి చూపించినట్లయింది. దీని వల్ల రెవెన్యూ పెరుగుతుంది. ప్రభుత్వానికి టాక్స్ రూపంలో లాభం చేకూరుతుంది. కాబట్టి నా ఉద్దేశంలో అలాంటి టాలెంట్ ఎంకరేజ్ చేయడానికి ప్రభుత్వం టాక్స్ బెనిఫిట్ ఇవ్వాలి. టికెట్స్ రేట్స్ తగ్గించడం పక్కనబెట్టి రాజమౌళికి రివార్డ్ ఇవ్వాలి. తెలుగు రాష్ట్రాలకు రాజమౌళి చేసిన సేవను డబ్బుతో కొలవలేం. ఆ ఘనత ఎప్పటీకీ నిలిచిపోతుంది'' అన్నారు రామ్ గోపాల్ వర్మ.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3za2nq2
v

Roja: హీరో నాని మాటలపై ఎమ్మెల్యే రోజా కౌంటర్స్.. పవన్‌ కళ్యాణ్‌పై పరోక్ష విమర్శ

ఆంధ్రప్రదేశ్‌లో టికెట్ల రేట్ల రగడ రోజు రోజుకు ముదురుతోంది. సినిమా టికెట్ ధరలపై ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని పలువురు సినీ ప్రముఖులు తప్పుబడుతున్నారు. ఈ క్రమంలో 'శ్యామ్ సింగ రాయ్' సినిమా విడుదలకు ముందు హీరో చేసిన వ్యాఖ్యలు సినీ, రాజకీయ వర్గాల్లో తీవ్ర దుమారం రేపాయి. నాని మాట్లాడిన తీరుపై ఇప్పటికే పలువురు వైసీపీ లీడర్స్ విరుచుకుపడగా.. తాజాగా టాలీవుడ్ సీనియర్ హీరోయిన్, ఎమ్మెల్యే మీడియా ముందు నాని వ్యాఖ్యలపై కౌంటర్స్ వేశారు. థియేటర్లలో సినిమా టికెట్ రేట్ల తగ్గింపుతో థియేటర్లలో వచ్చే కలెక్షన్స్ కంటే ఆ పక్కన ఉన్న కిరాణా కొట్టు కలెక్షన్స్ బెటర్‌గా ఉన్నాయని, టికెట్ ధరలు పెంచినా కూడా సినిమా చూసే సామర్థ్యం ప్రేక్షకులకు ఉందని నాని అన్నారు. దీంతో ఒక్కసారిగా ఏపీ టికెట్స్ ఇష్యూ హాట్ టాపిక్ అయింది. నాని వ్యాఖ్యలను కొందరు సినీ ప్రముఖులు సపోర్ట్ చేస్తుండగా.. వైసీపీ లీడర్స్ మాత్రం విరుచుకు పడుతున్నారు. తాజాగా సీన్ లోకి ఎమ్మెల్యే రోజా వచ్చి సినిమా టికెట్ల వ్యవహారంపై నాని మాటలు చాలా బాధాకరని అన్నారు. థియేటర్స్ కలెక్షన్స్ కంటే కిరాణా కొట్టు కలెక్షన్స్ బెటర్‌గా ఉందని అనుకున్నపుడు నాని గారు కిరాణా కొట్టే పెట్టుకోవచ్చుగా.. అంటూ నానిపై సెటైర్ వేశారు రోజా. ఇంతమందికి ఉపయోగపడేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంటే నాని గారి ఒక్క సినిమా కోసం ఆయనలా మాట్లాడటం చాలా బాధాకరమని అన్నారు. ఆయన మాటలు విని షాకయ్యానని చెప్పారు. ఇలాంటి మాటలు మాట్లాడటం వల్ల సినిమా ఇండస్ట్రీకి ఇంకా నష్టం వాటిల్లే ప్రమాదం ఉంటుందని, స్నేహపూరిత వాతావరణంలో మంచి నిర్ణయం తీసుకుంటే అటు పెద్ద సినిమాలకు ఇటు చిన్న సినిమాలకు న్యాయం జరుగుతుందని ఆమె చెప్పారు. కొంతమంది పొలిటికల్‌గా తమ ఉనికిని చాటు కోవడానికి ఇలాంటి ప్రయత్నాలు జరుగుతున్నాయని రోజా అన్నారు. ఇన్ని రోజులు లేని దాన్ని ఇదో పెద్ద ఇష్యూ చేస్తున్నారంటే.. ఒక పొలిటికల్ పార్టీ పెట్టి సినిమాలు చేస్తున్న వ్యక్తి వల్లే అనేది అందరికీ తెలుసంటూ రోజా చేసిన వ్యాఖ్యలు జనాల్లో హాట్ టాపిక్ అయ్యాయి. దీంతో ఈ ఇష్యూలోకి పరోక్షంగా పవన్ కళ్యాణ్‌‌ని లాగుతూ ఆమె ఈ కామెంట్స్ చేశారని చర్చించుకుంటున్నారు జనం.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3pCZSd2
v

2021 Rewind: సక్సెస్‌ఫుల్ సినీ ఎంట్రీ.. వచ్చి రాగానే వెండితెరపై సత్తాచాటిన హీరోలు వీరే..

సినిమా అనే రంగుల ప్రపంచంలో నిలదొక్కుకోవడం చాలా కష్టం. ఎంతో టాలెంట్ ఉంటే తప్ప అవకాశాలు తలుపుతట్టవు. అయితే కొందరు హీరోలకు తమ తమ టాలెంట్ ప్రూవ్ చేసుకునేందుకు కాస్త టైం పట్టినా కొందరు హీరోలు మాత్రం తొలి సినిమాతోనే తమ మార్క్ చూపెడుతుంటారు. మరి ఈ ఏడాది (2021)లో అలాంటి హీరోలు ఎవరు? వారి వారి సినిమాలు ఏ రేంజ్‌లో సక్సెస్ అయ్యాయో ఓ లుక్కేద్దామా.. ప్రదీప్ మాచిరాజు బుల్లితెరపై తనదైన యాంకరింగ్ చేస్తూ ప్రతి ఇంటి సభ్యుడికి సుపరిచితమైన యాంకర్ ప్రదీప్ ఈ ఏడాదే హీరోగా పరిచయమయ్యారు. ఇప్పటికే పలు సినిమాల్లో సైడ్ క్యారెక్టర్స్ చేస్తూ వెండితెరపై కూడా తన టాలెంట్ చూపించిన ప్రదీప్.. ఈ ఏడాది ఆరంభంలోనే హీరోగా వెండితెరపై కాలుమోపారు. ఆయన హీరోగా కొత్త దర్శకుడు మున్నా తెరకెక్కించిన '30 రోజుల్లో ప్రేమించడం ఎలా' మూవీ విమర్శకుల ప్రశంసలు అందుకుంది. హీరోగా తొలి సినిమాతోనే ప్రదీప్ టాలెంట్ బయటపడిందనే టాక్ వచ్చింది. వైష్ణవ్ తేజ్ మెగా మేనల్లుడిగా, సాయి ధరమ్ తేజ్ సోదరుడిగా బలమైన బ్యాక్‌గ్రౌండ్‌తో వెండితెరపై కాలు మోపిన యంగ్ హీరో వైష్ణవ్ తేజ్.. తన తొలి సినిమా 'ఉప్పెన'తో ప్రేక్షకుల గుండెల్లో గూడు కట్టుకున్నారు. ఈ చిత్రంలో ఆయన నటన చూసి పలువురు సినీ ప్రముఖులు ప్రశంసించారు. సుకుమార్ శిష్యులు బుచ్చి బాబు సానా దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా నిర్మాతలకు లాభాల పంట పండించింది. రోషన్ మేక హీరో శ్రీకాంత్ తనయుడిగా సినీ గడప తొక్కిన రోషన్ మేక పెళ్లి సందD సినిమాతో పూర్తి స్థాయి హీరోగా ప్రేక్షకుల ముందుకొచ్చారు. దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు రూపొందించిన ఈ సినిమా మ్యూజికల్ హిట్‌గా నిలవడమే గాక రోషన్ నటనకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. కెరీర్ పరంగా ఈ సినిమాతో మరో మెట్టు ఎక్కారు రోషన్. కమెడియన్ సత్య తెలుగు చిత్రసీమలో కమెడియన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న సత్య.. 'వివాహ భోజనంబు' సినిమాతో హీరోగా అవతారమెత్తాడు. ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. సందీప్ కిషన్ ఈ సినిమాను నిర్మించాడు తేజ సజ్జ సినిమాల పరంగా, నటన పరంగా మంచి అనుభవమే ఉన్న తేజ సజ్జ తొలిసారి హీరోగా జాంబీ రెడ్డి సినిమాతో కెమెరా ముందుకొచ్చారు. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకుల చేత భేష్ అనిపించుకుంది. చిత్రంలో తేజ సజ్జ నటనకు మంచి మార్కులు పడ్డాయి.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3mFj4Vm
v

మంచు మనోజ్‌కి కరోనా పాజిటివ్.. స్వయంగా వెల్లడించిన హీరో

గత రెండేళ్లుగా సినీ ఇండస్ట్రీని కరోనా భయం వెంటాడుతూనే ఉంది. వరుసపెట్టి సినీ ప్రముఖులు కరోనా బారిన పడుతుండటం ఆందోళన కలిగిస్తోంది. అయితే కరోనా ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ తర్వాత కొన్ని నెలల పాటు కరోనా కేసులు నమోదు కాకున్నా అంతలోనే తిరిగి ఒక్కసారిగా కేసులు పెరుగుతుండటం మరోసారి గుబులు పుట్టిస్తోంది. కరోనా సెకండ్ వేవ్ ముగిసిందనుకునే లోపే ఒమిక్రాన్ రూపంలో మరో వేరియంట్ పలు దేశాలను వణికిస్తోంది. రీసెంట్‌గా కమల్ హాసన్, బాలీవుడ్ బ్యూటీ కరీనా కపూర్, యాక్షన్ కింగ్ అర్జున్ కరోనా బారిన పడి చికిత్స తీసుకోగా తాజాగా తనకు కరోనా సోకిందంటూ మంచు మనోజ్ ట్వీట్ చేశారు. ''నాకు క‌రోనా పాజిటివ్ అని తేలింది. ఇటీవ‌ల న‌న్ను క‌లిసిన ప్రతి ఒక్కరు వెంట‌నే క‌రోనా ప‌రీక్ష‌లు చేయించుకోవాల‌ని కోరుతున్నా. ప్రతి ఒక్కరూ కరోనా పట్ల జాగ్రత్తగా వ్యవహరించాలి. ప్రస్తుతం నేను బాగానే ఉన్నా. డోంట్ వర్రీ.. మీ అందరి ప్రేమతో ఆరోగ్యంగా తిరిగివస్తా. వైద్యులు, న‌ర్సులంద‌రికీ నేను ప్రత్యేకంగా కృత‌జ్ఞ‌త‌లు చెబుతున్నాను'' అని మంచు మ‌నోజ్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు. దీంతో మనోజ్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. మంచు వారసుడిగా సినీ ఎంట్రీ ఇచ్చి పలు సినిమాలతో ఆకట్టుకున్న మంచు మనోజ్.. తన భార్య ప్రణతితో విడాకులు తీసుకున్న అనంతరం పర్సనల్‌గా, ప్రొఫెషనల్‌గా ప్రేక్షకులకు దూరంగా ఉంటున్నారు. ఈ క్రమంలో మనోజ్ రెండో పెళ్లి చేసుకోనున్నాడని, ఓ ఫారెన్ అమ్మాయితో లవ్‌‌లో ఉన్నాడని పెద్ద ఎత్తున రూమర్స్ రావడంతో ఆయన రియాక్ట్ అవుతూ అట్టి వార్తలను కొట్టిపారేశారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3z562pn
v

Tuesday 28 December 2021

బీ రెడీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్.. భీమ్లా నాయక్‌ నుంచి బ్లాస్టింగ్ అప్‌డేట్

రెండేళ్ల రాజకీయ ప్రయాణం తర్వాత తిరిగి కెమెరా ముందుకొచ్చిన వరుస సినిమాలకు కమిటై తన అభిమానుల్లో ఉరకలేసే ఉత్సాహం నింపిన సంగతి తెలిసిందే. రీ- ఎంట్రీ తర్వాత వకీల్ సాబ్ రూపంలో భారీ హిట్ పట్టేసిన పవన్.. తన తదుపరి సినిమాలు చకచకా కంప్లీట్ చేస్తున్నారు. దీంతో ఆయా సినిమాల కోసం అశేష ప్రేక్షకలోకం ఆతృతగా ఉంది. ఆ లిస్టులో మొదటిది ''. పవన్ కళ్యాణ్, రానా జంటగా నటించిన ఈ సినిమాపై మెగా ఫ్యాన్స్ పెట్టుకున్న అంచనాలు మాటల్లో చెప్పలేం. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ సర్‌ప్రైజింగ్ అప్‌డేట్ ఇచ్చారు చిత్ర నిర్మాత నాగ వంశీ. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన ‘టైటిల్‌ సాంగ్‌, ‘లాలా..భీమ్లా’ పాటలు, పవన్ మాస్‌ లుక్‌ పోస్టర్‌ల భారీ రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. సాంగ్స్ అయితే ఇప్పటికీ ట్రెండింగ్‌లోనే ఉన్నాయి. ఈ క్రమంలోనే పవన్ ఫ్యాన్స్ ఊగిపోయే కొత్త అప్‌డేట్ ఇచ్చారు మేకర్స్. ఈ సినిమాను లాలా..భీమ్లా Dj వర్షన్ రిలీజ్ చేయనున్నట్లు తెలిపారు. అది కూడా కొత్త సంవత్సర కానుకగా. 31 డిసెంబర్ రాత్రి 7 గంటల 2 నిమిషాలకు లాలా..భీమ్లా Dj వర్షన్ విడుదలకు కానుందని, ఈ పాటతో బ్లాస్టింగ్ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ చేసుకోండని తెలుపుతూ కొత్త పోస్టర్ రిలీజ్ చేశారు. నిజానికి సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల కావాల్సిన ఈ సినిమాను కొన్ని అనివార్య కారణాల వల్ల ఫిబ్రవరి 25కు వాయిదా వేశారు. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్‌తో పాటు దగ్గుబాటి రానా లీడ్ రోల్ పోషిస్తున్నారు. సితారా ఎంటర్‌టైన్‌మెంట్స్‌ భారీ రేంజ్‌లో రూపొందిన ఈ చిత్రానికి సాగర్‌.కె.చంద్ర దర్శకత్వం వహించారు. త్రివిక్రమ్‌ మాటలు, స్క్రీన్ ప్లే అందించారు. ఈ మూవీ కోసం పవన్ ఫ్యాన్స్ ఆతృతగా ఎదురుచూస్తున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3qwiTNt
v

ఆర్ధిక కష్టాల్లో కుటుంబం.. డబ్బు సాయం కోరిన నెటిజన్.. యాంకర్ ప్రదీప్ రియాక్షన్ వైరల్

ప్రస్తుతం సోషల్ మీడియా ట్రెండ్ నడుస్తోంది. ఏ విషయాన్నైనా సామాజిక మాద్యమాల ద్వారా వ్యక్తపరచడం చాలా సులువైంది. మరీ ముఖ్యంగా ట్విట్టర్, ఇన్స్‌స్టాగ్రామ్ లాంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ సామాన్యులకు సెలబ్రిటీలకు మధ్య వారధిగా మారాయి. తమ మనసులోని మాటలను, రిక్వెస్ట్‌లను సెలబ్రిటీల ముందుకు తీసుకెళ్లడం సులభతరం చేశాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా ఓ నెటిజన్ యాంకర్ కోరుతూ ట్వీట్ పెట్టాడు. దీనిపై ప్రదీప్ రియాక్ట్ అయిన తీరు ఆయన్ను వార్తల్లో నిలిపింది. బుల్లితెరపై సక్సెస్‌ఫుల్ యాంకర్‌గా దూసుకుపోతున్న ప్రదీప్.. అప్పుడప్పుడు తన మంచి మనసును చాటుకుంటూ ఉంటారు. ఆపదలో ఉన్న వారి పట్ల జాలి చూపిస్తూ చేతనైనంత సాయం చేస్తుంటారు. ఈ నేపథ్యంలోనే తన కుటుంబ పరిస్థితి బాగోలేదని, కరోనా కారణంగా నాన్న చనిపోవడంతో ఆర్థికంగా కుంగి పోయామని తెలుపుతూ ఓ బీటెక్ విద్యార్ధి ట్వీట్ చేశాడు. ఈ మేరకు యాంకర్ ప్రదీప్‌ని ట్యాగ్ చేస్తూ సాయం కోరాడు. కరోనా కారణంగా నాన్న చనిపోవడంతో బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్న తాను, బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్న తన సిస్టర్ చాలా కష్టాల్లో ఉన్నామని తెలిపిన నెటిజన్ మీ నుంచి కొంత డబ్బు సాయం కావాలని కోరాడు. తమ కుటుంబ పరిస్థితి ఎలా ఉందనే దానికి ప్రూఫ్ కూడా ఇస్తానని చెబుతూ తన ఫోన్ నెంబర్ ఇచ్చాడు. దీంతో మంచి మనసుతో ఆ కుర్రాడి పరిస్థితి అర్థం చేసుకున్న యాంకర్ ప్రదీప్.. ''నా శక్తి మేర సాయం చేస్తా బ్రదర్. నీ డీటెయిల్స్ పంపించి స్ట్రాంగ్‌గా ఉండు'' అని రిప్లై ఇచ్చారు. దీంతో ప్రదీప్ మంచి మనసుపై నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గతంలో కూడా ప్రదీప్‌ మాచిరాజు తన దాతృత్వాన్ని చాటుకున్నారు. కరోనా కల్లోల పరిస్థితుల్లో చాలా మంది రోజువారీ కార్మికుల కోసం తన వంతు సాయాన్ని ప్రకటించారు. ఒక నెలరోజుల పాటు తనకి తెలిసిన కార్మికులకు ఆర్థిక సాయం అందించారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3qutOHf
v

ఉ అంటావా మావ.. ఉఊ అంటావా మావ.. ఇరగదీసిన జూనియర్ సమంత.. వీడియో వైరల్

సోషల్ మీడియా కారణంగానే ఫేమ్ కూడగట్టుకొని జూనియర్ సమంతగా నెటిజన్లకు సుపరిచితమైంది . అదే పాపులారిటీతో బిగ్ బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన ఈ బ్యూటీ తనదైన ఆటతీరుతో బుల్లితెర ఆడియన్స్ మనసు దోచుకుంది. దీంతో బిగ్‌బాస్ షో తర్వాత ఆమె పాపులారిటీ మరింత పెరిగింది. అప్పటిదాకా కొందరికే తెలిసిన అషు రెడ్డి.. బిగ్ బాస్ తర్వాత ప్రతి ఒక్కరికీ చేరువైంది. సినిమా ఆఫర్లు కూడా పెట్టేస్తూ బిగ్ సెలబ్రెటీగా మారింది. ఇక మరోవైపు తన అసలైన అస్త్రం సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ రోల్ పోషిస్తూ ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫొటోస్, వీడియోలతో నెటిజన్లను ఫిదా చేస్తోంది అషు రెడ్డి. ఈ నేపథ్యంలోనే రీసెంట్‌గా సెన్సేషన్ అవుతున్న సాంగ్ 'ఉ అంటావా మావ... ఉఊ అంటావా మావ' పాటకు స్టెప్పులేసింది అషు. ఆమె చేసిన ఈ సాంగ్ ప్రోమో వీడియో రిలీజ్ చేయడంతో ఆన్ లైన్ మాధ్యమాలు షేక్ అవుతున్నాయి. అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ తెరకెక్కించిన ‘పుష్ప’ మూవీలోని ‘ఉ అంటావా మావ... ఉఊ అంటావా మావ’ పాట ఎంతటి సంచలనాలు సృష్టిస్తుందో చూస్తున్నాం. హీటు పుట్టించే మేకోవర్‌తో సమంత కాలుకదిపిన ఈ ఐటెం సాంగ్ దేశవ్యాప్తంగా మారు మోగుతోంది. పలువురు ఈ సాంగ్ స్పూఫ్ వీడియోలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఇదే సాంగ్‌ రీ క్రియేట్ చేస్తూ హంగామా చేసింది జూనియర్ సమంత అషు రెడ్డి. అచ్చం సమంత లాంటి కట్టుబొట్టుతో స్టెప్పేసి అభిమానులను మరింత హుషారెత్తించింది అషు. సమంతను మించి అన్నట్లుగా ఈ బిగ్ బాస్ బ్యూటీ వేసిన స్టెప్స్ వీడియోలో హైలైట్ అవుతున్నాయి. దీంతో ఈ వీడియో వైరల్ అవుతోంది. ఇకపోతే ఈ మధ్యే సంచనల దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మతో బోల్డ్‌ ఇంటర్య్వూలో పాల్గొని సోషల్‌ మీడియాలో సెన్సేషనల్‌గా మారింది అషు రెడ్డి. మనసులో ఏదీ దాచుకోకుండా అన్ని విషయాలపై ఓపెన్ అయింది ఈ ముద్దుగుమ్మ. దీంతో ఒక్కసారిగా అషు క్యారెక్టర్, ఆమె ఓపెన్‌నెస్ జనాల్లో చర్చనీయాంశం అయ్యాయి.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3mHpQdf
v

సుకుమార్‌తో చిరంజీవి మీట్.. అల్లు అర్జున్ నటనపై మెగాస్టార్ కామెంట్స్

ప్యాన్ ఇండియా మూవీ 'పుష్ప' విజయంతో అందరి ప్రశంసలు అందుకుంటున్న క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్‌ను మెగాస్టార్ అభినందనలతో ముంచెత్తారు. ఇటీవలే ‘పుష్ప’ సినిమా వీక్షించిన చిరంజీవి.. ఆ వెంటనే సుకుమార్‌ని ప్రత్యేకంగా తన ఇంటికి ఆహ్వానించి ప్రశంసించారు. సినిమా తనకు బాగా నచ్చిందని చెబుతూ సుక్కు ప్రతిభను కొనియాడారు. అన్ని భాషల్లో పుష్ప సినిమాకు లభిస్తున్న ఆదరణ పట్ల తనకెంతో ఆనందంగా ఉందని చెప్పిన చిరంజీవి.. సినిమాలో పుష్పరాజ్‌గా అల్లు అర్జున్ నటన చాలా బాగుందని, సినిమాలోని ప్రతి అంశం ఎంతో అద్భుతంగా ఉందని అన్నారు. దర్శకుడుగా సుకుమార్ పడిన తపన, కష్టం ప్రతి ఫ్రేములో కనిపించిందని, అందుకు తగ్గ ప్రతిఫలం బ్లాక్‌బస్టర్ రూపంలో వచ్చిందని సుకుమార్‌పై చిరంజీవి ప్రశంసలు గుప్పించారు. అల్లు అర్జున్ హీరోగా మైత్రీ మూవీస్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్ నిర్మించిన ఈ పాన్ ఇండియా సినిమాలో రష్మిక మందన హీరోయిన్‌గా నటించింది. మొదటిసారి అల్లు అర్జున్ ఊర మాస్ లుక్కులో కనిపించి కిక్కిచ్చారు. సుకుమార్- అల్లు అర్జున్ కాంబోలో వచ్చిన హాట్రిక్ సినిమాగా ఈ మూవీ సూపర్ సక్సెస్ సాధించింది. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రంలో అనసూయ, సునీల్ కీలకపాత్రలు పోషించారు. అల్లు అర్జున్ కెరీర్‌లో సరికొత్త రికార్డులు నమోదు చేస్తూ ప్రస్తుతం థియేటర్లలో ఈ సినిమా సక్సెస్‌ఫుల్ రన్ కొనసాగిస్తోంది. దేశవిదేశాల్లో డీసెంట్ కలెక్షన్స్ రాబడుతూ విమర్శకుల ప్రశంసలందుకుంటోంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3Ey3Doa
v

ఎన్టీఆర్ -చ‌ర‌ణ్ గొడ‌వ‌పైRRR ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో రాజ‌మౌళి క్లారిటీ !

తెలంగాణ గోండు వీరుడు కొమురం భీమ్‌గా యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, మ‌న్యం వీరుడు అల్లూరి సీతారామ‌రాజుగా మెగా ప‌వ‌ర్‌స్టార్ రామ్ చ‌ర‌ణ్ న‌టించిన చిత్రం . రెండు భిన్న ధ్రువాలు వంటి హీరోల‌తో పాన్ ఇండియా డైరెక్ట‌ర్ రాజ‌మౌళి తెర‌కెక్కించిన ఈ ఫిక్ష‌న‌ల్ పీరియాడిక్ మూవీ.. ప్ర‌పంచ వ్యాప్తంగా జ‌న‌వ‌రి 7న విడుద‌ల‌వుతుంది. తెలుగు, హిందీ, త‌మిళ‌, క‌న్న‌డ‌, మల‌యాళ బాష‌ల్లో రూపొందిన ఈ చిత్రం మ‌రో ఐదు భాష‌ల్లో అనువాద చిత్రంగా రిలీజ్‌కి సిద్ధ‌మైంది. సెన్సార్ కార్య‌క్ర‌మాలు కూడా ఎప్పుడో పూర్తి చేసేసిన రాజ‌మౌళి అండ్ టీమ్‌ ఇప్పుడు ప్ర‌మోష‌న‌ల్ యాక్టివిటీస్‌తో ఫుల్ బిజీగా ఉన్నారు. ఒకే రేంజ్ ఇమేజ్‌.. బాక్సాఫీస్ స్టామినా ఉన్న ఇద్ద‌రు అగ్ర క‌థానాయ‌కులతో రాజ‌మౌళి సినిమా అన‌గానే ముందు అంద‌రూ ఆశ్చ‌ర్య‌పోయారు. అసలు ఎలా హ్యాండిల్ చేస్తారోన‌ని కూడా అంద‌రూ భావించారు. కానీ రాజ‌మౌళి అస‌లు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సినిమాను విజ‌య‌వంతంగా పూర్తి చేశారు. సినిమా రిలీజ్‌కు సిద్ధ‌మైంది. ఎన్టీఆర్ - రామ్ చ‌ర‌ణ్ మ‌ధ్య స్నేహ బంధం చాలా ఎక్కువైంది. ప‌లు సంద‌ర్భాల్లో ఇద్ద‌రూ త‌మ మ‌ధ్య ఉన్న అనుబంధాన్ని తెలియ‌జేసిన సంగ‌తి కూడా విదితమే. ఓ సంద‌ర్భంలో అయితే ఎన్టీఆర్ - రామ్ చ‌ర‌ణ్ సెట్స్‌లో ఎలా ఉండేవార‌నే దానిపై బ‌హిరంగంగానే స్పందించారు. ఇద్ద‌రూ ఎప్పుడూ సెట్స్‌లో ఒక‌రినొక‌రు గిల్లుకుంటూ గిచ్చుకుంటూ ఉంటార‌ని.. దాని గురించి నా ద‌గ్గ‌ర‌కు వ‌చ్చి పంచాయ‌తీ పెడుతుంటార‌ని, దాని వ‌ల్ల పాతిక రోజుల త‌న‌కు కాల్షీట్స్ వేస్ట్ అయ్యాయ‌ని కూడా రాజ‌మౌళి స‌ర‌దాగా చెప్పుకొచ్చారు. రాజ‌మౌళికి ఎన్టీఆర్ చ‌క్క‌లిగింత పెట్ట‌డం, ఎన్టీఆర్‌ను అలాగే రామ్ చ‌ర‌ణ్ ఆట ప‌ట్టించ‌డం వంటి దృశ్యాలు వీడియోల రూపంలో నెట్టింట తెగ వైర‌ల్ కూడా అయ్యాయి. ఇలా RRR సెట్స్‌లో ఎన్టీఆర్ - రామ్ చ‌ర‌ణ్ అల్ల‌రి చేయ‌డం గురించి చెన్నైలో జ‌రిగిన RRR Pre Release Eventలోనూ చ‌ర్చ‌కు వ‌చ్చింది. దానికి ఎన్టీఆర్ మాట్లాడుతూ చ‌ర‌ణ్ న‌న్ను గిల్లేసి ఏమీ తెలియ‌న‌ట్లు ఉంటాడ‌ని అన్నారు. దానికి చ‌ర‌ణ్ అంతా తార‌క్ చేస్తాడ‌ని అన్నారు. మ‌ధ్య‌లో రాజ‌మౌళి క‌లుగజేసుకుని సెట్స్‌లో రామ్ చ‌ర‌ణ్ చాలా డిసిప్లెయిన్‌గా ఉంటార‌ని, త‌ను గుడ్ బాయ్ అని అన‌డ‌మే కాకుండా.. ఎన్టీఆర్ బ్యాడ్ బాయ్ అని అన్నారు. ఈ స‌ర‌దా సంభాష‌ణ త‌మిళ తంబీల‌ను తెగ ఆక‌ట్టుకుంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3ezqwNe
v

Monday 27 December 2021

సమంత గోవా వెకేషన్.. ప్రకృతి అందాల నడుమ ఆ ఇద్దరితో ఎంజాయ్

ఇటీవలే నాగ చైతన్యతో విడాకుల విషయాన్ని అధికారికంగా ప్రకటించిన .. ప్రస్తుతం తన కెరీర్ పట్ల ప్రత్యేక శ్రద్ద తీసుకుంటోంది. విడాకుల అనంతరం రూటు మార్చిన ఈ ముద్దుగుమ్మ పుష్పలో ఐటెం సాంగ్ చేసి తనలోని మరో కోణాన్ని బయటపెట్టింది. మరోవైపు సినిమాల విషయంలో మరింత దూకుడుగా వ్యవహరిస్తూ టాలీవుడ్ సహా బాలీవుడ్‌, హాలీవుడ్‌ సినిమాలకు సైన్‌ చేస్తోంది. విడాకుల తాలూకు వ్యవహారాన్ని పూర్తిగా మరచిపోయేలా దేశాన్ని చుట్టి వస్తూ పలు పర్యాటక ప్రదేశాలను సందర్శిస్తోంది సమంత. ఈ క్రమంలోనే ఈ ఏడాది న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసం తన స్నేహితులతో కలిసి గోవా వెళ్ళింది. తన బెస్ట్‌ఫ్రెండ్‌ శిల్పారెడ్డి సహా మరో ఫ్రెండ్‌తో కలిసి గోవా టూర్‌ చేస్తోంది సామ్. ఇక ఎప్పటిలాగే ఇందుకు సంబంధించిన ఫోటోలను #goayoubeauty అనే ట్యాగ్‌ లైన్‌తో తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ అక్కడి ప్రతి ఎంజాయ్ మూమెంట్ అభిమానులతో పంచుకుంటోంది. తాజాగా సమంత షేర్ చేసిన ఫొటోల్లో తన ఇద్దరూ స్నేహితురాళ్ళతో కలిసి స్విమ్‌సూట్‌లో దర్శనమిచ్చింది సమంత. దీంతో ఈ ఫోటోస్ ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతున్నాయి. కొత్త సంవత్సరానికి స్వాగతం పలికేందుకు ఇంకా కేవలం నాలుగు రోజులే సమయం ఉండటంతో తన న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అక్కడే ప్లాన్ చేసుకుందట సమంత. ఇక సమంత సినిమాల విషయానికొస్తే.. ఇటీవలే `శాకుంతలం` సినిమా కంప్లీట్ చేసి ఆ వెంటనే 'యశోద' మూవీ షూటింగ్‌ కంప్లీట్‌ చేసింది. కోలీవుడ్‌లో విజయ్ సేతుపతి సరసన `కాథువాకుల రెండు కాదల్` అనే సినిమాలో, అలాగే `అరేంజ్ మెంట్స్ ఆఫ్ లవ్` అనే విదేశీ చిత్రంలోనూ నటిస్తోంది సామ్. వీటితో పాటు రాజ్‌-డీకే దర్శకత్వంలో ఓ వెబ్‌సిరీస్‌కు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ఎన్టీఆర్- కొరటాల శివ కాంబోలో రాబోతున్న కొత్త ప్రాజెక్టులో కూడా సమంతనే హీరోయిన్‌గా తీసుకున్నారని తెలుస్తోంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3eur8Uz
v

Pushpa: దాక్షాయణి రోల్ కోసం అనసూయ ఎంత తీసుకుందంటే.. పార్ట్ -2లో ఆమె క్యారెక్టర్!

బుల్లితెర, వెండితెరలపై సత్తా చాటుతోంది భరద్వాజ్. చిన్నితెరపై యాంకర్‌గా జబర్దస్త్ పాపులారిటీ కూడగట్టుకొని తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న అనసూయ.. అటు వెండితెరపై కూడా అదే హవా నడిపిస్తోంది. సిల్వర్ స్క్రీన్‌పై అనసూయ అభినయానికి మంచి మార్కులు పడుతున్నాయి. దీంతో తన స్థాయిని మరింత పెంచుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది ఈ బ్యూటీ. ఈ నేపథ్యంలోనే ఇటీవలే వచ్చిన 'పుష్ప' సినిమాలో దాక్షాయణిగా డిఫరెంట్ రోల్ చేసింది. అయితే ఈ రోల్ కోసం ఆమె తీసుకున్న రెమ్యూనరేషన్‌పై ఆసక్తికర విషయాలు బయటకొచ్చాయి. అల్లు అర్జున్- సుకుమార్ కాంబోలో వచ్చిన 'పుష్ప' సినిమా పాజిటివ్ రెస్పాన్స్ తెచ్చుకొని బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల ప్రవాహం పారిస్తోంది. ఈ సినిమాలో అల్లు అర్జున్ రోల్ సహా అన్ని క్యారెక్టర్స్‌కి మంచి స్పందన లభించింది. దాక్షాయణిగా అనసూయ రూపం ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయింది. కాకపోతే ఈ రోల్‌కి ఇంకాస్త స్క్రీన్ స్పేస్ ఇస్తే బాగుండేదనే అభిప్రాయలు వ్యక్తమయ్యాయి. రెగ్యులర్ క్యారెక్టర్స్ కాకుండా ఇలాంటి నటనకు ప్రాధాన్యత రోల్స్ ఎంపిక చేసుకుంటూ అలరిస్తున్న అనసూయ రెమ్యూనరేషన్ విషయంలో కూడా ఎక్కడా తగ్గడం లేదట. ఈ క్రమంలోనే పుష్ప సినిమాలో ఆమె చేసిన దాక్షాయణి పాత్ర కోసం ఏ స్థాయిలో రెమ్యూనరేషన్ అందుకుందనేది ప్రస్తుతం హాట్ టాపిక్ అయింది. రోజువారి లెక్కన రోజుకు 1.5 లక్ష నుంచి రెండు లక్షల మధ్య ఛార్జ్ చేసిందట ఈ జబర్దస్త్ బ్యూటీ. వారానికి పైగా ఆమె షూటింగ్‌లో పాల్గొందని, మొత్తంగా 15 లక్షలకు పైగా ఆమెకు ముట్టాయని సమాచారం. ఇకపోతే పార్ట్ -2లో అనసూయ రోల్ మరింత హైలైట్ కానుందని అంటున్నారు. పుష్ప రెండో భాగంలో ఆమెకు స్క్రీన్ స్పేస్ ఎక్కువగా ఉంటుందని చెప్పుకుంటున్నారు. ఫిబ్రవరి నెల నుంచి ఈ సినిమా పట్టాలెక్కనుంది. మరోవైపు తన ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ రోల్స్ చాలా జాగ్రత్త పడుతున్న అనసూయ.. ఎంత ఆఫర్ చేసినా తనకు నచ్చితేనే ఓకే చెబుతోందట.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3sy0S3U
v

చచ్చిపోయా.. ఆ వీడియో షేర్ చేస్తూ సమంత రియాక్షన్! మనసులోని స్ట్రాంగ్‌ ఫీలింగ్స్ బయటపెట్టిందిలే..

పట్టలేని ఆనందం వచ్చినా, ఆపుకోలేని దుఃఖం వచ్చినా.. చచ్చిపోయారా బాబు అనేది సాధారణంగా సగటు మనిషి నోట పలికే మాట. స్టార్ హీరోయిన్ కూడా అచ్చం అలాగే ఫీల్ అవుతోంది. తాను రీసెంట్‌గా చేసిన ఐటెం సాంగ్ రెస్పాన్స్ చూసి ఆనందం తట్టుకోలేక 'డెడ్' అనేసింది సామ్. ఈ మేరకు తనలోని స్ట్రాంగ్ ఫీలింగ్స్ ఆ ఒక్క పదం రూపంలో బయటపెడుతూ ట్విట్టర్‌లో పోస్ట్ పెట్టింది సమంత. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ తీర్చిదిద్దిన 'పుష్ప' సినిమాలో సమంత ఐటెం సాంగ్ చేసిన విషయాన్ని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనేలేదు. ''ఉ అంటావ మావ.. ఉ ఊ అంటావ మావ'' అంటూ హీటెక్కించింది సామ్. దీంతో జనరల్‌గా సుక్కు ఐటెం సాంగ్‌కి ఉండే డిమాండ్‌ని 100 రెట్లు పెంచేసింది ఈ సాంగ్. అల్లు అర్జున్‌తో కలిసి సమంత చేసిన డాన్సింగ్ మూమెంట్స్ తెగ ఎంజాయ్ చేస్తున్నారు ఆడియన్స్. ఇక యూట్యూబ్‌లో ఈ సాంగ్ సృష్టిస్తున్న అలజడి అంతాఇంతా కాదు. ఎక్కడ చూసినా ఈ సాంగ్ మోత మోగుతోంది. చిన్న- పెద్ద అనే వయసు బేధం, ఆడ- మగ అనే లింగ బేధం లేకుండా ప్రతి ఒక్కరి పెదాలపై ఇదే సాంగ్ కదలాడుతోంది. ఎంతోమంది ఈ పాటను స్ఫూప్‌ వీడియోలు చేశారు. సాంగ్ రీక్రియేట్‌ చేసి రీల్స్‌, షార్ట్స్‌ రూపంలో సోషల్ మీడియాలో షేర్ చేయడంతో సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఈ నేపథ్యంలోనే ఓ చిన్నారి వీడియో వైరల్ అయింది. తన తల్లి ‘హు( Who)’ అనే ఇంగ్లీష్ పదాన్ని నేర్పే ప్రయత్నం చేస్తుంటే ఆ పాప మాత్రం క్యూట్‌గా ‘ఉ అంటావా మావ.. ఉ ఊ అంటావా మావ’ అని పాడేస్తోంది. అయితే ఈ వీడియో సమంత కంట పడటంతో సంతోషం పట్టలేక దాన్ని తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేస్తూ 'డెడ్' అని ట్యాగ్ లైన్ జత చేసింది. దీంతో సమంత ఫ్యాన్స్ ఇది చూసి క్రెడిట్ అంటే ఇలా ఉంటుంది మరి అంటూ కామెంట్స్ చేస్తున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3sIe6en
v

తారక్‌ది చైల్డిష్ మెంటాలిటీ.. చరణ్ లాంటి మైండ్ సెట్ ఎక్కడా చూడలేదు: రాజమౌళి ఓపెన్ కామెంట్స్

కెరీర్ ఆరంభంలో ఉన్న తారక్‌తో పోల్చితే ఇప్పటి తారక్‌లో ఎన్నో వేరియేషన్స్ చూస్తున్నాం. అంచెలంచెలుగా తన నటన, డాన్స్ ప్రతిభను మెరుగుపర్చుకొని అశేష ప్రేక్షకాదరణ పొందుతున్నారు . అయితే తారక్‌లోని ఆ ట్రాన్స్‌ఫర్‌మేషన్, ఆ ఎనర్జీకి కారణం దర్శక ధీరుడు అంటుంటారు. ఎప్పుడైతే 'యమ దొంగ' సినిమాలో తారక్ రూపాన్ని మార్చేస్తూ తెరపై ప్రెజెంట్ చేశారో అప్పటినుంచి జర్నీ తిరుగేలేకుండా సాగుతోంది. తాజాగా అలాంటి తారక్‌పై అదే రాజమౌళి ఓపెన్ కామెంట్స్ చేశారు. ఎన్టీఆర్, హీరోలుగా భారీ మల్టీస్టారర్ సినిమా RRR రూపొందించి పలు భాషల్లో జనవరి 7న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు జక్కన్న. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఈ సినిమా ప్రమోషన్స్ చేపడుతున్న ఆయన.. గత రాత్రి చెన్నైలో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఉదయ నిధి స్టాలిన్, శివ కార్తికేయన్, ఆర్బీ చౌదరిలు ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఈ వేదికపై RRR సినిమాను ఉద్దేశిస్తూ ఎన్టీఆర్, రామ్ చరణ్‌లపై రాజమౌళి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. నాకంటే తానే సీనియర్‌ అని తారక్‌ ఎప్పుడూ గొడవ పడుతుంటాడని, తారక్‌ ప్రేమను తట్టుకోవటం చాలా కష్టమని రాజమౌళి అన్నారు. ఉదయం 7 గంటలకు సెట్‌కు రమ్మంటే 6 గంటలకే వచ్చేస్తాడు కాబట్టి నీకు టైమ్ సెన్స్ లేదని తారక్‌ని ఎప్పుడూ తిడుతుంటానంటూ సరదా కామెంట్ చేశారు జక్కన్న. తారక్‌ది లయన్‌ పర్సనాలిటీ, చైల్డ్‌ మెంటాలిటీ అని చెప్పిన రాజమౌళి.. ఇలాంటి నటుడు దొరకడం భారతీయ చలన చిత్ర పరిశ్రమ అదృష్టమంటూ ఆయన ఎనర్జీని ఆకాశానికెత్తారు. ఇకపోతే ఎలాంటి ఒత్తిడి లేకుండా క్లియర్‌ మైండ్‌తో సెట్‌కు వచ్చే వ్యక్తి రామ్ చరణ్ అని, అతన్ని ‘మై హీరో’ అంటుంటానని రాజమౌళి చెప్పారు. ‘మీకేం కావాలి. దాన్ని నేను ఎలా చేయగలను’ అని ఆలోచించే మెంటాలిటీ చెర్రీదని, ఇలాంటి మెంటాలిటీని నేను ఎవరిలోనూ చూడలేదని చెప్పారు. చరణ్‌, తారక్‌.. ఈ ఇద్దరిలో దక్షిణ ధ్రువం ఒకరైతే ఉత్తర ధ్రువం మరొకరు. ఈ రెండు ధ్రువాలు RRR అనే అయస్కాంతానికి అతుక్కునందుకు తనకెంతో సంతోషంగా ఉందని జక్కన్న చెప్పారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3JqTFJ4
v

Sunday 26 December 2021

మెగా క్యాంప్ రిక్వెస్ట్‌...కీర్తి సురేష్ భర్తగా మారుతున్న యంగ్ హీరో!

టాలీవుడ్ యంగ్ హీరో స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్‌కి భ‌ర్త‌గా మార‌బోతున్నార‌ట‌. అదేంటి? హీరోయిన్‌గా ఫుల్ బిజీగా ఉందిగా! అప్పుడే ఎందుకు పెళ్లి చేసుకుంటుంద‌నే సందేహం కూడా చాలా మందికి రావ‌చ్చు. ఇంత‌కీ ఈ ప్ర‌పోజ‌ల్ పంపిందెవ‌రో తెలుసా? మెగాస్టార్ చిరంజీవికి చెందిన క్యాంప్ అని సినీ వ‌ర్గాల్లో వినిపిస్తోన్న గుస‌గుస‌లు. ఇంత‌కీ కీర్తి సురేష్ భ‌ర్త‌గా మార‌బోతున్న టాలీవుడ్ యంగ్ హీరో ఎవ‌రంటే.. నాగ శౌర్య‌. నాగ శౌర్య‌తో కీర్తి సురేష్ పెళ్లి జ‌ర‌గ‌నుందా? అంటే అవునండోయ్ అన‌క త‌ప్పదు మ‌రి. అయితే రియ‌ల్ లైఫ్‌లో కాదులెండి.. రీల్ లైఫ్‌లో. అదే ఇక్క‌డ అస‌లు మెళిక. అస‌లేం జ‌రిగింద‌నే వివ‌రాల్లోకి వెళితే, మెగాస్టార్ న‌టిస్తోన్న 155వ చిత్రం ‘భోళా శంకర్’. అన్నా చెల్లెల మధ్య అనుబంధం ప్రధానంగా సాగే సినిమా ఇది. ఇందులో చిరంజీవి చెల్లెలుగా ప్రముఖ హీరోయిన్ కీర్తి సురేష్ నటిస్తోన్న సంగతి తెలిసిందే. అలాగే మరో హీరోయిన్ తమన్నా ఇందులో చిరంజీవికి జోడీగా నటించనుంది. ఇందులో కీర్తి సురేష్‌కి పెళ్లి చూపుల స‌న్నివేశం ఉంది. అందులో పెళ్లి కొడుకుగా న‌టించ‌డానికి ఎవ‌రినో పెట్ట‌లేరు. ఎందుకంటే, కీర్తి సురేష్ జోడీగా క‌నిపించాలంటే ఆ మాత్రం ఉండాలి. కాబ‌ట్టి నాగ‌శౌర్య అయితే సూట్ అవుతాడ‌ని మేక‌ర్స్ భావించార‌ట‌. భోళా శంక‌ర్‌లో ఓ చిన్న అతిథి పాత్ర అయిన కీర్తి సురేష్‌కు కాబోయే భ‌ర్త పాత్ర‌లో క‌నిపించాల‌ని నాగ శౌర్య‌ను అడిగార‌ట‌. మెగాస్టార్ చిరంజీవితో ఉన్న అనుబంధం కార‌ణంగా .. బోళా శంక‌ర్‌లో న‌టించే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉన్నాయ‌ని సినీ వ‌ర్గాల్లో బ‌లంగా వార్త‌లు వినిపిస్తున్నాయి. మెగాస్టార్ చిరంజీవి టైటిల్ పాత్ర‌లో న‌టిస్తోన్న ఈ చిత్రానికి మెహ‌ర్ ర‌మేష్ ద‌ర్శ‌కుడు. ఎ.కె.ఎంట‌ర్‌టైన్మెంట్స్ బ్యాన‌ర్‌పై రామ‌బ్ర‌హ్మం సుంక‌ర‌, అనీల్ సుంక‌ర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్ప‌టికే సినిమా చిత్రీక‌ర‌ణ స్టార్ట్ అయ్యింది. కోల్ క‌త్తా బ్యాక్ డ్రాప్‌లో సాగే మూవీ ఇది. త‌మిళంలో అజిత్ హీరోగా న‌టించిన వేదాళం రీమేక్‌. ఇప్ప‌టికే ఆచార్య చిత్రీక‌ర‌ణ‌ను పూర్తి చేసిన చిరంజీవి ఒక వైపు బాబీ డైరెక్ష‌న్‌లో సినిమా చేస్తూనే, భోళా శంక‌ర్ సినిమా షూటింగ్‌ను కూడా పూర్తి చేస్తూ వ‌స్తున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3Hb9Gkc
v

పాము కాటుపై సల్మాన్ ఖాన్ వివరణ.. ఆ విష సర్పం ఎన్నిసార్లు కాటేసిందంటే! హెల్త్ అప్‌డేట్ ఇచ్చిన హీరో

బాలీవుడ్‌ స్టార్‌ హీరో పాము కాటుకు గురైన సంగతి తెలిసిందే. పన్వేల్‌లోని తన ఫామ్‌ హౌస్‌లో శనివారం రాత్రి ఆయనను ఓ పాము కాటేయడంతో స‌ల్మాన్ భాయ్ వ్య‌క్తిగ‌త సిబ్బంది ఆయ‌నను వెంట‌నే ముంబైలోని ఓ ఆసుపత్రికి తరలించారు. అక్కడ సల్మాన్‌ని ప‌రిశీలించిన వైద్యులు భ‌య‌ప‌డాల్సిందేమీ లేద‌ని, ఆరోగ్య ప‌రంగా ఎలాంటి ఇబ్బంది లేద‌ని తేల్చిచెప్పడంతో ఆయన అభిమానులు, సన్నిహితులు కాస్త ఊపిరి పీల్చుకున్నారు. అయితే తాజాగా తాను పాము కాటుకు ఎలా గురయ్యాననే విషయాన్ని స‌ల్మాన్ స్వయంగా వెల్లడించారు. ''నా ఫామ్‌ హౌస్‌లోకి ఓ పాము రావడంతో దాన్ని నేను కర్రతో బయట వదిలేద్దామని తీసుకెళ్లబోయాను. కానీ ఆ పాము మెల్లగా నా చేతిపైకి వచ్చేసింది. దాన్ని పట్టుకుని విడిపించడానికి చాలా ప్రయత్నించా. ఆ సమయంలోనే నన్ను మూడు సార్లు కాటేసింది. అది ఓ రకమైన విషపూరిత పాము. ఆ సర్పం కాటేసిన అనంతరం 6 గంటల పాటు ఆస్పత్రిలో చికిత్స అందించారు. ప్రస్తుతం ఆరోగ్యంగానే ఉన్నా" అని సల్మాన్ ఖాన్ చెప్పారు. చికిత్స అనంతరం ఆదివారం ఉదయం సల్మాన్‌ ఖాన్ తిరిగి తన ఫామ్‌ హౌస్‌ చేరుకున్నారని సమాచారం. ఇకపోతే నేడు (డిసెంబర్‌27) సల్మాన్ 56వ పుట్టిన రోజు కావడంతో పలువురు ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు ఆయనకు సోషల్ మీడియా వేదికగా పెద్దఎత్తున బర్త్‌ డే విషెస్‌ తెలుపుతున్నారు. ప్రస్తుతం సల్మాన్.. ‘ఏక్‌ థా టైగర్’ సీక్వెల్‌, ‘టైగర్‌ 3’ సినిమాలతో బిజీగా ఉన్నారు. కాగా తన 56వ పుట్టిన రోజు ప్రేక్షకులకు సరైన ట్రీట్ ఇచ్చారు ఈ బాలీవుడ్ సూపర్ స్టార్. తన తదుపరి మూవీ టైటిల్‌ను ఆయనే స్వయంగా ప్రకటించారు. తన అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న “భజరంగి భాయిజాన్” సీక్వెల్ టైటిల్‌ రివీల్ చేశారు సల్మాన్. ఈ చిత్రానికి ‘పవన్ పుత్ర భాయిజాన్’ అనే టైటిల్ ఫిక్స్ చేసినట్లు తెలిపారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3esEAs4
v

Pushpa Making Video: తెర వెనుక పుష్పరాజ్ కష్టం.. అబ్బుర పరుస్తున్న ఆన్ లొకేషన్ సీన్స్

స్టైలిష్ స్టార్ మాస్ గెటప్ వేస్తే ఆ బీభత్సం ఎలా ఉంటుందనేది ప్రేక్షకులకు నేరుగా చూపించేశారు సుకుమార్. ఆయన దర్శకత్వంలో రూపొందిన పుష్ప సినిమాలో అల్లు అర్జున్ రోల్ ఓ రేంజ్ రెస్పాన్స్ తెచ్చుకుంది. ఈ సినిమాతో బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తున్నారు బన్నీ. ప్యాన్ ఇండియా స్థాయిలో విడుదలైన ఈ సినిమాకు తెలుగుతో పాటు అన్ని భాషల్లోనూ హ్యూజ్ రెస్పాన్స్ వస్తుండటంతో చిత్రయూనిట్ ఆనందంలో మునిగితేలుతోంది. ఈ నేపథ్యంలో మేకింగ్‌ వీడియో రిలీజ్ చేసి తెర వెనుక పుష్పరాజ్ సహా చిత్రబృందం పడిన కష్టాన్ని కళ్ళకు కట్టినట్లు చూపించారు. సోషల్ మీడియా వేదికగా ఆదివారం విడుదల చేసిన ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఈ వీడియోలో పుష్పరాజ్ యాక్షన్ సీన్స్ మొదలుకొని, సాంగ్స్ మేకింగ్, కీలక సన్నివేశాల చిత్రీకరణకు సంబంధించిన దృశ్యాలు చూపించారు. అడవిలో వేసిన సెట్స్‌, ఆర్టిస్ట్‌లు, టెక్నీషియన్ల సమన్వయం ఇలా అన్ని కోణాలను టచ్ చేస్తూ ఈ వీడియో వదిలారు. పుష్ప సెట్స్‌పై ఉండగా ఈ మూవీ షూటింగ్ చూసేందుకు వచ్చిన దర్శకుడు వి.వి. వినాయక్‌, అల్లు అర్జున్‌ తనయ అర్హలను ఈ వీడియోలో చూపించి బన్నీ అభిమానులను మరింత హూషారెత్తించారు. అల్లు అర్జున్ కెరీర్‌లో తొలి పాన్ ఇండియా మూవీగా వచ్చిన ఈ సినిమాతో ఆయన మాస్ యాంగిల్ బయటపడింది. ప్రస్తుతం కలెక్షన్స్ పరంగా ఈ మూవీ హవా నడుస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్‌, ముత్తంశెట్టి మీడియా సంస్థల సంయుక్త సమర్పణలో రూపొందిన ఈ చిత్రం తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో విడుదలైంది. చిత్రంలో బన్నీ సరసన రష్మిక మందన నటించగా.. అనసూయ, సునీల్ కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా రెండో భాగాన్ని వచ్చే ఏడాది ఫిబ్రవరిలో స్టార్ట్ చేయబోతున్నట్లు తెలిపారు డైరెక్టర్ సుకుమార్.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3FzqUY0
v

అనుష్కతో నవీన్ పోలిశెట్టి.. ఫస్ట్ లుక్‌ రిలీజ్.. జాతి రత్నం డబుల్ ట్రీట్!!

విలక్షణ కథలతో సెలక్టెడ్ సినిమాలు ఎంచుకుంటూ ముందుకెళ్తున్నారు హైదరాబాదీ కుర్రోడు . లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమాతో తెలుగుతెరపై కాలుమోపిన ఈ కుర్ర హీరో రీసెంట్‌గా 'జాతి రత్నాలు' సినిమాతో తెగ అట్రాక్ట్ చేశారు. తనదైన నాచురల్ నటనతో ఆకట్టుకొని అన్నివర్గాల ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించారు. ఈ మూవీ తర్వాత చాలా ఆఫర్లు వచ్చినా కాస్త గ్యాప్ తీసుకొని మరీ కథల ఎంపిక చేసుకున్నారు నవీన్. ఈ నేపథ్యంలోనే ఒకేసారి రెండు సినిమాలతో బరిలోకి దిగుతున్నారు. నవీన్ పోలిశెట్టి పుట్టినరోజు సందర్భంగా ఒకేసారి ఆయన రెండు కొత్త సినిమాల ప్రకటన రావడం విశేషం. పుట్టిన రోజున ప్రేక్షకులకు డబుల్ ట్రీట్ ఇచ్చిన నవీన్.. ఓ సినిమాలో అనుష్కతో తెర పంచుకోబోతున్నారు. శెట్టి చేయబోయే తదుపరి సినిమాలో నవీన్ భాగం కాబోతున్నట్లు తెలుపుతూ అధికారిక ప్రకటన చేసింది యూవీ క్రియేషన్స్ బ్యానర్. ఈ మేరకు కొత్త పోస్టర్ రిలీజ్ చేస్తూ ఆయన అభిమానుల్లో జోష్ నింపారు మేకర్స్. రా రా కృష్ణయ్య దర్శకుడు మహేష్ ఈ మూవీకి దర్శకత్వం వహించనున్నారు. రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమాను తీర్చిదిద్దనున్నారని, ఇందులో అనుష్క శెట్టి నాలుగు పదుల వయసులో ఉన్న మహిళగా కనిపించనుందని సమాచారం. అయితే ఆమె కంటే వయసులో చిన్నవాడైన నవీన్ పోలిశెట్టి ఆమె ప్రేమలో పడటం, ఆ తర్వాత చోటుచేసుకునే పరిస్థితుల నేపథ్యంలో ఈ సినిమా ఉండబోతుందని ఇన్‌సైడ్ టాక్. ఇకపోతే సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫర్చ్యూన్‌ 4సినిమాస్‌ బ్యానర్లపై మరో సినిమాకు కమిటయ్యారు నవీన్ పోలిశెట్టి. అయితే ఆయన బర్త్ డే సందర్భంగా ఈ సినిమా నుంచి కూడా అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఇస్తూ కొత్త పోస్టర్ రిలీజ్ చేశారు. నవీన్‌కి సంబంధించి ఈ రెండు అప్‌డేట్స్ చూశాక ఆయన ఫ్యాన్స్ ఖుషీ ఖుషీ అవుతున్నారు. వచ్చే ఏడాది థియేటర్లలో నవీన్ సందడి మామూలుగా ఉండబోదంటూ కామెంట్స్ చేస్తున్నారు. సో.. చూడాలి మరి ఈ రెండు సినిమాలతో జాతి రత్నం ఎలాంటి హిట్స్ ఖాతాలో వేసుకుంటారనేది!.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3sBhis8
v

సినీ పరిశ్రమలో విషాదం.. ప్రముఖ గాయకుడు మృతి

చిత్రసీమలో మరో విషాదం చోటుచేసుకుంది. ప్ర‌ముఖ సింగర్, నటుడు (73) కన్నుమూశారు. గత కొన్ని నెలలుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆదివారం రాత్రి తుది శ్వాస విడిచారు. తన వృత్తి పరమైన జీవితంలో గాయకుడిగా పలు పాటలతో ప్రేక్షకులను ఉర్రూతలూగించారు మాణిక్య వినాయగం. త‌మిళ‌నాడులోని మైలాడుతురైలో 1943 డిసెంబరు 10న జన్మించిన మాణిక్య వినాయగం అత‌ని మేన‌మామ‌, ప్రమఖ సింగర్ ఎస్‌ జయరామన్ వ‌ద్ద సంగీత విద్యనభ్యసించి 2001 సంవత్సరంలో సినీ రంగంలో అడుగుపెట్టారు. ‘దిల్‌’ అనే తమిళ చిత్రంతో గాయకుడిగా కెరీర్ ఆరంభించారు. అప్పటినుంచి కెరీర్ మొత్తంలో అన్ని భాషల్లో కలిపి 800లకిపైగా పాటలు పాడిన ఘనత ఆయన సొంతం. దాదాపు దక్షిణాది అన్ని భాషల్లో తన గాత్రాన్ని వినిపించి ప్రేక్షకులను మెప్పించారు మాణిక్య వినాయగం. సినిమా పాటలు మాత్రమే కాకుండా ఆధ్యాత్మిక, జానపద గీతాలను కూడా ఆలపించారు. తెలుగులో మెగాస్టార్ చిరంజీవి హీరోగా రూపొందిన ‘శంకర్‌ దాదా MBBS’ చిత్రంలోని ‘పట్టుపట్టు చేయ్యే పట్టు’ పాటతో టాలీవుడ్‌ ప్రేక్షకులను మైమరిపించారు. గాయకుడిగానే కాకుండా నటుడిగానూ చిత్రసీమలో తనదైన ముద్రవేశారు మాణిక్య వినాయగం. ఆయన మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సామాజిక మాధ్యమాల వేదికగా సంతాపం వ్యక్తం చేస్తున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3qpJ8oA
v

Radhe Shyam కోసం తమన్.. బ్యాక్ గ్రౌండ్‌తో మరోసారి బాక్సులు బద్దలే!

ప్రభాస్ సినిమా మీద ఇప్పుడున్న అంచనాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ట్రైలర్ రిలీజ్ తరువాత రాధే శ్యామ్ రేంజ్ మరింతగా మారింది. ట్రైలర్‌లో విజువల్స్, సాంగ్స్, లొకేషన్స్, మ్యూజిక్, పూజా హెగ్డే కెమిస్ట్రీ మామూలుగా లేదు. ప్రభాస్ దెబ్బకు సోషల్ మీడియా రికార్డులన్నీ బద్దలైపోయాయి. బాహుబలి 2తో క్రియేట్ చేసిన రికార్డులను రాధే శ్యామ్‌తో చెరిపేశాడు. అలా రాధే శ్యామ్ సినిమా మీద పెరిగిన అంచనాలకు తగ్గట్టుగానే ఉండాలని చిత్రయూనిట్ ఇంకా జాగ్రత్తలు తీసుకుంటోంది. అయితే ఈ సినిమా కోసం హిందీకి ఓ మ్యూజిక్ డైరెక్టర్.. దక్షిణాదికి ఓ మ్యూజిక్ డైరెక్టర్‌ను పెట్టిన సంగతి తెలిసిందే. డియర్ కామ్రేడ్ ఫేమ్ జస్టిన్ ప్రభాకరణ్ ఇచ్చిన సంగీతం దక్షిణాది ప్రేక్షకులను ఆకట్టుకుంది. పాటలన్నీ హిట్ అయ్యాయి. అయితే బ్యాక్ గ్రౌండ్ విషయంలో మాత్రం చిత్రయూనిట్ ప్రయోగం చేసేందుకు రెడీగా లేదు. అందుకే నేపథ్య సంగీతం కోసం తమన్‌ను తీసుకున్నారు. ఈ మేరకు చాలానే రూమర్లు గతంలో వచ్చాయి. ఇప్పుడు అవే రూమర్లు నిజమయ్యాయి. మొత్తానికి మాత్రం రాధే శ్యామ్ యూనిట్‌తో కలిసి పని చేయబోతోన్నాడు. ఈ సినిమా అంతా కూడా ప్రేమతోనే నిండిపోయింది.. ఈ సారి ప్రేమికుల దినోత్సవాన్ని ఇంకాస్త ముందు జరుపుకోబోతోన్నారు.. మళ్లీ మళ్లీ మళ్లీ ప్రేమలో పడేందుకు సిద్దంగా ఉండండి.. ఇక ఇందులో నా ప్రాణం పెట్టి కొడతాను అని తమన్ చెప్పుకొచ్చాడు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3ptM3gK
v

అనసూయ టచ్ చేసింది!.. గాల్లో తేలిపోయిన అభిమాని

బుల్లితెర అయినా వెండితెర అయినా అడుగు పెడితే సందడి వేరే లెవెల్‌లో ఉంటుంది. ఇక అనసూయ లాంటి గ్లామరస్ బ్యూటీలు బయటకు వస్తే జనాలు ఎలా ఎగబడతారో అందరికీ తెలిసిందే. కరోనా, ఒమిక్రాన్ వంటివి కూడా జనాలను ఆపలేవు. అలా ఖమ్మంలో షాపింగ్ మాల్ ఓపెనింగ్‌కు వెళ్లిన అనసూయ కోసం ఆమె అభిమానులు తండోపతండాలుగా వచ్చారు. ఇక అనసూయతో ఫోటోలు దిగేందుకు, సెల్ఫీల కోసం నానా రకాల పాట్లు పడ్డారు. అయితే కొంత మందికి అనసూయకు అవకాశం ఇచ్చింది.. ఇంకొంత మందికి ఇవ్వలేకపోయింది. అనసూయ ఖమ్మంలో సందడి చేసిన వీడియోలు ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. ఇందులో ఓ అభిమాని మాత్రం ఫుల్ ఖుషీ అవుతున్నాడు. అనసూయ తన చేతిని తాకిందంటూ గాల్లో తేలిపోయాడు. ఇదే విషయాన్ని సోషల్ మీడియాలో చెప్పుకొచ్చాడు. అలా అభిమాని సంబరపడిపోవడంపై అనసూయ స్పందించింది. అయ్యో శానిటైజ్ చేసుకోండి అని అనసూయ కౌంటర్ వేసింది. మొత్తానికి అనసూయ తన చేతిని తాకడంతో ఆ అభిమాని మాత్రం గాల్లో తేలిపోయాడు. అనసూయ ఈ మధ్య సినిమాతో మరోసారి ట్రెండింగ్‌లోకి వచ్చింది. దాక్షాయణిగా అనసూయ కనిపించింది. కానీ పుష్ప సినిమాతో అనసూయ ఏమంత ప్రభావం చూపించలేదు. రంగమ్మత్తలాంటి బలమైన పాత్ర మాత్రం అనసూయకు పడలేదనిపిస్తోంది. ఈ మధ్య అనసూయ జబర్దస్త్ షోలో కూడా కనిపించడం లేదు. ఈ వారం అనసూయకు బదులుగా రష్మీ వచ్చింది. వచ్చే వారం కూడా అనసూయ స్థానంలో రష్మీనే రాబోతోందని ప్రోమోను బట్టి తెలుస్తోంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3EsMyvY
v

‘ఫోకస్’ పెట్టిన బిగ్ బాస్ బ్యూటీ.. హీరోయిన్‌గా అషూ రెడ్డి

బిగ్ బాస్ ఫేమ్ అషూ రెడ్డి.. సినిమాల్లో చాలా తక్కువగా నటించారు. బిగ్ బాస్ షో కంటే ముందుగానే ఛల్ మోహన రంగ అనే సినిమాలో కనిపించారు. బిగ్ బాస్ షో అనంతరం అంతగా సినీ అవకాశాలు రాలేదు. కానీ ఇప్పుడు బిగ్ బాస్ బ్యూటీ హీరోయిన్‌గా రాబోతోన్నారు. విజయ్‌ శంకర్‌ హీరోగా, అషూ రెడ్డి హీరోయిన్‌గా స్కైరా క్రియేషన్స్‌ సమర్పణలో రిలాక్స్‌ మూవీ మేకర్స్‌ ‘ఫోకస్‌’ అనే సినిమాను చేస్తున్నారు. ఉత్కంఠ‌భ‌రిత‌మైన స్క్రీన్‌ ప్లేతో రూపొందుతున్న ఈ చిత్రం ద్వారా జి. సూర్యతేజ ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మ‌వుతున్నారు. మర్డర్‌ మిస్టరీ బ్యాక్‌డ్రాప్‌లో ఆసక్తికరమైన మలుపులతో ప్రేక్షకులను ఆద్యంతం ఆశ్చర్యపరిచే సస్పెన్స్‌ థ్రిల్లర్‌గా ‘ఫోకస్‌’ మూవీ తెరకెక్కుతోంది. ప్ర‌ముఖ న‌టి మ‌ణిర‌త్నం కీల‌క పాత్ర పోషిస్తుండ‌గా.. బిగ్ బాస్ ఫేమ్ అషూరెడ్డి హీరోయిన్‌గా న‌టిస్తున్నారు. విజయ్‌ శంకర్ పోలీస్ ఆఫీస‌ర్ గా న‌టిస్తుండగా సుహాసిని మణిరత్నం జడ్జ్‌ పాత్రలో నటిస్తున్నారు. భాను చందర్, జీవా, షియాజీ షిండే, భరత్‌ రెడ్డి, సూర్య భగవాన్‌ ఇతర ముఖ్య‌ పాత్రల్లో కనిపిస్తారు. ‘ఫోకస్‌’ అని టైటిల్ పెట్ట‌డంతోనే తమ సినిమాపై ఇండస్ట్రీతో పాటు ఆడియన్స్‌ ఫోకస్‌ కూడా పడిందని దర్శకుడు చెప్పుకొచ్చాడు. మర్డర్‌ మిస్టరీ అండ్‌ సస్పెన్స్‌ థ్రిల్లర్స్‌ను ఇష్టపడే ప్రేక్షకులకు తమ చిత్రం కొత్త తరహా అనుభూతిని ఇస్తుందనీ, సినిమా గురించిన మరిన్ని విశేషాలు, వివరాలను త్వరలో వెల్లడిస్తామని చిత్ర ద‌ర్శ‌కుడు సూర్య‌తేజ తెలిపారు. అంతే కాకుండా అషూ తన ఇన్ స్టాగ్రాంలో ఓ పోస్ట్ చేశారు. రేపు (డిసెంబర్ 27) ఉదయం 11:55 గంటలకు సినిమాకు సంబంధించిన టైటిల్ లుక్ విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. ఇదే విషయాన్ని అషూ చెప్పుకొచ్చారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3mylrcq
v

మోసాన్ని ప్రశ్నించినందుకు తప్పుడు కేసు పెట్టారు: క‌రాటే క‌ళ్యాణి

కొన్నాళ్లు ముందు సైదాబాద్ ప‌రిధిలోని సింగ‌రేణి కాల‌నీలో ఓ మైన‌ర్ బాలిక హ‌త్య‌కు గురైంది. ఆ హ‌త్య‌కు సంబంధించిన వివ‌రాల‌ను క‌ళ్యాణి వెల్ల‌డించే ప్ర‌య‌త్నాలు ఆరోప‌ణ‌లు కూడా వ‌చ్చాయి. దీనికి సంబంధించిన ఏల్ల‌మ్మ బండ‌లోని తూటం శెట్టి నితేష్ అనే వ్య‌క్తి రంగారెడ్డి జిల్లా కోర్టులో ప్రైవేటుగా కంప్లైంట్ దాఖ‌లు చేశారు. కంప్లైంట్‌ను ప‌రిశీలించిన కోర్టు క‌రాటే క‌ళ్యాణిపై కేసు న‌మోదు చేయాల‌ని జ‌గ‌ద్గిరి గుట్ట పోలీసులను ఆదేశించింది. ఆదేశాల ప్ర‌కారం పోలీసులు క‌ళ్యాణిపై కేసు న‌మోదు చేశారు. దీనిపై న‌టి కరాటే క‌ళ్యాణి వివ‌ర‌ణ ఇస్తూ మాట్లాడారు. ఓ ఆధ్యాత్మిక సంస్థ హిందూ మ‌తం పేరుతో ప్ర‌జ‌ల నుంచి డ‌బ్బులు వ‌సూల చేస్తుంటే ప్ర‌శ్నించినందుకు త‌న‌పై త‌ప్పుగా వార్త‌లు రాయించి ట్రోల్ చేస్తున్నారంటూ క‌ళ్యాణి మండిపడ్డారు. క‌రాటే క‌ళ్యాణి మాట్లాడుతూ ‘‘శివ‌శ‌క్తి ఆధ్యాత్మిక చైత‌న్య వేదిక అనే సంస్థ‌ను స్టార్ట్ చేసిన క‌రుణాక‌ర్ సుగుణ‌, క‌ళ్యాణ్ కుమార్ చెట్ల‌ప‌ల్లి వంటి తొమ్మిది దీన్ని స్టార్ట్ చేశారు. కొంత మందిని బ‌య‌ట‌కు పంపేసి ఐదుగురు మాత్ర‌మే ఇప్పుడు డైరెక్ట‌ర్స్‌గా ఉంటూ వ‌స్తున్నారు. వీళ్లు 2020లో ఆఫీస్ స్టార్ట్ చేయాల‌ని చెబుతూ కోటి రూపాయ‌లు ఫండ్స్ క‌లెక్ట్ చేశారు. ఆఫీస్ అంతా స్టార్ట్ అయ్యింద‌ని చెప్పిన త‌ర్వాత మ‌ళ్లీ ఆరు నెల‌ల వ్య‌వ‌ధిలోనే కోటిన్న‌ర రూపాయలు ఫండ్ క‌లెక్ష‌న్స్ కోసం రెడీ అయ్యారు. ప్ర‌శ్నించినందుకు మాపై ఫేక్ ఐడీస్ క్రియేట్ చేసి ట్రోలింగ్ చేయ‌డం మొద‌లు పెట్టారు. వారు చేసిన పనులకు మా సాక్ష్యాధారాలున్నాయి. ఈ కేర్ ప్రై.లి. సెంట‌ర్‌, శివ శ‌క్తి ఫౌండేష‌న్‌, శివ శ‌క్తి ఆధ్యాత్మిక చైత‌న్య వేదిక అనే మూడు సంస్థ‌లు క‌లిసి గేమ్ ఆడుతున్నాయి. మోసం జ‌రుగుతుంద‌ని నేను ప్ర‌శ్నిస్తే.. నాపై వ్య‌క్తిగ‌తంగా ఆరోప‌ణ‌లు చేస్తున్నారు. ఇప్పుడున్న దేవిరెడ్డి ఆనంద్ రెడ్డికి ఆర్‌బీఎల్ బ్యాంకులో రెండున్న‌ర కోట్ల రూపాయ‌లు అప్పులున్నాయి. దాన్ని తీర్చ‌డం కోసం ఫండ్ రైజింగ్ పేరుతో గేమ్‌లాడుతున్నారు. నిధుల‌ను ప‌క్క దారి ప‌ట్టిస్తున్నారు. కార్పొరేట్ లెవ‌ల్లో మ‌నీ ల్యాండ‌రింగ్ జ‌రుగుతుంది. వారి మోసాల‌ను ప్ర‌శ్నించినందుకు న‌న్ను తిట్టారు. నాపై త‌ప్పుడు కేసులు పెట్టారు. నేను బాలిక కుటుంబానికి స‌పోర్ట్ చేయ‌డానికి వెళితే, నేను హ‌త్య కేసులో ఇరుక్కున్నానంటూ త‌ప్పుగా ట్రోల్ చేశారు. నేను ఏ హ‌త్య కేసులో ఇరుక్కున్నానో చెప్పాలి. ఆధారాల‌తో పోరాటం చేస్తుంటే బెదిరిస్తున్నారు’’ అన్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3Hhghd3
v

Saturday 25 December 2021

ఎన్టీఆర్‌తో సమంత.. ఇదీ ప్లాన్! వైరల్ అవుతున్న క్రేజీ అప్‌డేట్

ప్రస్తుతం RRR సినిమా ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నారు యంగ్ టైగర్ ఎన్టీఆర్. ఈ భారీ సినిమా కోసం చాలాకాలంగా కష్టపడుతున్న ఆయన సినిమా ప్రమోషన్స్ కోసం దేశవ్యాప్తంగా పర్యటిస్తున్నారు. అయితే తాజాగా RRR తర్వాత ఎన్టీఆర్ చేయబోతున్న తదుపరి ప్రాజెక్టు గురించి ఓ క్రేజీ అప్‌డేట్ బయటకొచ్చింది. మరికొద్ది రోజుల్లో ఎన్టీఆర్- కాంబోలో ఓ మూవీ పట్టాలెక్కనున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం స్క్రిప్ట్ రెడీ చేస్తున్న కొరటాల.. ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన సమంతను ఫైనల్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట. RRR తర్వాత ఎన్టీఆర్ 30వ సినిమాగా రాబోతున్న ఈ సినిమా కోసం హీరోయిన్ వేట కొనసాగుతోంది. తొలుత శ్రీ లీల నటించనుందన్నట్లుగా వార్తలు రాగా.. ఆ తర్వాత జాన్వీ కపూర్ పేరు తెరపైకి వచ్చింది. ఈ క్రమంలోనే వాళ్లెవరూ కాదని ఈ చిత్రంలో సమంతను ఫైనల్ చేయబోతున్నారనే మరో వార్త షికారు చేస్తోంది. క్రేజ్ క్యాచ్ చేస్తూ ఎన్టీఆర్‌తో మరోసారి స్టెప్పులేయించాలని కొరటాల స్కెచ్చేశారట. ఈ మేరకు స్క్రిప్ట్‌కి మెరుగులు దిద్దుతున్న కొరటాల శివ.. సమంత క్యారెక్టర్ చాలా బలంగా ఉండేలా మార్పులు చేర్పులు చేస్తున్నారట. మరికొద్ది రోజుల్లో సమంతను మీట్ అయి ఈ స్క్రిప్ట్ నేరేట్ చేయాలని ఆయన భావిస్తున్నట్లు ఇన్‌సైడ్ టాక్. భారీ బడ్జెట్ కేటాయించి రూపొందించనున్న ఈ సినిమాను సంక్రాంతి తర్వాత పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభించాలని సన్నాహాలు చేస్తున్నారట. ప్రస్తుతం పలు సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న సమంత.. ఈ ప్రాజెక్టుకి డేట్స్ ఇస్తుందో లేదో చూడాలి మరి!.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3emRfwr
v

అల్లుడు నిక్ జొనాస్ క్యారెక్టర్‌పై ప్రియాంక చోప్రా తల్లి పోస్ట్.. అతని స్వభావం ఎలాంటిదంటే..!

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ తనకంటే పదేళ్లు చిన్నవాడైన అమెరిక‌న్ సింగ‌ర్‌ నిక్ జోన‌స్‌ని ప్రేమించి పెళ్లాడిన సంగతి తెలిసిందే. కొన్నేళ్ల పాటు డేటింగ్ చేసి 2018 సంవత్సరంలో అతనితో వివాహ బంధంలోకి అడుగుపెట్టిన ప్రియాంక.. అప్పటి నుంచి భర్తతో తెగ షికార్లు కొడుతూ ఎంజాయ్ చేస్తోంది. లాస్ ఏంజిల్స్‌లో నివాసం ఉంటున్న ఈ జోడీ విడాకులు తీసుకోనుందంటూ ఇటీవల కొన్ని రూమర్స్ వైరల్ కాగా, వాటిని తిప్పికొడుతూ ఫుల్ క్లారిటీ ఇచ్చేసింది ప్రియాంక తల్లి . ఈ నేపథ్యంలోనే తన కూతురి భర్త నిక్ జొనాస్‌ని ఉద్దేశిస్తూ మరోసారి రియాక్ట్ అయ్యారు మధు చోప్రా. పెళ్లి తరవాత ప్రియాంక జోనస్‌గా పేరు మార్చుకున్న ప్రియాంక చోప్రా.. తన సోషల్ మీడియా ఖాతా నుంచి జోనస్ అనే పేరు తొలగించింది. అచ్చం సమంత తరహా లోనే ప్రియాంక కూడా ఇలా చేయడం చూసి ప్రియాంక, నిక్ విడిపోతున్నారనే ప్రచారం జరిగింది. అయితే ఈ ఇష్యూపై గతంలోనే రియాక్ట్ అయిన మధు చోప్రా.. అట్టి వార్తలను కొట్టిపారేశారు. అవన్నీ రూమర్స్ అని, ఎవ్వరూ నమ్మొద్దని చెప్పిన ఆమె.. తాజాగా తన అల్లుడు నిక్‌ ఓ జీనియస్ అంటూ పొగిడేస్తూ పోస్ట్ పెట్టారు. తాను 40 ఏళ్లు డాక్టర్‌గా పని చేశానని, అలాగే ఇద్దరు సంతోషకరమైన పిల్లలకు తల్లినని చెప్పిన మధు చోప్రా.. ఒక జీనియస్‌కు అత్తనని చెప్పారు. నిక్ జోనస్ చాలా నెమ్మదస్తుడని, ఏ విషయంలోనైనా చాలా మెచ్యూర్డ్‌గా ఆలోచించే స్వభావం ఆయనదని అన్నారు. తమ కుటుంబంలోని ప్రతి ఒక్కరూ అతన్ని ప్రేమిస్తారని ఆమె తెలపడం విశేషం.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3mu7ah2
v

35 సంవత్సరాలుగా మా రెండు కుటుంబాల మధ్య పోరు..! ఎన్టీఆర్ కామెంట్స్ వైరల్

రాను రాను మల్టీస్టారర్ సినిమాలకు డిమాండ్ పెరుగుతూ వస్తోంది. దిగ్గజ దర్శకులు, అగ్ర హీరోలు సైతం మల్టీస్టారర్ సినిమాలు తీసేందుకు ఆసక్తి చూపుతుండటం ప్రేక్షక వర్గాల్లో నూతనోత్సాహం నింపుతోంది. ఈ క్రమంలోనే యంగ్ టైగర్ , మెగా పవర్ స్టార్ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన భారీ చిత్రం . గత రెండేళ్లుగా షూటింగ్ జరుపుకుంటూ ఎట్టకేలకు ఈ సంక్రాంతి కానుకగా జనవరి 7న గ్రాండ్ రిలీజ్ కాబోతోంది ఈ సినిమా. ఈ నేపథ్యంలో చిత్ర ప్రమోషన్స్ విషయంలో తనదైన స్ట్రాటజీతో ముందుకెళ్తున్నారు జక్కన్న. పలు భాషల్లో ఈ ప్యాన్ ఇండియా సినిమా రిలీజ్ కానున్న నేపథ్యంలో అన్ని భాషా ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొల్పేలా ప్రమోషన్స్ చేపడుతున్నారు. ముంబై, చెన్నై, హైదరాబాద్ లాంటి నగరాల్లో ప్రెస్ మీట్స్ నిర్వహిస్తూ RRR విశేషాలతో హైప్ పెంచేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో ఎన్టీఆర్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. RRR సినిమా రిలీజ్ తర్వాత మరిన్ని బిగ్గెస్ట్‌ మల్టీస్టారర్‌ చిత్రాలు వచ్చే అవకాశాలున్నాయా అనే విషయమై ఎన్టీఆర్‌ ఆసక్తికరంగా స్పందించారు. ఈ విషయం ఇప్పుడు చెప్పొచ్చొ లేదో తెలియదు కానీ మా రెండు కుటుంబాల మధ్య 35 సంవత్సరాలుగా పోరు నడుస్తోందని అన్నారు. అయినా తామిద్దరం (రామ్ చరణ్- ఎన్టీఆర్) మంచి స్నేహితులని తెలిపారు. తమ మధ్య పోరు ఎప్పుడూ పాజిటివ్‌గానే ఉంటుందని చెప్పిన యంగ్ టైగర్.. RRR తర్వాత దేశంలోని గొప్ప నటీనటులంతా ఒకే తాటి పైకి వస్తారని, భారీ మల్టీస్టారర్‌ సినిమాలు వస్తాయనే నమ్మకం ఉందని అన్నారు. డీవీవీ దానయ్య సమర్పణలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో గోండు వీరుడు కొమురం భీమ్‌గా ఎన్టీఆర్‌, మ‌న్యం వీరుడుగా రామ్ చ‌ర‌ణ్ న‌టించారు. బాలీవుడ్ స్టార్స్ అజ‌య్ దేవ‌గ‌ణ్‌, ఆలియా భ‌ట్‌ భాగమయ్యారు. స‌ముద్ర ఖ‌ని, శ్రియా శ‌ర‌న్ కీలక పాత్రలు పోషించారు. హాలీవుడ్ నుంచి ఒలివియా మోరిస్‌, రే స్టీవెన్ స‌న్‌, అలిసన్ డూడి కీల‌క పాత్ర‌ల్లో కనిపించనున్నారు. RRR మూవీ కోసం యావత్ భారతదేశం ఆసక్తిగా ఎదురుచూస్తోంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3qst7Oz
v

పవన్ కళ్యాణ్ మత మార్పిళ్లను ప్రోత్సహిస్తున్నారు.. ఒళ్లు దగ్గర పెట్టుకోండి.. మాధవీ లత ఘాటు వ్యాఖ్య‌లు!

టాలీవుడ్ అగ్ర కథానాయ‌కుడు, జ‌న‌సేన పార్టీ అధి నాయ‌కుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్‌పై బీజేపీ నాయ‌కురాలు మాధ‌వీ ల‌త ఘాటు విమ‌ర్శ‌లు చేశారు. నిజానికి జ‌న‌సేన పార్టీ బీజేపీతో క‌లిసే ఉంది క‌దా, మ‌రి బీజేపీ నాయ‌కురాలైన మాధ‌వీ ల‌త ఆయ‌న‌పై ఘాటుగా ఎందుకు స్పందించారు? అనే అనుమానం రాక మాన‌దు. అస‌లు ఇంత‌కీ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఏమ‌న్నారు అనే వివ‌రాల్లోకి వెళితే, ఈ మ‌ధ్య ప‌వ‌న్ క‌ళ్యాణ్ బైబిల్ గురించి చాలా గొప్ప‌గా చెప్పారు. అయితే ఆయ‌న చెప్పినంత సీన్ లేద‌ని మాధ‌వీ ల‌త అంటున్నారు. ‘‘పవన్ కళ్యాణ్‌గారు క్రిస్మ‌స్ విషెస్ చెప్పండి. న‌మ్మిన వారికి విషెష్ అని చెప్పండి ఇంకా సంతోషం. మాన‌వాళికి అనేటువంటి పెద్ద మాట‌లు ఎందుకండి.. మీరే మ‌త మార్పిళ్ల‌ను ప్రోత్స‌హించేలా ఉంది. రెస్పెక్ట్ ఇద్దాం అంత వ‌రకే.. అక్క‌డ దేవుడు ఎవ‌రూ లేరు. మీరు రాసిన కంటెంట్‌లో విషెష్ త‌ప్ప నాకు ఏదీ న‌చ్చ‌లేదు. స‌ర్వ ప్రాణుల ప‌ట్ల అని ఏసు చెప్పిన‌ట్లు నేను మొన్న‌టి వ‌ర‌కు న‌మ్మాను. కానీ యూదుల వ‌ర‌కే ఆయ‌న ప్రేమ‌. మ‌నం యూదులం కాము. మీ పేజీని మెయిన్ టెయిన్ చేసేవాళ్ల‌ని ఒళ్లు ద‌గ్గ‌ర పెట్టుకోమ‌ని చెప్పండి. మొన్న బైబిల్ గురించి మీరు చెప్పినంత గొప్ప ఏం లేదండి. ఫ్లోలో మీరు చెప్పి మ‌త మార్పిళ్ల‌కు కార‌ణం కావ‌ద్దు. ఓ హిందువుగా మీ పోస్టుపై విచారం వ్య‌క్తం చేస్తున్నాను. మ‌న దేశంలో మ‌తం ఉందా అంటే ఉంద‌ని క‌చ్చితంగా చెప్ప‌గ‌ల‌ను. బైబిల్‌ను న‌మ్ముకున్న‌వాళ్లు స్వ‌ర్గానికి వెళ‌తారు. లేక‌పోతే న‌ర‌కానికి వెళ‌తారు. మ‌న జీవన విధానంలో బైబిల్‌ను ఫాలో అయిన వాళ్లు మాత్ర‌మే మంచి వాళ్లు అవుతార‌ని వాళ్లు చెబుతారు. మ‌నం న‌మ్మ‌లేదు కాబ‌ట్టి మ‌నం న‌ర‌కాని వెళ‌తాం. కాబ‌ట్టి మ‌నం క్రిస్మ‌స్‌ను సెల‌బ్రేట్ చేసుకోవ‌డం ఎంత వ‌ర‌కు క‌రెక్ట్‌. మ‌న ధర్మాన్మి, దేవుళ్ల‌ను వాళ్లు గౌర‌వించ‌క‌పోగా, అగౌర‌వ‌ప‌రుస్తున్నారు. అలాంట‌ప్పుడు మీరు మీ పిల్ల‌ల‌కు శాంటా గెట‌ప్ వేసి క్రిస్మ‌స్‌ను సెల‌బ్రేట్ చేసుకోవ‌డం ఎంత వ‌ర‌కు క‌రెక్ట్‌. మ‌న దేశంలో పోర్చుగీసువాళ్లు, డ‌చ్ వాళ్లు వ‌చ్చిన‌ప్పుడే మ‌న దేశంలోకి క్రిస్టియానిటి వ‌చ్చింది. వాళ్లు మ‌న దేవాల‌యాల‌ను ప‌డ‌గొట్టి, మ‌న సంస్కృతిని నాశనం చేశారు. మ‌న హిందూ ప్ర‌జ‌ల‌ను క్రిస్టియ‌న్స్‌గా మార్చే ప్ర‌య‌త్నం చేశారు. ఎన్నో అరాచ‌కాల‌ను చేశారు. నువ్వు ఈరోజు హ్యాపీ క్రిస్మ‌స్ అని పాట పాడితే మ‌న తాత ముత్తాలు మ‌న సంస్కృతి, దేశం కోసం త్యాగం చేసిన వారిని అవ‌మానప‌రిచిన‌ట్లే. ఇత‌ర మ‌త‌స్థులు మ‌న మ‌తాన్ని అగౌర‌వప‌రుస్తున్నారు. మ‌న స‌నాత‌న ధ‌ర్మం ఎక్క‌డుంది. ఎవరైనా మీకు క్రిస్మస్ కేక్ లేదా చాకలెట్స్ ఇస్తే తీసుకొనే ముందు ఒక కొబ్బరి ముక్క వెంకటేశ్వర స్వామి వారి ప్రసాదం వారికి ఇచ్చి చూడండి వాళ్ళు తీసుకొని కళ్ళకద్దుకొని తింటే అప్పుడు మీరు కేకులు చాక్లెట్లు తీసుకోండి. హిందువుల్లార జాగ్రత్త...ఎక్కడ కూడా క్రిస్మస్ వేడుకల్లో పాల్గొనకండి వాళ్ళు మనదేవుళ్లను భూతాలు మనల్ని పాపులు అని సంబోధిస్తారు’’ అని మాధ‌వీ ల‌త త‌న సోష‌ల్ మీడియా మాధ్య‌మంలో పోస్టులు చేశారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3qr1XHT
v

Radhe Shyam విడుదలపై క్లారిటీ.. అవన్నీ తెలియదన్న డైరెక్టర్

ప్రభాస్ ట్రైలర్ క్రియేట్ చేసిన సంచలనాలు అంతా ఇంత కాదు. దెబ్బకు యూట్యూబ్ రికార్డులన్నీ బద్దలయ్యాయి. తన పేరు మీదున్న బాహుబలి 2 రికార్డులను ప్రభాసే చెరిపేశాడు. అయితే ఆర్ఆర్ఆర్, రాధే శ్యామ్ సినిమాలపై ఇప్పుడు కొత్త రూమర్లు పుట్టుకొచ్చాయి. అసలే ఒమిక్రాన్ భయం ఎక్కువవుతోంది. ఇక మహారాష్ట్రలో అయితే ఏకంగా ఆంక్షలు విధించారు. నైట్ కర్ఫ్యూను పెట్టేశారు. థియేటర్లో యాభై శాతానికి ఆక్యుపెన్సీని తగ్గించారు. అయితే ఈ దెబ్బతో ఆర్ఆర్ఆర్, రాధే శ్యామ్‌లు వాయిదా వేస్తున్నారంటూ రూమర్లు బయటకు వచ్చాయి. మహారాష్ట్ర మాత్రమే కాకుండా ఉత్తర భారతదేశంలో మరి కొన్ని రాష్ట్రాలు కూడా ఇలాంటి ఆంక్షలు విధించినట్టు తెలుస్తోంది. ఇంకా మున్ముందు మరిన్ని ఆంక్షలు అమలు పరిచే అవకాశం ఉందని తెలుస్తోంది. అసలే ప్యాన్ ఇండియన్ సినిమాలు.. ఉత్తర భారతదేశం కలెక్షన్ల మీద మన వాళ్లు చాలా ఆశలు పెట్టుకుని ఉన్నారు. ఇలాంటి సమయంలో కర్ఫ్యూలు, యాభై శాతం ఆక్యుపెన్సీ చేయడంతో పెద్ద దెబ్బ పడ్డట్టు అయింది. అయితే ఈ వాయిదా రూమర్ల మీద రాధా కృష్ణ కుమర్ స్పందించాడు. ఒమిక్రాన్ వల్ల సినిమాను వాయిదా వేస్తున్నారట కద? అని మీడియా ప్రశ్నిస్తే.. రాధాకృష్ణ ఆసక్తికరమైన సమాధానాన్ని చెప్పాడు. తనకు సినిమాను పూర్తి చేసి నిర్మాతలకు ఇవ్వడమే తెలుసు.. ఈ ఒమిక్రాన్ గురించి నాకు తెలీదు.. ఇప్పటి వరకైతే జనవరి 14న రాధే శ్యామ్ రాబోతోంది.. ఈ సినిమానే విల్ పవర్ మీద ఉంటుంది.. మన విల్ పవర్ ఎంత ఉంది? అనేది చూడాలంటూ చెప్పుకొచ్చాడు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/32CaAHi
v

ఈ రోజు కోసం పద్నాలుగేళ్లుగా ఎదురుచూశా : అల్లు శిరీష్

గత కొన్ని రోజులుగా ముంబైలోనే ఉంటున్న సంగతి తెలిసిందే. అయితే అలా ఎందుకు దూరంగా ఉంటున్నాడన్న విషయం మాత్రం ఎవ్వరికీ తెలియడం లేదు. సినిమా షూటింగ్ కోసమా? అంటే అప్డేట్లు ఏమీ ఇవ్వడం లేదు. అల్లు శిరీష్ ప్రస్తుతం అను ఇమాన్యుయేల్‌తో కలిసి చేస్తోన్న ప్రేమ కాదంటా? అనే ఒకే ఒక్క సినిమా ఉంది. అది కూడా ఎప్పుడు వస్తుంది? అసలు షూటింగ్ జరుగుతుందా? లేదా? అన్న అప్డేట్లు ఏమీ రావడం లేదు. ప్రేమ కాదంటా అనే సినిమా టైటిల్ ఏమో గానీ.. అల్లు శిరీష్, అను ఇమాన్యుయేల్ మధ్య మాత్రం లెక్కలేనన్ని రూమర్లు వచ్చాయి. ఈ ఇద్దరూ ప్రేమలో ఉన్నారని, త్వరలోనే పెళ్లి చేసుకుంటారని రకరకాల రూమర్లు పుట్టుకొస్తుంటాయి. షూటింగ్ సెట్‌లో, ఆన్ లొకేషన్, ఆఫ్ లొకేషన్‌లో వీరిద్దరి సన్నిహితం సంబంధానికి రకరకాల పేర్లు పెట్టేస్తున్నారు. అయితే తాజాగా అల్లు శిరీష్ మాత్రం కాస్త ఎమోషనల్ అయ్యాడు. హిందీలో జెర్సీ సినిమాను అల్లు శిరీష్, దిల్ రాజు, నాగ వంశీ కలిసి నిర్మించిన సంగతి తెలిసిందే. షాహిద్ కపూర్ హీరోగా రాబోతోన్న ఈ మూవీ హోర్డింగ్‌ను చూసి, అందులో అని చూసి ఎమోషనల్ అయ్యాడు. ఇలా అల్లు ఎంటర్టైన్మెంట్స్ అని జుహు సర్కిల్‌లో ఓ హోర్డింగ్‌లో చూడాలని పద్నాలుగేళ్లుగా ఎదురుచూశాను.. మొత్తానికి ఇది జరిగింది అంటూ అల్లు శిరీష్ వేసిన ట్వీట్ వైరల్ అవుతోంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3qjrRgO
v

ర‌ష్మిక ప్ర‌త్యేక పూజ‌లు వెనుక కారణాలేంటో..? వీడియో వైరల్!

కన్న‌డ చిత్రం కిరిక్ పార్టీతో హిట్ కొట్టి అంద‌రి దృష్టిని ఆక‌ర్షించిన బ్యూటీ ర‌ష్మిక మంద‌న. ఈ శాండిల్ వుడ్ చిన్న‌ది.. త‌ర్వాత తెలుగులోకి ఛ‌లో చిత్రంతో ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమా కూడా హిట్ కావ‌డంతో ర‌ష్మిక క్రేజ్ పెరిగింది. అదృష్టంతో పాటు క‌లుపుగోలుత‌నం కూడా క‌లిసి రావ‌డంతో ర‌ష్మిక మంద‌న‌, త‌క్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ రేంజ్‌కు చేరుకుంది. సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబుతో స‌రిలేరు నీకెవ్వ‌రు, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌తో పుష్ప ది రైజ్ చిత్రాల్లో న‌టించింది. పుష్ప ది రైజ్ పాన్ ఇండియా రేంజ్ మూవీ కావ‌డంతో ర‌ష్మిక మంద‌న‌కు క్రేజ్ మ‌రింత పెరిగింది. తాజాగా ఈ అమ్మ‌డుకి సంబంధించిన వీడియో ఒక‌టి నెట్టింట తెగ హ‌ల్ చ‌ల్ చేస్తోంది. ఇంత‌కీ అది ఏ వీడియో అంటే.. ర‌ష్మిక ప్ర‌త్యేక పూజ‌లు చేయించుకుంటుంది. అందులో ర‌ష్మిక కుటుంబ స‌భ్యులు కూడా ఉన్నారు. మ‌రి ఇది పాత వీడియోనో ఏమో తెలియ‌డం లేదు. కానీ వైరల్ అవుతుంది. ప‌లువురు సెల‌బ్రిటీల‌కు జాత‌కాలు చెప్పే జోతిశ్యుడు వేణుస్వామి ఆధ్వ‌ర్యంలో ఈ పూజ‌లు నిర్వ‌హించ‌డం గ‌మ‌నార్హం. ఈ వీడియోపై నెటిజ‌న్స్ త‌మ‌దైన స్టైల్లో రియాక్ట్ అవుతున్నారు. కొంద‌రు విజ‌యాలు మ‌రింత రావాల‌ని ఆమె పూజలు నిర్వ‌హించింద‌ని అంటే, కొంద‌రేమో స‌న్యాసుల్లో క‌లిసిపోతుందా ఏంటి? అని అంటున్నారు. ద‌క్షిణాదిన తెలుగు, త‌మిళ, క‌న్న‌డ చిత్రాల్లో న‌టిస్తోన్న ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు బాలీవుడ్ ఎంట్రీ కూడా ఇచ్చేస్తుంది. ఇప్ప‌టికే రెండు చిత్రాల్లో న‌టించింది. అందులో ఓ చిత్రం మిషన్ మజ్ను. సిద్ధార్థ్ మ‌ల్హోత్రా హీరోగా శాంత‌న్ భ‌గ్చీ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్న ఈ సినిమా రియ‌ల్ ఇన్‌సిడెంట్‌ను బేస్ చేసుకుని రూపొందిస్తున్నారు. పాకిస్థాన్ అణ్వాయుధాల‌ను త‌యారు చేస్తుంద‌ని తెలుసుకోవ‌డానికి ఇండియా నిర్వ‌హించిన అతి పెద్ద కోవ‌ర్ట్ ఆప‌రేష‌న్ ఆధారంగానే ఈ మూవీ రూపొందుతోంది.వచ్చే ఏడాది మే 13న సినిమాను విడుదల చేస్తున్నారు. దీంతో పాటు గుడ్ బై అనే మ‌రో సినిమాలో బాలీవుడ్ సూప‌ర్‌స్టార్ అమితాబ్ బ‌చ్చ‌న్‌తో క‌లిసి న‌టిస్తోంది. వికాస్ భ‌ల్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్న ఈసినిమాలో అమితాబ్ కుమార్తె పాత్ర‌లో ర‌ష్మిక మంద‌న్న న‌టించ‌నుంది. ఈ సినిమా కూడా షూటింగ్ ద‌శ‌లోనే ఉంది. వ‌చ్చే ఏడాది ద్వితీయార్థంలో గుడ్ బై సినిమా విడుద‌ల‌వుతుందని టాక్.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3ElUO0E
v

Saamanyudu Teaser : రెండు రకాల మనుషులు.. విశాల్ యాక్షన్ అదుర్స్

ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. చక్ర అంతగా హిట్ కాలేదు. ఎనిమీ పర్వాలేదనిపించింది. ఇక మొత్తానికి విశాల్ మరో సినిమాతో రెడీ అయ్యాడు. ‘’ చిత్రంతో తు ప శరవణన్‌ను విశాల్ దర్శకుడిగా పరిచయం చేయబోతోన్నారు. ఈ యాక్షన్ డ్రామాకు నాట్ ఏ కామన్ మ్యాన్ అనేది ఉపశీర్షికగా ఫిక్స్ చేశారు. విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ బ్యానర్ మీద ఈ సినిమాను విశాల్ నిర్మిస్తున్నారు. నేడు ఈ మూవీ టీజర్‌ను చిత్రయూనిట్ విడుదల చేసింది. ఇక్కడ రెండు రకాల మనుషులే ఉన్నారు.. ఒకరు జీవితాన్ని అది నడిపించే దారిలో జీవించాలనుకునే సామాన్యులు.. ఇంకొకరుఆ సామాన్యుల్ని డబ్బు, పేరు, పదవి, అధికారం కోసం అంతం చేయాలనుకునే రాక్షసులు.. ఆ రాక్షసుల తల రాతని మార్చి రాయాల్సిన పరిస్థితి ఒక రోజు ఓ సామాన్యుడికి వస్తుంది’ అనే డైలాగ్‌తో టీజర్ సాగుతుంది. అంటే ఈ యుద్దం ఆపవా? అని విశాల్ ఫ్రెండ్ అంటే.. అది నా శత్రువు మీద ఆధారపడి ఉంటుంది అని విశాల్ ఎంతో ఇంటెన్సిటీతో అంటాడు. మొత్తానికి సామాన్యుడు యాక్షన్ సీక్వెన్స్‌లు మాత్రం రోమాలు నిక్కబొడుచుకునేలా ఉన్నాయి. ఈ టీజర్ ఇప్పుడు నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంది. ఇలాంటి పాత్రల్లో నటించడం విశాల్‌కు వెన్నతో పెట్టిన విద్య. ఇక డింపుల్ హయతి అందంగా కనిపించారు. కెవిన్ రాజ్ సినిమాటోగ్రఫీ, యువన్ శంకర్ రాజా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అద్బుతంగా కుదిరాయి.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3FxqzoQ
v

Pushpa ఖాతాలో ఇదొ కొత్త రికార్డ్.. ఆగని అల్లు అర్జున్ హవా

దెబ్బకు రికార్డులన్నీ తారుమారు అవుతున్నాయి. అసలే ఈ ఏడాది కరోనా వల్ల బాక్సాఫీస్ అంతగా కళకళలాడటం లేదు. ఈ ఏడాది ప్రారంభంలో క్రాక్ ఆ తరువాత ఉప్పెన దుమ్ములేపేశాయి. మళ్లీ ఈ డిసెంబర్ నెలలో అఖండ హల్చల్ చేసింది. ఇక ఇప్పుడు పుష్ప రాజ్ వేల మొదలైంది. రికార్డులు కొల్లగొట్టడంలో బన్నీ మాత్రం ఎక్కడా తగ్గడం లేదు. బాక్సాఫీస్ వద్ద పుష్ప లెక్కలు ఓ రేంజ్‌లో ఉంటున్నాయి. అయితే మైత్రీ మూవీస్ అధికారికంగా వేసే లెక్కలకు, బయట ట్రేడ్ వర్గాలు చెబుతున్న లెక్కలకు పొంతన ఉండటం లేదు. దీంతో కలెక్షన్ల విషయంలో కాస్త వివాదాలు తలెత్తుతున్నాయి. అయితే కాసేపు ఆ లెక్కలు పక్కన పెట్టేద్దాం. తాజాగా బుక్ మై షో నుంచి కొన్ని లెక్కలు బయటకు వచ్చాయి. కేవలం ఎనిమిది రోజుల్లోనే బుక్ మై షో ద్వారా పుష్పకు సంబంధించి 35 లక్షల టికెట్లు అమ్ముడుపోయాయట. ఇది ఈ ఏడాదిలోనే అత్యధికమని పుష్ప యూనిట్ తెలిపింది. 2021లోని ఏ సినిమాకు కూడా ఈ ఫీట్ దక్కలేదని తెలుస్తోంది. మొత్తానికి బన్నీ మాత్రం సోషల్ మీడియాలో రికార్డులనే కాకుండా ఇలా బుక్ మై షోలోనూ కొత్త రికార్డులను క్రియేట్ చేస్తున్నాడు. ఇక రెండో వారంలోకి ఎంట్రీ ఇచ్చిన పుష్ప మరింత దూకుడుగా వెళ్తోన్నట్టు తెలుస్తోంది. ప్రతీ చోటా హౌస్ ఫుల్ బోర్డులతో పుష్ప రాజ్ దుమ్ములేపుతున్నట్టు కనిపిస్తోంది. మొత్తానికి సుకుమార్ లెక్కలకు బాక్సాఫీస్ లెక్కలు మారిపోతోన్నాయని తెలుస్తోంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3Fs6Jvd
v

బ్రెస్ట్ క్యాన్సర్‌తో నటి పోరాటం.. ప్రేమతో మరింత బలం.. హంసా నందిని సుధీర్ఘమైన పోస్ట్

నటి, హీరోయిన్ ప్రస్తుతం బ్రెస్ట్ క్యాన్సర్‌తో బాధ పడుతున్నారు. తాజాగా తన ఆరోగ్య పరిస్థితిపై సుధీర్ఘమైన పోస్ట్ చేశారు. క్యాన్సర్ వచ్చిందని తెలియడంతో ఆమెపై అభిమానులు ప్రేమను కురిపించారు. ఆమె త్వరగా కోలుకోవాలని అభిమానులు ప్రార్థిస్తున్నారు. జీవితం నా మీదకు ఎన్ని రకాల రాళ్లను విసిరినా సరే, ఎలాంటి అన్యాయం చేసినా కూడా నేను మాత్రం బాధితురాలిగా మిగిలిపోకూడదని నిర్ణయించుకున్నాను. నెగెటివిటీ, భయాలతో బతకాలని అనుకోవడం లేదు. ఆశలను వదులుకోకుండా ఉంటున్నాను. ప్రేమ, ధైర్యంతోనే ఇంకా ముందుకు వెళ్తాను. నాలుగు నెలల క్రితం నాకు ఎద భాగంలో ఏదో తెలియని నొప్పి ఏర్పడింది. ఇకపై నా జీవితం సాఫీగా ఉండబోదని నాకు అర్థమైంది. 18 ఏళ్ల క్రితం మా అమ్మ చనిపోయారు. భయంకరమైన వ్యాధితో ఆమె మరణించారు. అప్పటి నుంచి నేను భయంతోనే బతుకుతూ వచ్చాను. అలా నొప్పి వచ్చిన కొన్ని గంటల్లోనే వెంటనే డాక్టర్ వద్దకు వెళ్లాను. ఏది జరగొద్దని భావించానో అదే జరిగింది. నాకు బ్రెస్ట్ క్యాన్సర్ అని తేలింది. ఆ వెంటనే ఎంతో ధైర్యంతో ఆపరేషన్ చేయించుకున్నాను. ఆ ట్యూమర్‌ను తొలగించారు. చాలా లక్కీ.. తొందరగా గుర్తించావ్.. ఇంకా మిగతా భాగాలకు స్ప్రెడ్ అవ్వకముందే తొలించేశామని డాకర్లు అన్నారు. అలా డాక్టర్ల మాటలతో వచ్చిన ఆనందం క్షణాల్లోనే ఆవిరైంది. వారసత్వంగా వచ్చే బ్రెస్ట్ క్యాన్సర్ టెస్టుల్లో నాకు పాజిటివ్ వచ్చింది. 70 శాతం మళ్లీ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందని, 45 శాతం నా జీవితాంతం కూడా క్యాన్సర్ వెంటాడుతూ ఉందని తెలిసింది. ఇక వీటిని జయించాలంటే సర్జరీలు చేయించుకోవాల్సిందే. ఇప్పటికి నాకు తొమ్మిది సార్లు కీమో థెరపీలు జరిగాయి. ఇంకా ఏడు సార్లు చేయించుకోవాల్సి ఉంది. కానీ ఇంతలోపే నాకు నేనుగా కొన్ని వాగ్దానాలు చేసుకున్నాను. ఈ వ్యాధి వల్ల నా జీవితం తలకిందులైపోకూడదు.. నవ్వుతోనే వీటిని ఎదురించి గెలుస్తాను. మళ్లీ తెరపై మునుపటి కంటే గొప్పగా వెలిగిపోతాను. నా కథను అందరికీ చెప్పి.. స్పూర్తినింపుతాను. జీవితాన్ని ఆనందిస్తూ గడుపుతాను.. నేను ఎక్కువగా అందుబాటులో ఉండటం లేదని అందరూ మెసెజ్‌లు చేస్తున్నారు. నా గురించి ఆలోచిస్తున్న ప్రతీ ఒక్కరికీ థ్యాంక్స్. అద్భుతమైన వైద్య బృందం పర్యవేక్షణలోనే నేను ఉన్నాను. ఫ్యామిలీ, ఫ్రెండ్స్, సినిమా మిత్రులు అందిస్తున్న ప్రేమతో ఇంకాస్త బలంగా పోరాడుతాను అని హంసా నందిని పోస్ట్ చేశారు. అలా నాలుగు రోజుల క్రితం హంసా నందిని చేసిన పోస్ట్ నెట్టింట్లో వైరల్అయింది. ఇక హంసా నందిని పరిస్థితి తెలిసిన అభిమానులు ఆమె కోసం ప్రార్థనలు చేయడం ప్రారంభించారు. ఆమె ప్రస్తుత పరిస్థితి గురించి ఆరా తీయడం ఆరంభించారు. దీంతో మరోసారి హంసా నందిని స్పందించారు. నా గురించి ఆలోచిస్తూ, ప్రార్థనలు చేస్తూ, నాలో ధైర్యాన్ని నింపుతున్న వారందరికీ థ్యాంక్స్. ఇలాంటి కష్టకాలంలో మీ ప్రేమ నన్ను మాటల్లో చెప్పలేనంత ధైర్యాన్ని ఇచ్చింది. ఈ యుద్దంలో నేను ఒంటరిని కాదు అని మీరు నిరూపించారు. ప్రతీ ఒక్కరూ నా మీద చూపిస్తున్న ఈ ప్రేమ పట్ల నాకు సంతోషంగా ఉంది. ఈ ప్రేమతో నాలో మరింత బలం పెరిగింది అంటూ హంసా నందిని ఎమోషనల్ అయింది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3132es8
v

జగద్గిరి గుట్టలో కరాటే కళ్యాణిపై కేసు నమోదు

సినిమాలు, బుల్లితెర న‌టిగా గుర్తింపు సంపాదించుకున్న క‌రాటే క‌ళ్యాణి తెలుగు రియాలిటీ షో బిగ్ బాస్ సీజ‌న్ 4లో కంటెస్టెంట్‌గానూ పార్టిసిపేట్ చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌పై జ‌గ‌ద్గిరిగుట్ట పోలీస్ స్టేష‌న్‌లో కేసు న‌మోదైంది. వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేయ‌డం వంటి అంశాల కార‌ణంగా వార్త‌ల్లో ఉండే క‌రాటే క‌ళ్యాణి ఈ కేసు కార‌ణంగా మ‌రోసారి వార్త‌ల్లో వ్య‌క్తిగా నిలిచారు. ఓ హ‌త్య కేసులోని సాక్ష్యాల‌ను క‌ళ్యాణి వెల్లడి చేయ‌డానికి ప్ర‌య‌త్నించిన‌ట్లు జ‌గ‌ద్గిరి గుట్ట పోలీసుల‌కు కంప్లైంట్ రావ‌డంతో పోలీసులు ఆమెపై కేసు న‌మోదు చేశారు. కొన్నాళ్లు ముందు సైదాబాద్ ప‌రిధిలోని సింగ‌రేణి కాల‌నీలో ఓ మైన‌ర్ బాలిక హ‌త్య‌కు గురైంది. ఆ హ‌త్య‌కు సంబంధించిన వివ‌రాల‌ను క‌ళ్యాణి వెల్ల‌డించే ప్ర‌య‌త్నాలు ఆరోప‌ణ‌లు కూడా వ‌చ్చాయి. దీనికి సంబంధించిన ఏల్ల‌మ్మ బండ‌లోని తూటం శెట్టి నితేష్ అనే వ్య‌క్తి రంగారెడ్డి జిల్లా కోర్టులో ప్రైవేటుగా కంప్లైంట్ దాఖ‌లు చేశారు. కంప్లైంట్‌ను ప‌రిశీలించిన కోర్టు క‌రాటే క‌ళ్యాణిపై కేసు న‌మోదు చేయాల‌ని జ‌గ‌ద్గిరి గుట్ట పోలీసులను ఆదేశించింది. ఆదేశాల ప్ర‌కారం పోలీసులు క‌ళ్యాణిపై కేసు న‌మోదు చేశారు. 250కిపైగా చిత్రాల్లో పలు పాత్రల్లో నటించి క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌గా, సీరియ‌ల్స్‌లో న‌టిగా క‌ళ్యాణి మంచి గుర్తింపునే సంపాదించుకుంది. బిగ్ బాస్ సీజన్ 4లో కంటెస్టెంట్‌గా పాల్గొన్న క‌ళ్యాణి రెండో వార‌మే ఇంటి నుంచి ఎలిమినేట్ అయ్యింది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3JltjYW
v

‘అర్జున ఫల్గుణ’ టైటిల్ వెనక ఇంత కథ ఉందా?.. క్రెడిట్ అంతా శ్రీవిష్ణుదే!

సినిమాలంటే జనాల్లో ఓ పాజిటివ్ ఇమేజ్ ఉంటుంది. అతను ఎంచుకునే సినిమాలు, వేసే పాత్రలు అందరినీ ఆశ్చర్యపరుస్తుంటాయి. ప్రతీ సారి కొత్తగా ట్రై చేస్తుంటాడు. అలాంటి శ్రీ విష్ణు ఈ ఏడాది రాజ రాజ చోర అంటూ వచ్చాడు. హిట్ కొట్టేశాడు. ఇక ఇప్పుడు ఈ ఏడాది చివర్లో అంటూ వచ్చి సందడి చేసేందుకు సిద్దంగా ఉన్నాడు. అమృతా అయ్యర్ హీరోయిన్‌గా ఎన్ ఎమ్ పాషా కో ప్రొడ్యూసర్‌గా మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద చిత్రాన్ని నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి కథ, కథనం, దర్శకత్వ బాధ్యతలను నిర్వహిస్తున్నారు. అర్జున ఫల్గుణ చిత్రం డిసెంబర్ 31న థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా దర్శకుడు తేజ మర్ని మాట్లాడుతూ సినిమా టైటిల్ వెనుకున్న కథను వివరించాడు. ముందుగా ఈ సినిమాకు ఆర్టోజ్ అనే టైటిల్ అనుకున్నాడు. ఈస్ట్ గోదావరిలోదొరికే కూలిడ్రింక్ పేరు ఆర్టోజ్ అట. అయితే ఆ టైటిల్ ఇవ్వడానికి కంపెనీ వాళ్లు అంగీకరించలేదట. ఇక ఆ టైటిల్ పెట్టక పోతే కథను మార్చాల్సి వస్తుందని అనుకున్నాడట. అలా ఓ రోజు శ్రీ విష్ణుతో కలిసి చర్చిస్తూ ఉన్నాడట. ఆ రోజు వర్షం, ఉరుములు పడుతూ ఉన్నాయట. ఆ సమయంలో కురుక్షేత్రం, రథం, చక్రపుఇరుసు పడి పిడుగు పడుతుందని అందుకే అర్జున ఫల్గుణ అని అంటే ధైర్యం వస్తుందని పెద్ద వాళ్లు అంటారు కదా? అని చర్చించుకున్నారట. అర్జున ఫల్గుణ అనే టైటిల్ బాగుంది కదా? ఇదే పెట్టేద్దామని శ్రీ విష్ణు అన్నాడట. అలా అర్జున ఫల్గుణ అనే టైటిల్ పెట్టడంతో కథ స్పాన్ మారిపోయిందట. కథలో ఎన్నో మార్పులు చేర్పులు చేసి యాక్షన్ డోస్ కూడా పెంచానని దర్శకుడు తేజ చెప్పుకొచ్చాడు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3sxEHdX
v

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...