Tuesday 31 December 2019

రౌడీ న్యూ ఇయర్‌ గిఫ్ట్‌.. `వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌` అప్‌డేట్

సెన్సేషనల్ స్టార్‌ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం . విభిన్న చిత్రాల దర్శకుడు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో విజయ్‌ దేవరకొండ నాలుగు డిఫరెంట్ వేరియేషన్స్‌లో కనిపించనున్నాడు. విజయ్‌కి జోడిగా రాశీ ఖన్నా, ఐశ్వర్యా రాజేష్‌, కేథరిన్‌ థ్రెస్సా, ఇసాబెల్లాలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటున్న ఈసినిమాకు సంబంధించి ప్రమోషన్‌ కార్యక్రమాలు ప్రారంభించారు చిత్రయూనిట్. ఇప్పటికే సినిమాలోని నాలుగు ప్రేమ కథలకు సంబంధించిన నాలుగు పోస్టర్లను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. న్యూ ఇయర్‌ కానుకగా మరో అప్‌డేట్ ఇచ్చారు. ఈ సినిమా టీజర్‌ రిలీజ్ డేట్‌ను ఎనౌన్స్‌ చేశారు. Also Read: రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా టీజర్‌ను జనవరి 3న రిలీజ్‌ చేస్తున్నట్టుగా ప్రకటించారు. న్యూ ఇయర్‌ శుభాకాంక్షలు తెలుపుతూ టీజర్‌ రిలీజ్ డేట్‌తో ఓ పోస్టర్‌ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి సినిమాను ప్రేమికుల రోజు కానుకగా ఫిబ్రవరి 14న రిలీజ్‌ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. క్రియేటివ్‌ కమర్షియల్స్‌ బ్యానర్‌పై సీనియర్‌ నిర్మాత కేయస్ రామారావు సమర్పణ ఏ వల్లభ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. మలయాళ సంగీత మాంత్రికుడు గోపీ సుందర్‌ సంగీతమందిస్తున్నాడు. డియర్‌ కామ్రేడ్‌తో నిరాశపరిచిన విజయ్‌ దేవరకొండ ఈ సినిమాతో సూపర్‌ హిట్ కొట్టి తిరిగి సత్తా చాటాలని భావిస్తున్నాడు. Also Read:


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2MJfnfo
v

దిశా న్యూ ఇయర్‌ విషెస్‌.. మరీ ఇంత ఘాటుగానా..?

సినిమాలతో సంబంధం లేకుండా ఎప్పటికప్పుడు తన ఫోటోషూట్‌లతో అభిమానులను అలరిస్తున్న అందాల భామ దిశా పటాని. కాల్విన్‌ కెయిన్‌కు ప్రచార కర్తగా వ్యవహరిస్తున్న ఈ బ్యూటీ తన ఇన్నర్‌వేర్‌ ఫోటో షూట్‌లతో చలి కాలంలోనూ వేడీ పుట్టిస్తుంది. సినిమాల పరంగా పెద్దగా అవకాశాలు లేకపోయినా తన సోషల్ మీడియా పోస్ట్‌లతో ఎప్పుడూ వార్తల్లో నిలుస్తుంటుంది. తాజాగా కొత్త సంత్సరానికి ఆహ్వనం పలికేందుకు కూడా ఈ భామ తనదైన స్టైల్‌నే ఎంచుకుంది. హాట్‌ ఇన్నర్‌వేర్‌తో దిగిన ఫోటోలను పోస్ట్‌ చేస్తూ `అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఆ భగవంతుడు అందరికీ ప్రేమను పంచాలని ఆశిస్తున్నా` అంటూ ట్వీట్ చేసింది. ఈ పోస్ట్‌ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. Also Read: పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వరుణ్‌ తేజ్‌ హీరోగా తెరకెక్కిన లోఫర్‌ సినిమాతో వెండితెరకు పరిచయం అయ్యింది ఈ బ్యూటీ. తొలి సినిమాలో అందాల ప్రదర్శన విషయంలో కాస్త ఆచితూచి వ్యవహరించిన ఈ భామ, తరువాత బాలీవుడ్‌ మూవీ ధోని బయోపిక్‌లోనూ హుందాగానే కనిపించింది. Also Read: టైగర్‌ ష్రాఫ్‌ సరసన హీరోయిన్‌గా నటించిన భాగీ 2 సినిమాతో గ్లామర్‌ డోస్‌ పెంచేసిన దిశ, తరువాత బాలీవుడ్‌లో వరుసగా సినిమాలు చేస్తోంది. అయితే సినిమాల పరంగా పెద్దగా సక్సెస్‌లు లేకపోయినా వరుస అవకాశాలతో బిజీగానే ఉంది. ప్రస్తుతం ఈ భామ మలంగ్‌, కే టినా, రాధే సినిమాల్లో నటిస్తోంది. అదే సమయంలో సోషల్ మీడియాలో తన ఫోటోలను పోస్ట్ చేస్తూ అభిమానులకు మరింత చేరువవుతుంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2MM56z3
v

అదే నా జీవితంలో తీసుకున్న అతి చెత్త నిర్ణయం: నయనతార

ప్రస్తుతం స్టార్ హీరోయిన్లుగా మంచి ఫాంలో ఉన్న చాలామంది తారలు కెరీర్‌ స్టార్టింగ్‌లో చిన్న చిన్న పాత్రలు అంతగా ప్రాధాన్యం లేని హీరోయిన్‌ రోల్స్ చేసివారే. లేడీ సూపర్‌ స్టార్‌ నయన తార కూడా కెరీర్‌ స్టార్టింగ్‌లో అలాంటి సినిమాల్లో చేసింది. గతంలో తను పాత్రల ఎంపికలో చేసిన పొరపాట్ల విషయంలో కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు కూడా చేసింది. ముఖ్యంగా స్టార్‌ డైరెక్టర్‌ మురుగదాస్‌, టాప్‌ హీరో సూర్య కాంబినేషన్‌లో తెరకెక్కిన సూపర్‌ హిట్ సినిమా గజినిలో నటించటం తన కెరీర్‌లో తీసుకున్న అతి చెత్త నిర్ణయం అంటూ కామెంట్‌ చేసింది నయనతార. అంతేకాదు ఈ సినిమాలో తన పాత్ర ముందుగా చెప్పినట్టుగా తెరకెక్కించలేదని, తన లుక్‌ కూడా అంత బాగోలేదని అభిప్రాయపడింది. అయితే ఈ విషయంలో తాను ఎవరినీ తప్పు పట్టడం లేదని, అలాంటి పాత్ర చేయటం వల్ల తనకు ఓ అనుభవం అయ్యిందటూ క్లారిటీ ఇచ్చింది. Also Read: అయితే తాజాగా ఈ విషయంపై డైరెక్టర్‌ మురుగదాస్ స్పందించాడు. తాను ఉద్దేశ పూర్వంగా ఓ ఆర్టిస్ట్‌ను తక్కువ చేయటం, మరో ఆర్టిస్ట్‌కు ఎక్కువ పాత్ర ఇవ్వటం లాంటివి చేయనన్నాడు మురుగదాస్‌. కథ డిమాండ్‌ మేరకు మాత్రమే మార్పులు ఉంటాయని గజిని విషయంలో కూడా అదే జరిగిందంటూ క్లారిటీ ఇచ్చాడు. గజిని తరువాత ఇన్నేళ్లకు మురుగదాస్ దర్శకత్వంలో నటించింది నయనతార. వీరి కాంబినేషన్‌లో తెరకెక్కిన దర్బార్‌ మూవీ జనవరి 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. సూపర్‌ స్టార్‌ రజనీకాంత్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమాలో నయన్‌ హీరోయిన్‌గా నటించింది. రజనీ రూత్‌లెస్‌ బ్యాడ్‌ పోలీస్‌గా నటిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. Also Read:


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2FaXO3M
v

Sri Reddy: నా కాళ్లు పట్టుకుంటానని.. ఇప్పుడు ఆమె కాళ్లపై పడ్డావేం వర్మా.. నేను హర్టూ!

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఏంటి? ఆమె హీరోయిన్ కాళ్లపై పడటం ఏంటి? మరీ ఇంత దిగజారిపోయాడా? ఇప్పుడు టాలీవుడ్ సర్కిల్స్‌లో ఇదే చర్చ. వర్మ శిష్యుడు అగస్థ్య మంజు దర్శకత్వం వహించిన ‘బ్యూటిఫుల్’ మూవీ న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా వర్మ చేస్తున్న రచ్చ అంతా ఇంతా కాదు. ఎప్పుడూ వివాదాస్పద వ్యాఖ్యలతో సినిమాను ప్రమోట్ చేసుకునే వర్మ ఈసారి తన పంథా మార్చి వింత వ్యక్తిగా మారారు. ప్రమోషనల్ ప్రెస్ మీట్‌లలో హీరోయిన్స్‌ నైనా గంగూలీతో పబ్లిక్‌గా రొమాన్స్ చేస్తూ ఆమెతో డాన్స్ చేస్తూ రచ్చ రచ్చ చేస్తున్నారు. అంతటితో ఆగకుండా ప్రీ న్యూ ఇయర్ పార్టీ పేరుతో సెలబ్రేషన్స్ నిర్వహించిన వర్మ.. అక్కడ తాగుతూ తూలుతూ ఇష్టం వచ్చినట్టుగా అమ్మాయిలతో డాన్స్ చేసి వింతగా ప్రవర్తించారు. ‘కసితీరా’ అంటూ బ్యూటిఫుల్ హీరోయిన్ నైనా గంగూలీతో డాన్స్ చేసి ఆమె కాళ్లపై పడ్డాడు. నైనా కాళ్లపై వర్మ ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక వర్మ మాదిరే వివాదాలకు కేరాఫ్ అడ్రస్ అయిన వివాదాస్పద నటి శ్రీరెడ్డి వర్మ చేసిన పనికి ఫసక్ లాంటి పంచ్‌లేసింది. ‘వర్మ నన్ను చీట్ చేశారు.. నన్ను దేవత అని పొగుడుతూ.. నా కాళ్లు పట్టుకుంటాన్నారు.. ఇప్పుడేమో ఆ హీరోయిన్ కాళ్లు పట్టుకున్నారు.. నేను హర్ట్ అయ్యా’ అంటూ ఫేస్ బుక్‌లో పోస్ట్ వదిలింది శ్రీరెడ్డి.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2QDrThN
v

ప్రతిరోజూ పండగే డిలీట్ సీన్ 2: పిసుకుడు డాక్టర్‌గా TNR , భద్రం మాత్రం అదే పనిలో..

‘ప్రతిరోజూ పండగే’ చిత్రంతో హిట్ అందుకున్నారు సుప్రీమ్ హీరో సాయి తేజ్. మారుతి దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రానికి మిక్స్డ్ టాక్ వచ్చినప్పటికీ ఫ్యామిలీ ఆడియన్స్‌ ఆదరించడంతో హిట్ లిస్ట్‌లో చేరి సాయి తేజ్‌ కెరియర్‌లో బెస్ట్ ఓపెనింగ్స్ రాబట్టింది. ఇక ఈ మూవీ ప్రమోషన్స్‌ను విడుదల తరువాత కూడా వేగవంతం చేశారు చిత్ర యూనిట్.. ప్రతిరోజూ పండగే సెలబ్రేషన్స్ నిర్వహిస్తూ సందడి చేస్తున్నారు. ఇక ఈ చిత్రంలోని డిలీట్ సీన్‌లను ఒక్కొక్కటిగా విడుదల చేస్తూ మరింత ఆసక్తిని రేకెత్తిస్తున్నారు. మంగళవారం నాడు సింక్ బ్రదర్స్ కాంబినేషన్ సీన్‌ను విడుదల చేయగా.. దానికి ఓ మోస్తరు స్పందన వచ్చింది. అయితే కొద్దిసేపటి క్రితం మరో సీన్‌ను విడుదల చేసింది చిత్ర యూనిట్. ఇందులో రావురమేష్, ఐ డ్రీమ్స్ టీఎన్ఆర్ కాంబినేషన్ సీన్ పొట్ట చెక్కలు చేస్తుంది. ఫస్ట్రేషన్‌తో బీపీ తెచ్చుకున్న రావురమేష్‌కి వైద్యం చేయడానికి వచ్చిన టీఎన్ఆర్‌కి హై ఫస్ట్రేషన్ అవ్వడం.. దాన్ని తగ్గించుకునేందుకు జేబులో స్మైలీ బాల్ పట్టుకుని పిసుక్కుంటూ ఉండటం.. ‘నాక్కూడా బీపీ ఉంది.. అందుకే జేబులో బాల్ పెట్టుకుని పిసుక్కుంటా’ అని చెప్పే సీన్ నవ్వులు పుట్టిస్తోంది. ఈ బీపీ డాక్టర్‌ని చూసి రావు రమేష్‌కి మరింత బీపీ పెరగడం.. వీళ్ల గొడవలో వీళ్లు ఉంటే.. పక్కనే కమెడియన్ భద్రం తన కొత్త భార్యతో సరసాలు ఆడుతూ కనిపించడం.. అతనిపైకి రావు రమేష్ బాల్ విసరడం పొట్ట చెక్కలు చేస్తుంది. మొత్తంగా యూట్యూబ్‌లో తన ఇంటర్వ్యూలతో సీరియస్‌గా కనిపించే టీఎన్ఆర్ ఈ సీన్‌తో తనలోని కమెడియన్‌ని బయటకు తీశారు. ఇంటర్వ్యూల మాదిరే.. సీన్ కూడా పేలింది కాని.. ఈ కొత్త కమెడియన్ ఎందుకు అనుకున్నారో ఏమో కాని ఈ సీన్‌కి బిగ్ స్క్రీన్‌పై కత్తెరేసి ఇదిగో ఇలా యూట్యూబ్‌లో విడుదల చేశారు. ఎలాగూ టీఎన్ఆర్‌కి యూట్యూబ్‌లో మంచి ఫాలోయింగ్ ఉంది కాబట్టి.. మంచి వ్యూస్ రాబడుతోంది ఈ డిలేటెడ్ కామెడీ సీన్.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2thhK2b
v

బిగ్ బాస్ బ్యూటీ బికినీ షో.. వామ్మో తేజస్వి!

బిగ్ బాస్ బ్యూటీ గురించి తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అవసరంలేదు. యాంకర్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, హీరోయిన్‌గా టాలీవుడ్‌లో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న తేజస్వి.. ‘బిగ్ బాస్’ రియాలిటీ షోలో పాల్గొనడం ద్వారా బాగా పాపులర్ అయ్యింది. బిగ్ బాస్ సీజన్ 2లో ఆమె కంటెస్టెంట్‌గా హౌస్‌లోకి వెళ్లి హాట్ బ్యూటీగా ఇమేజ్‌ను క్రియేట్ చేసుకుంది. అయితే, బిగ్ బాస్ హౌస్ నుంచి బయటికి వచ్చిన తరవాత ఆమెకు సినిమా అవకాశాలు పెద్దగా రాలేదు. దీంతో టీవీ షోలలో ఎక్కువగా పాల్గొంది. మొత్తానికి ఇటీవల ‘మీటూ’ అనే సినిమాను అంగీకరించింది. క్యాస్టింగ్ కౌచ్ సారాంశంతో ఈ సినిమా తెరకెక్కుతోంది. ప్రస్తుతం తేజస్వి ఇండోనేసియాలోని గిలి దీవుల్లో హాలీడేను ఎంజాయ్ చేస్తోంది. తన ఫ్రెండ్స్‌తో కలిసి అక్కడికి వెళ్లిన తేజస్వి హాట్ హాట్ ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తోంది. అయితే, తాజాగా తేజస్వి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన బికినీ ఫొటో చాలా హాట్‌గా ఉంది. స్విమ్మింగ్ పూల్ ఒడ్డున టూ పీస్ బికినీలో తలకు హ్యాట్ పెట్టుకుని స్టైలిష్ పోజ్ ఇచ్చింది. అంతేకాదు, స్విమ్మింగ్ పూల్‌లోని నీటిపై అల్పాహారం ఉంచిన పడవలాంటి బుట్ట కూడా చాలా అందంగా కనిపిస్తోంది. మొత్తం మీద ప్రేక్షకులు తనను మరిచిపోకుండా ఉండటానికి అందాలను ఆరబోస్తూ సోషల్ మీడియా ద్వారా సెగలు పుట్టిస్తోంది తేజస్వి. See Photos: ఇదిలా ఉంటే, 2013లో వచ్చిన ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ చిత్రం ద్వారా తేజస్వి తెలుగు తెరకు పరిచయమైంది. రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన ‘ఐస్‌క్రీం’ చిత్రంతో హీరోయిన్‌గా మారింది. ఈ సినిమాలో హాట్ హాట్‌గా అందాలు ఆరబోసింది. ‘లవర్స్’, ‘మళ్లీ మళ్లీ ఇది రాని రోజు’, ‘కేరింత’, లాంటి చిత్రాల్లో నటించి మెప్పించిన తేజస్వి.. బిగ్ బాస్ సీజన్ 2 షోలో కంటెస్టెంట్‌గా అడుగుపెట్టింది. తేజస్వి నటించిన ఆఖరి సినిమా ‘బాలకృష్ణుడు’. ఆ సినిమా తరవాత మళ్లీ తేజస్వి వెండితెరపై కనిపించలేదు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2SN9G49
v

‘బ్యూటిఫుల్’ హీరోయిన్‌కి ‘జార్జిరెడ్డి’ హీరో ఛాలెంజ్

వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ సమర్పణలో వస్తోన్న ‘బ్యూటిఫుల్’ సినిమా హీరోయిన్ నయనా గంగూలీకి ‘జార్జిరెడ్డి’ హీరో సందీప్ మాధవ్ ఒక ఛాలెంజ్ విసిరారు. ఇంతకీ ఏంటా ఛాలెంజ్ అనుకుంటున్నారా..? ఈ మధ్య సెలబ్రిటీలు ఒకరిపై ఒకరు విసురుకుంటోన్న గ్రీన్ ఇండియా ఛాలెంజ్. చెట్లను కాపాడుకోవాలని, ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలనే కాన్సెప్ట్‌తో రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌కు సినీ ప్రముఖుల నుంచి మంచి స్పందన వస్తోంది. గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా ప్రముఖ గాయని మంగ్లీ ఇచ్చిన ఛాలెంజ్‌ను స్వీకరించిన సందీప్ మాధవ్.. బుధవారం మోతినగర్ పార్కులో జీహెచ్‌ఎంసీ డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్‌తో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా హీరో సందీప్ మాట్లాడుతూ పెరిగిపోతున్న వాతావరణ కాలుష్యాన్ని అరికట్టాలంటే ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలని కోరారు. రాజ్యసభ సభ్యులు సంతోష్ ఒక గొప్ప కార్యక్రమాన్ని చేపట్టారని దానిలో తాను కూడా భాగస్వామి అయి మొక్కలు నాటడం చాలా సంతోషంగా ఉందని చెప్పారు. భవిష్యత్తులో సంతోష్ ఏ కార్యక్రమం చేపట్టినా తాను తోడుగా ఉంటానని సందీప్ మాధవ్ హామీ ఇచ్చారు. కాగా, ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను సందీప్ మాధవ్ మరో నలుగురురికి విసిరారు. డైరెక్టర్ జీవన్ రెడ్డి, హీరోయిన్ నయనా గంగూలీ, నటుడు శత్రువు, హీరోయిన్ కుంప్ చాందినికి మొక్కలు నాటాలని ఛాలెంజ్ విసిరారు. ఈ కార్యక్రమంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కో ఫౌండర్ రాఘవ, ప్రతినిధి కిషోర్ గౌడ్, కాలనీ అధ్యక్షులు ఇందర్ సింగ్, కాలనీ వాసులు పాల్గొన్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2FaBgAg
v

‘ప్రతిరోజూ పండగే’ డిలీటెడ్ సీన్: తీసేసి మంచిపని చేశారట!

సినిమాను తెరకెక్కించడం అనేది ఒక పెద్ద ప్రక్రియ. సినిమా మొత్తాన్ని చిత్రీకరించిన తరవాత ఎడిటింగ్ రూమ్‌లో దానికి చాలా కత్తెరలు వేస్తారు. నిడివి తగ్గించడానికో, ఈ సన్నివేశం అవసరంలేదనో కొన్ని సీన్లను తొలగిస్తారు. అలా తొలగించినవాటిలో మంచి సీన్స్ ఉంటే ఈ మధ్య చిత్ర నిర్మాణ సంస్థలు యూట్యూబ్‌లో పెట్టేస్తున్నాయి. వాటికి కూడా మంచి వ్యూస్ వస్తున్నాయి. తాజాగా ‘ప్రతిరోజూ పండగే’ సినిమా నుంచి డిలీట్ చేసిన సీన్‌ను గీతా ఆర్ట్స్ సంస్థ యూట్యూబ్‌లో పెట్టింది. సాయిధరమ్ తేజ్, రాశీ ఖన్నా జంటగా నటించిన చిత్రం ‘ప్రతిరోజూ పండగే’. సత్యరాజ్, రావు రమేష్ కీలక పాత్రలు పోషించారు. మారుతి దర్శకత్వం వహించారు. తమన్ సంగీతం సమకూర్చారు. అల్లు అరవింద్ సమర్పణలో యూవీ క్రియేషన్స్, జీఏ2 పిక్చర్స్ బ్యానర్లపై బన్నీ వాస్ ఈ చిత్రాన్ని నిర్మించారు. డిసెంబర్ 20న విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. బాక్సాఫీసు వద్ద మంచి వసూళ్లు రాబడుతోంది. ఔట్ అండ్ ఔంట్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమాలో తొలగించిన ఒక సన్నివేశాన్ని తాజాగా గీతా ఆర్ట్స్ సంస్థ యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేసింది. హీరో తాతయ్య రఘురామయ్య తన వ్యవసాయ భూమిలో భార్య సమాధి కట్టుకుంటాడు. ఈ సమాధి వద్దకు వెళ్లే దారి వేరొక పొలంలో నుంచి ఉంటుంది. ఆ పొలాన్ని సింక్ బ్రదర్స్ కొనుగోలు చేస్తారు. పక్కనే ఉన్న రఘురామయ్య స్థలం మీద కూడా కన్నేస్తారు. కానీ, ఆయన అమ్మడానికి ఒప్పుకోరు. Also Read: దీంతో రఘురామయ్య తన భార్య సమాధి వద్దకు వెళ్లకుండా సింక్ బ్రదర్స్ తాము కొనుగోలు చేసిన పొలంలో అడ్డంగా కంచె వేస్తారు. సమాధి వద్దకు వెళ్లడానికి దారిలేక రఘురామయ్య చాలా బాధపడుతూ ఉంటారు. అమెరికా నుంచి వచ్చిన రఘురామయ్య మనవడు సాయి విషయం తెలుసుకుని సింక్ బ్రదర్స్ మనుషులను కొట్టి కంచె పీకి పారేస్తాడు. సింక్ బ్రదర్స్ అక్కడి నుంచి పరారైపోతారు. ఇదంతా సినిమాలో చూపించారు. అయితే, సింక్ బ్రదర్స్ కొనుగోలు చేసిన స్థలం రఘురామయ్య స్నేహితుడు సూర్యనారాయణది. కాకపోతే వీళ్లిద్దరి మధ్య చాలా రోజుల నుంచి మాటలు ఉండవు. దీంతో వీళ్లిద్దరిని కలిపే ప్రయత్నం చేస్తాడు సాయి. తన తాతయ్య కోరిక మేరకు సూర్యనారాయణ మనవరాలు ఏంజెల్ ఆర్నాను పెళ్లిచేసుకోవడానికి సూర్యనారాయణ కుటుంబానికి తగ్గరయ్యే ప్రయత్నం చేస్తుంటాడు. ఈ క్రమంలో సాయి గురించి సూర్యనారాయణ వద్ద తప్పుగా చెప్పడానికి సింక్ బ్రదర్స్ వస్తారు. కానీ, వాళ్ల మాటలను పక్కనబెట్టి సాయితో కలిసి సూర్యనారాయణ పొలం వద్దకు బయలుదేరుతారు. ఈ సన్నివేశాన్ని సినిమా నుంచి తొలగించారు. ఇప్పుడు దీన్నే యూట్యూబ్‌లో పెట్టారు. ఈ సన్నివేశం ఏమీ అంత గొప్పగా లేదు. ఇదే విషయాన్ని ప్రేక్షకులు కూడా వెల్లడిస్తున్నారు. యూట్యూబ్ వీడియో కింద కామెంట్లు పెడుతున్నారు. ఈ సన్నివేశం సినిమా నుంచి తొలగించి మంచి పనిచేశారని అంటున్నారు. ఈ సీన్‌ను డిలీట్ చేసినందుకు థ్యాంక్స్ అని కామెంట్స్ చేస్తున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2Qbhbjk
v

అలా చేయటం మాట తప్పటమేం కాదు: రామ్ గోపాల్ వర్మ

సంచలన దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. సక్సెస్‌, ఫెయిల్యూర్స్‌తో సంబంధం లేకుండా వరుస పెట్టి సినిమాలు రిలీజ్ చేస్తున్నాడు. అంతేకాదు సమాజంలో అందరి దృష్టిని ఆకర్షించిన చాలా సంఘటనలపై వర్మ సినిమాలు చేస్తానంటూ ప్రకటించాడు. అలా చెప్పిన చాలా సినిమాలు రిలీజ్ చేశాడు కూడా. కమ్మరాజ్యంలో కడపరెడ్లు, లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ లాంటి సినిమాలు అలా తెరకెక్కించినవే. అయితే వర్మ ఇలా పదుల సంఖ్యలో సినిమా టైటిల్స్‌ ఎనౌన్స్‌ చేశాడు. అమ్మ, కుర్చీ. రెడ్డిగారు పోయారు, నయీం, శశికల ఇలా రాష్ట్రాన్నీ కదిలించే స్థాయి సంఘటన ఏది జరిగినా ఏదో ఒక సినిమా టైటిల్‌ను ఎనౌన్స్‌ చేస్తూ వచ్చాడు వర్మ. Also Read: తాజాగా అలా తాను ఎనౌన్స్‌ చేసిన సినిమా విషయంలో క్లారిటీ ఇచ్చాడు వర్మ. తాను ప్రకటించిన నయీం, శశికల సినిమాలు తానే మర్చిపోయానని చెప్పి అందరికీ షాక్‌ ఇచ్చాడు. అంతేకాదు తాను అలా పక్కకు పడేసిన టైటిల్స్‌, సినిమాలు దాదాపు 10 వరకు ఉంటాయని చెప్పాడు. కొంత మంది వ్యక్తులతో మాట్లాడినప్పుడు కొన్ని లైన్స్‌, టైటిల్స్‌ ఇంట్రస్టింగ్‌గా అనిపిస్తాయి. కానీ తరువాత సినిమాగా తెరకెక్కించే అంత కంటెంట్‌ రెడీ కాకపోవటంతో ఈ ప్రాజెక్ట్స్‌ పక్కనపడిపోతాయి. అలాగే వర్మ చాలా సినిమాలను పక్కన పడేశాడు. అయితే సినిమా ఎనౌన్స్‌ చేసి చేయకపోవటం మాట తప్పటం ఏం కాదంటున్నాడు వర్మ. Also Read: తాజాగా వర్మ నిర్మాణంలో తెరకెక్కిన బ్యూటీఫుల్‌ న్యూ ఇయర్‌ కానుకగా జనవరి 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. వర్మ సూపర్‌ హిట్ రంగీలాకు ట్రిబ్యూట్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో వర్మ ఆస్థాన నటి నైనా గంగూలి బోల్డ్‌ రోల్‌లో నటించింది. ప్రస్తుతం వర్మ ఈ సినిమా ప్రమోషన్‌ కార్యక్రమాల్లో ఫుల్‌ బిజీగా ఉన్నాడు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/36blGA1
v

శ్రీరెడ్డికి చుక్కలు చూపిస్తున్న చెన్నై వాసులు.. నావల్ల కాదంటూ ఏడుపు

హైదరాబాద్‌లో నానా హంగామా చేసి మొత్తానికి చెన్నై వెళ్లిపోయింది . అక్కడ గుళ్లకు వెళుతూ భక్తురాలిగా మారిపోయింది. తమిళనాడు ప్రజల కోసం సాయం చేయాలనుకుంటున్నాని ఇప్పటికే చాలా వీడియోలు పెట్టింది. నిర్మాణ సంస్థను ఏర్పాటుచేసి తమిళనాడుకు చెందిన యువ టాలెంట్‌ను ప్రోత్సహించాలని అనుకుంటున్నానని తెలిపింది. ఇక్కడివరకు బాగానే ఉంది కానీ.. గత కొన్ని రోజులుగా తమిళనాడు ప్రజలు శ్రీరెడ్డిని బాగా టార్చర్ పెడుతున్నారట. శ్రీరెడ్డి ఉంటున్న ప్రదేశంలోనే విశ్రాంత అసిస్టెంట్ కమిషనర్ నివాసం ఉంది. అక్కడ ఓ వెబ్ సిరీస్ షూటింగ్ జరుగుతోందట. ఈ వెబ్ సిరీస్‌లో తమన్నా నటిస్తున్నారు. అయితే షూటింగ్‌కి వచ్చే వారంతా తమ వాహనాలను శ్రీరెడ్డి నివాసం ముందు పార్క్ చేస్తున్నారట. ఫ్యాన్స్ తన ఇంటి ముందు కూర్చుకుంటున్నారట. దాంతో విసిగిపోయిన శ్రీరెడ్డి ఎన్నో సార్లు పోలీసులకు ఫిర్యాదు చేసింది. కానీ ఫలితం లేకుండాపోయింది. ఇక ఏం చేయాలో తెలీక లైవ్ వీడియోను పోస్ట్ చేస్తూ తన బాధను చెప్పుకుంది. READ ALSO: ‘నా ఇంటి ముందు ఉన్నవారంతా నాపై కామెంట్స్ చేస్తుంటారు. తమన్నా సెక్యూరిటీ గార్డ్స్ న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్నారు. ఇక్కడ తమన్నా షూటింగ్ చేస్తోంది. అయితే ఏంటి? నేను ఈరోజు పోలీసులకు ఫిర్యాదు చేస్తాను. గత పదిహేను రోజులుగా వీళ్లు నన్ను టార్చర్ పెడుతున్నారు. రోజూ ఇంటి ముందు ఉన్న రహదారులను బ్లాక్ చేస్తున్నారు. ఇక్కడ మేమెలా బతకాలి. పోలీసులు కూడా వీరికే సపోర్ట్ చేస్తున్నారు. పోలీసులు వారితో ఎలా కుమ్మక్కయ్యారో తెలీదు. నా ఇంటి ముందే వాళ్లు ఉంటే నేను నా పనులు ఎలా చేసుకుంటాను. దేనికైనా లిమిట్ అంటూ ఉంటుంది. నేను నా ఇంటికి చాలా రెంట్ ఇస్తున్నాను. అందుకు తగ్గట్టుగా నాకు సెక్యూరిటీ, సౌకర్యం ఉండాలి.’’ READ ALSO: ‘‘ఇక్కడ మాజీ అసిస్టెంట్ కమిషనర్ ఇల్లు ఉందట. అయితే ఏంటి? ఒంటరిగా ఆడదాన్ని ఇక్కడ ఉంటుంటే మీరు నన్ను టార్చర్ పెడుతున్నారు. మీరు షూటింగ్ చేసుకుంటుంటే నేనెందుక అడ్జస్ట్ అవ్వాలి. తమిళనాడు ప్రభుత్వానికి నా విన్నపం ఒక్కటే. నేనే కాదు నా చుట్టు పక్కల ఉన్నవారు కూడా వీరితో చాలా ఇబ్బందిపడుతున్నారు. నాకు కడుపు నొప్పో లేదా గుండె నొప్పో వస్తే అత్యవసర సమయాల్లో నేను బయటికి ఎలా వెళ్లాలి. నేనేమన్నా జైల్లో ఉంటున్నాను. ఉదయం నుంచి సాయంత్రం వరకు అభిమానులు నా ఇంటి ముందు కూర్చుకుంటున్నారు. ఒకరోజంటే ఊరుకోవచ్చు రోజూ ఇలాగే చేస్తు్న్నారు. నాపై కామెంట్స్ చేస్తున్నారు. ఆ మాజీ అసిస్టెంట్ కమిషనర్ కూతురిపై, భార్యపై ఇలాంటి కామెంట్స్ చేస్తే ఆయన ఊరుకుంటారా? మీరు లక్షలు సంపాదిస్తారు మీ ఇంటిని షూటింగ్స్‌కి ఇచ్చుకుని, నేను మాత్రం అడ్జస్ట్ అవ్వాలా? తమిళ మీడియా దీనిపై స్పందించాలి’’ READ ALSO: ‘‘తమన్నా వెబ్ సిరీస్ షూటింగ్ ప్రశాంతంగా జరిగిపోవాలి కానీ మేం మాత్రం ఇలా అల్లాడిపోవాలా. ఇలా ఇతరులను కష్టపెట్టి వెబ్ సిరీస్ షూటింగ్ చేసుకుంటూ వారు సంతోషంగా ఉంటారా? నేను భవానీ మాలలో ఉన్నాను కాబట్టి ఎవ్వరినీ ఏమీ అనలేకపోతున్నాను. నేనెందుకు ఇల్లు మారాలి. మమ్మల్ని ఎప్పుడు పడితే అప్పుడు ఎక్కడ పడితే అక్కడ కష్టపెడుతుంటే మేం ఇళ్లు ఖాళీ చేస్తూ పోవాలా. ఇప్పటివరకు నేను నా ఫోన్ నెంబర్ కూడా మార్చలేదు. చాలా మంది నన్ను టార్చెర్ పెట్టినా కూడా నేను ఫోన్ నెంబర్ మార్చలేదు. నేనెందుకు మార్చాలి’’ ‘‘ చాలా మంది నాపై కామెంట్ చేస్తారు. ముస్లింలు కూడా నాపై కామెంట్ చేస్తున్నారు. నేను మీ మతాన్ని గౌరవిస్తాను, మీరూ నా మతాన్ని గౌరవించాలి. నేనెందుకు ఇంతగా పోరాడుతున్నానో చెప్పలేదు కదా. నిన్న నేను బయటికి వెళ్లి వచ్చేలోగా నా ఇంటి ముందు రోడ్డంతా బ్లాక్ చేసేశారు. దాంతో నేను నా కారును అక్కడే వదిలేసి వెళ్లా్ల్సి వచ్చింది. తీరా ఉదయం వెళ్లి చూస్తే నా కారుపై గీతలు వేసేశారు. తమన్నా అయితే ఏంటి చిరంజీవి అయితే ఏంటి. ఎవడు ఏ షూటింగైనా చేసుకోండి. కానీ మమ్మల్ని ఎందుకు టార్చర్ పెడుతున్నారు? అందుకే నేను ఇంతగా పోరాడుతున్నా. ఈరోజు ఏదేమైనా నేను పోలీసులకు ఫిర్యాదు చేసి తీరుతాను’’ అంటూ వీడియోలో పేర్కొంది శ్రీరెడ్డి.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/39tOlCs
v

Monday 30 December 2019

2019లో అత్యధికంగా అమ్ముడుపోయింది ఈ సినిమా టికెట్లే..

కొత్త కంటెంట్, కొత్త టాలెంట్ ఉన్నా కూడా కొన్ని విషయాల్లో మన భారతీయ చిత్ర పరిశ్రమ హాలీవుడ్‌ను దాటలేకపోతోంది. హాలీవుడ్ కంటే మన ఇండియా నుంచి విడుదలయ్యే సినిమాల సంఖ్యే ఎక్కువ. కానీ అక్కడి సినిమాలకు భారతదేశంలో విపరీతమైన క్రేజ్ ఉంది. ఆ విషయం ‘అవెంజర్స్: ఎండ్‌గేమ్’ సినిమా చూస్తేనే అర్థమైపోతుంది. ఇంతకీ విషయం ఏంటంటే.. 2019లో అత్యధికంగా అమ్ముడుపోయిన సినిమాల టికెట్ల జాబితాను విడుదల చేసింది ప్రముఖ ఆన్‌లైన్ టికెటింగ్ పోర్టల్ బుక్ మై షో. అత్యధికంగా ఇండియాలో ‘అవెంజర్స్: ఎండ్‌గేమ్’ సినిమా టికెట్లే అమ్ముడుపోయాయి (ఆన్‌లైన్లో). మార్వెల్ స్టూడియోస్ తెరకెక్కించిన ఈ సినిమా కోసం ప్రపంచమంతా థియేటర్లకు పరుగులుపెట్టింది. ఇందుకు కారణం అవెంజర్స్ ఫ్రాంచైస్ నుంచి విడుదలైన చివరి సినిమా ఇదే కావడం. ఈ సినిమాలో ఐరన్ మ్యాన్, థార్, కెప్టెన్ అమెరికా, బ్లాక్ విడో వంటి సూపర్ హీరో క్యారెక్టర్స్ అన్నీ ఒకే చోట చేరడంతో సినిమా కలెక్షన్లతో బాక్సాఫీస్‌ను దున్నేసింది. బుక్ మై షో 2019లో అన్ని భాషల్లో కలిపి 1880 సినిమాల టికెట్లను ఆన్‌లైన్‌లో అమ్మింది. వీటిలో ‘అవెంజర్స్: ఎండ్‌గేమ్’ సినిమాకు సంబంధించిన 8.6 మిలియన్ టికెట్లు అమ్ముడుపోయి టాప్ స్థానంలో ఉంది. అంతేకాదు భారతదేశంలో హయ్యస్ట్ సెల్లింగ్ హాలీవుడ్ చిత్రంగానూ నిలిచింది. ఆ తర్వాత స్థానంలో బాలీవుడ్ నటుడు విక్కీ కౌషల్ నటించిన ‘ఉరి: ది సర్జికల్ స్ట్రయిక్స్’ సినిమా ఉంది. READ ALSO: ఈ సినిమా నుంచి 5.7 మిలియన్ టికెట్లు అమ్ముడుపోయాయి. ఆ తర్వాత స్థానాల్లో ‘కబీర్ సింగ్’, ‘సాహో’, ‘వార్’, ‘ది లయన్ కింగ్’, ‘మిషన్ మంగళ్’ ఉన్నాయి. బుక్ మై షో డేటా ప్రకారం.. గతేడాదితో పోలిస్తే 2019లో హిందీ సినిమాలకు పన్నెండు శాతం డిమాండ్ పెరిగింది. టాప్ రీజినల్ సినిమాల్లో తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, మరాఠీ చిత్రాలు నిలిచాయి. మలయాళ సినిమాల డిమాండ్ 108 శాతానికి పెరిగింది. హాలీవుడ్ 45 శాతం, హిందీ 25 శాతం డిమాండ్ పెరిగింది. 2019లో బాలీవుడ్ ఖిలాడీ అక్షయ్ కుమార్ నటించిన సినిమాలకు సంబంధించి 9.2 మిలియన్ టికెట్లు అమ్ముడుపోయాయి. ఆ తర్వాత స్థానంలో ఆయుష్మాన్ ఖురానా ఉన్నాడు. ఇక లైవ్ ఎంటర్‌టైన్మెంట్ విషయానికొస్తే.. ఇంటర్నేషనల్ లైవ్ ఈవెంట్స్‌కి బుక్ మై షోలో 62 శాతం డిమాండ్ పెరిగింది. READ ALSO:


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/39rNO45
v

బన్నీ ఫ్యాన్స్‌కు న్యూ ఇయర్‌ గిఫ్ట్‌.. సూపర్‌ హిట్‌ సాంగ్‌ వీడియో

ఈ ఏడాది బిగ్గెస్ట్ హిట్ సాధించిన పాటల్లో టాప్‌ లిస్ట్‌ లో ఉండే సాంగ్ `సామజవరగమన`. అల వైకుంఠపురములో సినిమాలోని ఈ పాట లిరికల్‌ వీడియో ఇప్పటికే 100 మిలియన్లకు పైగా వ్యూస్‌ సాధించిన రికార్డ్ సృష్టించింది. తమన్‌ సంగీత సారధ్యంలో సిద్ధ్‌ శ్రీరామ్‌ ఆలపించిన ఈ పాటకు సిరివెన్నెల సీతారామ శాస్త్రీ సాహిత్యమందించాడు. ఇప్పటికీ టాప్‌లో ట్రెండ్ అవుతున్న ఈ పాట వీడియో ప్రోమోను న్యూ ఇయర్‌ కానుకగా విడుదల చేశారు. 59 సెకన్ల నిడివితో రిలీజ్‌ అయిన ఈ ప్రోమో వావ్‌ అనిపించేలా ఉంది. పారిస్‌లోని అందమైన లోకేషన్‌లో ఈ పాటను చిత్రీకరించారు. బన్నీ స్టైలింగ్‌తో పాటు స్టైలిష్ డాన్స్‌ మూవ్స్‌ పాటకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. హీరోయిన్‌ పూజా హెగ్డే అందాలు మరింత గ్లామర్‌ను యాడ్‌ చేశాయి. Also Read: లాంగ్ గ్యాప్‌ తరువాత అల్లు అర్జున్‌ చేస్తున్న సినిమా కావటంతో ఈ మూవీపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. త్రివిక్రమ్‌ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను గీతా ఆర్ట్స్‌, హారికా హాసిని క్రియేషన్స్‌ బ్యానర్లపై అల్లు అరవింద్‌, రాధాకృష్ణలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో యంగ్ హీరో సుశాంత్‌, నివేదా పేతురాజ్‌, నవదీప్‌, టబు, జయరామ్‌లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా సినిమాతో నిరాశపరిచిన బన్నీ, ఈ సినిమాతో సూపర్‌ హిట్‌ కొట్టి తిరిగి ఫాంలోకి రావాలని ప్లాన్‌ చేస్తున్నాడు. అందుకు తగ్గట్టుగా ప్రమోషన్‌ కార్యక్రమాలను కూడా భారీగా ప్లాన్ చేస్తున్నారు. Also Read:


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2F8RLg0
v

పాపం రకుల్.. ఐదేళ్లు అవుతున్నా ఆ సినిమా రిలీజ్ అవ్వట్లేదు

ఎంత మంచి కాన్సె్ప్ట్‌ ఉన్నా, స్టార్ నటీనటులు ఉన్నా కొన్ని కారణాల వల్ల సినిమా విడుదల కాకపోవచ్చు. అలాంటి పరిస్థితే అగ్ర కథానాయిక రకుల్ ప్రీత్‌ సింగ్‌కు ఎదురైంది. హీరోయిన్‌గా బాలీవుడ్ నటుడు రాజ్‌కుమార్ రావు, డ్రీమ్ గర్ల్ హేమమాలిని ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ‘షిమ్లా మిర్చి’. ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్ రమేష్ సిప్పీ సినిమాను డైరెక్ట్ చేశారు. చక్కటి కాన్సెప్ట్‌తో కామెడీ నేపథ్యంలో తెరకెక్కించిన ఈ సినిమా షూటింగ్ ఐదేళ్ల క్రితమే పూర్తైపోయింది. కానీ ఇప్పటివరకు ఈ సినిమా విడుదలకు నోచుకోలేదు. ఇటీవల ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేస్తూ సినిమాను జనవరి 3న రిలీజ్ చేస్తున్నట్లు డైరెక్టర్ ప్రకటించారు. అయితే ఈ సినిమాకు థియేటర్‌లో విడుదలయ్యే అవకాశం లేదేమో. అందుకే ఓటీటీ (ఓవర్ ది టాప్) ప్లాట్‌ఫాం అయిన నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్ చేయాలని నిర్మాణ సంస్థ వయాకామ్ 18 నిర్ణయించింది. అయితే ఈ విషయం గురించి రకుల్, రాజ్‌కుమార్, హేమ మాలినికి కానీ డైరెక్టర్ రమేష్ సిప్పీకి కానీ చెప్పలేదట. వారి అనుమతి లేకుండానే సినిమాను నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్ చేస్తున్నందుకు రమేష్‌కి కోపం వచ్చినట్లు సన్నిహితులు మీడియా ద్వారా వెల్లడించారు. READ ALSO: ‘‘వయాకామ్ 18 సంస్థ ‘షిమ్లా మిర్చి’ సినిమాను నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్ చేయాలని వారికి వారే నిర్ణయించేసుకున్నారు. ఇక రమేష్ సిప్పీ ఏం చెప్పగలరు. 2014లో రమేష్ ఈ సినిమాను 17 కోట్లు పెట్టి తెరకెక్కించారు. 2015లో సినిమా పూర్తయ్యాక నిర్మాతల చేతిలో పెట్టారు. వాళ్లు ఎందుకు ఈ సినిమాను తమ వద్దే నాలుగేళ్లు పెట్టుకున్నారో, తీరా విడుదలయ్యే సమయానికి ఎందుకు థియేటర్‌లో కాకుండా నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల చేస్తున్నారో చెప్పలేదు. వయాకామ్ చాలా సార్లు ఇలాగే తమ సినిమాలను ఓటీటీ ప్లాట్‌ఫాంలో రిలీజ్ చేసేసింది. ఇటీవల విడుదలైన లుకా చుప్పి, పతి పత్ని ఔర్ వో సినిమాలు బాగా ఆడాయి. అలాంటప్పుడు ‘షిమ్లా మిర్చి’ పట్ల ఇలా ఎందుకు ప్రవర్తిస్తున్నారో తెలీడంలేదు’’ అని రమేష్ సన్నిహితులు తెలిపారు. READ ALSO: ఇంతకీ ఈ సినిమా కథేంటంటే.. అవి (రాజ్‌కుమార్ రావు)కి నైనా (రకుల్) అంటే చాలా ఇష్టం. కానీ అవికి ఓ ప్రాబ్లమ్ ఉంది. ఎప్పుడు నైనాను చూసినా ఐ లవ్యూ అనే మాట చెప్పలేక ‘ఐ’ అన్న పదం దగ్గరే ఆగిపోతుంటాడు. దాంతో చెప్పే ధైర్యం లేకపోతే కనీసం లెటర్ అయినా రాసి పంపు అని ఫ్రెండ్ సలహా ఇస్తాడు. దాంతో అవీ లవ్ లెటర్ రాసి నైనా ఇంట్లో ఉన్న పోస్ట్ బాక్స్‌లో వేస్తాడు. అయితే అవి కర్మ కాలి ఆ లెటర్ నైనా తల్లి (హేమ మాలిని) కంట పడుతుంది. దాంతో భర్త లేని ఆమె అవీ తనని ప్రేమిస్తున్నాడనుకుని తాను కూడా అతన్ని ఇష్టపడుతుంది. ఈ విషయం తెలిసి అవి, నైనా షాకవుతారు. ఆ తర్వాత ఏం జరిగింది? అవీని నైనా పెళ్లి చేసుకుంటుందా? లేక ఆమె తల్లి పెళ్లి చేసుకుంటుందా? అన్నదే సినిమా కథ. సినిమా స్టోరీ చాలా ఫన్నీగా ఉంది. ఓ రకంగా చెప్పాలంటే ఇందులో రకుల్‌తో పాటు హేమ మాలిని కూడా హీరోయిన్‌ అనే చెప్పాలి. ఇక ట్రైలర్‌లో రకుల్ మిర్చిలా ఘాటు ఘాటు అందాలను ఆరబోసింది. చీరకట్టులో నిజంగా ‘షిమ్లా మిర్చి’ అనిపించుకుంది. READ ALSO:


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/36bRCEl
v

చిరుతో ఐటమ్‌ సాంగ్‌.. హాట్‌ బ్యూటీకి క్రేజీ ఆఫర్‌!

హీరోయిన్‌ ఎంట్రీ ఇచ్చి చాలా కాలం అవుతున్నా.. స్టార్‌ ఇమేజ్‌ అందుకోలేకపోయిన బ్యూటీ కాసాండ్ర. పర్ఫామెన్స్‌ ఓరియంటెడ్‌ రోల్స్‌లో పాటు గ్లామర్‌ క్యారెక్టర్స్‌కు కూడా సై అన్నా ఈ భామకు అవకాశలు మాత్రం రావటం లేదు. ఇటీవల ఎవరు సినిమాలో నెగెటివ్ రోల్‌లోనూ మెప్పించిన రెజీనాకు స్టార్‌ హీరోల సరసన ఛాన్స్‌ దక్కకపోయినా వరుస సినిమాలు చేస్తోంది. తాజాగా ఈ భామకు ఓ క్రేజీ ఆఫర్‌ తలుపు తట్టినట్టుగా తెలుస్తోంది. మెగాస్టార్‌ హీరోగా తెరకెక్కుతున్న 152వ సినిమాలో రెజీనా నటించనుంది. అయితే ఈ సినిమాలో రెజీనా నటించబోయేది ఓ ప్రత్యేక గీతంలో అన్న టాక్‌ వినిపిస్తోంది. సందేశాత్మక చిత్రాలను కమర్షియల్ ఫార్మాట్‌లో తెరకెక్కించే స్టార్‌ డైరెక్టర్‌ కొరటాల శివ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. Also Read: ఇటీవల లాంచనంగా ప్రారంభమైన ఈ సినిమా జనవరిలో రెగ్యులర్‌ షూటింగ్ ప్రారంభం కానుంది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి ప్రీ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ సినిమాలో రెజీనా స్పెషల్‌ సాంగ్‌లో నటించనుందట. చిరుతో డ్యాన్స్‌ చేసే ఛాన్స్‌ రావటంతో రెజీనా కూడా స్పెషల్‌ సాంగ్‌కు వెంటనే ఒప్పేసుకుంది. గతంలో చిరు రీ ఎంట్రీ సినిమా ఖైదీ నంబర్‌ 150 షూటింగ్ సమయంలో ఇలాంటి రూమర్సే వినిపించాయి. ఆ సినిమాలో రెజీనా స్పెషల్ సాంగ్ చేస్తుందన్న ప్రచారం గట్టిగా వినిపించింది. అయితే ఫైనల్‌గా ఆ అవకాశం రాయ్‌ లక్ష్మీని వరించింది. ఇప్పుడు మరోసారి అదే తరహా వార్తలు రావటంతో ఎంత వరకు కరెక్ట్ అన్న అనుమానాలు కలుగుతున్నాయి. Also Read: ఈ సినిమాలో చిరంజీవి ద్విపాత్రాభినయం చేస్తున్నాడన్న టాక్‌ వినిపిస్తోంది. చాలా కాలం తరువాత చెన్నై చంద్రం త్రిషా, మెగాస్టార్‌కు జోడిగా నటిస్తోంది. ఈ సినిమాను మ్యాట్నీ ఎంటర్‌టైన్మెంట్స్‌ సంస్థతో కలిసి మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ బ్యానర్‌పై నిర్మిస్తున్నాడు. చాలా కాలం తరువాత మణిశర్మ ఈ సినిమాతో మెగాస్టార్‌కు సంగీతమందిస్తున్నాడు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2MKAVIB
v

Mathu Vadalara Latest Trailer


Mathu Vadalara Latest Trailer

from BharatStudent - Telugu - Actor Actress|Photo,Picture Galleries|Wallpapers|Screensavers|Movie Trailers|Film News and Gossips https://ift.tt/2ZCjMWR

O Katha Chebuta Vinu - Beautiful


O Katha Chebuta Vinu - Beautiful

from BharatStudent - Telugu - Actor Actress|Photo,Picture Galleries|Wallpapers|Screensavers|Movie Trailers|Film News and Gossips https://ift.tt/2FjR5op

Samajavaragamana Full Song - Ala Vaikuntapuramlo


Samajavaragamana Full Song - Ala Vaikuntapuramlo

from BharatStudent - Telugu - Actor Actress|Photo,Picture Galleries|Wallpapers|Screensavers|Movie Trailers|Film News and Gossips https://ift.tt/36cIwYc

సమ్మర్‌లో రానున్న మరో మెగా హీరో.. మెప్పిస్తాడా?

మెగా ఫ్యామిలీ నుంచి ఇప్పటికే చాలా మంది హీరోలు వెండితెరను ఏలేస్తున్నారు. తాజాగా ఈ లిస్ట్‌లోకి మరో యువ నటుడు చేరనున్నాడు. మెగాస్టార్‌ మేనల్లుడు, సుప్రీం హీరో సాయి ధరమ్‌ తేజ్‌ తమ్ముడు వైష్ణవ్‌ తేజ్ హీరోగా తెరంగేట్రానికి సిద్ధమవుతున్నాడు. ఇప్పటికే వైష్ణవ్‌ హీరోగా తెరకెక్కుతున్న ఉప్పెన సినిమా షూటింగ్ జరుగుతోంది. మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థతో కలిసి క్రియేటివ్‌ డైరెక్టర్‌ సుకుమార్‌ నిర్మాతగా తెరకెక్కిస్తున్న ఈ సినిమాతో సుకుమార్‌ శిష్యుడు బుచ్చిబాబు సానా దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. కృతికా శెట్టి హీరోయిన్‌గా పరిచయం అవుతోంది. కోలీవుడ్ స్టార్ హీరో విజయ్‌ సేతుపతి ఈ సినిమాలో నెగెటివ్‌ రోల్‌లో నటిస్తుండటం విశేషం. Also Read: ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమాను 2020 సమ్మర్‌లో రిలీజ్ చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నారు చిత్రయూనిట్‌. ఈ సినిమాలో వైష్ణవ్‌ చేపలు పట్టే కుర్రాడి పాత్రలో ఫుల్‌ మాస్‌ లుక్‌లో కనిపించనున్నాడు. సుకుమార్‌ ఆస్థాన సంగీత దర్శకుడు దేవీ శ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతమందిస్తున్నాడు. మెగా హీరో లాంచింగ్‌ మూవీ కావటంతో ప్రతీ ఒక్కరు ఈ ప్రాజెక్ట్‌ను ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నారు. శ్యామ్ దత్‌ సినిమాటోగ్రఫి బాధ్యతలు నిర్వహిస్తుండగా రంగస్థలం ఫేం రామకృష్ణ, మౌనికలు ఆర్ట్ వర్క్‌ బాధ్యతలు చూస్తున్నారు. నవీన్‌ నూడి ఎడిటింగ్‌ బాధ్యతలు తీసుకున్నాడు. ఇప్పటికే సగానికి పైగా చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమాపై అవుట్‌పుట్‌పై చిత్రయూనిట్ చాలా హ్యాపిగా ఉన్నారు. Also Read:


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2Fbhq7G
v

సూపర్‌ స్టార్ సినిమాకు చిక్కులు.. రిలీజ్‌ ఆపాలంటూ పిటీషన్‌!

కోలీవుడ్‌లో భారీ చిత్రాలకు రిలీజ్‌ సమస్యలు తప్పటంలేదు. చివరి నిమిషంలో సినిమాపై కాపీ ఆరోపణలు రావటం, లేదా ఆర్థిక సమస్యలు రావటం అనేది సర్వ సాధారణమైపోయింది. తాజాగా సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ హీరోగా తెరకెక్కుతున్న దర్బార్‌ సినిమాకు కూడా ఇలాంటి సమస్యలే ఎదురయ్యాయి. నిర్మాణ సంస్థ గత చిత్రం కోసం చేసిన అప్పుల కారణంగా దర్బార్‌ ఇబ్బందుల్లో పడింది. సూపర్‌ స్టార్ రజనీకాంత్ హీరోగా స్టార్‌ డైరెక్టర్‌ మురుగదాస్‌ తెరకెక్కించిన దర్బార్‌ సినిమాను పొంగల్‌ కానుకగా జనవరి 9న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేశారు. ఈ సినిమాను భారీ చిత్రాల నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్‌ ప్రతిష్టాత్మకంగా నిర్మించింది. అయితే తాజాగా నిర్మాణ సంస్థ కారణంగానే ఈ సినిమా రిలీజ్‌పై అనుమానాలు కలుగుతున్నాయి. Also Read: దర్బార్‌ రిలీజ్‌ను ఆపాలంటూ దాఖలైన పిటీషన్‌పై స్పందించాలంటూ మద్రాసు హైకోర్టు లైకా ప్రొడక్షన్స్‌కు నోటీసులు పంపింది. గతంలో 2.ఓ సినిమా నిర్మాణంలో ఉండగా లైకా సంస్థ, మలేషియాకు చెందిన ఎంటర్‌టైన్మెంట్‌ కంపెనీ డీఎంవై క్రియేషన్స్‌ నుంచి 12 కోట్లు అప్పుగా తీసుకుంది. ఈ మొత్తాన్ని తిరిగి చెల్లించకపోవటంతో ఇప్పుడు వడ్డీతో కలిపి 23 కోట్ల 70 లక్షలు అయ్యింది. ఆ మొత్తాన్ని చెల్లించే వరకు దర్బార్‌ రిలీజ్‌ ఆపాలంటూ డీఎంవై సంస్థ హైకోర్టును ఆశ్రయించింది. డీఎంవై సంస్థ మలేషియాలో భారతీయ చిత్రాలను డిస్ట్రిబ్యూట్‌ చేస్తోంది. 2.ఓ సినిమాను కూడా ఈ సినిమా 20 కోట్ల మొత్తానికి మలేషియా డిస్ట్రిబ్యూషన్‌ రేట్స్‌ తీసుకుంది ఈ సంస్థ. అంతేకాదు ఇటీవల రిలీజ్‌ అయిన సైరా నరసింహారెడ్డితో పాటు విశ్వాసం, గేమ్‌ ఓవర్‌, సూపర్‌ 30 లాంటి సినిమాను మలేషియాలో డీఎంవై ఎంటర్‌టైన్మెంట్స్‌ సంస్థ రిలీజ్‌ చేసింది. Also Read: డీఎంవై సంస్థ పిటీషన్‌ను విచారించిన జస్టిస్ గోవిందరాజ్‌, జనవరి 2 లోగా పిటీషన్‌పై స్పందించాలని లైకా సంస్థలకు నోటిసులు ఇచ్చారు. రజనీకాంత్ సరసన నయనతార హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో సునీల్‌ శెట్టి, ప్రతీక్‌ బబ్బర్‌, యోగి బాబు, జీవా, ప్రకాజ్‌ రాజ్‌, నివేదా థామస్‌లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2ZBDqCp
v

‘‘ఆ నటి నన్ను ఫాలో అవుతూ గోవా వరకు వచ్చింది’’

సెలబ్రిటీ రియాల్టీ షో బిగ్‌బాస్‌లో పాల్గొనాలంటే నిర్వాహకులు ఇచ్చిన స్క్రిప్ట్‌ను బాగా ఫాలో అవ్వాలి. వారు చెప్పినట్లుగానే నడుచుకుంటూ హౌజ్‌లో డ్రామా క్రియేట్ చేయాలి. కానీ ప్రస్తుతం ప్రసారం అవుతున్న హిందీ బిగ్ బాస్ సీజన్ 13లో మాత్రం సొంత విషయాలను బయటపెట్టి రచ్చ చేస్తున్నారు కంటెస్టెంట్లు. ఈ షోలో పాల్గొన్న బుల్లితెర నటులు సిద్ధార్థ్ శుక్లాకు రష్మీ దేశాయ్‌కు అస్సలు పడదు. ఒకప్పుడు షోలో ఇద్దరూ రొమాన్స్ చేసుకున్నారు కానీ ఇప్పుడు మాత్రం ఒకర్ని చూడగానే మరొకరికి ఒళ్లుమండిపోతోంది. ఈ నేపథ్యంలో ఆడియన్స్ చేత ఫోన్‌లో మాట్లాడించే కార్యక్రమాన్ని ఏర్పాటుచేశారు సల్మాన్. ఓ వ్యక్తి బిగ్ బాస్ హౌజ్‌కి ఫోన్ చేసి రష్మీ చేసిన కామెంట్స్ గురించి సిద్ధార్థ్‌ను ప్రశ్నించాడు. అసలే సిద్ధార్థ్‌కు ఎప్పుడూ కోపం ముక్కు మీదే ఉంటుంది. అందులో రష్మీ అంటే అతనికి పడదు. దాంతో మరోసారి సిద్ధార్థ్‌కు ఆగ్రహం కట్టలు తెంచుకుంది. దాంతో సిద్ధార్థ్‌కి కోపం వచ్చి రష్మీ గురించి షాకింగ్ కామెంట్ చేశాడు. ‘రష్మీ ఓ అబద్ధాల కోరు. ఒకప్పుడు నాపై ఇష్టం పెంచుకుంది. నేను గోవాలో ఉన్నానని తెలుసుకుని అక్కడి కూడా వచ్చేసింది’’ అంటూ రచ్చ చేశాడు. తోటి కంటెస్టెంట్స్ అతన్ని కంట్రోల్ చేయాలని యత్నించినా ఫలితం లేకుండాపోయింది. దాంతో అక్కడే ఉన్న రష్మీ ప్రియుడు అర్హాన్ ఖాన్‌కు కోపం కట్టలు తెంచుకుంది. సిద్ధార్థ్‌పై చేయిచేసుకోబోయాడు. వెంటనే రష్మీ అడ్డుపడింది కాబట్టి సరిపోయింది. READ ALSO: లేదంటే పెద్ద గొడవే జరిగి ఉండేది. ఇదంతా షోని హోస్ట్ చేస్తున్న చూస్తుండగానే జరిగింది. బిగ్‌బాస్‌లో డ్రామా ఇంత రసవత్తరంగా ఉంది కాబట్టే మరో ఐదు ఎపిసోడ్లు పొగిడించాలని చూస్తున్నారు. కానీ సల్మాన్‌కు అది ఏమాత్రం ఇష్టం లేదు. హౌజ్‌లో స్క్రిప్ట్ పరంగా డ్రామా క్రియేట్ చేయకుండా సొంత విషయాలు బయటికి చెప్పుకుని వారు చేస్తున్న రచ్చ సల్మాన్‌కు ఏమాత్రం నచ్చడంలేదు. అందుకే బిగ్ బాస్‌ షో నుంచి తప్పకుంటున్నట్లు ఇటీవల సల్మాన్ ప్రకటించారు. READ ALSO:


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/35e2Hn8
v

ఆకలన్నా కూడా టాలీవుడ్ పట్టించుకోదు: స్టార్ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్

ఒకప్పుడు అన్ని చిత్ర పరిశ్రమల్లో హీరోకే ప్రాధాన్యత ఇచ్చేవారు. తిండి దగ్గర్నుంచి మర్యాదల వరకు ముందు హీరో తిన్న తర్వాతే మిగతావారికి పెట్టేవారు. ఇలాంటి పరిస్థితి ప్రముఖ బాలీవుడ్ నటి నేహా ధుపియాకు ఎదురైంది. ఆమె తెలుగులో ‘నిన్నే ఇష్టపడ్డాను’, ‘పరమ వీర చక్ర’ సినిమాల్లో నటించారు. అయితే ఓసారి షూటింగ్ జరుగుతున్న సమయంలో తనకు చేదు అనుభవం ఎదురైందట. ఆకలిగా ఉందని డైరెక్టర్‌కు చెబితే ముందు హీరో తిన్నాకే మిగతావారు తినాలని చెప్పారట. READ ALSO: ‘‘దక్షిణాది పరిశ్రమలో నేను సెక్సిజం ఎదుర్కొన్నాను. ఓ తెలుగు సినిమా షూటింగ్ సమయంలో నాకు ఆకలిగా ఉందని తిన్నాక షూటింగ్ చేద్దామని డైరెక్టర్‌కు చెబితే ముందు హీరో తిన్నాకే మిగతావారు తినాలని అన్నారు. నాకు ఆకలేస్తోందని చెప్తే హీరో షాట్ రెడీగా ఉందని, అందుకే ముందు ఆయన తినేస్తే మంచిదని అన్నారు. అది నాకు చాలా జోక్‌గా అనిపించింది. సరే అని నేను వెళ్లి ఓ పక్కకు కూర్చున్నాను. అయితే నేను ఆ విషయం గురించి అంతగా పట్టించుకోలేదు. అప్పట్లో ఇలాంటి అన్ని చిత్ర పరిశ్రమల్లోనూ జరిగేవి కానీ ఇప్పుడు ఇలాంటివేమీ జరగలేదు. ఇక హిందీ చిత్ర పరిశ్రమలో మాత్రం నన్ను సినిమాల్లోకి తీసుకున్నట్లే తీసుకుని తొలగించేసేవారు. నేను ఓ సినిమాకు సంతకం చేసి దానిపై వర్క్ చేస్తున్నప్పుడు మరుసటి రోజు పేపర్లో నేను ఆ సినిమా నుంచి తప్పుకున్నట్లు వార్తలు వచ్చేసేవి. అలా చాలా సార్లు జరిగాయి. ఆ తర్వాత నేను ఈ జాబ్‌పై బాగా ఫోకస్ చేయడంతో ఇప్పుడు అలాంటి పరిస్థితులు నాకు ఎదురవడంలేదు’’ అని తెలిపారు. READ ALSO:


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2MXDXcP
v

టెన్త్ క్లాస్ హీరోయిన్‌కి పెళ్లి చేసేశారు.. ఆ ఫొటోనే కొంపముంచిందా?

హీరోయిన్ .. ఈ పేరుతో పాటు ఈమెను కూడా తెలుగు ఆడియన్స్ గుర్తుపట్టడం కష్టమే కాని.. అప్పట్లో కుమారి వర్సెస్ కుమారి, టెన్త్ క్లాస్ (సెకండ్ హీరోయిన్) సినిమాల్లో నటించిన సునైనాకి తమిళ్‌లో మంచి క్రేజ్ ఉంది. ఇప్పుడు తమిళ తంబీలు ఈమె రహస్య వివాహం గురించే చర్చించుకుంటున్నారు. సునైనా ఎవర్ని పెళ్లి చేసుకుంది? వరుడు ఎవరు? అంటూ చర్చోపచర్చలు మొదలుపెట్టారు. కొందరైతే ఆమెకు, ఆమె సన్నిహితులకు ఫోన్ చేసి శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నారట. హడావిడి ఏం లేకుండా రహస్యంగా పెళ్లి చేసుకున్న ఈ నటికి పెళ్లి పెద్దలు ఎవరయ్యా అంటే.. సోషల్ మీడియా ప్రచారకర్తలే. అవును.. ఇటీవల ఒక యువకుడితో కలిసి ఉన్న ఫొటోను సునైనా తన ఇన్‌స్ట్రాగామ్‌లో పోస్ట్‌ చేసింది. దీంతో సునైనా ఆ అబ్బాయిని రహస్యంగా వివాహం చేసుకుందంటూ సోషల్ మీడియాలో ప్రచారం మొదలుపెట్టారు. ఈ పెళ్లి రూమర్ హీరోయిన్ చెవిన పడటంతో.. ఇదేం కర్మరా దేవుడా..? నాకు పెళ్లి కావడం ఏంటి.. పెళ్లి చేసుకునే దాన్నైతే అందరికీ చెప్పే చేసుకుంటా అంటూ క్లారిటీ ఇచ్చింది సునైనా. తనకు పెళ్లైపోయిందని వచ్చిన వార్తల్లో నిజం లేదని.. అవన్నీ రూమర్స్ మాత్రమే అంటూ ఖండించింది సునైనా. అంతేకాదు.. అసలు తాను ఎవరితోనూ పెళ్లికి ఇంకా సిద్ధపడలేదని ఒకవేళ ఆ టైం వస్తే తానే స్వయంగా చెప్తానని క్లారిటీ ఇచ్చింది సునైన. అయితే సునైనా తన పెళ్లి రూమర్స్‌ని ఖండించినా తన పెళ్లిని ఇంకా చేస్తూనే ఉన్నారని వాపోతుంది ఈ బ్యూటీ. కాగా సునైన తెలుగులో క్లిక్ కాలేకపోయినా.. తమిళ్ బిజీగా మారింది. కాదలిల్‌ విళిందేన్ చిత్రంలో తమిళ్‌లో ఇంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ.. నీర్‌పార్వై, వంశం, మాసిలామణి, తదితర చిత్రాల్లో నటించింది. ఇటీవల ధనుష్‌ హీరోగా నటించిన ఎన్నై నోక్కి పాయుమ్‌ తూటా చిత్రంలో కీలకపాత్రలో నటించి మెప్పించింది. ప్రస్తుతం ట్రిప్, ఎరియుమ్‌ కన్నాడి లాంటి తమిళ చిత్రాలతో పాటు వెబ్ సిరీస్‌లో నటిస్తూ బిజీగా మారింది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2SEE5Bj
v

Pawan Kalyan ఐ లవ్ యు.. మా అమ్మమీద ఒట్టు, నమ్మకపోతే మీ కర్మ: ఇట్లు మీ వర్మ

సినిమా ప్రమోషన్స్‌ కోసం ఏం చేయడానికైనా సిద్ధంగా ఉంటారు . ఎప్పుడూ వివాదాలు చేసి సినిమాలు ప్రమోట్ చేసుకోవడం బోర్ కొట్టిందో ఏమో కాని.. ఈసారి ఆయన పంథాను మార్చి.. డిఫరెంట్‌గా ప్రమోషన్స్ నిర్వహిస్తున్నారు. రామ్ గోపాల్ వర్మ ప్రియ శిష్యుల్లో ఒకరైన అగస్త్య మంజు డైరెక్షన్‌లో వస్తున్న ‘బ్యూటిఫుల్’ మూవీని నూతన సంవత్సర కానుకగా జనవరి 1న విడుదల చేస్తున్నారు. టైగర్ కంపెనీ ప్రొడక్షన్‌లో వర్మ నిర్మించిన ఈ చిత్రానికి ట్రిబ్యూట్ టు రంగీలా అనేది ఉపశీర్షిక. ఈ బోల్డ్ అండ్ రొమాంటిక్ చిత్రంలో నైనా గంగూలీ లీడ్ రోల్ పోషిస్తోంది. ఇక ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా వర్మ హీరోయిన్స్‌తో డాన్స్ లాంటిది చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. తాజాగా మరోసారి వర్మ పిచ్చి పీక్స్ అన్నట్టుగా వ్యవహరిస్తూ హీరోయిన్ కాళ్లపై పడ్డాడు. ‘రా కసితీరా’ సాంగ్‌కి డాన్స్ చేస్తున్న నైనా కాళ్లపై పడ్డాడు వర్మ. న్యూ ఇయర్ కానుకగా విడుదల కానున్న ఈ చిత్రం కోసం ప్రీ న్యూ ఇయర్ ప్రైవేటు పార్టీని హైదరాబాద్‌లో ఏర్పాటు చేశారు.. ఈ పార్టీలో వర్మ తాగుతూ తూలుతూ పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తూ నోటికొచ్చినట్టు మాట్లాడటమే కాకుండా హీరోయిన్స్‌తో ఇష్టం వచ్చినట్టుగా వ్యవహరించి వివాదానికి తెరతీశారు. ఇక ఇదే వేడుకలో గురించి మాట్లాడుతూ.. ‘మా అమ్మ మీద ఒట్టేసి చెప్తున్నా.. పవన్ కళ్యాణ్ అంటే నాకు చాలా ఇష్టం.. ఇది నమ్మకపోతే మీ ఖర్మ. పవన్ కళ్యాణ్ గారికి తిక్క ఉంది.. నాకు లెక్క ఉంది. కాని లెక్కకన్నా తిక్కే అందరికీ ఇష్టం. అందుకే ఆయన సూపర్ స్టార్ అయ్యారు. ఐ లవ్.. పవన్ కళ్యాణ్ గారూ.. శ్రీదేవి కంటే కూడా ఆయనంటే నాకు ఇష్టం. నేను దేవుడ్ని నమ్మను. ఇది కూడా నమ్మక పోతే మీ ఖర్మ’ అంటూ వాడ్కా మత్తులో తాగుతూ తూలుతూ చెప్పుకొచ్చారు వర్మ.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/358t5Pr
v

సత్యదేవ్‌తో నిత్యా మీనన్.. 1979లో సాగే పీరియాడిక్ మూవీ!

పూరీ జగన్నాథ్ తెరకెక్కించిన ‘జ్యోతిలక్ష్మి’ సినిమాతో తనకంటూ ప్రత్యేక గుర్తింపును దక్కించుకున్న నటుడు సత్యదేవ్ కంచరన. ఈయన సోలో హీరోగానూ సినిమాలు చేస్తున్నారు. ‘బ్లఫ్ మాస్టర్’ సినిమాతో తన నటనలోని పవర్ ఏంటో చూపించారు సత్య. వరుసపెట్టి సినిమాలు చేస్తున్నా ఆయన ఇంకా సరైన బ్రేక్ అయితే రాలేదు. హీరోగానే కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్టుగా వరుసపెట్టి సినిమాలు చేస్తున్న సత్యదేవ్ తాజాగా మరో సినిమాను అంగీకరించారు. సత్యదేవ్, నిత్యా మీనన్, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రల్లో ఒక సినిమా తెరకెక్కనుంది. ‘అర్జున్ రెడ్డి’, ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ వంటి సూపర్ హిట్ చిత్రాల‌ను డిస్ట్రిబ్యూట్ చేసిన కె.ఎఫ్‌.సి. ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ సంస్థ చిత్ర నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టి ఈ సినిమాను నిర్మిస్తోంది. 1979లో సాగే పీరియాడిక్ మూవీగా ఈ చిత్రం రూపొందుతుంది. అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా ప్రయోగించిన స్పేస్ స్టేష‌న్ స్కైలాబ్ ఆధారంగా ఈ సినిమాను తెర‌కెక్కిస్తున్నారు. పృథ్వీ పిన్నమరాజు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. డాక్టర్ కె.ర‌వికిర‌ణ్ స‌మ‌ర్పణ‌లో బైట్ ఫీచ‌ర్స్ బ్యాన‌ర్‌‌పై దర్శకుడు విశ్వక్ కందెరావ్ ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. ఈ సినిమా టైటిల్, ఫస్ట్‌ లుక్‌ను త్వరలోనే ప్రకటిస్తామని చిత్ర యూనిట్ వెల్లడించింది. సాంకేతిక నిపుణులు: మాట‌లు, స్క్రీన్‌ప్లే, ద‌ర్శక‌త్వం: విశ్వక్ కందెరావ్‌ సినిమాటోగ్రఫీ: ఆదిత్య జ‌వ్వాది ఎడిటింగ్‌: ర‌వితేజ గిరిజాల‌ మ్యూజిక్‌: ప‌్రశాంత్ ఆర్‌ విహారి


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/36aFqnp
v

న్యూ ఇయర్ పార్టీకి మంచి కిక్కిచ్చే తెలుగు పాటలు.. వెయ్యిరా మావ!!

తెలుగు ప్రజలకు కొత్త సంవత్సరం అంటే ఉగాది పండుగే అయినా.. చాలా మందికి ఇంగ్లిష్ న్యూ ఇయర్ అంటేనే ఎక్కువ మక్కువ. దానికి కారణం హడావుడి, హంగామా, ఎంజాయ్‌మెంట్. డిసెంబర్ 31 వస్తుందంటే చాలు చాలా మందిలో ఏదో తెలియని హంగామా మొదలైపోతుంది. ఆ రోజు రాత్రి ఏం చేయాలి? పార్టీ ఎలా చేసుకోవాలి? ఎలాంటి డీజే పెట్టాలి? అనే కుర్రాళ్లంతా ఆలోచిస్తారు. డిసెంబర్ 31వ తేదీ రాత్రి ఏ వీధిలో చూసినా మ్యూజిక్ మోత మోగాల్సిందే. ఎక్కడ చూసినా పార్టీ వాతావరణమే కనిపిస్తుంది. మరి ఇలాంటి పార్టీల్లో మంచి కిక్కిచ్చే పాటలు ఉంటేనే కదా ఊపొస్తుంది. సౌండ్ సిస్టమ్‌లో పాట వస్తే డ్యాన్సంటే ఏంటో తెలియని వారు కూడా కాలు కదపాలి. దిస్ ఈజ్ ద న్యూ ఇయర్ పార్టీ అంటూ కుప్పి గంతులు వేయాలి. అలా మనతో గంతులు, స్టెప్పులు వేయించే సినిమా పాటలు ఈ ఏడాది చాలానే వచ్చాయి. దేవీశ్రీ ప్రసాద్, తమన్, మణిశర్మ, అనిరుధ్ వంటి సంగీత దర్శకులు అందించిన ఫాస్ట్ బీట్ సాంగ్స్‌తో పాటు మంచి పార్టీ సాంగ్స్ మీకోసం అందిస్తున్నాం. డాంగ్ డాంగ్ (సరిలేరు నీకెవ్వరు) దుమ్ము ధూళి (దర్బార్) దిమాక్ ఖరాబ్ (ఇస్మార్ట్ శంకర్) రాములో రాములా (అల వైకుంఠపురములో) కోకా కోలా పెప్సీ (వెంకీ మామ) ఏక్ బార్ (వినయ విధేయ రామ) రౌడీ బేబీ (మారి 2) మరణం మాసు మరణం (పేట) గ్యాంగ్ లీడర్ టైటిల్ సాంగ్ తకిట తకిట (ప్రతిరోజూ పండగే) గిర్రా గిర్రా (ఎఫ్2) బెస్ట్ మాస్ సాంగ్స్ టాప్ 15 తెలుగు డ్యాన్స్ సాంగ్స్ తెలుగు మాస్ సాంగ్స్


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/39spWx2
v

‘డాంగ్ డాంగ్’ సాంగ్: మహేష్ బాబు కొత్త స్టెప్పులు.. ఫ్యాన్స్‌కి ఫుల్ మీల్స్

సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాల్లో చాలా వరకు మ్యూజికల్ హిట్లే. ఆయన సినిమా ఆల్బమ్స్ చాలా బాగుంటాయి. వాటిలో మంచి ఫాస్ట్ బీట్స్ కూడా ఉంటాయి. అయితే, మహేష్ బాబు డ్యాన్స్ మాత్రం ఎప్పుడూ ఒకేలా ఉంటుందనే విమర్శ ఉంది. అందుకే ఆయన స్టైల్ మార్చారు. సరికొత్త స్టెప్పులతో ఇరగదీశారు. ఫ్యాన్స్‌కి ఫుల్ మీల్స్ అందించారు. మహేష్ బాబు, రష్మి మందన హీరోహీరోయిన్లుగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో వస్తోన్న చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. సంక్రాంతి కానుకగా జనవరి 11న విడుదలవుతోన్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. మహేష్ బాబు ఫ్యాన్స్ అయితే ఈ సినిమా కోసం కళ్లలో వత్తులు వేసుకుని మరీ ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర టీజర్ విశేషంగా ఆకట్టుకుంది. ఇక దేవీశ్రీ అందించిన పాటలపై మాత్రం మిశ్రమ స్పందన వచ్చింది. ఫ్యాన్స్ సూపర్ హిట్ సాంగ్స్ అని చెబుతుంటే.. సగటు సంగీత ప్రేమికుడు మాత్రం దేవీ ట్యూన్స్‌పై పెదవి విరిచాడు. అయితే, ఇటీవల విడుదల చేసిన ‘సరిలేరు నీకెవ్వరు’ టైటిల్ సాంగ్ మాత్రం అందరినీ ఆకట్టుకుంది. ముఖ్యంగా దేవీశ్రీ ప్రసాద్ అందించిన సాహిత్యం, శంకర్ మహదేవన్ గానం అద్భుతమనే చెప్పాలి. కానీ, తాజాగా విడుదలైన ‘డాంగ్ డాంగ్’ పాట ఇప్పటి వరకు విడుదలైన అన్ని పాటలను మరిచిపోయేలా చేస్తోంది. అంత మంచి మోడరన్ బీట్‌తో దేవీ కట్టిపడేశారు. రామజోగయ్య శాస్త్రి ట్రెండీ లిరిక్స్ అందించారు. హిందీ, తెలుగు మిక్స్ చేసి కొట్టారు. నకాష్ అజీజ్, లవిత లోబో సూపర్ ఎనర్జీతో పాటను ఆలపించారు. ఈ పాటలో మరో ప్రత్యేక ఆకర్షణ బిల్కీ బ్యూటీ తమన్నా. మహేష్ బాబుతో కలిసి ఆమె ఈ పాటలో స్టెప్పులేసింది. తమన్నా డ్యాన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరంలేదు. అయితే, ఈ పాటలో ఆమెతో సమానంగా స్టెప్పులేశారు సూపర్ స్టార్. శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ కావడంతో చిత్రీకరణ, డ్యాన్స్ అన్నీ కొత్తగా ఉన్నాయి. మొత్తం మీద ఒక మంచి పార్టీ సాంగ్‌‌ను తన అభిమానులకు న్యూ ఇయర్ గిఫ్ట్‌గా ఇచ్చారు మహేష్.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/37ost9E
v

‘సాఫ్ట్‌వేర్ సుధీర్’ ఎఫెక్ట్.. పేరు మార్చుకున్న నిర్మాత

సుడిగాలి సుధీర్‌, ధన్య బాలకృష్ణ హీరోహీరోయిన్లుగా రాజశేఖర్‌ రెడ్డి పులిచర్ల దర్శక‌త్వంలో వచ్చిన సినిమా ‘సాఫ్ట్‌వేర్ సుధీర్’. శేఖర ఆర్ట్స్‌ క్రియేషన్స్‌ బ్యానర్‌పై శేఖర్‌ రాజు నిర్మించిన చిత్రం డిసెంబర్‌ 28న విడుదలైంది. ఈ చిత్రం విడుదలైన అన్ని చోట్ల మంచి కలెక్షన్లను రాబడుతోంది. చిత్రం విజయం సాధించిన సందర్భంగా సోమవారం హైదరాబాద్‌ రామానాయుడు స్టూడియోస్‌లో సక్సెస్ మీట్‌ను ఏర్పాటు చేసింది చిత్ర యూనిట్. ఈ కార్యక్రమంలో హీరో సుడిగాలి సుధీర్‌, హీరోయిన్ ధన్య బాలకృష్ణ, నిర్మాత శేఖర్‌ రాజు, సంగీత దర్శకుడు భీమ్స్, గేయ రచయిత సురేష్ ఉపాధ్యాయ, డిస్ట్రిబ్యూటర్ పేపర్ సత్యనారాయణ పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా హీరో సుడిగాలి సుధీర్ మాట్లాడుతూ.. ‘‘వెండితెర మీద కంటిన్యూగా రెండు గంటలపాటు ఉండే క్యారెక్టర్ చేస్తానని నా లైఫ్‌లో ఊహించలేదు. అది ఈరోజు నిజమైంది. మాములుగా వారానికి మూడు రోజులు ఇంట్లో టీవీ ఆన్ చేస్తే కనిపిస్తాను. అలాంటిది నా కోసం టికెట్ కొనుక్కొని థియేటర్స్‌కి వెళ్లి సినిమా చూస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. మీ అందరికీ జీవితాంతం రుణపడి ఉంటాను. సినిమా విడుదలైనప్పటి నుండి అంత‌టా పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. పెద్ద పెద్ద టెక్నిషియన్స్ వర్క్ చేయడం వల్లే ఈ సినిమా నెక్స్ట్ లెవెల్‌‌కి వెళ్ళింది. మొదటి రోజు నుంచి సినిమా బాగుందని పాజిటివ్ టాక్ రావడంతో మా డైరెక్టర్ గారు మొక్కు తీర్చుకోవడానికి తిరుపతి వెళ్లారు. ఆయన తరపున మీ అందరికీ హృద‌య‌పూర్వక‌ ధన్యవాదాలు’’ అని అన్నారు. చిత్ర నిర్మాత శేఖర్ రాజు మాట్లాడుతూ.. ‘‘నా మొదటి సినిమాను హిట్ చేసిన ప్రేక్షక దేవుళ్ళకి నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను. కథ నచ్చి డబ్బుతీసుకోకుండా నటించిన డా. శివ ప్రసాద్ గారికి ఈ సినిమా అంకిత‌మిస్తున్నాను. మా సినిమా మొదటి రోజు 190 థియేటర్స్‌లో విడుదలైంది. ఇప్పుడు 300 థియేటర్స్‌లో ర‌న్ అవుతోంది. మా ‘సాఫ్ట్‌వేర్‌ సుధీర్‌’ విడుద‌లైన‌ రెండు రోజుల్లోనే 4 కోట్ల 50 లక్షల‌ రూపాయల గ్రాస్ వసూలు చేసింది. ఇంకా థియేటర్స్ పెంచుతున్నాం అని డిస్ట్రిబ్యూటర్స్ చెప్పారు. ఈ విజయానికి గుర్తుగా నా పేరుని సాఫ్ట్‌వేర్ శేఖర్ రాజు‌గా మార్చుకున్నాను’’ అని అన్నారు. హీరోయిన్ ధన్యబాలకృష్ణ మాట్లాడుతూ.. ‘‘ఈ సినిమాకు నార్మల్ ఓపెనింగ్స్ వస్తాయని అనుకున్నాం. కానీ, సుధీర్ ఫ్యాన్స్ దీనిని ఆడియన్స్‌లోకి తీసుకెళ్లి ఒక పండుగలా ఇంత పెద్ద ఓపెనింగ్స్ ఇచ్చారు. మౌత్ పబ్లిసిటీతో సినిమా బాగా ఆడుతుంది. తెలుగు రాష్టాల్లోనే కాదు కర్ణాటకలో కూడా మంచి కలెక్షన్స్ వస్తున్నాయి. ఎండ్ ఆఫ్ ది ఇయర్ ఒక మంచి హిట్ కొట్టామని సంతోషంగా ఉంది. ఈ చిత్రాన్ని సక్సెస్ చేసిన ఆడియన్స్‌కి, సుధీర్ ఫ్యాన్స్‌కి, నాకు ఈ అవ‌కాశం ఇచ్చిన ద‌ర్శక నిర్మాత‌ల‌కి ధన్యవాదాలు’’ అని అన్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/37jlKxS
v

‘మత్తు వదలరా’.. బాహుబలి, భళ్లాలదేవది ఒకే మాట!

‘మత్తు వదలరా’ సినిమా ద్వారా ప్రముఖ సంగీత దర్శకుడు యం.యం.కీరవాణి చిన్న కుమారుడు శ్రీసింహా హీరోగా, పెద్ద కుమారుడు కాలభైరవ సంగీత దర్శకుడిగా పరిచయమైన సంగతి తెలిసిందే. కొత్త దర్శకుడు రితేష్ రాణా ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఈయనే కాదు.. ఈ సినిమాకు పనిచేసిన వాళ్లంతా కొత్తవాళ్లే. సినిమాను కూడా అంతే కొత్తగా తీసి హిట్ అందుకున్నారు. ప్రేక్షకులు హిట్ చేసిన ఈ సినిమాను ఇప్పుడు సెలబ్రిటీలు కూడా చూస్తున్నారు. ఎస్.ఎస్.రాజమౌళి తెరకెక్కించిన ‘బాహుబలి’ సినిమాతో నేషనల్ స్టార్స్‌గా పాపులారిటీ సంపాదించిన రెబల్ స్టార్ ప్రభాస్, రానా దగ్గుబాటి తాజాగా ‘మత్తు వదలరా’ సినిమాను చూశారు. సినిమా అద్భుతంగా ఉందని చిత్ర యూనిట్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. ఈ మేరకు చిత్ర యూనిట్ ప్రభాస్‌తో దిగిన ఫొటోను, రానా మాట్లాడిన వీడియోను విడుదల చేశారు. ప్రభాస్ మాట్లాడే వీడియోను మంగళవారం విడుదల చేయనున్నారు. ఇక ఈ సినిమా గురించి రానా మాట్లాడుతూ.. ‘‘ఇలాంటి ఒక యూనిక్ కొత్త సినిమా తీసినందుకు చిత్ర దర్శకుడు రితేష్ రాణాకు అభినందనలు. నాకు ఇలాంటి కొత్త సినిమాలన్నా.. ఎడ్జీ సినిమాలన్నా చాలా ఇష్టం. ఇది చాలా మంచి ఎడ్జీ ఎడ్జీ ఫిల్మ్. సినిమా ప్రారంభం నుంచి చూసుకుంటే భైరవ ఇచ్చిన నేపథ్య సంగీతం ఒక ట్రిప్‌లో ఉంటుంది. సింహా నాకు బాగా తెలుసు. నా కళ్ల ముందే ఎదిగాడు. అతనే ఎదిగాడు.. నేను ఎదగలేదు అని అనుకుంటున్నాను. ఎందుకంటే ఒక నటుడిగా తన పాత్రలో అద్భుతంగా నటించాడు. తన మొదటి సినిమానే ఇలాంటి కథను ఎంపికచేసుకోవడం, ప్రజలు ఏం ఇష్టపడతారో తెలుసుకోవడం గొప్ప విషయం’’ అని చెప్పుకొచ్చారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/37kqT8Y
v

ఫ్లాప్స్‌తో గ్యాప్ తీసుకున్న సూపర్‌స్టార్.. సినిమా తీయకపోతే సూసైడ్ అంటున్న ఫ్యాన్

బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుక్ ఖాన్‌కు ఇండియాలోనే కాదు వరల్డ్ వైడ్ అభిమానులు ఉన్నారు. ఆయన నుంచి ఏదన్నా సినిమా వస్తోందంటే ఫ్యాన్స్‌కి పూనకాలు వచ్చేస్తుంటాయి. షారుక్ కంటే ఆయన అభిమానులే సినిమాను ఎక్కువ ప్రమోట్ చేస్తారు. అయితే 2017 నుంచి 2019 వరకు షారుక్ నుంచి వచ్చిన సినిమాలన్నీ ఫ్లాప్సే. దాంతో ఫ్యాన్స్ కూడా షాకయ్యారు. ‘రయీస్’, ‘జబ్ హ్యారీ మెట్ సెజల్’, ‘జీరో’ సినిమాలు వరుసగా ఫ్లాప్ అవుతూ రావడంతో షారుక్ కూడా డిస్టర్బ్ అయిపోయారు. దాంతో ఏడాది పాటు మరే సినిమాను ప్రకటించకూడదని నిర్ణయించుకున్నారు. ఈసారి ఏదన్నా సినిమా తీస్తే షారుక్ నటించిన ఫ్లాప్ సినిమాలు ఫ్యాన్స్‌కి గుర్తుకు రాకూడదు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని షారుక్ తన తర్వాతి ప్రాజెక్ట్‌ను ఎంచుకోవాలని అనుకుంటున్నారు. అయితే జనవరి 1న షారుక్ తన తర్వాతి సినిమా గురించి ప్రకటించకపోతే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరిస్తున్నాడు ఓ అభిమాని. ఈ మేరకు ట్విటర్‌లో ఓ పోస్ట్ పెట్టాడు. ‘న్యూ ఇయర్ రోజున తర్వాతి సినిమా గురించి ప్రకటించకపోతే ఆత్మహత్య చేసుకుంటాను’ అని పేర్కొన్నాడు. అయితే అతని ట్వీట్ చూసి చాలా మంది నెటిజన్స్ షాకయ్యారు. READ ALSO: ఇలాంటి పిచ్చి ఆలోచనలు చేయొద్దని, పాపులారిటీ కోసం పెట్టే ట్వీట్లు ఇతరులపై తీవ్ర ప్రభావం చూపుతాయంటూ మందలించారు. అయితే త్వరలో ప్రముఖ తమిళ దర్శకుడు అట్లీతో కలిసి షారుక్ ఓ సినిమా చేయబోతున్నట్లు ఎప్పటినుంచో వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే అట్లీ రాసిన కథను షారుక్‌కు చూపించారు. కానీ స్క్రిప్ట్‌లో కొన్ని మార్పులు చేయాలని షారుక్ అట్లీని కోరారట. తన తర్వాతి ప్రాజెక్ట్ గురించి కనీసం న్యూ ఇయర్ రోజున అయినా షారుక్ ప్రకటిస్తారో లేదో చూడాలి. READ ALSO:


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2MFNtRn
v

సరిలేరు నీకెవ్వరు.. అనిల్ రావిపూడి సెంటిమెంట్ కలిసొస్తుందా!

యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి ప్రస్తుతం మంచి ఫామ్‌లో ఉన్నారు. 2019లో ‘ఎఫ్2’ సినిమాతో ఆయన బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. ఆ సినిమా విజయంతో స్టార్ నిర్మాతలు, హీరోల దృష్టిని తనవైపు తిప్పుకున్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబును తన కథతో మెప్పించగలిగారు. మళ్లీ సంక్రాంతి రేసులో నిలబడ్డారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతోన్న ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా ఈ సంక్రాంతికి విడుదలవుతోంది. జనవరి 11న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలున్నాయి. ఆ అంచనాలకు తగ్గట్టుగానే సినిమాకు మంచి ప్రచారం కల్పిస్తున్నారు. సాగర నగరం విశాఖపట్నంలో ఈనెల 28న నిర్వహించిన విశాఖ ఉత్సవ్‌లో ‘సరిలేరు నీకెవ్వరు’ ప్రచార కార్యక్రమం చేపట్టారు. ఈ సినిమాలోని ‘డాంగ్ డాంగ్’ సాంగ్ ప్రోమోను విశాఖ ఉత్సవ్‌లో విడుదల చేశారు. మంత్రి అవంతి శ్రీనివాస్ ఈ ప్రోమోను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో సంగీత దర్శకుడు దేవీశ్రీ ప్రసాద్, డైరెక్టర్ అనిల్ రావిపూడి, నటకిరీటి డా. రాజేంద్ర ప్రసాద్ పాల్గొన్నారు. ఈ పాటకు వీరంతా స్టేజ్‌పై స్టెప్పులేశారు. అయితే, ఈ సాంగ్ ప్రోమో విడుదల కార్యక్రమాన్ని విశాఖ ఉత్సవ్‌లో నిర్వహించడానికి ఒక కారణం ఉంది. కిందటేడాది సంక్రాంతికి వచ్చిన అనిల్ రావిపూడి చిత్రం ‘ఎఫ్2’ ఆడియో విడుదల కార్యక్రమాన్ని కూడా విశాఖ ఉత్సవ్‌లో నిర్వహించారు. ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యింది. ఇప్పుడు ‘సరిలేరు నీకెవ్వరు’కు కూడా అదే సెంటిమెంట్‌ను అనిల్ రావిపూడి ఫాలో అయినట్టున్నారు. ఆయన మాటల్లో కూడా ఇదే పరమార్థం కనిపించింది. ‘‘గత సంవత్సరం ఇదే సమయానికి ‘ఎఫ్2’ సినిమా కోసం విశాఖ ఉత్సవ్‌కి వచ్చి సక్సెస్ అయ్యాం. ఆ సినిమాని ఎంత పెద్ద సక్సెస్ చేశారో నేను ఎప్పటికి మర్చిపోలేను. ఈ సంవత్సరం కూడా ఈ ఉత్సవ్‌కి వచ్చి ‘సరిలేరు నీకెవ్వరు’ నుంచి డాంగ్ డాంగ్ సాంగ్ ప్రోమో లాంచ్ చేశాం. దేవీ శ్రీ ప్రసాద్ ఈ సినిమాకి ఫస్ట్ జడ్జ్. ఆయనిచ్చిన ఫీడ్ బ్యాక్ నేనెప్పుడూ మరువలేను. సినిమా చాలా బాగా వచ్చింది’’ అని అనిల్ చెప్పిన మాటలు సినిమాపై ఆయన కాన్ఫిడెన్స్‌కు అద్దం పడుతున్నాయి.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/358jSqj
v

ఆ సీఈఓ రేప్ చేశాడంటూ దర్శకుడి సెన్సేషనల్ ట్వీట్

ఈ మధ్యకాలంలో ఆడవారిపైనే కాదు మగవాళ్లపై కూడా అత్యాచారాలు జరుగుతున్నాయి. అయితే తాజాగా పాకిస్థాన్‌కు చెందిన ఓ దర్శకుడు తనపై ఓ మగాడు అత్యాచారానికి పాల్పడ్డాడు అని చెప్పడం షాక్‌కు గురిచేస్తోంది. పాకిస్థాన్‌కు చెందిన అనే దర్శకుడు తనపై ఓ ప్రముఖ వార్తా పత్రికకు చెందిన సీఈఓ అత్యాచారం చేశాడని చెప్పి సంచలనం క్రియేట్ చేశారు. ఎందుకంటే ఆయనపై రేప్‌కి పాల్పడిన వ్యక్తి ఎవరో కాదు.. ప్రముఖ పాకిస్థానీ వార్తా పత్రిక అయిన డాన్ సీఈఓ హమీద్ హరూన్. అయితే తనపై ఓ ప్రముఖ సీఈఓ అత్యాచారానికి పాల్పడ్డాడని రెండు నెలల క్రితమే జంషెద్ ఆరోపించారు. అయితే అతని పేరు బయటపెట్టడానికి భయపడ్డాడు. కానీ ఇప్పుడు అతని పేరును ధైర్యంగా బయటపెడుతున్నానంటూ ట్విటర్‌లో శివాలెత్తిపోయారు. READ ALSO: ‘‘అవును డాన్ పత్రిక సీఈఓ హమీద్ హరూన్ నన్ను రేప్ చేశాడు. ధైర్యం ఉంటే ఈ వార్తను మీ పత్రికలో ప్రచురించండి. నేను మీటూ ఉద్యమానికి సంపూర్ణ మద్దతు తెలుపుతున్నాను. ఎందుకంటే గదుల్లో, న్యాయస్థానాల్లో ఏం జరుగుతుందో నాకు బాగా తెలుసు. ఎందుకంటే మీడియాలోనే పవర్‌ఫుల్ వ్యక్తి అయిన ఒకరు నన్ను దారుణంగా రేప్ చేశాడు. ఈ విషయం గురించి నేను నా స్నేహితులకు చెబితే అందరూ జోక్‌గా తీసుకున్నారు. ఈ ఘటన జరిగి 13 ఏళ్లు అవుతోంది. అప్పుడే ఎందుకు చెప్పలేదని నన్ను నేను శపించుకుంటున్నాను. కానీ ఆ దారుణ ఘటనను మర్చిపోవడానికి నేను థెరపిస్ట్ వద్దకు వెళ్లా్ల్సి వచ్చింది. కొన్ని నెలల పాటు పాకిస్థాన్‌కు దూరంగా ఉన్నాను. ఆ నీచుడు మా నాన్న చనిపోయినప్పుడు పరామర్శించడానికి కూడా వచ్చాడు. నా జీవితం నాశనం చేశాడని మా నాన్నకు కూడా తెలుసు ’’ అని పేర్కొన్నాడు. READ ALSO:


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/35bx9hM
v

Sunday 29 December 2019

నేను గర్భిణిగా ఉన్నప్పుడు నా భర్త మరో అమ్మాయితో..: నటుడి భార్య ఆవేదన

ప్రముఖ హాలీవుడ్ కమెడియన్ అసలు స్వరూపం గురించి బయటపెట్టి అందరినీ షాక్‌కు గురిచేశారు ఆయన భార్య ఎనికో పారిష్. ‘డోన్ట్ ఫ** దిస్ అప్’ అనే షోలో ఎనికా పాల్గొన్నారు. ఈ సందర్భంగా తన భర్త గురించి విస్తుపోయే విషయాలను వెల్లడించారు. ‘‘నేను ఎనిమిది నెలల గర్భిణిగా ఉన్నప్పుడు ఓ రోజు ఉదయం టిఫిన్ చేస్తుంటే ఓ మెసేజ్ వచ్చింది. అది ఎవరు పంపారో తెలీదు కానీ ఓపెన్ చేసి చూస్తే నా భర్త మరో అమ్మాయితో సెక్స్ చేస్తున్న వీడియో అది. అది చూసి షాకైపోయాను. వెంటనే అతనికి ఫోన్ చేసి నిలదీసాను. అలా ఎలా చేశావు అంటూ చాలా ఏడ్చేసాను. ఆ వీడియో ఇన్‌స్టాగ్రామ్, సోషల్ మీడియాలో వైరల్ అయింది" READ ALSO: " అప్పటినుంచి అతనితో రోజూ గొడవపడుతూ ఉండేదాన్ని. ప్రతీ రోజూ నువ్విలాగే ఉంటే నీతో ఉండను అంటూ గొడవపడేదాన్ని. ఆ తర్వాత కెవిన్ మరో అమ్మాయితో తిరుగుతున్నప్పుడు నన్ను మోసం చేస్తున్నాడన్న విషయం మీడియాకు పాకేసింది. 2017 జులైలో మా గురించి ఎన్నో వార్తలు వైరల్ అయ్యాయి. ఆ తర్వాత ఓ వ్యక్తి సెక్స్ వీడియో ఉందంటూ కెవిన్‌ను డబ్బులు ఇవ్వమని బెదిరించడంతో కెవిన్ నాకు బహిరంగంగా క్షమాపణలు చెప్పాడు’’ అని తెలిపారు. అయితే ఇంత జరిగిన తర్వాత కూడా ఎనికో కెవిన్‌తో కలిసి ఉంటున్నారో లేదో వెల్లడించలేదు. READ ALSO:


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2ZALYt3
v

నేను చేయాల్సింది చాలా ఉంది.. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు స్వీకారోత్సవంలో అమితాబ్ ఉద్వేగం

బిగ్ బి కీర్తి కిరీటంలో మరో కలికితురాయి చేరింది. సినిమా రంగంలో అత్యున్నత పురస్కారం దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అమితాబ్ బచ్చన్‌ను వరించింది. 2019 దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుకు అమితాబ్‌ను భారత ప్రభుత్వం ఎంపిక చేసిన విషయం తెలిసిందే. రాష్ట్రపతి చేతుల మీదుగా అమితాబ్ ఈ అవార్డును ఆదివారం అందుకున్నారు. రాష్ట్రపతి భవన్‌లో అవార్డు ప్రధానోత్సవం జరిగింది. ఈ సందర్భంగా అమితాబ్ బచ్చన్ మాట్లాడుతూ.. భారత ప్రభుత్వం అందించిన ఈ అవార్డుని తాను బాధ్యతగా భావిస్తున్నట్లు తెలిపారు. తల్లిదండ్రుల ఆశీర్వాదాలు, అభిమానుల ఆదరణ, దర్శకనిర్మాతల సహకారం వల్లే తాను ఈ అవార్డు అందుకునే స్థాయికి ఎదిగానని అమితాబ్ సంతోషం వ్యక్తం చేశారు. అంతేకాదు, తాను సినిమా రంగానికి చేయాల్సి ఎంతో ఉందని అమితాబ్ వ్యాఖ్యానించారు. అవార్డు కింద అమితాబ్‌కు స్వర్ణ కమలం, రూ.10 లక్షల నగదు, ప్రశంసాపత్రాన్ని రాష్ట్రపతి కోవింద్ అందజేశారు. అనారోగ్యం కారణంగా ఈ ఏడాది జాతీయ చలచిత్ర అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమానికి బిగ్‌బీ హాజరుకాలేకపోయారు. అమితాబ్ గతంలో అగ్నిపథ్, బ్లాక్, పా, పీకు తదితర చిత్రాలకు గానూ జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డులను అందుకున్నారు. ఇండియన్ సినిమా పితామహుడు దాదాసాహెబ్ పేరిట ఆయన శతజయంతి సందర్భంగా 1963లో జాతీయ అవార్డును భారత ప్రభుత్వం ఏర్పాటుచేసింది. ఎన్నో వేల కుటుంబాలకు జీవనాధారంగా ఉంటూ, కోట్ల ప్రజానీకానికి వినోదాన్ని, ఆటవిడుపును అందిస్తున్న భారత సినీ పరీశ్రమకు ఆద్యునిగా పేరుగాంచింది దాదాసాహెబ్ ఫాల్కే అసలు పేరు ధుండిరాజ్ గోవింద్ ఫాల్కే. 1913లో రాజా హరిశ్చంద్ర సినిమాతో మొదలైన ఆయన సినీ ప్రస్థానం 19 ఏళ్లు సాగింది. నిర్మాతగా, దర్శకుడుగా, స్క్రీన్‌ప్లే-రచయితగా ఆయన 95 చిత్రాలు, 26 లఘు చిత్రాలను రూపొందించారు. ఇక, సినిమా రంగానికి చేసిన సేవలకు గానూ ఆయన పేరుతో ఏటా ఈ అవార్డును అందజేస్తారు. దాదాసాహెబ్ ఫాల్కే తొలి అవార్డును 1969లో దేవికారాణి రోరిచ్ అందుకున్నారు. తెలుగులో బీఎన్ రెడ్డి, ఎల్వీ ప్రసాద్, అక్కినేని నాగేశ్వరరావు, రామానాయుడు, కే విశ్వనాథ్‌లు ఈ అవార్డును అందుకున్నవారిలో ఉన్నారు. ఆశా భోంస్లే, లతా మంగేష్కర్, రాజ్ కపూర్, బాలచందర్ లాంటి సినీ దిగ్గజాలను కూడా ఈ అవార్డు వరించింది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/37iumou
v

దర్శకుడి చేతిలో 200 కోట్లు పెట్టిన ప్రభాస్?

దర్శకధీరుడు ఎస్.ఎస్ రాజమౌళి తర్వాత అంతటి స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు సురేందర్ రెడ్డి. ఇందుకు ఆయన తెరకెక్కించిన ‘సైరా నరసింహారెడ్డి’ సినిమానే కారణం. అయితే త్వరలో సురేందర్ రెడ్డి.. యంగ్ రెబెల్‌స్టార్ ప్రభాస్‌తో కలిసి ఓ భారీ బడ్జెట్ సినిమాను తెరకెక్కించబోతున్నారట. ఈ మేరకు టాలీవుడ్‌లో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇందుకోసం ప్రభాస్‌కు చెందిన నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ సురేందర్ రెడ్డి చేతిలో 200 కోట్ల రూపాయలను పెట్టినట్లు తెలుస్తోంది. ఆయన తీసే సినిమా ‘సాహో’ మిగిల్చిన నిరాశ నుంచి బయటపడేలా ఉండాలని నిర్మాణ సంస్థ చెప్పిందట. రాధాకృష్ణతో కలిసి ప్రస్తుతం ‘జాన్’ (వర్కింగ్ టైటిల్)తో బిజీగా ఉన్న ప్రభాస్‌తో సినిమా చేయాలని సందీప్ రెడ్డి వంగా, కొరటాల శివ లైన్‌లో ఉన్నారని వార్తలు వచ్చాయి. READ ALSO: అయితే సందీప్ రెడ్డి వంగాతో సినిమాపై ఇటీవల ప్రభాస్ టీం క్లారిటీ ఇచ్చింది. అందులో ఎంత మాత్రం నిజం లేదని తెలిపింది. ఇక ప్రభాస్, సురేందర్ రెడ్డి ప్రాజెక్ట్‌లో ఎంత నిజం ఉందో తెలియాంటే మరో క్లారిఫికేషన్ రావాలి. మరోపక్క కొద్ది రోజులుగా ఓ సినిమాలో నటించేందుకు ప్రభాస్‌కు భారీ రెమ్యూనరేషన్‌ అందుకోబోతున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్‌ ప్రభాస్‌కు 75 కోట్ల రెమ్యూనరేషన్‌ ఆఫర్‌ చేసినట్టుగా వార్తలు వినిపించాయి. అయితే ఈ వార్తలు రూమర్స్‌ అంటూ కొట్టి పారేస్తున్నారు ప్రభాస్‌ టీం. డార్లింగ్‌ పారితోషికానికి సంబంధించి వస్తున్న వార్తలన్నీ ఫేక్‌ అంటూ క్లారిటీ ఇచ్చారు. READ ALSO:


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2SCDCji
v

రష్మి ఎక్స్‌పోజింగ్‌కి మాత్రమే ఒప్పుకుంటోంది అందుకే సుధీర్‌ని..: దర్శకుడి సంచలన వ్యాఖ్యలు

‘జబర్దస్త్’ కామెడీ షోతో బాగా పాపులర్ అయిపోయారు రష్మి గౌతమ్, సుడిగాలి సుధీర్. వీరిద్దరి కెమిస్ట్రీకి విపరీతమైన క్రేజ్ ఉంది. వీరిద్దరూ కలిసి ఓ సినిమాలో నటిస్తే చూడాలని కోరుకుంటున్న అభిమానులు ఎందరో ఉన్నారనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అయితే ఆ అవకాశం ‘సాఫ్ట్‌వేర్ సుధీర్’ సినిమాతో రష్మీకి వచ్చింది. కానీ డేట్లు కుదరడంలేదు అన్న కారణంతో రష్మి సినిమాకు నో చెప్పిందట. ఈ విషయాన్ని సుధీర్ ఒకానొక సందర్భంలో తెలిపాడు. అయితే రష్మి ఈ సినిమాకు నో చెప్పడంపై ప్రముఖ దర్శకుడు ఇమంది రామారావు షాకింగ్ కామెంట్స్ చేశారు. ‘‘ఇక్కడ నేను నిజాలే మాట్లాడాలని అనుకుంటున్నాను. సినిమాకు రెమ్యునరేషన్‌గా రష్మి రూ.40 లక్షలు కావాలని అడిగింది. కానీ సినిమా యూనిట్ కేవలం 35 లక్షలు ఇస్తామని చెప్పింది. ఇందుకు రష్మి ఒప్పుకోలేదు. ఇది రష్మి జీవితంలో దురష్టకరమైన సంఘటన. దాదాపు ఏడెనిమిది ఏళ్లుగా రష్మి, సుధీర్ మధ్య మంచి ట్రాక్ నడుస్తోంది. వీరిద్దరూ ప్రేమించుకుంటున్నారో లేదో పక్కనబెడితే వీరిద్దరినీ అభిమానులు ఎంతో ప్రేమిస్తున్నారు. జబర్దస్త్‌లో రష్మి, సుధీర్ కలిసి ఎన్నో పాటలకు డ్యాన్స్‌లు చేశారు. ఒకవేళ రష్మి ‘సాఫ్ట్‌వేర్ సుధీర్’ సినిమాకు ఒప్పుకుని ఉంటే.. వీరిద్దరూ జబర్దస్త్‌ షోలో వేసిన డ్యాన్సులను ఈ సినిమాలో కూడా వేసి ఉంటే సినిమా సూపర్ హిట్ అయి ఉండేది. ప్రతీ ఆర్టిస్ట్ జీవితంలో ఓ చేంజ్ ఓవర్ అనేది ఉండాలి’’ READ ALSO: ‘‘ఇప్పటివరకు రష్మి చేసిన సినిమాల్లో ఏ సినిమా కూడా ఎందుకు సక్సెస్ అవ్వలేదు? ఎందుకంటే రష్మిలోని గ్లామర్‌ను చూపించడానికి అందరూ ఆమెను వాడుకున్నారు కానీ గ్రామర్‌ను చూసేందుకు ఎవ్వరూ ప్రయత్నించలేదు. అప్పుడెప్పుడో డబ్బులు లేక ఇబ్బందిపడిందని పెర్ఫామెన్స్‌కు స్కోప్ ఉన్న సినిమాను రెమ్యునరేషన్ ఇవ్వనందుకు వదులుకుంది. దీని వల్ల రష్మి ఇంకా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటుంది. ఒకవేళ ‘సాఫ్ట్‌వేర్ సుధీర్’ సినిమాలో రష్మి హీరోయిన్‌గా చేసి ఉంటే మరో సినిమాలో కోటి రూపాయలు రెమ్యునరేషన్ ఇస్తామనేవాళ్లేమో. ఇండస్ట్రీలో మార్కెట్ ఇలా ఉంది. ఎవరి వల్ల ఎంత వస్తోంది అని మాత్రమే ఆలోచించుకోవాలి. రష్మికి, సుధీర్‌కి బాగా సింక్ అయింది. ప్రేక్షకులకు వారి కాంబినేషన్ అంటే చాలా ఇష్టం’’ READ ALSO: ‘‘ ఆ రకంగా చూసుకుంటే ‘సాఫ్ట్‌వేర్ సుధీర్’ సినిమాకు రష్మి నో చెప్పి చాలా పెద్ద పొరపాటు చేసింది. నేను ఈ సినిమా చూశాను. హీరోయిన్ పాత్ర పెర్ఫామెన్స్‌కు స్కోప్ ఉంది. ఇందులో రష్మి నటించి ఉంటే.. రష్మికి ఇంతబాగా నటించడం వచ్చా అని ఆలోచించేవారు ఉంటారు. అంతేకానీ ‘గుంటూర్ టాకీస్’ లాంటి సినిమాలు ఎన్ని చేసినా ఏం లాభం? అది కాదు నటన అంటే. స్కిన్ షో చేస్తే పది మంది కుర్రాళ్లు చూసి ఆనందపడతారు కాబట్టి అందరూ చూడరు. మున్ముందు రష్మికి ఇలాంటి అవకాశాలు వస్తాయో రావో తెలీదు. స్కిన్ షో చేయడానికి, హీరోతో బుగ్గా బుగ్గా రాసుకోవడంలో కష్టమేముంది? అదే ఓ డైలాగ్ చెప్పి నలుగురి చేత శెభాష్ అనిపించుకోవడంలో కదా ఉంది గొప్పతనమంతా. సుధీర్ వల్ల ధన్యకు బాగా పాపులారిటీ వచ్చేసింది. రష్మి డబ్బు కోసమే ఆలోచించింది. రష్మి కూర్చుని పని చేసినా రోజుకు లక్ష సంపాదించేస్తుంది. అలాంటప్పుడు ఈ సమయంలో రష్మి ఇంకా డబ్బు కావాలని అనుకోకూడదు. ఇప్పుడు కెరీర్‌ని బిల్డ్ చేసుకుంటే బాగుంటుందని నా అభిప్రాయం’’ అని వెల్లడించారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2rDRyhL
v

టాప్ 25 సూపర్ హిట్ తెలుగు సాంగ్స్ 2019

టాలీవుడ్‌లో ప్రతి ఏటా కొన్ని వందల సినిమాలు విడుదలవుతూ ఉంటాయి. ఒక్కో సినిమాలో మూడు నుంచి ఐదారు పాటలు ఉంటాయి. కానీ, ప్రతి సినిమాలోని పాటలు మనల్ని అలరించవు. కొన్ని సినిమాల్లో పాటలు మాత్రమే ప్రేక్షకుల్ని ఉర్రూతలూగిస్తాయి. చిన్న సినిమా పెద్ద సినిమా అనే తేడా లేకుండా పాట బాగుండే ప్రేక్షకులు కచ్చితంగా ఆదరిస్తారు. అలా ఈ ఏడాది తెలుగు ప్రేక్షకులను బాగా అలరించిన 25 సూపర్ హిట్ సాంగ్స్‌ను ఇక్కడ అందిస్తున్నాం. సామజవరగమన (అల వైకుంఠపురములో) రచన: సిరివెన్నెల సీతారామశాస్త్రి గానం: సిద్ శ్రీరామ్ సంగీతం: తమన్ ఎస్ సూర్యుడివో చంద్రుడివో (సరిలేరు నీకెవ్వరు) రచన: రామజోగయ్య శాస్త్రి గానం: బి. ప్రాక్ సంగీతం: దేవీశ్రీ ప్రసాద్ బుట్టబొమ్మ (అల వైకుంఠపురములో) రచన: రామజోగయ్య శాస్త్రి గానం: అర్మాన్ మాలిక్ సంగీతం: తమన్ ఎస్ దుమ్ము ధూళి (దర్బార్) రచన: అనంత్ శ్రీరామ్ గానం: ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం సంగీతం: అనిరుధ్ రవిచందర్ సరిలేరు నీకెవ్వరు టైటిల్ సాంగ్ రచన: దేవీశ్రీ ప్రసాద్ గానం: శంకర్ మహదేవన్ సంగీతం: దేవీశ్రీ ప్రసాద్ ఏమో ఏమో ఈ గుండెల్లో (ఎంత మంచివాడవురా) రచన: రామజోగయ్య శాస్త్రి గానం: ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం సంగీతం: గోపీ సుందర్ నువ్వు నాతో ఏమన్నావో (డిస్కోరాజా) రచన: సిరివెన్నెల సీతారామశాస్త్రి గానం: ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం సంగీతం: తమన్ ఎస్ ప్రతిరోజూ పండగే టైటిల్ సాంగ్ రచన: కేకే గానం: శ్రీకృష్ణ సంగీతం: తమన్ ఎస్ రాములో రాములా (అల వైకుంఠపురములో) రచన: కాసర్ల శ్యామ్ గానం: అనురాగ్ కులకర్ణి, మంగ్లీ సత్యవతి సంగీతం: తమన్ ఎస్ వెంకీ మామ టైటిల్ సాంగ్ రచన: రామజోగయ్య శాస్త్రి గానం: శ్రీకృష్ణ సంగీతం: తమన్ ఎస్ దిమాక్ ఖరాబ్ (ఇస్మార్ట్ శంకర్) రచన: కాసర్ల శ్యామ్ గానం: కీర్తన శర్మ, సాకేత్ సంగీతం: మణిశర్మ హొయ్‌నా హొయ్‌నా (గ్యాంగ్ లీడర్) రచన: అనంత్ శ్రీరామ్ గానం: ఇన్నో గంగా సంగీతం: అనిరుధ్ రవిచందర్ బుజ్జి బంగారం (గుణ 369) రచన: అనంత్ శ్రీరామ్ గానం: నకాష్ అజీజ్, దీప్తి పార్థసారథి సంగీతం: చైతన్ భరద్వాజ్ ఎల్లువచ్చి గోదారమ్మ (గద్దలకొండ గణేష్) రచన: వేటూరి సుందరరామ్మూర్తి గానం: ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల సంగీతం (రీమిక్స్): మిక్కీ జే మేయర్ సైరా టైటిల్ సాంగ్ రచన: సిరివెన్నెల సీతారామశాస్త్రి గానం: సునిధి చౌహన్, శ్రేయా ఘోషల్ సంగీతం: అమిత్ త్రివేది ఇదే కదా (మహర్షి) రచన: శ్రీమణి గానం: విజయ్ ప్రకాశ్ సంగీతం: దేవీశ్రీ ప్రసాద్ ప్రియతమా ప్రియతమా (మజిలీ) రచన: చైతన్య ప్రసాద్ గానం: చిన్మయి శ్రీపాద సంగీతం: గోపీ సుందర్ ప్రేమ వెన్నెల (చిత్రలహరి) రచన: శ్రీమణి గానం: సుదర్శన్ అశోక్ సంగీతం: దేవీశ్రీ ప్రసాద్ నీ నీలి కన్నుల్లోన ఆకాశమే (డియర్ కామ్రేడ్) రచన: రెహ్మాన్ గానం: గౌతమ్ భరద్వాజ్ సంగీతం: జస్టిన్ ప్రభాకరన్ మెల్ల మెల్లగా (ఏబీసీడీ) రచన: కృష్ణకాంత్ గానం: సిద్ శ్రీరామ్, అదితి భవరాజు సంగీతం: జుదా సాంధీ కన్నే కన్నే (అర్జున్ సురవరం) రచన: శ్రీమణి గానం: అనురాగ్ కులకర్ణి, చిన్మయి సంగీతం: సామ్ సీఎస్ నిజమేనా (సీత) రచన: లక్ష్మీ భూపాల్ గానం: అనురాగ్ కులకర్ణి సంగీతం: అనూప్ రూబెన్స్ కళ్లలో కలవరమై (దొరసాని) రచన: శ్రేష్ఠ గానం: చిన్మయి శ్రీపాద సంగీతం: ప్రశాంత్ ఆర్ విహారి ఏ చోట నువ్వున్నా (సాహో) రచన: కృష్ణకాంత్ గానం: గురు రాంధవ, తులసి కుమార్, హరిచరణ్ శేషాద్రి సంగీతం: గురు రాంధవ గొప్పదిరా మనిషి పుట్టుకు (తోలుబొమ్మలాట) రచన: చైతన్య ప్రసాద్ గానం: విజయ్ ఏసుదాస్ సంగీతం: సురేష్ బొబ్బిలి


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2EZTmF1
v

కేసీఆర్ సాక్షిగా చిరంజీవి చెప్పిన చీరాల వీరయ్య కథ

ప్రతి మనిషి జీవితంలోనూ తనలో స్ఫూర్తి నింపిన ఒక వ్యక్తి ఉంటాడని.. తన జీవితంలోనూ ఒక మనిషి ఉన్నాడని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. డిగ్రీ చదువుకున్న తరవాత ఏం చేయాలో తెలియని పరిస్థితిలో తనలో ఎంతో స్ఫూర్తిని నింపి తాను గొప్ప నటుడిగా ఎదగడానికి ఒక వ్యక్తి కారణమయ్యాడని, ఆయన్ని ఎప్పటికీ మరిచిపోనని వెల్లడించారు. ఆ వ్యక్తి పేరు వీరయ్య అని, ఆయనది చీరాల అని, తన తండ్రి వద్ద కానిస్టేబుల్‌గా పనిచేసేవారని చిరంజీవి చెప్పుకొచ్చారు. ఈ మేరకు ‘టీవీ9 నవ నక్షత్ర సన్మానం 2019’ కార్యక్రమంలో పాల్గొన్న చిరంజీవి.. ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో ఈ ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ‘‘జీవితంలో ఎలా ఎదగాలి అనడానికి నాకు నేనే ఉదాహరణగా చెప్పుకోగలను. వెనకా ముందు ఎవ్వరూ లేరు. నాన్న ఒక కానిస్టేబుల్ నుంచి ఎస్ఐ అయ్యారు. ఆయన ఎస్ఐ అయిన సమయంలో మేం చీరాలలో ఉండేవాళ్లం. అప్పుడు నా డిగ్రీ అయిపోయింది. తరవాత ఏం చేయాలో అగమ్యగోచర పరిస్థితి. సినిమా పట్ల మక్కువ ఉండేది. కానీ, సినిమా పరిశ్రమలో నాకు తెలిసినవారు ఎవ్వరూ లేరు. అక్కడికి వెళ్తే నేను ఏకాకిని అయిపోతాను. దారీతెన్నూ లేని పరిస్థితి అయిపోతుంది. ఎలా.. ఏం చేయాలి అని ఆలోచిస్తున్నప్పుడు నా గురువులు ఎవ్వరూ నాకు ఏం చెప్పలేదు. కానీ, నాన్నగారి దగ్గర పనిచేసే ఒక కానిస్టేబుల్.. నీకు సినిమాలంటే పిచ్చి కదా వెళ్లొచ్చు కదా అన్నాడు. అమ్మో.. అక్కడికి వెళ్తే ఏమీ తెలీదు, ఎవరిని అడగాలి వేషాల కోసం అని అన్నాను. ఏంటి బాస్ నువ్వు అలా అంటావ్.. నువ్వు శత్రుఘ్న సిన్హాలా ఉంటావ్.. నువ్వు డైలాగ్ చెబితే అదిరిపోతుంది.. నువ్వు ఫొటోలు తీసి పంపించు అన్నాడు. శత్రుఘ్న సిన్హా అనగానే నాకు తెలియకుండానే నా బాడీ లాంగ్వేజ్ మారిపోయింది. వెంటనే వాడి ముందే డైలాగులు చెప్పేశాను. ‘హాత్ మే బందూక్ లేకర్ కిదర్ బి షేర్ బంజాయగే హీరా’ అన్నాను. వాడు క్లాప్స్ కొట్టేశాడు. నా మొట్టమొదటి ఆడియన్ వాడు. వాడు కొట్టిన క్లాప్స్ వల్ల నాలో తెలియని ఉత్తేజం వచ్చింది. ఇది చాలు నువ్వు పెద్ద యాక్టర్ అయిపోవడానికి అన్నాడు. రా స్టూడియోకి వెళ్లి ఫొటోలు తీసుకొని ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్‌కి పంపిద్దాం అన్నాడు. ఎందుకంటే శత్రుఘ్న సిన్హా కూడా పూణె ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్ చేరి ఆ తర్వాత పెద్ద యాక్టర్ అయిపోయారు.. నువ్వు అలా వెళ్లిపో అన్నాడు. అది పిచ్చితనతో, గుడ్డి నమ్మకమో.. లేదంటే నా మీద నాకు నమ్మకమో తెలీదు కానీ.. యాక్టర్ అవుతాననే బలీయమైన పట్టుదలతో ప్రయత్నం చేశాను. నా ప్రయత్నం వృథా కాలేదు. ఎవరైతే నన్ను ఇన్‌స్పైర్ చేశాడో, నన్ను ఉత్సాహపరిచాడో, ప్రోత్సహించాడో ఈరోజుకీ ఆ వ్యక్తిని నేను మరిచిపోలేదు. ఆ వ్యక్తి పేరు వీరయ్య.. కానిస్టేబుల్.. చీరాలలో ఉంటాడు. కాబట్టి, ప్రతి వాళ్లకు వాళ్ల లైఫ్‌లో ట్రిగ్గరింగ్ పాయింట్ ఉంటుంది. వాళ్లను ఉత్సాహపరిస్తే, ప్రోత్సహిస్తే వాళ్లు సాధించలేనిదంటూ ఏదీ లేదు’’ అని చిరంజీవి చెప్పుకొచ్చారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2t9xRPk
v

కమెడియన్ నుంచి హీరో.. ఇప్పుడు విలన్.. సునీల్ కొత్త ప్రయత్నం

హాస్యనటుడిగా తెలుగు ప్రేక్షకులకు పరిచయమై తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్న నటుడు సునీల్. టాలీవుడ్‌లో స్టార్ కమెడియన్‌గా ఎదిగిన సునీల్.. ‘అందాల రాముడు’ సినిమాతో హీరోగా మారారు. ఎస్.ఎస్.రాజమౌళి తెరకెక్కించిన ‘మర్యాద రామన్న’ సినిమాతో హీరోగానూ తన మార్క్‌ను చూపించారు సునీల్. అయితే, ‘మర్యాద రామన్న’ తరవాత సునీల్ హీరోగా చాలా సినిమాలే చేసినప్పటికీ వర్కౌట్ కాలేదు. దీంతో ఆయన బాగా వెనకబడిపోయారు. ఇటు హీరోగా రాణించలేక, అటు కమెడియన్‌గా అవకాశాలు లేక సునీల్ కెరీర్ పరంగా చాలా ఇబ్బందిపడ్డారు. మొత్తానికి తన మిత్రుడు, దర్శకుడు తివిక్రమ్ సాయంతో ‘అరవింద సమేత’ సినిమాతో మళ్లీ కమెడియన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా కొత్త కెరీర్‌ను ప్రారంభించారు. ప్రస్తుతం ఆయన చేతిలో చాలా సినిమాలే ఉన్నాయి. అయితే, ఇన్నిరోజులూ కమెడియన్‌గా, హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా అలరించిన సునీల్ ఇప్పుడు విలన్‌గా ప్రేక్షకులను భయపెట్టబోతున్నారు. ఈమేరకు ఆయన విలన్‌గా ఒక కొత్త సినిమాను అంగీకరించారు. ఈ సినిమా ద్వారా యంగ్ కమెడియన్ సుహాస్ హీరోగా పరిచయం అవుతున్నారు. ‘హృదయ కాలేయం’, ‘కొబ్బరి మట్ట’ చిత్రాలను నిర్మించిన అమృత ప్రొడక్షన్స్ తదుపరి చిత్రం ‘కలర్ ఫోటో’లో సునీల్ విలన్‌గా నటిస్తున్నారు. ‘మజిలీ’, ‘డియర్ కామ్రేడ్’, ‘ప్రతిరోజూ పండగే’ వంటి చిత్రాల్లో తనదైన కామెడీతో ఆకట్టుకున్న సుహాస్ ‘కలర్ ఫోటో’ సినిమాతో హీరోగా పరిచయం కాబోతున్నాడు. తెలుగమ్మాయి చాందిని చౌదరీ హీరోయిన్. ఈ చిత్రం షూటింగ్ ప్రారంభం అయ్యింది. యూట్యూబ్‌లో పాపులర్ అయిన సందీప్ రాజ్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. అలాగే ‘మత్తు వదలరా’ సినిమాతో సక్సెస్ అందుకున్న యం.యం.కీరవాణి కుమారుడు కాల భైరవ ఈ చిత్రానికి స్వరాలు సమకూరుస్తున్నారు. కామెడీ ఎంటర్‌టైనర్‌గా రాబోతున్న ఈ చిత్రం 1995లో ఒక ఇంజనీరింగ్ కాలేజిలో జరిగే ప్రేమకథగా రూపొందుతుంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/365IXmY
v

‘అల వైకుంఠపురములో’ మ్యూజికల్ నైట్.. ఫ్యాన్స్ కోసం వినూత్నంగా..!

సంక్రాంతి బరిలో ఉన్న భారీ చిత్రాల్లో ‘అల వైకుంఠపురములో’ ఒకటి. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో వస్తోన్న ఈ హ్యాట్రిక్ మూవీపై ఇప్పటికే భారీ అంచనాలున్నాయి. ఈ సినిమా ఇప్పటికే మ్యూజికల్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమాకు తమన్ అందించిన పాటలు సూపర్ సక్సెస్ అయ్యాయి. ముఖ్యంగా ‘సామజవరగమన’ సాంగ్ అయితే ఈ ఏడాదికే బెస్ట్ సాంగ్‌గా చెప్పుకోవచ్చు. ఇక ‘రాములో రాములా’, ‘బుట్టబొమ్మ’ సాంగ్స్ యూత్‌కు విపరీతంగా ఆకట్టుకున్నాయి. ‘అల వైకుంఠపురములో’ ఆల్బమ్‌ సూపర్ సక్సెస్ కావడంతో ఈ విజయోత్సవాన్ని అల్లు అర్జున్ అభిమానుల సమక్షంలో నిర్మాతలు నిర్ణయించారు. అందుకే, జనవరి 6న ‘అల వైకుంఠపురములో’ మ్యూజికల్ ఫెస్టివల్‌ను నిర్వహిస్తు్న్నారు. ఈ మేరకు చిత్ర నిర్మాతలు అల్లు అరవింద్, ఎస్. రాధాకృష్ణ (చినబాబు) అధికారికంగా ప్రకటించారు. Also Read: ‘‘అల వైకుంఠపురంలో సినిమా నుండి ఇప్పటివరకు విడుదలైన అన్ని సాంగ్స్ ఎంతో పాపులర్ అయ్యాయి. అల్లు అర్జున్ కెరీర్‌లో మరో బ్లాక్ బాస్టర్ ఆల్బమ్‌గా నిలిచింది ఈ చిత్రం. అందుకు ముఖ్యంగా తమన్‌కు కృతఙ్ఞతలు. పాటలు ఇంతటి ప్రాచుర్యం పొందిన సందర్భాన్ని పురస్కరించుకుని జనవరి 6న యూసుఫ్ గూడలోని పోలీస్ గ్రౌండ్స్‌లో ‘అల వైకుంఠపురంలో మ్యూజికల్ ఫెస్టివల్’ను వైభవంగా, వినూత్నంగా జరుపుతున్నాం’’ అని పేర్కొన్నారు. కాగా, ఈ చిత్రంలో బన్నీ సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించింది. టబు, రాజేంద్రప్రసాద్, సచిన్ ఖేడ్‌కర్, తనికెళ్ళ భరణి, మురళీ శర్మ, సముద్ర ఖని, జయరాం, సునీల్, నవదీప్, సుశాంత్, నివేతా పేతురాజ్, గోవిందా పద్మసూర్య, కల్యాణి నటరాజన్, రోహిణి, ఈశ్వరీ రావు, శిరీష, బ్రహ్మాజీ, హర్షవర్ధన్, అజయ్, రాహుల్ రామకృష్ణ, పమ్మి సాయి ముఖ్య పాత్రలు పోషించారు. హారిక అండ్ హాసిని క్రియేష‌న్స్, గీతా ఆర్ట్స్ బ్యాన‌ర్స్‌పై అల్లు అరవింద్‌, ఎస్‌.రాధాకృష్ణ (చినబాబు) ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సంక్రాంతి కానుకగా జ‌న‌వ‌రి 12న ఈ చిత్రం విడుద‌ల‌వుతుంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2Q91WHY
v

నిర్మాతను బీరు బాటిల్‌తో కొట్టిన నటి సంజన?.. ఇదో చిల్లర ప్రచారం అంటోన్న హీరోయిన్!

సంజన గల్రానీ.. తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరంలేని పేరు. తరుణ్ ‘సోగ్గాడు’ సినిమాతో టాలీవుడ్‌కి పరిచయమైన ఈ కన్నడ బ్యూటీ ‘బుజ్జిగాడు’ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. కన్నడలో వరుసపెట్టి సినిమాలు చేస్తోన్న సంజన.. తెలుగులో మాత్రం కనిపించింది చాలా తక్కువే. కిందటేడాది ‘దండుపాళ్యం 3’ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. ఇదిలా ఉంటే, సంజన తాజాగా ఒక వివాదంలో చిక్కుకుంది. కన్నడ మహిళా నిర్మాత వందన జైన్‌ను సంజన బీర్ బాటిల్‌తో కొట్టిందనే వార్త హాట్ టాపిక్‌గా మారింది. డిసెంబర్ 24న బెంగళూరులోని ఓ ఫైవ్ స్టార్ హోటల్‌లో జరిగిన పార్టీలో సంజన తనను బీర్ బాటిల్‌తో కొట్టి గాయపరిచిందని పోలీసులకు వందన ఫిర్యాదు చేసింది. పార్టీలో తనకు, సంజనకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగిందని.. కోపంతో సంజన తనను బీర్ బాటిల్‌తో కొట్టిందని ఆ ఫిర్యాదులో వందన పేర్కొంది. దీంతో సంజనపై బోలెడన్ని వార్తలు వెలువడ్డాయి. అయితే, ఈ వార్తలపై సంజన తాజాగా స్పందించింది. తనపై వందన చేస్తోన్న ఆరోపణలన్నీ తప్పని.. ఆమె చిల్లర ప్రచారం చేసుకుంటోందని మండిపడింది. ఈ మేరకు ట్విట్టర్‌ ద్వారా మీడియాకు ఒక ప్రెస్ నోట్‌ను విడుదల చేసింది. ఈ ప్రెస్ నోట్‌లో ఆమె వెల్లడించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.. Also Read: ‘‘ఈ మధ్య నా గురించి వ్యాప్తి చెందుతున్న ప్రతి విషయం కేవలం తప్పుడు ప్రచారం మాత్రమే. ఎలాంటి ఆధారాలు లేకుండా ఆ మహిళ నాపై తప్పుడు ఆరోపణలు చేస్తోంది. ఆమె నన్ను, నా తల్లిని దారుణమైన పదజాలంతో తిట్టింది. నా కెరీర్‌ను నాశనం చేయడానికి, నన్ను జైలుకు పంపించడానికి, నా కుటుంబం పేరును నాశనం చేయడానికి ఆమె కుట్ర చేస్తోంది. ఆమె చౌకబారు మనిషి. ప్రచారం కోసం ఇలాంటి చౌకబారు ఆరోపణలు చేస్తోంది. ఆసలు ఆరోజు ఏం జరిగిందో ఆమెను వివరంగా అడిగి తెలుసుకోండి. నేను గత 10 సంవత్సరాలుగా సినిమాల్లో నటిస్తున్నాను. ప్రచారం కోసం నేను ఏనాడూ ఇలాంటి చిల్లర వేషాలు వేయలేదు. కానీ, ఆమె మాత్రం నన్ను అడ్డం పెట్టుకుని తనను తాను చిల్లర ప్రచారం చేసుకుంటోంది. మొబైల్ ఫోన్‌లో వీడియో చూపించి అసలు విషయాన్ని వక్రీకరించి చెబుతోంది. ఆమె చూపించే వీడియోలో ముఖానికి, తలకు ఏదైనా గాయం ఉందా? విరిగిపోయిన సీసాకైనా రక్తపు మరక ఉండాలి కదా. నేను నా జీవితంలో ఎప్పుడూ బాధ్యతా రాహిత్యంగా ప్రవర్తించలేదు. ఇది నాకు వ్యతిరేకంగా చేస్తోన్న నిరాధారమైన ఆరోపణ మాత్రమే. వచ్చే ఏడాదిలో నేను నాలుగు దక్షిణ భారత చిత్రాలు, ఒక హిందీ సినిమాలో నటించబోతున్నాను. వెబ్ ఫిల్మ్‌తో సహా నా చేతిలో ఇప్పుడు ఏడు సినిమాలు ఉన్నాయి. కాబట్టి, ఇలాంటి చిల్ల ప్రచారం చేసుకోవాల్సిన అవసరం నాకు లేదు. ఆమె తనను తాను నిర్మాతగా చెప్పుకుంటూ తప్పుడు ప్రచారం చేస్తోంది. నన్ను లక్ష్యంగా చేసుకుని ఆ తప్పుడు ప్రచారంలోకి లాగాలని చూస్తోంది. నాకు నిర్మాతలపై విపరీతమైన గౌరవం ఉంది. నేను దేవుణ్ణి నమ్ముతాను. ఆమె ఇంతకుముందు భారత క్రికెట్ స్పిన్ బౌలర్ అమిత్ మిశ్రాను వివాహం చేసుకోవడానికి ప్రయత్నించింది. కానీ సాధ్యపడలేదు. దీంతో ఆయనపై నిరాధారమైన ఆరోపణలు చేసింది. ఆయన్ని బ్లాక్ మెయిల్ చేసింది. ఆయన్ని భారత క్రికెట్ జట్టుకు దూరం చేయడంలో విజయవంతమైంది. ఇప్పుడు ఆమె వలలో నేను చిక్కుకున్నాను. దయచేసి ఆమె చేస్తోన్న నిరాధారమైన ఆరోపణలను నమ్మొద్దని, నన్ను రక్షించమని అభ్యర్థిస్తున్నాను. ఈ వివాదం ఇంకా కొనసాగాలని నేను కోరుకోవడంలేదు. ఈ పరిస్థితిలో నాకు, నా కుటుంబానికి పోలీసుల రక్షణ కావాలి. నాకు మద్దతు ఇచ్చిన బెంగళూరు నగర పోలీసులకు ఈ సందర్భంగా నేను ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను’’ అని ప్రెస్ నోట్‌లో సంజన గల్రానీ పేర్కొన్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/367VaHY
v

హాఫ్ మిలియన్ కొట్టిన సాయి తేజ్.. యూఎస్‌లో తొలిసారి

సరైన హిట్టు కోసం ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తోన్న సుప్రీం హరో సాయిధరమ్ తేజ్ ఎట్టకేలకు తన విజయ దాహాన్ని తీర్చుకున్నారు. ‘ప్రతిరోజూ పండగే’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుని మళ్లీ ఫాంలోకి వచ్చారు. ఈ సినిమా 9 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా రూ. 22 కోట్ల షేర్‌ను రాబట్టింది. ఇప్పటికీ బాక్సాఫీసు వద్ద వసూళ్ల వేటను కొనసాగిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా యూఎస్ బాక్సాఫీసు వద్ద కూడా సత్తా చాటుతున్నారు తేజూ. తన కెరీర్‌లో మొదటిసారి యూఎస్ బాక్సాఫీసు వద్ద హాఫ్ మిలియన్ డాలర్ మార్క్‌ను అందుకున్నారు. యూఎస్ బాక్సాఫీసు వద్ద ‘ప్రతిరోజూ పండగే’ సినిమా శనివారం నాటికి 529,600 డాలర్ల గ్రాస్ వసూలు చేసింది. అంటే, ఇండియన్ కరెన్సీ ప్రకారం సుమారు రూ. 3.78 కోట్లు. యూఎస్ హాఫ్ మిలియన్ డాలర్లను కలెక్ట్ చేసిన తొలి సాయిధరమ్ తేజ్ సినిమా ఇది. అక్కడ భారీ విజయం అందుకున్న ఈ సినిమా ఓవర్సీస్ బయ్యర్స్‌కు మంచి లాభాలను తెచ్చిపెట్టింది. ఈ సినిమాతో యూఎస్‌లోనూ సాయి తేజ్ మంచి మార్కెట్‌ను ఏర్పరుచుకున్నారు. ఇకపై ఆయన సినిమాలకు అక్కడ కూడా మంచి డిమాండ్ ఉంటుంది. కాగా, రాశీ ఖన్నా హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రంలో సత్యరాజ్, రావు రమేష్ కీలక పాత్రలు పోషించారు. శ్రీకాంత్, హరితేజ, సత్యం రాజేష్, అజయ్, మహేష్, విజయ్ కుమార్, ప్రభ తదితరులు నటించారు. మారుతి దర్శకత్వంలో వహించిన ఈ సినిమాను అల్లు అరవింద్ సమర్పణలో యూవీ క్రియేషన్స్, జీఏ2 పిక్చర్స్ బ్యానర్లపై బన్నీ వాస్ నిర్మించారు. ఎస్కేఎన్ సహనిర్మాత. తమన్ ఎస్ సంగీతం సమకూర్చారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2ryrtR8
v

మహేష్ సినిమా అందుకే ఫ్లాపైంది.. ఎన్టీఆర్‌కు కథ చెప్పింది నిజమే!

సౌత్‌ స్టార్‌ డైరెక్టర్‌ మురుగదాస్ తొలిసారిగా సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ను డైరెక్ట్‌ చేసిన సినిమా దర్బార్‌. త్వరలో రిలీజ్‌కు రెడీ అవుతున్న ఈ సినిమాకు సంబంధించి ప్రమోషన్‌ కార్యక్రమాలు భారీగా జరుగుతున్నాయి. ఇప్పటికే టీజర్‌, ట్రైలర్‌లతో పాటు లిరికల్‌ వీడియోలతో సినిమా మీద అంచనాలు తారా స్థాయికి చేరాయి. వరుస ప్రెస్‌మీట్‌లు ఇంటర్వ్యూలతో ఈ అంచనాలను మరింతగా పెంచేస్తున్నారు చిత్రయూనిట్‌. తాజాగా ప్రమోషన్‌లో భాగంగా మీడియాతో మాట్లాడిన దర్శకుడు మురుగదాస్‌ ఆసక్తికర విషయాలను వెల్లడించాడు. తెలుగులో స్టాలిన్‌, స్పైడర్‌ రెండు సినిమాలు చేసిన మురుగదాస్‌ ఆ రెండు సినిమాల పరాజయానికి తానే కారణమన్నాడు. తెలుగు ప్రేక్షకుల పల్స్‌ తెలుసుకోలేకపోయానని తెలిపాడు. స్పైడర్‌ విషయంలో మహేష్‌ను తమిళ ఆడియన్స్‌కు పరిచయం చేయాలనుకున్నానే తప్ప తెలుగు ప్రేక్షకులు మహేష్‌ను ఎలా చూడాలనుకుంటున్నారో పట్టించుకోలేదన్నాడు. Also Read: అంతేకాదు గతంలో ఎన్టీఆర్‌ హీరోగా మురుగదాస్‌ దర్శకత్వంలో ఓ సినిమా అంటూ వార్తలు వినిపించాయి. ఈ వార్తలపై స్పందించిన మురుగదాస్‌.. చాలా రోజులుగా కిందట ఎన్టీఆర్‌కు కథ చెప్పిన మాట వాస్తవమే అన్నాడు. అయితే ఆ ప్రాజెక్ట్ వర్క్‌ అవుట్ కాలేదని ప్రస్తుతం అయితే ఎన్టీఆర్‌తో సినిమా చేస్తున్నట్టుగా వస్తున్న వార్తలన్ని అవాస్తవం అన్నాడు. అంతేకాదు త్వరలో ఓ తెలుగు సినిమాను డైరెక్ట్‌ చేయనున్నాని చెప్పాడు మురుగదాస్‌. రజనీకాంత్ హీరోగా తెరకెక్కిన దర్బార్‌ సినిమా జనవరి 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. రజనీకాంత్‌ రూత్‌లెస్‌ బ్యాడ్‌ పోలీస్‌ ఆఫీసర్‌గా నటిస్తున్న ఈ సినిమాలో నయనతార హీరోయిన్‌గా నటిస్తోంది. Also Read:


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2SLxtl1
v

నితిన్‌, రష్మికకు కృతజ్ఞతలు తెలిపిన హృతిక్‌ రోషన్‌

వరుస ఫ్లాప్‌లతో ఇబ్బందుల్లో ఉన్న యంగ్ హీరో లాంగ్‌ గ్యాప్‌ తరువాత చేస్తున్న సినిమా భీష్మ. ఇప్పటికే చిత్రీకరణ చివరి దశకు చేరుకున్న ఈ సినిమాకు సంబంధించి ప్రమోషన్‌ కార్యక్రమాలు ప్రారంభించారు చిత్రయూనిట్. టీజర్‌తో పాటు వరుసగా లిరికల్‌ వీడియోలను రిలీజ్ చేస్తున్నారు. ఇటీవల పోసిటానాలో షూటింగ్ జరుగుతుండగా నితిన్‌, రష్మికలు ఓ వీడియోను తమ సోషల్‌ మీడియా పేజ్‌లో షేర్‌ చేశారు. హృతిక్‌ నటించిన గుంగ్రూ పాటకు నితిన్‌, రష్మికలు కలిసి డ్యాన్స్‌ చేసి ఆ వీడియోను హృతిక్‌ను ట్యాగ్‌ చేస్తూ ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు. `భీష్మ టీం తరపున మీకు ప్రేమతో హృతిక్‌ సర్‌. ఆడియో సరిగ్గా సింక్‌ అవ్వలేదు క్షమించాలి` అంటూ ట్వీట్ చేశాడు. Also Read: అయితే ఈ వీడియోపై స్పందించాడు. తన ట్విటర్‌ వేదికగా నితిన్‌, రష్మిక మందన్నలకు కృతజ్ఞతలు తెలియజేశాడు. అంతేకాదు నితిన్‌, రష్మికలతో పాటు భీష్మ టీ మొత్తానికి ఆల్‌ ద బెస్ట్‌ అంటూ ట్వీట్ చేశాడు నితిన్‌. వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న భీష్మ సినిమాను సితార ఎంటర్‌టైన్మెంట్స్‌ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నాడు. ఈ సినిమా 2020 ఫిబ్రవరిలో విడుదల కానుంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2SAUJlB
v

`ఈ `బ్యూటీఫుల్‌` అందాలని ఇలా ఎప్పుడు చూశావయ్యా`

సంచలన దర్శకుడు రామ్‌ గోపాల్ వర్మ తన సినిమాలకు సోషల్ మీడియా ద్వారానే కావాల్సినంత ప్రచారం చేసుకుంటాడు. ఇటీవల ఎక్కువగా వివాదాస్పద చిత్రాలనే రూపొందిస్తున్న వర్మ తాజాగా ఓ సెన్సిబుల్‌ రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. తన శిష్యుడు అగస్త్య మంజు దర్శకత్వంలో తెరకెక్కిన బ్యూటీఫుల్ సినిమాకు తనదైన స్టైల్‌లో ప్రచారం చేస్తున్నాడు. ఇటీవల అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు సినిమాలతో ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించిన వర్మ ఆశించిన విజయం మాత్రం సాధించలేకపోయాడు. ఈ సినిమా క్వాలిటీ, కంటెంట్‌ పరంగా నిరాశపరచటంతో వర్మ సృష్టించిన వివాదాలన్ని వృధా అయ్యాయి. తాజాగా బోల్డ్‌ కంటెంట్‌తో తెరకెక్కిన బ్యూటీఫుల్‌ను తలకెక్కుకున్నాడు వర్మ. Also Read: న్యూ ఇయర్‌ కానుకగా జనవరి 1న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. వర్మ ఆస్థాన నటి నైనా గంగూలి కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమాకు సంబంధించి ఆసక్తికర ట్వీట్‌లు చేస్తున్నాడు వర్మ. `మా `బ్యూటిఫుల్` టీం ప్రీ న్యూ ఇయర్ పార్టీ లో నాతో, నైనా గంగూలీ తో, పార్థ సూరి తో, అగస్త్య మంజు తో కలిసి వోడ్కా తాగండి.... ఎలాగంటే Facebook, instagram ద్వారా ఈరోజు 29 రాత్రి 8.45 నుంచి లైవ్ స్ట్రీమింగ్ లో మా ప్రైవేట్ పార్టీకి పబ్లిక్ అందరూ ఆహ్వానితులే` అంటూ ట్వీట్ చేసి ఆడియన్స్‌ను కన్‌ఫ్యూజ్‌ చేశాడు వర్మ. కాసేపటి హీరోయిన్‌ నైనా గంగూలి వంగవీటి సినిమాలో పోషించిన కుమారి పాత్రకు సంబంధించిన సీన్స్‌, తాజాగా బ్యూటీఫుల్‌ సినిమాలో సీన్స్‌ను కలిపి రూపొందించిన వీడియోను తన సోషల్ మీడియా పేజ్‌లో పోస్ట్ చేసిన వర్మ.. `సూపర్ సీరియస్ వంగవీటి కుమారి లో ఈ “బ్యూటిఫుల్” అందాలని ఇలా ఎప్పుడు చూసావయ్యా అగస్త్య మంజు??????` అంటూ కామెంట్ చేశాడు`.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2tW01xy
v

Saturday 28 December 2019

`కలర్‌ ఫోటో`తో హీరోగా మారుతున్న మరో కమెడియన్‌

ఇటీవల కమెడియన్లు హీరోలుగా తమ అదృష్టాన్ని పరీక్షించుకోవటం తరుచూ కనిపిస్తోంది. గతంలో చాలా మంది కమెడియన్లు హీరోలుగా నటించినా తరువాత కామెడీ పాత్రల్లో కొనసాగారు. కానీ ఈ మధ్య కాలంలో హీరోలుగా మారుతున్న కామెడియన్లు హీరోలుగా కొనసాగలేక, తిరిగి కామెడీ పాత్రలు చేయలేక ఇండస్ట్రీకి దూరమవుతున్నారు. అంతేకాదు ఒకసారి హీరోగా చేసిన వారికి తిరిగి కామెడీ పాత్రలో ఇచ్చేందుకు దర్శక నిర్మాతలు కూడా పెద్దగా ఆసక్తి కనబరచటం లేదు. తాజాగా మరో కమెడియన్‌ హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు రెడీ అవుతున్నాడు. విజేత, పేపర్‌ బాయ్‌, మజిలీ, డియర్‌ కామ్రేడ్‌, ప్రతిరోజూ పండగే సినిమాల్లో తనదైన నటనతో ఆకట్టుకున్న కమెడియన్‌ సుహాస్‌ హీరోగా సినిమా ప్రారంభమైంది. కలర్‌ ఫోటో పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమాతో నటుడు సందీప్‌ రాజ్‌ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. Also Read: ఈ సినిమాను హృదయ కాలేయం సినిమాకు దర్శకత్వం వహించిన స్టీవెన్‌ శంకర్‌ అలియాస్‌ సాయి రాజేష్, లౌక్యా ఎంటర్‌టైన్మెంట్స్‌తో కలిసి నిర్మిస్తున్నాడు. చాయ్‌ బిస్కెట్‌ యూట్యూబ్‌చానల్‌ కోసం కలిసి పనిచేసిన సుహాస్, సందీప్‌ల కాంబినేషన్‌లో సినిమా తెరకెక్కుతుండటంతో ఈ మూవీపై ఆసక్తి నెలకొంది. ఈ రోజు షూటింగ్ ప్రారంభమవుతున్న సందర్భంగా ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ను హీరో నాని చేతుల మీదుగా రిలీజ్‌ చేశారు. Also Read: సుహాస్‌కు జోడిగా ఛాందిని చౌదరి నటిస్తున్న ఈ సినిమాలో సీనియర్‌ కమెడియన్‌ సునీల్‌ విలన్‌గా నటిస్తుండటం విశేషం. దర్శకుడు సందీప్‌ రాజ్‌ కూడా కీలక పాత్రలో కనిపించనున్నాడు. ఈ సినిమాకు కీరవాణి తనయుడు కాళ భైరవ సంగీత దర్శకత్వం వహిస్తున్నాడు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2MxYUuz
v

మెగా హీరోలతో హ్యాట్రిక్‌ హిట్స్‌.. మరో సక్సెస్‌ గ్యారెంటీనా?

కొంత మంది దర్శకులు వరుసగా ఒకే హీరోతో ఎక్కువగా సినిమాలు చేస్తుంటారు. తెలుగులో ఇలాంటి దర్శకులు కనిపించకపోయినా తమిళ్‌లో అట్లీ వరుసగా విజయ్‌తో, శివ వరుసగా అజిత్‌లో సినిమాలు చేస్తుంటాడు. అలాగే మరికొందరు దర్శకుడు ఒకే ఫ్యామిలీకి చెందిన హీరోలతో వరుసగా సినిమాలు చేస్తుంటారు. తెలుగులోనూ ఓ దర్శకుడు అలా ఒకే ఫ్యామిలీ హీరోలతో సూపర్‌ హిట్లు తెరకెక్కిస్తున్నాడు. ఇటీవల గద్దలకొండ గణేష్‌ సినిమాతో సూపర్‌ హిట్ అందుకున్న దర్శకుడు . వరుణ్‌ తేజ్‌ హీరోగా తెరకెక్కిన ఈ రీమేక్‌ సినిమా హరీష్‌కు మెగా డైరెక్టర్‌ మరోసారి మంచి పేరు తెచ్చిపెట్టింది. ఈ సినిమా కన్నా ముందు అల్లు అర్జున్‌ హీరోగా డీజే దువ్వాడ జగన్నాథమ్‌ సినిమాను తెరకెక్కించాడు హరీష్. ఎన్నో వివాదాలకు కారణమైన డీజే బన్నీ కెరీర్‌లో బిగ్గెస్ట్‌ హిట్స్‌లో ఒకటిగా నిలిచింది. Also Read: అంతుకుముందు మెగా మేనల్లుడు సాయి ధరమ్‌ తేజ్‌ హీరోగా సుబ్రమణ్యం ఫర్‌ సేల్‌ సినిమాను తెరకెక్కించాడు హరీష్‌. ఈ సినిమాకు కూడా మంచి విజయం సాధించింది. అంతేకాదు పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్ కెరీర్‌ను మలుపు తిప్పిన సూపర్‌ హిట్ సినిమా గబ్బర్‌సింగ్‌కు దర్శకుడు కూడా హరీష్‌శంకరే. ఇలా వరుసగా మెగా హీరోలతో సూపర్‌ హిట్‌లు అందించిన హరీష్‌ శంకర్‌ తన తదుపరి చిత్రాన్ని కూడా మెగా హీరోతోనే ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఆర్ఆర్ఆర్‌ షూటింగ్‌లో బిజీగా ఉన్న మెగా పవర్‌ స్టార్ రామ్‌చరణ్‌ ఈ సినిమా పూర్తయిన తరువాత హరీష్‌తో సినిమా చేసే ఆలోచనలో ఉన్నాడు. Also Read: ఇప్పటికే రామ్‌ చరణ్‌కు కథ కూడా వినిపించినట్టుగా తెలుస్తోంది. ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్‌ భారీ బడ్జెట్‌తో తెరకెక్కించే ఆలోచనలో ఉందట. అయితే ఇంకా రామ్‌చరణ్‌, హరీష్‌ కథకు ఓకె చెప్పలేదని.. ఓకె చెప్పిన వెంటనే ప్రీ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు ప్రారంభమవుతాయని తెలుస్తోంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2MzYXWv
v

Daang Daang Video Song | Sarileru Neekevvaru


Daang Daang Video Song | Sarileru Neekevvaru

from BharatStudent - Telugu - Actor Actress|Photo,Picture Galleries|Wallpapers|Screensavers|Movie Trailers|Film News and Gossips https://ift.tt/37oJvVv

ఆ సీన్‌లో నటించడానికి చాలా ఇబ్బంది పడ్డా: పూజా హెగ్డే

టాలీవుడ్‌, బాలీవుడ్‌ అన్న తేడా లేకుండా అన్ని ఇండస్ట్రీలలో వరుస అవకాశాలతో దూసుకుపోతున్న నటి పూజా హెగ్డే. టాప్‌ హీరోల సరసన వరుస సినిమాలు చేస్తున్న ఈ బ్యూటీ తాజాగా తన యాక్టింగ్ ఎక్స్‌పీరియన్స్‌ గురించి ఆసక్తికర విషయాన్ని వెల్లడించింది. ఇటీవల జాతీయ మీడియాతో మాట్లాడుతూ లిప్‌లాక్‌ సన్నివేశాల్లో నటించటంపై తన అనుభవాలను వెల్లడించింది. కెరీర్‌ స్టార్టింగ్‌లో బాలీవుడ్ స్టార్‌ హీరో హృతిక్‌ రోషన్‌ సరసన ఓ పీరియాడిక్‌ సినిమాలో నటించే ఛాన్స్‌ కొట్టేసింది పూజా హెగ్డే. మొహెంజొదారో పేరుతో తెరకెక్కిన ఈ సినిమాలో రాణి పాత్రలో నటించింది. అయితే ఈ సినిమాలో హృతిక్‌తో లిప్‌లాక్‌ చేసింది ఈ బ్యూటీ. Also Read: ఈ సన్నివేశం చిత్రీకరణకు సంబంధించి తన అనుభవాలను వెల్లడించింది. `ముద్దు సీన్స్‌ ఆడియన్స్‌కు చాలా బాగా అనిపిస్తాయి. కానీ ఆ సన్నివేశాల్లో నటించేందుకు తారలు ఎంతో ఇబ్బంది పడతారు. మొహెంజొదారో షూటింగ్ సమయంలో హృతిక్‌తో లిప్‌లాక్‌ ఉందని దర్శకుడు అశుతోష్‌ గోవరికర్‌ నాకు ముందే చెప్పారు. సీన్‌ ఇంపార్టెన్స్‌ను వివరించారు. నేను కూడా ఆ సీన్‌లో నటించేందు ప్రిపేర్‌ అయ్యా. కానీ తీరా షాట్‌ చిత్రీకరించే సమయంలో వణుకు వచ్చేసింది. గతంలో నేను ఎప్పుడూ అలాంటి సీన్స్‌ చేయలేదు. అందుకే చాలా ఇబ్బంది పడ్డా. షూటింగ్ సమయంలో చుట్టూ అంత మంది క్రూ ఉన్నప్పుడు రొమాంటిక్ సన్నివేశాల్లో నటించటం చాలా ఇబ్బందిగా ఉంటుంది. అలాంటి సీన్స్‌లో నటించాలంటే హీరో హీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ చాలా ఇంపార్టెంట్‌` అని చెప్పింది పూజా హెగ్డే. Also Read: ప్రస్తుతం పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించిన అల వైకుంఠపురములో సంక్రాంతి కానుకగా రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఈ సినిమాతో పాటు ప్రభాస్‌ హీరోగా తెరకెక్కుతున్న పీరియాడిక్‌ రొమాంటిక్‌ డ్రామా జాన్‌లో నటిస్తోంది. ఈ సినిమాలతో పాటు బాలీవుడ్‌లోనూ పలు చిత్రాల్లో నటిస్తోంది పూజ.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2MF9mjT
v

Daang Daang పాటతో మహేష్, మిల్కీ బ్యూటీ ఇరగేశారు

డేంగ్.. డేంగ్ అంటూ పార్టీ సాంగ్‌తో రచ్చ చేస్తున్నారు మహేష్ బాబు, తమన్నాలు. సూపర్ స్టార్ మహేష్ బాబు, రష్మిక హీరో హీరోయిన్లుగా నటించిన ‘సరిలేరు నీకెవవ్వరు’ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. అనీల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మిల్కీ బ్యూటీ తమన్నా స్పెషల్ సాంగ్‌లో నటించింది. ఈ సాంగ్‌కి సంబంధించిన ప్రోమోను విడుదల చేసింది చిత్ర యూనిట్. డేంగ్.. డేంగ్ అంటూ సాగిన ఈ పాటలో తమన్నా ఎప్పటిలాగే స్టెప్పులతో పిచ్చెక్కిస్తుండగా.. మహేష్ బాబు సైతం స్టెప్పులేశాడు. దేవిశ్రీ ప్రసాద్ అదిరే బీట్ ఇవ్వగా.. రామ జోగయ్య శాస్త్రి లిరిక్స్ అందించారు. నకాష్ అజీజ్, లావిటొ లోబొ ఆలపించిన ఈ పాట కొద్దిసేపటి క్రితం విడుదలై యూట్యూబ్‌ని షేక్ చేస్తుంది. సాయంత్రం 7 గంటలనుండి ఈ పాట ప్రోమో కోసం నిరీక్షించి నీరసించిన ఫ్యాన్స్‌కి మంచి ఊపునిచ్చే పాటను ఇచ్చి జోష్ నింపాడు దేవి శ్రీ. శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ అందించిన ఈ సాంగ్‌లో స్వింగ్ జరా మిల్కీ బ్యూటీ తమన్నాతో పోటీ పడి స్టెప్పులు వేశారు మహేష్. మొత్తంగా మహేష్ బాబుపై డాన్స్‌ సరిగా వేయలేడనే కంప్లైంట్ ఉండనే ఉంది.. అయితే ఈ సాంగ్‌తో మహేష్ దాన్ని చెరిపేసుకునే ప్రయత్నం చేస్తున్నట్టుగానే కనిపించారు. మరి మహేష్, మిల్కీ బ్యూటీ ఆట పాటలపై మీరూ ఓ లుక్కేయండి.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2MwJ4An
v

Allu Arjun: ‘అల.. వైకుంఠపురములో’.. కాస్త రిలాక్స్

సంక్రాంతి పండుగ నాడు బాక్సాఫీస్ దుమ్ముదులిపేందుకు స్టైలిష్ స్టార్ ‘’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కించిన ఈ మూవీలో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించగా.. సుశాంత్, నవదీప్, నివేదా పేతురాజు, టబు, సునీల్, నవదీప్, రాజేంద్రప్రసాద్, సత్యరాజ్, సముద్రఖని, సచిన్ ఖేడ్కర్, మురళీశర్మ, రావు రమేష్ ఇలా చెప్పుకుంటూ పోతే స్క్రీన్‌ సరిపడనంతమంది భారీ క్యాస్టింగ్‌తో ఈ ‘అల వైకుంఠపురాన్ని నింపేశాడు మాటల మాంత్రికుడు. అసలే సంక్రాంతి అందులోనే మహేష్ బాబు ‘సరిలేరు నీకెవ్వరూ’ మూవీ రేస్‌లో ఉండటంతో పక్కా ప్లానింగ్‌తో ‘అల వైకుంఠపురములో’ చిత్రానికి అన్ని కార్యక్రమాలను చక్కబెడుతున్నారు. కాగా శనివారం నాటితో ఈ మూవీ షూటింగ్ కంప్లీట్ చేసుకుని గమ్మడికాయ కొట్టేసింది. ఈ సందర్భంగా షూటింగ్ కంప్లీట్ అంటూ .. పూజాతో కలిసి స్టెప్పులు వేస్తున్న ఫొటో పోస్టర్‌ని విడుదల చేసింది చిత్ర యూనిట్. మొత్తానికి షూటింగ్ పూర్తి కావడంతో నటీనటులకు రిలీఫ్ దొరికింది. బన్నీ, త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో వచ్చిన సన్నాఫ్ సత్యమూర్తి, జులాయి చిత్రాలు బ్లాక్ బస్టర్ హిట్స్ కావడంతో ‘అల.. వైకుంఠపురములో’ చిత్రంతో హ్యాట్రిక్ హిట్ కొట్టేందుకు రెడీ అవుతోంది ఈ కాంబో. హారిక హాసిని, గీతా ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి తమన్ అదిరిపోయే మ్యూజిక్ అందించారు. ఇప్పటికే ఆయన దరువు వేసి వదిలిన ‘సామజవరగమన’, రాములో రాములో సాంగ్స్ రిపీట్ మోడ్‌లో దంచికొడుతున్నాయి. ఈ రెండు సాంగ్స్ 100 మిలియన్ వ్యూస్‌ని దాటేసిన విషయం తెలిసిందే. మంచి మ్యూజికల్ హిట్ సాధించిన ‘అల వైకుంఠపురములో’ మూవీ జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2SBzYpB
v

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...