Monday 30 December 2019

‘మత్తు వదలరా’.. బాహుబలి, భళ్లాలదేవది ఒకే మాట!

‘మత్తు వదలరా’ సినిమా ద్వారా ప్రముఖ సంగీత దర్శకుడు యం.యం.కీరవాణి చిన్న కుమారుడు శ్రీసింహా హీరోగా, పెద్ద కుమారుడు కాలభైరవ సంగీత దర్శకుడిగా పరిచయమైన సంగతి తెలిసిందే. కొత్త దర్శకుడు రితేష్ రాణా ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఈయనే కాదు.. ఈ సినిమాకు పనిచేసిన వాళ్లంతా కొత్తవాళ్లే. సినిమాను కూడా అంతే కొత్తగా తీసి హిట్ అందుకున్నారు. ప్రేక్షకులు హిట్ చేసిన ఈ సినిమాను ఇప్పుడు సెలబ్రిటీలు కూడా చూస్తున్నారు. ఎస్.ఎస్.రాజమౌళి తెరకెక్కించిన ‘బాహుబలి’ సినిమాతో నేషనల్ స్టార్స్‌గా పాపులారిటీ సంపాదించిన రెబల్ స్టార్ ప్రభాస్, రానా దగ్గుబాటి తాజాగా ‘మత్తు వదలరా’ సినిమాను చూశారు. సినిమా అద్భుతంగా ఉందని చిత్ర యూనిట్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. ఈ మేరకు చిత్ర యూనిట్ ప్రభాస్‌తో దిగిన ఫొటోను, రానా మాట్లాడిన వీడియోను విడుదల చేశారు. ప్రభాస్ మాట్లాడే వీడియోను మంగళవారం విడుదల చేయనున్నారు. ఇక ఈ సినిమా గురించి రానా మాట్లాడుతూ.. ‘‘ఇలాంటి ఒక యూనిక్ కొత్త సినిమా తీసినందుకు చిత్ర దర్శకుడు రితేష్ రాణాకు అభినందనలు. నాకు ఇలాంటి కొత్త సినిమాలన్నా.. ఎడ్జీ సినిమాలన్నా చాలా ఇష్టం. ఇది చాలా మంచి ఎడ్జీ ఎడ్జీ ఫిల్మ్. సినిమా ప్రారంభం నుంచి చూసుకుంటే భైరవ ఇచ్చిన నేపథ్య సంగీతం ఒక ట్రిప్‌లో ఉంటుంది. సింహా నాకు బాగా తెలుసు. నా కళ్ల ముందే ఎదిగాడు. అతనే ఎదిగాడు.. నేను ఎదగలేదు అని అనుకుంటున్నాను. ఎందుకంటే ఒక నటుడిగా తన పాత్రలో అద్భుతంగా నటించాడు. తన మొదటి సినిమానే ఇలాంటి కథను ఎంపికచేసుకోవడం, ప్రజలు ఏం ఇష్టపడతారో తెలుసుకోవడం గొప్ప విషయం’’ అని చెప్పుకొచ్చారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/37kqT8Y
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...