Sunday 31 October 2021

దానికి సిగ్గెందుకు? బోరున ఏడుస్తూ పెళ్లిపై ఇలియానా కామెంట్స్! బ్రేకప్ తర్వాత ఓపెన్ అయిన గోవా బ్యూటీ

ఒకానొక సమయంలో తెలుగు తెరను తన అందాలతో షేక్ చేసింది గోవా బ్యూటీ . 'దేవదాసు' సినిమాతో ఎంట్రీ ఇచ్చి హీరో రామ్‌తో రెచ్చిపోయి నటించింది. అప్పటిదాకా తెలుగు ప్రేక్షకులు చూసిన అందాలకు కొత్త రూపమిస్తూ తన నాజూకు అందాలతో హల్చల్ చేసింది. అలా మొదటి సినిమాతోనే యూత్ ఆడియన్స్‌ని పులకరింపజేసిన ఈ బ్యూటీ ఆ తర్వాత వరుస హిట్స్ ఖాతాలో వేసుకొని బాలీవుడ్ బాట పట్టింది. ఈ మధ్యకాలంలో తెలుగు తెరపై అంతగా కనిపించకపోయినా సోషల్ మీడియా వేదికగా అందరితో టచ్‌లో ఉంటోంది ఇల్లీ బేబీ. ఈ నేపథ్యంలోనే ఇన్‏స్టాలో బోరున ఏడ్చేసింది ఇలియానా. అంతేకాదు ఏడవడానికి సిగ్గుపడాల్సిన అవసరం లేదు అని ఆమె అంటోంది. మరి ఈ ఏడుపుకి కారణం ఏంటంటే.. వంట చేయడానికి కూరగాయలు తరుగుతుంటే రెండు వేళ్లకు గాయం అయిందట. కత్తి చాలా పదునుగా ఉండటం వల్ల పొరపాటున గాయం అయిందట. ఈ విషయాన్ని చెబుతూ తన రెండు వేళ్లకు గాయం కావడంతో చిన్నపిల్లలా ఏడ్చేశానని ఇలియానా పేర్కొంది. అయితే ఇది చూసిన కొందరు నెటిజన్లు ఆమెను పెళ్లిపై ప్రశ్నించారు. దీంతో ఈ ప్రశ్నకు ఆసక్తికర సమాధానమిచ్చింది ఇలియానా. తనకు కూడా త్వరగా చేసుకోవాలని ఉందని చెబుతూనే.. తనకు కావాల్సిన విధంగా ఉండే వరుడు దొరకడం లేదంటూ హాట్ కామెంట్ వదిలింది. పెళ్లి విషయంలో ఇలియానా ఇలా ఓపెన్ కావడంతో నెటిజన్స్ మరింత రెచ్చిపోతూ కామెంట్స్ చేస్తున్నారు. గతంలో ఓ విదేశీ ఫోటో గ్రాఫర్‌తో ప్రేమాయణం నడిపి సహజీవనం కూడా చేసింది ఇలియానా. ఆ తర్వాత కొన్ని కారణాలతో అతడితో బ్రేకప్ చేసుకొని ఒంటరిగా ఉంటోంది. ఈ విషయమై గతంలో రియాక్ట్ అయిన ఇల్లీ బేబీ.. బ్రేకప్ తర్వాత చాలా కాలం పాటు డిప్రెషన్‌లో ఉన్నట్లు పేర్కొన్న సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు మరోసారి పెళ్లి టాపిక్‌పై ఇలియానా రియాక్ట్ కావడంతో అందరి దృష్టి ఆమె పెళ్లిపై పడింది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3BrLXZO
v

Megastar Chiranjeevi : దెయ్యం లుక్‌లో చిరంజీవి.. అంద‌రినీ భ‌య‌పెడుతున్న మెగాస్టార్!

కెరీర్ ప్రారంభంలో దొంగ సినిమా చూసిన వారికి ‘గోలీమార్‌.. కాష్మోరా కౌగిలిస్తే ఏం చేస్తారో.. ’ అనే పాట గుర్తుండే ఉంటుంది. ఆ సినిమాలో హీరోయిన్‌ను భ‌య‌పెట్ట‌డానికి మెగాస్టార్ దెయ్యంలా మారిపోతారు. మైకేల్ జాక్స‌న్ ఆల్బ‌మ్‌ను స్ఫూర్తిగా తీసుకుని చిరంజీవి అప్ప‌ట్లో చేసిన ఈ సాంగ్ ఆడియెన్స్‌ను తెగ ఆక‌ట్టుకుంది. ఇన్నేళ్ల త‌ర్వాత మ‌రోసారి చిరంజీవి దెయ్యం లుక్‌లో మ‌ళ్లీ క‌నిపించారు. ఎప్పుడూ న‌వ్వుతూ కూల్‌గా క‌నిపించే చిరంజీవి దెయ్యం లుక్‌ను చూస్తే పిల్ల‌లు జ‌డుసుకుంటారు. అయితే ఇప్పుడు చిరంజీవి చేస్తున్న సినిమాల్లో ఏదీ హార‌ర్ సినిమా లేదే. ఎందుకలా ఆయ‌న దెయ్యం లుక్‌లో క‌న‌ప‌డుతున్నార‌నే సందేహం రాక మాన‌దు. అయితే చిరంజీవి దెయ్యం లుక్‌.. సినిమా కోసం కాదండోయ్‌.. హాలోవీన్ సంద‌ర్భంగా ఆయ‌న వేసిన రియ‌ల్ గెట‌ప్‌. ప‌లువురు సినీ సెల‌బ్రిటీలు హాలోవీన్ సెలబ్రేష‌న్స్ చేసుకున్నారు. వారిలో చిరంజీవి కూడా ఉన్నారు. ఆయ‌న త‌న హాలోవీన్ లుక్‌ను ఇన్‌స్టా స్టోరీస్‌లో షేర్ చేశారు. ఈ వీడియోతో పాటు ఎగ్జ‌యిట్‌మెంట్ డే అని క్యాప్ష‌న్ పోస్ట్ చేయ‌డం అంద‌రినీ ఆక‌ట్టుకుంటుంది. ఆరున్న‌ర ప‌దులు వ‌య‌సు దాటినా ఆయ‌న ఎంతో ఉత్సాహంగా పిల్ల‌ల‌తో పోటీ ప‌డుతూ ఈ సెల‌బ్రేష‌న్స్‌లో పాల్గొన‌డం ఆయ‌న ఫ్యాన్స్‌కు ఆనందాన్నిస్తుంది. ఇక సినిమాల విష‌యానికి వ‌స్తే.. చిరంజీవి ఏక‌ధాటిగా సినిమాలు చేస్తున్నారు. ఇప్ప‌టికే ఆచార్య సినిమా షూటింగ్‌ను ఆయ‌న పూర్తి చేసేశారు. ఈ సినిమా ఫిబ్ర‌వ‌రి 4న విడుద‌ల‌వుతుంది. మ‌రోవైపు గాడ్‌ఫాద‌ర్ సినిమా షూటింగులో బిజీగా ఉన్నారు. ఈ సినిమా షూటింగ్ పూర్తి కాగానే మెహ‌ర్ ర‌మేశ్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందబోయే భోళా శంక‌ర్ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్ల‌డానికి చిరంజీవి ముహూర్తం ఫిక్స్ చేసుకున్నారు. ఈ సినిమా న‌వంబ‌ర్ 11న లాంఛ‌నంగా ప్రారంభ‌మై, న‌వంబ‌ర్ 15 నుంచి రెగ్యుల‌ర్ షూటింగ్ జ‌రుపుకోనుంది. సిస్ట‌ర్ సెంటిమెంట్ ప్ర‌ధానంగా సాగే ఈ చిత్రంలో చిరంజీవి చెల్లెలు పాత్ర‌లో కీర్తి సురేశ్ న‌టిస్తుంది. ఎ.కె.ఎంట‌ర్‌టైన్మెంట్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. దీని త‌ర్వాత బాబి ద‌ర్శ‌క‌త్వంలో మైత్రీ మూవీ మేక‌ర్స్ బ్యాన‌ర్‌లో మ‌రో సినిమా చేయ‌డానికి చిరంజీవి సిద్ధంగా ఉన్నారు. వ‌చ్చే ఏడాది మెగా ఫ్యాన్స్‌కు పండ‌గేన‌ని చెప్పాలి. ఎందుకంటే చిరంజీవి న‌టించిన మూడు చిత్రాలు బాక్సాఫీస్ వ‌ద్ద సంద‌డి చేయ‌డం ప‌క్కాగా క‌నిపిస్తోంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3jTO4jj
v

ఎన్టీఆర్‌ను అలా చూపిస్తే ఒప్పుకుంటారా?... డైరెక్టర్ కాకపోయుంటే.. రాజమౌళి ఆస‌క్తిక‌ర‌మైన స‌మాధానాలు

ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళికి, యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌కి మ‌ధ్య చాలా మంచి అనుబంధం ఉంది. ఇద్ద‌రి కాంబినేష‌న్లో స్టూడెంట్ నెం.1, సింహాద్రి, య‌మ‌దొంగ‌, ఇప్పుడు సినిమాలు రూపొందాయి. అయితే RRRలో ఎన్టీఆర్‌తో పాటు మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ కూడా న‌టిస్తున్నారు. రీసెంట్‌గా ఓ కాలేజ్ ఈవెంట్‌లో పాల్గొని అక్క‌డున్న వారు అడిగిన ప్ర‌శ్న‌ల‌కు ఆస‌క్తిక‌ర‌మైన స‌మాధానాలు ఇచ్చారు. ఆ క్ర‌మంలో ఒక‌వేళ మీరు డైరెక్ట‌ర్ కాక‌పోయుంటే ఏమై ఉండేవారు అని ఒక‌రు ప్ర‌శ్నిస్తే.. నాకు డ్రైవింగ్ వ‌చ్చు.. క‌చ్చితంగా మంచి డ్రైవ‌ర్‌ను అయ్యేవాడిని అని చెప్పారు జ‌క్క‌న్న‌. అలాగే RRRలో పాత్ర 30 నిమిషాలే ఉంటుంద‌ట క‌దా..నిజ‌మేనా! అని మ‌రొక‌రు ప్ర‌శ్నించారు. నిజంగా అలా చేస్తే ఎవ‌రైనా ఒప్పుకుంటారా? మీరు చెప్పండి త‌న‌దైన స్టైల్లో స‌మాధానం ఇచ్చేశారు రాజ‌మౌళి. బాహుబ‌లి’ త‌ర్వాత రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న సినిమా RRR..కావ‌డంతో ఎంటైర్ ఇండియ‌న్ మూవీ ఇండ‌స్ట్రీ ఆస‌క్తిగా ఎదురుచూస్తుంది. ఇదొక ఫిక్ష‌న‌ల్ పీరియాడిక‌ల్ డ్రామా. ఇద్ద‌రు స్వాతంత్య్ర స‌మ‌ర యోధుల‌కు సంబంధించింది. ఎన్టీఆర్ గోండు వీరుడు కొమురం భీమ్‌గా క‌నిపిస్తుంటే, మ‌న్యం వీరుడు అల్లూరి సీతారామ‌రాజు పాత్ర‌లో రామ్‌చ‌ర‌ణ్ న‌టించారు. 1940 బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ సినిమాలో ఈ ఇద్ద‌రు యోధులు క‌లుసుకుని, గొడ‌వ‌ప‌డి, బ్రిటీష్‌వారిని ఎదిరిస్తే ఎలా ఉంటుంద‌నే క‌థాంశంతో రూపొందిన చిత్రమే RRR. ఇందులో ఎక్క‌డా చ‌రిత్ర‌ను వ‌క్రీక‌రించలేద‌ని, అంతా ఫిక్షన‌ల్ సినిమా అని రాజ‌మౌళి ఇంట‌ర్వ్యూలో తేట తెల్లం చేసేశారు. టాలీవుడ్ స్టార్ హీరోలైన యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ కాంబినేష‌న్ మూవీ కావ‌డంతో ఇటు మెగా ఫ్యాన్స్‌, అటు నందమూరి ఫ్యాన్స్‌తో పాటు టాలీవుడ్ ప‌రిశ్ర‌మ అంతా ఎదురుచూస్తుంది. ఇక బాలీవుడ్ నుంచి అజ‌య్ దేవ‌గ‌ణ్‌, ఆలియా భ‌ట్‌తో పాటు శ్రియా శ‌ర‌న్‌, స‌ముద్ర ఖ‌ని త‌దిత‌రులు ఇత‌ర పాత్ర‌ల్లో న‌టించారు. అలాగే హాలీవుడ్‌కి చెందిన ఒలివియా మోరిస్‌, రే స్టీవెన్ స‌న్‌, అలిస‌న్ డూడి కూడా కీల‌క పాత్ర‌ల్లో నటించారు. పాన్ ఇండియా రేంజ్‌లో అగ్ర న‌టీన‌టులు చేసిన సినిమా కావ‌డంతో సినిమా క‌లెక్ష‌న్స్ ప‌రంగా ఎలాంటి సంచ‌నాల‌కు తెర తీస్తుందోనిన ట్రేడ్ వ‌ర్గాలు ఎదురుచూస్తున్నాయి. ఇంత మందిలో ఆస‌క్తి పెంచుతోన్న ఈ సినిమా వ‌చ్చే ఏడాది సంక్రాంతి సంద‌ర్భంగా జ‌న‌వ‌రి 7న రావ‌డం ప‌క్కా అయ్యింది. సోమ‌వారం(న‌వంబ‌ర్ 1) ఉద‌యం 11 గంట‌ల‌కు సినిమా నుంచి 45 సెక‌న్ల ఉండే గ్లింప్స్‌ను విడుద‌ల చేస్తున్నారు. ఈ గ్లింప్స్ ఎలా ఉండ‌బోతుందోన‌ని అంద‌రిలో క్యూరియాసిటీ పెరిగిపోయింది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3nN4bjK
v

పునీత్ చ‌దువు చెప్పించిన 1800 పిల్ల‌ల బాధ్య‌త నాదే: హీరో విశాల్‌

పునీత్ రాజ్‌కుమార్ మ‌ర‌ణం సినీ ఇండ‌స్ట్రీకి తీర‌ని లోటు. ఆయ‌న సినీ ప‌రిశ్ర‌మ‌కే కాదు, స‌మాజానికి కూడా ఎంతో సేవ చేశారు. ఎన్నో అనాథాశ్ర‌మాలు, వృద్ధాశ్ర‌మాలల‌కు సాయం చేయ‌డ‌మే కాకుండా, 1800 పిల్ల‌లకు చ‌దువు చెప్పిస్తున్నారు. ఇప్పుడాయ‌న లేరు క‌దా! మ‌రి ఆ పిల్ల‌ల భ‌విష్య‌త్తు ఏంటి? అనే సందేహం ఉంటుంది. అయితే మంచి మ‌న‌సుతో మంచి ప‌నులు చేసేవారికి ఆ దేవుడు ఏదో ఒక రూపంలో అండ‌గా నిల‌బ‌డుతూ ఉంటారు. పునీత్ ఎంతో ఇష్టంగా చేస్తున్న ఈ ప‌నికి ఓ స్నేహితుడిగా నేనున్నానంటూ ముందుకు వ‌చ్చారు హీరో విశాల్‌. పునీత్ చ‌దువు చెప్పిస్తున్న 1800 పిల్ల‌ల‌కు వ‌చ్చే ఏడాది చ‌దువుకు అయ్యే ఖ‌ర్చును నేను చూసుకుంటాన‌ని హీరో తెలిపారు. విశాల్, ఆర్య న‌టించిన చిత్రం ఈ దీపావ‌ళి సంద‌ర్భంగా న‌వంబ‌ర్ 4న విడుద‌ల‌వుతుంది. ఈ సంద‌ర్బంగా జ‌రిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో పునీత్ రాజ్‌కుమార్‌తో ఉన్న స్నేహాన్ని విశాల్ గుర్తు చేసుకున్నారు. అంతే కాదు. ఆయ‌న బాధ్య‌త‌లో తాను కొంత బాగం తీసుకుంటున్న‌ట్లు తెలిపారు. ‘‘పునీత్ రాజ్‌కుమార్ ఓ మంచి వ్య‌క్తి.. ఆయ‌న లేరనే వార్త‌ను చ‌దివినా, వింటున్నా న‌మ్మాల‌నిపించ‌డం లేదు. క‌ళ్ల‌లో నీళ్లు తిరుగుతున్నాయి. త‌న న‌ష్టాన్ని జీర్ణించుకోలేక‌పోతున్నాను. పునీత్ రాజ్‌కుమార్ మ‌ర‌ణం కేవ‌లం సినీ ఇండ‌స్ట్రీకే కాదు. స‌మాజానికి, ఆయ‌న‌తో అసోసియేట్ అయిన వారంద‌రికీ పెద్ద న‌ష్టాన్ని చేకూర్చింది. పునీత్‌లాంటి డౌన్ టు ఎర్త్ ప‌ర్స‌న్‌ను నేను ఇండ‌స్ట్రీలో చూడ‌లేదు. ఆయ‌న ఇండ‌స్ట్రీలో క‌లిసినా, బ‌య‌ట క‌లిసినా స‌రే! ఒకేలా ఉంటారు. నేను చూసిన వారిలో చాలా గొప్ప వ్య‌క్తి . ఆయ‌న ఆత్మ‌కు శాంతి క‌ల‌గాల‌ని కోరుకుంటున్నాను. ఒక వ్య‌క్తి(పునీత్‌) ఇన్ని చేయ‌గ‌లుగుతాడా? అనుకుంటే న‌మ్మ‌లేం. అన్ని మంచి ప‌నులు చేశారు. 1800 పిల్ల‌ల‌కు చ‌దువుకు భ‌రోసానిస్తున్నారు. అలాగే అనాథ పిల్ల‌ల‌కు అండ‌గా నిల‌బ‌డుతున్నారు. వృద్ధాశ్ర‌మాల‌కు సాయం చేశారు. అంతే కాదు, ఆయ‌న చనిపోయిన త‌ర్వాత కూడా త‌న క‌ళ్ల‌ను ఇత‌రుల‌కు దానం చేశారు. ఈ విష‌యాల‌ను త‌లుచుకుంటే ఎంతో బాధ‌గా ఉంటుంది. ఇక పునీత్ చ‌దువు చెప్పిస్తున్న 1800 పిల్ల‌ల బాధ్య‌త‌ను వ‌చ్చే ఏడాది నేను చూసుకుంటాన‌ని ఈ సంద‌ర్భంగా హామీ ఇస్తున్నాను’’ అన్నారు హీరో విశాల్. హీరో విశాల్, ఆర్య ప్రధాన పాత్రధారులుగా రూపొందిన చిత్రం ‘ఎనిమి’. దీపావ‌ళి సంద‌ర్భంగా న‌వంబ‌ర్ 4న తెలుగు, త‌మిళ‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ‌, హిందీ భాష‌ల్లో విడుద‌ల‌వుతుంది. ఆనంద్ శంక‌ర్ ఈ చిత్రానికి ద‌ర్శ‌కుడు. ఎస్‌.వినోద్ కుమార్ నిర్మాత‌. అదే రోజున ర‌జినీకాంత్ హీరోగా న‌టించిన పెద్ద‌న్న‌(అన్నాత్త‌) కూడా విడుద‌ల‌వుతుంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3jQdZbh
v

ఫామ్‌హౌస్‌ను పేకాట క్ల‌బ్‌గా మార్చేసిన యంగ్ హీరో...షాకిచ్చిన పోలీసులు.. అస‌లు నిజాలేంటి?

రేవు పార్టీలు జ‌ర‌గ‌డం అనేవి గుట్టు చ‌ప్పుడు కాకుండా పోలీసుల క‌ళ్లు గ‌ప్పి జ‌రిగిపోతుంటాయి. ఒక రేవు పార్టీలే కావు.. చాలా విష‌యాలు పోలీసుల‌కు తెలియ‌కుండా జ‌రుగుతుంటాయని ఓ ప్ర‌ముఖ ఛానెల్ నిర్వ‌హించిన ఆప‌రేష‌న్‌లో బ‌ట్ట‌బ‌య‌లైంది. అస‌లేం జ‌రిగింద‌నే విష‌యంలోకి వెళితే, హైద‌రాబాద్ శివార్లులోని మంచి రేవుల ద‌గ్గ‌ర ఓ ఫామ్ హౌస్ ఉంది. అది కేవ‌లం ఫామ్ హౌస్ అనుకుంటే పొర‌బ‌డ‌ట్టే. పెద్ద జూద‌శాల‌గా మారిపోయింది. ఈ విష‌యాన్ని పోలీసులు, ఛానెల్‌వాళ్లు క‌నిపెట్టేశారు. ఈ యంగ్ హీరో ఆధ్వ‌ర్యంలోనే ఈ ఫామ్ హౌస్ క‌మ్ పేకాట క్ల‌బ్ ర‌న్ అవుతుంద‌ని పోలీసులు భావిస్తున్నారు. ఇక్క‌డొక రేంజ్‌లో బిజినెస్ జ‌రుగుతుంది. క్యాసినోను మించిన రేంజ్‌లో వ్యాపారం జ‌రుగుతుండ‌టం కొస‌మెరుపు. ఇదంతా సుమంత్ చౌద‌రి అనే వ్య‌క్తి న‌డిపిస్తున్నాడ‌నే వార్త‌లు వ‌చ్చినా, అస‌లు సూత్ర‌ధారి మాత్రం స‌ద‌రు యంగ్ హీరోనే అని వార్త‌లు వినిపిస్తున్నాయి. ఓ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి నుంచి ఈ ఫామ్‌హౌస్‌ను ఐదేళ్ల పాటు లీజుకు తీసుకుని దాన్ని పేకాట క్ల‌బ్‌గా మార్చార‌ట‌. ఇప్పుడీ కేసులో స‌ద‌రు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి కూడా చిక్కుకున్న‌ట్లైంది. ఫామ్ హౌస్‌పై రైడ్ చేసిన పోలీసులు 25 మందిని అదుపులోకి తీసుకున్నారు. దీంతో పాటు 25 లక్షల క్యాష్‌, స్వాపింగ్ మెషీన్లు, కార్ల‌ను సీజ్ చేశారు. తెలంగాణ‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని రియ‌ల్ ఎస్టేట్ స‌హా ప‌లు రంగాల‌కు చెందిన బ‌డా బాబులు ఈ ఫామ్‌హౌస్‌కు వ‌స్తార‌ని టాక్‌. ఈ వ్య‌వ‌హారం వెనుక యంగ్ హీరో నాగ‌శౌర్య ఉన్నాడ‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. కానీ ఎటువంటి ఆధారాలు దొరికిన దాఖ‌లాలు లేవు. మ‌రి ఈయ‌న పేరు ఇరికించారా? నిజంగానే ఆయ‌న హ‌స్తం ఉందా? అని తెలియాల్సి ఉంది. మ‌రి ఇప్పుడిప్పుడే సినిమాల్లో ఎదుగుతున్న నాగ‌శౌర్య పేరు ఇలా బ‌య‌ట‌కు రావడం నిజంగా ఆయ‌న‌కు ఇబ్బందిని కలిగించేదే. అయితే దీనిపై ఆయ‌నెలా స్పందిస్తారు.. అసలు సుమంత్ చౌదరి ఎవరు? నిజంగానే సుమంత్ చౌదరికి నాగశౌర్యకి సంబంధం ఉందా? అనే విషయాలపై నిజంగా అస‌లు స్పందిస్తారో లేదో చూడాలి.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3w0Rsxo
v

Rajinikanth : హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన రజినీకాంత్

సూప‌ర్‌స్టార్ హాస్పిట‌ల్ నుంచి డిశ్చార్జ్ అయ్యి ఇంటికి చేరుకున్నారు. ఈ విష‌యాన్ని ఆయ‌నే స్వ‌యంగా తెలియ‌జేశారు. ‘‘నా చికిత్స పూర్తయ్యింది. ఆదివారం రాత్రి ఇంటికి చేరుకున్నాను. నా ఆరోగ్యం బాగు ప‌డాల‌ని ప్రార్థ‌న‌లు చేసిన నా మిత్రులు, శ్రేయోభిలాషులు, అభిమానుల‌కు హృద‌య పూర్వ‌కంగా కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌జేస్తున్నాను’’ అన్నారు. మూడు రోజుల ముందు ర‌జినీకాంత్‌కు త‌లనొప్పిగా ఉంద‌నిపించ‌డంతో ఆయ‌న్ని కావేరి హాస్పిట‌ల్‌లో జాయిన్ చేయించారు. అక్క‌డ వైద్యులు ఆయ‌న్ని ప‌రిశీలించి మెద‌డులోని న‌రాల్లో ఏవో బ్లాక్స్ ఉన్నాయ‌ని గుర్తించి చికిత్స అందించారు. క‌రోటిడ్ ఆర్ట‌రీ రివాస్కుల‌రైజేష‌న్ శ‌స్త్ర చికిత్స చేయించుకోవాల‌ని వైద్యులు ఈ సంద‌ర్భంగా ఆయ‌న‌కు సూచించారు. డాక్ట‌ర్స్ సూచ‌న మేర‌కు వైద్య నిపుణుల ప‌ర్య‌వేక్ష‌ణ‌లో ర‌జినీకాంత్‌కు క‌రోటిడ్ ఆర్ట‌రీ రివాస్కులైజేష‌న్ శ‌స్త్ర చికిత్స పూర్త‌య్యింది. రెండు రోజుల పాటు హాస్పిట‌ల్‌లోనే రెస్ట్ తీసుకున్న ర‌జినీకాంత్ ఇప్పుడు ఇంటికి చేరుకున్నారు. ఈ మ‌ద్య‌నే గ‌త వారమే ర‌జినీకాంత్ కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌క‌టించిన దాదా సాహెబ్ ఫాల్కే అవార్డును కుటుంబ స‌భ్యుల‌తో క‌లిసి వెళ్లి స్వీక‌రించారు. మ‌రోవైపు ఆయ‌న లేటెస్ట్ మూవీ అన్నాత్త‌(పెద్ద‌న్న‌) దీపావళి సంద‌ర్భంగా న‌వంబ‌ర్ 4న‌ విడుద‌ల‌కు సిద్ధంగా ఉంది. త‌లైవ‌ర్ అభిమానులు సినిమా కోసం చాలా ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. అదే స‌మ‌యంలో ర‌జినీకాంత్‌కు అనారోగ్య స‌మ‌స్య‌లు రావ‌డంతో వారిలో కంగారు మొద‌లైంది. అయితే ఆయ‌న శ‌స్త్ర చికిత్స త‌ర్వాత ఇంటికి చేరుకోవ‌డంతో అభిమానులు హ్యాపీగా ఫీల‌వుతున్నారు. వ‌యో భారంతో ర‌జినీకాంత్‌కు అనారోగ్య స‌మ‌స్య‌లు ఎక్కువ‌గా వ‌స్తున్నాయి. ఎమెసిస్‌, బ్రాంకైటిస్ వంటి స‌మ‌స్య‌ల‌తో ర‌జినీ చాలా ఇబ్బందులు ప‌డ్డారు. ప్ర‌తి ఏడాది అమెరికాలో రెగ్యుల‌ర్‌గా చికిత్స చేయించుకుంటూనే ఉన్నారు. ఒకానొక ద‌శ‌లో ఆయ‌న రాజ‌కీయాల్లోకి ప్ర‌వేశించాల‌ని అనుకున్నారు. అన్నీ సిద్ధం అవుతున్న సంద‌ర్భంలో గ‌త ఏడాది డిసెంబ‌ర్‌లో ఉన్న‌ట్లుండి సీరియ‌స్‌గా అనారోగ్యంతో ఇబ్బంది ప‌డ్డారు. అప్పుడాయ‌న షూటింగ్ చేస్తున్నారు. అయితే సినిమాకు బ్రేక్ వేసి ట్రీట్‌మెంట్ తీసుకున్నారు త‌లైవ‌ర్‌. అటు పిమ్మ‌ల డాక్ట‌ర్స్ స‌ల‌హా మేర‌కు ఆరోగ్య ప‌రిస్థితుల రీత్యా, ర‌జినీకాంత్ రాజకీయాల్లోకి రాన‌ని ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. మరి సినిమాల విషయంలో రజినీకాంత్ భవిష్యత్తులో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది అందరిలోనూ ఆసక్తిని పెంచుతోంది. ఇప్పటికే కొందరు దర్శకులు ఆయనతో సినిమా చేయాలని ఎదురుచూస్తున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2ZEjnrv
v

భర్తతో కలిసి మందు కొడుతూ పేకాట.. ఛీ ఛీ సిగ్గు లేదా?..కాజల్‌పై నెటిజన్ల ఆగ్రహం

కొందరు సెలెబ్రిటీలు ఈ మధ్య మరీ హద్దులు దాటుతున్నారు. సామాజిక బాధ్యత అంటూ ఒకటి ఉందని కూడా మరిచిపోతోన్నారు. మద్యం హానికరమని తెలిసినా కూడా జనాలు తాగడం మానేయడం లేదు. అయితే జనాల ఆరోగ్యం పట్ల సెలెబ్రిటీలకు కాస్తైన శ్రద్ద లేదనిపిస్తుంది. పొగాకు, గుట్కా, మద్యం వంటి వాటికి సెలెబ్రిటీలు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తూ.. ఇంకా చెడగొడుతున్నారు. మొన్నటికి మొన్న అమితాబ్ పొగాకు ఉత్పత్తుల యాడ్ నుంచి తప్పుకున్నాడు. అయితే ఈ మధ్య హీరోయిన్లు సైతం ఆల్కహాల్‌కు సంబంధించిన ప్రకటనల్లో నటిస్తున్నారు. ఆ మధ్య రెజీనా కూడా ఇలానే విస్కీ బ్రాండ్ సిగ్నేచర్‌ను ప్రమోట్ చేస్తూ ఓ యాడ్ చేసింది. అసలే సెలెబ్రిటీలను గుడ్డిగా నమ్మే వారు కోకొల్లలు. ఇలాంటి ఆల్కహాల్‌ను ప్రమోట్ చేస్తే వాటి ప్రభావం ఇంకా ఉంటుంది. కానీ సెలెబ్రిటీలకు మాత్రం కాసింత కూడా సోషల్ రెస్పాన్సిబిలిటీ లేనట్టుగా వ్యవహరిస్తున్నారు. తాజాగా కాజల్ కూడా ఇదే దారిలో నడిచింది. భర్తతో కలిసి మందు కొడుతున్నట్టుగా, పేకాట ఆడుతున్నట్టుగా ఫోటోను షేర్ చేసింది. ఆ ఫోటోలో టీచర్స్ బ్రాండ్‌కు సంబంధించిన మందు బాటిల్ ఉంది. ఇక ఆ ప్రొడక్ట్‌కు సంబంధించిన పోస్ట్ చేసిన కాజల్ ఇప్పుడు నెటిజన్ల ఆగ్రహానికి గురవుతోంది. ఈ పండుగను టీచర్స్ స్మూత్ లిక్విడ్‌తో సెలెబ్రేట్ చేసుకోండి.. ఇదే పర్ఫెక్ట్ కాంబినేషన్.. ఈ విస్కీ బ్రాండ్‌కు అంబాసిడర్‌గా మారినందుకు నాకు కిచ్లూకు ఎంతో ఆనందంగా ఉంది. బాధ్యతగా తాగండి. ఈపోస్ట్ కేవలం పాతికేళ్లు నిండిన వారికే అని చెప్పుకొచ్చింది కాజల్. పండుగకు ఇలా తాగమని ఎంకరేజ్ చేస్తావా? నీకు ఏమైనా డబ్బులు తక్కువగా ఉన్నాయా? ఇలాంటి యాడ్లు కూడా చేస్తున్నావ్? అంటూ నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. చీ ఛీ అంటూ అసహ్యించుకుంటున్నారు


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3nDugkY
v

చెరుకు రసం అమ్ముతున్న సప్తగిరి!.. వీడియోతో అసలు గుట్టు విప్పిన గెటప్ శ్రీను

సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటాడు. తన సినిమాకు సంబంధించిన బాగానే ప్రమోట్ చేసుకుంటాడు. అప్పుడప్పుడు తన అభిమానులతో చిట్ చాట్ చేస్తుంటాడు. లైవ్‌లోకి వచ్చి నెటిజన్లు అడిగే ప్రశ్నలకు సమాధానం ఇస్తుంటాడు. బుల్లితెర, వెండితెరపై గెటప్ శ్రీను ఇప్పుడు ఫుల్ బిజీగా మారిపోయాడు. తన చేతిలో ఐదారు ప్రాజెక్ట్‌లున్నాయి. హీరోగానూ చేస్తూనే మరో వైపు సైడ్ కారెక్టర్లతో దూసుకుపోతోన్నాడు. అలా వెండితెర మీద ఎంత బిజీగా ఉన్న జబర్దస్త్ షోను మాత్రం వదలడం లేదు. తాజాగా గెటప్ శ్రీను ఓ వీడియోను షేర్ చేశాడు. అందులో కమెడియన్, హీరో, నటుడు చెరుకు రసం తయారు చేస్తున్నాడు. రోడ్డు పక్కన ఉన్న చెరుకు బండి వద్ద ఆగారు. శ్రీను, సప్తగిరి ఇద్దరూ కలిసి చెరుకు రసాన్ని తయారు చేసినట్టు కనిపిస్తోంది. ఆ చెరుకు బండి యజమానిని పక్కకు తప్పించినట్టు కనిపిస్తోంది. ఇందులో సప్తగిరి చెరుకు రసాన్ని తయారు చేస్తుండగా.. శ్రీను సాయం చేశాడు. చెరుకు గడలు, అల్లం ముక్కలు అందిస్తూ శ్రీను సాయం చేశాడు. సప్తగిరి చెరుకు రసాన్ని పట్టేస్తున్నాడు. మొత్తానికి చిన్నప్పటి మెమోరీస్ అంటూ గెటప్ శ్రీను ఈ వీడియోను షేర్ చేశాడు. ఇక ఈవీడియో మీద నెటిజన్లు రకరకాల కామెంట్లు చేస్తున్నారు. నాకు తెలుసు ముందే మీరు ఇలాంటి సైడ్ బిజినెస్ పెడతారు అని ఒకడు అంటాడు. అన్నా నాకు ఓ గ్లాస్ ఇవ్వు అని ఇంకొకడు అంటున్నాడు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలని చూపించారు అని ఇంకొకడు అంటాడు. మొత్తానికి ఈ వీడియో మాత్రం నెట్టింట్లో వైరల్ అవుతోంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3mv5WCz
v

కొన్ని సార్లు వదిలేయడమే ముఖ్యం!.. డిప్రెషన్‌లో అలా చేస్తానన్న సమంత

ప్రస్తుతం ఫుల్ జోష్‌లో ఉంది. విడాకుల విషయాన్ని పూర్తిగా పక్కన పెట్టేసినట్టు కనిపిస్తోంది. నాగ చైతన్యకు సంబంధించిన మెమోరీస్‌ను కూడా తన వద్ద ఉంచుకోవడం లేదనిపిస్తోంది. చైతూ ఫోటోలను తన ఇన్ స్టాగ్రాం నుంచి సమంత డిలీట్ చేసేస్తోంది. అయితే సమంత ఇప్పుడు మాత్రం తన స్నేహితులతో కలిసి తెగ ఎంజాయ్ చేస్తోంది. గత వారం అంతా ఛార్ ధామ్ యాత్ర అంటూ తీర్థ యాత్రల్లో మునిగి తేలిసింది. హిమాయలయాలు, పుణ్య క్షేత్రాలు అంటూ దైవ చింతనలో గడపింది. ఈ వారం అంతా కూడా దుబాయ్‌లో దుమ్ములేపేసింది. అయితే సమంత తన ఫ్రెండ్స్ ప్రీతమ్, సాధన సింగ్‌లతో కలిసి దుబాయ్ వీధుల్లో నానా హంగామా చేసింది. ఇంకా అక్కడే ఉన్నట్టు కనిపిస్తోంది. అయితే సమంత తన రూం ఎలా ఉంటుంది..బెడ్రూం ఎంత దారుణంగా ఉంటుందో చూపించింది. అలా చిందరవందరగా ఎక్కడపడితే అక్కడే బట్టలు పడేసి ఉంటాయని సమంత చెప్పేసింది. అలా గందరగోళంగా ఉన్న రూంను ఎంతో నీట్‌గా చేసేశారంటూ ఆర్గనైజ్ విత్ ఈజ్ అనే కంపెనీ గురించి సమంత ప్రమోషన్ చేసింది. ఆర్గనైజ్ విత్ ఈజ్ ఇలా మన రూంను ఎంతో అందంగా చేసేసిందని సమంత చెప్పుకొచ్చింది. మామూలుగా అయితే తనకు ఎప్పుడైనా మూడ్ బాగా లేకపోయినా, డిప్రెషన్‌లా అనిపించినా కూడా బట్టలన్నీ సర్దుకుంటూ క్లీన్ చేసుకుంటుందట. మొత్తానికి సమంత మాత్రం తన రూంను చూపించింది. అందులో బెడ్డు మీద కుప్పలు కుప్పలుగా బట్టలు పడేసి ఉంటే సాధన, ప్రీతమ్, సమంతలు మాత్రం బెడ్డు మీద ముచ్చట్లు పెట్టుకుంటూ ఉన్నారు. కొన్ని సార్లు సర్దడం, అన్నీ కలపడం కంటే అలా వదిలేయడం బెటర్ అన్నట్టుగా ఓ కొటేషన్‌ను సమంత చెప్పుకొచ్చింది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3mstkkf
v

hero Nani: త‌న విల‌న్‌కు స‌పోర్ట్‌ చేయడానికి ముందుకొచ్చిన నేచుర‌ల్ స్టార్ నాని!

త‌న విల‌న్‌కు నేచుర‌ల్ స్టార్ స‌పోర్ట్ ఇవ్వ‌టం ఏంటి? అనే సందేహం రాక‌మాన‌దు. ఇంత‌కీ నాని విల‌న్ ఎవ‌రా? అంటే కార్తికేయ‌. కార్తికేయకు నాని ఏవిధంగా స‌పోర్ట్ చేస్తున్నారంటే.. హీరోగా న‌టించిన రాజా విక్ర‌మార్క చిత్రం ట్రైల‌ర్‌ను విడుద‌ల చేయ‌డం ద్వారా. యువ క‌థానాయ‌కుడు కార్తికేయ లేటెస్ట్ మూవీ ‘రాజా విక్ర‌మార్క‌’. యాక్ష‌న్ స్పై థ్రిల్ల‌ర్. ఇప్ప‌టికే విడుద‌లైన ఈ టీజ‌ర్‌కు చాలా మంచి స్పంద‌న వ‌చ్చింది. సినిమాను న‌వంబ‌ర్ 12న విడుద‌ల చేయ‌డానికి నిర్మాత‌లు స‌న్నాహాలు చేస్తున్నారు. న‌వంబ‌ర్ 1న సాయ‌త్రం 4 గంట‌ల 15 నిమిషాల‌కు ట్రైల‌ర్‌ను విడుద‌ల చేయ‌డానికి సిద్ధ‌మ‌య్యారు. ఆస‌క్తిక‌ర‌మైన విష‌య‌మేమంటే ఈ సినిమా ట్రైల‌ర్‌ను నేచుర‌ల్ స్టార్ నాని విడుద‌ల చేయ‌బోతున్నారు. ఇది వ‌ర‌కు నాని హీరోగా న‌టించిన గ్యాంగ్ లీడ‌ర్‌లో కార్తికేయ విల‌న్‌గా న‌టించిన సంగ‌తి తెలిసిందే. ఇలా ఓ అప్‌క‌మింగ్ హీరోకు ఆల్ రెడీ సెటిల్ అయిన హీరో స‌పోర్ట్ చేయ‌డం అనేది అభినందించాల్సిన విష‌య‌మే. ఇప్ప‌టి వ‌ర‌కు కార్తికేయ ప‌క్కా మాస్‌కు, యూత్‌కు క‌నెక్ట్ అయ్యే పాత్ర‌ల‌ను పోషించారు. కానీ తొలిసారి తన రూట్ మార్చి రాజా విక్ర‌మార్క‌తో డిఫ‌రెంట్ అటెంప్ట్ అయితే చేశార‌ని టీజ‌ర్‌తోనే అర్థ‌మైంది. న‌వంబ‌ర్ 1న విడుద‌ల కానున్న ట్రైల‌ర్ ఏ మేర‌కు ఆక‌ట్టుకుంటుంద‌నేది అంద‌రిలో ఆస‌క్తిని పెంచిన విష‌య‌మే. మ‌రోవైపు సినిమా కూడా న‌వంబ‌ర్ 12న విడుద‌ల‌వుతుంది. సాయి శ్రీపల్లి దర్శకత్వం వహించిన ఈ మూవీలో తాన్యా రవిచంద్రన్ హీరోయిన్‌గా న‌టించింది. హ్యాపీడేస్ ఫేమ్ సుధాక‌ర్‌ కోమాకుల కీలకపాత్రలో నటిస్తున్నారు. ఆదిరెడ్డి, 88 రామా రెడ్డి ఈ చిత్రానికి నిర్మాత‌లు. ప్రశాంత్ ఆర్ విహారి సంగీతం అందిస్తున్నారు. తొలి చిత్రం RX 100తో సూప‌ర్ హిట్ కొట్టి ప్రేక్ష‌కుల‌కు ద‌గ్గ‌రైన కార్తికేయ ఆ రేంజ్ హిట్ కోసం ఎదురుచూస్తున్నారు. అలాగే కేవ‌లం హీరోగా న‌టిస్తే స‌రిపోతుంద‌నే ఫీలింగ్ కూడా లేదు. అవ‌కాశం ఉంటే విల‌న్‌గా కూడా న‌టించ‌డానికి ఆయ‌న సిద్ధం. ఎందుకంటే ఇప్ప‌టికే నాని గ్యాంగ్ లీడ‌ర్ చిత్రంలో కార్తికేయ విల‌న్‌గా న‌టించి ఆక‌ట్టుకున్నారు. ఇప్పుడు కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ వ‌లిమై చిత్రంలోనూ కార్తికేయ విల‌న్‌గా న‌టిస్తున్నారు. ఒక‌వైపు న‌చ్చితే గ్రేషేడ్స్ ఉన్న పాత్ర‌లు చేస్తున్న కార్తికేయ హీరోగానూ వైవిధ్య‌మైన సినిమాలు చేస్తూ త‌న మార్క్ క్రియేట్ చేసుకుంటున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3mqqVGF
v

TDP పగ్గాలు చంద్రబాబుకు ఎందుకిచ్చావ్? బాలయ్యకు మోహన్ బాబు సూటి ప్రశ్న.. నటిసింహం షాకింగ్ రియాక్షన్

నందమూరి నటసింహం ట్రాక్ మార్చేశారు. ఇన్నాళ్లు రాజకీయాలు, సినిమాలతో బిజీగా ఉన్న ఆయన, ఇక డిజిటల్ ఎంట్రీ ఇస్తున్నారు. ''అనిపించింది అందాం.. అనుకున్నది చేద్దాం.. ఎవరు ఆపుతారో చూద్దాం'' అని గర్జిస్తూ నేరుగా ఆన్ లైన్ వేదికలపై అడుగు పెడుతున్నారు నటసింహం. 'అన్‌స్టాప‌బుల్‌' అంటూ రంగంలోకి దూకుతున్నారు. ఈ షో తొలి ఎపిసోడ్‌ను మంచు మోహ‌న్‌ బాబు అండ్ ఫ్యామిలీపై చిత్రీక‌రించారు. ఇది దీపావ‌ళి సంద‌ర్భంగా న‌వంబ‌ర్ 4న ప్రసారం కానున్న నేపథ్యంలో తాజాగా ఈ షో ప్రోమో రిలీజ్ చేశారు. కేవలం 3 నిమిషాలతో కట్ చేసిన ఈ వీడియోలో అందరి అంచనాలను తలకిందులు చేస్తూ ఇప్పటి వరకు ఎప్పుడూ చూడని విధంగా కొత్త అవతారంలో దర్శనమిచ్చారు బాలయ్య బాబు. సీనియర్ హీరోలు బాలకృష్ణ, మధ్య నడిచిన సంభాషణ ఎపిసోడ్‌పై అంతులేని ఆసక్తి నెలకొల్పింది. కామెడీ, కాంట్రవర్సీ కలగలపి సందడి చేశారు ఇద్దరు బడా హీరోలు. అలాగే ఈ ఇద్దరి జీవితాలకు సంబంధించిన సినీ, రాజకీయ విషయాలపై ఎన్నో సీక్రెట్స్ ఈ ఎపిసోడ్‌ ద్వారా తెలుసుకోవచ్చని ప్రోమో చూస్తుంటే స్పష్టమవుతోంది. ఇక ఈ ప్రోమోలో బాలయ్యను కొన్ని విషయాలపై మోహన్ బాబు సూటిగా ప్రశ్నించడం హైలైట్ అయింది. ''తెలుగుదేశం స్థాపించింది అన్న నందమూరి తారక రామారావు గారు. ఆయన తదనంతరం టీడీపీ పార్టీ పగ్గాలు నువ్వు తీసుకోకుండా చంద్రబాబుకు ఎందుకిచ్చావ్? అంటూ సూటిగా బాలయ్యను ప్రశ్నించారు మోహన్ బాబు. దీనిపై ఆ ఒక్కటి అడగొద్దు.. అన్నట్లుగా షాకింగ్ రియాక్షన్ ఇచ్చారు బాలకృష్ణ. ఇలాంటి ఎన్నో ఆసక్తికర సన్నివేశాలతో సాగిపోతున్న ఈ ప్రోమో వీడియో క్షణాల్లో వైరల్ అయింది. రిపీట్ చేసుకొని మరీ చూస్తున్నారు ప్రేక్షకులు. చూస్తుంటే బాలయ్య బాబు హోస్ట్ చేస్తున్న ఈ షో భారీ టీఆర్ఫీలు రాబట్టడం ఖాయమే అని తెలుస్తోంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3GApkGr
v

అమ్మాయిల ప్రైవేట్ పార్ట్స్‌తో ఆడుకోవడం సరదా!.. కామాంధుడి గుట్టు విప్పిన చిన్మయి

సింగర్,డబ్బింగ్ ఆర్టిస్ట్, నటి సోషల్ మీడియాలో ఎంత బిజీగా ఉంటారో అందరికీ తెలిసిందే. మహిళ సమస్యలను ఎప్పుడూ ప్రపంచానికి తెలిసేలా చేస్తుంటుంది. మహిళలు ఎదుర్కొనే బాధలను, సమాజంలో అమ్మాయిలపై జరిగే అకృత్యాలను ఎప్పటికప్పుడూ ఎత్తి చూపిస్తూనే ఉంటుంది. అలాంటి చిన్మయి తాజాగా కొన్ని స్టోరీలను షేర్ చేసింది. తన ఇన్ స్టాగ్రాం స్టోరీల్లో ఓ కామాంధుడి కథను చెప్పింది. ఇద్దరు వ్యక్తులు చాటింగ్ చేసుకున్న తీరు.. అందులోనే చర్చించుకున్న విషయాలు, మాట్లాడుకున్న అసభ్యకర పదజాలం గురించి చిన్మయి స్పందించింది. మొన్నటికి మొన్న సబ్యసారి అడ్వర్టైజ్మెంట్, మంగళసూత్రాల మీద ఆయన చేసిన అసభ్యకర యాడ్ వివాదాస్పదంగా మారింది. దానిపై చిన్మయి స్పందించింది. మంగళసూత్రం కేవలం ఓ ఆభరణం లాంటిదేనని చిన్మయి అభిప్రాయపడింది. అయితే అది కేవలం ఆడవారికే ఎందుకు.. మరి మగవాళ్లకు పెళ్లైందని చూపించేందుకు ఎందుకు ఎలాంటి ఆభరణాలు పెట్టలేదని చిన్మయి ప్రశ్నించింది. అయితే తాజాగా ఓ కామాంధుడు చేసిన చాటింగ్, తన ఫ్రెండుతో పెట్టిన ముచ్చట్ల గురించి చిన్మయి గుట్టు విప్పింది. వాడికి పద్నాలుగేళ్ల వయసు వచ్చినప్పుడు అమ్మాయిల వక్షోజాల మీద కన్ను పడింది. వాటిని పట్టుకోవడం వాడికి సరదా అంటా. రద్దీగా ఉన్న చోట లేదా ఒంటరిగా ఉన్న సమయంలో అమ్మాయిల వక్షోజాలను తాకేవాడట. దాంట్లో వాడు ఎక్స్ పర్ట్ అంటా. అలా తన గురించి తాను గొప్పగా చెప్పుకున్నాడు. ఆ వయసులో అది సరదా అని అలా తన గ్యాంగులో తానే గ్రేట్.. ఎక్కువ మందివి పట్టుకున్నాను అంటూ చెప్పుకొచ్చాడు. అయితే ఇలాంటి వాళ్లు కూడా సమాజంలో ఉన్నారు చూడండి అంటూ చిన్మయి తీవ్రంగా ఆవేదన చెందింది. సరదా కోసం అలాంటి పనులు చేసేవాడట అంటూ చిన్మయి ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇంకా చాలా చండాలంగా చేసిన ఆ చాటింగ్ వివరాలు, చేసిన ఘన కార్యాలు రాయడానికి కూడా వీల్లేకుండా ఉన్నాయి.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2ZD3DoF
v

ఏడుపొస్తోంది.. నా బిడ్డలకు మోసం చేస్తున్నాను.. బాలయ్య ముందు కన్నీళ్లు పెట్టుకున్న మోహన్ బాబు

అదేంటి? మోహ‌న్‌బాబు త‌నేంతో ప్రేమించే త‌న పిల్ల‌ల‌ను మోసం చేస్తున్నారా? అనే సందేహం రాక మాన‌దు. ఈ మాట అన్న‌ది మోహ‌న్‌బాబే. అయితే మాట‌ల‌కు అర్థం సంద‌ర్భాన్ని బ‌ట్టి మారిపోతూ ఉంటుంది. ఇంత‌కీ మోహ‌న్‌బాబు ఏ సంద‌ర్భంలో ఈ మాట చెప్పార‌నే విష‌యం తెలియాలంటే మాత్రం నంద‌మూరి బాల‌కృష్ణ హోస్ట్ చేస్తున్న టాక్ షో అన్‌స్టాప‌బుల్ చూడాల్సిందే. దీపావ‌ళి సంద‌ర్భంగా న‌వంబ‌ర్ 4న అన్‌స్టాప‌బుల్ షో ఆహాలో ప్ర‌సారం కానుంది. దీనికి సంబంధించిన ప్రోమో విడుద‌లైంది. అస‌లు బాల‌కృష్ణ‌తో టాక్ షో అంటే ఎలా ఉండ‌బోతుందోన‌ని అంద‌రూ అనుకున్నారు. కానీ ప్రోమో చూస్తే మాత్రం త‌ప్ప‌కుండా ఇదొక డిఫ‌రెంట్ టాక్ షో అని అర్థ‌మ‌వుతుంది. రొటీన్ టాక్ షోకు బాల‌య్య త‌న‌దైన ఎనర్జీని జోడించారు. మాస్‌, క్లాస్ ఆడియెన్స్‌ను ఆక‌ట్టుకునేలా డైలాగులేశారు. ఇక ప్ర‌శ్న‌ల సంగ‌తి స‌రేస‌రి! అటు మోహ‌న్‌బాబుని, ఇటు బాలకృష్ణ‌ని సినీ జ‌ర్న‌లిస్టులు అడ‌గ‌టానికి సంకోచించే ప్ర‌శ్న‌ల‌కు ఈ టాక్ షో స‌మాధానం చెప్పేస్తుంది. అలాగే ఒక ప‌ర్స‌న‌ల్ క్వ‌శ్చ‌న్ అని బాల‌కృష్ణ అన‌గానే మోహ‌న్‌బాబు విస్కీనా? అని అన్నారు. అప్పుడు బ్యాగ్రౌండ్‌లో ఏక్ పెగ్ లా అనే పాట రావ‌డం ఆక‌ట్టుకుంటుంది. హీరోగా నిల‌బడాల‌నుకుంటున్న‌ప్పుడు విఫ‌ల‌మ‌వుతుండ‌గా ఎప్పుడైనా బాధ‌ప‌డ్డారా? అని బాల‌కృష్ణ అడిగిన ప్ర‌శ్న‌కు మోహ‌న్‌బాబు ఎమోష‌న‌ల్ అయ్యి క‌న్నీళ్లు పెట్టుకున్నారు. . త‌లుచుకుంటే ఏడుపొస్తుంది సోద‌రా!, నా బిడ్డ‌ల‌కు మోసం చేస్తున్నాన‌నిపించింది. ఎందుకంటే నేను ఉన్న ఇల్లు అమ్మేశాను. ఎవ‌రూ స‌హాయం చేయ‌లేదు అని బాధ‌ప‌డ్డారు. అదే స‌మ‌యంలో మోహ‌న్‌బాబు కూడా బాల‌కృష్ణ‌ను కొన్ని ప్ర‌శ్న‌లు వేశారు. ఇక షోలో ల‌క్ష్మి, విష్ణు ఎంట్రీ ఇచ్చారు. మీరు నాన్న‌తో ఈ మ‌ధ్య చెప్పిన అబ‌ద్దాలేంటి? అని ఇద్ద‌రినీ బాల‌కృష్ణ అడిగిన ప్ర‌శ్న‌కు మోహ‌న్‌బాబు మాట్లాడుతూ ల‌క్ష్మి ఈ మ‌ధ్య అబ‌ద్దాలు నేర్చుకుంది కానీ.. విష్ణు అబ‌ద్దాలు చెప్ప‌డు అని అన్నారు. దానికి మీరు అలా అనుకుంటారు డాడో డాడి.. అంటూ ల‌క్ష్మీ మంచు రియాక్ష‌న్ బావుంది. షోలో దంచ‌వే మేన‌త్త కూతురా పాట‌కు బాల‌కృష్ణ‌, ల‌క్ష్మీ మంచు క‌లిసి డాన్స్ చేశారు. అలాగే ల‌క్ష్మీ మంచు జై బాల‌య్య అని ఎన‌ర్జిటిక్‌గా చెప్పింది’’ అన్నారు. ఈ ఎపిసోడ్ కోసం బాల‌య్య త‌న లుక్‌ను పూర్తిగా మార్చేశారు. బాల‌య్య లుక్‌కు సంబంధించిన ఫోటోలు నెట్టింట తెగ వైర‌ల్ అవుతున్నాయి. ఈ షో కోసం బాల‌య్య‌కు భారీ రెమ్యున‌రేష‌న్ ద‌క్కిన‌ట్లు టాక్‌. ఇండ‌స్ట్రీలో వినిపిస్తోన్న వార్త‌ల ప్ర‌కారం దాదాపు ఐదు కోట్ల రూపాయలు బాల‌య్య‌కు ఈ షో కోసం చెల్లించార‌ట‌. దీనికి వ‌చ్చే రెస్పాన్స్‌ను బ‌ట్టి త‌దుపరి సీజ‌న్‌ను ఎప్పుడు చేయాల‌నేది ప్లాన్ చేస్తార‌ని కూడా టాక్ వినిపిస్తోంది. డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్ వ‌ర్మ బాల‌కృష్ణ అన్‌స్టాప‌బుల్‌ను చిత్రీక‌రిస్తున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3bslaC6
v

Samantha: నానితో సమంత జోడీ.. బయటకొచ్చిన అసలు విషయం! సినీ వర్గాల్లో ఆసక్తికర చర్చ

అక్కినేని నాగ చైతన్యతో విడాకుల ప్రకటన తర్వాత సమంతకు సంబంధించిన ప్రతి వార్త సినీ వర్గాల్లో హాట్ టాపిక్ అవుతోంది. ప్రస్తుతం ఆమె వెళుతున్న టూర్స్, ఫ్యూచర్ ప్లాన్స్ అన్నీ కూడా నెట్టింట హాట్ టాపిక్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో కెరీర్‌కి సంబంధించి ఓ ఆసక్తికర వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. చైతూతో విడాకుల తాలూకు చేదు జ్ఞాపకాన్ని వీలైనంత త్వరగా మరిచిపోవడానికి సమంత తెగ ప్రయత్నాలు చేస్తోందట. అందుకోసమే సరదాగా తన స్నేహితులతో టూర్స్ వేస్తూ ఎంజాయ్ చేస్తోందట. ఇదిలా ఉంటే తన కేరీర్ విషయంలోనూ కొత్త అడుగులేస్తున్న సామ్.. తనకు నచ్చే కథలు వస్తే ఎలాంటి పాత్ర అయినా చేయడానికి సిద్ధమైందని తెలుస్తున్న నేపథ్యంలో హీరోగా రూపొందనున్న కొత్త సినిమాలో సమంతను హీరోయిన్‌గా తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నారట మేకర్స్. ఇప్పటికే తన 'శాకుంతలం' సినిమా షూటింగ్ ఫినిష్ చేసేసి.. ప్రముఖ తమిళ నిర్మాణ సంస్థ డ్రీమ్ వారియర్ పిక్చర్స్ పతాకంలో రాబోతున్న ఓ చిత్రానికి, అలాగే తెలుగులో శ్రీదేవి మూవీస్ వారి చిత్రానికి కమిట్ అయిన సమంత.. నానితో కూడా సినిమా చేసేందుకు రెడీ అయినట్లు తెలుస్తోంది. నాచురల్ స్టార్ నాని హీరోగా ఇటీవల ‘’ అనే మూవీ అనౌన్స్ అయిన సంగతి తెలిసిందే. ఇందులో సెకండ్ హీరోయిన్‌గా సమంత కనిపించే అవాకాశాలు ఉన్నాయనే టాక్ నడుస్తోంది. ఓదెల శ్రీకాంత్ అనే కొత్త దర్శకుడు రూపొందించనున్న ఈ సినిమాలో ఓ హీరోయిన్‌గా కీర్తి సురేష్ నటించనుండగా.. రెండో హీరోయిన్‌గా సమంతను తీసుకోవడానికి సన్నాహాలు చేస్తున్నారట దర్శకనిర్మాతలు. ఇప్పటికే ఈ ప్రపోజల్ సమంతకు చేరిందని సమాచారం. త్వరలో ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా రావొచ్చని అంటున్నారు. గతంలో నానితో కలిసి ''ఈగ, ఎటోవెళ్ళిపోయింది మనసు'' సినిమాల్లో నటించింది సామ్. ఇప్పుడు ఈ జోడీ హ్యాట్రిక్ కాంబోలో సినిమా రానుందని తెలియడం ఆమె అభిమానులను హుషారెత్తిస్తోంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2ZHYA64
v

RRR : ప్రభాస్, రామ్ చరణ్, ఎన్టీఆర్‌లలో ఎవరు బెస్ట్ చెప్పిన రాజమౌళి

బాహుబ‌లితో తెలుగు సినిమా స్థాయిని ప్ర‌పంచానికి చాటిన ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి త‌దుప‌రి చిత్రం RRR. పాన్ ఇండియా రేంజ్‌లో టాలీవుడ్ టాప్ స్టార్స్ అయిన యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్‌ల‌తో పాటు బాలీవుడ్ స్టార్స్ ఆలియా భ‌ట్‌, అజ‌య్ దేవ‌గ‌ణ్ ఇంకా హాలీవుడ్ స్టార్స్ ఒలివియా మోరిస్‌, రే స్టీవెన్ స‌న్‌, అలిస‌న్ డూడి త‌దిత‌రుల‌తో ఈ సినిమాను రూపొందించారు. 1940 బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఫిక్ష‌న‌ల్ పీరియాడిక్ మూవీ ఇది. భారీ తారాగ‌ణం.. నాలుగు వంద‌ల కోట్ల రూపాయ‌ల‌కు పైగానే బ‌డ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రంపై అంద‌రిలో భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. ఇప్ప‌టికే సినిమా పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు శ‌ర‌వేగంగా ఓ ప‌క్క జ‌రుగుతుండ‌గా మ‌రోవైపు రాజ‌మౌళి త‌న సినిమాకు కావాల్సిన ప్ర‌మోష‌న్స్ వేగ‌వంతం చేశారు. రీసెంట్‌గా జ‌క్క‌న్న ఓ ఇంట‌ర్వ్యూలో RRR గురించి మాట్లాడారు. ఆ స‌మ‌యంలో ప్ర‌భాస్‌, రామ్‌చ‌ర‌ణ్‌, ఎన్టీఆర్‌.. ఈ ముగ్గురితో మీరు ప‌నిచేశారు. మీ దృష్టిలో మీరు ఎవ‌రికీ ఓటేస్తారు? అని ఒక‌రు ప్ర‌శ్నించారు. అస‌లు రాజ‌మౌళి ఎలాంటి స‌మాధానం చెబుతారా? అని అంద‌రిలో ఆస‌క్తి పెరిగింది. అయితే రాజ‌మౌళి తెలివైన ప్ర‌శ్న‌ను చాలా తెలివిగా డీల్ చేసి అంద‌రితో ఔరా! అనిపించుకున్నారు. ఇంత‌కీ రాజ‌మౌళి ఏమ‌న్నారంటే.. ‘‘ఒక్కొక్క సంద‌ర్భంలో ఒక్కొక్క‌రుంటారు. సినిమా గురించి, యాక్టింగ్ గురించి ఏదైనా మాట్లాడాలంటే ఎన్టీఆర్‌తో స‌మ‌యం గ‌డ‌ప‌టానికి ఇష్ట‌ప‌డ‌తాను. అలాగే నాకు జంతువులు అంటే చాలా ఇష్టం. ఓ ర‌కంగా పిచ్చి. ఆ జంతువులు ఎలా ప్ర‌వ‌ర్తిస్తాయి. వాటి గురించి తెలుసుకోవ‌డానికి గంట‌ల స‌మ‌యం వెచ్చిస్తాను. వాటి గురించి మాట్లాడాలంటే రామ్‌చ‌ర‌ణ్‌తో స‌మ‌యం గ‌డ‌ప‌టానికి ఇష్ట‌ప‌డ‌తాను. అలాగే పుడ్ గురించి మాట్లాడాలంటే ప్ర‌భాస్‌తో టైమ్ స్పెండ్ చేస్తాను’’ అని అన్నారు రాజ‌మౌళి. RRRలో తెలంగాణ గోండు వీరుడు కొమురం భీమ్‌గా యంగ్ టైగ‌ర్ క‌నిపించ‌నుంటే, ఆంధ్ర ప్రాంతానికి చెందిన మ‌న్యం వీరుడు అల్లూరి సీతారామ‌రాజుగా మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ క‌నిపించ‌నున్నారు. ఈ రెండు పాత్ర‌లు చ‌రిత్ర‌లో క‌లుసుకోలేదు. అయితే ఒక‌వేళ క‌లుసుకుని బ్రిటీష్‌వారిపై పోరాడితే ఎలా ఉంటుంద‌నే ఫిక్ష‌న‌ల్ పాయింట్‌తో రాజ‌మౌళి ఈ సినిమాను తెర‌కెక్కించారు.అలాగే ఈ రెండు పాత్ర‌లు ఎలా ఉండ‌బోతాయ‌నే విష‌యాన్ని టీజ‌ర్స్ ద్వారా ప్రెజెంట్ చేశారు ద‌ర్శ‌క‌ధీరుడు. అలాగే న‌వంబ‌ర్ 1న ఈ సినిమాలో 45 సెక‌న్ల గ్లింప్స్‌ను విడుద‌ల చేస్తున్నారు. అలాగే సినిమాను వ‌చ్చే ఏడాది సంక్రాంతి సంద‌ర్భంగా జ‌న‌వ‌రి 7న విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3pSBBjF
v

బాలకృష్ణ అన్‌స్టాపబుల్.. ఐదు ఎపిసోడ్స్ లిస్టు ఇదే..నిజంగా ఆహా అనాల్సిందే!

నందమూరి బాల‌కృష్ణ డిజిట‌ల్ ఎంట్రీ ఇచ్చేశారు. ఇక స్క్రీన్‌పై సంద‌డి చేయాల్సింది మాత్రమే మిగిలింది. తెలుగు ఓటీటీ మాధ్య‌మ‌మైన ఆహాలో బాల‌య్య అన్‌స్టాప‌బుల్ అనే టాక్‌షో కు వ్యాఖ్యాత‌గా వ్య‌వ‌హ‌రిస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే షోకు సంబంధించిన ప్రోమో విడుద‌లైంది. ప్ర‌స్తుతం అన్న‌పూర్ణ స్టూడియోలో షోకు సంబంధించిన షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుగుతుంది. తొలి ఎపిసోడ్‌ను మంచు మోహ‌న్‌బాబు ఫ్యామిలీతో చిత్రీక‌రించారు. ఇందులో మంచు మోహ‌న్‌బాబు, ల‌క్ష్మీ ప్ర‌స‌న్న‌, విష్ణు పాల్గొన‌గా..వారిని బాల‌కృష్ణ ప్ర‌శ్న‌ల‌డిగారు. ఈ షోకు సంబంధించిన చిత్రీక‌ర‌ణ ఎప్పుడో ముగిసింది. దీన్ని దీపావ‌ళి సంద‌ర్భంగా న‌వంబ‌ర్ 4న విడుద‌ల ప్ర‌సారం చేయ‌బోతున్నారు. నంద‌మూరి అభిమానులంద‌రూ ఈ షో కోసం చాలా ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. ఇండ‌స్ట్రీ తాజా స‌మాచారం మేర‌కు ఇప్ప‌టి వ‌ర‌కు అన్‌స్టాప‌బుల్‌లో ఐదు ఎపిసోడ్స్‌కు సంబంధించిన చిత్రీక‌ర‌ణ పూర్త‌య్యింద‌ట‌. తొలి ఎపిసోడ్‌ను మోహ‌న్‌బాబు అండ్ ఫ్యామిలీపై చిత్రీక‌రించారు. ఇక రెండ‌వ షోను రానా ద‌గ్గుబాటిపై చిత్రీక‌రించారు. ఇక మూడో ఎపిసోడ్‌ నేచుర‌ల్ స్టార్ నానితో ఉంటుంది. ప్ర‌స్తుతం ఈ ఎపిసోడ్‌కు సంబంధించిన చిత్రీక‌ర‌ణ జ‌రుగుతోంది. త‌ర్వాత నాలుగో షోను పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్‌పై చిత్రీక‌రించ‌బోతున్నారు. ఇక ఐద‌వ ఎపిసోడ్‌ను నంద‌మూరి మ‌రో న‌ట వార‌సుడు యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌పై చిత్రీక‌రిస్తార‌ట‌. నిజంగానే అన్ స్టాప‌బుల్ ఇంట‌ర్వ్యూస్ లైనప్ మాత్రం అదిరింది. ప్ర‌తి ఎపిసోడ్ అంచ‌నాల‌ను పెంచేస్తుంద‌న‌డంలో సందేహం లేదు. ఈ ఎపిసోడ్ కోసం బాల‌య్య త‌న లుక్‌ను పూర్తిగా మార్చేశారు. బాల‌య్య లుక్‌కు సంబంధించిన ఫోటోలు నెట్టింట తెగ వైర‌ల్ అవుతున్నాయి. ఈ షో కోసం బాల‌య్య‌కు భారీ రెమ్యున‌రేష‌న్ ద‌క్కిన‌ట్లు టాక్‌. ఇండ‌స్ట్రీలో వినిపిస్తోన్న వార్త‌ల ప్ర‌కారం దాదాపు ఐదు కోట్ల రూపాయలు బాల‌య్య‌కు ఈ షో కోసం చెల్లించార‌ట‌. దీనికి వ‌చ్చే రెస్పాన్స్‌ను బ‌ట్టి త‌దుపరి సీజ‌న్‌ను ఎప్పుడు చేయాల‌నేది ప్లాన్ చేస్తార‌ని కూడా టాక్ వినిపిస్తోంది. డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్ వ‌ర్మ బాల‌కృష్ణ అన్‌స్టాప‌బుల్‌ను చిత్రీక‌రిస్తున్నారు. ఇక సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం బాలయ్య హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో చేసిన అఖండ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. త్వరలోనే ఈ సినిమా విడుదలపై ఓ క్లారిటీ వస్తుందని సమాచారం. దీని తర్వాత , గోపీచంద్ మలినేని దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు. దీన్ని మైత్రీ మూవీస్ వారు నిర్మిస్తున్నారు. దీనికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. నవంబర్ నుంచే ఆ సినిమా షూటింగ్ కూడా ప్రారంభమవుతుందని సినీ వర్గాల సమాచారం.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3bwc1bu
v

ఒత్తిడిలో తీసుకున్న నిర్ణయాలు! రోజులు మారుతుంటే జరిగేది అదే.. సమంత సెన్సేషనల్ కామెంట్స్

ట్విట్టర్ ఖాతా నుంచి ఎప్పుడైతే అక్కినేని పేరును తొలగించిందో అప్పటినుంచి సోషల్ మీడియాలో పేరు మారుమోగిపోతోంది. నాగ చైతన్యతో విడాకుల విషయమై బోలెడన్ని వార్తలు షికారు చేసిన అనంతరం అవన్నీ నిజమే అని ప్రకటించి షాకిచ్చింది సమంత. చైతూతో వివాహ బంధానికి ఫుల్‌స్టాప్ పెడుతున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఇక ఆ క్షణం నుంచి తనదైన దారిలో వెళుతూ సోషల్ మీడియాలో యమ యాక్టివ్‌గా ఉంటోంది సమంత. సోషల్ మీడియా ఖాతా ద్వారా తన రెగ్యులర్ అప్‌డేట్స్ ఇస్తూనే మోటివేషనల్ లైన్స్ షేర్ చేస్తోంది. వ్యక్తిగత జీవితానికి దైర్యం ముఖ్యమంటూ ఆమె షేర్ చేస్తున్న సందేశాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇప్పటికే అమ్మాయి చదువు, పెళ్లి అంటూ ఆడపిల్లల తల్లిదండ్రులకు సూచనలిచ్చిన సామ్.. తాజాగా మరో ఆసక్తికర పోస్ట్ పెట్టింది. ప్రముఖ రైటర్ రాబర్ట్ రాసిన పదాలను ఇన్స్‌స్టా స్టోరీగా పెట్టేసింది. ఒక మనిషి ఒత్తిడిలో ఉన్నప్పుడు తీసుకునే నిర్ణయాలే ఆ మనిషి ఏంటనేది తెలియజేస్తాయని, ఆ సమయంలో మనిషి స్వభావం బయట పడుతుందని రాబర్ట్ రాసిన వాక్యాలను అందరి ముందు పెట్టింది సమంత. అంతేకాదు రోజు రోజుకూ పరిస్థితులు మారుతాయని, మీ కోసం ఏది ఉద్దేశించబడి ఉంటుందో, ఏదైతే మీరు కోరుకుంటారో దానికి మార్గం పడుతూ వస్తుంది అని సామ్ పేర్కొంది. దీంతో ఈ పోస్టులు నెట్టింట వైరల్ అవుతున్నాయి. సమంత చెప్పిన దాంట్లో పలు అర్థాలు వెతుకుతున్నారు నెటిజన్లు. ఇకపోతే ఇటీవలే తన 'శాకుంతలం' సినిమా షూటింగ్ కంప్లీట్ చేసిన సమంత.. ప్రస్తుతం స్నేహితులతో కలిసి సరదాగా షికార్లు కొడుతోంది. విదేశాలను చుట్టి వస్తూ అక్కడి అందాలను కేమ్రాలో బంధించి అభిమానుల ముందు పెడుతోంది. ప్రస్తుతం సామ్.. దుబాయ్ టూర్‌లో ఉంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3muDFMD
v

Saturday 30 October 2021

టాలీవుడ్ సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణకు అస్వస్థత.. ఆసుపత్రిలో చికిత్స

టాలీవుడ్ సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణకు స్వల్ప అస్వస్థత గురయ్యారు. దీంతో కుటుంబ సభ్యులు ఆయన్ను శనివారం రాత్రి సికింద్రాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. ప్రస్తుతం వైద్యుల సమక్షంలో ఆయనకు చికిత్స అందిస్తున్నారు. నాలుగు రోజుల క్రితం ఆయన ఇంట్లోనే ప్రమాదవశాత్తు జారి పడ్డారు. అప్పటి నుంచి మందులు వాడుతున్నా పెద్దగా ప్రయోజనం లేకపోగా నిన్న రాత్రి నొప్పులు ఎక్కువ కావడంతో ఆస్పత్రిలో చేర్పించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యంగానే ఉన్నారని, ఎవ్వరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కుటుంబ సభ్యులు అంటున్నారు. ఒకానొక సమయంలో వరుస సినిమాలతో బిజీగా ఉన్న .. టాలీవుడ్ మూడు తరాల హీరోలతో తెరపంచుకున్నారు. సిపాయి కూతురు సినిమాతో 1959లో సినీ ఎంట్రీ ఇచ్చిన ఆయన.. 2019లో విడుదలైన ‘ఎన్టీఆర్‌ కథానాయకుడు’, ‘మహర్షి’ చిత్రాల తర్వాత వెండితెరకు దూరంగా ఉంటున్నారు. వయసు మీద పడటంతో ఆనారోగ్య కారణాలతో ఇంటిపట్టునే ఉంటున్నారు కైకాల. గత 60ఏళ్లుగా తెలుగు సినిమా రంగంలో 777 సినిమాల్లో నటించారు కైకాల సత్యనారాయణ. నటుడిగా పౌరాణిక, సాంఘిక, చారిత్రక, జానపద పాత్రలు చేసిన ఆయన.. పలు చిత్రాల్లో హాస్య నటుడిగా, ప్రతినాయకుడిగా, నాయకుడిగా ప్రధాన భూమికలు పోషించారు. ఆయన పోషించిన వైవిధ్యమైన పాత్రలకు గుర్తుగా 'నవరస నటనా సార్వభౌమ' అనే బిరుదును ఇచ్చింది తెలుగు సినిమా ఇండస్ట్రీ.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3bujLuR
v

నిర్మాత‌గా మారిన ర‌వితేజ‌.. రామాయణంతో మాస్ మ‌హారాజాకు లింకు .. వివాదాల‌కు దారి తీస్తుందా!

మాస్ మ‌హారాజా ర‌వితేజ రెండు వైపులా ప‌దున్న క‌త్తిలా దూసుకెళ్లిపోతున్నారు. ఒక‌వైపు సినిమాలు పూర్తి చేస్తున్నారు.. మ‌రోవైపు కొత్త సినిమాల‌కు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేస్తున్నారు. ఇప్ప‌టికే ఖిలాడి సినిమాను పూర్తి చేసిన ఈ కమ‌ర్షియ‌ల్ స్టార్ హీరో త్రినాథ‌రావు న‌క్కిన ద‌ర్శ‌క‌త్వంలో ధ‌మాకా సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ అల్యూమియం ఫ్యాక్టరీలో జరుగుతోంది. ఈ సినిమాను కూడా చాలా త్వ‌ర‌గా పూర్తి చేసేస్తున్నారు మాస్‌రాజా. ఈ సినిమా కంప్లీట్ కాకుండానే నెక్ట్స్ సినిమాకు ఓకే చెప్పేశారు. 70వ చిత్రాన్ని అధికారికంగా అనౌన్స్ చేశారు. దానికి సంబంధించి ఓ పోస్ట‌ర్‌ను కూడా విడుద‌ల చేశారు. ఈ పోస్ట‌ర్‌ను గ‌మ‌నిస్తే.. ఇందులో హీరోలు వెళ్లిపోరు అనే లైన్ ఉంది. దీనికి త‌గిన‌ట్లు ఆల‌యంపై ఉండే శిల్పాలు.. అందులో మ‌న ఇతిహాసం రామాయ‌ణంను సూచిస్తున్నాయి. అందులో రావణాసురుడు శిల్పం ప్ర‌ముఖంగా క‌నిపిస్తుంది. అంటే రాముడు.. రావ‌ణాసురుడుకి ఈ క‌థ‌కు ఉన్న లింకేంట‌నేది తెలుసుకోవాలంటే వేచి చూడక త‌ప్ప‌దు. ద‌ర్శ‌కుడు సుధీర్ వ‌ర్మ ఈ సినిమాను తెర‌కెక్కిస్తున్నారు. ఈ సినిమా ఫ‌స్ట్ లుక్‌, టైటిల్‌ను న‌వంబ‌ర్ 5న ఉద‌యం 10 గంట‌ల 08 నిమిషాల‌కు విడుద‌ల చేస్తున్నారు. శ్రీకాంత్ విస్సా అందిస్తున్న క‌థ‌, మాట‌లు అందిస్తున్నారు. అభిషేక్ అగ‌ర్వాల్ ఆర్ట్స్ బ్యాన‌ర్‌పై అభిషేక్ నామా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మూవీ అనౌన్స్‌మెంట్ పోస్ట‌ర్‌ను చూసి ర‌వితేజ ఫ్యాన్స్ సెల‌బ్రేష‌న్స్ చేసుకుంటున్నారు. స‌రికొత్త సినిమాతో మా హీరో సిల్వ‌ర్ స్క్రీన్‌పై సంద‌డి చేయ‌డం ఖాయ‌మ‌ని వారు ఆనందంగా ఉన్నారు. అయితే ఇతిహాసాల‌ను ఆధారంగా చేసుకుని సినిమాల‌ను తెర‌కెక్కించే స‌మ‌యంలో చాలా జాగ్ర‌త్త‌గా ఉండాలి. లేకుంటే వివాదాల‌కు కేరాఫ్‌గా మారిపోతాయి. అయితే ర‌వితేజ ఇలాంటి వివాదాల‌కు దూరంగానే ఉంటారు. మ‌రి రామాయ‌ణంకు, ర‌వితేజ సినిమాకు లింకేంటో తెలుసుకోవాలంటే ఆగ‌క త‌ప్ప‌దు. ఆస‌క్తిక‌ర‌మైన విష‌య‌మేంటే ఈ సినిమాతో రవితేజ నిర్మాత‌గా మారుతున్నారు. సినిమా అనౌన్స్‌మెంట్ పోస్ట‌ర్‌లో ఆర్‌టి టీమ్ వ‌ర్క్స్ అనే పేరుంది. అంటే ఇది ర‌వితేజ టీమ్ వ‌ర్క్స్ అనే నెటిజ‌న్స్ భావిస్తున్నారు. మ‌రి రవితేజ త‌న సినిమాల‌కు మాత్ర‌మే నిర్మాత‌గా ఉంటారా? లేక వేరే టాలెంట్‌ను ఎంక‌రేజ్ చేస్తాడా? అనేది చూడాలి. సాధార‌ణంగా ఎక్స్‌పెరిమెంట‌ల్ సినిమాలంటే క‌మ‌ర్షియ‌ల్ సినిమాల‌కు ర‌వితేజ ప్రాధాన్యం ఇస్తుంటాడు. అందుకు కార‌ణం ఆయ‌నకు ఎక్స్‌పెరిమెంట్స్ మూవీస్ పెద్ద‌గా క‌లిసి రాలేదు. మ‌రి సుధీర్ వ‌ర్మ ఈసారి రవితేజ‌ను డిఫ‌రెంట్‌గా ఎలా ప్రెజెంట్ చేసి మెప్పిస్తారో వేచి చూద్దాం మ‌రి.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3muHXnh
v

ఆశ ఎన్‌కౌంటర్ ట్రైలర్: కల్పితం అంటూనే అంతా చూపించిన ఆర్జీవీ

కాంట్రవర్సీ ఎక్కడ ఉంటే చూపు అక్కడే. ఈ విషయాన్ని ఎవరో చెప్పడం కాదు.. ఆయన తీరు చూసే ప్రతి ఒక్కరికీ అర్థమవుతుంది. వివాదాస్పద సినిమాలు తీయడంలో తనకంటూ స్పెషల్ ఐడెంటిటీ క్రియేట్ చేసుకున్న ఆయన.. ఎవరెన్ని విమర్శలు చేసినా తన దారి తనదే అన్నట్లుగా వెళుతున్నారు. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్‌ నగర శివారులో జరిగిన నేపథ్యంలో సినిమా రూపొందించారు ఆర్జీవీ. నవంబర్ 26, 2019న షాద్ నగర్ సమీపంలో జరిగిన దిశ సామూహిక అత్యాచారం యావత్ భారత దేశాన్ని ఆగ్రహంలో ముంచెత్తింది. ఆ తర్వాత దిశ నిందితులు ఎన్‌కౌంటర్ చేయబడ్డారు. అయితే నలుగురు యువకులు అత్యంత పాశవికంగా దిశను సామూహిక అత్యాచారం చేసి హతమార్చిన ఈ దుర్ఘటనను, ఆ తర్వాత ఆ దారుణానికి ఒడిగట్టిన ఆ నలుగురు యువకుల ఎన్‌కౌంటర్ దృశ్యాలను తన సినిమాలో చూపించబోతున్నారు రామ్ గోపాల్ వర్మ. ఈ మూవీకి ఆశ ఎన్ కౌంటర్ అని పేరు పెట్టిన ఆర్జీవీ.. తాజాగా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేశారు. 2 నిమిషాల నిడివితో కూడిన ఈ వీడియోలో దిశ ఘటనను చూపించే ప్రయత్నం చేశారు. అయితే ట్రైలర్ మొదట్లో మాత్రం 'ఈ చిత్రం ఏ వ్యక్తుల పైన, ఏ ఘటనల పైన ఆధారపడి తీయలేదు కేవలం కల్పితం' అని చెబుతూ తనదైన దారిలో వెళ్లారు వర్మ. చిత్రాన్ని దిశ సంఘటన చోటు చేసుకున్న తేదీ నవంబర్ 21న రిలీజ్ చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ఇకపోతే ఈ సినిమా సోనియా ఆశ అనే అమ్మాయి టైటిల్ రోల్ పోషిస్తోందని ఆర్జీవీ తెలిపారు. అనురాగ్‌ కంచర్ల ప్రొడక్షన్‌పై నిర్మిస్తున్న ఈ సినిమాకు ఆనంద్‌ చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2ZL0AKP
v

అందుకే పవన్ కళ్యాణ్‌తో సినిమా చేయలేదు.. ఓ సారి ఆయన్ని కలిస్తే! సీక్రెట్ బయటపెట్టిన రాజమౌళి

తెలుగు సినిమా రేంజ్ ఏంటనేది ప్రపంచానికి చాటిచెప్పిన దర్శకుడు . బాహుబలి లాంటి భారీ సినిమాతో గత రికార్డులన్నీ తుడిపేశారు జక్కన్న. ఇక ఎల్లలుదాటిన క్రేజ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సొంతం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాదిమంది అభిమానుల గుండెల్లో గూడు కట్టుకున్నారు పవన్. మరి అలాంటి ఈ ఇద్దరు దిగ్గజాలు కలిస్తే ఆ సంచలనాలు ఉహించగలమా? రాజమౌళి- పవన్ కళ్యాణ్ కాంబోలో సినిమా రావాలనేది ఎంతోమంది సినీ ప్రియుల కోరిక. తాజాగా ఈ విషయమై రియాక్ట్ అయ్యారు రాజమౌళి. తాజాగా శ్రీకాకుళంలో జరిగిన ఓ కాలేజ్ ఫెస్టివల్‌కు ముఖ్య అతిథిగా విచ్చేసిన రాజమౌళి ఆసక్తికర వ్యాఖ్యలు ఛేహారు. పవన్‌తో మీ సినిమా ఎప్పుడని ఓ స్టూడెంట్ అడగడంతో ఓపెన్ అయ్యారు జక్కన్న. పవన్ కళ్యాణ్ గారితో సినిమా చేయాలని చాలా సంవత్సరాలు వెయిట్ చేశానని, కానీ అది కుదరలేదని చెబుతూ గత విషయాలు ప్రస్తావించారు రాజమౌళి. ''ఓ సారి ఓ మూవీ షూటింగ్ జరుగుతుండగా పవన్‌ని కలిశాను. ఆయనతో మాట్లాడితే చాలా కంఫర్టబుల్‌గా అనిపించింది. ఆ తర్వాత సార్ మీరు చెప్పండి మీకు ఎలాంటి సినిమా చేయాలని ఉంది అని అడిగా. మీరు ఎలాంటి సినిమా అనుకుంటున్నారో అది చెప్పండి. ఎలాంటి సినిమా చేయడానికైనా నేను రెడీ అన్నారు. సరే సార్ అయితే మీరు టైమివ్వండి.. ఏ టైమ్‌లో రమ్మంటే ఆ టైమ్‌లో వచ్చి మీకు కథ చెబుతా అన్నాను. ఆ తర్వాత ఆయన దగ్గర్నుంచి కబురొస్తుందని చూశాను.. రాలేదు. ఆయన వేరే వేరే సినిమాలు చేస్తూ బిజీ అయ్యారు. ఈ లోపు నా థింకింగ్ మారిపోయింది. జస్ట్ మాస్ సినిమాలు కాదు.. మోర్ బిగ్గర్, వైడర్ రీచ్ ఉన్న సినిమాలు చేయాలని అనుకున్నా. అలా 'మగధీర', 'యమదొంగ'.. లాంటి సినిమాలు చేస్తూ వచ్చా. ఆయనకేమో సినిమాలకంటే రాజకీయాల మీద ఎక్కువ ఇంట్రెస్ట్ వచ్చింది. ఈ లోపల ఎక్కువ నంబర్ ఆఫ్ డేస్ సినిమాలకు ఇలా నా డైరెక్షన్ వెళ్ళిపోయింది. సో.. పవన్ అంటే నాకు చాలా ఇష్టం, గౌరవం కూడా. కాకపోతే మేమిద్దరం వేర్వేరు మార్గాల్లో ట్రావెల్ చేస్తున్నాము'' అన్నారు. ప్రస్తుతం RRR సినిమాతో బిజీగా ఉన్నారు రాజమౌళి. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా తెరకెక్కుతున్న ఈ భారీ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 7న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3jRmTpk
v

పునీత్‌కు కన్నీటి వీడ్కోలు.. అశ్రు నయనాల నడుమ ముగిసిన స్టార్ హీరో అంత్యక్రియలు

కన్నడ పవర్‌ స్టార్‌ శుక్రవారం గుండెపోటుతో మరణించడంతో యావత్ సినీ ఇండస్ట్రీ షాక్ అయింది. ఉదయం జిమ్‌ చేస్తుండగా ఒక్కసారిగా కుప్పకూలిన ఆయన ఆసుపత్రికి తరలించాక చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. పునీత్‌ మరణవార్త సౌత్ ఇండియాలో సినీ ప్రేక్షకులను తీవ్రంగా కలచివేసింది. పలువురు సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ఇక శనివారం బెంగళూరులోని కంఠీరవ స్టేడియంలో ఏర్పాటు చేసిన పునీత్‌ అంతిమ దర్శనానికి తెలుగు, తమిళ చిత్రసీమలకు చెందిన నటీనటులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు కంఠీరవ మైదానంలో పునీత్ భౌతిక కాయానికి నివాళులర్పించి శ్రద్థాంజలి ఘటించారు. బాలకృష్ణ, జూనియర్‌ ఎన్టీఆర్‌ పునీత్‌ పార్ధివ శరీరాన్ని చూసి కన్నీటి పర్యంతమయ్యారు. అయితే నిన్న (శనివారం) సాయంత్రమే పునీత్ రాజ్‌కుమార్ అంత్యక్రియలు జరగాల్సి ఉండగా.. ఆయన పెద్ద కూతురు అమెరికా నుంచి వచ్చేందుకు ఆలస్యం కావడం వల్ల నేటి తెల్లవారు జామున పునీత్ అశ్రు నయనాల నడుమ పునీత్ అంత్యక్రియలు జరిపారు. బెంగళూరులోని శ్రీ కంఠీరవ స్టూడియోస్‌‌లో ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో పునీత్ రాజ్‌కుమార్ అంత్యక్రియలు ముగిశాయి. పునీత్‌ పార్థివ దేహంపై కాసేపు జాతీయ జెండాను కప్పి ఉంచి, అనంతరం ఆ పతాకాన్ని పునీత్‌ భార్యకు అందజేశారు. కంఠీరవ స్టూడియోస్‌‌లోని తండ్రి సమాధి దగ్గరే ఆయన కూడా సమాధి అయ్యారు. ఈ అంతిమయాత్రలో కర్నాటక సీఎం బసవరాజ్ బొమ్మై, మాజీ సీఎంలు యడ్యూరప్ప, సిద్దరామయ్యలతో పాటు పలువురు మంది సినీ, రాజకీయ ప్రముఖులు పాల్గొని పునీత్‌కు కడసారి వీడ్కోలు పలికారు. పునీత్ భార్య అశ్విని, కుమార్తెలు వందిత, ధృతి, సోదరుడు శివరాజ్‌కుమార్ రోదనలు పలువురి చేత కంటతడి పెట్టించాయి.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/315SJrB
v

ప్రభాస్‌- రాజమౌళి వార్! జనాల్లో ఓ రేంజ్ చర్చలు.. ఈ విషయమై జక్కన్న రియాక్షన్ వైరల్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, దర్శక ధీరుడు రాజామౌళి.. ఇద్దరూ ఇద్దరే. ఎల్లలు దాటిన క్రేజ్ ఈ ఇద్దరి సొంతం. బాహుబలి సిరీస్‌తో యావత్ సినీ ఇండస్ట్రీ ఎప్పటికీ చెప్పుకునే భారీ హిట్ ఇచ్చిన ఘనత ఈ ఇద్దరి సొంతం. ఇద్దరూ కలిశారంటే అదో సంచలనం. మరి అదే ఇద్దరూ విడివిడిగా పోటీకి దిగితే?. మరికొద్ది రోజుల్లో అదే సీన్ చూడబోతున్నాం. వచ్చే జనవరిలో సినిమాతో జక్కన్న బరిలోకి దిగబోతుంటే సినిమాతో ప్రభాస్ రంగంలోకి దూకుతున్నారు. దీంతో ఈ ఇద్దరి 'ఢీ'పై టాలీవుడ్ వర్గాల్లో ఆసక్తికర చర్చలు నడుస్తున్నాయి. అటు తెరకెక్కిస్తున్న భారీ సినిమా RRR, ఇటు ప్రభాస్ హీరోగా నటిస్తున్న 'రాధే శ్యామ్' సినిమాలు చాలాకాలంగా షూటింగ్ జరుపుకుంటున్నాయి. ఎట్టకేలకు ఈ రెండు సినిమాలు జనవరి నెలలోనే, అది కూడా వారం గ్యాప్‌లో రిలీజ్ కానున్న నేపథ్యంలో తెలుగు ప్రేక్షకుల దృష్టి మొత్తం సంక్రాంతిపై పడింది. జనవరి 7వ తేదీన RRR గ్రాండ్ రిలీజ్ ఉండగా, జనవరి 14వ తేదీన ప్రపంచవ్యాప్తంగా 'రాధే శ్యామ్' ప్రేక్షకుల ముందుకొస్తోంది. దీంతో ఈ రెండు సినిమాలు పోటీపడనున్నాయనే టాక్ షురూ అయింది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ ఇష్యూపై దర్శక ధీరుడు రాజమౌళి క్రేజీగా రియాక్ట్ అయ్యారు. RRR, రాధే శ్యామ్ మధ్య గట్టిపోటీ ఉండనుందా? అనే ప్రశ్నపై ఆయన స్పందించారు. సినిమాల మధ్య పోటీ అనేది సహజమని, గతంలో కూడా ఉంది.. ఇప్పుడూ ఉంటుందని జక్కన్న చెప్పారు. అయితే ఎన్ని సినిమాలు విడుదలైనా కంటెంట్‌ బాగుంటే ప్రేక్షకులు అన్ని సినిమాలను ఆదరిస్తారు. కాబట్టి అందులో పోటీ అనుకోవడానికి ఏమీ లేదు. మా సినిమాతో పాటు అన్ని సినిమాలు కూడా బాగా రాణించాలని కోరుకుంటున్నాము అని చెప్పుకొచ్చారు రాజమౌళి.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3w1Ufq0
v

ఆ కోరిక తీరకుండానే పునీత్ వెళ్లిపోయారు.. విషయం చెబుతూ డైరెక్టర్ ఎమోషనల్ కామెంట్స్

క‌న్న‌డ స్టార్ హీరో శుక్ర‌వారం గుండెపోటుతో మ‌ర‌ణించిన సంగ‌తి తెలిసిందే. ఆయన మరణంతో యావత్ సినీ ఇండస్ట్రీ శోక సంద్రంలో మునిగిపోయింది. ఎంతో భవిష్యత్, ఇతరులను ఆదుకోవాలనే మంచి మనసున్న పునీత్ ఇకలేరనే వార్తను ఏ ఒక్కరూ జీర్ణించుకోలేక పోతున్నారు. ఇక ఆయ‌న‌తో అనుబంధం ఉన్న పలు భాషల సినీ సెల‌బ్రిటీలయితే కన్నీరుమున్నీరయ్యారు. పలువురు స్టార్స్ బెంగుళూరు చేరుకొని పునీత్ భౌతికకాయానికి నివాళులర్పించారు. అయితే పునీత్ తన చిరకాల కోరిక నెరవేరకుండానే వెళ్లిపోయారని పేర్కొంటూ దర్శకుడు ఎమోషనల్ అయ్యారు. ఈ మేరకు పునీత్‌తో తనకున్న అనుబంధాన్ని పంచుకుంటూ అసలు విషయం చెప్పారు. పునీత్ వల్లే తాను వెండితెరకు పరిచయమయ్యానని గుర్తు చేసుకున్నారు. తన రెండో ప్రాజెక్ట్‌ ‘అజయ్‌’ కూడా ఆయనతోనే చేశానని చెప్పారు. తాను గారితో '' సినిమా ప్రకటించిన వెంటనే తనకు పునీత్ కాల్ చేసి అభినందించారని మెహర్ రమేష్ చెప్పారు. అలాగే చిరంజీవి గారితో నటించాలనే తన కోరికను ఈ సినిమాతో తీర్చాలని ఆయన కోరినట్లు తెలిపారు. వీలైతే అతిథి పాత్ర లేదంటే కనీసం పాటలోనైనా ఆయనతో కలిసి ఓ చిన్న స్టెప్పు వేస్తానని పునీత్ తనతో అన్నారని మెహర్ రమేష్ చెప్పుకొచ్చారు. అయితే ఈ విషయాన్ని తాను చిరంజీవి గారితో కూడా చర్చించానని, పునీత్ కోసం ఓ స్పెషల్ రోల్ రాయాలని అనుకున్నానని, అలాగే నవంబర్‌లో జరగనున్న మా సినిమా ప్రారంభోత్సవానికి పునీత్‌ను ముఖ్యఅతిథిగా పిలవాలని భావించామని చెప్పారు. ఇంతలో పునీత్ ఈ లోకం విడిచి వెళ్లారని తెలుపుతూ కన్నీరు పెట్టుకున్నారు మెహర్ రమేష్. కాగా, పునీత్ భౌతిక కాయానికి నివాళులర్పించిన చిరంజీవి.. పునీత్‌ రాజ్‌కుమార్‌ అకాలమరణం తీవ్రంగా కలచివేసిందని అన్నారు. బెంగళూరు వచ్చిన ప్రతిసారి పునీత్‌ను కలిసేవాడినని, దేవుడు చాలా అన్యాయం చేశాడని అన్నారు. ఆయన కుటుంబానికి ఆ భగవంతుడు ధైర్యం ఇవ్వాలని ప్రార్థిస్తున్నా అని పేర్కొన్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3bGA9Zr
v

ఆనంద్ దేవరకొండ పేరు మరిచిన అల్లు అర్జున్.. స్టేజ్ మీదే సారీ చెప్పిన బన్నీ

తమ్ముడిగా ఎంట్రీ ఇచ్చినప్పటికీ తనకంటూ ప్రత్యేక మార్క్ క్రియేట్ చేసేందుకు కష్టపడుతున్నాడు. ఈ క్రమంలో స్క్రిప్ట్‌లకు ప్రాధాన్యమిస్తూ కథలను ఎంచుకుంటున్నా. అందుకే మిడిల్ క్లాస్ మెలోడీస్ అనే సినిమా వచ్చింది. హిట్ అయింది. ఇక ఇప్పుడు అంటూ రాబోతోన్నాడు. నవంబర్ 12న రాబోతోన్న ఈ మూవీ ట్రైలర్‌ను నేడు విడుదల చేశారు. ఈ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా వచ్చాడు. అయితే స్టేజ్ మీద బన్నీ కాస్త ఎమోషనల్ అయ్యాడు. విజయ్ దేవరకొండ ఎంత ఇంటెలిజెంటో అంత స్వీట్. కొందరు అలా ఉండరు. కానీ విజయ్ మాత్రం చాలా స్వీట్. అందుకే నాకు చాలా ఇష్టం. చాలా తక్కువ సమయంలోనే ఎక్కువ స్టార్డం వచ్చింది. విజయ్ మీద ఎన్ని ప్రయోగాలైనా చేయోచ్చు. ఆయన ఇంకా ఎంతో ఎత్తుకు ఎదుగుతాడు. కేవలం నటనే కాదు.. వ్యాపారాల్లోనూ సక్సెస్ అయ్యాడు. రౌడీ వేర్స్ అంటే నాకు చాలా ఇష్టం. మామూలుగానే నాకు బట్టలంటే ఇష్టం. రౌడీ నుంచి బట్టలు వచ్చాయంటే ఎంతో ఎగ్జైట్ అవుతాను. ఇక నిర్మాతగానూ మారాడు. యంగ్ టాలెంట్‌కు సాయం చేస్తున్నాడు. విజయ్ అలా ఎదిగిపోతూ ఉంటే మీకు జెలస్ అనిపించదా? అని కొందరు అడిగారు. జెలస్ ఎందుకు ఉంటుంది. అలా అనుకున్నప్పుడు మనం కరెక్ట్‌గా పని చేయడం లేదన్నట్టు. ఈ పరుగు పందెంలో ఎవరు ఎక్కువగా పరిగెడుతుంటే వారికి సాయం చేయాలి. అయినా మనం పక్కన చూసి పరిగెత్త కూడదు. మన దారిలో మనం పరిగెత్తాలి. ఈ సినిమా హీరో గురించి చెప్పాలి. నా తమ్ముడు లాంటి వాడే. ఎందుకంటే నాక్కూడా ఇలాంటి తమ్ముడే ఉన్నాడు’ అని అల్లు అర్జున్ స్పీచ్ ఇస్తున్నాడు. అలా ఆనంద్ పేరు మరిచిపోయి.. మళ్లీ విజయ్ దేవరకొండ అనే అన్నాడు. పక్కనుంచి ఆనంద్ చెప్పే ప్రయత్నం చేసినా కూడా పేరు అంతగా గుర్తుకు రాలేదు. చివరకు ఆనంద్ దేవరకొండ అని చెప్పేశాడు. కానీ అలా పేరు మరిచిపోయినందుకు అక్కడే క్షమాపణలు చెప్పేశాడు బన్నీ. ఆ తరువాత తన ప్రసంగాన్ని కొనసాగించాడు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3EsA1cc
v

ఇండస్ట్రీలో వాడుకుని వదిలేస్తారు!.. డైరెక్టర్ మారుతి సంచలన కామెంట్స్

డైరెక్టర్ సినిమాను తెరకెక్కించే విధానం గురించి అందరికీ తెలిసిందే. చిన్న బడ్జెట్‌లో సినిమాను చుట్టేయగలడు. భారీ బడ్జెట్ చిత్రాలనూ హ్యాండిల్ చేయగలడు. అయితే మారుతి ఏ సినిమాను తెరకెక్కించినా కూడా తన మార్క్ మాత్రం కచ్చితంగా కనిపిస్తుంటుంది. హాస్య ధోరణిలోనే సినిమాను ముందుకు తీసుకెళ్తాడు. కరోనా కంటే ముందు పక్కా కమర్షియల్ అనే సినిమాను గోపీచంద్‌తో మొదలుపెట్టాడు. అయితే మధ్యలో కరోనా రావడం, షూటింగ్‌లు అన్నీ బంద్ అయిపోవడంతో మారుతి కొత్త ఆలోచన వచ్చింది అందరూ కరోనా భయంతో కొట్టుమిట్టాడుతున్నారని, ఎప్పుడూ భయపడని మిడిల్ క్లాస్ వాళ్లు కూడా భయాందోళనలో ఉన్నారని మారుతి అన్నాడు. అలాంటి వారి కథను తీయాలనే ఆలోచన రావడం, 20 రోజుల్లో కథను రాయడం, ముప్పై రోజుల్లో సినిమాను ఫినిష్ చేయాలని ఫిక్స్ అయ్యాడట. చాలా చిన్న బడ్జెట్‌తో సినిమా తీయాలని ఫిక్స్ అయ్యాడట. అందుకే అజయ్ ఘోష్ అయితే ఎంత ఇస్తే అంత తీసుకుంటాడని ఈ కారెక్టర్‌కు ఎంచుకున్నట్టు చెప్పాడు. అలా చాలా తక్కువ బడ్జెట్‌లో ఏదో టైం పాస్‌కు తీసినట్టు తీశాను. కానీ సినిమా చాలా సీరియస్‌గా వచ్చింది అని అన్నాడు. ఈ చిత్రం మనసుకు వేసే వ్యాక్సిన్. మీ భయాలను అన్నింటిని పోగొడుతుందని మారుతి అన్నాడు. ఇక హీరో గురించి మాట్లాడాడు. వర్షం లాంటి హిట్ ఇవ్వడంతో ప్రభాస్ ఆ రుణాన్ని తీర్చుకుంటున్నాడు. యూవీ క్రియేషన్స్ సంతోష్‌తో సినిమాలు తీస్తోంది. వారికి ఎవరైనా రూపాయి ఇస్తే వందరూపాయలు తిరిగి ఇస్తారు.. ఎవ్వరి రుణాన్ని ఉంచుకోరు.. ఇండస్ట్రీలో వాడుకుని వదిలేస్తారు.. నాకు తెలుసు. కానీ ఇలాంటి వారు మాత్రం ఉండరు అంటూ యూవీ క్రియేషన్స్, వంశీ ప్రమోద్, ప్రభాస్ గురించి మారుతి ఎంతో గొప్పగా చెప్పుకొచ్చాడు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3mrI3Mc
v

పునీత్ రాజ్ కుమార్ చనిపోయింది జిమ్ వల్ల కాదు.. అసలు విషయం బయటపెట్టిన హీరో శ్రీకాంత్

కన్నడ పవర్ స్టార్ మరణంతో యావత్ సినిమా ఇండస్ట్రీ శోకసంద్రంలో మునిగిపోయింది. తెలుగులో స్ట్రైట్ సినిమా చేయలేకపోయినప్పటికీ.. అగ్రహీరోలు, దర్శకులు, నిర్మాతలు అందరితోనూ పునీత్ రాజ్ కుమార్‌తో మంచి అనుబంధం ఉంది. ఇటీవల ఆయన నటించిన ‘యువరత్న’ సినిమాను తెలుగులో కూడా రిలీజ్ చేశారు. ఇక ఎన్టీఆర్ ఆయన సినిమాలో పాటపాడటం.. పూరీ జగన్నాథ్, మెహర్ రమేష్ వంటి దర్శకులతో పనిచేయడంతో పాటు.. చాలామంది స్టార్ హీరోలతో కలిసి పనిచేశారు పునీత్ రాజ్ కుమార్. ఈ సందర్భంలో ఆయన పార్థీవ దేహానికి నివాళులు అర్పించడానికి మెగాస్టార్ చిరంజీవి, వెంకటేష్‌లతో కలిసి వెళ్లిన హీరో .. పునీత్ రాజ్ కుమార్‌తో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుని ఎమోషనల్ అయ్యారు. ఈ సందర్భంలో పునీత్ జిమ్ చేస్తూ చనిపోయాడంటూ వస్తున్న వార్తలపై స్పందించారు. ఆయన మాట్లాడుతూ.. ‘ఆయన లేదంటే నమ్మలేకపోతున్నా.. కళ్లముందే కనిపిస్తున్నారు.. ఎందుకంటే ఆయనతో ‘జేమ్స్’ అనే సినిమాను రీసెంట్‌గా చేశాను. సుమారు 40 రోజులు ఆయనతో కలిసి ట్రావెల్ చేశాను. వెరీ డౌన్ టు ఎర్త్ పర్సన్. ఆయన నాకు ముందే తెలుసు.. పునీత్ వాళ్ల ఫ్యామిలీ కూడా నాకు బాగా తెలుసు. పునీత్ నేను కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవడం.. జేమ్స్ సినిమా రిలీజ్ కాలేదు.. రీసెంట్‌గానే షూటింగ్ కంప్లీట్ అయ్యింది. చాలామంది మంచి వ్యక్తుల్ని చూశాను కానీ.. పునీత్ లాంటి వ్యక్తిని నేను చాలా దగ్గర నుంచి చూశాను. ఒక స్టార్ హీరో కొడుకు అనే అహంకారం లేకుండా.. ఫ్యాన్స్‌కి దగ్గరగా ఉంటూ.. వాళ్లని హగ్ చేసుకుని వాళ్లకి సపోర్ట్ చేస్తారు. పబ్లిసిటీ లేకుండా ఎంతో మందికి హెల్ప్ చేస్తుంటారు. పునీత్ ఫ్రెండ్స్ కూడా నాకు చాలామంది తెలుసు. చిన్ననాటి స్నేహితుల్ని ఎవర్నీ కూడా వదలకుండా పునీత్ వాళ్లకి కూడా హెల్ప్ చేస్తూ వస్తున్నాడు. అలాంటి మంచి వ్యక్తి లేడంటే జీర్ణించుకోలేకపోతున్నా. జేమ్స్ సినిమాలో పునీత్ బాడీ బిల్డర్ రోల్ చేస్తున్నారు. నేను ఫ్యామిలీ విలన్‌ని. అతను నాకు బాడీ గార్డ్‌గా ఉండేరోల్. ఆయన వ్యక్తిత్వం ఎంత మంచిది అంటే.. షూటింగ్ టైంలో నాకోసం ఇంటి నుంచి భోజనం రప్పించేవారు. శ్రీకాంత్ సార్.. ఇంట్లో నుంచి భోజనం వస్తుంది.. బయట చేయొద్దు.. అర్థగంట ఆలస్యం అయినా ఇంటి నుంచే రప్పిస్తా అని అడిగి మరీ భోజనం పెట్టేవారు.కేవలం నాతోనే కాదు.. అందరితోనూ అలాగే ఉండేవారు. ఎప్పుడూ సెట్‌లో మంచి హుషారుగా ఉంటారు.. చాలా ఫిట్‌గా ఉంటారు. అసలు పునీత్ ఎప్పుడూ కూడా ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవు.. ఫీవర్‌ రావడం కూడా తెలియదని పునీత్ ఫ్రెండ్స్ చెప్తున్నారు. నిజానికి చాలామంది జిమ్ చేస్తూ చనిపోయాడని అంటున్నారు.. టీవీలలో కూడా వచ్చింది.. అది నిజం కాదు.. రాత్రి నుంచే ఆయన అస్వస్థత గురయ్యారు. ఉదయాన్నే లేచి కూర్చున్న తరువాత అన్ ఈజీగా ఉందని డాక్టర్ దగ్గరకు వెళ్లారు. జిమ్ చేయడం వల్లే ఆయన చనిపోయాడనేది నిజం కాదు.. జిమ్ చేస్తూ పడిపోలేదు.. అసలు ఆయన జిమ్‌కి వెళ్లలేదు. ముందు ఫ్యామిలీ డాక్టర్ దగ్గరకు వెళ్లారు.. ఆ తరువాత విక్రమ్ హాస్పటల్‌కి షిఫ్ట్ చేశారు. గుండెపోటుతో చనిపోవడం అనేది వాళ్ల ఫ్యామిలీ ఉంది.. పునీత్ తండ్రి రాజ్ కుమార్ గారు గుండెపోటుతో మరణించారు శివరాజ్ కుమార్‌ గారికి కూడా గుండెపోటు వచ్చింది.. అలాగే ఆయన తమ్ముడికి కూడా గుండెపోటు వచ్చింది. అలాగే పునీత్‌కి కూడా సడెన్ స్ట్రోక్ రావడం వల్లే మరణించారు’ అంటూ అసలు విషయాన్ని బయటపెట్టారు హీరో శ్రీకాంత్.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2ZJWAu3
v

మీ అన్నదమ్ములను చూస్తే మాకు మేం గుర్తొస్తాం!.. పునీత్‌పై నాగబాబు ఎమోషనల్ కామెంట్స్

కన్నడ పవర్ స్టార్ (46) గుండెపోటుతో శుక్రవారం మధ్యాహ్నం మరణించిన సంగతి తెలిసిందే. పునీత్ మరణంతో దక్షిణాది చిత్ర సీమ తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది. అప్పు అంటూ ప్రేమగా పిలుచుకునే తమ అభిమాన హీరో మరణించడంతో లక్షల మంది అభిమానులు పొటెత్తారు. బెంగళూరులోని కంఠీరవ స్టేడియ్ంలో నేడు పునీత్ పార్థీవ దేహాన్ని సందర్శానార్థం ఉంచారు. మన టాలీవుడ్ నుంచి ప్రముఖులందరూ కూడా వెళ్లారు. పునీత్‌కు నివాళ్లు అర్పించారు. బాలకృష్ణ, చిరంజీవి, వెంకటేష్, ఎన్టీఆర్ ఇలా హీరోలందరూ కూడా పునీత్‌ను చివరి చూపు చూసుకుని వచ్చారు. ఇక మెగా బ్రదర్ నాగబాబు తాజాగా పునీత్ రాజ్ కుమార్‌ను తలుచుకుంటూ ఎమోషనల్ అయ్యాడు. మీ ముగ్గురు అన్నదమ్ముళ్లను చూస్తే.. మా అన్నదమ్ములం గుర్తుకు వస్తామని ఆయనతో ఉన్న మెమోరీస్‌ను నాగబాబు గుర్తుకు చేసుకున్నారు. ‘డియర్ పునీత్.. నువ్ ఎప్పుడూ నాకు తమ్ముడిలాంటివాడివే. ఎవ్వరూ ఊహించటనట్టుగా నువ్ ఎప్పుడూ నా సోదరుడివే. మీ ముగ్గురు అన్నదమ్ములు.. మా ముగ్గురిలా కనిపిస్తారు.. అంతే కాకుండా కళ్యాణ్ బాబులా మీరు కూడా పవర్ స్టార్ అని పేరొందారు.. అయితే కేవలం ఇవే కారణాలు కాదు.. మీరు చేసిన మంచి పనులు, మీ చారిటీలు, సేవా గుణం, మంచి మనసుల ఇలా అన్నింటితో మీరు కేవలం నటుడిగానే కాకుండా మంచి మనిషిగానూ అందరి హృదయాల్లో చోటు సంపాదించుకున్నారు. మీరు మాతో ఉండకపోవచ్చు.. కానీ మీరు చూపించిన దారి, మీ మంచిదనం ఎప్పటికి చిరకాలంగా నిలిచిపోతుంది. మిమ్మల్ని ఎంతగానో మిస్ అవుతాం’ అని నాగబాబు ఎమోషనల్ అయ్యాడు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3brSWY0
v

అందాల ఆరబోతలో హద్దులు దాటేసింది!.. అంతా బయటపెట్టేసిన సోనాల్ చౌహాన్

తెరపై ఎంతలా హల్చల్ చేస్తుంటుందో అందరికీ తెలిసిందే. తెరపై అందాలను ఆరబోయడంలో ఏ మాత్రం వెనకడుగు వేయదు. బికినీలో తన వయ్యారాలను ఒలకబోస్తూ ఉంటుంది. అలా తాను నటించిన దాదాపు ప్రతీ సినిమాలో బికినీలో కనిపిస్తుంటుంది. లెజెండ్, పండగ చేస్కో, డిక్టేటర్ ఇలా అన్నీ చిత్రాల్లోనూ సోనాల్ చౌహాన్ అందాలను ఆరబోసింది. ఇక బాలీవుడ్ తెరపై మాత్రం మామూలుగా రచ్చ చేయదు. అన్నింటికంటే ఎక్కువగా సోషల్ మీడియాలో సోనాల్ చౌహాన్ దుమ్ములేపుతూ ఉంటుంది. తాజాగా సోనాల్ చౌహాన్ షేర్ చేసిన ఫోటోలు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. లో దుస్తులు మాత్రమే ధరించి పై అందాలను ప్రదర్శించింది. బెడ్డుపై అలా కూర్చుని తన పరువాలను బయటపెట్టేసింది. అయితే తాజాగా ఈ ఫోటోలు నెట్టింట్లో మంటలు పుట్టిస్తున్నాయి. ఇక ఆమె నల్ల రంగు లో దుస్తుల్లో కనిపించిన తీరుకు అందరూ ఫిదా అవుతున్నారు. ఈ హాట్ బ్యూటీకి తాజాగా మంచి ఆఫర్ వచ్చింది. అనిల్ రావిపూడి వెంకటేష్ వరుణ్ తేజ్ కాంబినేషన్‌లో రాబోతోన్న ఎఫ్ 3 సినిమాలో సోనాల్ చౌహాన్‌కు మంచి రోల్ దక్కింది. ఇందులో సునీల్ పాత్ర కొత్తగా వచ్చిన విషయం తెలిసిందే. అయితే సునీల్‌కు జోడిగా సోనాల్ చౌహాన్‌ను తీసుకున్నట్టు కనిపిస్తోంది. మొత్తానికి సంక్రాంతి బరిలోంచి ఎఫ్ 3 తప్పుకుంది. ఫిబ్రవరిలో ఈ సినిమా విడుదలకానుంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3mrsiEX
v

‘పెళ్లాం లేచిపోయిందా?’.. కొత్తగా ట్రై చేసిన ఆనంద్ దేవరకొండ

విజయ్ దేవరకొండ తమ్ముడిగా ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు. దొరసాని అంటూ మొదటి సినిమాతో ప్రయోగమే చేశాడు. కానీ అది అంతగా వర్కవుట్ అవ్వలేదు. ఇక రెండో చిత్రం మిడిల్ క్లాస్ మెలోడిస్ అంటూ సక్సెస్ కొట్టేశాడు. కానీ అది ఓటీటీకే పరిమితమైంది. అలా వచ్చిన సక్సెస్‌ను అంతగా ఎంజాయ్ చేయలేకపోయాడు. కానీ ఈ సారి మాత్రం థియేటర్లో హిట్ కొట్టేందుకు అంటూ రాబోతోన్నాడు. తాజాగా ఐకాన్ స్టార్ ఈ మూవీ ట్రైలర్‌ను విడుదల చేశాడు. పుష్ఫక విమానం ట్రైలర్‌లో కథ ఏంటో అర్థమైపోతోంది. బావిలో కప్పలాంటి ఓ ప్రభుత్వ లెక్కల మాస్టారు. పెళ్లి తరువాత సిటీకి వచ్చి సెటిల్ అవుతాడు. కానీ అతని భార్యను మాత్రం ఎవ్వరికీ చూపించడు. భార్య ఇంట్లోనే ఉన్నట్టుగా అందరినీ నమ్మిస్తాడు. హోటళ్లు నుంచి ఫుడ్ ఆర్డర్ చేసినతన భార్య చేసిందని స్కూల్‌లో స్టాఫ్ అందరికీ వడ్డిస్తుంటాడు. అలా తన భార్య ఇంట్లోనే ఉందని నమ్మించేందుకు నానా కష్టాలు పడతాడు. కానీ అసలు తన భార్య ఉండదు. పెళ్లైన పది రోజులకే లేచిపోతుంది. ఇక ఈ విషయంలో అతడి చుట్టూ పోలీసులు తిరుగుతుంటారు. లేచిపోయిందని చెప్పడానికి ఒక్క ఫ్రూప్ చూపించరా? అని పోలీస్ కారెక్టర్‌లో ఉన్న సునీల్ అడిగితే.. ఆమె రాసిన లెటర్ ఉందంటూ హీరో ఆనంద్ చెబుతాడు. అదెక్కడ అని అంటే.. మింగేసా అని చెప్పడంతో ట్రైలర్ ముగుస్తుంది. అలా మొత్తానికి ట్రైలర్ మాత్రం అందరినీ ఆకట్టుకునేలా ఉంది. కొత్త కథతో రాబోతోన్న విజయ్ మాస్ ఇమేజ్, స్టార్ స్టేటస్ గురించి ఆలోచించడం లేదు. మొత్తానికి కథకు ప్రాధాన్యమున్న పాత్రనే ఎంచుకున్నట్టు కనిపిస్తోంది. నవంబర్ 12న ఈ చిత్రం రాబోతోంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3pSs8ZG
v

పునీత్ రాజ్‌కుమార్‌కి చిరంజీవి, వెంకటేశ్ నివాళి... కంఠీరవ స్టేడియాని ధృతి రాజ్‌కుమార్.. అంత్య‌క్రియ‌లు వాయిదా!

క‌న్న‌డ హీరో పునీత్ రాజ్‌కుమార్ గుండెపోటుతో శుక్ర‌వారం మ‌ర‌ణించిన సంగ‌తి తెలిసిందే. ఆయ‌న మ‌ర‌ణ‌వార్త‌ను అభిమానులు ఎవ‌రూ జీర్ణించుకోలేక‌పోతున్నారు. ఇక ఆయ‌న‌తో అనుబంధం ఉన్న సినీ సెల‌బ్రిటీల సంగ‌తి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. సోష‌ల్ మీడియా ద్వారా సంతాపాన్ని ప్ర‌క‌టించిన మ‌న టాలీవుడ్ హీరోలు చిరంజీవి, వెంక‌టేశ్‌, శ్రీకాంత్‌, అలీ శనివారం రోజున బెంగుళూరు చేరుకుని పునీత్ రాజ్‌కుమార్ పార్థీవ దేహానికి నివాళులు అర్పించారు. ఈ సంద‌ర్భంగా వారు మీడియాతో కూడా మాట్లాడారు. ‘‘జీర్ణించుకోలేని విష‌యం. పునీత్‌ను మ‌న‌కు దూరం చేసి ఆ దేవుడు చాలా అన్యాయం చేశాడు. ఎంతో బాధ‌గా ఉంది. ఎప్పుడూ బెంగుళూరు వ‌చ్చిన రాజ్‌కుమార్‌గారి కుటుంబాన్ని క‌లిసేవాడిని. రాజ్‌కుమార్‌గారైతే వారి పిల్ల‌లంద‌రితో న‌న్ను క‌లిపించేవారు. త‌ర్వాత శివ‌, పునీత్‌ల‌తో మా బంధం కొన‌సాగింది. ఈరోజు పునీత్ మ‌ర‌ణంపై ఇంత మంది దుఃఖాన్ని వెలిబుచ్చుతున్నారంటే ఆయ‌నెంత గొప్ప వ్య‌క్తో అర్థం చేసుకోవ‌చ్చు. ఆయ‌న ఆత్మ‌కు శాంతి క‌ల‌గాల‌ని కోరుకుంటున్నాను’’ అని చిరంజీవి అన్నారు. ‘‘పునీత్ వంటి మంచి వ్యక్తిని ఇండస్ట్రీ కోల్పోవడం చాలా దురదృష్ట‌క‌రం’’ అన్నారు వెంకటేశ్. ‘‘పునీత్‌ది చాలా మంచి మనసు. డౌన్ టు ఎర్త్ ప‌ర్స‌న్‌. పెద్ద‌లంటే ఎన‌లేని గౌర‌వం ఇస్తాడు. ఆదేవుడు ఆయ‌న ఆత్మ‌కు శాంతిని క‌ల‌గించాల‌ని కోరుకుటున్నాను’’ అన్నారు హీరో శ్రీకాంత్. వీరితో పాటు అలీ కూడా కలిసి నివాళులు అర్పించారు. మరో వైపు పునీత్ రాజ్‌కుమార్ పెద్ద కుమార్తె ధృతి రాజ్‌కుమార్ బెంగుళూరు చేరుకున్నారు. అక్క‌డి నుంచి కంఠీర‌వ స్టేడియాని చేరుకున్నారు. ధృతి రాజ్‌కుమార్ రాక ఆల‌స్యం కావ‌డంతో పునీత్ రాజ్‌కుమార్ అంత్య‌క్రియ‌ల‌ను ఆదివారానికి వాయిదా వేశారు. ఇప్ప‌టికే నంద‌మూరి బాల‌కృష్ణ‌, ఎన్టీఆర్‌, రానా ద‌గ్గుబాటి, ప్ర‌భుదేవా, న‌రేశ్ స‌హా ప‌లువురు పునీత్ రాజ్‌కుమార్ పార్థీవ దేహానికి నివాళులు అర్పించారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3bmiXbr
v

RISE OF SHYAM అంటూ నాని రచ్చ.. ఫస్టి సింగిల్ ఎప్పుడంటే?

నేచురల్ స్టార్ వరుసగా సినిమాలు రెడీ చేస్తున్నాడు. లాక్డౌన్ వచ్చి పెద్ద హీరోలు కూడా ఎవ్వరూ సినిమాలను రిలీజ్ చేయలేదు. కానీ నాని మాత్రం గత లాక్డౌన్ సమయంలో ఓ చిత్రాన్ని వదిలాడు. మళ్లీ ఈ లాక్డౌన్ తరువాత ఇంకో చిత్రాన్ని వదిలాడు. అయితే అలా నాని ఓటీటీలో తన చిత్రాలను వదిలేస్తూ ఆడియెన్స్‌ను ఎంటర్టైన్ చేస్తున్నాడు. కానీ సినిమాలు మాత్రం అనుకున్నంతగా ఆడటం లేదు. నాని వీ, టక్ జగదీష్ సినిమాలు అంతగా వర్కవుట్ అవ్వలేదు. అలా ఓటీటీలు నానికి కలిసి రావడం లేదో ఏమో గానీ.. ఇక ఇప్పుడు మాత్రం నాని దుమ్ములేపేందుకు రెడీ అవుతున్నాడు. నాని రాహుల్ సంకృత్యాన్ కాంబోలో అనే సినిమా రాబోతోన్న సంగతి తెలిసిందే. కలకత్తా నేపథ్యంలో, పునర్జన్మల బ్యాక్ డ్రాప్‌లో ఈ సినిమా ఉండబోతోన్నట్టు టాక్. అందుకే రెండు షేడ్స్ ఉన్న లుక్స్‌ను రివీల్ చేశారు. ఒక దాంట్లో ఎంతో సీరియస్‌గా ఉంటే ఇంకో దాంట్లో ఎంతో కూల్‌గా కనిపించాడు. మొత్తానికి ఈ సారి కథను కలకత్తాకు తీసుకెళ్లి హిట్ పట్టుకొస్తాడేమో. నిహారిక ఎంటర్టైన్మెంట్స్‌పై వెంకట్ బోయనపల్లి ఎక్కడా కూడా కాంప్రమైజ్ కాకుండా అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోన్న ఈ సినిమా మ్యూజికల్ ప్రమోషన్స్ ప్రారంభించేశారు. మిక్కీ జే మేయర్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందించాడు. అంటూ మొదటి పాటను నవంబర్ 6న విడుదల చేయబోతోన్నట్టు ప్రకటించారు. ఈ మేరకు ఓ పోస్టర్‌ను వదిలారు. అందులోనాని దర్జాగా కూర్చున్నాడు. ఓ చేతితో సిగరేట్ ఉంది.. కళ్లు మాత్రం ఎంతో సీరియస్‌గా కనిపిస్తోంది. మొత్తానికి శ్యామ్ సింగ రాయ్ కథ వేరేలా ఉందనిపిస్తోంది. సాయి పల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్‌లుగా నటిస్తోన్న ఈ చిత్రానికి సత్యదేవ్ జంగా కథను అందించారు. జాన్ వర్గీస్ కెమెరామెన్‌గా పని చేస్తున్నారు. నవీన్ నూలి ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈ చిత్రం క్రిస్మస్ కానుకగా.. తెలుగు తమిళ కన్నడ మళయాల భాషల్లో డిసెంబర్ 24న విడుదల కాబోతోంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3GBxpKT
v

డబ్బుంటే క్రిమినల్స్ ఇలా అనుభవించొచ్చు.. ఆర్యన్ ఖాన్ విడుదలపై సమంత ఫ్రెండ్ కామెంట్స్

తనయుడు మొత్తానికి బెయిల్ మీద విడుదలయ్యాడు. శుక్రవారం నాడే బయటకు రావాల్సిన ఆర్యన్.. లాయర్లు బెయిల్ పత్రాలు సమర్పించడంలో అశ్రద్ద వహించారు. దీంతో అది శనివారం నాటికి వాయిదా పడింది. మొత్తానికి ఆర్యన్ ఖాన్ బయటకు వచ్చాడు. ఆర్యన్ రాక కోసం జన్నత్ మొత్తానికి జిగేల్ మనిపించేలా అరేంజ్ చేశారు. ఇక ఆర్యన్ రాక కోసం అదిరిపోయే ఏర్పాట్లు చేసినట్టు తెలుస్తోంది. అయితే ఆర్దర్ రోడ్డు జైలు నుంచి మన్నత్ వరకు ఆర్యన్ కోసం ప్రత్యేకంగా రహదారిలో ఏర్పాట్లు చేసినట్టు కనిపిస్తోంది. ఆర్యన్ లగ్జరీ కారులో వస్తుంటే.. దారి పొడవున జనాలు.. కారు ముందు సెక్యూరిటీ గార్డులు.. అబ్బో ఆ హంగామా మామూలుగా లేదు. ఏదో ఒలింపిక్ ఆటల్లో బంగారు పతాకాన్ని తీసుకొచ్చినంత ఘనంగా తీసుకొచ్చేస్తున్నారు. మొత్తానికి ఆర్యన్ ఖాన్ బెయిల్ మీద బయటకు రావడం, ఏదో ఘన కార్యం చేసి బయటకు వచ్చినట్టు ఇలా తీసుకెళ్లడంపై నెట్టింట్లో చర్చకు దారి తీస్తోంది. ఆర్యన్ ఖాన్ బెయిల్ మీద బయటకు రావడం, ఆ హంగామాకు సంబంధించిన వీడియో మీద మేకప్ ఆర్టిస్ట్, ఫ్రెండ్ కౌంటర్లు వేసింది. క్రైమ్ చేసినా కూడా ఒక వేళ మన దగ్గర డబ్బు, పవర్ ఉంటే ఇలా అనుభవించొచ్చు.. ఇలా దేవుడిలా స్వాగతం పలుకుతారు అని ఈ విజువల్స్ నిరూపిస్తున్నాయి.. దేవుడా.. ఆర్యన్ ఖాన్ బెయిల్ మీద బయటకు వచ్చేశాడు అంటూ సాధన సింగ్ కౌంటర్లు వేసింది. ప్రస్తుతం సాధన సింగ్, సమంత, ప్రీతమ్ జుకల్కర్ దుబాయ్‌లో ఎంజాయ్ చేస్తోన్న సంగతి తెలిసిందే. రేపు ఆదివారం జరుగబోతోన్న మ్యాచ్ కోసమే దుబాయ్‌కి వెళ్లినట్టు తెలుస్తోంది. అయితే సమంత మళ్లీ ఎప్పుడు తిరిగి వస్తుందో చూడాలి.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3pLLbom
v

మంచు విష్ణు పరువుతీసీన హైపర్ ఆది.. తెగ నవ్వుకుంటున్న నెటిజన్లు.. పర్యావసానం ఎలా ఉంటుందో?

వేసే పంచులు ఎలా ఉంటాయో అందరికీ తెలిసిందే. ట్రెండ్‌కు తగ్గట్టుగా కౌంటర్లు వేస్తుంటారు. నిత్యం జరిగే వాటిపై కౌంటర్లు వేస్తుంటారు. ఎవరైతే సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉంటారో అలాంటి వారిపై ఆది కౌంటర్లు వేస్తుంటాడు. అలా గతంలో కత్తి మహేష్, రాకేష్ మాస్టర్, కతర్ పాప, శ్రీరెడ్డి ఇలా కొందరిపై హైపర్ ఆది పంచ్‌లు వేశాడు. అలా ఎవరు ఎప్పుడు ట్రెండ్ అయితే వారి మీద తన స్కిట్లలో వెరైటీ పంచ్‌లు రాసుకుంటాడు. వారిపై సెటైర్లు వేస్తుంటాడు. తాజాగా హైపర్ ఆది కన్ను మీద పడింది. మా ఎన్నికల్లో మంచు విష్ణు చేసిన హడావిడి అంతా కాదు. మీడియాతో మాట్లాడుతూ మంచు విష్ణు చెప్పిన మాటలు, చేసిన అతిపై నెట్టింట్లో లెక్కలేనన్ని మీమ్స్, ట్రోల్స్ వచ్చాయి. ఓ సందర్భంగా నా గురించి పది ఊర్లను దత్తత తీసుకున్నాను.. నేను చెప్పను... మీరే వెళ్లి చూసుకోండి అని అంటాడు.. చెప్పను అన్న తరువాత ఎలా తెలుస్తుంది.. ఎలా వెళ్లి తెలుసుకోవాలి? అంటూ ట్రోల్స్, మీమ్స్ జరిగాయి. ఇక మంచు విష్ణు తన ప్రసంగాల్లో ఎక్కువగా వాడిన పదం అంకుల్. లెట్ దెమ్ నో అంకుల్ అంటూ ఎక్కువగా వాడేశాడు. ఇక టంగుటూరి వీరేహం పకహం అంటూ ఏదేదో మాట్లాడేశాడు. ఇలా మంచు విష్ణు నాడు సోషల్ మీడియాలో ఎదుర్కొన్న ట్రోలింగ్‌లపై తాజాగా హైపర్ ఆది సెటైర్లు వేశాడు. మొత్తానికి దీపావళి ఈవెంట్ రాక ముందే పేలిపోయేలా ఉంది. అన్నీ మీకే తెలిసినట్టు మాట్లాడుతారేంటి? ఇంతకు ముందు ప్రియమణి గారు మా సైడ్ వచ్చి ఏమన్నారంటే.. అని ఆది అనడం.. హా ఏమన్నారు అని రోజా కౌంటర్ వేయడం. ఆదిని రాం ప్రసాద్ అందరూ పట్టుకుని ఉంటే.. లెట్ దెమ్ నో అంకుల్ లెట్ దెమ్ నో.. అంటూ మంచు విష్ణును గుర్తుకు చేశాడు. స్కిట్‌లో గెటప్ శ్రీను అంకుల్ లేడు కాబట్టి సరిపోయింది.. అసలు మీకు స్కిట్ గురించి తెలుసా? మీకు స్క్రిప్ట్ మీద శూన్యం.. ఆ గుడివాడ రహల గురించి తెలుసా? అంటూ కౌంటర్ వేశాడు. బయట నన్ను ఎప్పుడూ ఓ పది మంది పొగుడుతూ ఉంటారు.. అని ఆది అనడం.. ఎవరు అని పక్కనుంచి రాంప్రసాద్ అడగడం.. వాళ్ల పేర్లు నేను చెప్పను.. కావాలంటే మీరు వెళ్లి అడగండి వాళ్లు నా గురించి చెబుతారు అని మరో సెటైర్ వేశాడు. దీపావళి ఈవెంట్ ప్రోమో కింద ఆది వేసిన పంచ్‌లు, మంచు విష్ణును ఆడుకున్న తీరుకు అందరూ నవ్వుకుంటున్నారు. మొత్తానికి మంచు విష్ణు మీద వచ్చిన ట్రోల్స్ మాత్రం ఫుల్లుగానే వైరల్ అయ్యాయన్నమాట. అయితే ఆది పంచులు వేశాడు మరి దాని పర్యావసానం ఎలా ఉంటుందో చూడాలి.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3bplfXm
v

పెళ్లై ఏడాది.. భర్త సీక్రెట్ చెప్పిన చందమామ.. రాత్రి అలా చేస్తాడన్న కాజల్

గత ఏడాది ఈ సమయానికి పరిస్థితులు ఎలా ఉన్నాయో అందరికీ తెలిసిందే. కరోనా దెబ్బకు అందరూ విలవిల్లాడిపోయారు. ఫస్ట్ వేవ్ దెబ్బకు అందరూ కుదేలయ్యారు. కొన్ని కొన్నిరంగాలు అలా పుంజుకోవడం ప్రారంభించాయి. ఎక్కడా ఎక్కువ మంది కలిసి ఈవెంట్లు ఏర్పాటు చేసుకోవడానికి అనుమతులు లేవు. అలాంటి సమయంలోనే తన ప్రేమను బయపెట్టేసింది. తన ప్రేమ గురించి ప్రపంచానికి వింతగా తెలియజేసింది. గౌతమ్ కిచ్లూతో ఎప్పటి నుంచో స్నేహబంధాన్ని కొనసాగిస్తూ వచ్చిన కాజల్ మొత్తానికి లాక్డౌన్ ఎఫెక్ట్‌తో ప్రేమ పీఠల వరకు తెచ్చేసింది. అలా అక్టోబర్ 30న గత ఏడాది ముంబైలో అతి కొద్ది మంది సన్నిహితుల మధ్య కాజల్ పెళ్లి వేడుకలు జరిగాయి.. సెలెబ్రిటీలు ఎవ్వరూ కూడా వెళ్లలేదు. కేవలం సోషల్ మీడియా వేదికగానే శుభాకాంక్షలు అందించారు. అలా కాజల్ గౌతమ్ పెళ్లి నిరాండబరంగానే జరిగినా కూడా వారం రోజులు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యాయి. ఆమె ధరించిన పెళ్లి చీర, వాడిన కాస్ట్యూమ్స్, హనీమూన్ పిక్స్ ఇలా ఎన్నోన్నో విషయాలతో నెట్టింట్లో తెగ హల్చల్ చేసింది. అయితే మొత్తానికి కాజల్ ఇప్పుడు ఫుల్ ఖుషీగా ఉంది. తన పెళ్లై ఏడాది అవుతోంది. వివాహా బంధానికి ఏడాది పూర్తి కావడంతో కాజల్ ఎమోషనల్ అయింది. అలానే భర్తకు సంబంధించిన ఓ సీక్రెట్‌ను బయటపెట్టేసింది. అర్దరాత్రి తన భర్త గునుగుతాడట. నిద్ర లేచే ఉన్నావా? ఇదిగో ఇలా ఈ డాగ్ వీడియో చూడు కాజల్ అని అంటాడట. అలా అనడం తనకు ఎంతో ఇష్టమట. హ్యాపీ వెడ్డింగ్ యానీవర్సరీ అంటూ తన భర్తతో అన్యోన్యంగా ఉన్న ఫోటోను కాజల్ షేర్ చేసింది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2ZBkTdW
v

NTR: పునీత్ రాజ్‌కుమార్‌కు ఎన్టీఆర్ నివాళి...కాసేపు మౌనంగా అలానే చూసిన తార‌క్‌

క‌న్న‌డ అగ్ర క‌థానాయ‌కుడు పునీత్ రాజ్‌కుమార్ మ‌ర‌ణ వార్త తెలిసిన సినీ ఇండ‌స్ట్రీ షాక‌య్యింది. ముఖ్యంగా టాలీవుడ్ స్టార్స్ తో పునీత్ రాజ్‌కుమార్‌కు స‌న్నిహిత సంబంధాలున్నాయి. ముఖ్యంగా ఎన్టీఆర్‌కు పునీత్‌కు మంచి అనుబంధం ఉంది. పునీత్ మ‌రి లేర‌నే వార్త విన‌గానే తార‌క్ షాక‌య్యారు. శ‌నివారం ఆయ‌న బెంగుళూరు చేరుకుని పునీత్ రాజ్‌కుమార్ పార్థివ దేహానికి నివాళులు అర్పించారు. ఆయ‌న చాలా సేపు పునీత్ రాజ్‌కుమార్ పార్థివ దేహాన్ని అలా చూస్తుండిపోయారు. ఆ స‌మ‌యంలో ఎవ‌రితోనూ మాట్లాడ‌లేదు. క‌ళ్లార్ప‌కుండా అలా కొద్ది సేపు చూసిన చివ‌ర‌కు న‌మస్కారం చేసి అక్క‌డ నుంచి పునీత్ అన్న‌య్య శివ రాజ్‌కుమార్‌ను క‌లిసి ఆయ‌న్ని ఓదార్చారు. అక్క‌డ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చేశారు. ఎన్టీఆర్‌ను పునీత్ రాజ్‌కుమార్ త‌న సోద‌రుడిగా భావించేవారు. ఆ అనుబంధంతోనే పునీత్ హీరోగా న‌టించిన చ‌క్ర‌వ్యూహ చిత్రంలో ఎన్టీఆర్ గెల‌యా..గెలయా అనే పాట‌ను పాడారు. ఈ సినిమాకు ఎస్‌.ఎస్‌.త‌మ‌న్ సంగీతం అందించారు. అంత‌కు ముందుగానే పునీత్ పార్థివ దేహాన్ని సంద‌ర్శించిన బాల‌కృష్ణ ఎమోష‌న‌ల్‌గా క‌న్నీళ్లు పెట్టుకున్నారు. ఇదంతా విధిరాత అంటూ త‌ల కొట్టుకున్నారు. రాజ్‌కుమార్ ఫ్యామిలీతో త‌మ‌కున్న అనుబంధాన్ని ఆయ‌న ఈ సంద‌ర్భంగా నెమ‌ర‌వేసుకున్నారు. నందమూరి హీరోల‌తో పాటు ఇటు చిరంజీవి కుటుంతో, మోహ‌న్‌బాబు ఫ్యామిలీ, మ‌హేశ్ ఫ్యామిలీతో పునీత్‌కు మంచి అనుబంధం ఉంది. ప్ర‌స్తుతం పునీత్ రాజ్‌కుమార్‌ పార్థివ దేహాన్ని కంఠీర‌వ స్టేడియంలో అక్క‌డ ప్ర‌జ‌ల సంద‌ర్శనార్థం ఉంచారు. ల‌క్ష‌లాదిగా ప్ర‌జ‌లు పునీత్‌కు నివాళ‌లు అర్పిస్తున్నారు. శ‌నివారం సాయంత్రం అంత్య‌క్రియ‌లు జ‌రుగుతాయి. ప్ర‌స్తుతం పునీత్ రాజ్‌కుమార్ కుమార్తె వందిత‌ అమెరికా నుంచి వ‌స్తున్నారు. ఆమె శ‌నివారం బెంగ‌ళూరుకి చేరుకుంటారు. ఆమె తుది చూపు చూసిన త‌ర్వాత పునీత్ రాజ్‌కుమార్ అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛ‌నాల‌తో జరుగుతాయి.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3jQa2nj
v

RRR గ్లింప్స్ రిలీజ్‌డేట్‌పై లేటెస్ట్ అప్‌డేట్.. అందరిలో పెరుగుతోన్న అంచనాలు

జ‌క్క‌న్న రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ హీరోలుగా రూపొందుతోన్న మోస్ట్ అవెయిటింగ్ మూవీ ఆప్ ఇండియా RRR. నిజానికి ఈ శుక్ర‌వారం(అక్టోబ‌ర్ 29)రోజున ఈ సినిమా నుంచి ముప్పై, న‌ల‌భై సెక‌న్ల పాటు గ్లింప్స్‌ను విడుద‌ల చేయాల‌ని చిత్ర యూనిట్ భావించింది. అయితే క‌న్న‌డ స్టార్ హీరో పునీత్ రాజ్‌కుమార్ ఆక‌స్మాత్తుగా చ‌నిపోవ‌డంతో కార్య‌క్ర‌మాన్ని వాయిదా వేశారు. ఈ విష‌యాన్ని ట్విట్ట‌ర్ ద్వారా చిత్ర యూనిట్ ప్ర‌క‌టించింది. అయితే తాజాగా గ్లింప్స్‌ను ఆదివారం అంటే న‌వంబ‌ర్ 1న ఉద‌యం 11 గంట‌ల‌కు విడుద‌ల చేయ‌బోతున్న‌ట్లు చిత్ర యూనిట్ ప్ర‌క‌టించింది. ఈ గ్లింప్స్ 45 సెక‌న్ల పాటు ప్రేక్ష‌కుల‌ను మెప్పించ‌నుంది. ‘బాహుబ‌లి’ త‌ర్వాత రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న సినిమా కావ‌డంతో ఎంటైర్ ఇండియ‌న్ మూవీ ఇండ‌స్ట్రీ ఆస‌క్తిగా ఎదురుచూస్తుండ‌గా.. టాలీవుడ్ స్టార్ హీరోలైన యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ కాంబినేష‌న్ మూవీ కావ‌డంతో ఇటు మెగా ఫ్యాన్స్‌, అటు నందమూరి ఫ్యాన్స్‌తో పాటు టాలీవుడ్ ప‌రిశ్ర‌మ అంతా ఎదురుచూస్తుంది. అగ్ర న‌టీన‌టులు చేసిన సినిమా కావ‌డంతో సినిమా క‌లెక్ష‌న్స్ ప‌రంగా ఎలాంటి సంచ‌నాల‌కు తెర తీస్తుందోనిన ట్రేడ్ వ‌ర్గాలు ఎదురుచూస్తున్నాయి. ఇంత మందిలో ఆస‌క్తి పెంచుతోన్న ఈ సినిమా వ‌చ్చే ఏడాది సంక్రాంతి సంద‌ర్భంగా జ‌న‌వ‌రి 7న రావ‌డం ప‌క్కా అయ్యింది. ఇప్ప‌టికే క‌రోనా దెబ్బ‌కు రెండు, మూడు సార్లు సినిమా విడుద‌ల వాయిదా ప‌డింది. కానీ ఈసారి మాత్రం డేట్ ఫిక్స‌యిపోండ‌ని జ‌క్క‌న్న అంద‌రికీ చెప్పేశాడ‌ట‌. నిర్మాణానంత‌ర కార్య‌క్ర‌మాలు జ‌రుగుతున్నాయి. మ‌రో వైపు ద‌ర్శ‌క ధీరుడు రాజ‌మౌళి RRR ర‌న్ టైమ్‌ను లాక్ చేశాడ‌ట‌. సినిమా ర‌న్ టైమ్ 2 గంట‌ల 45 నిమిషాల‌ని న్యూస్ నెట్టింట హ‌ల్ చ‌ల్ చేస్తోంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో సినిమా రెండున్నర గంట‌లు ఉంటేనే ఎక్కువ‌. కానీ.. రాజ‌మౌళి త‌న సినిమాకు 165 నిమిషాలు ఫిక్స్ చేయ‌డం టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. ఒక‌వైపు రాజ‌మౌళి తుది మెరుగులు దిద్దే ప‌నిలోఉంటూనే RRRను ప్ర‌మోట్ చేయ‌డంలో బిజీగా ఉంటున్నారు. సినిమా మ‌రింత ఎఫెక్టివ్‌గా ఆడియెన్స్‌కు క‌నెక్ట్ కావాల‌ని జక్క‌న్న తీవ్రంగా యోచిస్తున్నాడ‌ట‌.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3Bthg6o
v

దేవుడు అన్యాయం చేశాడు..నాకు వ్య‌క్తిగ‌తంగా తీర‌ని లోటు అంటూ అంటూ బాల‌కృష్ణ ఎమోష‌న‌ల్ స్పీచ్‌

కన్నడ అగ్ర కథానాయకుడు మ‌ర‌ణం క‌న్న‌డ సినీ ఇండ‌స్ట్రీకి తీర‌ని లోటు. అయితే న‌టుడిగా, వ్య‌క్తిగా ఆయ‌న ఓ క‌న్న‌డ సినీ రంగానికే ప‌రిమితం కాలేదు. తెలుగు, త‌మిళ‌, హిందీ స‌హా ప‌లు చిత్ర ప‌రిశ్ర‌మ‌ల‌తో ఆయ‌న మంచి స్నేహ బంధాన్ని కొన‌సాగించారు. పునీత్ ఇక లేర‌నే వార్త అంద‌ర‌నీ షాక్‌కు గురి చేసింది. శ‌నివారం పునీత్ పార్థివ దేహాన్ని నంద‌మూరి బాల‌కృష్ణ సంద‌ర్శించి నివాళులు అర్పించారు. ఈ సంద‌ర్భంగా బాల‌కృష్ణ త‌ల కొట్టుకుని విధిరాత అంటూ చాలా ఎమోష‌న‌ల్ అయ్యి క‌న్నీళ్లు పెట్టుకున్నారు. ఈ క్ర‌మంలో ఆయ‌న అక్క‌డున్న మీడియాతో మాట్లాడారు. ‘‘పునీత్ రాజ్‌కుమార్‌గారు లేర‌నే వార్త న‌మ్మ‌లేని నిజం. వార్త తెలియ‌గానే షాక‌య్యాను. ఒకే త‌ల్లికి పుట్ట‌క‌పోయినా సోద‌రుల్లాగా క‌లిసి పోయాం. రెండు కుటుంబాల మ‌ధ్య చాలా మంచి స్నేహ బాంధ‌వ్యాలున్నాయి. నాన్న‌గారు, రాజ్‌కుమార్‌గారు రెండు ఫ్యామిలీల మ‌ధ్య అలాంటి అనుబంధాన్ని ఏర్ప‌రిచారు. దేవుడు చాలా అన్యాయం చేశాడు. న‌టుడిగా ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకోవ‌డ‌మే కాదు, సామాజిక సేవా కార్య‌క్ర‌మాల‌తో ఎంద‌రికో అండ‌గా నిల‌బ‌డ్డారు. చ‌నిపోయిన త‌ర్వాత కూడా ఆయ‌న త‌న క‌ళ్ల‌ను దానం చేశారు. అంత మంచి మ‌న‌సున్న వ్య‌క్తి. నేను ఎమ్మెల్యేగా ఉన్న‌ప్పుడు లేపాక్షి ఉత్స‌వాల‌కు రావాల‌ని కోరితే శివ‌రాజ్‌కుమార్‌గానీ, పునీత్ రాజ్‌కుమార్‌గానీ వ‌చ్చేవారు. ఈరోజు ఆయ‌న మ‌న మ‌ధ్య లేర‌నేది నిజం. అయితే మ‌న గుండెల్లో ఉండిపోతారు’’ అన్నారు బాలకృష్ణ‌. పునీత్ రాజ్‌కుమార్ టాలీవుడ్ ఇండ‌స్ట్రీతో అంద‌రికంటే ఆయ‌నే ఎక్కువ స్నేహ సంబంధాల‌ను ఏర్ప‌రుచుకున్నారు. ఇక్క‌డి నుంచి ఏ హీరో బెంగుళూరు వెళ్లినా, పునీత్ వెళ్లి ప్ర‌త్యేకంగా క‌లిసి మాట్లాడేవారు. అలాంటి వ్య‌క్తి ఉన్న‌ట్లుండి దూరం కావ‌డాన్ని ఎవ‌రూ జీర్ణించుకోలేక‌పోతున్నారు. య‌న్‌.టి.ఆర్ బ‌యోపిక్ స‌మ‌యంలో బాల‌కృష్ణ సినిమా ప్ర‌మోష‌న్స్‌కు బెంగుళూరు వెళ్లిన‌ప్పుడు పునీత్ ఆయ‌న ప‌క్క‌నే కూర్చున్నారు. బాల‌కృష్ణ ముఖంపై ఏదో ఉంటే త‌న ఖ‌ర్చీఫ్ తీసుకుని దాన్ని శుభ్రం చేశారు. ఆ వీడియో ఇప్పుడు నెట్టింట వైర‌ల్ అవుతుంది. పునీత్ రాజ్‌కుమార్‌ పార్థివ దేహాన్ని కంఠీర‌వ స్టేడియంలో అక్క‌డ ప్ర‌జ‌ల సంద‌ర్శనార్థం ఉంచారు. శ‌నివారం సాయంత్రం అంత్య‌క్రియ‌లు జ‌రుగుతాయి. ప్ర‌స్తుతం పునీత్ రాజ్‌కుమార్ కుమార్తె అమెరికా నుంచి వ‌స్తున్నారు. ఆమె శ‌నివారం బెంగ‌ళూరుకి చేరుకుంటారు. ఆమె తుది చూపు చూసిన త‌ర్వాత పునీత్ రాజ్‌కుమార్ అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛ‌నాల‌తో జరుగుతాయి.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3BvSEtT
v

పునీత్ రాజ్‌కుమార్‌కు బాల‌కృష్ణ నివాళి.. త‌ల కొట్టుకుని.. క‌న్నీళ్లు పెట్టుకున్న నంద‌మూరి హీరో

క‌న్న‌డ ప్ర‌ముఖ క‌థానాయ‌కుడు పునీత్ రాజ్ కుమార్ మ‌ర‌ణం సినీ ప‌రిశ్ర‌మ‌ను శోక సంద్రంలో ముంచేసింది. ముఖ్యంగా పునీత్‌కు తెలుగు సినిమా ఇండ‌స్ట్రీలోని స్టార్స్‌తో మంచి అనుబంధాన్ని ఏర్ప‌రుచుకున్నారు. శ‌నివారం కంఠీర‌వ మైదానంలో పార్థివ దేహాన్ని ప్ర‌జ‌ల సంద‌ర్శ‌నార్థం ఉంచారు. ప్ర‌జ‌లు ల‌క్ష‌ల్లో పునీత్ పార్థీవ దేహాన్ని సంద‌ర్శిస్తున్నారు. ఈ క్ర‌మంలో టాలీవుడ్ సీనియ‌ర్ అగ్ర క‌థానాయ‌కుడు నంద‌మూరి బాల‌కృష్ణ పునీత్ రాజ్‌కుమార్ పార్థీవ దేహానికి నివాళులు అర్పించారు. పునీత్ రాజ్‌కుమార్ సోదరుడు శివ రాజ్‌కుమార్ ఈ నేప‌థ్యంలో బాల‌కృష్ణ చాలా ఎమోష‌న‌ల్ అయ్యారు. క‌న్నీళ్లు పెట్టుకున్నారు. ఇదంతా విధిరాత అంటూ త‌ల కొట్టుకుని త‌న భావోద్వేగాన్ని ప్ర‌ద‌ర్శించారు. బాల‌కృష్ణ‌తో నిర్మాత సాయి కొర్ర‌పాటి ఉన్నారు. తెలుగు చిత్ర‌సీమంటే క‌న్న‌డ కంఠీర‌వ రాజ్‌కుమార్ ఫ్యామిలీకి ఎంతో ఇష్టం. మ‌న నటీనటుల‌ను ఎంత‌గానో ఆద‌రించేవారు. పునీత్ రాజ్‌కుమార్ విష‌యానికి వ‌స్తే.. వారి ఫ్యామిలీలో టాలీవుడ్ ఇండ‌స్ట్రీతో అంద‌రికంటే ఆయ‌నే ఎక్కువ స్నేహ సంబంధాల‌ను ఏర్ప‌రుచుకున్నారు. ఇక్క‌డి నుంచి ఏ హీరో బెంగుళూరు వెళ్లినా, పునీత్ వెళ్లి ప్ర‌త్యేకంగా క‌లిసి మాట్లాడేవారు. అలాంటి వ్య‌క్తి ఉన్న‌ట్లుండి దూరం కావ‌డాన్ని ఎవ‌రూ జీర్ణించుకోలేక‌పోతున్నారు. ముఖ్యంగా నంద‌మూరి ఫ్యామిలీతో పునీత్‌కు చాలా మంచి స్నేహ బంధం ఉంది. ఆ మ‌ధ్య‌లో బాల‌కృష్ణ త‌న‌ సినిమా ప్ర‌మోష‌న్స్‌కు బెంగుళూరు వెళ్లిన‌ప్పుడు పునీత్ ఆయ‌న ప‌క్క‌నే కూర్చున్నారు. బాల‌కృష్ణ ముఖంపై ఏదో ఉంటే త‌న ఖ‌ర్చీఫ్ తీసుకుని దాన్ని శుభ్రం చేశారు. తానో పెద్ద హీరోన‌నే ఫీలింగ్‌ను ఎక్క‌డా చూపించేవారు కాదు పునీత్‌. ఆర్య సినిమా చూసి బన్నీకి స్పెషల్‌గా ఫోన్ చేసి మాట్లాడారంటే ఆయన మంచితనం, కలుపుగోలుతనం అర్థం చేసుకోవచ్చు. అలాగే చరణ్‌తో ఫ్రెండ్లీగా ఉండేవారు. అదే అంద‌రికీ ఆయ‌న్ని చాలా ద‌గ్గ‌ర చేసింద‌ని అందరూ అంటారు. పునీత్‌లాంటి ఓ మంచి వ్య‌క్తిని, స్నేహ‌శీలిని కోల్పోవ‌డం సినీ ఇండ‌స్ట్రీకి పెద్ద లోటే. కేవ‌లం సినిమాల‌తోనే కాదు, ఎంతో మంది ఆప‌న్నుల‌కి అండ‌గా నిలిచి త‌న దాతృత్వాన్ని చాటుకున్నారు. ఇబ్బందుల్లో ఉన్న వారికి ఆర్థిక సాయాన్ని అందించారు. చిన్న పిల్ల‌లు, అనాథ పిల్ల‌ల‌కు విద్య‌ను అందిస్తున్నారు పునీత్‌. అలాంటి వ్య‌క్తి ఉన్న‌ట్లుండి దూర‌మ‌వ‌డం అంద‌రికీ షాకింగ్‌గా అనిపిస్తుంది. సినీ సెల‌బ్రిటీలంద‌రూ త‌మ‌న సంతాపాన్ని వ్య‌క్తం చేశారు. పునీత్ రాజ్‌కుమార్‌ పార్థివ దేహాన్ని కంఠీర‌వ స్టేడియంలో అక్క‌డ ప్ర‌జ‌ల సంద‌ర్శనార్థం ఉంచారు. శ‌నివారం సాయంత్రం అంత్య‌క్రియ‌లు జ‌రుగుతాయి. ప్ర‌స్తుతం పునీత్ రాజ్‌కుమార్ కుమార్తె అమెరికాలో ఉన్నారు. అక్క‌డ నుంచి ఆమె శ‌నివారం బెంగ‌ళూరుకి చేరుకుంటారు. ఆమె తుది చూపు చూసిన త‌ర్వాత పునీత్ రాజ్‌కుమార్ అంత్యక్రియలు జరుగుతాయి.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3nKQKk2
v

Friday 29 October 2021

నేను వాటిని ప‌ట్టించుకోలేదు.. ఆలియాభ‌ట్ టార్చ‌ర్ పెట్టింది.. వాళ్ల‌తో ప‌నిచేయడం చాలా ఈజీ..రాజ‌మౌళి సెన్సేష‌న‌ల్ కామెంట్స్‌

ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి త‌న ప్రెస్టీజియ‌స్ మూవీ RRR ప్ర‌మోషన్స్‌లో బిజీగా ఉన్నారు. ఒక‌వైపు మూవీ పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాల‌తో త‌ల‌మున‌క‌లై ఉంటూనే పాన్ ఇండియా రేంజ్‌లో త‌న సినిమాను ప్ర‌మోట్ చేసుకోవ‌డంపై కూడా దృష్టి పెట్టారు. రాజమౌళి రీసెంట్‌గా ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో త‌న సినిమా RRR ..ఆలియా గురించి, ఎన్టీఆర్‌, చ‌ర‌ణ్‌, అజ‌య్ దేవ‌గ‌ణ్ స‌హా ఇత‌ర స్టార్స్‌ను డైరెక్ట్ చేయ‌డం గురించి ప‌లు ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాల‌ను ఆయ‌న తెలియ‌జేశారు. ‘‘నేను డైరెక్టర్‌గా న‌టీన‌టులు ఉత్తరాదివారా, ద‌క్షిణాదివారా, హిందీ, త‌మిళ‌, క‌న్న‌డ .. అంటూ వారి మ‌ధ్య హ‌ద్దుల‌ను చూడ‌టం మ‌ర‌చిపోయాను. ఆడియెన్స్ విష‌యంలోనూ అంతే నేను భాషా బేదాలు చూడటం మ‌ర‌చిపోయాను. స్క్రిప్ట్ కూడా అంతే నా స్క్రిప్ట్‌కు భాష‌తో సంబంధం లేకుండా ఏ న‌టుడు అయితే న్యాయం చేస్తాడా? అని ఆలోచించే అప్రోచ్ అవుతాను. అలాగే నేను డైరెక్ట్ చేసిన బాహుబ‌లి కార్డ్‌ను కూడా ఉప‌యోగించుకోను. స్క్రిప్ట్ ప్ర‌కార‌మే ముందుకెళ‌తాను. RRR లో అజ‌య్ దేవ‌గ‌ణ్‌గారు కీల‌క పాత్ర పోషించారు. ఆయ‌న ఈగ హిందీ వెర్ష‌న్ మ‌క్కీకి డ‌బ్బింగ్ చెప్పారు. అప్ప‌టి నుంచి ఆయ‌న‌తో అనుబంధం ఉంది. స్టార్స్‌తో ప‌నిచేయడం నాకు చాలా ఈజీ. వారికి సంబంధించిన వ‌ర్క్ విష‌యంలో వారెంతో ప్రొఫెష‌న‌ల్‌గా ఉంటారు. అజ‌య్ దేవ‌గ‌ణ్‌గారిని తీసుకుంటే, ఆయ‌న షూటింగ్ స‌మ‌యంలో ఎప్పుడూ త‌న వ్యానిటీ వ్యాన్‌లో కూర్చోలేదు. బ‌య‌టే కూర్చుని షాట్ ఎలా వ‌స్తుందో గ‌మ‌నించేవారు. అలాగే న‌న్ను చూస్తుండేవారు. నేనెప్పుడైనా ఆయ‌న్ని చూస్తే లేచి నా ద‌గ్గ‌ర‌కు న‌డుచుకుంటూ వ‌చ్చి నాతో ఏమైనా అవ‌స‌రం ఉందా సార్‌! అని అడిగేవారు. ఇక ఆలియా భ‌ట్ అయితే మ‌మ్మ‌ల్ని టార్చ‌ర్ పెట్టేసింది. త‌న లైన్స్ గురించి, డిక్ష‌న్ గురించి పూర్తిగా తెలుసుకునేది. ఇక ఎన్టీఆర్‌, చ‌ర‌ణ్ రెండు ద‌శాబ్దాలుగా తెలుసు. నాకు మంచి స్నేహితులు, సోద‌ర స‌మానులు. వారితో ప‌నిచేయ‌డం ఎప్పుడూ నాకు క‌ష్ట‌మ‌నిపించ‌లేదు’’ అని తెలిపారు రాజమౌళి. ‘బాహుబ‌లి’ త‌ర్వాత రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న సినిమా కావ‌డంతో ఎంటైర్ ఇండియ‌న్ మూవీ ఇండ‌స్ట్రీ ఆస‌క్తిగా ఎదురుచూస్తుండ‌గా.. టాలీవుడ్ స్టార్ హీరోలైన యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ కాంబినేష‌న్ మూవీ కావ‌డంతో ఇటు మెగా ఫ్యాన్స్‌, అటు నందమూరి ఫ్యాన్స్‌తో పాటు టాలీవుడ్ ప‌రిశ్ర‌మ అంతా ఎదురుచూస్తుంది. అగ్ర న‌టీన‌టులు చేసిన సినిమా కావ‌డంతో సినిమా క‌లెక్ష‌న్స్ ప‌రంగా ఎలాంటి సంచ‌నాల‌కు తెర తీస్తుందోనిన ట్రేడ్ వ‌ర్గాలు ఎదురుచూస్తున్నాయి. ఇంత మందిలో ఆస‌క్తి పెంచుతోన్న ఈ సినిమా వ‌చ్చే ఏడాది సంక్రాంతి సంద‌ర్భంగా జ‌న‌వ‌రి 7న రావ‌డం ప‌క్కా అయ్యింది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3GA7QtJ
v

శృంగార స‌మ‌యంలో ఆ యాంగిల్‌నే ఎక్కువ‌గా ఇష్ట‌ప‌డ‌తా.. మ‌లైకా అరోరా కామెంట్స్ వైర‌ల్‌

బాలీవుడ్ హాట్ బ్యూటీ.. ఫిట్‌నెస్ ఫ్రీక్ చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట తెగ వైర‌ల్ అవుతున్నాయి. ఇంత‌కీ ఆమె దేని గురించి చెప్పిందో తెలుసా!.. శృంగారం స‌మ‌యం గురించి. అస‌లు మ‌లైకా త‌న సీక్రెట్‌గా ఉంచాల్సిన శృంగార ర‌హస్యాన్ని ఎందుకు బ‌ట్ట బ‌య‌లు చేసింది. ఆమెకు ఆ అవ‌స‌రం ఏంటి? అనే వివ‌రాల్లోకి వెళ్తే.. ‘నో ఫిల్ట‌ర్ విత్ నేహ’ అనే క్యారక్రమంలో అతిథిగా మలైకా అరోరా పాల్గొంది. అప్పుడు నేహా ధూపియా అనుకోని ఓ ప్ర‌శ్న‌ను వేసింది. నీకు శృంగారంలో ఏ యాంగిల్ అంటే ఇష్ట‌మ‌ని వెంట‌నే టాప్ యాంగిల్ అని మ‌లైకా అరోరా ఏమాత్రం తడుముకోకుండా బ‌దులిచ్చింది. అయితే ఈ ఇంట‌ర్వ్యూ ఏం కొత్త‌గా జ‌రిగిందేం కాదు.. పాత‌దే. అయితే ఈ వార్త మాత్రం నెట్టింట మ‌రోసారి తెగ హ‌ల్ చ‌ల్ చేస్తోంది. స‌ల్మాన్ సోద‌రుడు అర్బాజ్‌ఖాన్‌ను 1998లో పెళ్లి చేసుకున్న మలైకా అరోరా అత‌న్నుంచి 2017లో విడాకులు తీసుకుంది. అంత‌కు ముందే అర్జున్ క‌పూర్‌పై ఈమెకు ప్రేమ పుట్టింది. అర్జున్ క‌పూర్ వ‌ల్ల‌నే అర్బాజ్‌, మ‌లైకా విడిపోయార‌నే వార్త‌లు కూడా అప్ప‌ట్లో తెగ హ‌ల్‌చ‌ల్ చేశాయి. ఆమెకు పన్నెండేళ్ల కొడుకు కూడా ఉన్నాడు. అయితే ఇప్పుడామె త‌న‌కంటే వ‌య‌సులో చాలా చిన్న‌వాడైన అర్జున్ క‌పూర్‌తో రిలేష‌న్‌షిప్‌లో ఉంది. త‌మ బంధం గురించి, పెళ్లి గురించి మాత్రం వీరిద్ద‌రూ ఎక్క‌డా నోరు తెర‌వ‌డం లేదు కానీ.. విందులు, విహారాల‌కు చెట్టాప‌ట్టాలేసుకుని వెళుతున్నారు. దాదాపు యాబై ఏళ్ల‌కు ద‌గ్గ‌ర‌వుతున్నా కూడా మ‌లైకా మాత్రం ఫిట్‌నెస్ విష‌యంలో కుర్ర భామ‌ల‌కు గట్టిపోటినే ఇస్తుంది. సినిమాల విష‌యానికి వ‌స్తే.. న‌టిగా, స్పెష‌ల్ సాంగ్ డాన్స‌ర్‌గా త‌న‌దైన గుర్తింపు సంపాదించుకున్న మ‌లైకా అరోరా తెలుగులోనూ రెండు సినిమాల్లో స్పెష‌ల్ సాంగ్స్ చేసింది. అందులో ముందుది అతిథి.. ఇందులో సూప‌ర్‌స్టార్ మ‌హేశ్ హీరో. త‌ర్వాత ప‌వ‌న్ క‌ళ్యాణ్ గ‌బ్బ‌ర్ సింగ్‌లో కెవ్వు కేక సాంగ్‌లోనూ ఆడిపాడి అభిమానుల‌ను అల‌రించింది. ప్ర‌స్తుతం ఇండియాస్ బెస్ట్ డాన్స‌ర్ వంటి షోల‌కు జ‌డ్జ్‌గా వ్య‌వ‌హ‌రిస్తోంది బాలీవుడ్ హాట్ బ్యూటీ మ‌లైకా అరోరా.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3GD0ci2
v

Puneeth Rajkumar: పునీత్ మరణవార్తతో ఆగిన అభిమాని గుండె

ఫ్యాన్స్‌లో డైహార్డ్ ఫ్యాన్స్ వేరు. త‌మ అభిమాన హీరోను ఎవ‌రైనా ఏమైనా చిన్న మాట అంట‌నే విన‌డానికి ఒప్పుకోరు. వారిపైకి గొడ‌వ‌కెళ‌తారు. కొట్టేసుకుంటారు. వారి ప్ర‌వ‌ర్త‌న చూస్తే అబ్బో త‌న హీరో కోసం చ‌నిపోయేలా ఉన్నాడ‌నేంత ప్రేమ ఉందే అనిపిస్తుంది. కానీ నిజంగానే ఇప్పుడుత‌ను ప్రాణంగా ప్రేమించే హీరో లేడ‌ని తెలియ‌గానే ఓ అభిమాని గుండె ఆగింది. కన్నడ ప‌వ‌ర్‌స్టార్ పునీత్ రాజ్‌కుమార్ మ‌ర‌ణం అభిమానుల‌కు షాక్ ఇచ్చి వారిని శోక సంద్రంలో ముంచేసింది. శుక్ర‌వారం ఉద‌యం గుండెపోటుతో పునీత్ రాజ్‌కుమార్ అకాల మ‌ర‌ణం చెందారు. మ‌ర‌ణ‌వార్త విన్న త‌ర్వాత క‌ర్ణాట‌క ప్ర‌భుత్వం త‌గు చ‌ర్య‌లు తీసుకుంది. థియేట‌ర్స్‌ను మూసి వేసింది. మ‌ద్యపాన విక్ర‌యాల‌పై ఆదివారం వర‌కు ప్ర‌భుత్వం నిషేధం విధించింది. అయితే త‌మ అభిమాన క‌థానాయ‌కుడు ఇక లేర‌నే వార్త‌ను అభిమానులు జీర్ణించుకోలేక‌పోతున్నారు. పునీత్ మర‌ణ‌వార్త విన‌గానే మునియ‌ప్ప‌న్ అనే అభిమాని గుండె ఆగిపోయింది. పొన్నాచ్చి తాలూకాలోని మ‌రూరుకి చెందిన మునియ‌ప్ప‌న్‌కు పునీత్ అంటే ప్రాణం. ఇప్పుడు నిజంగా ఆ ప్రాణ‌మే పోయింది. పునీత్ చ‌నిపోయార‌నే వార్త తెలియ‌గానే మునియ‌ప్ప‌న్‌కు గుండెపోటు వ‌చ్చింది. వెంట‌నే ఆయ‌న్ని ద‌గ్గ‌ర‌లోని హాస్పిట‌ల్‌కు తీసుకెళ్లారు. అయితే అప్ప‌టికే ఆయ‌న చ‌నిపోయిన‌ట్లు డాక్ట‌ర్లు చెప్పారు. మునియ‌ప్ప‌న్‌కు ఏడాది వ‌య‌సున్న పాప ఉంది. రీల్ హీరోగా, రియ‌ల్ హీరోగా ఎంద‌రికో స్ఫూర్తిగా నిలిచి ముందుకు న‌డిపిన వ్య‌క్తి పునీత్ రాజ్ కుమార్‌. ఇలా ఉన్న‌ట్లుండి దూర‌మైపోవ‌డం ఆయన కుటుంబంలోని వ్య‌క్తికే కాదు. సినీ ఇండ‌స్ట్రీకి కూడా తీర‌ని లోటే. పునీత్‌తో అనుబంధం ఉన్న వారెవ‌రైనా ఆయ‌న్ని అంత సులువుగా మ‌ర‌చిపోలేరు. భాష‌తో సంబంధం లేకుండా స్టార్స్‌, టెక్నిషియ‌న్స్ అంద‌రూ పునీత్ రాజ్‌కుమార్ మ‌ర‌ణంపై స్పందించారు. త‌మ సంతాపాల‌ను వ్య‌క్తం చేశారు. శ‌నివారం పునీత్ అంత్య‌క్రియ‌లు జ‌రుగుతాయి. పునీత్ రాజ్‌కుమార్ కుమార్తె అమెరికా నుంచి వ‌స్తున్నారు. బాల‌న‌టుడిగా కెరీర్‌ను ప్రారంభించిన పునీత్‌.. హీరోగా 29 సినిమాల్లో న‌టించారు. చిన్న వ‌య‌సులో బాల‌నటుడిగా జాతీయ అవార్డును అందుకున్నారు పునీత్‌.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3GAs9ah
v

నిహారిక కొణిదెల కొత్త వెబ్ సిరీస్‌.. సీక్రెట్ రివీల్ చేసిన మెగాడాట‌ర్‌!

హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వ‌క ముందుగానే మెగాడాట‌ర్ నిహారిక ..వెబ్ సిరీస్‌ల‌తో ప్రేక్ష‌కుల‌కు ద‌గ్గ‌రైన సంగ‌తి తెలిసిందే. సినిమాల్లోహీరోయిన్‌గా న‌టిస్తే ల‌క్ క‌లిసి రాలేదు. ఆ త‌ర్వాత ఆమె పెళ్లి చేసుకుని కొన్ని రోజుల పాటు ఇండ‌స్ట్రీకి దూరంగా ఉన్నారు. అయితే ఇప్పుడు మ‌ళ్లీ త‌న ప్రాజెక్ట్స్‌తో బిజీగా మారాల‌ని అనుకుంటున్నారు. అందులో భాగంగానే కొన్ని రోజుల నుంచి ఆమె త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో ఓసీఎఫ్ఎస్ అనే హ్యాష్ ట్యాగ్‌ను జ‌త చేస్తూ పోస్టులు చేస్తున్న సంగ‌తి తెలిసిందే. అస‌లు దీని అర్థ‌మేంటో తెలియ‌క చాలా మంది నెటిజ‌న్స్ నిహారిక‌ను అదేంటో చెప్ప‌మ‌ని కూడా అడిగారు. కానీ ఇన్ని రోజులు నిహారిక వారి ప్ర‌శ్న‌కు స‌మాధానాన్ని దాట వేస్తూ వ‌చ్చింది. అయితే శుక్ర‌వారం ఆమె తండ్రి, న‌టుడు మెగా బ్ర‌ద‌ర్ నాగ‌బాబు పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ఇన్నిరోజులు దాచి పెడుతూ వ‌చ్చిన సీక్రెట్‌ను నిహారిక రివీల్ చేసింది. ఓసీఎఫ్ఎస్ అంటే ఒక చిన్న ఫ్యామిలీ స్టోరి అని తెలియ‌జేస్తూ ఓ పోస్ట‌ర్‌ను విడుద‌ల చేసింది నిహారిక‌. ఇది తాను నిర్మాత‌గా జీ5 సంస్థ కోసం నిర్మిస్తోన్న వెబ్ సిరీస్ అని కూడా ఈ సంద‌ర్భంగా ఆమె తెలియ‌జేసింది. దానికి సంబంధించిన ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. ఇందులో సంతోశ్ శోభ‌న్‌, సిమ్రాన్ శ‌ర్మ హీరో హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. ఇంకా సీనియ‌ర్ న‌రేశ్‌, తుల‌సి త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. ఈ వెబ్ సిరీస్‌లో ఐదు ఎపిసోడ్స్ ఉంటాయి. ఒక్కో ఎపిసోడ్ న‌లబై నిమిషాల వ్య‌వ‌ధితో ఉంటుంది. న‌వంబ‌ర్ 19న ఈ వెబ్ సిరీస్ అందుబాటులోకి రానుంది. అలాగే తండ్రి పుట్టిన‌రోజు సెల‌బ్రేష‌న్స్‌లో భ‌ర్త‌తో పాటు పాల్గొంది. త‌న ఫ్యామిలీ ఫొటోను నిహారిక ఇన్‌స్టాలో షేర్ చేసింది. దీంతో పాటు ఫ్యామిలీయ అనే క్యాప్ష‌న్ కూడా జోడింది. ఇప్పుడీ ఫొటో నెట్టింట తెగ వైర‌ల్ అవుతోంది. పెళ్లికి ముందే ముద్ద‌ప‌ప్పు అవ‌కాయ్‌, నాన్న కూచి వంటి వెబ్ సిరీస్‌లో న‌టించిన నిహారిక ‘ఒక మ‌న‌సు’ చిత్రంతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. తర్వాత సూర్య కాంతం, ఒరు నెల్లనాల్ పాత్తు సొల్రన్ అనే తమిళ సినిమాల్లో హీరోయిన్‌గా న‌టించింది. అయితే హీరోయిన్‌గా మాత్రం అనుకున్న రేంజ్‌లో స‌క్సెస్‌ను అందుకోలేక‌పోయింది. ఈ క్ర‌మంలో ఆమె చైత‌న్య జొన్న‌ల‌గ‌డ్డ‌ను వివాహం చేసుకుని కొన్నిరోజులు పాటు కుటుంబంతో స‌మ‌యాన్ని గ‌డిపారు. ఇప్పుడు మ‌ళ్లీ ఎంట్రీ ఇచ్చారు. మారుతున్న ట్రెండ్‌ను ఫాలో అవుతతూ డిజిట‌ల్ మాధ్య‌మంకు వెబ్ సిరీస్‌ల‌ను నిర్మించడానికి ఆమె సిద్ధ‌మ‌య్యారు. ఇక భ‌విష్య‌త్తులో ఆమె ఎలాంటి ప్రాజెక్ట్స్‌ను రూపొందిస్తుద‌నేది తెలియాలంటే కొన్నాళ్లు ఆగాల్సిందే.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3mzKKM1
v

పునీత్ హ‌ఠాన్మ‌ర‌ణం..క్వ‌శ్చ‌న్ మార్క్‌లా మారిన‌ రూ.400 కోట్ల మార్కెట్‌

సినీ రంగంలో ఓ స్టార్ హీరో బాక్సాఫీస్ ద‌గ్గ‌ర చూపించే ప్ర‌భావం ఎంతో ఎక్కువ‌గా బ‌లంగా ఉంటుంది. నిర్మాత‌లే కాదు..డిస్ట్రిబ్యూట‌ర్స్‌, ఎగ్జిబిట‌ర్స్‌.. థియేట‌ర్స్ యాజ‌మాన్యం ఇలా అంద‌రూ స్టార్ హీరో సినిమా స‌క్సెస్ కావాల‌నే కోరుకుంటారు. ఎందుకంటే స్టార్ హీరో సినిమా స‌క్సెస్ అయితే లాభాల‌ను చూడొచ్చనేది వారి ఆశ‌. అలాంటి ఓ స‌క్సెస్‌ఫుల్ స్టార్ ఆక‌స్మాత్తుగా సుదూర లోకాల‌కు వెళ్లిపోవ‌డం అనేది చాలా మందికి బాధ‌నే మిగిలిస్తే.. బాక్సాఫీస్‌కు ప్ర‌శ్నార్థకాన్ని చూపించింది. ఎందుకంటే ఇప్పుడు పునీత్ రాజ్‌కుమార్ ప్లాన్ చేసుకున్న ప్రాజెక్ట్స్ వేల్యూ రూ.400 కోట్ల‌కు పైమాటేన‌ని బాక్సాఫీస్ వ‌ర్గాల స‌మాచారం. ఎందుకంటే ఆయ‌న సినిమా వ‌స్తుందంటే త‌క్కువ‌లో త‌క్కువ‌గా వంద కోట్ల రూపాయ‌ల బిజినెస్ జ‌రుగుతుంద‌ని ట్రేడ్ వ‌ర్గాల అంచనా. ఇప్పుడు ఆయ‌న రెండు సినిమాలు చేస్తున్నారు. జేమ్స్‌, దిత్వ‌. ఈ రెండు సినిమాలకు ఒక్కో దానికి 50-60 కోట్ల రూపాయ‌ల బ‌డ్జెట్‌ను అనుకుంటే రెండు సినిమాల‌కు క‌లిసి వంద నుంచి నూట ఇర‌వై కోట్ల రూపాయ‌లు బ‌డ్జెట్ అవుతుంది. ఇప్పుడు ఇవి సగంలోనే అగిపోతాయి. మ‌రి ఈ ద‌ర్శ‌క నిర్మాత‌ల ప‌రిస్థితేమిటో అంతు ప‌ట్ట‌డం లేదు. ఇక పునీత్ రాజ్‌కుమార్ నిర్మాత కూడా త‌న సొంత బ్యాన‌ర్‌లోనే సినిమాలు చేస్తుంటారు. ఆయ‌నిప్పుడు ఏకంగా ఐదు సినిమాలు త‌న బ్యాన‌ర్‌లోనే ప్లాన్ చేసుకున్నార‌ట‌. మినిమం అర‌వై కోట్ల బ‌డ్జెట్‌తో మార్కెట్‌ యావ‌రేజ్‌గా వేసుకున్నా.. అవ‌న్నీ క‌లిపితే రూ.300 కోట్ల‌కు పైగానే మార్కెట్‌పై ప్ర‌భావాన్ని చూపిస్తాయి. అంటే మొత్తంగా క‌లుపుకుంటే నాలుగు వంద‌ల కోట్ల రూపాయ‌ల సినిమా బిజినెస్ ప్ర‌శ్నార్థ‌కంగా మారింది. ఆయ‌న సినిమాల‌ను న‌మ్ముకున్న ద‌ర్శ‌కులు, నిర్మాత‌లు, ఇత‌ర టెక్నీషియ‌న్స్ ప‌రిస్థితి అగ‌మ్య గోచ‌రంగా మారింది. కానీ ఏం చేద్దాం.. విధి ఆడిన వింత నాట‌కంలో కొన్ని ప్ర‌శ్న‌లకు జ‌వాబులు దొర‌క‌వు. ఇదీ అంతే. మంచి వ్య‌క్తి, రీల్ హీరోగా, రియ‌ల్ హీరోగా ఎంద‌రికో స్ఫూర్తిగా నిలిచి ముందుకు న‌డిపిన వ్య‌క్తి పునీత్ రాజ్ కుమార్‌. ఇలా ఉన్న‌ట్లుండి దూర‌మైపోవ‌డం ఆయన కుటుంబంలోని వ్య‌క్తికే కాదు. సినీ ఇండ‌స్ట్రీకి కూడా తీర‌ని లోటే. పునీత్‌తో అనుబంధం ఉన్న వారెవ‌రైనా ఆయ‌న్ని అంత సులువుగా మ‌ర‌చిపోలేరు. భాష‌తో సంబంధం లేకుండా స్టార్స్‌, టెక్నిషియ‌న్స్ అంద‌రూ పునీత్ రాజ్‌కుమార్ మ‌ర‌ణంపై స్పందించారు. త‌మ సంతాపాల‌ను వ్య‌క్తం చేశారు. శ‌నివారం పునీత్ అంత్య‌క్రియ‌లు జ‌రుగుతాయి.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3jPFOAH
v

Puneeth RajKumar: టాలీవుడ్‌లో అందరి బంధువయా.. పునీత్ రాజ్‌కుమార్

తెలుగు చిత్ర‌సీమంటే క‌న్న‌డ కంఠీర‌వ రాజ్‌కుమార్ ఫ్యామిలీకి ఎంతో ఇష్టం. మ‌న నటీనటుల‌ను ఎంత‌గానో ఆద‌రించేవారు. పునీత్ రాజ్‌కుమార్ విష‌యానికి వ‌స్తే.. వారి ఫ్యామిలీలో టాలీవుడ్ ఇండ‌స్ట్రీతో అంద‌రికంటే ఆయ‌నే ఎక్కువ స్నేహ సంబంధాల‌ను ఏర్ప‌రుచుకున్నారు. ఇక్క‌డి నుంచి ఏ హీరో బెంగుళూరు వెళ్లినా, పునీత్ వెళ్లి ప్ర‌త్యేకంగా క‌లిసేవారు. ఫంక్ష‌న్స్‌కు అటెండ్ అయ్యేవారు. తార‌క్‌ను నా సోద‌రుడు అనేవారు. ఆ అనుబంధంతోనే ఆయ‌న హీరోగా చేసిన ‘చ‌క్ర‌వ్యూహ‌’లో ‘గెల‌యా గెల‌యా..’ అనే పాటను పాడారు తారక్. అలాగే నందమూరి బాలకృష్ణ అంటే కూడా ఎంతో ఇష్టం. ఆయ‌న సినిమా ప్ర‌మోష‌న్స్‌కు వెళ్లిన‌ప్పుడు పునీత్ ఆయ‌న ప‌క్క‌నే కూర్చున్నారు. బాల‌కృష్ణ ముఖంపై ఏదో ఉంటే త‌న ఖ‌ర్చీఫ్ తీసుకుని దాన్ని శుభ్రం చేశారు. తానో పెద్ద హీరోన‌నే ఫీలింగ్‌ను ఎక్క‌డా చూపించేవారు కాదు పునీత్‌. ఆర్య సినిమా చూసి బన్నీకి స్పెషల్‌గా ఫోన్ చేసి మాట్లాడారంటే ఆయన మంచితనం, కలుపుగోలుతనం అర్థం చేసుకోవచ్చు. అలాగే చరణ్‌తో ఫ్రెండ్లీగా ఉండేవారు. అదే అంద‌రికీ ఆయ‌న్ని చాలా ద‌గ్గ‌ర చేసింద‌ని అందరూ అంటారు. కేవలం నటీనటులతో సత్సంబంధాలుండేవి కాదు. టెక్నీషియన్స్‌ను కూడా ఎంత‌గానో ఎంకరేజ్ చేసేవారు. పూరీ జ‌గ‌న్నాథ్‌, వీర శంక‌ర్, మెహ‌ర్ ర‌మేశ్ వంటివారు ఈ లిస్టులో ఉన్నారు. అస‌లు పునీత్ రాజ్‌కుమార్‌ను ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌యం చేసిందే తెలుగు ద‌ర్శ‌కుడైన పూరీ జ‌గ‌న్నాథ్‌. త‌ర్వాత క‌మ‌ర్షియ‌ల్ తెలుగు బ్లాక్‌బ‌స్ట‌ర్స్‌ను క‌న్న‌డ‌లో రీమేక్ చేసి అక్క‌డ కూడా హిట్ కొట్టారు. ఈ లిస్టులో రెడీ, ఒక్కడు, దూకుడు వంటి చిత్రాలున్నాయి. ఆంధ్రావాలా ఇక్కడ ప్లాప్ అయినా క‌ర్ణాట‌క‌లో వీర క‌న్న‌డిగగా పునీత్ న‌టించారు. అలాగే ఒక్క‌డుని అజ‌య్‌గా రీమేక్ చేశారు. దీనికి మ‌ణిశ‌ర్మ‌నే ద‌ర్శ‌కుడు. అలాగే దూకుడు సినిమాను ప‌వ‌ర్ పేరుతో రీమేక్ చేశారు. దానికి త‌మ‌న్ సంగీతాన్ని అందించారు. ద‌ర్శ‌కుడు వీర శంక‌ర్‌, జ‌యంత్ సి.ప‌రాన్జీ ద‌ర్శ‌క‌త్వంలో సినిమా చేశారు. జ‌నార్ధ‌న మ‌హ‌ర్షి ఈయ‌న సినిమాల‌కు క‌థ‌ల‌ను అందించారు. మ్యూజిక్ డైరెక్ట‌ర్ చ‌క్రితో పునీత్ వ‌ర్క్‌చేశారు. యువ‌ర‌త్న సినిమా విడుద‌ల స‌మ‌యంలో మీడియాతో మాట్లాడుతూ స్ట్ర‌యిట్ తెలుగు సినిమా చేయాల‌నుకుంటున్నాన‌ని, త్వ‌ర‌లోనే ఆ క‌బురు చెప్తాన‌ని కూడా అన్నారు. అలా వ్య‌క్తిగ‌తంగా, ప్రొఫెష‌న‌ల్‌గా సినిమాల్లో ఎప్పుడూ తెలుగు వారితో అనుబంధాన్ని ఆయ‌న కొన‌సాగించారు పునీత్‌. అందుకనే తెలుగువారికి పునీత్ అంటే ఎంతో ఇష్టం ఏర్ప‌డింది. మ‌న స్టార్స్ ఎప్పుడు ఫోన్ చేసినా అందుబాటులో ఉండేవారు. అలాంటి ఓ మంచి వ్య‌క్తిని, స్నేహ‌శీలిని కోల్పోవ‌డం సినీ ఇండ‌స్ట్రీకి పెద్ద లోటే. కేవ‌లం సినిమాల‌తోనే కాదు, ఎంతో మంది ఆప‌న్నుల‌కి అండ‌గా నిలిచి త‌న దాతృత్వాన్ని చాటుకున్నారు. ఇబ్బందుల్లో ఉన్న వారికి ఆర్థిక సాయాన్ని అందించారు. చిన్న పిల్ల‌లు, అనాథ పిల్ల‌ల‌కు విద్య‌ను అందిస్తున్నారు పునీత్‌. అలాంటి వ్య‌క్తి ఉన్న‌ట్లుండి దూర‌మ‌వ‌డం అంద‌రికీ షాకింగ్‌గా అనిపిస్తుంది. సినీ సెల‌బ్రిటీలంద‌రూ త‌మ‌న సంతాపాన్ని వ్య‌క్తం చేశారు. పునీత్ రాజ్‌కుమార్‌ పార్థివ దేహాన్ని కంఠీర‌వ స్టేడియంలో అక్క‌డ ప్ర‌జ‌ల సంద‌ర్శనార్థం ఉంచారు. శ‌నివారం సాయంత్రం అంత్య‌క్రియ‌లు జ‌రుగుతాయి. ప్ర‌స్తుతం పునీత్ రాజ్‌కుమార్ కుమార్తె అమెరికాలో ఉన్నారు. అక్క‌డ నుంచి ఆమె శ‌నివారం బెంగ‌ళూరుకి చేరుకుంటారు. ఆమె తుది చూపు చూసిన త‌ర్వాత పునీత్ రాజ్‌కుమార్ అంత్యక్రియలు జరుగుతాయి.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3boQXnt
v

హీరో యష్‌తో కలిసి స్టేజ్‌పై చివరిసారిగా స్టెప్పులేసిన పునీత్ రాజ్ కుమార్.. వైరల్ అవుతోన్న వీడియో

నిన్న మొన్నటి వరకు మనతో ఆడి పాడిన వ్య‌క్తి ఈరోజు ఉన్న‌ట్లుండి మ‌న మ‌ధ్య లేరు అనే విష‌యం తెలిస్తే ఎలా ఉంటుంది? మైండ్ బ్లాంక్ అయిపోతుంది. ఇప్పుడు క‌న్న‌డ స్టార్ హీరో కుటుంబ స‌భ్యుల ప‌రిస్థితి అలాగే ఉంది. ఇక శాండిల్‌వుడ్ స‌హా ఇత‌ర ప‌రిశ్ర‌మ‌ల్లోని అభిమానులు, ఇత‌ర న‌టీన‌టులకు ప‌రిస్థితి కూడా ఇలాగే ఉంది. శుక్ర‌వారం ఉద‌యం జిమ్ చేస్తున్న పునీత్ రాజ్‌కుమార్‌కు గుండె నొప్పి రావ‌డం, వెంట‌నే హాస్పిట‌ల్‌కు తీసుకెళ్లినా ఫ‌లితం లేక‌పోవ‌డంతో ఆయ‌న సుదూర లోకాల‌కు వెళ్లిపోవ‌డం జ‌రిగింది. ఈ విషయాన్ని ఎవ‌రూ జీర్ణించుకోలేక‌పోతున్నారు. అంద‌రూ ఆయ‌నతో ఉన్న మ‌ధుర స్మృతుల‌ను గుర్తు చేసుకుంటున్నారు. ఈరోజు పునీత్ రాజ్ కుమార్ అన్న‌య్య శివ రాజ్‌కుమార్ హీరోగా న‌టించిన ‘జై భ‌జ‌రంగీ 2’ మూవీ విడుద‌లైంది. రాజ్‌కుమార్ ఫ్యామిలీ అభిమానులు ఎంతో ఆనందంగా ఉన్న స‌మ‌యంలో అంద‌రికీ పునీత్ హఠాన్మ‌ర‌ణం షాక్ ఇచ్చింది. రెండు రోజుల ముందు అంటే అక్టోబ‌ర్ 27న ‘జై భ‌జ‌రంగీ 2’ ప్రీ రిలీజ్ ఈవెంట్ జ‌రిగింది. ఈ వేడుక‌కు హీరో య‌ష్‌, పునీత్ రాజ్ కుమార్ హాజ‌ర‌య్యారు. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ వేడుక‌లో స్టేజ్‌పై శివ రాజ్‌కుమార్‌, పునీత్ రాజ్‌కుమార్‌, య‌ష్ క‌లిసి స్టెప్పులేశారు. ఇప్పుడు ఆ వీడియో నెట్టింట తెగ వైర‌ల్ అవుతోంది. ఇంత యాక్టివ్‌గా ఉన్న పునీత్ ఈరోజు మ‌న మ‌ధ్య లేర‌న్న విష‌యం అభిమానుల‌కు మింగుడుప‌డ‌టం లేదు. ఎంతో ఫిట్‌గా ఉంటూ రోజూ ఎక్స‌ర్‌సైజులు చేసే పునీత్ రాజ్‌కుమార్‌కు ఉన్న‌ట్లుండి గుండెపోటు వ‌చ్చింది. రెండు కిలోమీట‌ర్ల దూరంలోని విక్ర‌మ్ హాస్పిట‌ల్‌కు తీసుకెళ్లినా లాభం లేక‌పోయింది. ఇప్పుడు పునీత్ రాజ్‌కుమార్ పార్థివ దేహాన్ని ఆయ‌న స్వ‌గృహంలో ఉంచారు. అక్క‌డ నుంచి కంఠీర‌వ స్టేడియంకు తీసుకెళ‌తారు. అక్క‌డ ప్ర‌జ‌ల సంద‌ర్శనార్థం ఉంచుతారు. రేపు సాయంత్రం అంత్య‌క్రియ‌లు జ‌రుగుతాయి. ప్ర‌స్తుతం పునీత్ రాజ్‌కుమార్ కుమార్తె అమెరికాలో ఉన్నారు. అక్క‌డ నుంచి ఆమె రేపు బెంగ‌ళూరుకి చేరుకుంటారు. ఆమె తుది చూపు చూసిన త‌ర్వాత పునీత్ రాజ్‌కుమార్ అంత్య‌క్రియ‌ల‌ను జ‌రుపుతారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3Bm01Ux
v

పునీత్ రాజ్ కుమార్ మరణం.. మా గుండెల్లో ఉంటారు.. పూజా హెగ్డే, అనుష్క, కీర్తి సురేష్ ఎమోషనల్

కన్నడ ఇండస్ట్రీకి కోలుకోలేని దెబ్బ తగిలింది. కన్నడ పవర్ స్టార్ (46) మరణంతో ఒక్కసారిగా ఇండస్ట్రీ మొత్తం ఉలిక్కి పడింది. గుండెపోటు నేటి మధ్యాహ్నం పునీత్ రాజ్ కుమార్ మరణించారు. ఈ వార్త తెలియగానే లక్షలాది మంది అభిమానులు బెంగళూరు విక్రమ్ ఆస్పత్రి ముందు బారులు తీరారు. దక్షిణాదికి చెందిన సెలెబ్రిటీలంతా కూడా అప్పు మరణంపై స్పందిస్తున్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నారు. మన పునీత్ రాజ్ కుమార్ మరణ వార్త విని ఎంతో దిగ్భ్రాంతికి లోనయ్యాను. ఒక్కసారిగా షాక్ అయ్యాను. ఎంతో మంచి వారు.. ఎంతో ఒదిగా ఉంటారు.. ఆయన ఫ్యామిలీకి అభిమానులకు నా ప్రగాఢ సానుభూతి. మీరు ఎప్పుడూ కూడా మా గుండెల్లో ఉంటారు.. మీ ఆత్మకు శాంతి చేకూరాలి - నేను విన్నది నమ్మలేకపోతోన్నాను.. జీవితంలో ఎప్పుడేం జరుగుతుందో ఊహించలేం. ఇండియన్ సినిమాకు తీరనిలోటు.. ఇలాంటి కష్టకాలంలో ఆయన కుటుంబ సభ్యులకు, అభిమానులకు నా ప్రగాఢ సానుభూతి. ఆయన ఆత్మకు శాంతి కలగాలి. నేను ఆయన్ను నా మొదటి సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో కలిశాను. ఆయన ఎంతో మంచి వారు. ఇలా ఆయన మనల్ని వదిలి వెళ్లడం బాధగా ఉంది. ఆయన అభిమానులు ఎంతో బాధలో ఉన్నారు- నమ్మశక్యంగా లేదు. నిజంగా షాక్‌కు గురయ్యాను.. చాలా త్వరగా వెళ్లిపోయారు.. ఆయన అభిమానులు, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి-కీర్తి సురేష్ ఇలాంటి ఘటనలు, ప్రస్తుతం మనం ఎదుర్కొంటున్న పరిస్థితులే మనకు ఎంతో గుణపాఠం నేర్పిస్తుంది.. ఏదీ కూడా తొందరపడ్డట్టు ఇక మనకు అనిపించదు.. మన చేతుల్లోంచే అంతా జారిపోతోంది అంటూ పరోక్షొంగా పునీత్ రాజ్ కుమార్ మరణంపై తాప్సీ స్పందించింది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3vVKD08
v

Bheemla Nayak: పవన్ కళ్యాణ్‌ మూవీలో మలయాళీ బ్యూటీ.. సెట్స్ పైకి యంగ్ హీరోయిన్

మరో మలయాళ సుందరి తెలుగు తెరకి పరిచయమవుతోంది. ఆమెనే యంగ్ హీరోయిన్ సంయుక్త మీనన్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్- కాంబోలో తెరకెక్కుతున్న '' సినిమాలో ఆమెకు ఆఫర్ దక్కింది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ పర్యవేక్షణలో సాగర్ కే చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రానా సరసన నటించనుంది. ఈ విషయాన్ని చిత్రయూనిట్ అఫీషియల్‌గా అనౌన్స్ చేస్తూ సెట్స్ పైకి వెల్‌కమ్ చెప్పింది. 'అయ్యప్పనుమ్ కోషియుమ్‌' తెలుగు రీమేక్‌గా 'భీమ్లా నాయక్' సినిమా రూపొందిస్తున్నారు. భారీ బడ్జెట్ కేటాయించి రూపొందిస్తున్న ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ పోలీస్ ఆఫీసర్‌గా నటిస్తుండగా ఆయన సరసన నిత్యమీనన్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇప్పటికే ఈ ఇద్దరిపై మేజర్ పార్ట్ షూటింగ్ కంప్లీట్ చేసిన చిత్రయూనిట్.. తాజాగా సంయుక్త మీనన్‌కు స్వాగతం పలికారు. ఇక రానా- సంయుక్త మీనన్ కాంబినేషన్లో సన్నివేశాలను చిత్రీకరిస్తే షూటింగు పార్ట్ అంతా ఫినిష్ అయినట్లే అని తెలుస్తోంది. వచ్చే నెలాఖరుకల్లా ఈ షూటింగ్ కంప్లీట్ చేసి పోస్ట్ ప్రొడక్షన్ జరపాలని ప్లాన్ చేస్తున్నారట మేకర్స్. సంక్రాంతి కానుకగా జనవరి 12వ తేదీన ఈ సినిమా విడుదల కానుంది. ఈ మూవీపై మెగా అభిమానులు బోలెడన్ని అంచనాలు పెట్టుకున్నారు. ఇప్పటికే విడుదలైన మూవీ అప్‌డేట్స్ సినిమా పట్ల ఉన్న ఆతృతను రెట్టింపు చేశాయి.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3pKcBeh
v

Superstar: రజినీకాంత్ హెల్త్ బులెటిన్ విడుద‌ల చేసిన డాక్ట‌ర్స్‌

కోలీవుడ్ అగ్ర క‌థానాయ‌కుడు ర‌జినీకాంత్ గురువారం అనారోగ్యంతో కావేరీ హాస్పిట‌ల్‌లో జాయిన్ అయిన సంగ‌తి తెలిసిందే. దీంతో ఒక్క‌సారిగా ఆయ‌న అభిమానుల్లో ఆందోళ‌న నెల‌కొంది. అయితే ర‌జినీకాంత్‌ సాధార‌ణ చెక‌ప్ కోస‌మే హాస్పిట‌ల్‌లో చేరిన‌ట్లు కుటుంబ స‌భ్యులు తెలిపారు. అయితే అభిమానుల్లో టెన్ష‌న్ త‌గ్గ‌లేదు. ర‌జినీకాంత్ మెద‌డులోని న‌రాల్లో ఏదో స‌మ‌స్య ఉంద‌నే వార్త ప్రేక్ష‌కాభిమానుల‌ను కంగారు పెట్టింది. దీంతో చికిత్స అందిస్తున్న వైద్యులు శుక్ర‌వారం ర‌జినీకాంత్ హెల్త్ బులెటిన్‌ను విడుద‌ల చేశారు. మెదుడు నాళాల్లో బ్లాక్స్‌ను గుర్తించిన వైద్యులు చికిత్స అందిస్తున్నారు. కొన్ని రోజుల్లోనే చికిత్స పూర్త‌వుతుంద‌ని, ఆయ‌న్ని త్వ‌ర‌లోనే డిశ్చార్జ్ చేస్తామ‌ని డాక్ట‌ర్స్ తెలిపారు. ఏడు ప‌దులు వ‌య‌సు మీరిన త‌ర్వాత ర‌జినీకాంత్‌కు అనారోగ్య స‌మ‌స్య‌లు చుట్టుముడుతున్నాయి. రీసెంట్‌గానే ఆయ‌న కుటుంబ స‌భ్యుల‌తో క‌లిసి ఢిల్లీ వెళ్లి ఉప రాష్ట్రప‌తి వెంక‌య్య‌నాయుడు చేతుల మీదుగా దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అందుకున్న సంగ‌తి తెలిసిందే. అలాగే దీపావళి సంద‌ర్భంగా ర‌జినీకాంత్ న‌టించిన ‘పెద్ద‌న్న‌’(అన్నాత్త‌) దీపావళి సంద‌ర్భంగా న‌వంబ‌ర్ 4న విడుద‌లవుతుంది. త‌మ త‌లైవ‌ర్ సినిమాను థియేట‌ర్స్‌లో ఘ‌నంగా సెల‌బ్రేట్ చేయాల‌ని ఆయ‌న అభిమానులు అనుకుంటున్న స‌మ‌యంలో ఆయ‌న హాస్పిట‌ల్‌లో జాయిన్ అయ్యార‌నే వార్త అంద‌రిలో టెన్ష‌న్‌కు గురి చేసినా ఇప్పుడు డాక్ట‌ర్స్ హెల్త్ బులెటిన్‌ను విడుద‌ల చేయ‌డం అంద‌రికీ కాస్త ఊర‌ట‌ను ఇచ్చే అంశ‌మే. 2011 నుంచి ర‌జినీకాంత్‌కు అనారోగ్య స‌మ‌స్య‌లు ఎక్కువ‌గా వ‌స్తున్నాయి. ఎమెసిస్‌, బ్రాంకైటిస్ వంటి స‌మ‌స్య‌ల‌తో ర‌జినీ చాలా ఇబ్బందులు ప‌డ్డారు. ప్ర‌తి ఏడాది అమెరికాలో రెగ్యుల‌ర్‌గా చికిత్స తీసుకుంటున్నారు. చివ‌ర‌కు అమెరికా వెళ్లి చికిత్స తీసుకున్న త‌ర్వాత మెరుగైంది. త‌ర్వాత ర‌జినీకాంత్ రాజ‌కీయాల్లోకి వెళ్లాల‌ని అనుకుంటున్న స‌మ‌యంలో ర‌క్త‌పోటు అధికం కావ‌డంతో గ‌త ఏడాది డిసెంబ‌ర్‌లో అన్నాత్త షూటింగ్‌ను ఆపేసి ర‌జినీకాంత్ చికిత్స తీసుకున్నారు. ఆరోగ్య ప‌రిస్థితుల రీత్యా, ర‌జినీకాంత్ రాజకీయాల్లోకి రాన‌ని ప్ర‌క‌టించారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3pQkChM
v

పునీత్ మరణంపై మహేష్ బాబు, కళ్యాణ్ రామ్ రియాక్షన్.. రియల్లీ షాక్ అంటూ!

కన్నడ చిత్రసీమలో తీవ్ర విషాదం అలుముకుంది. యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో (46) అకాలమరణంతో శాండిల్‌వుడ్‌ శోక సంద్రంలో మునిగిపోయింది. ఆయన మరణవార్త తెలిసి రాజ్‌కుమార్ అభిమానులు అయితే గుండెలు అవిసేలా రోదిస్తున్నారు. అప్పు.. నీకు అప్పుడే నూరేళ్లు నిండిపోయాయా అని కన్నీరుమున్నీరు అవుతున్నారు. ఈ రోజు (అక్టోబర్ 29) శుక్ర‌వారం ఉద‌యం జిమ్ చేస్తుండ‌గా గుండె నొప్పి రావ‌డంతో ఒక్కసారిగా కుప్పకూలిన పునీత్‌ను వెంటనే బెంగుళూరులోని విక్రమ్‌ ఆసుపత్రిలో జాయిన్ చేశారు. అక్కడ ట్రీట్‌మెంట్ అందిస్తుండగానే పునీత్‌ రాజ్‌కుమార్‌ తుది శ్వాస విడిచారు. పునీత్ మరణ వార్తతో యావత్ సినీ ఇండస్ట్రీ షాక్‌కి గురైంది. కన్నడ హీరో అయినా తెలుగు స్టార్ హీరోలందరితోనూ పునీత్‌కు మంచి పరిచయాలున్నాయి. దీంతో తెలుగు సినీ ప్రముఖులు కూడా పునీత్ మరణాన్ని జీర్ణించుకోలేక పోతున్నారు. సోషల్ మీడియా వేదికగా ఆయన మృతిపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ''పునీత్ రాజ్‌కుమార్ మరణ వార్త విని షాకయ్యా. నాకు తెలిసిన అత్యంత వినయపూర్వకమైన వ్యక్తులలో ఆయన ఒకరు. పునీత్ కుటుంబ సభ్యులకు, ప్రియమైన వారికి నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నా'' అని ట్వీట్ చేశారు. ''పునీత్ రాజ్‌కుమార్ ఇకలేరని తెలిసి షాక్‌కి గురయ్యా.. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నా. ఈ షాకింగ్ న్యూస్ తెలిసి నోట మాట రావడం లేదు'' అని అన్నారు. అలాగే కోన వెంకట్, రామ్ పోతినేని, హన్సిక, కార్తిక్ సుబ్బరాజు సహా పలువురు టాలీవుడ్ ప్రముఖులు పునీత్ మృతి పట్ల విచారం వ్యక్తం చేస్తున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3bnHNrq
v

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...