ప్రభాస్ సినిమా మీద ఇప్పుడున్న అంచనాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ట్రైలర్ రిలీజ్ తరువాత రాధే శ్యామ్ రేంజ్ మరింతగా మారింది. ట్రైలర్లో విజువల్స్, సాంగ్స్, లొకేషన్స్, మ్యూజిక్, పూజా హెగ్డే కెమిస్ట్రీ మామూలుగా లేదు. ప్రభాస్ దెబ్బకు సోషల్ మీడియా రికార్డులన్నీ బద్దలైపోయాయి. బాహుబలి 2తో క్రియేట్ చేసిన రికార్డులను రాధే శ్యామ్తో చెరిపేశాడు. అలా రాధే శ్యామ్ సినిమా మీద పెరిగిన అంచనాలకు తగ్గట్టుగానే ఉండాలని చిత్రయూనిట్ ఇంకా జాగ్రత్తలు తీసుకుంటోంది. అయితే ఈ సినిమా కోసం హిందీకి ఓ మ్యూజిక్ డైరెక్టర్.. దక్షిణాదికి ఓ మ్యూజిక్ డైరెక్టర్ను పెట్టిన సంగతి తెలిసిందే. డియర్ కామ్రేడ్ ఫేమ్ జస్టిన్ ప్రభాకరణ్ ఇచ్చిన సంగీతం దక్షిణాది ప్రేక్షకులను ఆకట్టుకుంది. పాటలన్నీ హిట్ అయ్యాయి. అయితే బ్యాక్ గ్రౌండ్ విషయంలో మాత్రం చిత్రయూనిట్ ప్రయోగం చేసేందుకు రెడీగా లేదు. అందుకే నేపథ్య సంగీతం కోసం తమన్ను తీసుకున్నారు. ఈ మేరకు చాలానే రూమర్లు గతంలో వచ్చాయి. ఇప్పుడు అవే రూమర్లు నిజమయ్యాయి. మొత్తానికి మాత్రం రాధే శ్యామ్ యూనిట్తో కలిసి పని చేయబోతోన్నాడు. ఈ సినిమా అంతా కూడా ప్రేమతోనే నిండిపోయింది.. ఈ సారి ప్రేమికుల దినోత్సవాన్ని ఇంకాస్త ముందు జరుపుకోబోతోన్నారు.. మళ్లీ మళ్లీ మళ్లీ ప్రేమలో పడేందుకు సిద్దంగా ఉండండి.. ఇక ఇందులో నా ప్రాణం పెట్టి కొడతాను అని తమన్ చెప్పుకొచ్చాడు.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3ptM3gK
v
No comments:
Post a Comment