Tuesday 29 October 2019

పెళ్లిపీటలు ఎక్కుతోన్న అర్చన.. హైదరాబాద్‌లో వివాహం

హీరోయిన్‌గా ప్రేక్షకులకు పరిచయమై ఆ తరవాత క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారిన నటి అర్చన అలియాస్ వేద పెళ్లి చేసుకోబోతున్న విషయం తెలిసిందే. ప్రముఖ వ్యాపారవేత్త జగదీశ్‌ను అర్చన పెళ్లిచేసుకోబోతున్నారు. గత కొంతకాలంగా ప్రేమలో ఉన్న జగదీశ్, అర్చన అక్టోబర్ 3న నిశ్చితార్థం చేసుకున్నారు. హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని రాడిసన్ బ్లూ హోటల్‌లో వీరి నిశ్చితార్థం ఘనంగా జరిగింది. అర్చన, జగదీశ్ నిశ్చితార్థ వేడుకలో హీరోలు సుమంత్, శివబాలాజీ, నవదీప్, నటి మధుమితతో పాటు కుటుంబ సభ్యులు కూడా పాల్గొన్నారు. అయితే, తాజాగా వీరి పెళ్లి తేదీని ఖరారు చేశారు. నవంబర్ 13న వీరి వివాహం హైదరాబాద్‌లో ఘనంగా జరగనుంది. ఈ మేరకు వధూవరుల కుటుంబ సభ్యులు మంగళవారం మీడియాకు ప్రకటించారు. పెద్దల సమక్షంలో అంగరంగ వైభవంగా అర్చన-జగదీశ్ పెళ్లి జరగనుంది. Also Read: కాగా, బ్రాహ్మణ కుటుంబానికి చెందిన అర్చన ‘తపన’ అనే సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమ్యారు. ఈ సినిమాలో ఆమె స్క్రీన్ నేమ్ వేద. ఆ తరవాత ‘నేను’ సినిమాతో అర్చన గుర్తింపు తెచ్చుకున్నారు. ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’ సినిమాలో త్రిష స్నేహితురాలిగా నటించి మెప్పించారు. ఇక అప్పటి నుంచి హీరోయిన్ పాత్రలే కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్టుగానూ రాణించారు. ‘శ్రీరామదాసు’, ‘పౌర్ణమి’, ‘యమదొంగ’, ‘ఖలేజా’, ‘బలుపు’ వంటి భారీ చిత్రాల్లో అర్చన నటించారు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో కలిపి సుమారుగా 40 సినిమాల్లో నటించారు. ఆమె ఆఖరిగా నటించిన చిత్రం ‘వజ్ర కవచధర గోవింద’.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2PuIwNy
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...