Saturday 29 February 2020

దటీజ్ ఉపాసన: పేదల కోసం మంచి కార్యక్రమం.. పాల్గొనాలంటూ పిలుపు

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సతీమణి, అపోలో ఫౌండేషన్, అపోలో లైఫ్ గ్రూపుల చైర్‌పర్సన్‌ ఉపాసన కొణిదెల సామాజిక సేవలో ముందుంటారనే విషయం అందరికీ తెలిసిందే. బిజినెస్‌లతో బిజీగా ఉండే ఉపాసన సామాజిక సేవ కోసం కూడా సమయాన్ని కేటాయిస్తున్నారు. పేదలకు తనవంతు సాయాన్ని అందిస్తున్నారు. అలాగే, సోషల్ మీడియా ద్వారా తన ఫాలోవర్స్‌కు అవగాహన కల్పిస్తున్నారు. తమవంతు సాయం అందించాలని కోరుతున్నారు. తాజాగా ఉపాసన పేదల కోసం మరో మంచి కార్యక్రమం చేపట్టారు. మనం మన కోసమే కాకుండా జనం కోసం కూడా ఆలోచించాలంటున్నారు ఉపాసన. మన జ్ఞాపకాలతో ముడిపడనివి, వాడేసిన వస్తువులు, దుస్తులు ఏమైనా ఉంటే వాటిని పేదలకు ఇచ్చే ఏర్పాటు చేయాలంటున్నారామె. తన ఇంట్లో వాడకం మొదలుపెట్టి 9 నెలలు దాటిన అలాంటి వస్తువులను జనం కోసం వినియోగించేందుకు సిద్ధం చేశారు. ఈ వస్తువులన్నింటినీ అమ్మి చారిటీ కోసం నిధులు సమకూరుస్తానని ఉపాసన సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ‘‘మీ దగ్గర కూడా ఇలాంటివి పాత వస్తువులు ఉంటే వాటిని పేదల కోసం ఇవ్వండి’’ అంటూ ఆమె పిలుపునిచ్చారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3coWDxc
v

Green India Challenge: ఖుష్బూతో మొక్కలు నాటించిన రోజా.. ఛాలెంజ్ ఎవరికి విసిరారంటే!

‘మొక్కలు నాటుదాం..పర్యావరణాన్ని రక్షించుకుందాం’ అనే నినాదాన్ని జనంలోకి తీసుకువెళ్లడంలో సెలబ్రిటీలు తమవంతు ప్రయత్నం చేస్తున్నారు. తెలంగాణ రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమానికి అనూహ్య స్పందన కంటిన్యూ అవుతోంది. ఈ కార్యక్రమంలో పలువురు సెలబ్రిటీలు భాగస్వామ్యం అవుతూ తాము మొక్కలు నాటడంతో పాటు.. తమ సన్నిహితులు స్నేహితుల్ని ఈ గ్రీన్ ఛాలెంజ్‌లో భాగస్వామ్యం చేస్తున్నారు. ‘రోజా వనం’ పేరిట గత వారం సినీ నటుడు అర్జున్‌తో మొక్కలు నాటించిన సినీ నటి, నగరి ఎమ్మెల్యే శనివారం నాడు సీనియర్ నటి ఖుష్బూతో మొక్కలు నాటించారు. గ్రీన్‌ ఇండియా చాలెంజ్, రోజా వనం సంయుక్తంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో కుష్బూ మూడు మొక్కలు నాటారు. ఈ సందర్భంగా తన తోటి యాక్టర్స్ మీనా, సుహాసిని, డాన్సర్ బింద్రాలకు గ్రీన్ ఛాలెంజ్ విసిరారు .


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2VxisV6
v

Hit Movie: ‘హిట్’ ఫస్ట్ డే కలెక్షన్స్.. ఈ లెక్కన నానికి లాభమా? నష్టమా?

హీరోగానే కాదు.. నిర్మాతగానూ సత్తా చాటుతున్నాడు నేచురల్ స్టార్ నాని. వాల్ పోస్టర్ బ్యానర్‌తో నిర్మాతగా మారిన నేచురల్ స్టార్ నాని లేటెస్ట్ మూవీ ‘హిట్’. మాస్ కా దాస్ విశ్వక్ సేన్ హీరోగా నటించిన ఈ చిత్రం శుక్రవారం నాడు విడుదలై పాజిటివ్ టాక్‌ను రాబట్టింది. శైలేష్ కొలను ఈ చిత్రంతో టాలీవుడ్ దర్శకుడిగా పరిచయం కాగా..‘చి.ల.సౌ ఫేమ్ రుహాని శర్మ హీరోయిన్‌గా నటించింది. మంచి బజ్‌తో థియేటర్స్‌కి వచ్చిన హిట్ మూవీ తొలిరోజు మంచి కలెక్షన్లే రాబట్టింది. ఈ నగరానికి ఏమైంది?, ఫలక్ నుమాదాస్ చిత్రాలతో నటుడిగా గుర్తింపు పొందిన విశ్వక్ సేన్ పూర్తి స్థాయిలో ఎస్టాబ్లిష్ కాకపోవడంతో ఈ చిత్రం తొలిరోజు ఓ మాదిరిగానే ఉన్నాయి. తొలిరోజు అన్ని ఏరియాలలోనూ కలిపి రూ. 1.29 కోట్లు రాబట్టింది. ఏరియాల వారిగా.. నైజాం- 0.66 కోట్లు సీడెడ్- 0.13 కోట్లు యూఏ- 0.12 కోట్లు గుంటూరు- 0.15 కోట్లు ఈస్ట్ గోదావరి- 0.06 కోట్లు వెస్ట్ గోదావారి- 0.05 కోట్లు క్రిష్ణా - 0.08 కోట్లు నెల్లూరు- 0.04 కోట్లు మొత్తం - 1.29 కోట్లు మొదటి 15 నిమిషాలు మీరు థియేటర్‌కి వచ్చికూర్చోండి.. ఆ తరువాత సీట్లలో మిమ్మల్ని నేను కూర్చోబెడతా.. వచ్చేటప్పుడు ఎక్కువ వాటర్ తాగి మాత్రం రావొద్దు. ఎందుకంటే టాయిలెట్ వస్తే మధ్యలో లేవలేరు. అంతలా ఉండబోతుంది ‘హిట్’ సినిమా అంటూ హీరో విశ్వక్ సేన్ చెప్పనంత రేంజ్‌లో ఈ సినిమా లేదు కాని.. సినిమా చూసిన ప్రేక్షకుల్ని ‘హిట్’ డిజప్పాయింట్ చేయదు అని మాత్రం చెప్పొచ్చు. కాగా తొలిరోజు ఓ మాదిరి కలెక్షన్లు రాబట్టిన ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ 4.40 కోట్ల మేరకు జరిగింది. సో.. తొలిరోజు రూ. 1.29 కోట్లు రాబట్టడటంతో బ్రేక్ ఈవెన్ సాధించి నానికి లాభాలు కురిపిస్తుందేమో చూడాలి. See Photo Story:


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2VyopRy
v

రాత్రి వేళల్లో హాట్ హీరోయిన్‌తో విజయ్ బైక్ రైడ్: ఫొటోలు వైరల్

రౌడీ బాయ్ హాట్ హీరోయిన్‌ను బైక్ ముందు కూర్చోబెట్టుకుని రాత్రి వేళ్లలో తెగ చక్కర్లుకొట్టాడు. నమ్మడం లేదా.. కావాలంటే పైనున్న ఫొటో చూడండి. ఇంతకీ ఆ అమ్మాయి ఎవరో తెలుసా? బాలీవుడ్‌లో మొన్న మొన్ననే అడుగుపెట్టిన లేద అందం అనన్యా పాండే. ‘సాహో’ సినిమాలో విలన్‌గా నటించిన ప్రముఖ బాలీవుడ్ నటుడు చుంకీ పాండే కూతురు. ‘ఫైటర్’ సినిమాలో విజయ్ దేవరకొండకు జోడీగా నటిస్తోంది. డ్యాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై కరణ్ జోహార్ సినిమాను సమర్పిస్తున్నారు. పూరీ కనెక్ట్స్ బ్యానర్‌పై పూరీ జగన్నాథ్, ఛార్మీ కలిసి సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాను తెలుగు, హిందీలో రిలీజ్ చేయనున్నారు. ఈ సినిమాకు సంబంధించిన కొన్ని స్టిల్స్ లీకయ్యాయి. విజయ్ దేవరకొండ బైక్‌పై కూర్చుని ఉండగా, అనన్య ఆయన ముందు కూర్చుని ఉన్నారు. రాత్రివేళల్లో ఈ సీన్‌ను చిత్రీకరిస్తుండగా ఎవరో ఫొటోలు తీసారు. దాంతో ఈ ఫొటోలు కాస్తా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఈ సినిమాలో కీలక పాత్రలో ఓ ఇంటర్‌ నేషనల్‌ స్టార్‌ను నటింపచేసేందుకు ప్రయత్నిస్తున్నాడట పూరి. బాక్సింగ్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో లెజెండరీ బాక్సర్‌ మైక్‌ టైసన్‌తో కీలక పాత్రలో చేయించే ఆలోచనలో ఉన్నాడట. READ ALSO: అయితే మైక్‌ పూరి సినిమాలో అతిథి పాత్రలో నటించేందుకు అంగీకరిస్తాడా లేదా అన్న విషయం చూడాలి. ఈ సినిమాకు ముందుగా పూరి ఫైటర్‌ అనే టైటిల్‌ను అనుకున్నా.. ఆ టైటిల్‌ విషయంలో కరణ్ అభ్యంతరం వ్యక్తం చేసినట్టుగా తెలుస్తోంది. ఫైటర్‌ చాలా నార్మల్‌గా ఉందని అన్ని భాషలకు సూట్ అయ్యే మరో డిఫరెంట్ టైటిల్‌ అయితే బెటర్‌ అన్న అభిప్రాయం వ్యక్తంచేశాడట. దీంతో ఫైటర్‌ను పక్కన పెట్టిన పూర్తి సినిమాను VD 10 అనే పేరుతోనే ప్రారంభించాడు. ఈ సినిమాలో విజయ్‌కు జోడిగా బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే నటించనుందన్న టాక్ వినిపిస్తోంది. READ ALSO:


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2TcrYvs
v

Prabhas సినిమాలో దీపిక పదుకొణె అంటగా...!

యంగ్ రెబెల్ స్టార్ .. జాతీయ అవార్డు గ్రహీత నాగ్ అశ్విన్‌తో కలిసి ఓ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా కొత్త సినిమాను ప్రకటించారు. ఈ సినిమాను ప్యాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిస్తున్నట్లు ఇటీవల నాగ్ అశ్విన్ వెల్లడించారు. అందుకే ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపిక పదుకొణెని ఎంపిక చేసుకోవాలని అనుకుంటున్నారట. ఇదే విషయాన్ని మీడియా వర్గాలు నాగ్ అశ్విన్‌ని అడగ్గా.. ‘ఈ విషయం గురించి ఆ హీరోయిన్‌కే కాదు నాకూడా తెలీదు. మొన్నేగా సినిమా గురించి ప్రకటించాం. సినిమా స్టార్ట్ అవ్వడానికి మరో పది నెలలు పడుతుంది. ఇది నేను సొంతంగా రాసుకున్న కథే. ఏ సినిమాకీ రీమేక్ కాదు. ప్రభాస్‌కు కథ నచ్చే ఒప్పుకున్నారు. కథ నచ్చకపోతే మనం ఎంత ఫోర్స్ చేసినా వాళ్లు ఒప్పుకోరు కదా’ అని తెలిపారు. ప్రభాస్ ఫ్యాన్స్ గర్వపడేలా ఈ సినిమాను తెరకెక్కిస్తానని నాగ్ అశ్విన్ అన్నారు. అయితే ఇంకా ఈ సినిమాకు ఎలాంటి టైటిల్ అనుకోలేదు. సినిమాను మాత్రం తెలుగు, హిందీతో పాటు ఇతర దక్షిణాది భాషల్లో రిలీజ్ చేయనున్నారు. READ ALSO: ప్రస్తుతం రాధాకృష్ణ సినిమాతో ప్రభాస్ బిజీగా ఉన్నారు కాబట్టి ఈ సినిమా పూర్తైన వెంటనే నాగ్ అశ్విన్ సినిమాలో నటిస్తారు. రాధాకృష్ణ సినిమాలో పూజా హెగ్డే కథానాయికగా నటిస్తున్నారు. ‘రాధే శ్యాం’, ‘ఓ డియర్’ అనే టైటిల్స్ పరిశీలనలో ఉన్నాయి. 1930ల నాటికి చెందిన ప్రేమ కథ నేపథ్యంలో సినిమా ఉండబోతోందని ఎప్పటినుంచో వార్తలు వస్తున్నాయి. ‘సాహో’ సినిమాతో చేసిన తప్పులు ఈ సినిమాలో రిపీట్ కాకుండా ఉండేలా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. READ ALSO:


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3ciSLO5
v

లోదుస్తులు బయటికి కనిపిస్తే తప్పేంటి: నటి సూటి ప్రశ్న

ఆడపిల్లలు పద్ధతిగా ఉండాలని అందరూ చెప్పేమాటే. ముఖ్యంగా భారతదేశంలోని ప్రతీ ఆడపిల్ల ఒళ్లంతా కప్పుకుని దుస్తులు వేసుకోవాలి. లేకపోతే అదో పెద్ద పాపంలా చూస్తారు. పెద్దలు అలా చెప్పడంలో ఏమాత్రం తప్పు లేదు. ఎందుకంటే మన జాగ్రత్త కోసమే వారు ఇలాంటివన్నీ చెప్తుంటారు. అయితే కొంతమంది అమ్మాయిల అభిప్రాయం ఏంటంటే.. ఎలాంటి దుస్తులైనా వేసుకునే హక్కు మాకుంది. ఇలా ఉండండి, అలా ఉండండి అంటే ఒప్పుకునేది లేదు అంటున్నారు. అదేమంటే.. ఇది 2020 అంటారు. ప్రముఖ నటి కూడా దీనికే సపోర్ట్ చేస్తున్నారు. ఆమె లోదస్తులకు సంబంధించిన ఓ క్యాంపెయిన్కు సపోర్ట్ చేస్తున్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం రాబోతున్న సందర్భంగా ఈ క్యాంపెయిన్‌ను నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా రాధికా మదన్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. ‘ఇది 2020. ప్రతీ విషయంలో మహిళలు ప్రశంసలు అందుకుంటున్నారు. కానీ ఏ మహిళలనైతే పొడుగుతున్నారో అదే మహిళ లోదుస్తులు బయటికి కనిపించేలా వేసుకుంటే నోటికొచ్చిన కామెంట్స్ చేస్తున్నారు. మహిళలు వేసుకునే దుస్తులను బట్టి వారి వ్యక్తిత్వాన్ని డిసైడ్ చేసే రోజుల పోయాయి. వాళ్లు ఎలాంటి దుస్తుల్లో సౌకర్యంగా ఫీలవుతారో అలాంటి దుస్తులనే వేసుకోనివ్వాలి' READ ALSO: ' ఓసారి నేను స్కూల్లో చదువుతున్నప్పుడు ఓ అబ్బాయి నా దగ్గరికి వచ్చి నీ లోదుస్తులు కనిపిస్తున్నాయి అని చెప్పాడు. అది పెద్ద పాపం అనుకుని నేను సిగ్గుతో ఇంటికి వెళ్లిపోయాను. కానీ ఇప్పుడు ఆ అబ్బాయి కనిపిస్తే నీ పని నువ్వు చూసుకోరా అని చెప్పాలని ఉంది. నేను అందరు ఆడపిల్లలకు ఒక్కటే చెప్పాలని అనుకుంటున్నాను. మీ లోదుస్తులు బయటపడితే వాటిని చూసి సిగ్గుపడకండి. అది కేవలం మీ మానాన్ని కాపాడుకోవడానికి వేసుకునే దుస్తులే తప్ప మీ వ్యక్తిత్వాన్ని నిర్ణయించేవి కావు’’ అని తెలిపారు. READ ALSO:


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2I6D7Y9
v

‘మైండ్ బ్లాక్’ ఫుల్ సాంగ్: బాబూ సూడు.. గంటలోనే రికార్డు!

‘బాబూ నూ సెప్పు.. వాడ్ని కొట్టమని డప్పు’.. సూపర్‌స్టార్ మహేష్ బాబు అభిమానులు థియేటర్లలో పూనకాలతో ఊగిపోయిన పాట ఇది. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ సినిమా సంక్రాంతికి విడుదలై బ్లాక్ బస్టర్ విజయం అందుకుంది. ఈ సినిమా రిలీజ్ అయ్యి ఈరోజుకి సక్సెస్‌ఫుల్‌గా 50 రోజులు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ‘మైండ్ బ్లాక్’ ఫుల్ సాంగ్‌ని రిలీజ్ చేసింది టీం. ఈ పాట రిలీజ్ అయిన గంటలోనే నాలుగు లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. పాటకు ఉన్న క్రేజ్ అలాంటిది మరి. మహేష్ ఇలాంటి ఒక ఊర మాస్ పాట చేస్తాడని ఫ్యాన్స్ ఎప్పుడూ ఊహించలేదు. లుంగీ కట్టుకుని మరీ మహేష్ మాస్ స్టెప్పులకు వేసాడంటే ఇక ఫ్యాన్స్ ఆగుతారా. అనిల్ రావిపూడి సరిలేరు నీకెవ్వరు సినిమాకు సంబంధించిన ప్రెస్ మీట్ పెట్టినప్పుడే ఫ్యాన్స్‌ మరిచిపోలేని మాస్ పాట అందిస్తానని చెప్పాడు. ఆయన ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నాడు. అసలు మహేష్‌కి డ్యా్న్స్ వచ్చా అని అడిగినవారంతా ఈ పాట చూసి ముక్కున వేలేసుకుంటున్నారు. సినిమా 50 రోజులు సక్సెస్‌ఫుల్‌గా ఆడిన సందర్భంగా అనిల్ రావిపూడి ఎమోషనల్ పోస్ట్ ఒకటి పెట్టారు. READ ALSO: ‘మరో మర్చిపోలేని సంక్రాంతి. నేనెప్పటికీ మర్చిపోలేని ప్రయాణం. నేను సూపర్‌స్టార్‌తో కలిసి చేసిన జర్నీ 50 రోజులు పూర్తిచేసుకుంది. ఈ సినిమాకు నాకు చాలా ప్రత్యేకం. తెలుగు రాష్ట్రాల్లో ‘నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్’, ‘నీకు అర్థమవుతోందా’, ‘రమణా.. లోడ్ ఎత్తాలిరా’ డైలాగులు వైబ్రేషన్ క్రియేట్ చేసాయి. ప్రేక్షకులూ సరిలేరు మీకెవ్వరూ’ అని పేర్కొన్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3afQaTb
v

Friday 28 February 2020

Mind Block Full Video Song | Sarileru Neekevvaru


Mind Block Full Video Song | Sarileru Neekevvaru

from BharatStudent - Telugu - Actor Actress|Photo,Picture Galleries|Wallpapers|Screensavers|Movie Trailers|Film News and Gossips https://ift.tt/2Pwtgij

పవర్‌స్టార్ ఫ్యాన్స్ సెలబ్రేషన్స్‌కి రెడీగా ఉండిండి.. ఫస్ట్‌లుక్ వచ్చేస్తోంది

పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ ‘పింక్’ రీమేక్‌లో నటిస్తున్న సంగతి తెలిసిందే. వేణు శ్రీరామ్ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. అభిమానులు ఎంతో ఉత్కంఠతో ఎదురుచూస్తున్న ఈ సినిమా ఫస్ట్‌లుక్ వచ్చేస్తోంది. సోమవారం ఫస్ట్‌లుక్‌ను రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది. అయితే టీం నుంచి అఫీషియన్ కన్ఫర్మేషన్ రావాల్సి ఉంది. సినిమాకు లాయర్ సాబ్, లేదా వకీల్ సాబ్ అనే టైటిల్ అనుకుంటున్నారట. బాలీవుడ్‌లో మంచి విజయం అందుకున్న ‘పింక్’ సినిమాకు ఈ సినిమా రీమేక్‌గా రాబోతోంది. అందులో అమితాబ్ బచ్చన్ ప్రధాన పాత్రలో నటించారు. ఇందులో అదే పాత్రను పవన్ పోషిస్తున్నారు. ఈ సినిమాలో మరో ముగ్గురు అమ్మాయిల పాత్రలు చాలా కీలకం. హిందీలో తాప్సి, కీర్తి కుల్హరి నటించిన పాత్రల్లో నివేదా థామస్‌, అంజలి నటిస్తున్నట్లు తెలుస్తోంది. దిల్ రాజు, బోనీ కపూర్ కలిసి సినిమాను నిర్మిస్తున్నారు. షూటింగ్ చాలా ఫాస్ట్‌గా జరిగిపోతోంది. పవన్ షూటింగ్స్‌కు హైదరాబాద్ వచ్చేందుకు దిల్ రాజు ఆయన కోసం ప్రత్యేకమైన విమానం కూడా ఏర్పాటుచేసినట్లు సమాచారం. READ ALSO: త్వరోలో సినిమాలోని మొదటి పాటను రిలీజ్ చేయడానికి కూడా సన్నాహాలు చేస్తున్నారు. సినిమాకు తమన్ సంగీతం అందించారు. సినిమా కోసం కంపోజ్ చేసిన రెండు మూడు పాటలను పవన్‌కు వినిపించేందుకు ఇటీవల తమన్ ఆయన ఇంటికి వెళ్లారు. ఆయనకు కూడా పాటలు నచ్చాయట. సినిమాను మేలో రిలీజ్ చేసేయాలని సన్నాహాలు చేస్తున్నారు. READ ALSO:


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2POXGwL
v

ఇక బెడ్రూం సీన్లలో నటించే ఓపిక నాకు లేదు: సిద్ధార్థ్ హీరోయిన్

ఫలానా హీరోయిన్ సెక్స్ సీన్లలో, రొమాంటిక్ సీన్లలో నటిస్తే ఇక ఆమెను ఇలాంటి సన్నివేశాల్లో చూపించాలని అనుకుంటారు. కొందరేమో ఏ సన్నివేశం అయితే ఏంటి అవకాశం వచ్చిందా లేదా అని నటించేస్తూ ఉంటారు. మరికొందరు మాత్రం ఎప్పుడూ ఇవే సీన్లా, నాలో నటిని గుర్తించలేరా అని బాధపడుతుంటారు. అలాంటివారిలో ఒకరు ప్రముఖ తమిళ నటి . ‘గృహం’, ‘విశ్వరూపం 2’ సినిమాల్లో రొమాంటిక్ డోస్ కాస్త ఎక్కువగా ఉన్న సన్నివేశాల్లో నటించారు ఆండ్రియా. ఇటీవల రిలీజ్ అయిన ‘వడా చెన్నై’ సినిమాలో కూడా ఆండ్రియా పాత్ర బెడ్‌రూం సీన్లకే పరిమితం అయిపోయింది. అయితే ఇక ఈ సీన్లతో విసిగిపోయానని అంటున్నారు ఆండ్రియా. తనకు చాలాకాలంగా ఇలాంటి సన్నివేశాలే వస్తున్నాయని, ఇక తన వల్ల కాదని అన్నారు. తన పాత్ర గొప్పగా ఉండి, బెడ్ రూం సీన్లలో నటించాల్సిన అవసరం ఉంటే తప్పకుండా చేస్తాను కానీ, ఊరికే బోల్డ్ సీన్లలో నటించమంటే మాత్రం ఇక నుంచి నో చెప్పాలని అనుకుంటున్నట్లు తెలిపారు. మంచి పాత్రలతో తన వద్దకు వస్తే రెమ్యునరేషన్ తగ్గించుకోవడానికైనా సిద్ధంగా ఉన్నానని పేర్కొన్నారు. ప్రస్తుతం ఆండ్రియా ‘మాస్టర్’ సినిమాలో నటిస్తున్నారు. దళపతి విజయ్ కథానాయకుడిగా నటిస్తున్న ఈ సినిమాకు లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. READ ALSO: మాళవిక మోహనన్ మరో హీరోయిన్ పాత్రను పోషిస్తున్నారు. వేసవిలో సినిమా రిలీజ్ కాబోతోంది. ఆండ్రియా నటి మాత్రమే కాదు సింగర్ కూడా. సూపర్‌స్టార్ మహేష్ బాబు, కియారా అద్వానీ నటించిన ‘భరత్ అనే నేను’ సినిమాలో ‘అరెరె ఇది కలలా ఉన్నదే’ పాటను పాడింది ఆండ్రియానే. READ ALSO:


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2I21c2t
v

రాజకీయాల్లోకి రజినీకాంతా.. వచ్చేలోపే చచ్చిపోతాడు: దర్శకుడి షాకింగ్ వ్యాఖ్యలు

సూపర్‌స్టార్ రాజకీయాల్లోకి రావాలని ఎప్పటినుంచో కలలు కన్నారు. ఇంకా పార్టీ పేరు ప్రకటించలేదు కానీ ఆయన పరోక్షంగా రాజకీయాల్లోకి వచ్చేసినట్లే. అయితే సినీ ప్రముఖులు రాజకీయాల్లోకి వెళ్తే.. ప్రత్యర్ధి పార్టీలు కుళ్లుకోవడం, కామెంట్స్ చేయడం చూసే ఉంటాం. కానీ ఓ సినీ దర్శకుడే రజినీకాంత్ రాజకీయ రంగప్రవేశంపై షాకింగ్ కామెంట్స్ చేసారు. ఆయన ఎవరో కాదు ప్రముఖ తమిళ దర్శకుడు, నటుడు ఆర్. సుందర రాజన్. దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయ లలిత 72వ జయంతి సందర్భంగా తమిళనాడులో ఓ కార్యక్రమం ఏర్పాటుచేసారు. ఈ ఈవెంట్‌కు సుందరరాజన్ అతిథిగా వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన స్టేజ్ ఎక్కి ఇష్టారాజ్యంగా మాట్లాడేసారు. "అన్నాదురై ముఖ్యమంత్రి అయినప్పుడు టీచర్లు చాలా సంతోషించారు. ఎందుకంటే సీఎం అవడానికి ముందు అన్నాదురై కూడా టీచర్ ప్రొఫెషన్‌లోనే ఉన్నారు. కానీ టీచర్లు ఎవ్వరూ ఆయన్ను ఫాలో అయ్యి సీఎం అవ్వాలని అనుకోలేదు. కానీ ఎప్పుడైతే మహానుభావుడు ఎంజీఆర్ ముఖ్యమంత్రి అయ్యారో, చాలా మంది తమకున్న అర్హతలు ఏంటో కూడా చూసుకోకుండా సినిమాల్లోకి వచ్చేయాలని నిర్ణయించేసుకున్నారు. రజినీకాంత్ పార్టీ పెట్టి, కోయింబత్తూరులో తొలి సమావేశం ఏర్పాటుచేసారనుకోండి.. ఆయన తిరుపూరు చేరుకునేలోపే చచ్చిపోతాడు. ఆయన శరీరం అంత క్రిటికల్‌గా ఉంది మరి" READ ALSO: "ఎంజీఆర్ తన సినిమాలోని విలన్లను ఎప్పుడూ చంపలేదు. కానీ రజినీకాంత్, విజయ్, అజిత్ లాంటి నటులు తమ సినిమాల్లోని విలన్స్‌ని ఎప్పుడూ చంపాలనే చూసారు. రాజు పాత్ర కూడా కేవలం ఎంజీఆర్‌కే సరిపోయింది. రజినీ, అజిత్, విజయ్ రాజు గెటప్ వేస్తే అసహ్యంగా ఉండేవారు. ఎంజీఆర్ కూర్చున్న సీటులో వీళ్లంతా కూర్చోవాలన్న ఆలోచన కూడా ఎలా వచ్చిందో నాకైతే అర్థంకావడంలేదు’ అంటూ రెచ్చిపోయారు. వీళ్లను మాత్రమే కాదు స్టాలిన్, కరుణానిధిలతో పాటు ఇతర నేతలపై కూడా నోటికొచ్చినట్లు కామెంట్స్ చేసారు సుందర రాజన్. READ ALSO:


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2Vy9R4G
v

ప్రియుడితో ఘాటు ముద్దులు.. హీరో చెల్లెలు అరాచకం

నాలుగు గోడల మధ్య తీర్చుకోవల్సిన ముద్దు ముచ్చట్లను సోషల్ మీడియాకి ఎక్కి మరీ కిస్సుబుస్సులాడిస్తున్నారు సెలబ్రిటీలు. ఇదేం ఆనందమో తెలియదు కాని.. బాలీవుడ్ సెలబ్రిటీలు అయితే సిగ్గువిడిచి మరీ చుమ్మహ అంటూ లిప్ లాక్‌లు కానిచ్చేస్తున్నారు. కానిస్తే కానిచ్చారు.. ఈ ఘాటు ముద్దుల్ని సోషల్ మీడియాలో షేర్ చేసి రెండు విధాలుగా ఆనందం పొందుతున్నారు. తాజాగా బాలీవుడ్‌ యాక్షన్ హీరో సోదరి తన ప్రియుడితో ఘాటు ముద్దులు కానిస్తూ.. ఆ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. బిజినెస్ రంగంలో రాణిస్తున్న ఈ 26 ఏళ్ల హాట్ భామ తన ప్రియుడు ఎబాన్ హ్యామ్స్‌తో రిలేషన్ షిప్‌లో ఉంది. ప్రస్తుతం ప్రియుడితో కలిసి వెకేషన్ ట్రిప్‌‌ను ఎంజాయ్ చేస్తున్న ఈ భామ.. తన ప్రియుడితో ముద్దూ ముచ్చట్లను తీర్చుకుంటూ రసభరిత చిత్రాలను సోషల్ మీడియాలో వదిలిపెట్టింది. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ఈ భామ తన ప్రియుడితో కలిపి ఉన్న శృంగార భరిత చిత్రాలను షేర్ చేయడం ఇదే తొలిసారి కాదు.. తరచూ ఇలాంటి కిస్ క్లిక్స్‌ను షేర్ చేస్తూనే ఉంటుంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/386Zbg2
v

ఫొటోలు: రష్మిక చిట్టి చెల్లెలు.. ఎంత ముద్దుగుందో

భీష్మ, సరిలేరు నీకెవ్వరు వంటి బ్లాక్ బస్టర్ హిట్లతో 2020లో రెండు హిట్లు అందుకుని టాలీవుడ్‌లో సత్తా చాటుతోంది రష్మిక. అర్థమౌతోందా అంటూ అందర్నీ అలరిస్తున్న ఈ భామకు ఓ చిట్టిచెల్లెలు ఉంది. వీరిద్దరికీ సంబంధించి వైరల్ అవుతున్న ఫొటోలు మీకోసం.

from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2wYVzQp
v

Ala Vaikunthapurramloo (Title Song) Full Video


Ala Vaikunthapurramloo (Title Song) Full Video

from BharatStudent - Telugu - Actor Actress|Photo,Picture Galleries|Wallpapers|Screensavers|Movie Trailers|Film News and Gossips https://ift.tt/32xEYPg

Chitike se Aa Chirugaali - Official Video Song | Aranya


Chitike se Aa Chirugaali - Official Video Song | Aranya

from BharatStudent - Telugu - Actor Actress|Photo,Picture Galleries|Wallpapers|Screensavers|Movie Trailers|Film News and Gossips https://ift.tt/2T75uf1

RED Official Teaser


RED Official Teaser

from BharatStudent - Telugu - Actor Actress|Photo,Picture Galleries|Wallpapers|Screensavers|Movie Trailers|Film News and Gossips https://ift.tt/39b8c91

‘రెడ్’ టీజ‌ర్: రాపో మాస్ థ్రిల్లర్.. మణిశర్మ మార్క్ స్కోర్

క్రైమ్ థ్రిల్లర్ జోన‌ర్‌కి స‌స్పెన్స్ ఎలిమెంట్ చాలా కీల‌కం. అస‌లేం జ‌రుగుతోంది? అన్నది ముందే రివీల్ కాకూడ‌దు. ప్రేక్షకుడి ఊహ‌కు దొరికిపోకూడదు. ఊపిరి బిగ‌బ‌ట్టి కుర్చీ అంచున కూర్చొని చూడ‌గ‌లిగేలా చేస్తేనే స‌క్సెస్ సాధ్యం. అలాంటి గ్రిప్ ఉన్న క్రైమ్ థ్రిల్లర్లు ఇటీవ‌ల టాలీవుడ్ బాక్సాఫీస్ వ‌ద్ద సంద‌డి చేశాయి. ప్రస్తుతం క్రైమ్ థ్రిల్లర్ కం ల‌వ్ స్టోరీల‌తో హిట్లు కొట్టే ట్రెండ్ న‌డుస్తోంది. ఆ కోవ‌లోనే మ‌రో ప్రయ‌త్నం ‘రెడ్’. ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా కిశోర్ తిరుమ‌ల ద‌ర్శక‌త్వం వ‌స్తోన్న చిత్రం ‘రెడ్’. శ్రీ‌ స్రవంతి మూవీస్ ప‌తాకంపై స్రవంతి ర‌వికిశోర్ నిర్మిస్తున్నారు. ఇదో స‌స్పెన్స్ థ్రిల్లర్ కం ల‌వ్ ఎంట‌ర్‌టైన‌ర్. ఆద్యంతం ఎమోష‌న్స్ ర‌క్తి క‌ట్టిస్తాయి. నిజ ఘ‌ట‌న‌ల ఆధారంగా రూపొందుతున్న ఈ సినిమా ఏప్రిల్ 9న ప్రపంచ‌ వ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతోంది. అయితే, చిత్ర ప్రచారంలో భాగంగా శుక్రవారం టీజర్‌ను విడుదల చేశారు. ఈ టీజర్ చాలా ఆసక్తికరంగా ఉంది. Also Read: ఈ సినిమాలో రామ్ ద్విపాత్రాభినయం చేశారని ఇప్పటికే వార్తలు వచ్చాయి. టీజర్‌లో ఈ రెండు పాత్రలను పరిచయం చేశారు. ‘‘క్రైమ్ హిస్టరీలో ఇలాంటి కేసు చూడ‌డం ఇదే ఫ‌స్ట్ టైమ్’’ అంటూ టీజర్‌ మొదలవుతుంది. ‘‘సిద్ధార్థ్, ఆదిత్య ఇద్దరికీ ఎటువంటి సంబంధం లేదు. డిఫ‌రెంట్ డిఫ‌రెంట్ లైఫ్స్.. డిఫ‌రెంట్ వ‌ర‌ల్డ్స్’’ అంటూ పోలీస్ అధికారిణిగా నటించిన నివేద థామస్ ఇన్వెస్టిగేష‌న్‌లో చెప్పేసింది. అయితే ఆ రెండు పాత్రల్లో ఏది నిజం? ఏది అబ‌ద్ధం? ఇంకేదో స‌స్పెన్స్ ఎలిమెంట్ ఉందా అనే అనుమానాన్ని టీజర్ చివరిలో కలిగించారు. ‘నేనే’ అనే డైలాగ్ క్యూరియాసిటీని క్రియేట్ చేస్తోంది. Also Read: టీజర్‌లో ప్రధానంగా చెప్పుకోవాల్సిన మరో అంశం మణిశర్మ నేపథ్య సంగీతం. కిర్రాక్ అంతే. ‘ఇస్మార్ట్ శంకర్’తో మళ్లీ ఫాంలోకి వచ్చిన మణిశర్మ.. ‘రెడ్’ సినిమాకు అదిరిపోయే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఇచ్చారని టీజర్ చూస్తుంటేనే అర్థమవుతోంది. మరి ఆయన అందించే ఆల్బమ్ ఎలా ఉంటుందో చూడాలి. ప్రస్తుతం మణిశర్మ ఈ సినిమాతో పాటు చిరంజీవి 152వ చిత్రం, వెంకటేష్ ‘నారప్ప’లకు సంగీత సారథ్యం వహిస్తున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2vf8M79
v

బాక్సాఫీస్ దుమ్ముదులిపిన భీష్మ.. ఫస్ట్ వీక్ రూ. 50 కోట్లు

నితిన్, రష్మిక జంటగా నటించిన చిత్రం బాక్సాఫీస్ వద్ద భీష్మ కలెక్షన్ల కుమ్ముడు కొనసాగిస్తోంది. గత శుక్రవారం (ఫిబ్రవరి 21) విడుదలైన ఈ మూవీకి బ్లాక్ బస్టర్ హిట్ టాక్ రావడంతో నితిన్ కెరియర్‌లోను అత్యధిక వసూళ్లను రాబడుతోంది. తొలిరోజు ఆరున్నర కోట్ల షేర్ రాబట్టిన ఈ చిత్రం రెండు రోజుల్లో రూ.10 కోట్లు.. నాలుగు రోజుల్లో రూ. 16.71 కోట్ల షేర్ రాబట్టింది. ఇక తొలివారం ముగిసేనాటికి ఆక్యుపెన్సీ పెంచుకుని వరల్డ్ వైడ్ రూ.50 కోట్లు గ్రాస్ కలెక్షన్లు రాబట్టింది. కాగా భీష్మ చిత్రం బ్రేక్ ఈవెన్ సాధించి లాభాల బాట పట్టింది. ఈ సినిమా రూ. 23 కోట్లకు మార్కెట్ చేయగా.. తొలి ఐదురోజుల్లోనే ఖర్చుపెట్టిన మొత్తం వచ్చేసింది. దీంతో ఫుల్ ఖుషీలో ఉంది. ఇప్పటికే హైదరాబాద్ మూవీ సక్సెస్ మీట్ నిర్వహించగగా.. వైజాగ్‌లో 29న ‘భీష్మ’ విజయోత్సవ వేడుకకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ చిత్రానికి ఇప్పటికే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రశంసలు దక్కడంతో విజయోత్సవ వేడుకకు పవన్ కళ్యాణ్ వస్తారనే ప్రచారం నడుస్తోంది. అయితే నిర్మాణ సంస్థ నుండి పవన్ రాకపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2voroS6
v

నిఖిల్ ‘కార్తికేయ 2’కి ముహూర్తం ఫిక్స్

నిఖిల్ హీరోగా సుమారు ఆరేళ్ల క్రితం అంటే 2014 అక్టోబర్ 24న ‘కార్తికేయ’ అనే సినిమా విడుదలైంది. నిఖిల్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. ఇప్పటికీ ‘కార్తికేయ’ను మించిన సినిమాను నిఖిల్ చేయలేదు. ఈ సినిమాకు సీక్వెల్ ఎప్పుడు అని నిఖిల్‌ను అభిమానులు ఎప్పటి నుంచో అడుగుతున్నారు. ఇటు నిఖిల్‌తో పాటు డైరెక్టర్ చందు మొండేటిని సీక్వెల్ గురించి పదేపదే ప్రశ్నిస్తున్నారు. మొత్తానికి ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కుతోంది. యానిమ‌ల్ హిప్నటిజం అనే కొత్త కాన్సెప్ట్‌ని ‘కార్తికేయ’ చిత్రం ద్వారా డైరెక్టర్ చందు మొండేటి తెలుగు ప్రేక్షకులకు ప‌రిచ‌యం చేశారు. మొత్తానికి మళ్లీ వీరిద్దరి కాంబినేష‌న్‌లో ‘కార్తికేయ 2’ వచ్చేస్తోంది. ఈ చిత్రాన్ని మార్చి 2న తిరుమ‌ల తిరుప‌తిలో పూజా కార్యక్రమాలు నిర్వహించి శ్రీవేంక‌టేశ్వరుని స‌న్నిధానంలో ప్రారంభించనున్నారు. ఈ చిత్రాన్ని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరి, అభిషేక్ అగ‌ర్వాల్ ఆర్ట్స్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. టి.జి.విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ నిర్మాతలు. Also Read: ‘‘అర్జున్ సుర‌వ‌రం’’ లాంటి బ్లాక్‌బ‌స్టర్ త‌రువాత ఏ చిత్రం చేయ‌కుండా కొంత గ్యాప్ తీసుకుని ప్రేక్షకుల‌కి, త‌న అభిమానుల‌కి కిక్ ఇచ్చే చిత్రం చేయాల‌ని నిఖిల్ ‘కార్తికేయ‌ 2’కి శ్రీకారం చుట్టారు. తెలుగు ప్రేక్షకులకు ఊహకు అందని మరో కొత్త కథలో చందు మొండేటి ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారట. ‘కార్తికేయ 2’కు సంబంధించి ఒక్కో సర్‌ప్రైజ్‌ను రివీల్ చేస్తూ 2020 చివరిలో సినిమాను విడుదల చేస్తారట. ఈ సినిమాకు సంబంధించి హీరోయిన్, ఇతర నటీనటులు, సాంకేతిక విభాగం గురించి త్వరలోనే ప్రకటన విడుదల చేయనున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2I2oTYv
v

శ్రద్ధా కపూర్‌ని ప్రేమించాను, కానీ చెప్పలేకపోయాను: ఫీలైపోతున్న హీరో

‘సాహో’ భామ శ్రద్ధా కపూర్‌ని ఇష్టపడిన వారు ఎవరుంటారు చెప్పండి. కుర్రకారుకే కాదు హీరోలు కూడా ఆమెపై మనసు పారేసుకున్నారు. వారిలో బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్ ఒకరు. పాపం ఆయన శ్రద్ధాను ప్రేమించారట. కానీ ఆమెతో ఈ విషయాన్ని చెప్పలేపోయారట. వీరిద్దరూ జంటగా నటించిన సినిమా ‘బాఘి 3’. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా టైగర్ తన మనసులో మాటను బయటపెట్టాడు. ఈ విషయం తెలిసి శ్రద్ధా కూడా షాకయ్యారు. ‘నేను శ్రద్ధా ఒకే స్కూల్లో చదువుకున్నాం. అప్పటినుంచే తనంటే నాకు ఇష్టం. కానీ నాకు ఈ విషయం తనకు చెప్పాలంటే చాలా భయం వేసింది. కేవలం తనని దూరం నుంచి చూస్తూ ఆనందించేవాడిని. తను నా పక్క నుంచి వెళ్తున్నప్పుడు గాలికి తన జుట్టు నన్ను తాకేది. అప్పట్లో నేను అంత ధైర్యవంతుడ్ని కాను. నాకు శ్రద్ధలో నచ్చని విషయాలు అంటూ లేవు. తనతో నచ్చే విషయాలు అడిగితే పెద్ద లిస్టే తయారు అవుతుంది’ అని తెలిపారు. ఈ మాటలన్నీ విన్న శ్రద్ధా.. ‘నేనంటే ఇష్టమని అప్పుడే చెప్పచ్చుగా. ఏదో ఒకటి చేసేదాన్ని’ అంటూ సెటైర్ వేసింది. అయినా ఇప్పుడు శ్రద్ధా.. రోహన్ శ్రేష్ఠ అనే ఫొటోగ్రాఫర్‌తో ప్రేమలో ఉన్నారట. కాబట్టి ఇప్పుడు టైగర్ ప్రపోజ్ చేసినా కూడా శ్రద్ధ ఒప్పుకునే స్థితిలో లేరనే చెప్పాలి. READ ALSO: 2016లో వచ్చిన ‘బాఘి’ సినిమా మంచి విజయం అందుకుంది. మన తెలుగు బ్లాక్ బస్టర్ ‘వర్షం’కు ఈ సినిమా రీమేక్‌గా వచ్చింది. ఆ తర్వాత 2018లో ‘బాఘి 2’ వచ్చింది. ఇందులో టైగర్ ష్రాఫ్, దిశా పటానీ నటించారు. ఈ సినిమాను కూడా మన నుంచే కాపీ కొట్టారు. ఇప్పుడు మూడో సీక్వెల్ రాబోతోంది. దీనికి టైటిల్ ‘బాఘి 3’ అని పెట్టారు. ఇందులో టైగర్‌కు జోడీగా మరోసారి నటించారు. ఇందులో రితేష్ దేశ్‌ముఖ్.. టైగర్ సోదరుడి పాత్రలో నటించారు. రితేష్‌ను కాపాడుకోవడం కోసం టైగర్ ఉగ్రమూకలను ఎలా మట్టుబెట్టాడు అన్న కాన్సెప్ట్‌తో తెరకెక్కించినట్లు తెలుస్తోంది. మార్చి 6న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. READ ALSO:


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/39axcx9
v

‘ఓ పిట్టకథ’ చెప్పడానికి వస్తోన్న మెగాస్టార్

గతంలో మంచి కమర్షియల్ సినిమాలను నిర్మించిన భవ్య క్రియేషన్స్‌ సంస్థ తొలిసారి కొత్త తారలతో, కొత్త దర్శకుడితో నిర్మించిన చిత్రం ‘ఓ పిట్ట కథ’. విశ్వంత్‌ దుద్దుంపూడి, సంజయ్‌రావు, నిత్యా శెట్టి హీరో హీరోయిన్లుగా బ్రహ్మాజీ కీలకపాత్రలో నటించిన ఈ చిత్రం మార్చి 6న విడుదలకు సిద్ధమవుతోంది. చెందు ముద్దు దర్శకత్వంలో వి.ఆనందప్రసాద్‌ ఈ చిత్రాన్ని నిర్మించారు. మార్చి 1న హైదరాబాద్‌లో ఈ చిత్రం ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ని ఘనంగా నిర్వహించనున్నారు. ఈ ఈవెంట్‌లో మెగాస్టార్‌ చిరంజీవి ముఖ్య అతిథిగా పాల్గొబోతున్నారు. ఈ విషయాన్ని నిర్మాత ఆనంద ప్రసాద్ శుక్రవారం మీడియాకు వెల్లడించారు. ‘‘కథను నమ్మి తీసిన సినిమా ఇది. ఇప్పటికే మా ప్రచార చిత్రాలకు మంచి స్పందన లభిస్తోంది. మెగాస్టార్‌ చిరంజీవి ముఖ్య అతిథిగా చాలా గ్రాండ్‌గా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ చేయనున్నాం. చిరంజీవి గారి రాకతో మా సినిమాకి ఓ కొత్త ఊపు రాబోతుంది. ఆయన ఈ ఫంక్షన్‌కి రావడానికి అంగీకరించినందుకు చాలా చాలా థ్యాంక్స్‌’’ అని అన్నారు. మెగాస్టార్ చిరంజీవి ఈ మధ్య చిన్న సినిమాలను బాగా ఎంకరేజ్ చేస్తున్నారు. ఇటీవల నిఖిల్ సినిమా ‘అర్జున్ సురవరం’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా విచ్చేసి ఆ చిత్రంపై అంచనాలను భారీగా పెంచేశారు. నిజానికి చిరంజీవి ప్రమోట్ చేయడం వల్ల నిఖిల్ సినిమాకు మరింత క్రేజ్ వచ్చింది. ఇప్పుడు ‘ఓ పిట్టకథ’ గురించి చెప్పడానికి వస్తున్నారు. సినిమాలో కంటెంట్ గురించి పక్కన బెడితే చిరంజీవి రాకతో ఇప్పుడు ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో అంచనాలు పెరగడం ఖాయం. Also Read: కాగా, ఈ చిత్రంలో బాలరాజు, శ్రీనివాస్‌ భోగిరెడ్డి, భద్రాజీ, రమణ చల్కపల్లి, సిరిశ్రీ, సూర్య ఆకొండి తదితరులు నటించారు. ప్రవీణ్ లక్కరాజు సంగీతం సమకూర్చారు. సునీల్ కుమార్ యన్ సినిమాటోగ్రఫీ అందించారు. డి.వెంకట ప్రభు ఎడిటర్. కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం చెందు ముద్దు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2TlVcGZ
v

నూనిగాడి సినిమా ఫట్ అంటగా... శ్రీరెడ్డి సెటైర్

నేచురల్ స్టార్ నాని నిర్మాతగా వ్యవహరించిన ‘హిట్’ సినిమాపై వివాదాస్పద నటి కామెంట్స్ చేసిందా? ఆమె కామెంట్ చూస్తుంటే నిజమే అనిపిస్తోంది. విశ్వక్ సేన్, రుహాని శర్మ జంటగా నటించిన ‘హిట్’ సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో శ్రీరెడ్డి ఫేస్‌బుక్‌లో కామెంట్స్ చేసింది. ‘హిట్టా ఫట్టా.. నూనిగాడు ఓం బూమ్ ఫట్ అంటగా’ అని సెటైర్ పేల్చింది. అయితే నాని నిర్మించిన హిట్ సినిమాకు శ్రీరెడ్డి పెట్టిన కామెంట్ సింక్ అవుతోంది. అంటే ఆమె నానిపై కామెంట్స్ చేసినట్టేగా అని నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు. శ్రీరెడ్డి మీటూ ఉద్యమం మొదలుపెట్టినప్పుడు నాని పేరును కూడా బయటపెట్టి షాకింగ్ విషయాలు వెల్లడించిన సంగతి తెలిసిందే. నాని కూడా తనను లైంగికంగా వేధించాడని పేర్కొంది. అందుకే ‘బిగ్ బాస్ 2’లో తనకు అవకాశం రానివ్వకుండా చేసాడని ఆరోపించింది. కానీ నాని మాత్రం ఈ వార్తలను ఖండించాడు. అనవసరంగా తనపై బురద జల్లేందుకు ప్రయత్నిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. అంతేకాదు శ్రీరెడ్డిని లీగల్ నోటీసులు కూడా పంపించారు. దీనికి శ్రీరెడ్డి స్పందిస్తూ.. ‘కచ్చితంగా మనం న్యాయ పరంగానే పోరాడదాం’ అని సవాల్ చేసారు. ఇవన్నీ ప్రస్తుతం సర్దుమణిగాయి అనుకుంటే.. శ్రీరెడ్డి మాత్రం అప్పుడప్పుడూ ఇలా ఫేస్‌బుక్‌లో పోస్ట్‌లు పెట్టి మళ్లీ గెలకాలని చూస్తూ ఉంటుంది. ఇకపోతే నాని నిర్మాతగా వ్యవహరించిన ‘హిట్’ సినిమా మిక్స్‌డ్ టాక్ అందుకుంటోంది. READ ALSO: కొందరేమో సినిమాను సస్పెన్స్‌తో చితకొట్టాడని అంటుంటే మరికొందరు మాత్రం నీళ్లు తాగకుండా సినిమాకు వెళ్లేంత ఏమీ లేదక్కడ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఈ సినిమా ఒక సాధారణ క్రైం స్టోరీ అని, కొత్తదనం ఏమీ లేదని అంటున్నారు. కాకపోతే సినిమాను తెరకెక్కించిన శైలేష్ కొలను స్క్రీన్‌ప్లేని చక్కగా వాడుకోవడంలో నూటికి నూరు మార్కులు సంపాదించుకున్నాడని టాక్. ఈ సినిమాలో ఉన్నత పోలీస్ అధికారిగా నటించిన విశ్వక్ సేన్ తన పాత్రకు నూరు శాతం న్యాయం చేసారు. ఒక సైకలాజికల్ డిజార్డర్ ఉన్న పోలీస్ అధికారిగా చక్కని నటన కనబరిచారు. రుహానీ శర్మ పాత్రకు పెద్ద ప్రాధాన్యత లేదట. READ ALSO:


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3abU7rX
v

కరోనా వైరస్‌పై హీరో నిఖిల్ సిల్లీ కామెంట్.. క్లాస్ పీకిన జర్నలిస్ట్

చైనాతో పాటు ఇతర దేశాలను గజగజా వణికిస్తోంది మహమ్మారి కరోనా వైరస్. చైనాలోని వుహాన్ నగరంలో వెలుగుచూసిన కొత్తరకం ప్రాణాంతక కరోనా వైరస్ ఇప్పటికి 50 దేశాలకు వ్యాపించింది. ఓ పక్క యావత్ ప్రపంచం ఎక్కడ ఈ వైరస్ బారిన పడతామోనని భయంతో వణికిపోతుంటే.. యువ నటుడు సిద్ధార్థ్ ఈ వైరస్‌పై సిల్లీ కామెంట్ చేసారు. కరోనా వైరస్ వల్ల స్టాక్ మార్కెట్ దారుణంగా పడిపోయిందని, 2008 ఆర్థిక మాంద్యం తర్వాత మళ్లీ ఇంతగా పడిపోయింది లేదు అని ఓ వ్యక్తి ట్వీట్ చేసారు. ఈ ట్వీట్‌కు నిఖిల్ స్పందిస్తూ.. ‘థ్యాంక్స్ టు కరోనా వైరస్. స్టాక్స్ కొనుక్కోవడానికి ఇదే సరైన సమయం’ అని కామెంట్ చేసాడు. దాంతో ప్రముఖ జర్నలిస్ట్ హేమంత్‌కి ఒళ్లుమండింది. ‘ఇలాంటి సమయంలో నీ కామెంట్ చాలా ఇన్‌సెన్సిటివ్‌గా ఉంది బ్రో. ముఖ్యంగా చుట్టుపక్కల ఉన్న దేశాలు, ప్రజలు వైరస్ వల్ల అల్లాడిపోతున్న సమయంలో ఇలాంటి కామెంట్స్ చేయడం కరెక్ట్ కాదు. అర్థం చేసుకుంటావని అనుకుంటున్నా’ అని నిఖిల్‌కి క్లాస్ పీకాడు. దీనికి నిఖిల్.. ‘మనుషులు ఎంత మంది మనుషులను చంపగలరో, అంతమందిని ఈ వైరస్ కూడా చంపలేదు. ఇంతమందిని మద్యం, సిగరెట్లు కూడా చంపలేవు. ఇలాంటి ఫ్లూ వ్యాధిలు వచ్చిపోతుంటాయ్. మనం దీని నుంచి మనల్ని కాపాడుకోగలుగుతాం. మన వ్యాధి నిరోధక శక్తి ఈ వైరస్‌ను తట్టుకోగలదు’ అంటూ తనని తాను సమర్ధించుకున్నాడు నిఖిల్. READ ALSO: ఈ కరోనా వైరస్ క్రమంగా అన్ని ఖండాలకు వైరస్ విస్తరించడంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ తీవ్ర ఆందోళన చెందుతోంది. కరోనా వైరస్ మహమ్మారిని ఎదుర్కొడానికి చర్యలు చేపట్టాలని పదే పదే డబ్ల్యూహెచ్‌ఓ అన్ని దేశాలకు విజ్ఞప్తి చేస్తోంది. READ ALSO:


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2weFup0
v

భక్తవత్సలం నాయుడు లాండింగ్.. కలెక్షన్ కింగ్ కిర్రాక్ లుక్

దాదాపు రెండేళ్ల గ్యాప్ తర్వాత తమిళ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు కలెక్షన్ కింగ్ మోహన్ బాబు. ప్రముఖ తమిళ నటుడు సూర్య నటిస్తున్న చిత్రం ‘సూరారై పొట్రు’. తెలుగులో ఈ సినిమాను ‘ఆకాశం నీ హద్దురా’ టైటిల్‌తో రిలీజ్ చేస్తున్నారు. ఇందులో మోహన్ బాబు ఎయిర్ వింగ్ కమాండర్‌గా కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇందులో ఆయన పేరు భక్తవత్సలం నాయుడు. మోహన్ బాబు అసలు పేరు కూడా అదే కావడం విశేషం.ఈ సినిమాలోని మోహన్ బాబు లుక్స్ రిలీజ్ అయ్యాయి. ఎయిర్ ఫోర్స్ అధికారి పాత్రలో ఆయన లుక్ అదిరిపోయిందనే చెప్పాలి. సినిమాకు మోహన్ బాబే డబ్బింగ్ చెప్పుకున్నారు. ఎయిర్ డెక్కన్ వ్యవస్థాపకుడు జీఆర్ గోపీనాథ్ జీవితాధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు దర్శకురాలు సుధ కొంగర. ఆస్కార్ అవార్డు గ్రహీత గునీత్ మోంగాతో పాటు సూర్య ఈ సినిమాను నిర్మాతగా వ్యవహరించారు. ప్రముఖ బాలీవుడ్ నటుడు జాకీ ష్రాఫ్ వినోద్ మాల్యా అనే పాత్రలో నటించారు. జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందించారు. ఇటీవల ఈ సినిమాలోని తొలి పాటను చాలా గ్రాండ్‌గా రిలీజ్ చేసారు. దాదాపు వంద మంది అనాథ పిల్లలను సూర్య విమానంలో ఎక్కించారు. ఈ సినిమాలో జేబులో ఆరు వేల రూపాయలు పెట్టుకుని పట్టణం వచ్చిన వ్యక్తి విమాన కంపెనీని ఎలా స్థాపించాడు? ఆ సమయంలో ఆయన ఎదుర్కొన్న సవాళ్లు ఇందులో చూపించనున్నారు. ఏప్రిల్ 9న సినిమా రిలీజ్ కానుంది. READ ALSO:


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/384yMPW
v

తూ..ఇది సినిమానా: తాప్సి మూవీపై విమర్శకుడి నీచమైన కామెంట్స్

ప్రముఖ నటి తాప్సి నటించిన ‘థప్పడ్’ సినిమా నిన్న రిలీజ్ అయింది. ఈ సినిమా చూసినవారంతా బాగుందనే ప్రశంచారు. ప్రముఖ సినీ విశ్లేషకుడు తరణ్ ఆదర్శ్ అయితే సినిమాకు 4 స్టార్ రేటింగ్ ఇచ్చారు. అయితే బాలీవుడ్‌కి చెందిన ప్రముఖ సినీ విమర్శకుడు కమాల్ ఆర్ ఖాన్ తాప్సి సినిమాపై నీచమైన కామెంట్స్ చేసారు. ఈరోజు సినిమా చూసిన కమాల్ ట్విటర్‌లో తన రివ్యూని పోస్ట్ చేసారు. ‘సినిమా చూసిన అరగంటలోపే అసలు ఏం జరుగుతోందో అర్థంకాలేదు. ఇక ఇంటర్వెల్‌కి వచ్చేసరికి సినిమా గురించి నేను ఒక్కటే చెప్పగలను. తూ. నేను సినిమాను వినోదం కోసం చూస్తాను. అంతేకానీ సినిమా చివరి వరకు బోర్ కొట్టి చావడానికి కాదు. ‘థప్పడ్’ సినిమా చూసాక నేను ఒక్కటే చెప్పగలను. ఈ సినిమాతో మగవాళ్లకు, ఆడవాళ్లకు, సమాజానికి ఎలాంటి సంబంధంలేదు. దర్శకుడు అనుభవ్ సిన్హా తన వ్యక్తిగత జీవితాన్ని సినిమాగా మార్చారు. కానీ అనుభవ్ సర్.. మా పబ్లిక్ జీవితం మీలాగా లేదు. మేం రెండు రూపాయల చిల్లరగాళ్లం. మీరు ఉన్నతమైన వ్యక్తి. కాబట్టి మీ జీవితాన్ని మీ వద్దే ఉంచుకోండి’ అని ట్వీట్స్ చేసారు కమాల్. READ ALSO: ఈ సినిమా ప్రమోషన్స్‌ను తాప్సి వెరైటీగా చేసారు. సినిమా ట్రైలర్‌ను రిలీజ్ చేసి ఈ ట్రైలర్‌ను తొలగించేలా చూడాలని ఆడియన్స్‌ని కోరారు. ఇంతకీ ఈ సినిమా కథేంటంటే.. ఇందులో తాప్సి గృహిణి పాత్రలో నటించారు. తన భర్త, ఇల్లే సర్వస్వం అనుకుని బతికే మహిళ. కానీ తన భర్త వర్క్ టెన్షన్‌లో పడి ఆవేశంలో భార్య చెంపపై కొడతాడు. దాంతో ఆమె విడాకులు కావాలని కోర్టు మెట్లు ఎక్కుతుంది. కేవలం ఒకే ఒక్క చెంప దెబ్బ వల్ల విడాకులు తీసుకోవాలని అనుకుంటున్న తాప్సి నిర్ణయానికి న్యాయస్థానం కూడా షాక్ అవుతుంది. ‘కేవలం ఒక్క చెంప దెబ్బకే విడాకులా?’ అని న్యాయవాది తాప్సిని అడిగిన ప్రశ్నకు తాప్సి సమాధానం చెబుతూ.. ‘ఆయన నన్ను తొలిసారి కొట్టారు. కొట్టింది ఒక్కసారే అయినా కొట్టాల్సిన అవసరం లేదు కదా. నాపై నిజంగా అంత ప్రేమ ఉంటే కొట్టాల్సిన అసవరం నిజంగా రాదు కదా’ అని తిరిగి ప్రశ్నించిన తీరు ఆలోచింపజేస్తోంది. READ ALSO:


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/388K45I
v

Thursday 27 February 2020

‘హిట్’ సినిమా రివ్యూ

నేచురల్ స్టార్ నాని నిర్మాతగా మారి వాల్ పోస్టర్ సినిమా అనే బ్యానర్‌ను స్థాపించారు. ‘బాహుబలి’ లాంటి సినిమాకు కాస్ట్యూమ్ డిజైనర్‌గా పనిచేసిన ప్రశాంతి తిపిరినేనితో కలిసి సినిమాలను నిర్మిస్తున్నారు. వీరిద్దరూ మొదటి ప్రయత్నంగా ‘అ!’ సినిమాను నిర్మించి విజయం అందుకున్నారు. ఇప్పుడు ‘హిట్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ‘ఫలక్‌నుమా దాస్’ ఫేమ్ విశ్వక్ సేన్ హీరోగా నటించిన ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. కథ విక్రమ్ (విశ్వక్ సేన్) ఉన్నత పోలీస్ అధికారి. హిట్ (హోమిసైడ్ ఇంటర్వెన్షన్ టీం)ను లీడ్ చేస్తుంటారు. గతంలో తన జీవితంలో జరిగిన ఒక ఘటన వల్ల విక్రమ్ మెంటల్‌గా డిస్టర్బ్ అవుతారు. దీని వల్ల క్రైమ్ ఇన్వెస్టిగేషన్‌లో కొన్ని సంఘటనలు చూసినప్పుడు ఆయన తీవ్ర డిప్రెషన్‌కు లోనవుతూ ఉంటారు. డిపార్ట్‌మెంట్‌ను వదిలేస్తేనే ఈ సమస్య నుంచి కోలుకుంటావని విక్రమ్‌కు డాక్టర్ సలహా ఇస్తారు. ఈ సమయంలో ఒక టీనేజ్ అమ్మాయి కనిపించకుండా పోతుంది. ఈ కేసును పోలీసులు విచారిస్తున్న సమయంలోనే విక్రమ్ ప్రేయసి స్వప్న (రుహానీ శర్మ) కూడా కనిపించదు. అసలు వీళ్లిద్దరూ ఏమయ్యారు? ఈ కేసుని విక్రమ్ ఎలా ఛేదించారు? అనేదే సినిమా. రివ్యూ ‘హిట్’ ఒక సాధారణ క్రైమ్ స్టోరీ. కథలో కొత్తదనం ఏమీ లేదు. కాకపోతే జరిగిన క్రైమ్‌ గురించి ఇన్వెస్టిగేషన్ ఎలా సాగింది అనేది ఈ సినిమాలో కీలకం. కిల్లర్‌ను కనిపెట్టిన విధానం, ఆ కిల్లర్ ఫ్లాష్‌బ్యాక్ ఆసక్తికరం. సింపుల్‌గా చెప్పాలంటే స్క్రీన్‌ప్లే ఈ సినిమాకు ప్రాణం. అలాంటి ప్రాణాన్ని దర్శకుడు శైలేష్ కొలను నిలబెట్టే ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నంలో దర్శకుడు పూర్తిగా విజయం సాధించలేకపోయినా పర్వాలేదనిపించారు. సినిమాలో సస్పెన్స్‌ను చివరి వరకు తీసుకురావడంలో దర్శకుడు సక్సెస్ అయ్యారు. క్లైమాక్స్ వరకు కిల్లర్ ఎవరు అనేది మనం అస్సలు ఊహించలేం. అంత బాగా సస్పెన్స్‌ను క్యారీ చేశారు. ఇన్వెస్టిగేషన్ చివరి వరకు ఆసక్తికరంగా సాగినా సినిమాలో కమర్షియల్ ఎలిమెంట్స్ అస్సలు లేకపోవడం మైనస్. సినిమా ఒక డాక్యుమెంటరీలా సాగుతూ ఉంటుంది. కొన్ని సన్నివేశాలు సాగదీసినట్టు అనిపిస్తాయి. ‘‘వాటర్ ఎక్కవ తాగి రాకండి, మధ్యలో పోలేరు’’ అని హీరో విశ్వక్ సేన్ చెప్పినంత క్యూరియాసిటీ అయితే సినిమా చూసినప్పుడు కలగలేదు. అయితే, మధ్య మధ్యలో కొన్ని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ మనల్ని యాక్టివేట్ చేస్తుంటాయి. ముఖ్యంగా ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ సన్నివేశాలు మంచి థ్రిల్‌ను ఇస్తాయి. సినిమాకు ఎమోషనల్ టచ్ అస్సలు లేదు. చాలా సీరియస్‌గా సాగుతుంది. కేవలం పోలీస్ ఇన్వెస్టిగేషన్, ఇంటరాగేషన్ మాత్రమే చూపించారు. కాబట్టి సస్పెన్స్, థ్రిల్లర్ జోనర్లు ఇష్టపడే ప్రేక్షకులకు మాత్రమే ఈ సినిమా నచ్చుతుంది. కమర్షియల్ ఎలిమెంట్స్‌ను ఆశించే ప్రేక్షకులు ఈ సినిమాను ఎంజాయ్ చేయలేరు. ఎవరెలా చేశారంటే.. నటన విషయానికి వస్తే ఈ సినిమాకు ప్రధాన బలం విశ్వక్ సేన్. చాలా బాగా నటించారు. ఒక సైకలాజికల్ డిజార్డర్ ఉన్న పోలీస్ అధికారిగా చక్కని నటన కనబరిచారు. ఎప్పటిలానే తనలోని రఫ్‌నెస్‌ను కూడా రుచి చూపించారు. ఒక కేసును ఇన్వెస్టిగేట్ చేసే పోలీసు ఆఫీసర్ ప్రవర్తన ఎలా ఉంటుందో కళ్లకుకట్టారు. విశ్వక్ సేన్ నటన ఈ సినిమాకు పెద్ద ప్లస్. ఇక ఫోరెన్సిక్ ఆఫీసర్‌గా నటించిన రుహానీ శర్మ పాత్రకు పెద్దగా ప్రాధాన్యత లేదు. మురళీ శర్మ, భానుచందర్, బ్రహ్మాజీ, హరితేజ తదితరులు తమ పాత్రల పరిధి మేర నటించారు. హరితేజ పాత్ర కాస్త కొత్తగా అనిపిస్తుంది. తెర వెనుక.. టెక్నికల్‌గా ఈ సినిమా చాలా రిచ్‌గా ఉంది. ముఖ్యంగా వివేక్ సాగర్ నేపథ్య సంగీతం గురించి చెప్పుకోవాలి. సస్పెన్స్, థ్రిల్లింగ్ సీన్స్‌లో తన సౌండ్స్‌తో మెప్పించారు. ఇక మణికందన్ సినిమాటోగ్రఫీ మరో హైలైట్. ఔటర్ రింగ్ రోడ్ డ్రోన్ షాట్స్, వర్షంలో ఫారెస్ట్ ఫైట్ వంటి చాలా సన్నివేశాలు నేచురల్‌గా చిత్రీకరించారు. సినిమాలో డైలాగులు కూడా అక్కడక్కడా బాగానే పేలాయి. ఎడిటర్ గ్యారీ సినిమాను చాలా బాగా ఎడిట్ చేశారు. చివరిగా.. పర్వాలేదు.. వాటర్ ఎక్కువగా తాగయినా సినిమాకు వెళ్లొచ్చు


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2PwebgG
v

మహేష్‌ను బాలీవుడ్‌కు లాగాలని చూస్తున్న బడా నిర్మాత.. ఎంతైనా ఇస్తాడట

సూపర్‌స్టార్ తెలుగు సినిమాలతో బిజీగా ఉన్నారు. అయితే ఇక్కడి హీరోలు బాలీవుడ్‌కి వెళ్తే బాగుంటుందని కొందరి అభిప్రాయం. యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ ‘బాహుబలి’తో ప్యాన్ ఇండియా స్టార్ అని ప్రూవ్ చేసేసుకున్నారు. అందుకే ఆయన నటించిన ‘సాహో’ సినిమాను కూడా హిందీలో రిలీజ్ చేసారు. కానీ మహేష్ ప్యాన్ ఇండియా స్టార్ కాదు. కానీ ఆయన గురించి బాలీవుడ్‌లో తెలీని వారు ఎవ్వరూ లేరు. ఎందుకంటే మహేష్.. బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్‌తో కలిసి థంప్స్ అప్ యాడ్ చేస్తుంటారు. ప్రకటనల్లో నటించారు కాబట్టి మహేష్ హిందీ సినిమాల్లో నటిస్తే బాగుంటుందని కోరుకోవడంలో తప్పు లేదు. నీ మహేష్‌కు అసలు ఆ ఇంట్రెస్ట్ లేదు. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, ప్రభాస్, విజయ్ దేవరకొండ బాలీవుడ్‌లో నటించేందుకు రెడీ అయిపోయారు కానీ మహేష్‌కు మాత్రం ఆ ఆలోచన కూడా లేదు. తాను అస్సలు బాలీవుడ్‌లో నటించాలని అనుకోవడం లేదని ఇప్పటికే ఎన్నోసార్లు చెప్పారు. అయితే బాలీవుడ్ బడా నిర్మాతల్లో ఒకరైన సాజిద్ నదియాద్‌వాలా ఎలాగైనా మహేష్‌ను బాలీవుడ్‌లోకి లాగాలని చూస్తున్నారట. ఆయన నిర్మిస్తున్న ఓ మల్టీస్టారర్ సినిమాలో మహేష్‌ను తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నారట. ఇందుకోసం మహేష్‌కు ఎంతైనా ఇస్తామని కూడా చెప్పినట్లు బాలీవుడ్ వర్గాల సమాచారం. READ ALSO: ఈ మల్టీస్టారర్‌లో రణ్వీర్ సింగ్ కూడా నటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఇందులో ఎంత నిజం ఉంది అన్నది తెలీదు కానీ మహేష్ మాత్రం ఎన్ని కోట్లు ఇచ్చినా బాలీవుడ్‌లోకి అడుగుపెట్టడు అన్నది మాత్రం కచ్చితంగా చెప్పగలం. ఎందుకంటే అందరూ అన్ని ఇండస్ట్రీలలో హిట్ అవ్వలేరు. మహేష్ తెలుగులో సూపర్‌స్టార్ అవ్వచ్చు. కానీ ఆయన చరిస్మా బాలీవుడ్‌కు అతకదనే చెప్పాలి. ప్రస్తుతం మహేష్.. మెగాస్టార్ చిరంజీవి, కొరటాల శివ కాంబినేషన్‌లో వస్తున్న ఓ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నారు. దీంతో పాటు పరశురాంతో కలిసి ఓ సినిమా చేయబోతున్నారట. READ ALSO:


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2Tkq1ff
v

సునీల్ కొత్త సినిమా.. బాప్‌రే విలన్ గెటప్‌లో అదిరిపోయాడుగా!

ఈరోజు ప్రముఖ కమెడియన్ పుట్టినరోజు. ఈ సందర్భంగా ‘కలర్ ఫొటో’ సినిమాలో ఆయన లుక్‌ను టీం రిలీజ్ చేసింది. లుక్‌లో సునీల్ విలన్ పాత్రలో నటిస్తున్నారు. జీపులో స్టైల్‌గా కూర్చుని సీరియస్‌గా కనిపిస్తున్న సునీల్ తన లుక్‌తో ఆకట్టుకుంటున్నారు. ఇందులో ఆయన పేరు ఎస్సై రామరాజు. ఈ సినిమాలో కమెడియన్ సుహాస్ కథానాయకుడిగా నటిస్తు్న్నారు. విజేత, పేపర్‌ బాయ్‌, మజిలీ, డియర్‌ కామ్రేడ్‌, ప్రతిరోజూ పండగే సినిమాల్లో తనదైన నటనతో ఆకట్టుకున్న సుహాస్‌ ఈ సినిమాతో హీరోగా పరిచయం కాబోతున్నారు. నటుడు సందీప్ రాజ్ సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు. ఈ సినిమాను హృదయ కాలేయం సినిమాకు దర్శకత్వం వహించిన స్టీవెన్‌ శంకర్‌ అలియాస్‌ సాయి రాజేష్, లౌక్యా ఎంటర్‌టైన్మెంట్స్‌తో కలిసి నిర్మిస్తున్నాడు. చాయ్‌ బిస్కెట్‌ యూట్యూబ్‌చానల్‌ కోసం కలిసి పనిచేసిన సుహాస్, సందీప్‌ల కాంబినేషన్‌లో సినిమా తెరకెక్కుతుండటంతో ఈ మూవీపై ఆసక్తి నెలకొంది. సుహాస్‌కు జోడిగా ఛాందిని చౌదరి నటిస్తున్నారు. ఈ సినిమాకు కీరవాణి తనయుడు కాళ భైరవ సంగీత దర్శకత్వం వహిస్తున్నారు. READ ALSO: ఒకప్పుడు ఇండస్ట్రీలో స్టార్ కమెడియన్‌గా గుర్తింపు తెచ్చుకున్న సునీల్ ఆ తర్వాత ‘అందాల రాముడు’, ‘మర్యాద రామన్న’ సినిమాలతో హీరోగా మారారు. హీరోగానూ మంచి పేరు తెచ్చుకున్నారు కానీ ఆ పొజిషన్‌ను నిలబెట్టుకోలేకపోయారు. హీరో అంటే సిక్స్ ప్యాక్ బాడీ కంపల్సరీ అన్నట్లు.. సునీల్ కూడా రిస్క్ తీసుకుని మరీ కండలు పెంచేసారు. దాంతో అది ఆయన ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపింది. అనారోగ్య సమస్యలు వచ్చాయి. ఈ విషయం పక్కనబెడితే.. ఇప్పుడు సునీల్ విలన్ పాత్రలతో మెప్పించాలని అనుకుంటున్నారు. ఆల్రెడీ ఆయన ‘డిస్కో రాజా’ సినిమాలో విలన్ పాత్రలో నటించారు. ఆయనలో ఈ కోణం కూడా ఉందని ఇప్పటివరకు ఆడియన్స్‌కు తెలీదు. ఇప్పుడు మరోసారి ‘కలర్ ఫొటో’ సినిమాతో తనలోని రౌద్రాన్ని చూపించబోతున్నారు సునీల్. ఆయన ఇలాగే మరిన్ని మంచి పాత్రలతో ప్రేక్షకులను అలరిస్తూనే ఉండాలని కోరుకుంటూ మరోసారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుదాం. READ ALSO:


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2T5RzWD
v

టీఎస్‌ఆర్టీసీ బస్సులో ‘భీష్మ’ పైరసీ.. రియాక్ట్ అయిన కేటీఆర్

వెంకీ కుడుముల, నితిన్ కాంబినేషన్‌లో వచ్చిన ‘భీష్మ’ సినిమా బ్లాక్ బస్టర్ విజయం అందుకుంది. రష్మిక మందన కథనాయికగా నటించారు. వారం రోజుల్లోనే 50 కోట్లు రాబట్టినట్లు తెలుస్తోంది. అయితే సినిమా రిలీజ్ అయిన వారం రోజుల్లోనే పైరసీ కాపీలు వచ్చేసాయి. పైగా ఆ పైరసీ కాపీని టీఎస్‌ఆర్టీసీ బస్సులో ప్లే చేయడం చర్చనీయాంశంగా మారింది. ఈ విషయాన్ని నిఖిల్ అనే నెటిజన్ దర్శకుడు వెంకీ కుడుములకు తెలియజేసాడు. ‘‘తెలంగాణ ఆర్టీసీ బస్సులో భీష్మ పైరసీని ప్లే చేసారు. వెంకీ కుడుముల, నితిన్ వెంటనే వీరిపై యాక్షన్ తీసుకోండి’ అంటూ ఆ బస్సు నెంబర్‌తో సహా ఫొటోలను షేర్ చేసాడు. దీనిపై వెంకీ కుడుముల స్పందిస్తూ.. తెలంగాణ మంత్రి కేటీఆర్‌కు ట్వీట్ చేసారు. ‘నా టీం పైరసీలు అవ్వకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నారు. బస్సుల్లో పైరసీ సినిమాలను ప్లే చేస్తే వెంటనే వారిని ప్రశ్నించండి. వినకపోతే పోలీసులకు ఫిర్యాదు చేయండి. సినిమాలు తీయడానికి మేమెంతో డబ్బు పెట్టి కష్టపడుతుంటాం. మా సినిమా అనే కాదు ఏ సినిమాను కూడా పైరసీ చేయనివ్వకండి. గురించి నాకు తెలిసేలా చేసిన వ్యక్తికి ధన్యవాదాలు. టీఎస్‌ఆర్టీసీ బస్సులో పైరసీ మూవీని ప్లే చేయడం బాధాకరం. కేటీఆర్ సర్ మాకు ఏ సమస్య వచ్చిన ట్యాగ్ చెయ్యాలనిపించే ఒకే ఒక్క ఐడీ మీది’ అని ట్వీట్ చేసారు. READ ALSO: దీనికి కేటీఆర్ స్పందిస్తూ.. ‘నేను ఈ విషయాన్ని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ గారి దృష్టికి తీసుకెళ్తాను. పైరసీని అంతమొందిచే దిశగా అన్ని రకాల చర్యలు తీసుకుంటాను’ అని హామీ ఇచ్చారు. ఈ ట్వీట్ చూడగానే యువ నటుడు నిఖిల్ కూడా తన బాధను చెప్పుకున్నాడు. నిఖిల్ నటించిన ‘అర్జున్ సురవరం’ సినిమా పైరసీ వీడియోను కూడా చాలా బస్సుల్లో ప్లే చేసారు. ఈ విషయం గురించి నిఖిల్ ట్వీట్ చేస్తూ దయచేసి పైరసీ ఆపేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. READ ALSO:


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3c9SiOd
v

Indian 2 Accident: శంకర్‌ను గంటల తరబడి విచారించిన సీబీఐ

కొన్ని రోజుల క్రితం ‘భారతీయుడు 2’ షూటింగ్ సెట్‌లో జరిగిన ఘోర ప్రమాదం నుంచి సినిమా టీం ఇంకా కోలుకోలేకపోతోంది. రాత్రి షూటింగ్‌లో బిజీగా ఉండగా భారీ క్రేన్ మీద పడి ఇద్దరు అసిస్టెంట్ డైరెక్టర్లు, ఓ లైట్‌మెన్ అక్కడికక్కడే చనిపోవడం క్షణాల్లో జరిగిపోయాయి. దర్శకుడు శంకర్, కమల్ హాసన్, కాజల్ అగర్వాల్ వెంట్రుకవాసిలో ఈ ప్రమాదం నుంచి బయటపడ్డారు. అయితే ఈ విషయం సీబీఐ దాకా వెళ్లింది. సీబీఐ అధికారులు శంకర్‌ను చెన్నైలోని వేపేరి ప్రాంతానికి తీసుకెళ్లి రెండు గంటలకు పైగా విచారణ జరిపారట. అయితే శంకర్‌ను ఎలాంటి ప్రశ్నలు సంధించారు అన్న వివరాలు మాత్రం బయటికి రాలేదు. అయితే ‘భారతీయుడు 2’ సెట్స్‌లో జరిగిన ప్రమాదం విషయంలో తప్పంతా లైకా ప్రొడక్షన్స్‌దే అన్నట్లుగా కమల్ మాట్లాడారు. అంతేకాదు సెట్స్‌లో పనిచేస్తున్న ప్రతీ ఒక్కరికి అన్ని విషయాల్లోనూ భద్రత కల్పిస్తేనే మళ్లీ షూటింగ్‌లో పాల్గొంటాం అని లైకా ప్రొడక్షన్స్‌కు లేఖ రాసారు. అప్పటివరకు ఎవ్వరూ షూటింగ్‌లో పాల్గొనరు అని చెప్పారు. దాంతో లైకా ప్రొడక్షన్స్ సీఈఓ నీలకాంత్ నారాయణ్‌పూర్‌ ఆగ్రహం వ్యక్తం చేసారు. దాంతో లైకా ప్రొడక్షన్స్ సీఈఓ నీలకాంత్ నారాయణ్ పూర్ కమల్ మాటలను ఖండించారు. నిందలు తమపై వేయొద్దని అన్నారు. జరిగిన ఘటనలో అందరిదీ తప్పు ఉందని, ముఖ్యంగా సెట్స్‌లో ప్రతీ ఒక్కరి బాధ్యతను కమల్, శంకరే చూసుకునేవారని లేఖ‌లో పేర్కొన్నారు. READ ALSO: ఇంత జరిగాక ఇప్పుడిప్పుడే షూటింగ్ మళ్లీ మొదలుపెట్టే అవకాశం లేదని స్పష్టంగా తెలుస్తోంది. ఈ కేసుపై సీబీఐ విచారణ జరుపుతోంది కాబట్టి అన్ని విషయాలు క్లియర్ అయ్యేవరకు షూటింగ్‌కు అనుమతి ఇచ్చే అవకాశం లేదు. మరోపక్క క్రేన్‌ను సెట్స్‌లో నిలిపిన వ్యక్తిని ఇటీవల పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే అతను ముందస్తు బెయిల్‌కు దరఖాస్తు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. READ ALSO:


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2T4eUrU
v

పెద్ద స్పెసిఫికేషన్ రివీల్: #MegaMonster Samsung Galaxy M31 వచ్చేసింది అలాగే ఇది 64MP క్వాడ్ కెమెరాతో మార్కెట్‌లోకి వచ్చేందుకు సిద్ధంగా ఉంది

గత రెండు వారాలుగా, మనమందరం #MegaMonster Galaxy M31 కోసం ఎదురు చూస్తూ అన్నింటినీ పక్కన పెట్టాం. అలాగే, పరిణీతి చోప్రా, అర్జున్ కపూర్.. ఈ ఫోన్‌లో అద్భుతమైన 64MP క్వాడ్ కెమెరాపై మాకున్న ఆసక్తిని మినికోయ్, జైపూర్‌ల వంటి ఉత్సాహభరితమైన తేలికైన ప్రయాణాలకు ఈ ఫోన్‌ను తీసుకెళ్లడం ద్వారా మరింత పెంచారు. అర్జున్ కూడా ఎంతో ఎంజాయ్ చేశారు! అవును, మీ విహారయాత్రలను అత్యంత అమూల్యంగా మార్చే ఫోన్ కోసం మీరు ఇక ఎదురు చూడక్కర్లేదు! ఈ అద్భుతమైన స్మార్ట్‌ఫోన్‌ను శాంసంగ్ ఈరోజు లాంచ్ చేసింది. 2020 మార్చి 5వ తేదీ నుంచి అమెజాన్, శాంసంగ్ ఆన్‌లైన్ స్టోర్, అన్ని ప్రముఖ రిటైల్ స్టోర్లలో ఈ ఫోన్ అమ్మకానికి అందుబాటులో ఉండనుంది. అప్పటి వరకు సమయాన్ని గడపడానికి, మీరు ఈ ఫోన్ యొక్క అద్భుతమైన ఫీచర్లను తెలుసుకోండి. దీంతో పాటు ఈ #MegaMonsterను ఉపయోగించి మీరు చేయగలిగే పనులను ప్లాన్ చేసుకోవచ్చు. అసాధారణమైన 64MP క్వాడ్ కెమెరా సెటప్‌తో #MegaSnaps విహారయాత్రకు వెళుతున్నా లేదా మీకు ఎంతో ఇష్టమైన ఫోటోగ్రఫీ చేసేటప్పుడు ఈ Samsung Galaxy M31 మీకు ఎంతగానో సాయపడుతుంది. మీ వ్యక్తిగత, ఉద్వేగభరితమైన, కొన్నిసార్లు హాస్యభరితమైన ప్రపంచాన్ని ఈ విప్లవాత్మకమైన కెమెరా ద్వారా బంధించడంలో ఈ స్మార్ట్‌ఫోన్ మీకు సాయపడుతుంది. ఇందులో ఉన్నవి ఇవే: f/1.8 అపెర్చర్‌తో కూడిన భారీ 64MP ప్రధాన కెమెరా, క్లారిటీ, డిటైల్ కోసం 1/1.72” 0.8µm, అత్యద్భుతమైన 123-డిగ్రీల ఫీల్డ్-ఆఫ్-వ్యూను అందించే 8MP అల్ట్రావైడ్ సెన్సార్ అదిరిపోయే పోర్ట్రెయిట్ ఫోటోల అద్భుతమైన 5MP డెప్త్ సెన్సార్ చిన్న వస్తువులను కూడా 4 సెంటీమీటర్ల దగ్గరగా, అందంగా చూపించే 5MP మాక్రో సెన్సార్ అత్యద్భుతమైన ఇన్ఫినిటీ-యూ డిస్‌ప్లేతో పాటు.. ఈ #MegaMonster ఫోన్‌లో ముందువైపు 32MP సెల్ఫీ కెమెరా కూడా ఉంది. మీరు మీ సోషల్ మీడియా కోసం స్లో-మో, హైపర్‌లాప్స్, అద్భుతమైన 4K నాణ్యతతో వీడియోలను షూట్ చేయవచ్చు. ఈ గొప్ప ఫోన్ యొక్క #MegaLaunch లో కూడా లాంచ్ ఫిల్మ్‌ను అందించారు. ఇది మీకు ఈ పవర్‌ఫుల్ ఫోన్ ఎలా ఉండనుందో తెలియజేస్తుంది. శక్తివంతమైన 6000mAh బ్యాటరీతో #MegaVacay అద్భుతమైన చిత్రాలను తీసే స్మార్ట్‌ఫోన్ మన దగ్గర ఉన్నప్పటికీ.. ఇది ఎక్కువసేపు పనిచేయకపోతే ఎంత నిరాశగా ఉంటుందో ఒకసారి ఆలోచించండి! Samsung Galaxy M31 అయితే ఈ కోవలోకి రాదు. దీని అద్భుతమైన 6000mAh బ్యాటరీ మెయిన్ స్ట్రీమ్ స్మార్ట్‌ఫోన్‌ల్లో లభించే అతిపెద్ద బ్యాటరీ అని చెప్పవచ్చు. ఇందులో 15W ఫాస్ట్ చార్జింగ్ సామర్థ్యం ఉంది. దీనికోసం యూఎస్‌బీ టైప్-సీ పోర్ట్‌ను అందించారు. దీని భారీ బ్యాటరీ ద్వారా మీరు 21 గంటల పాటు ఇంటర్నెట్‌ను ఉపయోగించవచ్చని, 48 గంటల పాటు ఎల్‌టీఈ ద్వారా వాయిస్ కాల్ చేయవచ్చని, 26 గంటల వరకు వీడియోలను ప్లే చేయవచ్చని, 119 గంటల వరకు సంగీతాన్ని ప్లే చేయవచ్చని శాంసంగ్ పేర్కొంది! సున్నితమైన డిజైన్, FHD+ sAMOLED ఇన్ఫినిటీ-U డిస్‌ప్లే కల #MegaStyle Samsung Galaxy M31 లో భారీ 16.21 సెంటీమీటర్ల (6.4 అంగుళాల) FHD+ sAMOLED ఇన్ఫినిటీ-U డిస్‌ప్లే, సన్నని బెజెల్, మృదువైన అంచులను కలిగి ఉంది. వీటి సాయంతో దీన్ని సులభంగా పట్టుకోవచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్ మందం కేవలం 8.9 మిమీ గానే ఉంది. అలాగే బరువు కూడా అతి తక్కువగా 191 గ్రాములు మాత్రమే ఉంది. సొగసైన డిజైన్ కూడా దీని సొంతం. స్క్రీన్ రక్షణ కోసం కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3ను ఇందులో అందించారు. యువతే లక్ష్యంగా తయారైన ఈ గాడ్జెట్ అత్యంత అందమైన ఓషన్ బ్లూ, స్పేస్ బ్లాక్ రంగులలో వస్తుంది. ఇందులో ఉన్న ఫుల్ స్క్రీన్ మోడ్‌తో ద్వారా మీరు నెట్‌ఫ్లిక్స్ లేదా అమెజాన్ ప్రైమ్ లేదా ఎంఎక్స్ ప్లేయర్‌లో మీకు ఇష్టమైన కంటెంట్‌ను చూసేటప్పుడు అద్భుతమైన అనుభవాన్ని పొందుతారు. ఈ #MegaMonster లోని కాంట్రాస్ట్ రేషియో భారీ 100000: 1గా ఉంది. అంటే మిమ్మల్ని కచ్చితంగా సంతృప్తి పరిచేలా దీని ప్రదర్శన ఉంటుంది. మీ స్మార్ట్‌ఫోన్‌ వినియోగ అనుభవాన్ని ఇది మరింత పెంచుతుంది. ఎక్సినోస్ 9611 ప్రాసెసర్‌తో #MegaPerformance ఇక ఈ ఫోన్ లోపలి భాగాల విషయానికి వస్తే, శాంసంగ్ ఒక ప్రత్యేక కారణంతోనే దీన్ని #MegaMonster అని పిలిచింది. డిస్‌ప్లే కింద Galaxy M31 శక్తివంతమైన ఎక్సినోస్ 9611 ప్రాసెసర్‌తో వినియోగదారుల చేతికి రానుంది, దీని క్లాక్ స్పీడ్ 2.3 గిగాహెర్ట్జ్‌గా ఉండనుంది. ఈ ఆక్టా-కోర్ ప్రాసెసర్ 10 నానోమీటర్ ఆర్కిటెక్చర్‌పై ఆధారపడి ఉంటుంది. అంతేకాకుండా మీ గేమింగ్ అనుభవాన్ని మెరుగుపరచడానికి ఈ Samsung Galaxy M31 ప్రత్యేకమైన మాలి జీ72 ఎంపీ3 జీపీయూతో వస్తుంది. ఇది 6 జీబీ + 64 జీబీ, 6 జీబీ + 128 జీబీ రెండు ర్యామ్ + స్టోరేజ్ వేరియంట్లలో లభిస్తుంది. ఇది సరిపోకపోతే మీరు ఇందులో అందించిన ఎక్స్‌పాండబుల్ మెమొరీ కార్డ్ స్లాట్ ద్వారా 512 జీబీ వరకు విస్తరించదగిన మెమరీని పెంచుకోవచ్చు. ఈ #MegaMonster స్మార్ట్‌ఫోన్‌ను బాక్స్‌లో నుంచి బయటకు తీయగానే మీరు ఆండ్రాయిడ్ 10 ఆధారిత వన్ యూఐ 2.0 ఆపరేటింగ్ సిస్టంను ఎక్స్‌పీరియన్స్ చేయవచ్చు. ఇప్పుడు ఆ స్మార్ట్‌ఫోన్ అధికారికంగా లాంచ్ అయింది. ఇప్పుడు మనమంతా ఈ #MegaMonster అన్ని ఫీచర్లను చూడవచ్చు. అయితే మీరు దీన్ని ఇంటికి తీసుకెళ్లాలనుకుంటే మాత్రం మీరు కొంచెం ఎక్కువ కాలం వేచి ఉండాలి. ఈ స్మార్ట్‌ఫోన్ మార్చి 5వ తేదీ నుంచి అందుబాటులో ఉండనుంది. 6 జీబీ + 64 జీబీ మెమరీ వేరియంట్‌ ధర రూ.15999గా ఉంది. 6 జీబీ + 128 జీబీ మెమరీ వేరియంట్‌ ధర రూ.16999గా ఉంది. దీంతో పాటు , , ఎంపిక చేసిన రిటైల్ స్టోర్లలో రూ.1000 విలువైన వివిధ లాంచ్ ఆఫర్లు లభిస్తాయి. దీంతో Galaxy M31 స్మార్ట్ ఫోన్ 6 జీబీ + 64 జీబీ మెమరీ వేరియంట్ ధర రూ.14,999గానూ, 6 జీబీ + 128 జీబీ ధర రూ.15999 గానూ ఉండనుంది. పరిణీతి, అర్జున్ గమ్యస్థానాలను సరిగ్గా ఊహించినందుకు ఫోన్ గెలుచుకున్న 10 మంది అదృష్ట విజేతలలో మీరు కూడా ఒకరు అయితే, మీ స్మార్ట్‌ఫోన్‌ను మీ #MegaMonster బాటలో తీసుకెళ్లడం మర్చిపోవద్దు! డిస్‌క్లెయిమర్: ఈ కథనాన్ని శాంసంగ్ తరపున టైమ్స్ ఇంటర్నెట్ స్పాట్‌లైట్ బృందం ప్రచురించింది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/32zrwu5
v

రాహు

థ్రిల్‌కి స్కోప్ ఉన్న కథతో కొత్త డైరెక్టర్ ఎంచుకున్న పాయింట్ చాలా కొత్తగా ఉంది. ట్రైలర్‌తోనే కంటెంట్ ఓరియెంటెడ్ సినిమా అనే భావన కలిగించిన దర్శకుడు మెయిన్ ప్లాట్ వరకు కథను బాగా రాసుకున్నాడు. అయితే దాన్ని తెరపైకి తీసుకువచ్చే క్రమంలో మాత్రం కాస్త తడబడ్డాడు.

from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/32z18At
v

మళ్లీ ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్న శ్రుతి హాసన్.. షాక్‌కు గురిచేస్తున్న ఫొటోలు

స్టార్ నటి ఒకప్పుడు ముక్కుకు ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఆమె మళ్లీ సర్జరీ చేయించుకున్నారట. ఇదవరకు ఆమెకు ఉన్న ముక్కుతో పోలిస్తే ఇప్పుడు కాస్త సన్నబడినట్లుగా కనిపిస్తోంది. అన్నింటి కంటే షాకింగ్ విషయం ఏంటంటే.. శ్రుతి చాలా సన్నబడిపోయారు. దాంతో శ్రుతికి ఏమైంది అంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. దాంతో ఈ సారి ధైర్యంగా తాను ఎందుకు సర్జరీ చేయించుకోవాల్సి వచ్చిందో ఇన్‌స్టాగ్రామ్ ద్వారా వెల్లడించారు. "నేను ఇటీవల ఇన్‌స్టా్గ్రామ్‌లో పోస్ట్ చేసాను. కానీ చాలా సన్నగా ఉంది అంటూ చాలా మంది కామెంట్స్ చేసారు. ఇకపై ఈ కామెంట్స్‌ సహించబోం. నేను ఇప్పుడు పోస్ట్ చేసిన ఫొటోలు మూడు రోజుల గ్యాప్ మధ్యలో తీసినవి. నేను చెప్పబోయే విషయం గురించి ఇతర ఆడవాళ్లు కూడా ఫీలవుతారని అనుకుంటున్నారు. నాకు మెంటల్‌గా ఫిజికల్‌గా హార్మోనల్ సమస్యలు ఉన్నాయి. ఎన్నో ఏళ్ల పాటు నా హార్మోన్స్‌ని బ్యాలెన్స్ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాను. అది అంత సులువు కాదు. బాధ భరించడం అంత సులువు కాదు, శారీరకంగా జరిగే మార్పులను తట్టుకోవడం అంత తేలిక కాదు" READ ALSO: "ఇతరులను వేలెత్తి చూపే హక్కు ఎవ్వరికీ లేదు. అవును నేను ప్లాస్టిక సర్జరీ చేయించుకున్నాను. ఈ విషయం చెప్పుకోవడానికి ఏమాత్రం సిగ్గుపడటంలేదు. నేను ప్లాస్టిక్ సర్జరీలను సపోర్ట్ చేయడంలేదు. అలాగని వాటికి వ్యతిరేకిని అని కూడా చెప్పను. మనం ఎలా బతకాలని అనుకుంటున్నాం అన్నదే ముఖ్యం. మన శరీరాల్లో, ఆలోచనల్లో వచ్చే మార్పులను స్వీకరించగలిగినప్పుడే మనకు మనం సాయం చేసుకున్నవాళ్లం అవుతాం. ప్రేమను పంచండి. రోజూ నన్ను నేను కాస్త ఎక్కువ ప్రేమించుకోవడమే నా జీవితంలో గొప్ప ప్రేమ కథ. మీ జీవితం కూడా అంతేనని ఆశిస్తున్నాను’’ అని తెలిపారు. శ్రుతి హాసన్ ‘లక్’ అనే బాలీవుడ్ సినిమాతో ఎంట్రీ ఇచ్చారు. ఈ సినిమా చూసినవారికి ఆమె సర్జరీకి ముందు ఎలా కనిపించేవారు క్లియర్‌గా తెలుస్తుంది. సర్జరీ తర్వాత శ్రుతి ముఖంలో చోటుచేసుకున్న మార్పులు నిజంగా ఆశ్చర్యాన్ని కలిగించాయి. ఎందుకంటే అందరికీ ప్లాస్టిక్ సర్జరీలు సెట్ అవ్వవు. కొందరికి బెడిసికొట్టి ఉన్న అందం పోగొట్టుకున్న సెలబ్రిటీలు కూడా ఉన్నారు. శ్రుతి ముక్కుకు మాత్రమే కాదు పెదాలకు కూడా బొటాక్స్ చేయించుకుంది. దాంతో అవి లావుగా అందంగా కనిపిస్తున్నాయి. READ ALSO:


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2I3dF64
v

‘హిట్’ ట్విట్టర్ రివ్యూ: సస్పెన్స్‌తో చంపేశారు.. సూపర్‘హిట్’

చాలా రోజుల తరవాత ఒక చిన్న సినిమాకి మంచి బజ్ క్రియేట్ అయ్యింది. దీనికి ప్రధాన కారణం నేచురల్ స్టార్ నాని. ఆయన సొంత బ్యానర్ వాల్ పోస్టర్ సినిమా నిర్మాణంలో వస్తోన్న చిత్రం కావడంతో ‘హిట్’ సినిమాకు మంచి పాపులారిటీ వచ్చింది. దీనికి తోడు ప్రచార కార్యక్రమాలను కూడా బాగా నిర్వహించడం ప్లస్ అయ్యింది. రాజమౌళి, అనుష్క, రానా వంటి వాళ్లతో ప్రమోట్ చేయించి సినిమాకు మంచి హైప్ తీసుకొచ్చారు నాని. మరోవైపు, ‘ఫలక్‌నుమా దాస్’ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న విశ్వక్ సేన్.. ఈ చిత్రంలో హీరోగా నటించడం కూడా ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచింది. శైలేష్ కొలను దర్శకత్వం వహించిన ‘హిట్’ మూవీ భారీ అంచనాల నడుమ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే యూఎస్‌లో ప్రీమియర్ షోలు ప్రారంభమైపోయాయి. అక్కడ సినిమా చూసినవాళ్లు ట్విట్టర్ ద్వారా తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. ప్రస్తుతానికి అయితే సినిమాకు పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. ఫస్టాఫ్ చాలా బాగుందని అంటున్నారు. గ్రిప్పింగ్ స్క్రీన్‌ప్లేతో దర్శకుడు కట్టిపడేశారట. చాలా బాగా ఎంగేజ్ చేశారని చెబుతున్నారు. క్లైమాక్స్ వరకు సస్పెన్స్ మెయింటైన్ చేశారట. విశ్వక్‌సేన్ చాలా బాగా నటించాడని అంటున్నారు. ఒక క్రైమ్ థ్రిల్లర్‌కు కావాల్సిన అన్ని ఎలిమెంట్స్ ఈ సినిమాలో ఉన్నాయని కొంత మంది ట్వీట్లు చేస్తున్నారు. ప్రేక్షకుల్ని ఆశ్చర్యానికి గురిచేసే సన్నివేశాలు చాలానే ఉన్నాయట. ఇంటర్వెల్‌లో వచ్చే ఓల్డ్ సిటీ ఛేజ్ సీన్ అయితే చాలా బాగుందని కొంత మంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మొత్తంగా సినిమా చాలా ఎంగేజింగ్‌గా ఉందని ట్వీట్లు చేస్తున్నారు. అయితే, థ్రిల్లర్ జోనర్ సినిమాలు చూసే ప్రేక్షకులకు అంత థ్రిల్ ఏమీ ఇవ్వలేకపోయారని అనే వాళ్లు కూడా ఉన్నారు. ఫస్టాఫ్‌ను చిన్న చిన్న సర్‌ప్రైజ్‌లతో నడిపించారని.. సెకండాఫ్‌ సినిమాను నిలబెట్టిందని చెబుతున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3cfzrRJ
v

నా బ్యానర్‌లో స్టార్ డైరెక్టర్లు పని చేయరు.. నేనూ నటించను: నాని

నేచుర‌ల్ స్టార్ నాని స‌మ‌ర్పణ‌లో వాల్ పోస్టర్ సినిమా బ్యాన‌ర్‌పై ‘ఫ‌ల‌క్‌నుమాదాస్’ ఫేమ్ విశ్వక్ సేన్ హీరోగా రూపొందిన చిత్రం ‘హిట్‌’. ‘ది ఫ‌స్ట్ కేస్‌’ అనేది ట్యాగ్ లైన్‌. శైలేష్ కొల‌ను ద‌ర్శకుడిగా పరిచయమవుతున్నారు. ప్రశాంతి ఈ చిత్రాన్ని నిర్మాత. రుహానీ శ‌ర్మ హీరోయిన్‌గా న‌టించారు. విశ్వక్ సేన్ ఈ చిత్రంలో విక్రమ్ రుద్రరాజు అనే ఐపీఎస్ ఆఫీస‌ర్‌గా క‌నిపించనున్నారు. ఫిబ్రవ‌రి 28న ఈ సినిమా విడుద‌ల‌వుతుంది. ఈ నేపథ్యంలో గురువారం చిత్ర యూనిట్ పాత్రికేయుల సమావేశం ఏర్పాటుచేసింది. నిర్మాత నాని మాట్లాడుతూ.. ‘‘రేపు సినిమా విడుదలవుతుంది. చాలా హ్యాపీగా, కాన్ఫిడెంట్‌గా ఉన్నాం. ప్రేక్షకుల రెస్పాన్స్ కోసం ఆతృత‌గా ఎదురుచూస్తున్నాం. అంద‌రికీ న‌చ్చే సినిమా అవుతుంది. గ‌త రెండు మూడేళ్లుగా తెలుగులో కొత్త కంటెంట్ సినిమాలు అన్నీ స‌క్సెస్ అవుతున్నాయి. స‌పోర్ట్ చేస్తున్న అంద‌రికీ థాంక్స్‌. అన్ని చోట్ల నుండి పాజిటివ్ బ‌జ్ వ‌స్తుంది. ప్రామిస్‌గా చెబుతున్నాను సినిమా న‌చ్చి.. మ‌ళ్లీ మీ స్నేహితుల‌తోనో, ఫ్యామిలీ మెంబ‌ర్స్‌తోనో వెళ‌తారనే న‌మ్మకం ఉంది. సినిమాను చూసిన వారు సినిమా గురించి ఎక్కువగా రివీల్ చేయకుండా చూడాలని నిర్మాతగా చెబుతున్నాను. శైలేష్ క‌థ న‌చ్చడంతో ఈ సినిమాకు నిర్మాత‌గా మారాను. అంద‌రం క‌లిసి విశ్వక్ అయితే ఈ సినిమాకు న్యాయం చేస్తాడ‌ని భావించాం. హిట్ అంటే హోమిసైడ్ ఇంట‌ర్వెన్షన్ టీమ్ అని అర్థం. అంటే ఓ ప్రమాదం జ‌రుగబోతుంద‌ని ముందే ఊహించి దాన్ని జ‌ర‌గకుండా చూసే టీమ్. Also Read: ఈ సినిమా స్నీక్ పీక్‌ను చాలా మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. మా బ్యాన‌ర్‌లో కంటెంట్‌కు ప్రాధాన్యత ఉన్న సినిమాల‌నే నిర్మిస్తాం. కొత్త కాన్సెప్ట్‌, టాలెంట్‌ను ఎంక‌రేజ్ చేయ‌డానికే ఈ బ్యాన‌ర్‌ను పెట్టాను. ఇందులో స్టార్ డైరెక్టర్స్ సినిమాలు చేయ‌రు. అలాగే నేను కూడా నా బ్యాన‌ర్‌లో న‌టించ‌ను. నాకు క‌థ న‌చ్చి నేను చేయ‌లేని సినిమాల‌ను నా బ్యాన‌ర్‌లో నిర్మిస్తాను. ఇది వ‌ర‌కు మా బ్యాన‌ర్‌లో కొత్తగా చేసిన ‘అ!’ సినిమాకు నేష‌న‌ల్ అవార్డు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. ఈసారి మ‌రో కొత్త జోన‌ర్‌తో మీ ముందుకు వ‌స్తున్నాం. Also Read: నేను ఇప్పటి వ‌ర‌కు ఏడు సార్లు సినిమా చూశాను. ఒక్కసారి కూడా బోర్ కొట్టలేదు. ఫిబ్రవ‌రి 28.. ఈ సినిమాకు ఫ‌ర్ట్‌ఫెక్ట్ రిలీజ్ అనిపించింది. రేపు రాజ‌మౌళి గారు కూడా సినిమాను చూడ‌బోతున్నారు. నిర్మాత ప్రశాంతి గారు మా ఫ్యామిలీ మెంబ‌ర్‌. చాలా టాలెంటెడ్. ఆమె లాంటి వ్యక్తులు.. మంచి టీమ్ ఉండ‌బ‌ట్టే నేను సినిమాల్లో న‌టిస్తూ సినిమాల‌ను నిర్మించ‌గ‌లిగాను’’ అని అన్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3acBzHY
v

యాడ్స్‌లోకి వచ్చేసిన హీరో సుశాంత్: డౌట్స్ తుడిచెయ్.. అది తెరిచెయ్!

అక్కినేని కాంపౌండ్ నుంచి వచ్చిన హీరోల్లో సుశాంత్ ఒకరు. ‘కాళిదాసు’ సినిమాతో హీరోగా పరిచయమైన సుశాంత్.. ‘కరెంట్’ సినిమాతో గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే, ఆ తరవాత వరుస డిజాస్టర్లతో డీలా పడ్డారు. 2018లో వచ్చిన ‘చి.ల.సౌ’ సినిమాతో మళ్లీ హిట్ అందుకున్నారు. ఈ ఏడాది ‘అల వైకుంఠపురములో’ ఒక పాత్ర చేశారు. ఈ సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ప్రస్తుతం ‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’ సినిమాలో నటిస్తున్నారు. ఇదిలా ఉంటే, సుశాంత్ ఇప్పుడు వాణిజ్య ప్రకటనల్లోకి కూడా వచ్చేశారు. శీతల పానీయం ‘స్ర్పైట్’తో వాణిజ్య ప్రకటనల (కమర్షియల్ యాడ్స్) ప్రపంచంలోకి అడుగుపెట్టారు. సుశాంత్ ఇప్పుడు ‘స్ర్పైట్’కు బ్రాండ్ అంబాసడర్. ఆ బ్రాండ్‌కు ఆయన చేసిన మొదటి కమర్షియ యాడ్ విడుదలైంది. ఇదివరకటి యాడ్స్ తరహాలోనే ఉత్తేజభరితంగా ఉన్న ఈ టీవీ కమర్షియల్‌లో సుశాంత్ ఉబర్ కూల్ లుక్స్‌లో కనిపిస్తున్నారు. ‘స్ర్పైట్’కు తమిళంలో అనిరుధ్ రవిచందర్, హిందీలో ఆయుష్మాన్ ఖురానా బ్రాండ్ అంబాసడర్లుగా వ్యవహరిస్తున్నారు. Also Read: కాగా, ‘స్ర్పైట్’కు ఇప్పటి వరకు తెలుగులో నాని బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్నారు. అంతకు ముందు నవీన్ పొలిశెట్టి, ప్రియదర్శి సంయుక్తంగా చేశారు. ఇప్పుడు సుశాంత్‌ను బ్రాండ్ అంబాసిడర్‌గా తీసుకున్నారు. ఈ సమ్మర్‌కు తన యాడ్స్‌తో తెలుగు ప్రజలను ‘స్ర్పైట్’ వైపు తిప్పే బాధ్యతలు సుశాంత్ భుజంపై వేశారు. అందుకే ‘‘డౌట్స్ తుడిచెయ్.. స్ర్పైట్ తెరిచెయ్’’ అంటున్నారు సుశాంత్.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2I32day
v

దాన్ని చంపి కాల్చేద్దామంటూ మాజీ భార్యపై హీరో కుట్ర.. మెసేజ్‌లు చదివి షాకైన జడ్జ్

ప్రముఖ హాలీవుడ్ నటుడు .. తన మాజీ భార్యను చంపేందుకు వేసిన ప్లా్న్ చూసి షాకయ్యాడు న్యాయమూర్తి. జానీ, ఆంబర్‌ల మధ్య జరుగుతున్న వివాదం హాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఆంబర్‌ను చంపడానికి స్నేహితుడితో కలిసి జానీ వేసిన ప్లాన్, దానికి సంబంధించిన మెసేజ్‌లు లీకయ్యాయి. దాంతో ఈరోజు ట్రయల్ ఉండడంతో జానీ కోర్టుకు వెళ్లారు. కోర్టులో జడ్జ్ ఈ మెసేజ్‌లన్నీ చదివి వినిపించారు. అలా ఇప్పటివరకు 70వేల మెసేజ్‌లు చదివారు. వాటిలో జానీ ఏమని పేర్కొన్నారంటే.. ‘ఆంబర్‌ను తగలబెట్టేద్దాం. ముందు నీళ్లలో ముంచి చంపుదాం. ఆ తర్వాత శవాన్ని కాల్చేద్దాం’ అని జానీ తన స్నేహితుడైన నటుడు పాల్ బెట్టనీకి 2013లో మెసేజ్‌ పంపారు. ఆ తర్వాత 2014లో ‘నేను తాగడం పూర్తిగా మానేస్తా డార్లింగ్. నేను ఆంబర్‌తో కలిసి లాస్ ఏంజెల్స్‌కి వెళ్లాల్సి ఉంది. అందుకే రాత్రి తాగాను. తను అసహ్యకరమైన భార్య. నాకు తిండి లేదు. పౌడర్లు, విస్కీ మాత్రమే ఉన్నాయి’ అని మరో మెసేజ్ పంపారు. ఈ మెసేజ్‌లన్నీ చదివి జడ్జ్‌ కూడా షాకయ్యారు. అయితే ఈ మెసేజ్‌లన్నీ తానే చేసినట్లు జానీ ఒప్పుకున్నారు. కానీ ఎక్కడా ఆంబర్‌పై చేయిచేసుకున్నట్లు ఏ ఆధారాలు లేవని, ఇవన్నీ ఆంబర్ తనను టార్చర్ పెట్టడం వల్ల జానీ పంపిన మెసేజ్‌లని జానీ తరఫు న్యాయవాది తెలిపారు. READ ALSO: గతంలో ఆంబర్ జానీపై చేసిన దాడులకు సంబంధించిన ఆడియో ఒకటి లీకైంది. తన భర్తను టార్చర్ పెట్టానని ఆ ఆడియోలో ఒప్పేసుకున్నారు. కుండలు, ఇంట్లోని వంట సామాన్లతో తన భర్తపై దాడి చేశానని వెల్లడించారు. దాంతో జానీ డెప్ 50 మిలియన్ డాలర్లు తనకు ఇవ్వాలంటూ ఆంబర్‌పై పరువు నష్టం దావా వేశారు. అంతేకాదు ఒకప్పుడు ఆంబర్ డెప్‌పై తప్పుడు ఆరోపణలు చేయడంతో ఆయన నటించాల్సిన ‘పైరేట్స్ ఆఫ్ ది కరీబియన్’ సిరీస్ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. ఆయనపై ఆంబర్ ఆరోపణలే చేయడంతో డిస్నీ సంస్థ ఆయనకు ఫేమస్ జాక్ స్పారో పాత్రను ఇవ్వలేదు. READ ALSO:


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/32DD0Nm
v

సీక్వెల్‌కు ప్లాన్ వేసిన మాజీ ప్రియుడు.. రష్మిక ఒప్పుకుంటుందా?

రష్మిక మందన.. కన్నడ నటుడు రక్షిత్ శెట్టి ఒకప్పుడు ప్రేమించుకున్న సంగతి తెలిసిందే. వీరిద్దరూ జంటగా ‘కిరిక్ పార్టీ’ అనే సినిమాలో నటించారు. ఈ సినిమా బ్లాక్ బస్టర్. సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడే రష్మిక, రక్షిత్ ప్రేమించుకున్నారు. ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఇంట్లోవారితో మాట్లాడి పెళ్లికి కూడా ఒప్పించారు. నిశ్చితార్థం కూడా గ్రాండ్‌గా జరిగిపోయింది. నిశ్చితార్థం అయిన కొద్దిరోజులకే తామిద్దరం విడిపోయామని సోషల్ మీడియా ద్వారా వెల్లడించి అందరికీ షాక్ ఇచ్చారు. ఇక తనకు సినిమా ఆఫర్లు రావనుకుని పెళ్లి చేసుకోవాలనుకున్నారట రష్మిక. కానీ ‘ఛలో’లో అవకాశం రావడంతో పెళ్లి వాయిదా వేసుకోవాలని అనుకున్నారట. అయితే పెళ్లి తర్వాత సినిమాలు వద్దని రక్షిత్ ఇంట్లోవారు చెప్పినట్లు టాక్. అందుకే రష్మిక పెళ్లి క్యాన్సిల్ చేసుకున్నారని తెలుస్తోంది. ఈ సంగతి అటుంచితే.. ఇప్పుడు మరోసారి రష్మిక, రక్షిత్ కలిసి సినిమాలో నటించబోతున్నారట. ‘కిరాక్ పార్టీ’కి సీక్వెల్ తీయాలని రక్షిత్ శెట్టి అనుకుంటున్నారట. రక్షితే దర్శకుడు, నిర్మాత. వీరితో పాటు సంయుక్తా హెగ్డే, అరవింద్ అయ్యర్, ధనుంజయ్ రంజన్, ప్రమోద్ శెట్టి కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నట్లు టాక్. READ ALSO: ‘కిరిక్ పార్టీ’లో రష్మిక హీరోయిన్ కాబట్టి ఇప్పుడు సీక్వెల్‌లో కూడా ఆమే నటిస్తే బాగుంటుందని రక్షిత్ అనుకుంటున్నాడట. పాత విషయాలన్నీ మర్చిపోయి కేవలం ప్రొఫెషనల్‌ పరంగానే ఆలోచించి సినిమా చేస్తే బాగుంటుందని రక్షిత్ అభిప్రాయం. అసలే పెద్ద పెద్ద హీరోలతో రష్మిక తెలుగులో బిజీ అయిపోయింది. ప్రస్తుతం స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌, సుకుమార్ కాంబినేషన్‌లో వస్తున్న సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది. మరి రక్షిత్‌తో కలిసి ఈ సినిమాలో నటించేందుకు ఒప్పుకుంటుందో లేదో చూడాలి. READ ALSO:


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2T385qn
v

Bheeshma Thanks Meet: నితిన్ కోసం వస్తున్న మెగా వారసుడు

యువ హీరో నితిన్‌కు దాదాపు నాలుగేళ్ల తర్వాత మంచి హిట్ వచ్చి పడింది. వెంకీ కుడుముల దర్శకత్వంలో నితిన్ హీరోగా నటించిన ‘’ సినిమా బ్లాక్ బస్టర్ విజయం అందుకున్న సంగతి తెలిసిందే. ఇందులో రష్మిక మందన హీరోయిన్‌గా నటించారు. సినిమా రిలీజైన రోజే బొమ్మ బ్లాక్ బస్టర్ అనిపించుకుంది. ఇటీవల సక్సెస్ మీట్‌ని ఏర్పాటుచేసారు. నాలుగేళ్ల తర్వాత హిట్ వచ్చిన సందర్భంలో తనకు సంతోషంతో ఏడుపు వచ్చేస్తోందని ఆ కన్నీళ్లు కనపడకూదనే కళ్లజోడు పెట్టుకున్నానంటూ నితిన్ ఎమోషనల్ అయ్యారు. శుక్రవారం సినిమా కోసం థ్యాంక్స్ మీట్‌ను ఏర్పాటుచేయనున్నారు. వైజాగ్‌లోని గురజాడ కళాక్ష్రేత్రంలో ఈవెంట్‌ను నిర్వహించనున్నారు. ఈ ఈవెంట్‌కు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ అతిథిగా రాబోతున్నారు. సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు మాటలమాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ గెస్ట్‌గా వచ్చారు. కానీ సక్సెస్ మీట్‌కి మాత్రం ఏ గెస్ట్‌ని ఆహ్వానించలేదు. ఇక ‘భీష్మ’ సినిమా గురించి చెప్పాలంటే.. సినిమాలో నితిన్ మంచి ఈజ్‌తో నటించాడని ప్రేక్షకులు తెగ మెచ్చేసుకున్నారు. READ ALSO: ముఖ్యంగా కామెడీ చాలా బాగా చేసాడని అన్నారు. వెన్నెల కిషోర్ కామెడీ అదిరిపోయింది. మరోసారి తన మార్క్ కామెడీతో కడుపులు చెక్కలు చేసాడు. రఘు బాబు, బ్రహ్మాజీ, నరేష్ కూడా బాగానే నవ్వించారు. ప్రముఖ బెంగాలీ నటుడు జిషు సేన్ గుప్తా ఈ చిత్రంలో కార్పోరేట్ విలన్‌గా నటించి అదరగొట్టాడు. ప్రస్తుతం నితిన్.. ‘అంధాదున్’ తెలుగు రీమేక్‌తో బిజీగా ఉన్నారు. తన నిర్మాణ సంస్థ అయిన శ్రేష్ఠ్ మూవీస్ బ్యానర్‌పై నితిన్ తల్లిదండ్రులు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. మేర్లపాక గాంధీ దర్శకత్వం వహిస్తున్నారు. READ ALSO:


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/380rahb
v

పవన్-క్రిష్ సినిమాలో ఇతనే విలన్.. పవర్‌స్టార్‌కి సరైనోడే!

పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్‌తో ఈసారి ఎలాగైనా హిట్ కొట్టి తన సత్తా ఏంటో చాటుకోవాలని అనుకుంటున్నారు దర్శకుడు క్రిష్ జాగర్లమూడి. ఇప్పటికే హైదరాబాద్‌లో కీలకమైన సన్నివేశాలను తెరకెక్కించేసారు. సినిమాకు ‘విరూపాక్ష’ అనే టైటిల్ అనుకుంటున్నట్లు తెలుస్తోంది. పవన్ సినిమా అంటే విలన్ పాత్ర ఆయన రేంజ్‌కు సరిపోయేలా ఉండాలి. అందుకే ఈసారి విలన్‌ను బాలీవుడ్‌ నుంచి తెప్పించాలని అనుకుంటున్నారట క్రిష్. బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్‌ను ఎంపిక చేసుకున్నట్లు టాలీవుడ్ వర్గాల సమాచారం. ఈ సినిమాను క్రిష్ తెలుగులోనే కాకుండా హిందీలోనూ రిలీజ్ చేయాలని అనుకుంటున్నారట. అందుకే హిందీ నటులు కూడా ఉంటే బాలీవుడ్ ఆడియన్స్ కనెక్ట్ అవుతారనేది క్రిష్ ఆలోచన. అర్జున్ రాంపాల్‌కి హిందీలో మంచి గుర్తింపు ఉంది. విలన్ పాత్రల్లో బాగా ఒదిగిపోతారు. ఆయన చూపుల్లోనే విలనిజం ఉంటుందని అంటారు. కాస్త తెలుగు డైలాగులు బాగా బట్టీ పట్టి చెప్పగలిగితే.. పవన్‌కు సమానంగా పేరు తెచ్చుకోగలుగుతారని చెప్పొచ్చు. కానీ ఇంకా ఈ విషయంలో సినిమా టీం నుంచి క్లారిటీ రావాలి. ఇందులో కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఈ సినిమాలో పవన్ దొంగ పాత్రలో నటించనున్నట్లు తెలుస్తోంది. పవన్‌ ఇమేజ్‌ క్రేజ్‌ తగ్గ మాస్‌ కమర్షియల్‌ ఎలిమెంట్స్‌తో ఓ సందేశాత్మక కథను క్రిష్ సిద్ధం చేశారట. READ ALSO: ప్రముఖ యాంకర్ అనసూయ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. సినిమాకు ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ‘సైరా నరసింహారెడ్డి’, ‘ఆర్ ఆర్ ఆర్’ సినిమాలకు మాటల రచయితగా వ్యవహరించిన సాయి మాధవ్ బుర్రా ఈ సినిమాకు కూడా డైలాగులు రాస్తున్నారు. గతంలో క్రిష్ సాయి మాధవ్‌తో కలిసి ‘కంచె’, ‘గౌతమిపుత్ర శాతకర్ణి’, ‘ఎన్టీఆర్’ బయోపిక్‌కి కలిసి పనిచేసారు. సాయి బాబా కెమెరామెన్‌గా పనిచేస్తున్నారు. ఏఎం రత్నం సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతికి సినిమాను రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. READ ALSO:


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/32viZIF
v

పవన్ కళ్యాణ్‌కు ఉన్న గట్స్ చిరంజీవికి లేవు అంటున్న రాకేష్ మాస్టర్

చిత్ర పరిశ్రమలో అవకాశాలు లేక, ఇతరులు తనపై వేస్తున్న నిందలు భరించలేక వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ ఎప్పుడూ వార్తల్లో నిలుస్తున్నారు ప్రముఖ కొరియోగ్రాఫర్ రాకేష్ మాస్టర్. శ్రీరెడ్డి, చిరంజీవి, మంచు లక్ష్మిలపై షాకింగ్ కామెంట్స్ చేసిన అసలు తనకు ఎందుకు చిరంజీవి నచ్చడో ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. ‘‘నేను ఏది మాట్లాడినా నిజాయతీగా మాట్లాడతాను. అందుకే నన్ను వివాదాస్పద మాస్టర్ అని అంటారు. నేను ఇండస్ట్రీలోకి వచ్చిందే నందమూరి తారక రామారావుగారు, మెగాస్టార్ చిరంజీవిగారిని చూసి. నేను ఇండస్ట్రీలోకి వచ్చి ఎందరికో లైఫ్ ఇచ్చాను. కానీ ఇప్పుడు నాకు లైఫ్ లేకుండాపోతోంది. తెలుగు రాష్ట్రాల్లో చిరంజీవి నచ్చనివాడు ఎవ్వడూ ఉండడు. కానీ నాకు ఆయన వ్యక్తిత్వం నచ్చదు. చిరంజీవి ఇండస్ట్రీలో బెస్ట్ డ్యాన్సర్. నేను ఆయన్ని చూసే ఇండస్ట్రీలోకి వచ్చానన్న మాట నిజమే. కానీ నాకు ఆయన వ్యక్తిత్వం అస్సలు నచ్చదు. ఎందుకంటే నాలాంటి వాళ్లు ఇండస్ట్రీలోకి వచ్చినప్పుడు చిరంజీవిగారు పిలిచి అవకాశాలు ఇచ్చి సాయం చేయొచ్చు. కానీ ఆయన అలా చేయలేదు. పైగా ఇప్పుడు అవకాశాలు ఇస్తానంటున్నారు" READ ALSO: "ఇప్పుడేం చేసుకోవాలి. వయసు అయిపోయాక మేం ఎన్ని అవకాశాలు ఇచ్చినా ఏం చేస్తాం. నేను చిరంజీవి పేరునే ఎందుకు బయటికి తీసానంటే.. తెలుగు చిత్ర పరిశ్రమలో టాప్‌లో ఎన్టీఆర్ ఉన్నారు. ఆ తర్వాత స్థానం బాస్ చిరంజీవిదే. ఎన్టీఆర్ బతికి లేరు కాబట్టి ఆయన గురించి మనం మాట్లాడుకోకూడదు. మరి ఆయన తర్వాత అంతటి గొప్ప స్థానంలో ఉన్న చిరంజీవి సాయం చేయొచ్చు కదా అని అడుగుతున్నాను. ఎన్టీఆర్‌లో నచ్చని విషయం కూడా ఉంది. ఆయన లక్ష్మీపార్వతిని రోడ్డుమీద వదిలేసారు. అలా చేయడం ఎందుకు? ఆ ఒక్క విషయంలో నాకు ఆయన నచ్చరు. మెగా ఫ్యామిలీలో నాకు అల్లు అర్జున్ అంటే చాలా ఇష్టం. అతని స్టైల్ మరెవ్వరికీ లేదు. ఇకపోతే పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వం అంటే చాలా ఇష్టం. అతను బెదిరే టైప్ కాదు. పవన్‌కు ఉన్న గట్స్ చిరంజీవికి లేవు’’ అని తెలిపారు. READ ALSO:


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2wbPjnG
v

ఒకేరోజు పెళ్లికొడుకులు అవుతోన్న నితిన్, నిఖిల్!

టాలీవుడ్‌కు పెళ్లి సీజన్ వచ్చింది. ఒకేసారి ఇద్దరు హీరోలు పెళ్లిపీటలు ఎక్కుతున్నారు. ఈ వేసవిలో తన బ్యాచ్‌లర్ లైఫ్‌కి టాటా చెప్పి దాంపత్య జీవితంలోకి అడుగుపెట్టబోతున్నారు. యంగ్ హీరోలు నితిన్, నిఖిల్ సిద్ధార్థ ఒకే రోజు నుంచి తమ దాంపత్య జీవితాన్ని మొదలుపెట్టబోతున్నారు. ఏప్రిల్ 16న వీరిద్దరూ పెళ్లికొడుకులుగా మారనున్నారు. తన పెళ్లి కోసం నితిన్ దుబాయ్ వెళ్తుండగా.. నిఖిల్ మాత్రం హైదరాబాద్‌లోనే పెళ్లి వేడుక చేసుకోనున్నారు. ఇదిలా ఉంటే, గత కొన్నాళ్లుగా భీమవరం అమ్మాయి డాక్టర్ పల్లవి వర్మతో ప్రేమలో ఉన్న నిఖిల్ ఆమెతో ఫిబ్రవరి 1న నిశ్చితార్థం చేసుకున్నారు. గోవాలో కుటుంబ సభ్యుల సమక్షంలో వీరి నిశ్చితార్థం వైభవంగా జరిగింది. గోవాలోనే పల్లవి వర్మకు తన లవ్‌ను ప్రపోజ్‌ చేశారట. అందుకే, అక్కడే నిశ్చితార్థం వేడుకను జరుపుకున్నారు. వీరి వివాహం ఏప్రిల్ 16న హైదరాబాద్‌లో జరగనుంది. Also Read: మరోవైపు, నితిన్ పెళ్లి ప్రకటన అందరికీ ఒక సర్‌ప్రైజ్. ఎందుకంటే, నితిన్‌ది ప్రేమ వివాహం. కానీ, ఈ విషయాన్ని చాలా రహస్యంగా ఉంచారాయన. కొన్నేళ్లుగా ప్రేమిస్తోన్న అమ్మాయినే ఆయన పెళ్లిచేసుకుంటున్నారు. నాగర్ కర్నూలుకు చెందిన షాలిని కందుకూరిని ఏప్రిల్ 16న నితిన్ పెళ్లాడబోతున్నారు. దుబాయ్‌లో ఏప్రిల్ 15న నిశ్చితార్థం.. 16న కొద్దిమంది సన్నిహితులు, స్నేహితుల సమక్షంలో వీరి పెళ్లి జరగబోతోంది. 21న హైదరాబాద్‌లో గ్రాండ్ రిసెప్షన్ ఏర్పాటు చేస్తున్నారు. మొత్తానికి యూత్‌లో మంచి క్రేజ్ ఉన్న ఇద్దరు టి-టౌన్ బోయ్స్ ఓకేరోజు పెళ్లికొడుకులు అవుతున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2Pu1fZ3
v

తమన్ ప్రొఫైల్ పిక్‌లో పవన్... దూసుకెళ్లిపోతోందిగా!

ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్.ఎస్ ప్రస్తుతం ‘పింక్’ రీమేక్‌ కోసం మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నారు. త్వరలో ఈ సినిమాకు సంబంధించిన మొదటి పాటను రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ సందర్భంగా తమన్ పవన్‌ మిలిటరీ టోపీ పెట్టుకుని ఉన్న ఓ లోగో రిలీజ్ చేసారు. ఆ లోగోను తమన్ ట్విటర్ ప్రొఫైల్ పిక్చర్‌గా మార్చుకున్నారు. అంతేకాదు పింక్ రీమేక్‌లోని మొదటి పాటను ఎప్పుడు విడుదల చేస్తున్నారు అని ఫ్యాన్స్ ఒకటే గొడవ చేసేస్తున్నారు. దీనిపై తమన్ ట్వీట్ చేస్తూ.. ‘‘పవన్ కళ్యాణ్ వీరాభిమానిగా ‘పింక్’ రీమేక్‌లోని మొదటి పాటను ఎప్పుడెప్పుడు రిలీజ్ చేద్దామా అని ఆత్రుతగా ఫీల్ అవుతున్నాను. టీం మొత్తం చాలా కష్టపడుతోంది. మీ అందరూ ఈ సినిమా ఎంత ముఖ్యం అని ఫీలవుతున్నారో మేం కూడా అంతే. పవర్ స్టార్‌కు బెస్ట్ ఇవ్వడానికి మేం కూడా మా బెస్ట్ ప్రయత్నిస్తున్నాం. లవ్యూ గాయ్స్’ అని ట్వీట్ చేసారు. ఈ ట్వీట్ చేసిన కొద్దిసేపటి తర్వాత తమన్ తన ట్విటర్ ప్రొఫైల్ పిక్చర్ మార్చేసారు. ‘’ హ్యాష్‌ట్యాగ్‌తో ట్విటర్ ట్రెండింగ్‌లో దూసుకుపోతోంది. READ ALSO: కాగా ఇటీవల తమన్ తాను సినిమా కోసం కంపోజ్ చేసిన మ్యూజిక్‌ను పవన్‌కు వినిపించేందుకు ఆయన ఇంటికి వెళ్లారు. ఈ విషయాన్ని తమన్ సోషల్ మీడియా ద్వారా వెల్లడిస్తూ ఎమోషనల్ అయ్యారు.‘ఈరోజు కలలా ఉంది. ఎప్పటినుంచో నేను ఆయనతో కలిసి పనిచేయాలని, ఆయన సినిమాకు సంగీతం అందించాలని అనుకుంటున్నాను. నేను ఇప్పటివరకు కంపోజ్ చేసిన పాటలన్నీ పవన్‌కు వినిపించాను. చాలా కంగారుపడ్డాను. చెమలు పట్టేసాయి. అయితే అది భయం వల్ల కాదు. ఆయన పట్ల నాకున్న ప్రేమ, ఒత్తిడి వల్ల. మొత్తానికి ఆయనకు నా పాటలు నచ్చాయి. త్వరలో ఫస్ట్ పాటతో మీ ముందుకు రాబోతున్నాను. లవ్యూ సర్’ అని పేర్కొన్నారు. READ ALSO:


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3942plr
v

‘నీలి నీలి ఆకాశం’ సాంగ్ లిరిక్స్: మీలోనూ ఓ సిద్ శ్రీరామ్ ఉండే ఉంటాడు.. అందుకోండి!

యాంకర్‌గా మంచి పాపులారిటీ సంపాదించిన ప్రదీప్ మాచిరాజు నటుడిగానూ కొన్ని సినిమాల్లో నటించారు. కాకపోతే అవన్నీ పెద్దగా గుర్తుపెట్టుకోలేని పాత్రలు. అందుకే, ఇప్పుడు నటుడిగా తన ప్రతిభను నిరూపించుకోవడానికి సోలో హీరోగా వస్తున్నారు. ప్రదీప్, అమృతా అయ్యర్ హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం ‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా’. ఈ చిత్రం ద్వారా మున్నా దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఎస్వీ బాబు నిర్మాత. అనూప్ రూబెన్స్ సంగీతం సమకూరుస్తున్నారు. ఈ సినిమా నుంచి ఇప్పటికే విడులైన ‘నీలి నీలి ఆకాశం’ పాట సెన్సేషన్ అయ్యింది. యూట్యూబ్‌లో 35 మిలియన్లకు పైగా వ్యూస్ రాబట్టింది. ఈ పాటను చంద్రబోస్ రచించారు. సిద్ శ్రీరామ్, సునీత ఆలపించారు. మరి ఇంత పాపులర్ అయిన ఈ పాటను మీరు కూడా పాడేయండి. పల్లవి నీలి నీలి ఆకాశం ఇద్దామనుకున్నా మబ్బులు నిన్నే కమ్మేస్తాయని మానేస్తూ ఉన్నా నెలవంకకు ఇద్దామనుకున్నా.. ఓహో ఓహో నీ నవ్వుకు సరిపోదంటున్నా... నువ్వే నడిచేటి తీరుకే తారలు మొలిచాయి నేలకే నువ్వే వదిలేటి శ్వాసకే గాలులు బ్రతికాయి చూడవే ఇంత గొప్ప అందగత్తెకేమి ఇవ్వనే నీలి నీలి ఆకాశం ఇద్దామనుకున్నా మబ్బులు నిన్నే కమ్మేస్తాయని మానేస్తూ ఉన్నా చరణం - 1 ఓహో వానవిల్లులో ఉండని రంగు నువ్వులే ఏ రంగుల చీరను నీకు నెయ్యాలే నల్ల మబ్బులా మెరిసే కళ్లు నీవిలే ఆ కళ్లకు కాటుక ఎందుకెట్టాలే చెక్కిలిపై చుక్కగా దిష్టే పెడతారులే నీకైతే తనువంతా చుక్కను పెట్టాలే ఏదో ఇవ్వాలి కానుక ఎంతో వెతికాను ఆశగా ఏది నీ సాటి రాదిక అంటు ఓడాను పూర్తిగా కనుకే ప్రాణమంత తాళి చేసి నీకు కట్టనా నీలి నీలి ఆశాశం ఇద్దామనుకున్నా నీ హృదయం ముందర ఆకాశం చిన్నది అంటున్నా చరణం - 2 ఓహో అమ్మ చూపులో వొలికే జాలి నువ్వులే ఆ జాలికి మారుగా ఏమి ఇవ్వాలే నాన్న వేలితో నడిపే ధైర్యమే నీదే నీ పాపనై పసి పాపనై ఏమి ఇవ్వాలే దయ కలిగిన దేవుడే మనలను కలిపాడులే వరమొసగే దేవుడికే నేనేం తిరిగివ్వాలే ఏదో ఇవ్వాలి కానుక ఎంతో వెతికాను ఆశగా ఏది నీ సాటి రాదిక అంటూ అలిసాను పూర్తిగా కనుకే మళ్లి మళ్లీ జన్మనెత్తి నిన్ను చేరనా నీలి నీలి ఆకాశం ఇద్దామనుకున్నా మబ్బులు నిన్నే కమ్మేస్తాయని మానేస్తూ ఉన్నా


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2wSsRAv
v

Wednesday 26 February 2020

‘మనసు మారే’ పాట లిరిక్స్: సరళమైన సిరివెన్నెల సాహిత్యం.. మీరూ పాడేయండి

‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి.. ఈ పేరు వింటేనే ఏదో తెలియని ఆరాధన భావం మనలో కలుగుతుంది. ముఖ్యంగా సంగీత ప్రియులైతే సిరివెన్నెల గారి పేరు వింటేనే పులకించిపోతారు. అంతలా ఆయన తన సాహిత్యంతో తెలుగు ప్రేక్షకులను కట్టిపడేశారు. మూడు దశాబ్దాలకు పైగా తన కలం నుంచి మధుర గేయాలను జాలువారుస్తోన్న సిరివెన్నెల.. ఇప్పటికీ మనల్ని మంత్రముగ్ధుల్ని చేస్తూనే ఉన్నారు. ఈ మధ్య ‘సామజవరగమన’, ‘నువ్వు నాతో ఏమన్నావో’ వంటి సూపర్ హిట్ సాంగ్స్‌కి సాహిత్యం అందించిన సిరివెన్నెల ఇప్పుడు నాని, సుధీర్ బాబు ప్రధాన పాత్రల్లో వస్తోన్న ‘V’ సినిమా కోసం ఒక మంచి పాట రాశారు. ‘మనసు మరీ మత్తుగా తూగిపోతున్నదే’ అంటూ సాగే ఈ పాటలోనూ శాస్త్రిగారు తన మార్కు సాహిత్యం చూపించారు. అమిత్ త్రివేది స్వరపరిచిన ఈ పాట ఇటీవల విడుదలై యూట్యూబ్‌లో దూసుకుపోతోంది. ఈ పాటను అమిత్ త్రివేది, శాషా తిరుపతి, యాజిన్ నిజార్ ఆలపించారు. సాహిత్యం ఎంత బాగుందో.. అమిత్ త్రివేది ఇచ్చిన ట్యూన్‌ కూడా అంతే బాగుంది. అమిత్ త్రివేది, శాషా అద్భుతంగా ఆలపించారు. మరి ఆ పాటను మీరూ పాడేయండి.. పల్లవి మనసు మరీ మత్తుగా తూగిపోతున్షదే ఏమా ఈ వళ వయసు మరీ వింతగా విస్తుబోతున్నదే నీదే ఈ లీల అంతగా కవ్విస్తావేం గిల్లి అందుకే బంధించెయ్‌ నన్నల్లి కిలాడి కోమలి గులేబకావళి సుఖాల జావళీ వినాలి కౌగిలి చరణం - 1 అడుగులో అడుగువై ఇలా రా నాతో నిత్యం వరాననా బతుకులో బతుకునై నివేదిస్తా నా సర్వం జహాపనా పూల నావ గాలి తోవ హైలోహైలెసో చేరనీవా చేయనీవా సేవలేవేవో ॥మనసు మరీ॥ చరణం - 2 మనసులో అలలయే రహస్యాలేవో చెప్పే క్షణం ఇది మనువుతో మొదలయే మరో జన్మాన్నె పుట్టే వరమిది నీలో ఉంచా నా ప్రాణాన్ని చూసి పోల్చుకో నాలో పెంచా నీ కలలన్నీ ఊగనీ ఊయల్లో ॥మనసు మరీ॥


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3cbEnqF
v

దిల్ రాజుకు పెళ్లైపోయిందా? దుబాయ్‌లో చేసేసుకున్నారట

జాతీయ అవార్డు గ్రహీత, ప్రముఖ నిర్మాత రహస్యంగా రెండో పెళ్లి చేసేసుకున్నట్లు వార్తలు వస్తు్న్నాయి. మంగళవారం దుబాయ్‌లో వివాహం చేసేసుకున్నారట. ఫ్యామిలీ ఫ్రెండ్‌నే పెళ్లి చేసుకున్నట్లు తెలుస్తోంది. కేవలం కుటుంబీకులు, స్నేహితుల సమక్షంలో పెళ్లి చేసుకున్నారట. ఇండస్ట్రీకి చెందిన ఏ ఒక్కరినీ పెళ్లికి పిలవలేదట. పెళ్లికి దిల్ రాజు కూతురు హన్షితా రెడ్డి కూడా వెళ్లారని టాక్. అయితే దిల్ రాజు స్పోక్స్‌ పర్సన్ మాత్రం అందులో నిజం లేదని, ఇలాంటి రూమర్స్ నమ్మొద్దని అంటున్నారు. మరి ఇప్పటికైనా దిల్ రాజు తన రెండో పెళ్లి గురించి క్లారిటీ ఇస్తారో లేదో వేచి చూడాలి. దిల్ రాజు భార్య అనిత కొన్నేళ్ల క్రితం అనారోగ్యంతో చనిపోయారు. ఆ తర్వాత తన ఒక్కగానొక్క కుమార్తెకు పెళ్లి చేసి పంపించారు. కూతురు అత్తగారింటికి వెళ్లిపోవడంతో దిల్ రాజు ఒంటరిగా ఉంటున్నారట. అందుకే మళ్లీ పెళ్లి చేసుకుని తన జీవితానికి ఓ తోడు కావాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. తెలుగు చిత్రపరిశ్రమలో సక్సెస్‌ఫుల్ నిర్మాతగా పేరు తెచ్చుకున్న దిల్‌రాజు జాతీయ అవార్డు కూడా అందుకున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై ఇప్పటివరకు ఎన్నో సక్సెస్‌ఫుల్ సినిమాలు తీసారు. 2003లో వచ్చిన ‘దిల్’ సినిమాతో దిల్‌రాజు నిర్మాతగా తన ప్రయాణాన్ని ప్రారంభించారు. READ ALSO: ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయం అందుకోవడంతో తన పేరు ముందు ‘దిల్’ అని పెట్టుకున్నారు. ఆ తర్వాత వరుసగా ‘ఆర్య’, ‘బొమ్మరిల్లు’, ‘మిస్టర్ పర్‌ఫెక్ట్’, ‘సతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ వంటి ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలను నిర్మించారు. ఈరోజు ఆయన ఇండస్ట్రీలోనే టాప్ ప్రొడ్యూసర్‌గా పేరు తెచ్చుకున్నారు. ప్రస్తుతం ఆయన పవన్ కళ్యాణ్‌ నటిస్తున్న పింక్ రీమేక్ సినిమాకు, అల్లు అర్జున్ నటిస్తున్న ‘ఐకాన్’ సినిమాలను నిర్మిస్తున్నారు. మరోపక్క బాలీవుడ్‌లో షాహిద్ కపూర్ నటిస్తున్న ‘జెర్సీ’ సినిమాకు కూడా నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. READ ALSO:


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2T3RBhV
v

కమల్ కావాలని ముద్దు పెట్టారంటే నమ్మరు, వదిలేయండి: రేఖ

పాతికేళ్ల క్రితం జరిగిన ఓ ఆసక్తికర సంఘటన ఇప్పుడు వైరల్ అవుతోంది. ప్రముఖ తమిళ సీనియర్ నటి రేఖ.. 20 ఏళ్ల క్రితం నటించిన ‘పున్నగాయ్ మన్నన్’ సినిమా షూటింగ్‌లో జరిగిన ఓ సంఘటన గురించి ఇటీవల వెల్లడించారు. ఈ సినిమాలో హీరోగా, రేఖ హీరోయిన్‌గా నటించారు. లెజండరీ డైరెక్టర్ కే. బాలచందర్ దర్శకత్వం వహించారు. అందులో కమల్, రేఖ గాఢంగా ప్రేమించుకుంటారు. అయితే ఇంట్లోవాళ్లు పెళ్లికి ఒప్పుకోలేదని చనిపోవాలని నిర్ణయించుకుంటారు. అయితే ఆత్మహత్య చేసుకునే సన్నివేశం తెరకెక్కిస్తున్నప్పుడు కమల్ హాసన్ రేఖ‌కు ముద్దుపెట్టేసారట. ఈ విషయాన్ని రేఖ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. తన అనుమతి లేకుండానే బాలచందర్, కమల్ హాసన్ ముద్దు సీన్‌ను పెట్టారని, ఆ తర్వాత కొన్ని రోజుల పాటు తనకు నిద్ర పట్టలేదని అన్నారు. అయితే ఆమె సరదాగా వెల్లడించిన ఈ విషయం కోలీవుడ్‌లో విపరీతంగా వైరల్ అవుతోంది. ప్రముఖ సింగర్ చిన్మయి శ్రీపాద కూడా దీనిపై స్పందించి.. ఇలాంటి దర్శకులు ఇప్పటికీ ఉన్నారని కామెంట్స్ చేసారు. అయితే సోషల్ మీడియాలో రేఖ ఇచ్చిన ఇంటర్వ్యూ రచ్చ పుట్టిస్తోంది. కమల్ హాసన్ రేఖ‌కు క్షమాపణలు చెప్పాలని నెటిజన్స్ డిమాండ్ చేసారు. అయితే ఈ విషయం ఎక్కడ సీరియస్ అవుతుందోనని భయపడి రేఖ దీనికి ఫుల్ స్టాప్ పెట్టాలని అనుకున్నారు. READ ALSO: ‘దయచేసి ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేయండి. నా అనుమతి లేకుండా కమల్ హాసన్ ముద్దు పెట్టారంటే ఎవరూ నమ్మరు. ఈ విషయం నాకు, కమల్‌కు, బాలచందర్ సర్‌కి మాత్రమే తెలుసు. కానీ బాలచందర్ ఇప్పుడు బతికి లేరు. కాబట్టి నాకు కమల్ హాసన్ నుంచి ఎలాంటి సారీ అవసరంలేదు. నా అనుమతి లేకుండా ముద్దు పెట్టారు కానీ సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ విజయం అందుకుంది. నేను ఈ విషయాన్ని ఇప్పుడు ఎందుకు చెప్పానంటే ఒకవేళ లిప్ కిస్ సీన్ గురించి నాకు ముందే చెప్పి ఉంటే నేను ఒప్పుకునేదాన్ని కాను అని తెలియజేయడానికి మాత్రమే. దయచేసి ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేయండి’’ అని తెలిపారు. READ ALSO:


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2PwqHx0
v

అయ్యో ‘అల..వైకుంఠపురములో’.. ఇలా ఎలా జరిగిందబ్బా.!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘’ సినిమాను 26న జెమిని టీవీ సంస్థకు చెందిన సన్ నెక్ట్స్ యాప్‌లో స్ట్రీమ్ చేస్తామని ఇదివరకే ప్రకటించారు. సాధారణంగా ఇలాంటి భారీ సినిమాలన్నీ అమెజాన్, నెట్‌ఫ్లిక్స్ యాప్స్‌లో రిలీజ్ చేస్తుంటారు. కానీ ఈ రెండు ఓటీటీలలో సినిమాను రిలీజ్ చేయమని అమెరికాకు చెందిన డిస్ట్రిబ్యూటర్లు ముందునేగా అనౌన్స్ చేసారు. అందుకే ఓవర్ సీస్‌లో ఈ సినిమా మిలియన్ల డాలర్ల కాసుల వర్షం కురిపించింది. కానీ ఇప్పుడు ఓ షాక్ న్యూస్ బయటికి వచ్చింది. సన్ నెక్ట్స్ యాప్‌లో రిలీజ్ అవ్వాల్సిన ‘అల వైకుంఠపురములో’ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్ అయింది. ఒక్క ప్రకటన కూడా లేకుండా ఇది ఎలా జరిగిందో తెలీదు కానీ ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. అయితే డిస్ట్రిబ్యూటర్లే కావాలని ఓటీటీలో రిలీజ్ చేస్తున్నామని ముందుగానే చెప్పకుండా ఇలా చేసారా అన్న వార్తలు కూడా వెలువడుతున్నాయి. అయితే ఇప్పుడు నెట్‌ఫ్లి్క్స్‌లో ‘అల వైకుంఠపురములో’ రిలీజ్ అవడం వల్ల డిస్ట్రిబ్యూటర్లు వచ్చిన నష్టం ఏమీ లేదు. READ ALSO: ఎందుకంటే.... తెలుగు రాష్ట్రాలకు చెందిన డిస్ట్రిబ్యూటర్లతో పాటు అమెరికాలో సినిమా కొనుక్కున్నవాళ్లు కూడా తొలి 50 రోజుల్లోనే 8 కోట్లకు పైగా లాభాలు దక్కించుకున్నారు. కాబట్టి ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్‌లో సినిమా రిలీజ్ అయినంత మాత్రాన పోయేది ఏమీ లేదు. సో ఆడియన్స్... ఎవరైనా ‘అల వైకుంఠపురములో’ సినిమాను థియేటర్‌లో చూడటం మిస్ అయివుంటే వెంటనే నెట్‌ఫ్లిక్స్‌లో డౌన్‌లోడ్ చేసుకుని ఎంజాయ్ చేసేయండి. READ ALSO:


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2I0qWfq
v

Chiranjeevi: ప్రభాస్‌ కోసం సినిమా వదులుకున్న మెగాస్టార్

యంగ్ రెబెల్‌ స్టార్ నిన్న కొత్త సినిమాను ప్రకటించి ఫ్యాన్స్‌ను సర్‌ప్రైజ్ చేసారు. ‘మహానటి’ సినిమాను తెరకెక్కించి జాతీయ అవార్డును దక్కించుకున్న నాగ్ అశ్విన్‌తో కలిసి ప్రభాస్ పనిచేయబోతున్నారు. వైజయంతి మూవీస్ సంస్థ ఇండస్ట్రీలో 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా కొత్త సినిమాను ప్రకటించారు. ప్రభాస్ ఫ్యాన్స్ గర్వపడేలా ఈ సినిమాను తెరకెక్కిస్తానని నాగ్ అశ్విన్ అన్నారు. దీనిని ప్యాన్ ఇండియా సినిమాగా తెరకెక్కించబోతున్నారు. అయితే ఈ సినిమా స్క్రిప్ట్ ముందు మెగాస్టార్ చిరంజీవి వద్దకు వచ్చిందట. ‘మహానటి’ సినిమా ప్రమోషన్స్ సమయంలో నాగ్ అశ్విన్ చిరంజీవి కోసం ఓ సైన్స్ ఫిక్షన్ కథ తయారుచేసుకుంటున్నానని, త్వరలో ఆయనకు కథ వినిపిస్తానని చెప్పారు. ఆ తర్వాత చిరుకి కథ చెప్పడంతో ఆయన ఓ నిర్ణయానికి వచ్చారట. ఈ సినిమాను తాను చేయడం కంటే ప్రభాస్‌ చేస్తే ఇంకా బాగుంటుంది అని చిరు నాగ్ అశ్విన్‌కి చెప్పారంట. ఎందుకంటే ‘బాహుబలి’ సినిమాతో ప్రభాస్ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు. అందుకే ఈ సినిమాను ఆయన చేస్తేనే బాగుంటుందని చిరు అభిప్రాయపడ్డారట. ఇందుకు అశ్విన్ కూడా ఒప్పుకోవడంతో ప్రభాస్‌కు కథ వినిపించారు. చిరంజీవి రిఫర్ చేసిన స్క్రిప్ట్ అంటే ఏ రేంజ్‌లో ఉంటుందో ప్రభాస్‌కి కూడా తెలుసు. అందుకే మరో క్షణం ఆలోచించకుండా సినిమాను ఓకే చేసేసారట ప్రభాస్. అయితే ఇంకా ఈ సినిమాకు ఎలాంటి టైటిల్ అనుకోలేదు. సినిమాను మాత్రం తెలుగు, హిందీతో పాటు ఇతర దక్షిణాది భాషల్లో రిలీజ్ చేయనున్నారు. READ ALSO : ప్రస్తుతం రాధాకృష్ణ సినిమాతో ప్రభాస్ బిజీగా ఉన్నారు కాబట్టి ఈ సినిమా పూర్తైన వెంటనే నాగ్ అశ్విన్ సినిమాలో నటిస్తారు. రాధాకృష్ణ సినిమాలో పూజా హెగ్డే కథానాయికగా నటిస్తున్నారు. ‘రాధే శ్యాం’, ‘ఓ డియర్’ అనే టైటిల్స్ పరిశీలనలో ఉన్నాయి. 1930ల నాటికి చెందిన ప్రేమ కథ నేపథ్యంలో సినిమా ఉండబోతోందని ఎప్పటినుంచో వార్తలు వస్తున్నాయి. ‘సాహో’ సినిమాతో చేసిన తప్పులు ఈ సినిమాలో రిపీట్ కాకుండా ఉండేలా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. READ ALSO:


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/380IeUs
v

Butta Bomma Full Video Song - Ala Vaikunthapurramuloo


Butta Bomma Full Video Song - Ala Vaikunthapurramuloo

from BharatStudent - Telugu - Actor Actress|Photo,Picture Galleries|Wallpapers|Screensavers|Movie Trailers|Film News and Gossips https://ift.tt/2vixRhe

OMG Daddy Full Video Song - Ala Vaikunthapurramu loo


OMG Daddy Full Video Song - Ala Vaikunthapurramu loo

from BharatStudent - Telugu - Actor Actress|Photo,Picture Galleries|Wallpapers|Screensavers|Movie Trailers|Film News and Gossips https://ift.tt/2PsJOaZ

Ninne Ninne Full Video Song | Aswathama


Ninne Ninne Full Video Song | Aswathama

from BharatStudent - Telugu - Actor Actress|Photo,Picture Galleries|Wallpapers|Screensavers|Movie Trailers|Film News and Gossips https://ift.tt/38ZoGRw

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...