Thursday 31 October 2019

వాటిలో సెక్స్ కాకుండా ఇంకేముంది: తాప్సి

గ్లామరస్ పాత్రలతోనే చిత్ర పరిశ్రమకు పరిచయమయ్యారు తాప్సి. విచిత్రమేంటంటే.. ఎవరైనా తెలుగులో డీగ్లామ్ పాత్రల్లో నటించి బాలీవుడ్‌లో గ్లామరస్ పాత్రల్లో నటిస్తారు. కానీ అందుకే వ్యతిరేకంగా ఉన్నారు. ‘ఝుమ్మంది నాదం’, ‘మిస్టర్ పర్‌ఫెక్ట్’, ‘వీర’ వంటి సినిమాల్లో గ్లామరస్‌గా కనిపించారు. కానీ బాలీవుడ్‌లో మాత్రం హోమ్లీ పాత్రల్లో నటిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఆమె ఎంచుకునే సినిమాలకు ఇతర హీరోయిన్లు ఎంచుకునేవాటికి ఎంతో డిఫరెన్స్ ఉంటుంది. విభిన్నమైన సినిమాలతో తన యాక్టింగ్ స్కిల్స్‌ను ప్రదర్శిస్తు్న్న తాప్సి ఒక్క విషయంలో మాత్రం స్ట్రిక్ట్ రూల్ పెట్టుకున్నారు. అదేంటంటే.. సినిమాలో రొమాన్స్ చేయడానికి ఎలాంటి ఇబ్బంది లేదు కానీ సెక్స్ కామెడీ సినిమాలకు మాత్రం దూరంగా ఉంటానని అంటున్నారు. ‘ఓసారి నాకు ఐటెం సాంగ్‌లో నటించాలని ఆఫర్ వచ్చింది. కానీ నేను నో చెప్పాను. ఎందుకంటే నేను హీరోయిన్‌గా నటిస్తున్న సినిమాలో ఐటెం సాంగ్ చేయమంటే చేస్తాను కానీ వేరే వాళ్ల సినిమాలో చేయను. ఒకవేళ ఆ ఐటెం సాంగ్‌కు ఇంపార్టెన్స్ ఉందనిపిస్తే చేయడానికి ఎలాంటి అభ్యంతరం లేదు. అంతేకానీ ఏదో సినిమాలో మసాలా జోడించడానికి పెట్టే పాటల్లో నేను డ్యాన్స్ చేయను. అంతేకాదు నేను సెక్స్ కామెడీ సినిమాలు కూడా చేయను. ఇప్పటివరకు నేను చూసిన సెక్స్ కామెడీ సినిమాల్లో సెక్స్ తప్ప కామెడీ లేదు. అర్థంపర్థం లేకుండా అనవసరంగా అమ్మాయిలపై అసభ్యకర కామెంట్లు, డబుల్ మీనింగ్ డైలాగులతో తీసే సినిమాలు వేస్ట్. అదీకాకుండా ఇప్పటివరకు నేను పర్‌ఫామెన్స్‌కు ప్రాధాన్యం ఉన్న పాత్రల్లో నటిస్తూ వచ్చాను. ప్రేక్షకులు కూడా దీనికే అలవాటు పడ్డారు. ఇప్పుడు ట్రాక్ మారిస్తే వారికి నచ్చదు. ప్రేక్షకులు నన్ను గుడ్డిగా నమ్మాలి. నేను సినిమా చేస్తున్నాంటే కచ్చితంగా అందులో ఏదో కంటెంట్ ఉందనే వారు నమ్మాలి. ఆ స్థాయిలో పేరు తెచ్చుకోవడానికి కష్టపడుతున్నాను. ‘జుడ్వా 2’ సినిమా కోసం సన్నబడ్డాను. బికినీ వేసుకున్నాను. చాలా కష్టంగా అనిపించింది. త్వరలో ఇలా బికినీ ధరించే పాత్రలో కన్పించబోతున్నాను. చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది’ అని తెలిపారు. తాప్సి ప్రధాన పాత్రలో నటించిన ‘సాండ్ కీ ఆంఖ్’ సినిమా ఇటీవల విడుదలై మంచి విజయం అందుకుంది. ఇందులో భూమి పెడ్నేకర్ మరో ప్రధాన పాత్రలో నటించారు. ఉత్తర్ ప్రదేశ్‌కు చెందిన షార్ప్ షూటర్స్ చంద్రో తోమర్, ప్రకాశీ తోమర్ జీవితాధారంగా ఈ సినిమాను తుషార్ హీరానందని తెరకెక్కించారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2JGvKb5
v

ఆ క్రికెటర్ నాపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నాడు: అనుష్క శర్మ

బాలీవుడ్ నటి వివాదంలో చిక్కుకున్నారు. 2019 వరల్డ్ కప్ మ్యాచ్ సమయంలో టీమిండియా సెలక్టర్స్ టీం చేత ఆమె స్పెషల్‌గా టీ కప్పులు సర్వ్ చేయించుకున్నారట. ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ ఫరూఖ్ ఇంజినీర్ ఈ ఆరోపణలు చేశారు. దాంతో అనుష్క స్పందించారు. తనపై అనవసరంగా ఆ క్రికెటర్ తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ‘నాపై వస్తు్న్న తప్పుడు వార్తలు, ఆరోపణలపై స్పందించకోవడమే మంచిది అనుకున్నాను. అలాంటివారిని పట్టించుకోకపోవమే ఉత్తమం అనుకున్నాను. 11 ఏళ్లుగా నా కెరీర్‌ను ఇలాగే నడుపుతూ వస్తున్నాను. నా మౌనంలో నిజాయతీ ఉంది. ఒక అబద్ధాన్ని పలు మార్లు చెబుతూ ఉంటే అది నిజమయ్యే అవకాశం ఉంటుందని అంటుంటారు. నా విషయంలో ఇదే జరుగుతోందేమోనని భయంగా ఉంది. నా గురించి కొందరు అబద్ధాలు చెబుతూనే ఉన్నారు. నేను మౌనంగా ఉండటం వల్ల అవి నిజమయ్యే అవకాశం ఉంది. ఒకప్పుడు నా మాజీ ప్రియుడు రణ్‌వీర్ సింగ్ విషయంలోనూ నాపైనే నిందలు వేశారు. అప్పుడు కూడా నేను మౌనంగానే ఉన్నాను. ఇప్పుడు నా భర్త విరాట్ కోహ్లీ విషయంలో క్రికెట్ రంగానికి సంబంధించిన అర్థం పర్థంలేని నిందలన్నీ భరిస్తున్నాను’ ‘తప్పుడు వార్తల్లో నా పేరును వాడుతున్నారు. నేను క్రికెట్‌కు సంబంధించిన మీటింగ్స్‌లో తలదూరుస్తున్నానని, దాని వల్ల సెలక్షన్ ప్రాసెస్‌పై ఎఫెక్ట్ పడిందని వార్తలు వస్తున్నాయి. విరాట్‌తో కలిసి మ్యాచెస్ చూడటానికి విదేశాలకు వెళ్లినప్పుడు నాకు స్పెషల్ ట్రీట్‌మెంట్ ఇచ్చారని కొందరు ఆరోపిస్తున్నారు. ఇలా నాపై నోటికొచ్చిన ఆరోపణలు చేస్తున్నవారందరికీ ఒక్కటే సమాధానం చెప్పాలనుకుంటున్నాను. నేను ప్రతి విషయంలోనూ ప్రొటోకాల్ ఫాలో అవుతూ వస్తున్నాను. అయినప్పటికీ ఎందుకు వచ్చిన గొడవ అని స్పందించలేదు. కానీ ఇక నేను మౌనంగా ఉంటే నాపై వచ్చిన ఆరోపణలన్నీ నిజమే అవుతాయని స్పందించాల్సి వచ్చింది’ అని వెల్లడించారు. అనుష్క పోస్ట్ చూసిన ఫరూఖ్ ఆమెకు సారీ చెప్పారు. ‘నేనేదో జోక్‌గా అంటే దాన్ని కొండంత చేశారు. పాపం అనవసరంగా అనుష్కను ఈ విషయంలోకి లాగారు. ఆమె మంచి యువతి. విరాట్ బెస్ట్ కెప్టెన్. రవిశాస్త్రి బెస్ట్ కోచ్’ అని ట్వీట్ చేశారు. అనుష్క పెట్టిన పోస్ట్‌పై ఆమె మాజీ ప్రియుడు రణ్‌వీర్ సింగ్‌తో పాటు ఇతర సినీ ప్రముఖులు కూడా స్పందించారు. అనుష్కకు మద్దతుగా నిలిచారు.



from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2BZNPwv
v

Me Too: సచిన్ తెందుల్కర్‌ను టార్గెట్ చేసిన గాయని

క్రికెట్ గాడ్ సచిన్ తెందుల్కర్‌ ట్వీట్ పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు ప్రముఖ బాలీవుడ్ గాయని . కొన్ని రోజులుగా మ్యూజిక్ కంపోజర్‌ అను మాలిక్‌పై ఆరోపణలు చేస్తూ వార్తల్లో నిలిచారు సోనా. సింగింగ్ రియాల్టీ షో ఇండియన్ ఐడల్‌కు అను జడ్జ్‌గా వ్యవహరిస్తున్నారు. ఇంతకుముందు ఈ షోకు సోనా కూడా జడ్జ్‌గా వ్యవహరించేవారు. అయితే తన కెరీర్ తొలినాళ్లలో అను తనను లైంగికంగా వేధించాడని సోనా ఏడాది క్రితం ఆరోపణలు చేశారు. దాంతో షో నిర్వాహకులు అనును తొలగించారు. కొంతకాలం తర్వాత సోనాను కూడా తొలగించారు. ఏడాది తర్వాత అనును మళ్లీ షోలోకి ఆహ్వానించి జడ్జ్‌గా కూర్చోబెట్టారు. దీనిపై అసహనం వ్యక్తం చేశారు సోనా. ఇండియాలో మరో నిర్భయ ఘటన జరిగితే తప్ప ఇలాంటి వారు బాగుపడరని అన్నారు. ఈ నేపథ్యంలో ఇండియన్ ఐడల్ షోలో పాల్గొన్న ఓ కంటెస్టెంట్‌ను పొగుడుతూ ట్వీట్ చేశారు సచిత్ తెందుల్కర్. ‘ఈ కంటెస్టెంట్ పాటలు, అతని జీవిత కథ నా మనసును తాకాయి. ఎక్కడెక్కడి నుంచో వచ్చిన వీరంతా జీవితంలో అత్యున్నత స్థాయికి ఎదుగుతారన్న నమ్మకం నాకుంది’ అని సచిన్ ట్వీట్ చేశారు. దీనిపై సోనా మొహాపాత్ర స్పందించారు. ‘సచిన్ సర్.. మీకు మీటూ గురించి ఏమీ తెలీదా? మీరు మెచ్చుకుంటున్న షోలో అను మాలిక్ అనే కామాంధుడు ఉన్నాడు. మీరు ఎప్పుడూ ఆ షోలో పాల్గొనేవారినే మెచ్చుకుంటారా? అను మాలిక్ వల్ల మాలాగా ఇబ్బందులు పడిన ఆడవాళ్ల గురించి అస్సలు పట్టించుకోరా?’ అని ప్రశ్నించింది సోనా. అయితే ఎందుకొచ్చిన గొడవ అనుకున్నాడో ఏమో సచిన్ మాత్రం దీనిపై స్పందించలేదు. అను మాలిక్‌ గురించి మరో షాకింగ్ విషయం బయటికి వచ్చింది. ఇటీవల గాయని సోనా మొహాపాత్ర అతనిపై మీటూ ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు నేహా భాసిన్ అనే మరో పాపులర్ సింగర్ అను తనతో ప్రవర్తించిన తీరును సోషల్ మీడియాలో బట్టబయలు చేసింది. అతడు కామాంధుడని తనని కూడా వదిలిపెట్టలేదని తిట్టిపోసింది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2PCzHl8
v

‘మీకు మాత్రమే చెప్తా’ ట్విట్టర్ రివ్యూ.. నిర్మాతగా విజయ్ దేవరకొండ పాస్

‘అర్జున్ రెడ్డి’ సినిమాతో టాలీవుడ్‌లో స్టార్ హీరోగా మారిన విజయ్ దేవరకొండ.. కొత్త టాలెంట్‌ను ఎంకరేజ్ చేయడానికి ఇప్పుడు నిర్మాత అవతారం ఎత్తారు. కింగ్ ఆఫ్ ది హిల్ అనే ప్రొడక్షన్ హౌస్‌ను స్థాపించారు. ‘పెళ్లి చూపులు’ సినిమా సమయంలో తన వద్దకు వచ్చిన కథను.. ఆ సినిమా డైరెక్టర్‌ తరుణ్ భాస్కర్‌ను హీరోగా చేసి ఇప్పుడు తెరకెక్కించారు. ‘మీకు మాత్రమే చెప్తా’ అంటూ ఇప్పటి వరకు రాని ఒక కొత్త స్టోరీ లైన్‌తో వచ్చిన చిత్రంలో అభినవ్ గోమఠం, అనసూయ, వాణి భోజన్, నవీన్ జార్జ్ థామస్, పావని గంగిరెడ్డి, అంతికా మిశ్రా నటించారు. షమీర్ సుల్తాన్ దర్శకుడిగా పరిచయం అయ్యారు. Also Read: నటీనటలు, సాంకేతిక వర్గం సంగతి పక్కనబెడితే.. ఇది విజయ్ దేవరకొండ నిర్మించిన సినిమా కావడంతో అంచనాలు ఏర్పడ్డాయి. దీనికి తగ్గట్టుగానే ప్రచార కార్యక్రమాలు కూడా చేపట్టారు. విజయ్ దేవరకొండ అయితే ప్రత్యేకంగా ఒక డ్యాన్స్ వీడియో కూడా చేశారు. మొత్తం మీద అంచనాల నడుమ శుక్రవారం ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే యూఎస్‌లో ప్రీమియర్ షోలు మొదలైపోయాయి. మరోవైపు, హైదరాబాద్‌లోని ఏఎంబీ సినిమాస్‌లో గురువారం రాత్రి సెలబ్రిటీ ప్రీమియర్ షో కూడా వేశారు. సినిమా చూసినవాళ్లు ట్విట్టర్ ద్వారా తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. See Photos: ప్రస్తుతానికి అయితే సినిమాకు పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. సినిమా ఫుల్ కామెడీగా ఉందని అంటున్నారు. సినిమా ప్రారంభం నుంచి ఆఖరి వరకు ఫన్ రైడ్ అని కొంత మంది ట్వీట్లు చేశారు. చూడదగిన సినిమా అని చెబుతున్నారు. కొన్ని సన్నివేశాల్లో అయితే నవ్వలేక పొట్టచెక్కలైపోతుందని కూడా అంటున్నారు. ఇక సెలబ్రిటీ షో చూసినవాళ్లలో చాలా మంది సినిమా గురించి పాజిటివ్‌గా స్పందిస్తున్నారు. తరుణ్ భాస్కర్ అద్భుతంగా చేశారని, అభినవ్ గోమఠం కామెడీ టైమింగ్ సూపర్ అని చెబుతున్నారు. మొత్తం మీద హీరోగా సూపర్ సక్సెస్ అయిన విజయ్ దేవరకొండ.. నిర్మాతగానూ సక్సెస్ అయినట్టే.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/334FcNl
v

హాట్ బ్యూటీతో రకుల్ ప్రీత్ వర్కౌట్స్.. తెగ రాసేసుకుంటున్నారు!

దక్షిణాదిలో స్టార్ హీరోయిన్‌గా వెలుగొందుతోన్న ఢిల్లీ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం బాలీవుడ్‌పై కన్నేసింది. సౌత్‌లో పెద్ద చిత్ర పరిశ్రమలు అయిన టాలీవుడ్, కోలీవుడ్‌లో దాదాపుగా స్టార్ హీరోలందరితోనూ నటించేసిన రకుల్.. ఇప్పుడు బాలీవుడ్ స్టార్ల వైపు చూస్తోంది. ఇటీవల ‘దే దే ప్యార్ దే’ సినిమాలో అజయ్ దేవగణ్‌తో రొమాన్స్ చేసిన రకుల్.. తాజాగా ‘మర్‌జావన్’ చిత్రంలో నటించింది. రితేష్ దేశ్‌ముఖ్, సిద్ధార్థ్ మల్హోత్ర హీరోలుగా నటించిన ఈ చిత్రం నవంబర్ 15న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఇదిలా ఉంటే, రకుల్ ప్రీత్ సింగ్‌కు ఫిట్‌నెస్‌పై శ్రద్ధ ఎక్కువనే సంగతి అందరికీ తెలిసిందే. నిన్న మొన్నటి వరకు టాలీవుడ్, కోలీవుడ్ సెలబ్రిటీష్‌తో కలిసి జిమ్‌లో వర్కౌట్స్ చేసిన రకుల్.. ఇప్పుడు బాలీవుడ్ హాటీస్‌తో చేస్తోంది. తాజాగా బాలీవుడ్ హాట్ యాక్టర్, సింగర్ సోఫీ చౌదరితో కలిసి రకుల్ ప్రీత్ సింగ్ వర్కౌట్స్ చేసింది. ఈ వర్కౌట్స్ సంబంధించిన ఫొటోలు, వీడియోలను సోఫీ చౌదరి తన ఇన్‌గ్రామ్ స్టోరీలో పెట్టుకుంది. వర్కౌట్ సూట్స్‌లో ఈ ఇద్దరు భామలు పిచ్చ హాట్‌గా ఉన్నారు. ముఖ్యంగా రకుల్, సోఫీ వెనక్కి తిరిగి ఒకరిని ఒకరు రాసుకుంటూ చేసే వర్కౌట్ అయితే మరీ హాట్‌గా ఉంది. కాగా, తెలుగులో రకుల్ ప్రీత్ సింగ్ ఆఖరిగా కనిపించిన సినిమా ‘మన్మథుడు 2’. ఈ చిత్రం బాక్సాఫీసు దగ్గర బోల్తా కొట్టింది. ఆ తరవాత తెలుగులో ఏ సినిమాను రకుల్ అంగీకరించలేదు. తమిళంలో శివకార్తికేయన్ సరసన ఒక సినిమాలో నటిస్తోంది. అలాగే, దిగ్గజ దర్శకుడు శంకర్ తెరకెక్కిస్తోన్న ‘ఇండియన్ 2’లో ఒక పాత్ర చేస్తోంది. ప్రస్తుతానికి అయితే రకుల్‌కు తెలుగులో అవకాశాలు తగ్గాయనే చెప్పాలి. దర్శక, నిర్మాతలు ఎవరూ రకుల్ వైపు చూడట్లేదని టాక్. చూద్దాం మళ్లీ ఏ స్టార్ హీరోతో అయినా ఎంట్రీ ఇస్తుందేమో..!


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/34eMs9t
v

నా బుజ్జి జొన్నా.. దశాబ్ధానికోసారైనా స్త్రీలతో ఎంజాయ్ చేయి, లేదంటే పోతావ్: వర్మ ఎటాక్

వివాదాల దర్శకుడు సినీ రచయితపై సంచలన కామెంట్స్ చేశారు. ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ అంటూ వర్మ రెండు వర్గాల మధ్య విభేదాలను రెచ్చగొడుతున్నారంటూ వర్మను ఏకిపారేసిన విషయం తెలిసిందే. ఓ టీవీ ఛానల్ చర్చా కార్యక్రమంలో పాల్గొన్న వర్మ.. రచయిత జొన్నవిత్తులకు ‘జొన్నవిత్తుల చౌదరి’ అని బిరుదు ఇచ్చారు. దీంతో జొన్నవిత్తుల ఘాటుగా స్పందిస్తూ.. రామ్ గోపాల్ వర్మ ఫిలాసఫీ పైన నేను పప్పువర్మ అనే బయోపిక్ తీస్తానని ప్రకటించారు. ఈ సందర్భంగా.. వర్మ బతికున్న శవం లాంటివాడు. ఇలాంటి బరితెగించినవాడు సమాజంలో ఉండకూడదు. ఇతని దిక్కుమాలిన ఆలోచనలు వలన సొసైటీకి కలిగే దుష్పరిణామాలను తొలగించే ప్రయత్నమే ఈ ‘పప్పువర్మ’ అంటూ వర్మని ఏకిపారేశారు జొన్నవిత్తుల. వీటిపై రివర్స్ కౌంటర్ ఇస్తూ జొన్నవిత్తులపై తనదైన శైలిలో వ్యంగ్యాస్త్రాలు సంధిస్తూ ట్వీట్ వదిలారు వర్మ. ‘ఓ నా బుజ్జి జొన్నా.. నీ వీడియో చూశాన్రా కిస్సీ బాయ్. నువ్వు అప్పుడప్పుడూ దశాబ్దానికొకసారైనా ఒక స్త్రీతో ఎంజాయ్ చెయ్యి బేబీ.. లేకపోతే ఫ్రస్ట్రేషన్‌తో చచ్చిపోతావ్ జొన్నా. నీ భార్య పిల్లలు నిన్నెలా భరిస్తున్నారు డార్లింగ్. వాళ్ళ మీద జాలేస్తుంది స్వీట్ హార్ట్.. కానీ ఐ లవ్ యు డా’ అంటూ మంటపెట్టే ఎమోజీలను షేర్ చేశారు వర్మ. మరి దీనిపై జొన్నవిత్తుల రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/331KHfr
v

అది చూసే నా భర్త నాకు పడిపోయాడు: ప్రియాంక చోప్రా

గ్లోబల్ స్టార్ పర్సనల్, ప్రొఫెషలన్ లైఫ్‌ని చక్కగా బ్యాలెన్స్ చేసుకుంటోంది. తనకంటే పదేళ్లు చిన్నవాడైన అమెరికన్ గాయకులు నిక్ జొనాస్‌ను ప్రియాంక ప్రేమించి పెళ్లి చేసుకుంది. డిసెంబర్ 1న వీరిద్దరూ తొలి పెళ్లి రోజును జరుపుకోబోతున్నారు. ఈ సందర్భంగా తనలో అందం కాకుండా ఇంకేం చూసి నిక్ పడిపోయాడో ప్రియాంక ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ‘పెళ్లయ్యాక ప్రొఫెషనల్ లైఫ్‌ని మేనేజ్ చేసుకోవడం చాలా కష్టంగా ఉంది. కానీ అర్థం చేసుకునే భర్త వచ్చాడు కాబట్టి నేనెంతో లక్కీ. చెప్పాలంటే నా పనిపై నాకున్న గౌరవం చూసే నిక్ నాకు పడిపోయాడు. మా ఇద్దరికీ ప్రొఫెషనల్ జీవితాలు ఎంతో ముఖ్యం. ఎందుకంటే మేమిద్దరం సొంతంగా ఎంటర్‌టైన్‌మెంట్ కెరీర్‌ను ఎంచుకున్నాం. మాకెవ్వరూ సాయం చేయలేదు. మా కాళ్లపై మేం నిలబడ్డాం. ఈ స్థాయికి రావడానికి చాలా కష్టపడ్డాం. మా ఇద్దరికీ ఇండస్ట్రీలో 10 ఏళ్ల సక్సెస్‌ఫుల్ కెరీర్ ఉంది. ఈ స్థాయికి రావడానికి మేం ఏం కోల్పోయామో మాకే తెలుసు. అందుకే ప్రొఫెషన్ పరంగా ఇద్దరం ఒకర్నొకరం బాగా సపోర్ట్ చేసుకుంటాం. మేమిద్దరం ఓ రూల్ పెట్టుకున్నాం. మూడు వారాలకు మించి ఒకరినొకరు చూసుకోకుండా ఉండకూడదు’ ‘అందుకే ప్రపంచంలో ఏ మూలనున్నా రోజూ వీడియో కాల్స్ చేసుకుంటూ ఉంటాం. ఈ రోజుల్లో రిలేషన్‌‌షిప్‌లో ఉన్న చాలా మంది కేవలం పనిపైనే ఫోకస్ చేస్తున్నారు. దాంతో వారి ప్రేమను, వైవాహిక జీవితాన్ని కోల్పోతున్నారు. ఎక్కువగా పనిపై ఫోకస్ చేయడం వల్లే విడిపోతున్నాం అని చెబుతుంటారు. అందులో లాజిక్ లేదు. ఒకరికోసం ఒకరు అనుకున్నప్పుడు జీవితంలో ఎంత బిజీగా ఉన్నా వారి కోసం కాస్తైనా సమయం కేటాయిస్తాం. మా గురించి ప్రజలు ఏమనుకున్నా నేను పట్టించుకోను. అసలు వారి గురించి ఆలోచించను కూడా. వారి నోరు వారి ఇష్టం. జీవితంలో నేను చేసిన మంచి పనుల్లో నిక్‌ని పెళ్లి చేసుకోవడం ఒకటి. మా ఇద్దరికీ పెళ్లై ఏడాది కావొస్తోంది. నా వెన్నంటే ఉంటూ నన్ను సంతోషపెట్టే వ్యక్తిని పెళ్లి చేసుకున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. నేను ఉన్నతంగా మరింత ఎదగడానికి నిక్ నాకు కొత్త రెక్కల్ని ఇచ్చాడు’ అని వెల్లడించారు ప్రియాంక.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2pjEpth
v

మా నాన్న వద్దన్నారు.. సంపాదనంతా దీనిపైనే పెట్టా: విజయ్ దేవరకొండ

సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ నిర్మాతగా మారి తెరకెక్కించిన తొలి సినిమా ‘మీకు మాత్రమే చెప్తా’. దర్శకుడు తరుణ్ భాస్కర్ ఈ చిత్రం ద్వారా హీరోగా మారారు. వాణి భోజన్, అభినవ్ గోమఠం, అనసూయ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ చిత్రానికి నూతన దర్శకుడు షమీర్ సుల్తాన్ దర్శకత్వం వహించారు. నవంబర్ 1న ఈ చిత్రం విడుదలవుతోంది. ఇప్పటికే ఈ సినిమాకు నిర్మాత విజయ్ దేవరకొండ బోలెడన్ని ప్రచార కార్యక్రమాలు నిర్వహించారు. ఇక సినిమా విడుదలకు ఒక్కరోజు ఉందనగా మీడియా ముందుకు వచ్చారు. సినిమా గురించి కాసేపు ముచ్చటించారు. మీడియా ప్రతినిధులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు. మీరు చేయాల్సిన సినిమాకు మీరే నిర్మాత అయ్యారా? నేను ‘పెళ్లి చూపులు’ చేసిన తరవాత.. ఈ సినిమా డైరెక్టర్, కో- డైరెక్టర్ షమీర్చ, అర్జున్ మొదటిసారి నన్ను కలిశారు. అప్పటికే వాళ్లు చేసిన షార్ట్ ఫిల్మ్స్ చూశాను. ఏ మాత్రం బడ్జెట్ లేకుండా చాలా రిచ్‌గా వాటిని తీశారు. వాళ్ల స్కిల్ చూసి యాక్టర్‌గా అయినా, నిర్మాతగా అయినా ఏదో విధంగా వాళ్లతో సినిమా చేస్తానని చెప్పా. ఆ తరువాత వాళ్ళు నాకు ‘మీకు మాత్రమే చెప్తా’ స్క్రిప్ట్ చెప్పారు. నేను చేద్దాం అన్నాను. అయితే ‘అర్జున్ రెడ్డి’ సినిమా అప్పటికి రిలీజ్ కాలేదు. అది రిలీజ్ అయ్యాక ఈ సినిమా చేయడం కరెక్ట్ కాదని నాకు అనిపించింది. కానీ, ఈ సినిమా అయితే చేయాలి అనుకున్నాను. అలా చివరికి నేను నిర్మాతగా మారి తీశాను. తరుణ్ భాస్కర్‌నే ఎందుకు హీరోగా పెట్టుకున్నారు? తరుణ్ భాస్కర్ మాత్రమే న్యాయం చేయగలడు అనిపించింది. ఆయన టైమింగ్‌ చాల బాగుంటుంది. ‘పెళ్లి చూపులు’ సినిమా చేస్తున్నప్పుడు తరుణ్ సీన్స్‌లో యాక్ట్ చేసి చూపించేవాడు. నిజంగా మాకంటే బాగా చేసేవాడు. తరుణ్ అయితేనే ఈ స్క్రిప్ట్‌కి బాగుంటుందని తనని అడిగాను. అప్పుడు తను ఒప్పుకోలేదు. కానీ, చివరికి ఒప్పుకున్నాడు. మీరే నిర్మాత ఎందుకు అయ్యారు? మీరు అడిగితే ఎవరైనా తీస్తారు కదా? ‘పెళ్లి చూపులు’ సమయంలో నిర్మాత దొరకకపోవడం ఎంత కష్టం అనేది చూశా. అందుకే సినిమాని నిర్మించా. ఈరోజు నేను ఈ స్థానంలో ఉన్నానంటే దానికి కారణం ఎంతోమంది. అందుకే ఇప్పుడు నేను ఉన్న స్థానంలో ఎవరినైనా ప్రోత్సహించగలను అనే ధైర్యంతోనే ఈ సినిమా చేశా. నిర్మాతగా సినిమాలో ఎంత వరకు ఇన్‌వాల్వ్ అయ్యారు? స్క్రిప్ట్‌లో ఇన్‌వాల్వ్ అయ్యాను గాని, ఒకసారి స్క్రిప్ట్ ఫైనల్ చేశాక ఇక నేను ఈ సినిమాలో ఎక్కడా తలదూర్చలేదు. సెట్‌కి ఒకే ఒక్క సారి వెళ్ళాను. అది కూడా వస్తే బాగుటుంది అని అడిగితేనే వెళ్లాను. మ్యూజిక్ గురించి మాత్రమే వాళ్లు నా దగ్గరకు వచ్చేవాళ్లు. పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా కొంచెం చూశా. కానీ, మిగిలినవాటి గురించి అసలు పట్టించుకోలేదు. మీ అంచనాలను సినిమా చేసిన వాళ్లు అందుకోగలిగారా? ఈ టీం సినిమా కోసం చాలా కష్టపడ్డారు. ఇంతగా పనిచేసే వాళ్ళను నేను నా సెట్‌లో కూడా చూడలేదు. చాలా హార్డ్‌వర్క్ చేశారు. అవుట్ ఫుట్ మీద పూర్తి నమ్మకంతో చేశారు. ఈ సినిమాకి ఎంత బడ్జెట్ అయ్యింది? నేను ఇప్పటి వరకూ చేసిన సినిమాల ద్వారా సంపాదించిన డబ్బులో 70 శాతం ఈ సినిమాకే ఖర్చు పెట్టాను. మొదట్లో మా నాన్న.. ‘‘ఇప్పుడు ఎందుకురా మనకు ప్రొడక్షన్, యాక్టింగ్ మీద దృష్టి పెట్టకుండా’’ అని అన్నారు. కానీ స్క్రిప్ట్ బాగుంది అని చేసేశాం. అయితే గుడ్డిగా ఏమి చేయలేదు. ఈ టీమ్ మీద నాకు పూర్తి నమ్మకం ఉంది. అందుకే రిస్క్ తీసుకుని సినిమా చేశాను. నా మీద నమ్మకంతో నా నిర్మాతలు డబ్బు ఖర్చు పెట్టకపోతే నేను ఇప్పటికీ చిన్న ఇంట్లో రెంట్ కట్టుకుంటూ ఉండేవాడిని. అందుకే నేను చేశా. ‘మీకు మాత్రమే చెప్తా’ కథ మీద అంత నమ్మకంగా ఉన్నారు. సినిమాలో మీకు అంత నచ్చిన విషయం ఏంటి? ఈ కథ విన్నంత సేపూ నవ్వుతూనే ఉన్నాను. ఆడియన్స్ సినిమా హాల్ నుంచి బయటకి వచ్చేటప్పుడు నవ్వుకుంటూ వస్తారు. ఈరోజుల్లో హ్యూమర్ వర్కౌట్ అవుతుంది. సినిమా చూశాక.. సినిమాని బాగా చేశారు, బాగా ఎంజాయ్ చేశాం అని ఆడియన్స్ కచ్చితంగా ఫీల్ అవుతారు. ఇంకా కొత్తవాళ్లను ఎంకరేజ్ చేసే సినిమాలు చేస్తారా? ప్రస్తుతానికి ఈ సినిమా చేశా.. ముందు ముందు చేయాలని ఉంది, చూడాలి. మీ తదుపరి సినిమాలు ఏంటి? ‘వరల్డ్ ఫేమస్ లవర్’ సినిమా ఇంకా ఎనిమిది రోజుల షూటింగ్ మిగిలి ఉంది. పూరీ గారితో చేయబోయే సినిమా జనవరి నుంచి ప్రారంభమవుతుంది. తరువాత శివ నిర్వాణతో ఒక సినిమా ఉంటుంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2NFb1G3
v

17 సార్లు ఆ హీరో చెంప చెళ్లుమనిపించాను: Saaho నటుడు

ఓ హీరోను పట్టుకుని ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 17 సార్లు చెంప చెళ్లుమనిపించాడట బాలీవుడ్ నటుడు జాకీ ష్రాఫ్. ఆ హీరో ఎవరో కాదు అనిల్ కపూర్. వీరిద్దరూ ఇండస్ట్రీలో ఎప్పటినుంచో మంచి స్నేహితులు. అలాంటిది కొట్టుకునేంత గొడవ ఏమొచ్చింది అనుకుంటున్నారా? అవి షూటింగ్‌లో భాగంగా తిన్న తన్నులు. అనిల్, జాకీ ఎన్నో సినిమాల్లో కలిసి నటించారు. వీరిద్దరూ నటించిన ‘పరిందా’ అనే సినిమా విడుదలై నవంబర్ 3కి 30 ఏళ్లు పూర్తవుతుంది. ఈ సందర్భంగా అప్పటి రోజుల్ని గుర్తుచేసుకుంటూ ఓ వీడియోను విడుదల చేశారు జాకీ ష్రాఫ్. ‘ఓ సీన్‌లో నేను అనిల్ కపూర్‌ని కొట్టాల్సి ఉంది. ఎన్నిసార్లు చేసినా ఆ సీన్ పర్‌ఫెక్ట్‌గా వచ్చేది కాదు. దాంతో ఎక్కువ టేక్స్ తీసుకోవాల్సి వచ్చింది. అలా 17 సార్లు అనిల్‌ చెంప చెళ్లుమనిపించాను. చెప్పాలంటే ఫస్ట్ టేక్‌లోనే నేను అనిల్‌ను సరిగ్గా కొట్టాను. అనిల్ కూడా సరైన ఎక్స్‌ప్రెషన్ ఇచ్చాడు. డైరెక్టర్ షాట్ ఓకే చేశాడు. కానీ అనిల్ మాత్రం ఇంకో టేక్ ఇంకో టేక్ అంటూ నాచేత 17 సార్లు కొట్టించుకున్నాడు. ఇది గాల్లో కొట్టే సన్నివేశం కాదు. నేను అనిల్‌ను నిజంగానే కొట్టాలి. నాకేమో అన్నిసార్లు కొడుతుంటే బాధేసింది’ అంటూ అప్పటిరోజుల్ని గుర్తుచేసుకున్నాడు జాకీ. అనిల్ కపూర్, జాకీ ష్రాఫ్ ఎన్నో సినిమాల్లో అన్నాతమ్ముళ్ల పాత్రల్లో నటించారు. అనిల్ కంటే జాకీ వయసులో చిన్నవాడు. కానీ చూడటానికి జాకీ పెద్దవాడిలా ఉండేవాడు. దాంతో ఎప్పుడూ అతనే అన్న పాత్రను పోషించేవాడు. ఇప్పటికీ అనిల్ కపూర్‌కు హీరోగా నటించే అవకాశాలు వస్తాయనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఎందుకంటే 60 ఏళ్ల వయసులోనూ అనిల్ 30 ఏళ్ల కుర్రాడిలా యవ్వనంగా మెరిసిపోతున్నారు. చివరిసారిగా అనిల్, జాకీ 2013లో వచ్చిన ‘షూటౌట్ ఎట్ వాడాలా’ సినిమాలో నటించారు. మళ్లీ వీరిద్దరూ ఎప్పుడు కలిసి నటిస్తారా అని ఫ్యాన్స్ ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఇటీవల విడుదలైన సాహో సినిమాలో జాకీ ష్రాఫ్ ప్రభాస్ తండ్రిగా కీలక పాత్రలో నటించిన సంగతి తెలిసిందే.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2qbt4v3
v

ఆ వార్త తెలియగానే షాక్‌కు గురయ్యాను: బాలకృష్ణ

సీనియర్ నటి గీతాంజలి మృతి పట్ల హీరో నందమూరి బాలకృష్ణ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆమె మరణ వార్త తనను షాక్‌కు గురిచేసిందని అన్నారు. తమ కుటుంబంతో మంచి అనుబంధం ఉన్న వారిలో ఆవిడ ఒకరని తెలిపారు. తన తండ్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు అంటే ఆమెకు ఎంతో అభిమానమని పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ఫేస్‌బుక్‌లో ఒక పోస్ట్ పెట్టారు. ‘‘గీతాంజలి గారు పరమపదించారినే వార్త తెలియగానే షాక్‌ అయ్యాను. ఎప్పుడు కలిసినా ఆప్యాయంగా పలకరించేవారు. మా కుటుంబంతో మంచి అనుబంధం ఉన్న వారిలో ఆవిడ ఒకరు. నాన్నగారంటే ఆవిడకు ఎంతో అభిమానం. నాన్నగారు డైరెక్ట్‌ చేసిన ‘సీతారామ కళ్యాణం’ సినిమాలో సీత పాత్రలో గీతాంజలిగారు నటించారు. నటనలో ఆవిడ నాన్నగారిని ఎప్పుడూ ఇన్‌స్పిరేషన్‌గా తీసుకునేవారు. తెలుగు సినిమాల్లో నటిగా తనదైన ముద్ర వేశారు. అలాంటి గొప్ప నటి మనల్ని విడిచిపెట్టి పోవడం ఎంతో బాధాకరం. ఆమె ఆత్మకు శాంతి కలగాలి. ఆమె కుటుంబానికి ఆ దేవుడు మనోధైర్యానివ్వాలని ప్రార్ధిస్తున్నాను’’ అని బాలకృష్ణ పేర్కొన్నారు. Also Read: కాగా, గీతాంజలి గుండెపోటుతో గురువారం ఉదయం మృతిచెందారు. ప్రస్తుతం ఆమె వయసు 72 సంవత్సరాలు. 1947లో తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో జన్మించిన గీతాంజలి అసలు పేరు మణి. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో కలిపి 500పైగా చిత్రాల్లో గీతాంజలి నటించారు. సీనియర్ హీరో రామకృష్ణను గీతాంజలి వివాహం చేసుకున్నారు. ఆమె తెలుగులో ఆఖరిగా నటించిన చిత్రం ‘దటీజ్ మహాలక్ష్మి’. తమన్నా ప్రధాన పాత్ర పోషించిన ఈ సినిమా విడుదల కావాల్సి ఉంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2NozTl4
v

వామ్మో.. ఇలియానా ఇంత భయంకరంగా ఉందేంటి?

ఎప్పుడూ అందంగా, సెక్సీగా కనిపించే గోవా బ్యూటీ ఒక్కసారిగా భయంకరంగా తయారైంది. ఇదంతా హాలోవీన్ ఎఫెక్ట్ అన్నమాట. ఈ హాలోవీన్‌ని మన ఇండియాలో జరుపుకోరు కానీ ప్రపంచవ్యాప్తంగా దీన్నో పెద్ద పండుగలా జరుపుకుంటారు. ఏటా క్రిస్మస్ పండుగకు నెల రోజుల ముందు హాలోవీన్ జరుపుకోవడం ఎన్నో ఏళ్లుగా సంప్రదాయంగా వస్తోంది. ఈ హాలోవీన్ పిచ్చి ఇలియానాకు కూడా పట్టినట్లుంది. కళ్లనిండా కాటుక పూసుకుని నల్లటి దుస్తుల్లో తయారైంది. అయితే ఈ మేకప్ అంతా ఆమె కథానాయికగా నటించిన ‘పాగల్‌పంతి’ సినిమా కోసం. ఈ సినిమా పోస్టర్‌లో ఇలియానా భయంకరమైన అవతారంలో కనిపించింది. పగలు చూస్తే పగలే కల్లోకి వచ్చేలా ఉంది అంటూ పలువురు నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ‘పాగల్ పంతి’ సినిమాలో జాన్ అబ్రహం, పుల్కిత్ సమ్రాట్, కృతి కర్బంద ప్రధాన పాత్రల్లో నటించారు. వీరికి సంబంధించిన హాలోవీన్ పోస్టర్లు కూడా విడుదలయ్యాయి. ఇక కృతి కర్బంద పోస్టర్ చూస్తే హడలిపోవడం ఖాయం. ఇంతకీ ఈ హాలోవీన్‌ను ఎందుకు జరుపుకుంటారంటే.. చనిపోయినవారిని గుర్తుచేసుకోవడానికి. మూడు రోజుల పాటు ఈ హాలోవీన్‌ను జరుపుకుంటారు. ఈ మూడు రోజులు వెజ్ తప్ప నాన్ వెజ్ ముట్టుకోరు. ఇలా చేస్తే చనిపోయినవారి ఆత్మ శాంతిస్తుందని క్రైస్తవుల నమ్మకం. మన సినీ ప్రుముఖులు కూడా ఈ హాలోవీన్‌ను ఏటా జరుపుకుంటూ ఉంటారు. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పిల్లలు అర్హా, అయాన్‌లు కూడా హాలోవీన్ గెటప్‌లు ధరించారు. ఈ ఫొటోలను అర్జు్న్ భార్య స్నేహ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇక ఇలియానా నటిస్తున్న పాగల్ పంతి సినిమా విషయానికొస్తే.. ఈ సినిమాను అనీస్ బాజ్మీ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ఇటీవల విడుదలైంది. ఈ సినిమాను బుర్రపెట్టి చూడొద్దని చిత్రబృందం ముందే వార్నింగ్ ఇచ్చింది. వరుస ఫ్లాప్స్‌తో సతమతమవుతున్న ఇలియానా కెరీర్ ఈ సినిమాతో మళ్లీ ట్రాక్‌లో పడుతుందో లేదో చూడాలి. నవంబర్ 22న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2NlqnyY
v

గీతాంజలికి కన్నీటి నివాళి.. తీవ్ర భావోద్వేగానికి గురైన హేమ

సీనియర్ నటి గీతాంజలి కన్నుమూసిన విషయం తెలిసిందే. గురువారం ఉదయం గుండెపోటుకు గురైన గీతాంజలిని కుటుంబసభ్యులు హైదరాబాద్ ఫిల్మ్‌నగర్‌లోని అపోలో ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ గీతాంజలి తుదిశ్వాస విడిచారు. ఆమె మృతిపట్ల సినీ ప్రముఖులు, అభిమానులు సంతాపం వ్యక్తం చేశారు. మరోవైపు, మూవీ ఆర్టిస్టు అసోసియేషన్‌లోని సభ్యులు గీతాంజలి మృతిపట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆమెకు కన్నీటి నివాళి అర్పించారు. గీతాంజలి నివాసంలో ఉంచిన ఆమె మృతదేహాన్ని ‘మా’ సభ్యులు ఉత్తేజ్, హేమ, రమాప్రభ, శివాజీ రాజా తదిరులు సందర్శించి నివాళులర్పించారు. అలాగే, స్వర్గీయ ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీపార్వతి కూడా నివాళులర్పించిన వారిలో ఉన్నారు. అయితే, గీతాంజలి మృతి పట్ల నటి హేమ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఒకానొక దశలో ఆమె తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. దు:ఖాన్ని ఆపుకోలేకపోయారు. కన్నీరు పెట్టుకున్నారు. Also Read: మరోవైపు గీతాంజలికి నివాళులర్పించిన అనంతరం లక్ష్మీ పార్వతి మీడియాతో మాట్లాడుతూ.. ‘‘క్షణంలో జీవితం ఏమైపోతుందో అర్థంకాని విషయం. ఈరోజు భోజనానికి వస్తానని చెప్పిన మనిషి ఏకంగా స్వర్గానికి వెళ్లిపోవడం చాలా బాధగా అనిపించింది. అందరూ పోవాల్సినోళ్లమే.. కానీ, హఠాత్తుగా పోయినప్పుడు మనకు ఆశ్చర్యం కలుగుతూ ఉంటుంది. ఆమె కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. ఆమె ఎంతో ఉత్తమురాలు, మంచి మనిషి. ఆమె తప్పకుండా స్వర్గానికే వెళతారు. అలాంటి వ్యక్తి ఆత్మకు శాంతి చేకూరాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను’’ అని అన్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2Pz44sD
v

సీఎం అవ్వాలంటూ స్టార్ హీరోకు ఫ్యాన్స్ రిక్వెస్ట్

బాలీవుడ్ స్టా్ర్ నటుడు మహారాష్ట్ర ముఖ్యమంత్రి అయితే బాగుంటుందని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఇందుకు కారణం మహారాష్ట్రలో రాజకీయ పరిస్థితులే. దేశ ఆర్థిక రాజధాని అయిన మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటుపై ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. సీఎం పదవీకాలాన్ని చెరిసగం పంచుకోవాల్సిందేనని శివసేన పట్టుబట్టడంతో బీజేపీ మల్లగుల్లాలు పడుతోంది. అగ్రనేతలు సర్దిచెప్పే ప్రయత్నం చేసినా శివసేన మాత్రం మొట్టుదిగడం లేదు. ఈ నేపథ్యంలో సీఎం దేవేంద్ర ఫడణవీస్‌, శివసేన వేర్వేరుగా గవర్నర్‌ భగత్‌సింగ్ కోష్యారీని కలవడంతో మరింత వేడి రాజుకుంది. ఈ నేపథ్యంలో మహారాష్ట్రలో మంచి ప్రభుత్వం ఏర్పడాలంటే అనిల్ కపూర్ వస్తేనే బాగుంటుందని ఫ్యాన్స్ అంటున్నారు. ఈ మేరకు సోషల్ మీడియాలో అనిల్ కపూర్ సీఎం పేరుతో హ్యాష్‌ట్యాగ్ క్రియేట్ చేసి కామెంట్లు పెడుతున్నారు. ‘మహారాష్ట్రలో ప్రభుత్వం నెలకొనేంతవరకు అనిల్ కపూర్‌ను ముఖ్యమంత్రిని చేయండి. 2001లో ఆయన నటించిన ‘నాయక్’ సినిమాలో వన్ డే సీఎం అయ్యారు. ఈ సీన్ అందరికీ నచ్చింది. కాబట్టి మన ప్రభుత్వానికి ఓ పరిష్కారం దొరకే వరకు అనిల్ కపూర్‌ను సీఎం చేయండి. ఏమంటారు దేవేంద్ర ఫడ్నవిస్, ఆదిత్య ఠాక్రే?’ అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. ఇందుకు అనిల్ కపూర్ తనదైన శైలిలో సమాధానం ఇచ్చాడు. ‘నేను ‘నాయక్’గానే బాగున్నాను’ అంటూ తనకు సినిమాలే కరెక్ట్ అని బదులిచ్చాడు. 2001లో వచ్చిన నాయక్ సినిమాలో రాణీ ముఖర్జీ కథానాయికగా నటించారు. ఈ సినిమాలో అనిల్ కపూర్ ఒక రోజు సీఎంగా వ్యవహరిస్తారు. శంకర్ ఈ సినిమాను డైరెక్ట్ చేశారు. మరోవైపు, శివసేనకు మద్దతు పెరుగుతోంది. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ-శివసేన కలిసి పోటీచేసి, మెజార్టీ సీట్లు సాధించాయి. అయితే, ముఖ్యమంత్రి పీఠాన్ని చెరో రెండేళ్లు పంచుకోవాలని, గతంలో చేసుకున్న ఒప్పందానికి కట్టుబడి ఉండాలని శివసేన డిమాండ్ చేస్తోంది. బీజేపీ మాత్రం ఇందుకు సుముఖంగా లేనట్లు తెలుస్తోంది. డిప్యూటీ సీఎం పదవిని శివసేన తీసుకోవాలని కొందరు బీజేపీ నేతలు సూచిస్తున్నారు. దీంతో ప్రభుత్వ ఏర్పాటుపై సందిగ్ధత కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో అనిల్ కపూర్ వస్తే బాగుంటుందని ఫ్యాన్స్ సోషల్ మీడియాలో డిబేట్ పెట్టారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2WuZOf4
v

సముద్రంలో జలకాలాట.. మాల్దీవుల్లో ఒంటరిగా ఎంజాయ్ చేస్తోన్న రేణు దేశాయ్

మల్టీ టాలెండెట్ రేణు దేశాయ్.. పవన్ కళ్యాణ్ నుంచి విడిపోయిన తరవాత తన ఇద్దరు పిల్లలతో జీవితాన్ని చాలా సంతోషంగా గడుపుతున్నారు. కేవలం వ్యక్తిగత జీవితాన్నే కాకుండా ప్రొఫెషనల్ లైఫ్‌ను కూడా ఎంజాయ్ చేస్తున్నారు. తనకెంతో ఇష్టమైన సినీ పరిశ్రమలోనే కొనసాగుతున్నారు. హైదరాబాద్ నుంచి పుణే వెళ్లిపోయిన ఆమె.. మరాఠి చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టారు. దర్శకురాలుగా ఒక సినిమా, నిర్మాతగా రెండు సినిమాలు చేశారు. ఇప్పుడు తెలుగులోనూ ఒక సినిమాను తెరకెక్కించాలని చూస్తున్నారు. ఒకవైపు తన ప్రొఫెషనల్ లైఫ్‌తో బిజీగా ఉంటూనే పిల్లలతోనూ ఆనందమైన వ్యక్తిగత జీవితాన్ని గుడుపుతున్నారు రేణు. అప్పుడప్పుడు పిల్లలతో కలిసి విహారయాత్రలకు వెళ్తుంటారు. అయితే, ప్రస్తుతం ఆమె ఒంటరిగా వెకేషన్‌ను ఎంజాయ్ చేస్తున్నారు. అది కూడా అందమైన మాల్దీవుల్లో. ఈ విషయాన్ని ఆమెనే స్వయంగా ఇన్‌స్టాగ్రామ్ ద్వారా వెల్లడించారు. అంతేకాదు, రెండు అందమైన ఫొటోలను కూడా షేర్ చేశారు. సముద్రంలో ఒంటరిగా జలకాలాట ఆడటం ఎంతో బాగుందని పేర్కొన్నారు. Also Read: ‘‘పర్వతాలు నా హృదయమైతే, మహాసముద్రం నా ఆత్మ అని ఇప్పుడు నాకు తెలిసింది. ఈ మాల్దీవులు విహారయాత్రలో సముద్రంలో నేను ఒంటరిగా గంటలపాటు ఈతకొట్టిన తరవాత ఈ విషయం నాకు అర్థమైంది. ఒక చేప ఆత్మ నాలో ఉందని తెలుసుకున్నాను. అగ్ని నాకు ఇష్టమైన భూతం అంటే వెటకారంగా అనిపించేది. అగ్ని అనే కాన్సెప్ట్‌కు నేను బాగా ఆకర్షితురాలి అయ్యాను. కానీ, నీటిలో ఉంటే ఇంట్లో ఉన్న భావన కలుగుతోంది. జీవితం అంటే ఇదే అని ఇప్పుడు నాకు తెలిసింది. వ్యంగ్యాలు, వైరుధ్యాలు’’ అని వేదాంతం చెప్పుకొచ్చారు రేణు. ప్రస్తుతం రేణు దేశాయ్ పిల్లలు అకీరా నందన్, ఆధ్య.. తమ తండ్రి పవన్ కళ్యాణ్ వద్ద ఉన్నట్టు తెలిసింది. దీపావళి పండుగకు వీళ్లిద్దరూ తండ్రి వద్దకు వచ్చారు. చిరంజీవి ఇంట్లో జరిగిన దీపావళి సంబరాల్లో తండ్రి పవన్‌తో కలిసి వీరిద్దరూ పాల్గొన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం వీళ్లిద్దరూ ఆయన దగ్గరే ఉన్నట్టు తెలిసింది. అందుకే, రేణు దేశాయ్ ఒంటరిగా మాల్దీవులు వెకేషన్‌కు వెళ్లినట్టున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/36jVBPV
v

‘ఆ సింగర్ ఓ కామాంధుడు, నన్నూ వదిలిపెట్టలేదు’

ప్రముఖ బాలీవుడ్ మ్యూజిక్ కంపోజర్, సింగర్ అను మాలిక్‌ గురించి మరో షాకింగ్ విషయం బయటికి వచ్చింది. ఇటీవల గాయని సోనా మొహాపాత్ర అతనిపై మీటూ ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అనే మరో పాపులర్ సింగర్ అను తనతో ప్రవర్తించిన తీరును సోషల్ మీడియాలో బట్టబయలు చేసింది. అతడు కామాంధుడంటూ తిట్టిపోసింది. ‘నువ్వు చెప్పింది నిజమే సోనా. అను మాలిక్ ఓ కామాంధుడు. వాడు నన్ను కూడా వదిలిపెట్టలేదు. 21 ఏళ్ల వయసులో నేను అను మాలిక్ స్టూడియో‌కి వెళ్లాను. నేను పాడిన పాటల సీడీ ఆయనకు చూపిస్తే నచ్చి నాకు ఛాన్స్ ఇస్తాడనుకున్నా. కానీ ఇలా అసహ్యంగా ప్రవర్తిస్తాడని అస్సలు ఊహించలేదు. ఆ సమయంలో అతను సోఫాలో కూర్చుని నా కళ్లను పొగుడుతూ అసభ్యకరంగా ప్రవర్తించేవాడు. నాకు భయమేసి కింద మా అమ్మ ఎదురుచూస్తోంది సర్ అని వెళ్లిపోయాను. ఆ తర్వాత అను నాకు చాలా ఫోన్లు, మెసేజ్‌లు చేశాడు. కానీ నేను స్పందించలేదు. నాకంటే వయసులో పెద్దవాడైన అతను ఇలా ప్రవర్తించడం ఎంత వరకు కరెక్ట్? వాడు మళ్లీ టీవీలో ఎలా కనిపిస్తున్నాడో నాకు అర్థంకావడంలేదు. ఈ నిజాలన్నీ బయటపట్టాక నాకు ఏం జరిగినా ఫర్వాలేదు. ఎన్ని సార్లు తప్పించుకున్నా నిజం ఎప్పటికీ సజీవంగానే ఉంటుంది. అయితే ప్రముఖ సింగింగ్ రియాల్టీ షోలో పాల్గొన్న ఓ సింగర్ చాలా బాగా పాటలు పాడుతున్నాడని ప్రముక లెజండరీ క్రికెటర్ సచిన్ టెండుల్కర్ మెచ్చుకున్నాడు. దాంతో సోనా మొహాపాత్ర ఆయన్ను టార్గెట్ చేస్తూ కామెంట్ చేసింది. ‘సచిన్ సర్.. మీకు మీటూ గురించి ఏమీ తెలీదా? మీరు మెచ్చుకుంటున్న షోలో అను మాలిక్ అనే కామాంధుడు ఉన్నాడు. మీరు ఎప్పుడూ ఆ షోలో పాల్గొనేవారినే మెచ్చుకుంటారా? అను మాలిక్ వల్ల మాలాగా ఇబ్బందులు పడిన ఆడవాళ్ల గురించి అస్సలు పట్టించుకోరా?’ అని ప్రశ్నించింది సోనా. అయితే ఎందుకొచ్చిన గొడవ అనుకున్నాడో ఏమో సచిన్ మాత్రం దీనిపై స్పందించలేదు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2q3AXD5
v

‘ఈ నటిని నేను చంపలేదు, మీడియా చెప్పిందంతా అబద్ధం’

బాలీవుడ్ నటి జియా ఖాన్ ఆత్మహత్య కేసులో ఇప్పటివరకు మీడియా వర్గాలు రాసినదంతా అబద్ధమేనని అంటున్నారు బాలీవుడ్ నటుడు . జియా, సూరజ్ చాలా కాలం పాటు ప్రేమించుకున్నారు. వీరిద్దరి మధ్య ఏం జరిగిందో తెలీదు కానీ ఏడేళ్ల క్రితం జియా తన ఇంట్లో ఉరేసుకుని సూసైడ్ చేసుకున్నారు. దాంతో జియా తల్లి రాబియా తన కుమార్తె చావుకు కారణం సూరజేనని పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో పోలీసులు సూరజ్‌ను కస్టడీలోకి తీసుకున్నారు. ఏడేళ్లు అవుతున్న ఈ కేసు ఓ కొలిక్కి రాలేదు. దాంతో ఇక తాను న్యాయం కోసం ఎదురుచూడలేకపోతున్నానని సూరజ్ బాధపడుతున్నారు. దీని గురించి తాజాగా మీడియా ముందుకు వచ్చి మాట్లాడారు. ‘నేను జియాను చంపలేదు. ఈ కేసు విషయంలో ఇప్పటివరకు బాలీవుడ్ మీడియా వర్గాలు రాసినదంతా అబద్ధం. మీరు కేవలం జియా తల్లి చెప్పిన మాటల్ని విని నా గురించి తప్పుగా అనుకుంటున్నారు. అసలేం జరిగిందని నన్ను ఒక్కరూ ప్రశ్నించలేదు. నేను కూడా స్పందించలేదు. ఎందుకంటే నేను అమాయకుడినని నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. ఈ కేసులో నిజం ఏంటో తెలియాలని నేను చాలాకాలంగా ఎదురుచూస్తున్నాను. కానీ మీడియా నాకు ఆ న్యాయం ఇవ్వలేదు. కేవలం న్యాయస్థానం మాత్రమే నాకు న్యాయం చేయగలదు. ఇప్పటికే ఏడేళ్లు గడిచిపోయింది. కానీ కోర్టు ఇంకా తీర్పు ఇవ్వలేదు. ఇదంతా నా కెరీర్‌పై ప్రభావం చూపుతోంది’ ‘ దీని వల్ల నేనే కాదు నా కుటుంబం కూడా చాలా బాధపడుతోంది. జియా తల్లి రాబియాకు బ్రిటిష్ పాస్‌పోర్ట్ ఉంది. దాంతో సరిగ్గా కోర్టులో నా వాదన సమయం వచ్చే సరికి ఆమె బ్రిటన్ వెళ్లిపోతున్నారు. నాపై కేసు పెట్టింది ఆవిడే కదా. మరి ఎందుకు కోర్టుకు రావడంలేదు. బ్రిటిష్ పాస్‌పోర్ట్ ఉన్నంత మాత్రాన ఏదైనా చేయొచ్చు అనుకుంటోంది. నాపై లేని పోని నిందలు వేసి ఇలా తప్పించుకు తిరగడం ఆమెకు మర్యాదగా అనిపించుకోదు. కేసుపై ఎలాంటి తీర్పు రాకపోవడంతో అందరూ నన్ను బ్యాడ్ బాయ్ అనుకుంటున్నారు. త్వరలో ఈ వివాదం నుంచి నేను బయటపడాలని ఆ దైవాన్ని కోరుకుంటున్నాను’ అని వెల్లడించారు సూరజ్.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2qX9svb
v

Wednesday 30 October 2019

Shahrukh Khan వీడియో పోస్ట్ చేసిన సల్మాన్.. ఇన్‌స్టాగ్రామ్ క్రాష్

షారుక్ ఖాన్, సల్మాన్ ఖాన్.. వీరిద్దరూ బాలీవుడ్‌కు రెండు కళ్లులాంటివారు. ఒకప్పుడు నేను గొప్పా నువ్వు గొప్పా అన్నంతగా కొట్టుకున్న వీరిద్దరూ ఇప్పుడు ప్రాణ స్నేహితులు అయిపోయారు. సల్మాన్, షారుక్‌ని ఒకే స్క్రీన్‌పై చూడాలని వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్న ఫ్యాన్స్ ఎందరో ఉన్నారు. అయితే.. షారుక్ చేసిన ఓ సాహసవంతమైన పనిని మెచ్చుకుంటూ పోస్ట్ చేసిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో రచ్చ పుట్టిస్తోంది. షారుక్ నటించిన ‘హ్యాపీ న్యూఇయర్’ సినిమాలోని ఓ క్లిప్ అది. వీడియోలో షారుక్ షర్ట్‌కి మంటలు వ్యాపించినా కూడా ఆయన ఏమీ కానట్లు వెళ్లిపోతుంటాడు. ఇంతకీ సల్మాన్ ఈ వీడియో ఎందుకు పోస్ట్ చేశాడంటే.. ఇటీవల బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ఇంట్లో అపశృతి చోటు చేసుకుంది. దాదాపు మూడేళ్ల తర్వాత అమితాబ్ ముంబయిలోని తన నివాసంలో ఇటీవల దీపావళి వేడుకలు నిర్వహించారు. బాలీవుడ్‌కి చెందిన ఎందరో అతిరథమహారథులు వేడుకకు హాజరయ్యారు. ఐశ్వర్య రాయ్‌ వద్ద మేనేజర్‌గా పనిచేసిన అర్చనా సదానంద్ అనే యువతి కూడా వేడుకకు వెళ్లింది. అయితే ఆమె లెహంగా దీపాల మధ్య చిక్కుకుని మంటలు అంటున్నాయి. అక్కడే ఉన్న షారుక్ ఖాన్ వెంటనే అప్రమత్తమై మంటలు అదుపు చేశారు. అర్చన చేతికి కాలికి 15 శాతం గాయాలయ్యాయి. ఆమెను వెంటనే దగ్గర్లోని లీలావతి హాస్పిటల్‌కు తరలించారు. రియల్ లైఫ్‌లోనూ షారుక్ హీరో అనిపించుకున్నారని కాంప్లిమెంట్ ఇస్తూ సల్మాన్ ఈ వీడియోను పోస్ట్ చేశాడు. ‘మంటల్లో దూకి ఎవరినైతే రక్షిస్తాడో అతడినే హీరో అంటాడు’ అని సల్మాన్ వాయిస్ ఓవర్ ఇచ్చాడు. ఇంకేముంది.. సల్మాన్ ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయగానే ఫ్యాన్స్ టకటకా లైక్ బటన్ నొక్కిపడేశారు. దాంతో కాసేపటి వరకు సల్మాన్ ఇన్‌స్టాగ్రామ్ క్రాష్ అయింది. దాదాపు పది లక్షల మందికి పైగా ఈ వీడియోను లైక్ చేశారు. షారుక్, సల్మాన్ ఒకప్పుడు రైవల్స్ అన్న మాట నిజమే. కానీ తమ మధ్య ఎలాంటి శతృత్వం లేదని స్పష్టం చేశారు. ఇప్పుడు ప్రాణ స్నేహితుల్లా మెలుగుతున్నారు. అంతే కాదు ఒకరి సినిమాలను ఒకరు ప్రమోట్ చేసుకుంటున్నారు. షారుక్ నటించిన జీరో సినిమాలో సల్మాన్ అతిథి పాత్రలో మెరిశారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2PyR3zh
v

రెమ్యునరేషన్ పెంచేసిన బాలకృష్ణ.. స్పందించిన నిర్మాత

నటిసింహా నందమూరి బాలకృష్ణ రెమ్యునరేషన్ పెంచేశారని, ప్రస్తుతం ఆయన చేస్తున్న ‘రూలర్’ సినిమాకు భారీగా పారితోషికం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారని వార్తలు వచ్చాయి. గతేడాది వచ్చిన ‘జైసింహా’ సినిమాకు రూ.6 కోట్లు తీసుకున్న బాలయ్య.. ఇప్పుడు ‘రూలర్’ సినిమాకు రూ.12 కోట్లు డిమాండ్ చేస్తున్నారని అన్నారు. ఈ రెండు సినిమాలకు సి.కళ్యాణే నిర్మాత. దీంతో ఈ వార్త ఫిల్మ్ సర్కిల్స్‌లో గట్టిగా వినిపించింది. బాలకృష్ణ రెమ్యునరేషన్ పెంచేయడంతో బడ్జెన్‌ను సరిచేసుకోవడానికి మిగిలిన డిపార్ట్‌మెంట్లలో పనిచేసేవారికి సి.కళ్యాణ్ కోత విధిస్తున్నారని కూడా రూమర్ వచ్చింది. Also Read: అయితే, ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని నిర్మాత సి.కళ్యాణ్ స్పష్టత ఇచ్చారు. బాలయ్య పారితోషికం కోసం నిర్మాతలను ఇబ్బంది పెట్టే మనిషి కాదని కళ్యాణ్ అన్నారు. ‘‘బాలకృష్ణతో గతంలో పనిచేశాను. ఆయన చాలా మంచివారు. డౌన్ టూ ఎర్త్ పర్సన్. ఎప్పుడూ ఏదీ డిమాండ్ చేయలేదు. రెమ్యునరేషన్ ఎక్కువగా అడుగుతున్నారనే వార్తల్లో నిజం లేదు. మా మధ్యన రెమ్యునరేషన్ గురించి అసలు చర్చే జరగలేదు. సినిమా అనుకున్న షెడ్యూల్ ప్రకారమే జరుగుతోంది’’ అని కళ్యాణ్ చెప్పుకొచ్చారు. Also Read: కాగా, ఈ సినిమాకు సీనియర్ దర్శకుడు కె.ఎస్. రవికుమార్ దర్శకత్వం వహిస్తు్నారు. ఈ సినిమాలో బాలయ్య రెండు భిన్నమైన పాత్రల్లో కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ లుక్స్ విశేషంగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా తాజాగా విడుదలైన పోలీస్ అధికారి లుక్ అయితే అభిమానులను కట్టి పడేసింది. బాలయ్య కాస్త బరువు తగ్గి పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌లా పోస్టర్‌లో కనిపిస్తున్నారు. ఈ సినిమాలో సోనాల్ చౌహాన్, వేదిక హీరోయిన్లుగా నటిస్తున్నారు. డిసెంబర్ 20న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/332JNiW
v

ఈవెంట్‌లో మెరిసిన ఐశ్వర్య రాయ్.. నిజంగా 50 కేజీ తాజ్‌మహలే

బాలీవుడ్ బ్యూటీ ఐశ్వర్యా రాయ్ బచ్చన్ అందాన్ని పొగడటానికి మాటలు చాలవు. అందుకే ఏ.ఆర్ రెహమాన్ ఆమెను ‘50 కేజీ తాజ్‌మహల్’తో పోల్చాడు. ఐష్‌కు వయసు పెరిగే కొద్ది అందం రెట్టింపవుతూనే ఉంది అనడానికి ఈ ఫొటోన ఎగ్జాంపుల్. ఓ ఈవెంట్ షో కోసం ఐష్ రోమ్ వెళ్లారు. వైట్ బాల్ గౌన్‌లో ర్యాంప్ వాక్ చేశారు. దీనిని ప్రముఖ లెబనీస్ డిజైనర్ జయాద్ జెర్మానోస్ డిజైన్ చేశారు. మేకప్ మరీ ఎక్కువగా లేకుండా చాలా సింపుల్‌గా, బ్యూటిఫుల్‌గా ముస్తాబయ్యారు. ఈ ఫొటోలను ఐష్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయగానే నెటిజన్లు ఫిదా అయిపోయారు. ఒక్క లైక్‌తో ఆమె అందాన్ని వర్ణించలేక కామెంట్స్ సెక్షన్‌ను కాంప్లిమెంట్స్‌తో నింపేస్తున్నారు. మాజీ మిస్ వరల్డ్ అయిన ఐష్‌ను నాలుగు పదుల వయసులోనూ అందానికి పర్యాయపదంగా ఆమె పేరును వాడుతుంటారు. ఐష్ అందం తగ్గిపోతుంది అన్న మాట ఇప్పటివరకు ఎవరి నుంచి రాలేదు. అభిమానుల కోసమే ఐష్ ఇన్‌స్టాగ్రామ్‌ను తెరిచారు. రోజుకో ఫొటోతో ఫ్యాన్స్‌ను ఫుల్ ఖుష్ చేస్తున్నారు. అన్నట్టు రేపు 45వ బర్త్‌డే. రోమ్‌లోనే తన భర్త అభిషేక్ బచ్చన్, కూతురు ఆరాధ్య బచ్చన్‌లతో కలిసి గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకోబోతున్నారు. ఇక ఐష్ వర్క్ విషయానికొస్తే చివరిగా ఆమె ‘ఫ్యాన్నే ఖాన్’ చిత్రంలో నటించారు. కానీ ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయింది. ప్రస్తుతం ఐష్ మణిరత్నం దర్శకత్వంలో నటిస్తున్నారు. తమిళంలో తెరకెక్కుతున్న ‘పొన్నియిన్ సెల్వన్’ అనే చిత్రంలో విలన్ పాత్రలో నటిస్తున్నారు. ఇందులో ఆమె చోళా రాజ్య మహారాణి నందిని పాత్రను పోషిస్తున్నారు. ఐశ్వర్య భర్త పాత్రలో ప్రముఖ నటుడు మోహన్ బాబు నటించనున్నట్లు తెలుస్తోంది. ఆరాధ్య పెద్ద అవుతుండడంతో ఐష్ సినిమాలకు సమయం కేటాయించలేకపోతున్నారు. అందుకే నిదానంగా సినిమాలకు సంతకం చేస్తున్నారు. మణిరత్నం తెరకెక్కించని ‘ఇరువర్’ సినిమాతోనే ఐష్ తన కెరీర్‌ను ప్రారంభించారు కాబట్టి ఆయన తన సినిమాలో చేయమని అడగ్గానే కాదనలేకపోయారు. చాలా కాలం తర్వాత ఐష్‌ను తమిళ ప్రేక్షకులు వెండితెరపై చూడబోతున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/325cnPb
v

పెళ్లిళ్ల సీజన్ వచ్చేసింది.. నన్ను సంప్రదించండి అంటున్న స్టార్ హీరో

బాలీవుడ్ సూపర్‌స్టార్ అభిమానుల కోసం బంపర్ ఆఫర్ ప్రకటించాడు. పెళ్లిళ్ల సీజన్ వచ్చేసింది. నవంబర్‌లో బోలెడు ముహూర్తాలు ఉన్నాయని అంటున్నారు. మరి పెళ్లంటే సందడి ఏ రేంజ్‌లో ఉంటుందో మనం ఊహించుకోవచ్చు. ఇలాంటి అవసరాలు ఏమైనా ఉంటే నన్ను సంప్రదించండి అని అంటున్నాడు రణ్‌వీర్. ‘83’ సినిమా కోసం మీసం పెంచిన రణ్‌వీర్ షూటింగ్ అయిపోవడంతో గెడ్డం, మీసం తొలగించాడు. ఈ నేపథ్యంలో ఓ చక్కటి సెల్ఫీ దిగి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. కేవలం ఫొటో పోస్ట్ చేసి ఊరుకుంటే అతను రణ్‌వీర్ ఎందుకు అవుతాడు చెప్పండి. అందుకే ఓ ఫన్నీ క్యాప్షన్‌ను కూడా పెట్టాడు. ‘పెళ్లిళ్ల సీజన్ వచ్చేసింది. ఎంటర్‌టైనర్ ఫర్ హైర్. ఈవెంట్స్, వెడ్డింగ్స్, బర్త్‌డే పార్టీలు ఏమైనా ఉంటే నన్ను సంప్రదించండి’ అని పేర్కొన్నాడు. ఇందుకు వెంటనే రణ్‌వీర్ భార్య దీపిక పదుకోన్ ఇచ్చిన కామెంట్ అంతకంటే హైలైట్‌గా నిలిచింది. ‘బుకింగ్స్ కోసం నన్ను సంప్రదించండి’ అని పేర్కొన్నారు. రణ్‌వీర్ క్యాప్షన్‌పై ఎందరో సినీ ప్రముఖులు స్పందించారు. బాలీవుడ్ నటుడు అర్జున్ కపూర్ స్పందిస్తూ.. ‘నువ్వు చాలా చీప్’ అన్నాడు. అనుపమ్ ఖేర్ స్పందిస్తూ.. ‘ఫొటోలో నువ్వు ఇచ్చిన ఎక్స్‌ప్రెషన్ చూసి కూడా నిన్ను సంప్రదించాడంటే వాడికి ఎంతో గట్స్ ఉండి ఉండాలి’ అన్నారు. ప్రముఖ నిర్మాత ఏక్తా కపూర్ స్పందిస్తూ.. ‘మాకు పెళ్లికొడుకు కావాలి’ అని సరదాగా కామెంట్ చేశారు. ఇక వర్క్ విషయానికొస్తే.. లెజండరీ క్రికెటర్ కపిల్ దేవ్ కెప్టెన్‌గా ఉన్నప్పుడు 1983లో ఇండియా వరల్డ్ కప్ ఎలా సాధించింది అన్న నేపథ్యంలో ఓ సినిమా తెరకెక్కింది. ఈ సినిమాకు ‘83’ అనే టైటిల్‌ను పెట్టారు. ఇందులో రణ్‌వీర్ కపిల్ దేవ్ పాత్రలో నటించారు. కపిల్ భార్య రోమీ దేవ్ పాత్రలో రణ్‌వీర్ భార్య దీపిక పదుకోన్ నటించారు. వీరిద్దరి కాంబినేషన్‌లో రాబోతున్న ఐదో సినిమా ఇది. ఇటీవల దీపిక, రణ్‌వీర్ పెళ్లయ్యాక తొలిసారి దీపావళి వేడుకలు జరుపుకున్నారు. ప్రస్తుతం వీరు బోలెడు ప్రాజెక్ట్స్‌తో బిజీగా ఉన్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/32244DY
v

Sonu Nigam నా కాపురంలో నిప్పులు పోశాడు: గాయని

‘మీటూ’ ఉద్యమం వల్ల చిత్ర పరిశ్రమ బాగుపడుతుందని అందరూ ఆశించారు. కానీ ఎవరి పేర్లైతే బయటికి వచ్చాయో వారందరూ ఇప్పుడు సంతోషకరమైన జీవితాన్ని గడుపుతున్నారు. పలువురు దర్శకులు, ప్రొడ్యూసర్లు, నటులు, సింగర్ల పేర్లు బయటికి వచ్చాయి. వారిని పని నుంచి తొలగించారు కూడా. సరిగ్గా ఏడాది తర్వాత వారంతా మళ్లీ ఇండస్ట్రీలోకి వచ్చేశారు. దాంతో ఆరోపణలు చేసిన వారికి న్యాయం జరగకుండా పోయింది. బాధితుల్లో ప్రముఖ బాలీవుడ్ గాయని ఒకరు. సింగర్ అను మాలిక్‌పై ఆమె గతేడాది లైంగిక ఆరోపణలు చేశారు. దాంతో ఇండియన్ ఐడల్ అనే సింగింగ్ రియాల్టీ షోకి జడ్జ్‌గా వ్యవహరిస్తున్న అను మాలిక్‌ను వెంటనే షో నుంచి తొలగించారు. ఏడాది తర్వాత ఆయన్ను మళ్లీ షోలోకి ఆహ్వానించారు. దాంతో సోనా చేసిన ప్రయత్నంగా వేస్ట్ అయిపోయింది. దీనిపై ఓ నెటిజన్ స్పందిస్తూ తన బాధను వ్యక్తం చేశారు. ‘ఇండియన్ ఐడల్ షోలో అను మాలిక్ ఉన్నాడు. అతను సోనా మొహాపాత్రను లైంగికంగా వేధించాడు. షో నుంచి తొలగించాక మళ్లీ ఏడాది తర్వాత అదే షోలో జడ్జ్‌గా కూర్చోవడం నన్ను షాక్‌కు గురిచేసింది. ఎంతో ధైర్యంతో తాము ఎదుర్కొన్న వేధింపుల గురించి బయటపెట్టిన నటీమణులు, ఫీమేల్ సింగర్ల ప్రయత్నం వేస్ట్ అయిపోయింది’ అని పేర్కొన్నాడు. దీనిపై సోనా మొహాపాత్ర స్పందిస్తూ.. ‘దీనంతటికీ కారణం సోనూ నిగమ్. అను మాలిక్‌కు కావాల్సినంత పబ్లిసిటీ కల్పించాడు. అను మాలిక్ కూడా ఓ తల్లికి బిడ్డే అని నేరం రుజువు అయ్యేంతవరకు ఆయన్ను జడ్జ్‌గా ఉండనివ్వాలని అన్నాడు. దాంతో షో నిర్వాహకులు మళ్లీ అను మాలిక్‌ను నియమించుకున్నారు. సోనూ ఇంతటితో ఆగలేదు. నా కాపురంలో నిప్పులు పోశాడు. నా భర్తకు నా గురించి లేనిపోనివి చెప్పాడు. నన్ను టెర్రరిస్ట్ అన్నాడు. నాపై ఓ కన్నేసి ఉంచాలని నా భర్తకు లేనిపోనివి నూరిపోశాడు. ఇప్పుడు అతని కళ్లు చల్లబడి ఉంటాయి’ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తనలాంటి బాధితులకు న్యాయం జరగాలంటే ఇండియాలో మరో నిర్భయ ఘటన జరగాలేమోనని సోనా బాధపడ్డారు. బాధితురాలైన తనకు పని లేకుండా పోయిందని, తనను వేధించినవాడు మాత్రం ఎంతో సంతోషంగా డబ్బులు సంపాదించుకుంటూ ఎంజాయ్ చేస్తున్నాడని అన్నారు. రేప్ చేస్తున్నప్పుడు, లైంగికంగా వేధిస్తున్నప్పుడు ఆడపిల్లలు ప్రూఫ్‌లు కలెక్ట్ చేస్తూ ఉండాలని ఈ వెధవల అభిప్రాయమని మండిపడ్డారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2JEqLrA
v

I Am Sorry Full Video Song || RDXLove


I Am Sorry Full Video Song || RDXLove

from BharatStudent - Telugu - Actor Actress|Photo,Picture Galleries|Wallpapers|Screensavers|Movie Trailers|Film News and Gossips https://ift.tt/338cnzC

అలనాటి మేటి నటి గీతాంజలి గుండెపోటుతో కన్నుమూత

సీనియర్‌ నటి గీతాంజలి గురువారం కన్నుమూశారు. గుండెపోటుతో హైదరాబాద్‌ ఫిలింనగర్‌లోని అపోలో ఆస్పత్రిలో ఆమె చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. తెలుగుతోపాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ చిత్రాల్లోనూ నటించిన గీతాంజలి.. ఎన్టీఆర్‌ దర్శకత్వంలో ఆయనే కథానాయుడిగా నటించిన సీతారాముల కళ్యాణం ద్వారా వెండితెరకు పరిచమయ్యారు. అన్ని భాషల్లోనూ 500కు పైగా చిత్రాల్లో నటించారు. కలవారి కోడలు, డాక్టర్‌ చక్రవర్తి, లేతమనసులు, బొబ్బిలియుద్ధం, ఇల్లాలు, దేవత, గూఢచారి116, కాలం మారింది, శ్రీ శ్రీ మర్యాదరామన్న, నిర్దోషి, మాయాజాలం, గ్రీకువీరుడు తదితర చిత్రాల్లో నటించారు. తొలి చిత్రం సీతారాముల కళ్యాణంలో గీతాంజలి నటనకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ఆమె ఎన్టీఆర్‌కు పోటీగా నటించి మెప్పించారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో శ్రీరామమూర్తి, శ్వామసుందరి దంపతులకు జన్మిం. కాకినాడలోని సెయింట్ జోసెఫ్ కాన్వెంటులో కొన్నేళ్లు చదివిన గీతాంజలి. మూడేళ్ల వయసు నుంచే గీతాంజలి తన అక్క స్వర్ణతో పాటు గంధర్వ నాట్యమండలిలో లక్ష్మారెడ్డి, శ్రీనివాసన్ ల వద్ద నాట్యం నేర్చుకున్నారు. నాలుగో ఏట నుంచి అక్కతో కలిసి నాట్య ప్రదర్శనలు ప్రారంభించారు. గీతాంజలి అసలు పేరు మణి. 1963లో పారస్‌మణి అనే హిందీ చిత్రంలో నటిస్తుండగా ఆ చిత్ర నిర్మాతలు లక్ష్మీకాంత్-ప్యారేలాల్ సినిమా టైటిల్లోనూ మణి ఉంది కాబట్టి ఈమెకు గీతాంజలి అని పేరు సూచించారు. ఆ పేరు సినీరంగంలో అలానే స్థిరపడిపోయింది. సహనటుడు రామకృష్ణతో వివాహం తర్వాత సినిమాలకు కొంత విరామం ఇచ్చారు. క్యారక్టర్‌ ఆర్టిస్ట్‌గా మారిన ఆమె పెళ్లైన కొత్తలో,మాయాజాలం, భాయ్‌, గ్రీకువీరుడు తదితర చిత్రాల్లో నటించారు. గీతాంజలి చివరి చిత్రం తమన్నా కథానాయికగా రూపొందుతున్న దటీజ్‌ మహాలక్ష్మి. రాజకీయాల్లోకి వచ్చిన గీతాంజలి 2009 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల సమయంలో తెలుగుదేశం పార్టీలో చేరారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/36kgeeU
v

నన్ను ‘అక్క’ అని పిలవడం కష్టమే.. సారీ బోయ్స్: అనసూయ

అనసూయ పేరు చెబితే మనకు ముందుగా గుర్తొచ్చే పాత్ర రంగమ్మత్త. ‘రంగస్థలం’లో అనసూయ చేసిన ఈ పాత్ర ఆమె కెరీర్‌లో ది బెస్ట్‌గా నిలుస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. నిజం చెప్పాలంటే అనసూయ ఎక్కడికెళ్లినా, ఏ కార్యక్రమంలో పాల్గొన్నా అక్కడికొచ్చే అభిమానులు రంగమ్మత్త అనే పిలుస్తారు. కానీ, ఇప్పుడు అనసూయను ‘అక్క’ అని పిలవాల్సి వస్తుందట. కుర్రాళ్లు తనను అలా పిలవడం కష్టమేనన్న అనసూయ.. ఈ విషయంలో తన అభిమానులకు సారీ చెప్పారు. ఈ ఆసక్తికర సన్నివేశానికి ‘మీకు మాత్రమే చెప్తా’ ప్రీ రిలీజ్ వేడుక వేదికైంది. Also Read: విజయ్ దేవరకొండ నిర్మాతగా తరుణ్ భాస్కర్ హీరోగా షమీర్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘మీకు మాత్రమే చెప్తా’ సినిమాలో అనసూయ ఒక ముఖ్య పాత్ర పోషించారు. అది అక్క పాత్ర అని అనసూయ స్వయంగా చెప్పారు. చాలా స్ట్రిక్ట్‌గా ఉండే అక్క పాత్రట. అందుకే, ఇప్పటి వరకు అత్తగా తనను చూసిన ఈ కుర్రాళ్లు సడెన్‌గా అక్క అంటే జీర్ణించుకోగలరా అని అనసూయ వేదికపై అన్నారు. నిజం చెప్పాలంటే అనసూయ మాట్లాడటానికి వేదికపై వచ్చిన వెంటనే గోల మొదలైంది. అస్సలు ఆమెను మాట్లాడనివ్వకుండా ఒకటే అరుపులు, కేకలు. Also Read: ఇంకేముంది.. అనసూయను ఆపలేం కదా. ఆ అభిమానాన్ని చూసి ఆకాశానికి ఎక్కేశారు. ‘నన్ను టీజ్ చేస్తున్నారా, ర్యాగింగ్ చేస్తున్నారా’ అంటూ సరదాగా నవ్వుతూ అన్నారు. ‘‘మీ ఫేవరేట్ రౌడీ గురించి ఈ సినిమా చూస్తారని నాకు తెలుసు. మీరు ఊహించిన దానికి మించి ఈ సినిమాటో ఎంటర్‌టైన్మెంట్ ఉంటుంది. నవంబర్ 1 నుంచి థియేటర్లలో ఈ సినిమాను చూడండి. మీకన్నా ఒక్కరోజు ముందు నేను సినిమా చూసేస్తా’’ అంటూ చిన్న పిల్లలా భుజాలు ఎగరేశారు అనసూయ.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2NsLiAr
v

నిత్యా మీనన్‌కు పెళ్లయిపోయిందా.. అందుకే ‘శ్రీమతి’ అని రాశారా?

దక్షిణాదిలో ఉన్న టాలెంటెడ్ హీరోయిన్లలో ఒకరు. కాస్త ఎత్తు తక్కువై ఆమెకు అవకాశాలు తగ్గాయి కానీ.. లేదంటే సౌత్‌లోని అన్ని సినీ ఇండస్ట్రీలలో ఆమెకు స్టార్ హీరోయిన్ హోదా దక్కేది. అయినప్పటికీ ఆమెకున్న ఫ్యాన్ ఫాలోయింగ్ తక్కువేమీ కాదు. తెలుగులోనూ నిత్యా మీనన్‌ను ఇష్టపడే వాళ్లు చాలా ఎక్కువే. ‘అలా మొదలైంది’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ కన్నడ బ్యూటీ ఆ తరవాత అన్నీ మంచి మంచి పాత్రలే చేశారు. గ్లామర్‌ రోల్స్ కాకుండా నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలను ఎంపిక చేసుకున్నారు. ఈ మధ్య ‘గీత గోవిందం’, ‘ఎన్టీఆర్ కథానాయకుడు’ చిత్రాల్లో కనిపించారు. కాగా, ప్రస్తుతం ఆమె తమిళనాడు దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలిత బయోపిక్‌‌లో నటిస్తున్నారు. ‘ది ఐరన్ లేడీ’ టైటిల్‌తో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో జయలిలత పాత్రను పోషిస్తున్నారు. ఇప్పటికే ఫస్ట్‌లుక్ కూడా విడుదలైంది. అయితే.. ఈ సినిమాను, జయలలితను ప్రస్తావిస్తూ ఓ ప్రముఖ తమిళ దినపత్రిక కథనాన్ని ప్రచురించింది. ఈ కథనంలో ‘శ్రీమతి నిత్యా మీనన్’ అని పేర్కొంది. దీంతో రచ్చ మొదలైంది. సాధారణంగా పెళ్లైన మహిళలనే శ్రీమతి అంటారు. కానివాళ్లను కుమారి అంటారు. కాబట్టి, ఆ దినపత్రిక శ్రీమతి అని పేర్కొంది కనుక నిత్యా మీనన్‌కు పెళ్లయిపోయిందని ప్రచారం చేస్తున్నారు. Also Read: వాస్తవానికి దక్షిణాదిలో ప్రముఖ హీరోయిన్లు అయిన రాధికా ఆప్టే, శ్రియ, ఇలియానా రహస్య వివాహాలు చేసుకున్నారు. తమ బాయ్‌ఫ్రెండ్స్‌ను పెళ్లిచేసేసుకున్న తరవాత కొన్నాళ్లకు ప్రకటించారు. ఇలియానా అయితే పెళ్లిచేసుకుని విడాకులు కూడా తీసేసుకుంది. కాబట్టి, నిత్యా మీనన్ విషయంలో అలా ఎందుకు జరగకూడదు అని ప్రశ్నిస్తున్నారు. ఆమెకు ఇప్పటికే పెళ్లికాకపోతే శ్రీమతి అని ఎందుకు రాస్తారు అని వైరల్ చేస్తున్నారు. టెలివిజన్ ప్రొడ్యూసర్, డైరెక్టర్ అయిన ఆలివర్ మాక్ కల్హౌన్‌తో దిగిన ఫొటోలను ఇప్పటికే నిత్యా మీనన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆనెనెస్ యూనివర్సిటీలో చదువుకునేటప్పుడు ఆలివర్ తనకు మంచి మిత్రుడని చెప్పకనే చెప్పారు. దీంతో నిత్య పెళ్లిపై ఇప్పుడు అనుమానాలు మరింత ఎక్కువయ్యాయి. చూద్దాం ఈ పెళ్లి రూమర్‌గా మిగిలిపోతుందో.. లేకపోతే రాధికా ఆప్టే, శ్రియ మాదిరిగా నిత్యా మీనన్ ఏమైనా షాకింగ్ అనౌన్స్‌మెంట్ చేస్తారో..!


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/321YHEK
v

‘భాస్కర్ ఒక రాస్కల్’ అంటున్న అమలాపాల్

మలయాళ భామ అమలాపాల్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. ‘బెజవాడ’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన అమలాపాల్.. రామ్ చరణ్ ‘నాయక్’ సినిమాలో నటించి అందరినీ ఆకర్షించింది. ఆ వెంటనే బన్నీ సరసన ‘ఇద్దరమ్మాయిలతో’ చిత్రంలో ఆడిపాడింది. ఆ తరవాత ఆమె తెలుగులో చెప్పుకోదగిన సినిమా చేయలేదు. ఇప్పుడు ‘లస్ట్ స్టోరీస్’ తెలుగు రీమేక్‌లో అమలాపాల్ ప్రధాన పాత్ర పోషిస్తోంది. ఇదిలా ఉంటే, రెండేళ్లుగా తెలుగు ప్రేక్షకులకు ముఖం చూపించని అమలాపాల్ ఇప్పుడు ఒక తమిళ అనువాద చిత్రంతో వస్తోంది. అరవిందస్వామి, అమలాపాల్ ప్రధాన పాత్రలలో దర్శకుడు సిద్ధికీ తెరకెక్కించిన తమిళ చిత్రం ‘భాస్కర్ ఒరు రాస్కల్’. ఈ సినిమా ఇప్పడు తెలుగులో ‘భాస్కర్ ఒక రాస్కల్’ పేరుతో రాబోతోంది. కార్తికేయ మూవీస్ పతాకంపై పఠాన్ చాన్ బాషా అందిస్తున్న ఈ చిత్రం నవంబర్ నెలలో విడుదల కానుంది. ఈ విషయాన్ని బుధవారం అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్భంగా నిర్మాత పఠాన్ చాన్ బాషా మాట్లాడుతూ.. ‘‘ఇదే చిత్రాన్ని తొలుత మలయాళంలో మమ్ముట్టి, నయనతార జంటగా దర్శకుడు సిద్ధికీ రూపొందించారు. అక్కడ విజయం సాధించడంతో మళ్లీ తన దర్శకత్వంలోనే నటీనటుల మార్పుతో తమిళంలో తెరకెక్కించారు. తమిళంలో కూడా ఈ చిత్రానికి ప్రేక్షక ఆదరణ లభించడంతో తెలుగులో విడుదల చేసేందుకు పూనుకున్నాను. తోడు లేని ఇద్దరు వ్యక్తులు ఎలా కలిశారు.. వారు అలా కలిసేందుకు ఇద్దరు పిల్లలు ఎలాంటి ప్రయత్నం చేసారు అన్న ఆసక్తి దాయకమైన ఇతివృత్తంతో ఆద్యంతం హాస్య ప్రధానంగా ఈ చిత్రం ఉంటుందని. ఊహించని ఓ ట్విస్ట్ ప్రేక్షకులను ఎంతగానో అలరింప చేస్తుంది’’ అని అన్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2JAlukB
v

నా వంపులు దాచుకోలేదు, చూస్తే చూడండి లేకపోతే లేదు: సోనాక్షి సిన్హా

హీరోయిన్ అంటే సన్నగానే ఉండాలా? కాస్త లావుంటే అస్సలు చూడరా? లావుగా ఉన్నా అందం, నైపుణ్యం ఉండాలే కానీ ఎందుకు చూడరు. ఈ మూడు కలగలిపిన నటీమణులు మన తెలుగు చిత్ర పరిశ్రమలో తక్కువే. కానీ బాలీవుడ్‌లో సోనాక్షి సిన్హా, జరీన్ ఖాన్ లాంటి ఎందరో హీరోయిన్లు ఉన్నారు. వారంతా తమ బరువునే అందంగా మార్చుకుంటున్నారు. అలనాటి నటుడు శత్రుఘ్న సిన్హా కూతురు అయిన 2010లో వచ్చిన ‘దబాంగ్’ సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు. ఆమె కాస్త లావు ఉన్నప్పటికీ ప్రేక్షకుల మన్ననలు పొందారు. ఆ తర్వాత ఎన్నో సినిమాల్లో నటించే అవకాశం దక్కించుకున్నారు. బాలీవుడ్‌లో అవకాశాలు వస్తున్న కొద్దీ సోనాక్షికి ఫ్యాన్స్‌తో పాటు ట్రోల్స్ చేసేవారు కూడా పెరిగిపోయారు. ఇందుకు కారణం ఆమె కాస్త లావుగా ఉండటమే. ఓసారి సోనాక్షి అందంగా తయారై చక్కటి ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ ఫొటోపై కొందరు సానుకూలంగా స్పందిస్తే.. మరికొందరు మాత్రం ‘ఏనుగుకి మేకప్ వేసినట్లుంది’ అని కామెంట్ చేశారు. దాంతో చాలా రోజుల పాటు సోనాక్షి ఎంతో బాధపడ్డారు. ఆ తర్వాత అనేవారు అంటూనే ఉంటారని పట్టించుకోవడం మానేశారు. అయితే సోనాక్షి ఈ మధ్యకాలంలో కాస్త బరువు కూడా తగ్గారు. అయినప్పటికీ తనపై కామెంట్లు చేయడం మానలేదట. అలాంటివారందరికీ బుద్ధి చెప్పడానికి సోనాక్షి సోషల్ మీడియాలో ఓ వీడియో పోస్ట్ చేశారు. ‘ఇప్పుడు మనం ఏనుగు గురించి మాట్లాడుకుందాం. మీరంతా నన్ను అలాగే ఎగతాళి చేసేవారు కదా. కొన్నేళ్ల పాటు మీరు నా బరువుపై కామెంట్లు చేశారు. కానీ ఎప్పుడూ రియాక్ట్ అవ్వకూడదని అనుకున్నాను. ఎందుకంటే ఏనుగు అన్ని జంతువుల్లో పెద్దది. ట్రోల్స్ చేసేవారంతా మన మూడ్‌ని కూడా నరకం చేసేస్తారు. వారందరికీ వేరే పని లేక ఇతరులను ఎగతాళి చేస్తుంటారు. కాబట్టి వారు నోటికొచ్చినట్లు వాగుతుంటారు. ఇదివరకు వారి కామెంట్స్‌కు మనకు కోపం వచ్చేది. బాధపడేదాన్ని. కానీ ఇప్పుడు వారు ఓ జోక్ అయిపోయారు. విని నవ్వుకోవడం తప్ప ఇంకేం చేయలేం. ఆ తర్వాత నేను 30 కిలోలు బరువు తగ్గాను. అయినా కూడా నాపై కామెంట్లు చేయడం మానలేదు. వారి చావు వారే చస్తారు అని వదిలేశాను. నేను ఇండస్ట్రీలో నాకంటూ గుర్తింపు తెచ్చుకోవడానికి వచ్చాను. తెచ్చుకున్నాను కూడా. నా శరీరం గురించి నేను దాచుకోవాల్సింది ఏమీ లేదు. నా నడుం సైజ్, వంపులు, నా బరువు ఇవేవీ నేను దాచుకోలేదు. ఎందుకంటే కొలవడానికి నేను స్కేల్‌ని కాను. ఆడపిల్లని’ అని వెల్లడించారు సోనాక్షి.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2MXytPA
v

‘తెరి’ రీమేక్.. రవితేజ సరసన శృతిహాసన్

దళపతి విజయ్ హీరోగా అట్లీ దర్శకత్వంలో వచ్చిన సూపర్ హిట్ తమిళ చిత్రం ‘తెరి’. 2016లో విడుదలైన ఈ సినిమాను ‘పోలీస్’ పేరుతో తెలుగులో అనువాదం చేసి కూడా విడుదల చేశారు. అయితే, అప్పటికి విజయ్‌కు తెలుగు రాష్ట్రాల్లో అస్సలు మార్కెట్ లేదు. దీంతో, చాలా మందికి ఈ సినిమా గురించి తెలీలేదు. అందుకని, ఈ సినిమాను ఇప్పుడు తెలుగులో రీమేక్ చేస్తున్నారు. అది కూడా మాస్ మహారాజా రవితేజ హీరోగా. ఈ సినిమాకు గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్నారు. బి. మధు నిర్మిస్తున్నారు. ఇది రవితేజకు 66వ చిత్రం. Also Read: ఇదిలా ఉంటే, ఈ సినిమాలో హీరోయిన్‌గా శృతిహాసన్‌ను ఖరారు చేశారు. ఈ మేరకు దర్శకుడు గోపీచంద్ మలినేని ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ‘బలుపు’ తరవాత రవితేజ, శృతిహాసన్, గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో వస్తున్న రెండో సినిమా ఇది. వాస్తవానికి ‘తెరి’లో సమంత, అమీ జాక్సన్ హీరోయిన్లుగా నటించారు. మరి తెలుగులో కూడా ఇద్దరు హీరోయిన్లు ఉన్నారా? లేదంటే శృతిహాసన్ ఒక్కరేనా అనే విషయం తెలియాల్సి ఉంది. కాగా, ప్రస్తుతం రవితేజ ‘డిస్కోరాజా’ సినిమాతో బిజీగా ఉన్నారు. విఐ ఆనంద్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సైంటిఫిక్ థ్రిల్లర్‌లో పాయల్ రాజ్‌పుత్, నభా నటేష్, తాన్యా హోప్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఎస్‌ఆర్‌టీ ఎంటర్‌టైన్మెంట్స్ పతాకంపై రామ్ తాళ్లూరి నిర్మిస్తున్నారు. థమన్ సంగీతం సమకూరుస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో శరవేగంగా జరుగుతోంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2Pzdynx
v

గర్భం దాల్చావ్, నీ భర్త ఎక్కడ అని అడుగుతున్నారు: నటి

బాలీవుడ్ నటి పెళ్లికి ముందే ఓ బిడ్డకు జన్మనివ్వబోతున్నారు. మరికొన్ని నెలల్లో కల్కి పండంటి బిడ్డకు జన్మనిస్తారు. ప్రస్తుతం తన ప్రెగ్నెన్సీ లైఫ్‌ను ఎంజాయ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా తన వ్యక్తిగత విషయాల గురించి, ప్రస్తుతం చేస్తున్న సినిమాల గురించి కల్కి ఓ ఆంగ్ల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. ‘నా ప్రెగ్నెన్సీ గురించి ఎవ్వరికీ తెలీకూడదు అనుకున్నాను. ఈ విషయం నా మేకప్ మ్యాన్‌కు మాత్రమే తెలుసు. సెట్‌లో ఎవ్వరికీ ఈ విషయం చెప్పకూడదు అనుకున్నాను. నా మేకప్ మ్యాన్ నన్ను జాగ్రత్తగా చూసుకున్నాడు. ఆ తర్వాత రోజులు గడిచే కొద్ది పొట్ట పెరుగుతూ వచ్చింది. డ్రెస్సులు పట్టడంలేదు. దాంతో ఎలాస్టిక్ దుస్తులు వేసుకోవడం ప్రారంభించా. ఇక నాలుగో నెల రాగానే నేను చెప్పకపోయినా అందరికీ ఈ విషయం తెలిసిపోతుంది. అందుకే నేనే చెప్పాలనుకున్నాను. నా ఇండస్ట్రీ ఫ్రెండ్స్ అంతా చాలా హ్యాపీగా ఫీలయ్యారు. కానీ సోషల్ మీడియా ట్రోల్స్‌ని మాత్రం తట్టుకోలేకపోయా. నీ భర్త ఎక్కడ? ఎప్పుడు గర్భం దాల్చావ్? ఇలాంటి దుస్తులు వేసుకోకు అంటూ ప్రశ్నలు వేసేవారు. నేను ప్రెగ్నెంట్ అయ్యాయని తెలిసి నా బాయ్‌ఫ్రెండ్ చాలా హ్యాపీగా ఫీలయ్యాడు’ ‘ మొదటి నెలలో ఏమీ తినలేకపోయేదాన్ని. ఆ తర్వాత బేబీ కోసం కష్టపడి తినడం నేర్చుకున్నాను. గర్భం దాల్చినా కూడా నేను వర్క్ నుంచి దూరంగా ఉండాలనుకోలేదు. ఎందుకంటే ఇంట్లో ఉంటే డిప్రెస్ అయిపోతాను. నేనెప్పుడూ బిజీగా ఉండాలనుకునే వ్యక్తిని. అందుకే మొదటి మూడు నెలలు షూటింగ్‌లో బిజీగా గడిపాను. ఇప్పుడు ఎటూ అందరికీ తెలిసిందే కాబట్టి నాకు సినిమాల్లో అవకాశాలు ఇస్తున్నారు. కాకపోతే నేనే ఆలోచించి మరీ స్క్రిప్ట్స్ ఎంచుకుంటున్నాను. ఇక నాకు పుట్టబోయే బిడ్డ విషయానికొస్తే ఇప్పటికే మేం ఓ పేరును అనుకుంటున్నాం. ఆ పేరు పాపకి బాబుకి సరిగ్గా సరిపోతుంది’ ‘కానీ ఆ పేరు ఇప్పుడే చెప్పదలచుకోలేదు. నేను బేబీ కోసం కొత్త డ్రెసెస్ కొనాలని అనుకోవడం లేదు. ఎందుకంటే నా చిన్నప్పటి దుస్తులను మా అమ్మ దాచి ఉంచింది. అవి చాలా సాఫ్ట్‌గా ఉంటాయి. నా బేబీకి కూడా అవే వాడాలని అనుకుంటున్నాను. పెళ్లికి ముందే పిల్లల్ని కనడం అంటే ఇప్పటికీ సమాజం ఓ తప్పుగా భావిస్తుంది. నా ఇంట్లోవారికి నా పక్కింటి వారికి నేనుంటున్న కాలనీ మొత్తానికి నాకు పెళ్లి కాలేదని తెలుసు. కానీ వాళ్లెప్పుడూ నన్ను వేలెత్తి ప్రశ్నించింది లేదు. ఈ ఆలోచనా విధానం మారాలి. కామెంట్ చేసేవాళ్లు మనం ఎంత మంచివాళ్లమైనా చేస్తూనే ఉంటారు. అలాంటి సమాజం కోసం మనం మనల్ని మార్చుకోవాల్సిన అవసరం లేదు. మన ఇష్టాలను చంపుకోవాల్సిన అసవరం లేదు’ అని వెల్లడించింది కల్కి.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2NspWTT
v

నాగబాబు బర్త్‌డేను సెలబ్రేట్ చేసిన వరుణ్, నిహారిక.. మెగా ఫ్యామిలీ సందడి

మెగా బ్రదర్ నాగబాబు పుట్టినరోజు వేడుక హైదరాబాద్‌లోని పార్క్ హయత్ హోటల్‌లో ఘనంగా జరిగింది. తండ్రి నాగబాబు బర్త్‌డేను వరుణ్ తేజ్, నిహారికా గ్రాండ్‌గా సెలబ్రేట్ చేశారు. మంగళవారం రాత్రి జరిగిన ఈ వేడుకలో మెగా ఫ్యామిలీ మెంబర్స్ అంతా పాల్గొన్నారు. చిరంజీవి-సురేఖ, రామ్ చరణ్-ఉపాసన, అల్లు అర్జున్-స్నేహా, కళ్యాణ్ దేవ్-శ్రీజ దంపతులు సహా కొణిదెల, అల్లు కుటుంబాలకు చెందిన సభ్యులంతా హాజరయ్యారు. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. Also Read: కాగా, 1961 అక్టోబర్ 29న పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరులో జన్మించిన నాగబాబు నిన్నటితో 58 సంవత్సరాలు పూర్తిచేసుకుని 59వ ఏట అడుగుపెట్టారు. అన్నయ్య చిరంజీవి టాలీవుడ్‌లో స్టార్ హీరోగా మారిన రోజుల్లోనే నాగబాబు కూడా నటుడిగా తెరంగేట్రం చేశారు. చిరంజీవి హీరోగా నటించిన ‘రాక్షసుడు’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు నటుడిగా నాగబాబు పరిచయం అయ్యారు. ఆ తరవాత వరుసగా చిరంజీవి సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేశారు. అక్కడి నుంచి చాలా సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగానూ మెప్పించారు. నటుడిగానే కాకుండా నిర్మాతగానూ నాగబాబు టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్నారు. అంజనా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సోదరులు చిరంజీవి, పవన్ కళ్యాణ్‌తో సినిమాలు చేశారు. అయితే, ‘ఆరెంజ్’ సినిమా నాగబాబుకు కోలుకోలేని దెబ్బ కొట్టింది. ఆ తరవాత ఆయన మరో సినిమాను నిర్మించలేకపోయారు. ప్రస్తుతం ఆయన తనయుడు వరుణ్ తేజ్ హీరోగా రాణిస్తున్నారు. మరోవైపు, నాగబాబు ‘జబర్దస్త్’ కామెడీ షోతో బుల్లితెర ప్రేక్షకులకు బాగా దగ్గరైపోయారు. Also Read: ఇదిలా ఉంటే, మంగళవారం తన తండ్రి నాగబాబు పుట్టినరోజును పురష్కరించుకుని ట్విట్టర్ ద్వారా వరుణ్ తేజ్ శుభాకాంక్షలు తెలిపారు. ‘‘పుట్టినరోజు శుభాకాంక్షలు నాన్న. నీ ముఖంలో చిరునవ్వు కోసం నేను ఏమైనా చేస్తాను. నాకు అద్భుతమైన జీవితాన్ని ఇచ్చిన నీకు కృతజ్ఞతలు. నీకన్నా ఇష్టమైనది నాకు ఏమీ లేదు’’ అని వరుణ్ ట్వీట్‌లో పేర్కొన్నారు. అలాగే, నిహారిక కూడా తండ్రికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. తండ్రి నుదిటిపై ప్రేమగా ముద్దుపెడుతున్న ఫొటోను కూడా ట్వీట్ చేశారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/34cQGOQ
v

Amitabh Bachchan ఇంట్లో అపశృతి, షారుక్ ఖాన్‌కి గాయాలు

బాలీవుడ్ మెగాస్టార్ ఇంట్లో అపశృతి చోటు చేసుకుంది. దాదాపు మూడేళ్ల తర్వాత అమితాబ్ ముంబయిలోని తన నివాసంలో ఇటీవల దీపావళి వేడుకలు నిర్వహించారు. బాలీవుడ్‌కి చెందిన ఎందరో అతిరథమహారథులు వేడుకకు హాజరయ్యారు. ఐశ్వర్య రాయ్‌ వద్ద మేనేజర్‌గా పనిచేసిన అర్చనా సదానంద్ అనే యువతి కూడా వేడుకకు వెళ్లింది. అయితే ఆమె లెహంగా దీపాల మధ్య చిక్కుకుని మంటలు అంటున్నాయి. అక్కడే ఉన్న షారుక్ ఖాన్ వెంటనే అప్రమత్తమై మంటలు అదుపు చేశారు. అర్చన చేతికి కాలికి 15 శాతం గాయాలయ్యాయి. ఆమెను వెంటనే దగ్గర్లోని లీలావతి హాస్పిటల్‌కు తరలించారు. ఎలాంటి ఇన్‌ఫెక్షన్స్ రాకుండా ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు. అర్చనను కాపాడుతున్న క్రమంలో షారుక్‌‌కి కూడా స్వల్పంగా గాయాలయ్యాయి. అర్థరాత్రి 3 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగిందట. ఆ సమయంలో షారుక్ అమితాబ్ వద్దే ఉన్నారు. అర్చన తన కుమార్తెతో కలిసి గార్డెన్‌లో ఉన్నప్పుడు అక్కడే ఉన్న దీపాల్లో ఆమె లెహెంగా పడిందట. దాంతో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. ఆమె కేకలు వేస్తుంటే అక్కడున్న మిగతా గెస్ట్‌లు ఏం చేయాలో అర్థం కాక చూస్తూ నిలబడ్డారట. షారుక్ పరుగులు తీసి ఆమె వద్దకు వెళ్లి తన జాకెట్ తీసి మంటలు ఆర్పేందుకు యత్నించాడు. ఆమెను కాపాడి రియల్ లైఫ్‌లోనూ హీరో అని నిరూపించాడు. ఇంత జరిగినా కూడా అమితాబ్ మీడియా ముందుకు వచ్చి ఏమీ స్పందించలేదు. గతంలో ప్రతీ దీపావళికి అమితాబ్ తన నివాసంలో గ్రాండ్‌గా వేడుకలు ఏర్పాటుచేసేవారు. కానీ ఈ మధ్యకాలంలో ఆయనకు ఒంట్లో బాగుండటం లేదు. అదీకాక ఎవరైనా ప్రముఖులు చనిపోయినప్పుడు కానీ ఏదన్నా ప్రమాదం జరిగినా కానీ అమితాబ్ వేడుకలు నిర్వహించరు. దాదాపు మూడేళ్ల తర్వాత ఈ ఏడాదిలో అమితాబ్ ఈ వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. బాలీవుడ్ ప్రముఖులతో పాటు రిలయన్స్ సంస్థల అధినేత ముఖేష్ అంబానీ, నీతూ అంబానీలు కూడా హాజరయ్యారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/36hYArZ
v

రామ్ ‘రెడ్’ మూవీ ఓపెనింగ్.. పూరి, ఛార్మి హంగామా

ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘రెడ్’. తిరుమల కిషోర్ దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీ స్రవంతి మూవీస్ బ్యానర్‌పై ‘స్రవంతి’ రవికిషోర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మణిశర్మ సంగీతం సమకూరుస్తున్నారు. పీటర్ హెయిన్స్ యాక్షన్ సీన్స్ డైరెక్ట్ చేయనున్నారు. దీపావళి సందర్భంగా సోమవారం ఈ సినిమాను అధికారికంగా ప్రకటించారు. నిన్న టైటిల్, ఫస్ట్‌లుక్ పోస్టర్లను విడుదల చేశారు. ఈరోజు (అక్టోబర్ 30న) సినిమాను లాంఛనంగా ప్రారంభించారు. Also Read: ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకోవడమే కాకుండా మళ్లీ ఫుల్ ఫామ్‌లోకి వచ్చిన రామ్.. తనతో ‘నేను శైలజ’, ‘ఉన్నది ఒక్కటే జిందగీ’ వంటి క్లాసికల్ మూవీస్ తీసిన తిరుమల కిషోర్‌ను నమ్ముకున్నారు. అయితే, పోస్టర్లు చూస్తుంటే ఇది మంచి మాస్ మూవీలా అనిపిస్తోంది. అందుకే, ఈ సినిమా ఓపెనింగ్‌కు మాస్ డైరెక్టర్ పూరి జగన్నాథ్‌కు అతిథిగా తీసుకొచ్చారు రామ్. ముహూర్తపు సన్నివేశానికి ఛార్మితో కలిసి పూరి జగన్నాథ్ తొలి క్లాప్ కొట్టారు. ఈ సమయంలో ఛార్మి అరుపులు, కేకలతో హంగామా చేశారు. ఆ తరవాత పూరి, ఛార్మిలను రామ్ ఆప్యాయంగా హత్తుకున్నారు. ఇదిలా ఉంటే, ‘రెడ్’ సినిమా నవంబర్ 16 నుంచి సెట్స్‌పైకి వెళ్లనుంది. నాన్ స్టాప్‌గా షూటింగ్ జరిపి ఏప్రిల్ తొలివారంలో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నామని నిర్మాత ‘స్రవంతి’ రవికిషోర్ చెప్పారు. తమ బ్యానర్‌లో ఇదొక విభిన్నమైన చిత్రం అవుతుందని తెలిపారు. ఇది తమిళ చిత్రం ‘తదమ్’కు రీమేక్ అనే వార్తలు వస్తున్నాయి. దీనిపై రవికిషోర్ స్పందిస్తూ.. పూర్తి రీమేక్ కాదని, స్టోరీ లైన్‌ను తీసుకొని చాలా మార్పులు చేశామని అన్నారు. సినిమా టైటిల్ మాదిరిగానే కథ, కథనం కూడా చాలా కొత్తగా ఉంటాయని దర్శకుడు తిరుమల కిషోర్ వెల్లడించారు. ఇదొక కమర్షియల్ థ్రిల్లర్ అని చెప్పారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2pt9LO3
v

సముద్రంలో ‘సాగరకన్య’.. కొడుక్కి పాఠాలు నేర్పుతోంది

బాలీవుడ్ బ్యూటీ వెండితెరకు దూరమైనప్పటికీ తన జీరో సైజ్ ఫిగర్‌తో, యోగా వీడియోలతో, వంటలతో సోషల్ మీడియాలో సందడి చేస్తూనే ఉంటారు. ఓ బిడ్డకు తల్లైన శిల్ప ఇప్పటికీ సెక్సీ బాడీతో ఫ్యాన్స్‌ని షాక్‌కు గురిచేస్తున్నారు. ప్రస్తుతం తన ఫ్యామిలీతో కలిసి థాయ్‌లాండ్‌లోని ఫుకెట్‌లో వెకేషన్‌ను ఎంజాయ్ చేస్తున్న శిల్ప సముద్రంలో తన ఏడేళ్ల కుమారుడు వియాన్‌కు ఊపిరి ఎలా పీల్చుకోవాలో నేర్పించారట. తన కుమారుడితో కలిసి సముద్రంలో మునిగి సహజంగా ఎలా ఊపిరి పీల్చుకోవాలో ఆ ట్రిక్స్ అన్నీ నేర్పించిందట. ఈ విషయాన్ని శిల్ప ఇన్‌స్టాగ్రామ్ ద్వారా వెల్లడిస్తూ వీడియో షేర్ చేశారు. 44 ఏళ్ల వయసులో శిల్ప ఫిట్‌నెస్‌కు ఎంతో ప్రాధాన్యం ఇస్తారు. ఈ వయసులోనూ తన కుమారుడిని ఒడిలో కూర్చోబెట్టుకుని పుషప్స్ చేయగలరు. తాజాగా శిల్ప ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన వీడియోకు విపరీతమైన స్పందన వస్తోంది. శిల్ప ఎందరో తల్లులకు రోల్‌ మోడల్ అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ప్రస్తుతం శిల్ప సినిమాలకు దూరంగా ఉన్నారు. తన కుటుంబానికే సమయం కేటాయిస్తున్నారు. తనకున్న వ్యాపారాలను చూసుకుంటున్నారు. అప్పుడప్పుడూ ముంబయి వాసులకు స్పెషన్ ఈవెంట్స్ సందర్బంగా యోగా పాఠాలు కూడా నేర్పుతుంటారు. రచయిత్రి గానూ శిల్పకు మంచి పేరుంది. 1993లో బాజీగర్ చిత్రంతో బాలీవుడ్‌‌లోకి అడుగుపెట్టారు శిల్ప. ఆ తర్వాత ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించారు. తెలుగులో వెంకటేష్‌కు జోడీగా ‘సాహసవీరుడు సాగరకన్య’ సినిమాలో కథానాయికగా నటించారు. ఆ తర్వాత నాగార్జునకు జోడీగా ‘ఆజాద్’ సినిమాలో నటించారు. చివరిసారిగా 2014లో వచ్చిన ‘డిష్కియావ్’ సినిమాలో ఓ పాటలో నటించారు. ఈ సినిమాకు ఆమె నిర్మాతగానూ వ్యవహరించారు. ఆ తర్వాత టీవీ షోలలో కనిపిస్తూ సందడి చేశారు. చాలా కాలం తర్వాత ఆమె ‘నికమ్మా’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. దాదాపు 13 ఏళ్ల తర్వాత ఆమె మళ్లీ వెండితెరపై సందడి చేయనున్నారు. సబీర్ ఖాన్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2qOObnk
v

Tuesday 29 October 2019

బన్నీకి విలన్‌గా మక్కల్ సెల్వన్.. ఓకే చెప్పిన తమిళ స్టార్ నటుడు

కోలీవుడ్‌లో సూపర్ స్టార్ స్టేటస్‌ను అనుభవిస్తోన్న మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి టాలీవుడ్‌లోనూ గుర్తింపు తెచ్చుకున్నారు. కేవలం తమిళంలో మాత్రమే కాకుండా ఇతర భాషల్లోనూ మంచి పాత్రల్లో నటిస్తున్నారు విజయ్. తమిళ అనువాద చిత్రం ‘పిజ్జా’తో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన ఈ 41 ఏళ్ల నటుడు.. తాజాగా మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన ‘సైరా నరసింహారెడ్డి’లో తమిళ యోధుడు రాజా పాండిగా ఆకట్టుకున్నారు. ప్రస్తుతం, పంజా వైష్ణవ్ తేజ్ ఆరంగేట్ర చిత్రం ‘ఉప్పెన’లో ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. ఇదిలా ఉంటే, విజయ్ సేతుపతి టాలీవుడ్ భారీ చిత్రంలో నటించడానికి అంగీకరించినట్టు వార్తలు వస్తు్న్నాయి. అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమాలో విజయ్ సేతుపతి విలన్‌గా చేయనున్నారని టాక్. ఇది అల్లు అర్జున్ 20వ సినిమా. బుధవారం ఈ సినిమాను లాంఛనంగా ప్రారంభించారు. ఈ సినిమాలో బన్నీ సరసన రష్మిక మందన హీరోయిన్‌గా నటిస్తోంది. దేవీశ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తున్నారు. ఇంతకు మించి వివరాలను వెల్లడించలేదు. Also Read: అయితే, ఇప్పటికే విజయ్ సేతుపతికి సుకుమార్ స్టోరీ లైన్‌ను చెప్పారని.. పాత్రను కూడా వివరించారని అంటున్నారు. సుకుమార్ చెప్పిన స్టోరీ లైన్ విజయ్ సేతుపతికి బాగా నచ్చేసిందని, దీంతో విలన్‌గా నటించడానికి ఆయన అంగీకరించారని ఓ ప్రముఖ తమిళ దినపత్రికకు ఇండస్ట్రీ వర్గాలు వెల్లడించాయి. త్వరలోనే పూర్తి స్క్రిప్ట్‌ను విజయ్ సేతుపతికి సుకుమార్ నెరేట్ చేయనున్నారని తెలిసింది. ఇంకా టైటిల్ ఖరారు చేయని ఈ సినిమాను ముత్తంశెట్టి మీడియా సంస్థతో కలిసి మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో ఈ సినిమా సాగుతుందని సమాచారం. శేషాచలం అడవులు, తిరుమల పర్వత ప్రాంతాల్లో కథ నడుస్తుందట.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2NmslPP
v

‘Bigg Boss చెత్త షో, నాపై కిలో కారంపొడి చల్లారు’

బాలీవుడ్ సూపర్‌స్టార్ సల్మాన్ కాన్ టీఆర్‌పీ రేటింగ్స్‌ కోసం జనాల ప్రాణాలతో చెలగాటం ఆడటానికి కూడా వెనుకాడడని అనిపిస్తోంది. ఆయన హోస్ట్ చేస్తున్న సెలబ్రిటీ రియాల్టీ షో బిగ్ బాస్ సీజన్ 13లో కంటెస్టెంట్ల చేత ఘోరమైన టాస్క్‌లు చేయిస్తున్నాడు. ఇటీవల బిగ్ బాస్ హౌస్‌లో ఓ టాస్క్ పెట్టారు. ఈ టాస్క్‌లో భాగంగా సిద్ధార్థ్ డే అనే కంటెస్టెంట్‌పై మిగతా హౌస్‌మేట్స్ ఏకంగా కిలో బ్లీచ్ పౌడర్ చల్లారట. అంతటితో ఆగలేదు అరకిలో కారం పొడి తెచ్చి అతనిపై పోశారట. దాంతో అతని మెడ వద్ద చర్మం ఊడిపోయింది. గత వారం ఈ షో నుంచి బయటికి వచ్చేసిన సిద్ధార్థ్ మీడియా ముందుకు వచ్చి తన గోడును చెప్పుకున్నాడు. ‘బిగ్ బాస్ హౌస్‌లో టాస్క్‌లో భాగంగా నాపై బ్లీచ్, కారం పొడి చల్లారు. నా శరీరంపై చర్మం ఊడిపోయింది. ఇప్పుడిప్పుడే నేను కోలుకుంటున్నాను. ఈ టాస్క్ వల్ల చాలా రోజుల పాటు నిద్రపోలేకపోయాను. సెలబ్రిటీలు అయివుండి ఇలాంటి పనులు చేస్తే యువతకు రాంగ్ మెసేజ్ ఇచ్చినవారవుతారు. తొలి టాస్క్‌లోనే నాచేత మట్టి, మిరపకాయలు తినిపించారు. నాకు ఛాన్స్ వచ్చినప్పుడు నా తోటి కంటెస్టెంట్స్‌తో నేను అలా చేయలేదు. ఎందుకంటే టాస్క్‌ కోసం నేను మరొకరిని హింసపెట్టే వ్యక్తిని కాను. ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేసే పనులు చేయొచ్చు కానీ కారం పొడి, బ్లీచ్ చల్లితే అది ఎంటర్‌టైన్మెంట్ ఎలా అవుతుందో నాకు అర్థంకావడంలేదు’ అని వెల్లడించాడు సిద్ధార్థ్. దాంతో నెటిజన్లు సల్మాన్ ఖాన్‌పై, బిగ్ బాస్ షోపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సిద్ధార్థ్‌కు అయిన గాయాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ అతనికి న్యాయం జరగాలని డిమాండ్ చేస్తున్నారు. బిగ్ బాస్ హౌస్‌లో ఇంత జరుగుతున్నా వాటిని ఎందుకు ఛానెల్‌లో చూపించడంలేదని ప్రశ్నిస్తున్నారు. సల్మాన్ మాత్రం ఈ ఘటన గురించి ఇంతవరకు స్పందించింది లేదు. వీకెండ్ ఎపిసోడ్‌లో హౌస్‌లో ఏం జరుగుతోందో సల్మాన్ రివ్యూ చేస్తాడు. ఓ కంటెస్టెంట్‌కు అంతటి గాయాలు అయినప్పటికీ సల్మాన్ స్పందించకపోవడం గమనార్హం.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2q3BdBQ
v

Most Wanted Bhaiగా సల్మాన్.. ఫస్ట్‌లుక్ విడుదల

బాలీవుడ్ సూపర్‌స్టార్ రంజాన్ కానుక సిద్ధం అయిపోయింది. ప్రభుదేవా, సల్మాన్ ఖాన్ కాంబినేషన్‌లో మరో సినిమా రాబోతోంది. సినిమాకు ‘రాధే: మువర్ మోస్ట్ వాంటెడ్ భాయ్’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్‌లుక్‌ను తాజాగా విడుదల చేశారు. బ్లాక్ జాకెట్‌లో, గాగుల్స్‌తో గన్ పట్టుకుని కాల్పులు జరుపుతున్నట్లుగా సల్మాన్ ఫస్ట్‌లుక్‌లో కనిపించారు. అయితే ఇందులో కొత్తదనం ఏమీ కనిపించడంలేదు. సల్మాన్ నటించిన వాంటెడ్, దబాంగ్‌, రేస్ 3 సినిమాలోనూ ఇలా సల్మాన్ గన్ పట్టుకుని కనిపించారు. సల్మాన్‌తో కలిసి ప్రభుదేవా రాధే అనే టైటిల్‌తో ఓ సినిమా చేస్తున్నాడని ఎప్పటినుంచో ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అందులో నిజం లేదని ప్రభుదేవా చెప్పాడు. ఇప్పుడు అదే టైటిల్‌తో సినిమాను చేయబోతున్నట్లు ప్రకటించారు. ఈ సినిమాకు సల్మాన్ ఖాన్ ఫిలింస్ బ్యానర్‌పై సల్మాన్, అతని సోదరుడు సొహైల్ ఖాన్, బావమరిది అతుల్ అగ్నహోత్రి సంయుక్తంగా నిర్మి్స్తున్నారు. మెహబూబ్ స్టూడియోస్‌లో నవంబర్ 4 నుంచి షూటింగ్ ప్రారంభం అవుతుంది. కంటిన్యుయస్‌గా నెల రోజుల పాటు సినిమాను షూట్ చేయనున్నారు. ఆ తర్వాత సల్మాన్, ప్రభుదేవా కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘దబాంగ్ 3’ ప్రమోషన్స్‌లో పాల్గొంటారు. ‘రాధే’ సినిమాను వచ్చే ఏడాది రంజాన్‌కు ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నాడు సల్మాన్. రంజాన్ సల్మాన్‌కు బాగా కలిసొచ్చింది. ఆయన ప్రభుదేవా దర్శకత్వంలో నటించిన ‘వాంటెడ్’ సినిమా నుంచి మొన్నవచ్చిన ‘భారత్’ సినిమా వరకు దాాదాపుగా అన్నీ రంజాన్‌కే విడుదల చేస్తూ వచ్చారు. రంజాన్‌ తనకు బాగా కలిసొచ్చిన పండుగ అని సల్మాన్ ఎప్పుడూ చెబుతుంటాడు. అయితే రాధే సినిమా విషయంలో మాత్రం ఎక్కడో తేడా కొడుతోంది. టైటిల్ కాస్త కొత్తగా ఉన్నప్పటికీ ఫస్ట్‌లుక్ విషయంలో మాత్రం ప్రభుదేవా కానీ సల్మాన్ కానీ క్రియేటివిటీ పరంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోలేదని తెలుస్తోంది. టైటిల్‌కు తగ్గట్టు ఊరమాస్ లుక్‌ను డిజైన్ చేసుంటే మరోలా ఉండేది. ఫస్ట్‌లుక్‌తోనే ఇవన్నీ ఆలోచించడం ఎందుకులెండి. బహుశా సినిమాను భారీ స్థాయిలో తెరకెక్కిస్తారేమో.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2PxfU6f
v

అల్లు అర్జున్, సుకుమార్ సినిమా ప్రారంభం

క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కాంబినేషన్ అంటే మనకు గుర్తొచ్చే సినిమా ‘ఆర్య’. వాస్తవానికి అల్లు అర్జున్‌కు స్టార్ డమ్‌ను తీసుకొచ్చిన సినిమా ఇది. ఆ తరవాత వీరిద్దరి కాంబినేషన్‌లో ‘ఆర్య 2’ వచ్చినా ఆకట్టుకోలేకపోయింది. ఇప్పుడు ముచ్చటగా మూడోసారి వీరిద్దరూ జతకట్టారు. మైత్రీ మూవీస్ బ్యానర్‌లో సుకుమార్, అల్లు అర్జున్ సినిమా తెరకెక్కనున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. ఇది బన్నీకి 20వ సినిమా. అయితే, ఈ సినిమాను బుధవారం లాంఛనంగా ప్రారంభించారు. హైదరాబాద్‌లోని మైత్రీ మూవీస్ కార్యాలయంలో జరిగిన పూజాకార్యక్రమంలో ముహూర్తపు సన్నివేశానికి అల్లు అరవింద్ క్లాప్‌నిచ్చారు. ప్రముఖ దర్శకుడు కొరటాల శివ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. మరో దర్శకుడు సురేందర్ రెడ్డి స్క్రిప్ట్‌ను చిత్ర యూనిట్‌కు అందజేశారు. ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన రష్మిక మందన హీరోయిన్‌గా నటించనుంది. దేవీశ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తున్నారు. నాని ‘గ్యాంగ్ లీడర్‌’కు కెమెరామెన్‌గా పనిచేసిన మిరోస్లావ్ కూబా బ్రోజెక్ ఈ సినిమాకు సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ముత్తంశెట్టి మీడియా సంస్థతో కలిసి ఈ సినిమాను మైత్రీ మూవీస్ నిర్మిస్తోంది. కాగా, ప్రస్తుతం ‘అల... వైకుంఠపురములో...’ సినిమాతో బన్నీ బిజీగా ఉన్నారు. ఈ చిత్రానికి త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తోనన సంగతి తెలిసిందే. ఈ చిత్ర షూటింగ్ చివరి దశలో ఉంది. పాటలు చిత్రీకరణ మిగిలి ఉందని సమాచారం. ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ పుట్టినరోజు సందర్భంగా నవంబర్ 7న ‘అల... వైకుంఠపురములో...’ టీజర్‌ను విడుదల చేసే యోచనలో చిత్ర యూనిట్ ఉన్నట్టు తెలుస్తోంది. ఈ సినిమాకు తమన్ సంగీతం సమకూరుస్తున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/36hiOSC
v

‘ఆ సినిమాలో నగ్నంగా నటించాల్సి వచ్చింది, అమ్మానాన్నకు తెలిసి..’

కెరీర్ తొలినాళ్లలో ఎన్నో కష్టాలు పడినా.. ఇప్పుడు స్టార్ హీరోకు ఏమాత్రం తీసిపోని క్రేజ్ సంపాదించుకున్నాడు బాలీవుడ్ నటుడు . 2010లో వచ్చిన ‘లవ్ సెక్స్ ఔర్ ధోకా’ అనే సినిమాతో రాజ్‌కుమార్‌కు బ్రేక్ వచ్చింది. అయితే సినిమా కోసం ఎలాంటి సన్నివేశాల్లోనైనా నటించాల్సి ఉంటుంది. అందుకే ఇందులో నగ్నంగా నటించాలని దర్శకుడు దివాకర్ బెనర్జీ చెప్పినప్పుడు తప్పకుండా నటిస్తానని ఒప్పుకున్నాడట. సినిమా కోసమే కాబట్టి ఒప్పేసుకున్నాడు కానీ తన తల్లిదండ్రలకు ఈ విషయం చెప్పడానికి చాలా సిగ్గుపడ్డాడట. ఈ విషయాన్ని రాజ్‌కుమార్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. ‘నగ్నంగా నటించబోతున్నానని నా తల్లిదండ్రులతో చెప్పాలనుకున్నాను. ఏదైతే అదైంది అనుకుని వెళ్లి ధైర్యంగా నాకో సినిమాలో నటించే అవకాశం వచ్చిందని చెప్పాను. వారు చాలా సంతోషించారు. కాకపోతే సినిమాలో నగ్నంగా నటించాల్సిన సన్నివేశాలు ఉన్నాయని చెప్పాను. దాంతో వారు షాకయ్యారు. ఆ తర్వాత వారిని ఎలాగైనా కన్విన్స్ చేయాలనుకున్నాను. నా ముందు భాగం ఎవ్వరికీ కనిపించదు. కేవలం వెనక భాగం మాత్రమే చూపించాలి అని చెప్పాను. అప్పుడు వారు ఓకే అనుకున్నారు. ఎందుకంటే ఇదంతా సినిమాలో భాగమే. అది కూడా నటనే. ఆ తర్వాత ఈ టాపిక్ గురించి వారు నాతో ఎప్పుడూ చర్చించలేదు. ఆ తర్వాత షాహిద్, ఒమర్టా అనే సినిమాల్లోనూ నేను నగ్నంగా నటించాను. ఎలాంటి సన్నివేశాల్లోనైనా నటించాలని నేను సినిమాల్లోరి రాకముందు నుంచే నిర్ణయించుకున్నాను. ఎందుకంటే హీరో అవ్వాలని నాకు చిన్నప్పటి నుంచి కోరిక. ఎక్కువగా బయట తిరిగేవాడిని. అందరితో గొడవలు పడుతుండేవాడిని. హీరోగా ఫైట్లు చేసేవాడిని. కావాలనే గొడవలు పెట్టుకుని ఫైట్లకు దిగేవాడిని. కాకపోతే నేను గూండా కాదనుకోండి. జస్ట్ ఫిల్మీ కిడ్ అంతే’ అని చెప్పుకొచ్చాడు రాజ్‌కుమార్ రావు. రాజ్‌కుమార్ రావు ప్రధాన పాత్రలో నటించిన ‘మేడ్ ఇన్ చైనా’ సినిమా ఇటీవల విడుదలైంది. సినిమాకు మంచి స్పందన వస్తోంది. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లు కూడా బాగానే రాబడుతోంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2JsIBh5
v

పూనమ్ కౌర్ ట్వీట్.. మళ్లీ Pawan Kalyanనే టార్గెట్ చేసిందా?

ప్రముఖ నటి మరోసారి తన ట్వీట్‌తో వార్తల్లోకెక్కింది. ఎప్పుడూ వివాదాస్పద ట్వీట్లు చేస్తూ అందరి నోళ్లలో నానుతూ ఉండే పూనమ్ ఇప్పుడు మరో ట్వీట్ చేసింది. ‘ఓ అబద్ధాల కోరు రాజకీయ నాయకుడు కాగలడేమో కానీ నాయకుడు కాలేడు’ అని ట్వీట్ చేసింది. దాంతో ఈ ట్వీట్ కాస్తా వైరల్‌గా మారింది. పూనమ్ టార్గెట్ చేస్తోంది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌నే అంటూ పలువురు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. జనసేనాని అభిమానులేమో అనవసరంగా ఆయన్ను ఈ వివాదంలోకి లాగొద్దు అంటూ వార్నింగ్‌లు ఇస్తున్నారు. సోషల్ మీడియాలో చాలా సేపటి వరకు ఈ ట్వీట్‌పై చర్చ జరిగింది. దాంతో పూనమ్ దీనిపై క్లారిటీ ఇవ్వాలనుకున్నారు. ‘నా ఆలోచనల్లో నిజాలు మాత్రమే ఉంటాయి. మీ ఆలోచనలన్నీ ఊహాగానాలే. ఇలాంటి పరిస్థితుల్లో కొన్ని పెయిడ్ మీడియా వర్గాలు సొమ్మలు చేసుకోవాలని అనుకుంటున్నాయి. నేను చెప్పిన మాటపై నిలబడే వ్యక్తిని. మీరు మీ ఊహా ప్రపంచంలోనే ఉండండి. మీలాంటివారిపై నాకు జాలేస్తుంటుంది. గాడ్ బ్లెస్’ అని పూనమ్ పేర్కొంది. పూనమ్ చేసే ట్వీట్లకు స్పందించి అనవసరంగా ఆమెకు ప్రచారం కల్పిస్తున్నారని పవన్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆమె నోటికొచ్చినట్లు చేసే ట్వీట్లకు అసలు స్పందించకపోవడమే మంచిదని అంటున్నారు. ఏమైనా గత కొన్ని రోజులుగా సైలెంట్‌గా ఉన్న పూనమ్ కౌర్.. తన ఒక్క ట్వీట్‌తో మరోసారి వార్తల్లో నిలిచింది. గతంలో పూనమ్ పవన్ కళ్యాణ్ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌పై ఎన్నో ఆరోపణలు చేసింది. త్రివిక్రమ్ తనకు ముందు ‘అఆ’ సినిమాలో అవకాశం ఇస్తానన్నారని కానీ ఇవ్వలేదని ఆరోపించింది. అసలు పూనమ్ ఆ ట్వీట్ ఎవరిని ఉద్దేశిస్తూ చేసిందో ఎందుకు చేసిందో తనకే తెలియాలి. ఇప్పుడు ఆమె చేతిలో సినిమాలు కూడా లేవు. కనీసం ఈ రకంగా ట్వీట్లు చేస్తే అయినా పాపులారిటీ వస్తుందని ప్రయత్నిస్తున్నట్లుంది. కానీ సినిమా రంగానికి చెందిన ఆమె రాజకీయాల్లో తలదూర్చకపోవడమే మంచిదని పలువురు నెటిజన్లు సూచనలు ఇస్తున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2NmQYfg
v

‘విజిల్’ కలెక్షన్లు.. తెలుగులోనూ విజయ్‌కి విజిల్స్

తమిళ స్టార్ హీరో విజయ్ ‘విజిల్’ (బిగిల్) మూవీ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. అట్లీ దర్శకత్వంలో గత శుక్రవారం విడుదలైన ఈ మూవీకి హిట్ టాక్ రావడంతో తిరుగులేని కలెక్షన్లను సాధిస్తోంది. తెరి, మెర్సల్ వంటి బ్లాక్ బాస్టర్ బస్టర్ హిట్స్ తరువాత అట్లీ, విజయ్ కాంబినేషన్‌లో ఎమోషనల్ స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కిన ‘బిగిల్’ చిత్రం తెలుగులో విజిల్ పేరుతో విడుదలైంది. మాస్ ఆడియన్స్ మెప్పిస్తూ ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం విడుదలైన తొలి నాలుగురోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా 150 కోట్ల మార్క్ దాటి.. రెండొందల కోట్ల కలెక్షన్ల వైపు దూసుకువెళ్తోంది. ఒక్క ఇండియాలోనే రూ. 97. 68 కోట్లను వసూలు చేసి బాక్సాఫీస్ వద్ద సత్తా చాటాడు విజయ్. ఇక తెలుగు రాష్ట్రాల్లోనూ విజిల్ సినిమాకు కలెక్షన్ల వర్షం కురుస్తోంది. నాలుగు రోజుల్లో మొత్తంగా 12 కోట్ల షేర్ రాబట్టి బ్రేక్ ఈవెన్ సాధించింది. మూడోరోజు నైజాంలో 1.92 కోట్లు, సీడెడ్‌లో 1. 64 కోట్లు, ఉత్తరాంధ్రలో 0. 67 కోట్లు, గుంటూరులో 0. 81 కోట్లు, ఈస్ట్, వెస్ట్‌లో 7.06 కోట్లు, క్రిష్ణాలో 0. 44 కోట్లు, నెల్లూరులో 0. 28 కోట్లు సాధించి మూడురోజులకు గాను 6. 50 కోట్ల షేర్ రాబట్టింది. ఇక శని ఆదివారాలు వీకెండ్ కావడంతో ఈ కలెక్షన్లు మరింత పుంజుకుని నాలుగో రోజు రెట్టింపు కలెక్షన్లు రాబట్టి లాభాల బాట పట్టింది ‘విజిల్’. ఈ సినిమాతో పాటు కార్తీ ‘ఖైదీ’ చిత్రం కూడా మంచి కలెక్షన్లతో సత్తా చాటుతోంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2MXmMIL
v

పెళ్లిపీటలు ఎక్కుతోన్న అర్చన.. హైదరాబాద్‌లో వివాహం

హీరోయిన్‌గా ప్రేక్షకులకు పరిచయమై ఆ తరవాత క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారిన నటి అర్చన అలియాస్ వేద పెళ్లి చేసుకోబోతున్న విషయం తెలిసిందే. ప్రముఖ వ్యాపారవేత్త జగదీశ్‌ను అర్చన పెళ్లిచేసుకోబోతున్నారు. గత కొంతకాలంగా ప్రేమలో ఉన్న జగదీశ్, అర్చన అక్టోబర్ 3న నిశ్చితార్థం చేసుకున్నారు. హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని రాడిసన్ బ్లూ హోటల్‌లో వీరి నిశ్చితార్థం ఘనంగా జరిగింది. అర్చన, జగదీశ్ నిశ్చితార్థ వేడుకలో హీరోలు సుమంత్, శివబాలాజీ, నవదీప్, నటి మధుమితతో పాటు కుటుంబ సభ్యులు కూడా పాల్గొన్నారు. అయితే, తాజాగా వీరి పెళ్లి తేదీని ఖరారు చేశారు. నవంబర్ 13న వీరి వివాహం హైదరాబాద్‌లో ఘనంగా జరగనుంది. ఈ మేరకు వధూవరుల కుటుంబ సభ్యులు మంగళవారం మీడియాకు ప్రకటించారు. పెద్దల సమక్షంలో అంగరంగ వైభవంగా అర్చన-జగదీశ్ పెళ్లి జరగనుంది. Also Read: కాగా, బ్రాహ్మణ కుటుంబానికి చెందిన అర్చన ‘తపన’ అనే సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమ్యారు. ఈ సినిమాలో ఆమె స్క్రీన్ నేమ్ వేద. ఆ తరవాత ‘నేను’ సినిమాతో అర్చన గుర్తింపు తెచ్చుకున్నారు. ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’ సినిమాలో త్రిష స్నేహితురాలిగా నటించి మెప్పించారు. ఇక అప్పటి నుంచి హీరోయిన్ పాత్రలే కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్టుగానూ రాణించారు. ‘శ్రీరామదాసు’, ‘పౌర్ణమి’, ‘యమదొంగ’, ‘ఖలేజా’, ‘బలుపు’ వంటి భారీ చిత్రాల్లో అర్చన నటించారు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో కలిపి సుమారుగా 40 సినిమాల్లో నటించారు. ఆమె ఆఖరిగా నటించిన చిత్రం ‘వజ్ర కవచధర గోవింద’.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2PuIwNy
v

ప్రభాస్‌ను పెళ్లిచేసుకుంటా: కాజల్

రెబల్ స్టార్ ప్రభాస్ పెళ్లి గురించి డిస్కషన్ చేయని రోజంటూ ఉండదు. ఆయన ఎక్కడికెళ్లినా, ఏ ఇంటర్వ్యూకి హాజరైనా, ఆఖరికి ఆయన సినిమాల గురించి ఎవరైనా మాట్లాడుకున్నా మధ్యలో పెళ్లి ప్రస్తావన అయితే కచ్చితంగా వస్తుంది. ప్రస్తుతం టాలీవుడ్‌లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ఎవరంటే టక్కున ప్రభాస్ అని చెప్తారు ఎవరైనా. ఆయన పెళ్లిపై ఇప్పటికే బోలెడన్ని రూమర్లు వచ్చాయి. కానీ, వాటిలో ఓ ఒక్కటి నిజరూపం దాల్చలేదు. అయితే, ప్రభాస్‌ని పెళ్లిచేసుకోవడానికి తాను సిద్ధమంటున్నారు అందాల చందమామ కాజల్ అగర్వాల్. మంచు లక్ష్మి హోస్ట్‌గా నిర్వహిస్తోన్న ‘ఫీట్ అప్ విత్ ద స్టార్స్’ షోలో తాజాగా కాజల్ అగర్వాల్ పాల్గొన్నారు. ఈ షోలో కాజల్ చాలా ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు. షోలో భాగంగా అందరినీ అడిగినట్టే కాజల్‌ను కూడా కొన్ని ఇబ్బందికర ప్రశ్నలు అడిగారు మంచు లక్ష్మి. కాజల్‌కు అస్సలు ఇష్టంలేని సుగర్ క్యాండీలను ఆమె నోట్లో పెట్టి మరీ.. ఈ ప్రశ్నలను మంచు లక్ష్మి అడిగారు. వాటిలో మొదటి ప్రశ్న ‘‘నిషా అగర్వాల్‌తో నువ్వు గొడవపడతావా?’’ అని. దీనికి కాజల్ సమాధానం చెప్తూ.. ‘‘గొడవ కాదు, ఇద్దరం ఒకరినొకరు కరుచుకుంటాం’’ అని అన్నారు. Also Read: ఇక రెండో ప్రశ్న.. ‘‘నువ్వు ఎవరిదైనా బయోగ్రఫి చేయాల్సి వస్తే ఎవరిది చేస్తావు?’’ అని. దీనికి కాజల్ చాలా సేపు ఆలోచించి సుష్మా స్వరాజ్ అని చెప్పారు. ఆమె అద్భుతమైన నాయకురాలని, అందుకే చేయాల్సి వస్తే ఆమె బయోపిక్ చేస్తానని వెల్లడించారు. నీకు కోపం వస్తే మొదటిగా చేసే పనేంటి అనే ప్రశ్నకు ఏడుస్తానని సమాధానం ఇచ్చారు కాజల్. ఇక ఆ తరవాత అసలైన ప్రశ్న అడిగారు లక్ష్మి. టాలీవుడ్‌లో ముగ్గురు హీరోలు రామ్ చరణ్, ఎన్టీఆర్, ప్రభాస్‌లలో ఎవరిని చంపేస్తావు, ఎవరితో హుక్ అప్ అవుతావు, ఎవరిని పెళ్లి చేసుకుంటావు అని కాజల్‌ను లక్ష్మి అడిగారు. Also Read: ఈ ప్రశ్నలకు ఆశ్చర్యపోయిన కాజల్.. నవ్వుతూనే రామ్ చరణ్‌ను కిల్ చేస్తానని, ఎన్టీఆర్‌తో హుక్ అప్ అవుతానని, ప్రభాస్‌ను పెళ్లిచేసుకుంటానని చెప్పారు. ప్రభాస్‌ను పెళ్లిచేసుకుంటానని చెప్పడానికి కారణం కూడా వెల్లడించారు కాజల్. ఈ ముగ్గురు హీరోల్లో ప్రభాస్‌కు ఇంకా పెళ్లికాలేదు కాబట్టి అవకాశం వస్తే అతన్నే పెళ్లిచేసుకుంటానని నవ్వుతూ చెప్పారు కాజల్. ఈ సమాధానాలన్నీ సరదాగా మాత్రమే చెప్పానని షో ఆఖరిలో కాజల్ వెల్లడించారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/36htDUI
v

‘నా మాజీ భర్త మంచోడు.. నా కొత్త ప్రియుడికి ఓపికెక్కువ’

ప్రేమించుకోవడం, పెళ్లి చేసుకోవడం, పిల్లల్ని కనడం.. ఆ తర్వాత బ్రేకప్ చెప్పేయడం. ప్రస్తుతం బాలీవుడ్‌లో నడుస్తు్న్న ట్రెండ్ ఇదే. ఎప్పటినుంచో తమ భార్యలను, భర్తలను వదిలించుకోవాలని అనుకున్నవాళ్లు అడల్టరీకి సుప్రీంకోర్డు ఓకే చెప్పిన మరుక్షణం కోర్టు మెట్లు ఎక్కడం మొదలుపెట్టారు. ఇప్పటికే ఎందరో సెలబ్రిటీలు తమ భర్తలకు, భార్యలకు వీడ్కోలు పలికి మరొకరితో జీవనాన్ని కొనసాగిస్తున్నారు. ఇలాంటి రిలేషన్‌షిప్స్ తమ పిల్లలపై ఎలాంటి ప్రభావం చూపుతాయని కొంచెం కూడా ఆలోచించడంలేదు. తాజాగా ప్రముఖ బాలీవుడ్ నటుడు మాజీ భార్య అధూనా తనకు కొత్త ప్రియుడు దొరికాడంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అతనికి బర్త్‌డే విషెస్ చెప్తూ లిప్ కిస్ చేస్తున్న ఫొటోను షేర్ చేసింది. అతని పేరు నికోలో అని రెండేన్నరేళ్లుగా తనతో డేటింగ్‌లో ఉన్నానని తెలిపింది. అలాగని తన మాజీ భర్తపై తనకు ఎలాంటి కోపం లేదని పేర్కొంది. తన మాజీ భర్త చాలా మంచివాడని, కొత్త ప్రియుడికి ఓపిక ఎక్కువని అంటోంది. ఫర్హాన్‌కు అధూనాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. కొన్నేళ్ల క్రితం వీరిద్దరూ విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత ఫర్హాన్ తన కంటే వయసులో చిన్నదైనా శిబానీ దండేకర్‌తో డేటింగ్‌లో ఉన్నాడు. వీరి జీవితాలు వీరు చూసుకున్నారు కానీ తాము తీసుకున్న నిర్ణయాలు పిల్లలపై ఎలాంటి ప్రభావం చూపుతాయని ఆలోచించలేదు. పిల్లల కోసం భార్యభర్తలుగా ఉంటామని చెప్తున్నారు. ఇప్పటివరకు విడిపోయిన ప్రతీ జంట చెప్పిన మాట ఇదే. ప్రేమ ఎప్పుడు పుడుతుందో ఏ వయసులో పుడుతుందో ఎవ్వరూ చెప్పలేరు. కానీ ఇలాంటి రిలేషన్‌షిప్స్ మాత్రం సమాజంపై చెడు ప్రభావం చూపుతాయని పలువురు అభిప్రాయపడుతున్నారు. బాలీవుడ్‌లో అందరికంటే వైరల్ అవుతున్న లవ్‌స్టోరీ మలైకా అరోరా, అర్జున్ కపూర్‌ది. పెళ్లై టీనేజ్ వయసున్న కుమారుడు ఉన్న మలైకా తనకంటే పదేళ్లు చిన్నవాడైన అర్జున్‌తో డేటింగ్‌లో ఉండటం చర్చనీయాంశంగా మారింది. ఎవరైనా ఏంటిది అని ప్రశ్నిస్తే ఊరుకునేది లేదని ఇద్దరూ ఘాటుగా స్పందించారు. 2020లో వీరి వివాహం జరగనున్నట్లు తెలుస్తోంది. ఇక ఫర్హాన్ విషయానికొస్తే.. మహేష్ బాబు నటించిన ‘భరత్ అనే నేను’ సినిమాలోని ‘ఐ డోన్ట్ నో’ అనే పాటను పాడారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/34djSVX
v

యాంకర్‌కు లిప్ కిస్ ఇచ్చిన స్టార్ నటి.. వీడియో వైరల్

ప్రముఖ హాలీవుడ్ నటి , ఫేమస్ టీవీ పర్సనాలిటీ ఎల్లెన్ దెజనరెస్‌లకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రముఖ అమెరికన్ కామెడీ సిరీస్ ‘ఫ్రెండ్స్’తో బాగా పాపులర్ అయిన జెన్నిఫర్ ఇటీవల ఇన్‌స్టాగ్రామ్‌లో ఎకౌంట్ తెరిచారు. ఆమె పోస్ట్ చేసిన తొలి ఫొటోకు ఇన్‌స్టాగ్రామ్ క్రాష్ అయింది. ఈ నేపథ్యంలో ప్రముఖ టీవీ పర్సనాలిటీ ఎల్లెన్.. తన స్నేహితురాలైన జెన్నిఫర్‌ను తన షోకు ఆహ్వానించారు. వీరిద్దరూ ఇండస్ట్రీలో మంచి ఫ్రెండ్స్ కావడంతో ఎల్లెన్ పిలవగానే జెన్నిఫర్ వెళ్లారు. చాలా కాలం తర్వాత ఇద్దరూ కలుసుకోవడంతో ఇద్దరూ లిప్ కిస్ ఇచ్చేసుకున్నారు. దాంతో అక్కడున్నవారంతా షాకయ్యారు. లిప్ కిస్ ఇచ్చాక జెన్నిఫర్.. ‘ఎలా ఉంది? నా ముద్దును ఎంజాయ్ చేశావా? లేక భయపడ్డావా?’ అంటూ ఎల్లెన్‌ను ప్రశ్నించారు. ఇందుకు ఎల్లెన్ స్పందిస్తూ.. ‘చాలా నచ్చింది’ అని చెప్పారు. అయితే ఎల్లెన్ స్వలింగ సంపర్కురాలు. ఆమెకు 2008లో పోర్టియా రోస్సీ అనే నటితో పెళ్లైంది. దాంతో ఎల్లెన్ మరో మహిళను ముద్దు పెట్టుకోవడం వైరల్ అవుతోంది. జెన్నిఫర్ ముద్దుతో ఆగలేదు. ‘చివరిసారిగా నువ్వు అబ్బాయిని ఎప్పుడు ముద్దుపెట్టుకున్నావ్’ అని అడిగింది. ఇందుకు ఎల్లెన్ స్పందిస్తూ.. ‘ఎందుకు అందరూ షాకవుతున్నారు? నేను జస్ట్ అబ్బాయిలకు లిప్ కిస్ మాత్రమే ఇస్తాను. అంతేకానీ వారితో సెక్స్ చేయను’ అని చెప్పింది. ఆ తర్వాత ఎల్లెన్.. జెన్నిఫర్‌ను ప్రశ్నిస్తూ.. ‘చివరిసారిగా నువ్వు అమ్మాయిని ఎప్పుడు ముద్దుపెట్టుకున్నావ్’ అని అడిగింది. ఈ ప్రశ్నకు జెన్నిఫర్ రిప్లై ఇస్తూ.. ‘నేను అమ్మాయిలకు లిప్ కిస్ ఇవ్వను’ అంది. ఆ తర్వాత ఎల్లెన్ చేసిన పనికి అందరూ షాకయ్యారు. జెన్నిఫర్ ఆ మాట అనగానే ఎల్లెన్ మళ్లీ ముందుకు వంగి జెన్నిఫర్‌కు లిప్ కిస్ ఇచ్చింది. ఆ తర్వాత ఎల్లెన్ కూడా తాను చేసిన పనికి నవ్వుకుంది. ‘ఎంతో కాలంగా అభిమానులు ఈ క్షణం కోసమే కదా ఎదురుచూస్తున్నారు’ అంది. ఆ తర్వాత జెన్నిఫర్.. ఎల్లెన్‌ పెదాలు బాగున్నాయని కాంప్లిమెంట్ కూడా ఇచ్చింది. అది విన్న ఎల్లెన్.. ‘నీ పెదాలు కూడా చాలా సాఫ్ట్‌గా ఉన్నాయి. నాకు ఆడవాళ్లలో నచ్చేదే అది’ అని చెప్పింది. మొత్తానికి అలా రెండు ముద్దులు నాలుగు మాటలతో ఈ షోను ముగించారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/36b0Ykt
v

రేప్ చేస్తుంటే ప్రూఫ్స్ కలెక్ట్ చేస్తూ కూర్చోవాలా: గాయని ఆగ్రహం

మీటూపై షాకింగ్ ఆరోపణలు చేసిన వారిలో ప్రముఖ గాయని ఒకరు. ప్రముఖ గాయకుడు అను మాలిక్ ‌తనను లైంగికంగా వేధించాడని ఏడాది క్రితం సోనా షాకింగ్ ఆరోపణలు చేశారు. సోనాతో పాటు గాయని శ్వేతా పండిట్‌ కూడా అను మాలిక్ నిజ స్వరూపం బయటపెట్టారు. మ్యాటర్ సీరియస్ అవడంతో ప్రముఖ సింగింగ్ రియాల్టీ షో ఇండియన్ ఐడల్ నుంచి అను మాలిక్‌ను తొలగించారు. ఈ షోకు ఆయన జడ్జ్‌గా వ్యవహరించేవారు. కానీ సోనాకు న్యాయం జరగలేదు. అను మాలిక్‌ను తొలగించిన తర్వాత సోనాను కూడా తీసేశారు. ఇక్కడ షాకింగ్ విషయం ఏంటంటే.. అను మాలిక్‌పై మీటూ ఆరోపణలు ఉన్నప్పటికీ అతన్ని మళ్లీ ఇండియల్ ఐడల్ సీజన్ 11 జడ్జ్‌గా నియమించారు. దాంతో సోనాకు చిర్రెత్తుకొచ్చింది. ట్విటర్ వేదికగా తన ఆగ్రహాన్ని ప్రదర్శించారు. ‘అను మాలిక్ నన్ను లైంగికంగా వేధించాడు అని ఎన్నోసార్లు నోరుబాదుకున్నాను. కానీ ఎవ్వరూ నా మాట వినలేదు. ఇండియాలో మరో నిర్భయ సంఘటన జరిగే తప్ప ఎవ్వరూ మేలుకోరా? అనుపై నేను ఆరోపణలు చేయడంతో నన్ను షో నుంచి తీసేశారు. నేను అనుపై ఆరోపణలు చేయడంతో మరో టీవీ ఛానెల్ రేటింగ్స్ బాగా పెరిగిపోయానని చెప్పారు. ఏడాది తర్వాత ఆ కామాంధుడిని మళ్లీ జడ్జ్‌ సీట్‌‌ను కట్టబెట్టారు. నేను ఎప్పుడు ఆరోపణలు చేసినా కూడా ప్రూఫ్ ఉందా అని చాలా మంది అడిగారు. రేప్ చేస్తున్నప్పుడు, లైంగికంగా వేధిస్తున్నప్పుడు ఆడపిల్లలు ప్రూఫ్‌లు కలెక్ట్ చేస్తూ ఉండాలని ఈ వెధవల అభిప్రాయం’ ‘ అను మాలిక్ గురించి తెలిసి కూడా మిగతా ఇద్దరు సింగర్స్‌ ఆయనతో కలిసి ఎలా పనిచేస్తున్నారో నాకు అర్థంకావడంలేదు. ఎంతైనా అందరికీ డబ్బే ముఖ్యం కదా. అను మాలిక్‌కు మళ్లీ జడ్జ్ సీట్ ఎందుకు కట్టబెట్టారని నేను సింగర్ విశాల్ దద్లానీని అడిగాను. చాలా చర్చలు జరిగాయని విశాల్ నాకు చెప్పాడు. పైగా ఇలా మాట్లాడినందుకు తన పేరు బయటపెట్టొద్దని చెప్పాడు. నేను ఏం బయటపెట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నువ్వు చెప్పిన దాంట్లో ఒక్క లాజిక్ కూడా లేదు’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు సోనా.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2qLTmEz
v

Pressure Cooker Movie Teaser


Pressure Cooker Movie Teaser

from BharatStudent - Telugu - Actor Actress|Photo,Picture Galleries|Wallpapers|Screensavers|Movie Trailers|Film News and Gossips https://ift.tt/2JyyQhs

లోకేశ్‌ని ‘పప్పు’ అంటారా, నాకు తెలీదే.. వర్మ వెటకారం

నాకు నచ్చింది నేను తీస్తా.. ఇష్టముంటే చూడండి, లేకపోతే మానేయండి అనే దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. వివాదం అనేది లేకపోతే ఆయనకు అస్సలు నిద్ర పట్టదు. ఈ మధ్య కాలంలో ఆయనకు వివాదాల పిచ్చి మరీ ఎక్కువైంది. అందుకే, ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సమయంలో ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ అనే వివాదాస్పద చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఇప్పుడు ఏపీలో వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తరవాత ‘కమ్మరాజ్యంలో కడపరెడ్లు’ అంటూ కాకరేపుతున్నారు. ఇది వివాదాస్పద పాత్రలతో అస్సలు వివాదాస్పదం కాని సినిమా అంటూ రామ్ గోపాల్ వర్మ చెబుతున్నా.. ఆయన చేసే ప్రచార కార్యక్రమాలు మాత్రం వివాదాస్పదంగానే ఉన్నాయి. ఒక వర్గాన్ని రెచ్చగొట్టే విధంగానే ఉన్నాయి. దీపావళి సందర్భంగా ‘కమ్మరాజ్యంలో కడపరెడ్లు’ సినిమా ట్రైలర్‌ను వర్మ విడుదల చేశారు. ఈ ట్రైలర్ సెన్సేషన్ క్రియేట్ చేసింది. యూట్యూబ్‌లో ఆ రోజు టాప్ ట్రెండ్‌గా నిలిచింది. ఈ ట్రైలర్‌ను చూసిన తరవాత వర్మను తిట్టేవాళ్లు తిట్టారు, పొగిడే వాళ్లు పొగిడారు. అయితే, ఈ ట్రైలర్‌లో లోకేశ్ పాత్రధారికి చంద్రబాబు పాత్రధారి పప్పు వడ్డించే సన్నివేశం బాగా హైలైట్ అయ్యింది. అది ఎందుకు అయ్యిందో మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సన్నివేశంపై తాజాగా తన అభిమాని ఒకరితో ఫోన్ కాల్ ద్వారా వర్మ డిస్కషన్ పెట్టారు. ‘కమ్మరాజ్యంలో కడపరెడ్లు’ సినిమాపై న్యూస్ ఛానెల్ 10టీవీ ప్రసారం చేసిన చర్చా కార్యక్రమంలో వర్మ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రేక్షకులతో వర్మ ఫోన్‌లో మాట్లాడే అవకాశం కూడా కల్పించారు. Also Read: ఈ క్రమంలో హైదరాబాద్‌లోని ఒక వ్యక్తి నుంచి ఫోన్ కాల్ వచ్చింది. ట్రైలర్‌లో అన్నిటికన్నా పప్పు వడ్డించే సీన్ చాలా బాగా నచ్చిందని, హైలైట్ అని వర్మతో ఆ వ్యక్తి చెప్పాడు. ఎందుకు అంత బాగా నచ్చిందని వర్మ తిరిగి ప్రశ్నించారు. కానీ, ఆ వ్యక్తి మాత్రం అసలు విషయం చెప్పకుండా దాటవేసే ప్రయత్నం చేశాడు. అయినప్పటికీ వర్మ వదల్లేదు. అతని నుంచి అసలు విషయం రాబట్టారు. ఏపీ మాజీ ఐటీ మంత్రి లోకేశ్‌ను పప్పు అని అంటారని తెలిసే మీరు ఆ సీన్ పెట్టారని వర్మను డైరెక్ట్‌గా అనేశాడు ఆ వ్యక్తి. Also Read: దీనికి వర్మ సమాధానం ఇస్తూ.. ‘‘లోకేశ్‌ని అలా అంటారా? నాకు తెలీదు. ఫస్ట్ టైమ్ వింటున్నాను. లోకేశ్‌ను అలా అంటారని మీకు ఎవరు చెప్పారు?’’ అంటూ బాగా వెటకారంగా మాట్లాడారు. సోషల్ మీడియాలో వచ్చే మెమీస్ ద్వారా లోకేశ్‌ను పప్పు అని అంటారని తనకు తెలుసని ఆ వ్యక్తి తిరిగి సమాధానం చెప్పాడు. ‘‘అవునా.. నేనైతే ఫస్ట్ టైమ్ వింటున్నా’’ అంటూ మరోసారి వెటకారంగా, తనదైన మ్యానరిజంతో అన్నారు వర్మ. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2MXnWUC
v

పిల్లాడిని దత్తత తీసుకోండి.. నేను చదివిస్తా: పుట్టినరోజు నాడు లారెన్స్ గొప్ప నిర్ణయం

తమిళనాడులో ప్రమాదవశాత్తు బోరు బావిలో పడిన చిన్నారి సుజిత్ విల్సన్ మృతిచెందిన సంగతి తెలిసిందే. తిరుచ్చిలో ఈనెల 25న రెండేళ్ల సుజిత్ దురదృష్టవశాత్తు బోరు బావిలో పడిపోయాడు. 35 అడుగుల లోతులో చిక్కుకుపోయాడు. అధికారులు రెస్య్కూ ఆపరేషన్ చేపట్టి నాలుగు రోజులపాటు కష్టపడినా సుజిత్ ప్రాణాలను కాపాడలేకపోయారు. సుజిత్ క్షేమంగా బయటకు రావాలని తమిళనాడు ప్రజలతో పాటు యావత్తు దేశం ఆకాంక్షించింది. కానీ, దేశ ప్రజల ప్రార్థనలు సుజిత్‌ను కాపాడలేకపోయాయి. కాగా, బిడ్డను కోల్పోయి శోకసంద్రంలో ఉన్న సుజిత్ తల్లిదండ్రులకు హీరో, దర్శకుడు, కొరియోగ్రాఫర్ రాఘవ లారెన్స్ తన సానుభూతిని తెలియజేశారు. సుజిత్ ఎక్కడికి వెళ్లిపోలేదని, దేశ ప్రజల గుండెల్లో బతికే ఉన్నాడని అన్నారు లారెన్స్. ఈ మేరకు ఫేస్‌బుక్‌లో ఒక పోస్ట్ చేశారు. ఈరోజు (అక్టోబర్ 29న) తన పుట్టినరోజు అయినప్పటికీ దాన్ని సెలబ్రేట్ చేసుకోవాలని అనుకోవడంలేదని పేర్కొన్నారు. సుజిత్ మరణం తనకు అంత బాధను కలిగించిందని లారెన్స్ పరోక్షంగా వెల్లడించారు. Also Read: అయితే, ఈ సందర్భంగా సుజిత్ తల్లిదండ్రులకు లారెన్స్ ఒక విన్నపం చేశారు. దేశంలో ఎంతో మంది పిల్లలకు తలిదండ్రులు లేరని. అలాంటి పిల్లల్లో ఒకరిని దత్తత తీసుకుని.. ఆ పిల్లాడికి సుజిత్ అని పేరు పెట్టమని లారెన్స్ కోరారు. ఇలా సుజిత్ తల్లిదండ్రులు ఒక పిల్లాడిని దత్తత తీసుకుంటే.. అతడు చదువుకోవడానికి అయ్యే పూర్తి ఖర్చును తాను భరిస్తానని లారెన్స్ వెల్లడించారు. మరి లారెన్స్ విన్నపానికి సుజిత్ తల్లిదండ్రులు ఎలా స్పందిస్తారో చూడాలి. వాస్తవానికి ఇలాంటి సేవా కార్యక్రమాలు లారెన్స్‌కు కొత్తేమీకాదు. ఆయన సొంతంగా చారిటీని ఏర్పాటుచేసి కొన్ని వందల మంది చిన్న పిల్లలకు హార్ట్ సర్జరీలు చేయించారు. తన చారిటీ ద్వారా ఎంతో మందిని ఆదరిస్తున్నారు. వరదలు వచ్చినప్పుడు తానే స్వయంగా వెళ్లి సహాయ సహకారాలు అందించారు. తాను సంపాదించే మొత్తంలో చాలా వరకు లారెన్స్ సేవా కార్యక్రమాలకే ఉపయోగిస్తున్నారు. అందుకే, లారెన్స్‌ను ఎంతో మంది అభిమానిస్తున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2Pqiw64
v

‘Mega Family’పై వర్మ షాకింగ్ ట్విస్ట్

వివాదాల దర్శకుడు ఎప్పుడు ఎక్కడ ఎవరికి బాంబ్ పెడతాడో ఆయనకే తెలీదు. ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమాతో తానేంటో మరోసారి నిరూపించుకున్నాడు. ఇప్పుడు ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇటీవల విడుదలైన ఈ సినిమా ట్రైలర్‌ తెలుగు రాష్ట్రల్లో దుమ్మురేపింది. చంద్రబాబు నాయుడు, జగన్, లోకేష్ పాత్రధారులను పరిచయం చేస్తూ విడుదల చేసిన ట్రైలర్ విపరీతంగా ట్రెండ్ అయింది. ఈ సినిమాతోనే జనాలు తట్టుకోలేకపోతుంటే నిన్న మరో సినిమాను ప్రకటించారు వర్మ. ‘మెగా ఫ్యామిలీ’ అనే టైటిల్‌ను ప్రకటించి ఇదే తన తర్వాతి సినిమా అన్నారు. దాంతో వర్మ.. చిరంజీవి ఫ్యామిలీని టచ్ చేస్తున్నాడని అనుకున్నారు చాలా మంది. ఈ సినిమా ఏమై ఉంటుంది అని ఆలోచించేలోపే తాజాగా మరో ట్విస్ట్ ఇచ్చాడు వర్మ. తాను ‘మెగా ఫ్యామిలీ’ సినిమా చేయడంలేదని ప్రకటించారు. ఇందుకు కారణం ఏంటో తెలిస్తే పగలబడి నవ్వుకుంటారు. ‘మెగా ఫ్యామిలీ సినిమా కాన్సెప్ట్ ఏంటంటే.. ఓ వ్యక్తికి 39 మంది సంతానం ఉంటారు. చాలా మంది పిల్లలు ఉన్నారు కాబట్టి, నేను చిన్న పిల్లలపై సినిమాలు చేయను కాబట్టి, ఈ సినిమాను చేయకూడదని నిర్ణయించుకున్నాను’ అని ట్వీట్ చేశారు. కావాలనే చిరంజీవి కుటుంబ నేపథ్యంలో సినిమా చేస్తున్నానని ప్రజల్లో ఆసక్తి రేకెత్తించడానికే వర్మ ఈ సినిమా తీస్తున్నారని జోక్ చేశారు. అందరూ చిరంజీవి గురించే అనుకుంటారని, దాంతో తాను తెరకెక్కించిన కమ్మరాజ్యంలో కడపరెడ్లు సినిమా ప్రమోషన్స్‌కు మరింత మైలేజ్ వస్తుందని వర్మ ఆలోచించాడు. కావాలని మెగా ఫ్యామిలీ పిల్లల సినిమా అని చెప్పి తప్పించుకున్నట్లు తెలుస్తోంది. వర్మ తీసే సినిమాల్లో వివాదం ఉన్నప్పటికీ ఆయనలో ఎలాంటి బెరుకు కనిపించదు. నేను కేవలం నా సినిమాలతో నిజాలను మాత్రమే చూపిస్తాను అని చెప్తుంటారు. మరి ఇప్పుడు కడపరెడ్లు సినిమా తెలుగు రాష్ట్రాల్లో ఆడుతుందో లేదో చూడాలి. లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా విడదల సమయంలో అధికారంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఉంది కాబట్టి ఏపీలో సినిమా విడుదలను అడ్డుకున్నారు. అప్పుడు జగన్ వర్మకు, ఈ సినిమాకు మద్దతు తెలిపారు. ఇప్పుడు అధికారంలోకి జగన్ ప్రభుత్వం వచ్చింది కాబట్టి వర్మ సినిమా సాఫీగా విడుదల అవుతుందో లేదో వేచి చూడాలి.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2Ptg0w2
v

కత్రినా కైఫ్ కొత్త బాయ్‌ఫ్రెండ్ ఇతనేనా?

బాలీవుడ్ బార్బీడాల్ ప్రేమలో పడిందా? అవుననే అంటున్నాయి బాలీవుడ్ వర్గాలు. బాలీవుడ్ నటుడు రణ్‌బీర్ కపూర్‌తో చాలా కాలం పాటు డేటింగ్ చేశారు కత్రినా. ఇద్దరూ కలిసి ఒకే ఇంట్లో లివిన్ రిలేషన్‌షిప్‌లో ఉండేవారు. ఆ తర్వాత ఏమైందో ఏమో తెలీదు కానీ రణ్‌బీర్, కత్రినా విడిపోయారు. దాంతో ఫ్యాన్స్ కూడా చాలా బాధపడ్డారు. కత్రినాతో విడిపోయినందుకు రణ్‌బీర్ ఎంత బాధపడ్డాడో తెలీదు కానీ కత్రినా మాత్రం తట్టుకోలేకపోయారు. అన్నీ మర్చిపోవడానికి ఆమె ఎంచుకున్న మార్గం జిమ్. ఈ విషయాన్ని ఆమే స్వయంగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. రణ్‌బీర్ మాత్రం తనకంటే పదేళ్లు చిన్నదైన ఆలియా భట్‌తో డేటింగ్‌లో ఉన్నాడు. త్వరలో పెళ్లి కూడా చేసుకోవాలని అనుకుంటున్నారు. నేను మాత్రం ఎంత కాలం ఒంటరిగా ఉండాలి అని కత్రినా అనుకుందో ఏమో.. తనకంటూ ఓ తోడుని వెతుక్కుంది. బాలీవుడ్ నటుడు విక్కీ కౌషల్‌తో కత్రినా డేటింగ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. ఓ అవార్డ్ వేడుకలో కత్రినాకు విక్కీ సరదాగా ప్రపోజ్ చేశాడు. ఆ తర్వాత ఇద్దరికీ ఒకరంటే ఒకరిపై ఇష్టం పెరిగినట్లుంది. ఆదివారం ముంబయిలో జరిగిన దీపావళి వేడుకలకు ఇద్దరూ కలిసే హాజరయ్యారు. ఆ తర్వాత ఎవ్వరికీ తెలీకుండా విడివిడిగా తమ కార్లలో వెళ్లిపోయారు. అయితే వారిద్దరూ కేవలం ఫ్రెండ్స్ అని, ఇద్దరూ సింగిల్‌గానే ఉన్నారని సన్నిహితులు అంటున్నారు. త్వరలో కత్రినా, విక్కీ కౌషల్ కలిసి ఓ సినిమాలో నటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కత్రినాకు ఇప్పుడిప్పుడే పెళ్లి ఆలోచనలు లేనట్లున్నాయి. ఆమె సినిమాలు హిట్ అయినా అవ్వకపోయినా బాలీవుడ్‌లో కత్రినా సక్సెస్‌ఫుల్ హీరోయిన్. ఇక కత్రినా తానేంటో నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. ఈ సమయంలో పెళ్లి చేసుకుంటే ఆమె లైఫ్ సెట్ అయిపోతుంది. కానీ కత్రినా మాత్రం బాలీవుడ్‌లో ఇంకా ఏదో సాధించాలని చూస్తోంది. ఇటీవల కే కాస్మెటిక్స్ పేరుతో కొత్త వ్యాపారాన్ని ప్రారంభించింది. ప్రస్తుతం కత్రినా.. ‘సూర్యవంశి’ సినిమాతో బిజీగా ఉంది. ఇందులో అక్షయ్ కుమార్‌కు జోడీగా నటిస్తోంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2JrPCP6
v

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...