Saturday 31 October 2020

Mahesh Babu: థాయ్‌లాండ్‌లో మహేష్ బాబు అలా..! కమలాయ ఎఫెక్ట్ అంటున్న నమ్రత

కరోనా మహమ్మారి దాడితో దేశం మొత్తం అతలాకుతలమైంది. అన్ని రంగాలపై కరోనా ప్రభావం పడింది. దాదాపు నాలుగు నెలల పాటు ఏ ఒక్కరూ గడపదాటి బయటకురాని పరిస్థితి చూశాం. ఆ తర్వాత నెమ్మదిగా లాక్‌డౌన్ సడలింపులు వస్తుండటంతో ప్రజలంతా ఎవరి పనిలో వారు నిమగ్నమవుతున్నారు. ఈ నేపథ్యంలో సూపర్ స్టార్ పాత ఫోటో షేర్ చేసి సర్‌ప్రైజ్ చేశారు ఆయన సతీమణి . కరోనాకి ముందు సమ్మర్‌ వెకేషన్‌కి వెళ్లినప్పటి ఫొటో ఇది అని పేర్కొన్నారు. పాత ఫోటోనే అయినా రేర్ పిక్ కావడంతో సోషల్ మీడియాలో ఈ ఫోటో వైరల్ అయింది. పైగా ఈ పిక్‌లో టోపీ పెట్టుకుని.. చాలా సంతోషంగా కనిపిస్తున్న మహేష్ డిఫరెంట్ లుక్ నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. గతంలో ఎప్పుడూ మహేష్‌ని‌ ఇలా కనిపించకపోవడంతో ఈ పిక్ చూసి తెగ మురిసిపోతున్నారు సూపర్ స్టార్ ఫ్యాన్స్. థాయ్‌లాండ్‌లోని కమలాయ రిసార్ట్, అందులోని స్పా అంటే మహేష్‌ బాబుకు ఎంతో ఇష్టమని తెలుపుతూ ఈ రేర్ ఫోటో షేర్ చేశారు నమ్రత. ఈ మేరకు ప్రీ కోవిడ్ డైరీస్ అనే హ్యాష్ ట్యాగ్ జతచేశారు. Also Read: ఇక మహేష్ బాబు సినిమాల విషయానికొస్తే.. ఇటీవలే 'సరిలేరు నీకెవ్వరూ' మూవీతో సక్సెస్ అందుకున్న ఆయన మరికొద్ది రోజుల్లో 'సర్కారు వారి పాట' సినిమా రెగ్యులర్ షూట్‌లో పాల్గొనబోతున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, జీఎమ్‌బి ఎంటర్‌టైన్‌మెంట్ ,14 రీల్స్ ప్లస్ సంస్థలు సంయుక్తంగా సమర్పిస్తున్న ఈ సినిమాకు పరశురామ్ దర్శకత్వం వహిస్తున్నారు. చిత్రంలో మహేష్ సరసన కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. థమన్ సంగీతం అందిస్తున్నారు. మహేష్ కెరీర్‌లో 27వ సినిమాగా ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3eceLLY
v

Valmiki Jayanti: ఆ రోజు గొడవ చేసినోళ్లకు గుర్తుండే ఉంటుంది.. నాగబాబు సెటైరికల్ కామెంట్స్!

మెగా ప్రిన్స్, తనయుడు వరుణ్ తేజ్ హీరోగా రూపొందిన 'గద్దలకొండ గణేష్' సినిమా విడుదలకు ముందే వివాదాల్లో చిక్కుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు మొదట 'వాల్మీకి' అనే టైటిల్ కన్ఫర్మ్ చేసి ప్రమోషన్స్ కూడా చేసిన దర్శకనిర్మాతలు పలు వివాదాలు తలెత్తడంతో చివరి క్షణంలో ఆ టైటిల్‌ని 'గద్దలకొండ గణేష్'గా మార్చేసి రిలీజ్ చేశారు. తాజాగా అదే విషయాన్ని గుర్తుచేస్తూ ఓ సెటైరికల్ కామెంట్ వదిలారు మెగా బ్రదర్ నాగబాబు. 'వాల్మీకి' సినిమా అంతా రెడీ అయ్యాక.. తమ సినిమాలో వాల్మీకి మహర్షిని కించపరచలేదని, ఆయన గురించి చాలా గొప్పగా చెప్పడం జరిగిందని డైరెక్టర్ హరీష్ శంకర్ తెలిపినా వివాదాలు సద్దుమణగలేదు. దీంతో 'వాల్మీకి'గా ప్రేక్షకుల ముందుకు రావాల్సిన వరుణ్ తేజ్ 'గద్దలకొండ గణేష్'గా వెండితెరపై కనిపించాడు. ఫైనల్‌గా చూస్తే ఈ మూవీ సూపర్ డూపర్ హిట్ సాధించింది. అయితే ఈ రోజు (అక్టోబర్ 31) వాల్మీకి మహర్షి జయంతిని పురస్కరించుకొని ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ తనదైన స్టైల్‌లో నాగబాబు ట్వీట్ చేశారు. Also Read: ''ఆ రోజు 'వాల్మీకి' అని టైటిల్ పెడితే గొడవ చేశారు కదా. వాళ్ళకి మరి ఈ రోజు అని గుర్తుండే ఉంటుంది. ఏదైతేనేం.. హ్యాపీ బర్త్ డే వాల్మీకి గారు. నాకు నచ్చిన మంచి మాస్ కథలు రాసేవాళ్ళలో మీరు ప్రథములు. రాముని జీవితాన్ని బాగా రాసినందుకు ధన్యవాదాలు'' అని నాగబాబు తన ట్వీట్‌లో పేర్కొన్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2HSjTsk
v

ఓడిపోయాం.. ఇక మన జీవితం ఇంతే! రిప్ హ్యూమానిటీ అంటూ రగిలిపోయిన రష్మీ

మానవుడిగా పుట్టి అన్నీ తెలిసిన మనమే మూగ జీవాల పట్ల ప్రవర్తిస్తున్న తీరు చూస్తుంటే బాధేస్తుందనే అర్థంతో ఎమోషనల్ పోస్ట్ పెట్టింది . మూగ జీవాలంటే అమితంగా ఇష్టపడే ఆమె ఓ విషాదకర వీడియో షేర్ చేస్తూ ఇక మన భవిష్యత్తు ఇలాగే ఉంటుందంటూ ఆవేదన చెందింది. ఎంత అవగాహన కల్పించినా జనాల్లో మార్పు రావడం లేదంటూ కోపంతో రగిలిపోయింది రష్మీ. ఈ సృష్టిలోని మూగ జీవాలంటే యాంకర్ రష్మీకి మహా ఇష్టం. జంతు ప్రేమికులరాలిగా జీవులను రక్షించే బాధ్యత మనుషులపై ఉందని ఇప్పటికే పలు సార్లు ఆమె పోస్టులు పెట్టింది. మూగ జీవాలన్నాక చిన్న, పెద్ద తేడా లేదంటూ సృష్టి లోని జీవాలన్నింటినీ సంరక్షించుకోవాల్సిన బాధ్యత మనదే అని ఎన్నోసార్లు ట్వీట్స్ చేసింది. లాక్‌డౌన్ సమయంలోనూ వీధి కుక్కలకు స్వయంగా ఆహారం అందించి మానవత్వం చాటుకుంది రష్మీ. సృష్టిలో అన్నీ ముఖ్యమైనవే.. దేన్నీ వదులుకోవద్దు అని ఎప్పుడూ చెప్పే ఆమె.. తాజాగా షేర్ చేసిన వీడియోతో ఏకంగా రిప్ హ్యూమానిటీ అంటూ షాకింగ్ కామెంట్ చేసింది. Also Read: ఓ పిల్లాడు చిన్న కుక్క (పప్పీ)ని తీసుకొచ్చి వాటర్ ట్యాంక్‌లో వేసి దాని చావుకు కారణమై వెళ్ళిపోతున్న వీడియోను ఓ నెటిజన్ తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేస్తూ రష్మీకి ట్యాగ్ చేశాడు. ఇదేనా మనం మన పిల్లలకు నేర్పించేది? అంటూ దానిపై కామెంట్ రాశాడు. ఈ వీడియో మూగ జీవాలను ప్రేమించే ప్రతి వ్యక్తి హృదయాన్ని కలచివేస్తోంది. కాగా ఈ వీడియో చూసిన రష్మీ వెంటనే దాన్ని రీ ట్వీట్ చేస్తూ కోపంతో రగిలిపోయింది. రోజురోజుకూ మానవత్వం మంటగలుస్తోంది.. రిప్ హ్యూమానిటీ అంటూ ఫైర్ అయింది. డిగ్రీలు చదివించాలనే మోజు తప్పితే చిన్నారులకు మానవతా విలువల్లో కనీస పరిజ్ఞానం ఇవ్వడంలో విఫలమవుతున్నామని ఆవేదన వ్యక్తం చేసింది రష్మీ. ఇది చూస్తుంటే మన భవిష్యత్ ఎలా ఉంటుందో అర్థమవుతోందంటూ ట్వీట్ చేసింది .


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2HJ1jU9
v

తొలి జేమ్స్ బాండ్ హీరో సీన్ కానరీ కన్నుమూత

స్కాటిష్‌ నటుడు, తొలిసారి వెండితెరపై జేమ్స్ బాండ్‌గా కనిపించిన (90) శనివారం రోజు కన్నుమూశారు. ‌ఇటీవలే 90వ పుట్టినరోజు జరుపుకున్న ఆయన కన్నుమూయడం హాలీవుడ్‌ పరిశ్రమలో తీవ్ర విషాదాన్ని నింపింది. వయసు పైబడటంతో కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన నిద్రలోనే కన్నుముసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. సీన్ కానరీ మరణవార్త తెలిసి పలువురు సినీ ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా సంతాపం తెలుపుతున్నారు. జేమ్స్ బాండ్‌ సిరీస్‌కు చెందిన ఏడు సినిమాల్లో సీన్ కానరీ నటించారు. మొదటిసారిగా 1962లో వచ్చిన బాండ్ సిరీస్ 'డా. నో'లో జేమ్స్ బాండ్‌గా నటించి మెప్పించిన ఆయన.. ఆ తర్వాత 1963లో వచ్చిన 'ఫ్రమ్ రష్యా విత్ లవ్', 1964లో వచ్చిన 'గోల్డ్ ఫింగర్', 1965లో వచ్చిన 'థండర్‌బాల్', 1967లో వచ్చిన 'యూ ఓన్లీ లివ్ ట్వైస్', 1971లో వచ్చిన 'డైమండ్స్ ఆర్ ఫరెవర్', 1983లో వచ్చిన 'నెవర్ సే నెవర్ ఎగైన్' వంటి వరుస జేమ్స్ బాండ్ సిరీస్‌లలో నటించి వెండితెరపై ఓ వెలుగు వెలిగారు. Also Read: ‘ది అన్‌ టచ్‌బుల్స్‌’ సినిమాలో అద్భుతంగా నటించి ఉత్తమ సహాయ నటుడిగా ఆస్కార్‌ అవార్డు సైతం అందుకున్నారు. భాషాభేదం అనేది లేకుండా సీన్ కానరీకి ప్రపంచవ్యాప్తంగా అభిమానులున్నారు. అలాగే రెండుసార్లు గోల్డెన్ గ్లోబ్స్ అవార్డులతో పాటు రెండుసార్లు బాఫ్టా అవార్డులను కూడా ఆయన గెలుచుకున్నారు. 2006లో అమెరికన్‌ ఫిల్మ్‌ ఇనిస్టిట్యూట్‌ నుంచి జీవిత సాఫల్య పురస్కారం అందుకున్న సీన్‌ కానరీ ఆ తర్వాత వెండితెరకు పూర్తిగా దూరమయ్యారు. సీన్ కానరీ మృతి పట్ల ప్రపంచ ఆడియన్స్ అంతా విచారం వ్యక్తం చేస్తున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3ebK9Kx
v

కుర్రకారుకు పిచ్చెక్కిస్తున్న ప్రగ్యా జైస్వాల్ పోజ్! లో- దుస్తులను ఫోకస్ చేస్తూ ఇలా!!

'కంచె' భామ హాట్ కిక్కిచ్చింది. లో- దుస్తులను ఫోకస్ చేస్తూ ఫోటో షూట్‌లో పాల్గొని ఆ ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ మేరకు 'ఈ శనివారం వేళ కొన్ని కిరణాలను ఒడిసిపట్టుకుంటున్నా' అంటూ ఆమె పెట్టిన ట్యాగ్ లైన్ నెటిజన్లను ఆకట్టుకుంటోంది. ఈ ఫొటోలో ప్రగ్యా అందాల విందు చూసి కుర్రకారు పిచ్చెక్కిపోతున్నారు. అమ్మడి పదునైన లుక్స్, క్లీవేజ్ ట్రీట్ చూసి వావ్! బ్యూటిఫుల్ అంటూ అందాలను పొగిడేస్తున్నారు. అందంతో పాటు అభినయం పరంగా టాలెంట్ ఉందని ప్రూవ్ చేసుకున్న ప్రగ్యా జైస్వాల్.. అవకాశాలు పట్టడంలో మాత్రం విఫలమైందనే చెప్పుకోవాలి. ఆశించిన మేర అవకాశాలు రాకపోవడంతో ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా ద్వారా అందాల విందిస్తూ అటు దర్శక నిర్మాతలకు గ్యాలం వేస్తూనే ఇటు నెటిజన్లను కనువిందు చేస్తోంది. దీంతో ప్రగ్యా పోస్ట్ చేస్తున్న హాట్ పిక్స్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. Also Read: ఈ క్రమంలోనే తాజాగా ఆమె పోస్ట్ చేసిన ఓ పిక్ కుర్రకారు కంటిమీద రెప్ప వాలనీయడం లేదు. లో- దుస్తులను ఫోకస్ అయ్యేలా ప్రగ్యా స్టైలిష్ లుక్ చూసి ఫిదా అవుతున్నారంతా. కావాల్సినంత అందం, దానికి తోడు నటనా సామర్థ్యం ఉన్నప్పటికీ ప్రగ్యాకు అవకాశాలు దక్కకపోవడం నిరాశ కలిగిస్తోందంటూ ఈ ఫోటోపై కామెంట్స్ చేస్తున్నారు. ''కంచె, ఓం నమో వెంటేశాయా, గుంటూరోడు, నక్షత్రం, ఆచారి అమెరికా యాత్ర'' లాంటి సినిమాలు చేసింది ప్రగ్యా జైస్వాల్.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/31XPpwi
v

తెలంగాణ పోలీస్‌పై కీరవాణి స్పెషల్ పాట.. నెవర్ బిఫోర్ సాంగ్.. వీడియో

ప్రముఖ సినీ గేయ రచయిత అనంత్ శ్రీరామ్ రచించి ప్రముఖ సంగీత దర్శకుడు ఎం.ఎం. కీరవాణి స్వరపరచి, ఆలపించిన "పోలీస్, పోలీస్.. తెలంగాణా పోలీస్, ప్రాణం పంచే మనసున్న పోలీస్" అనే పాటను డీజీపీ మహేందర్ రెడ్డి శనివారం ఆవిష్కరించారు. డీజీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఈ పాట ఆవిష్కరణ కార్యక్రమానికి సంగీత దర్శకుడు ఎం.ఎం. కీరవాణి హాజరయ్యారు. సీనియర్ పోలీస్ అధికారులు ఉమేష్ ష్రాఫ్, జితేందర్, సందీప్ శాండిల్య, శివధర్ రెడ్డి, నాగిరెడ్డి, బాల నాగాదేవి, వెంకటేశ్వర్లు, ఈ పాట ఎడిటర్ హైమా రెడ్డి తదితరులు హాజరయ్యారు. ఈ నెల 21వ తేదీ నుంచి 31 వ తేదీ వరకు నిర్వహించిన పోలీస్ ఫ్లాడ్ డే కార్యక్రమాల సందర్బంగా ఈ పాటను విడుదల చేయడం సందర్భోచితంగా ఉందని డీజీపీ మహేందర్ రెడ్డి పేర్కొన్నారు. విధినిర్వహణలో పోలీసులు ఎదుర్కొనే కస్టాలు, ఇబ్బందులను వివరిస్తూనే పోలీసులు అందించే సేవలను స్ఫూర్తిదాయకంగా ఆవిష్కరించారని మహేందర్ రెడ్డి ప్రశంసించారు. మనం కష్టపడుతూ సేవలందిస్తుంటే మనతో ఎంతోమంది కలసి వస్తారనడానికి నిదర్శనం ఈ అద్భుతమైన పాటే నిదర్శనమని డీజీపీ అన్నారు. ఈ సందర్బంగా సంగీత దర్శకుడు, గాయకుడు ఎం.ఎం. కీరవాణి మాట్లాడుతూ, మాతృదేవోభవ, పితృ, ఆచార్య దేవోభవ అన్న మాదిరిగానే రక్షక దేవోభవ అనే రోజులు వస్తాయని, ఈ దిశగా పోలీసులు అందిస్తున్న సేవలను ప్రశంసించారు. తన తొమ్మిదేళ్ల వయస్సులో తొలి కార్యక్రమం రాయచూరులో పోలీస్ సంస్మరణ దినోత్సవం రోజునే ఇచ్చానని తెలియచేశారు. ఇస్తున్నా ప్రాణం మీ కోసం అనే పోలీసు త్యాగాలను తెలియచేసే పాటను 1998 సంవత్సరంలోనే అప్పటి డీజీపీలు దొర, రాములు కోరిక మేరకు స్వర పరచి పాడానని గుర్తు చేశారు. ఈ పాటను హిందీ భాషలో కూడా రూపొందిస్తానని కీరవాణి అన్నారు. ఈ సందర్బంగా ఈ పాట చాలా శ్రావ్యంగానూ, స్ఫూర్తి దాయకంగా ఉందని పోలీసు అధికారులు ప్రశంసించారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/37VdojC
v

Rajashekar Health: వైద్యుల పర్యవేక్షణలో రాజశేఖర్.. ఆయన ఆరోగ్య పరిస్థితిపై లేటెస్ట్ రిపోర్ట్

కరోనా సోకడంతో సీనియర్ హీరో ఇటీవలే హైదరాబాద్ లోని సిటీ న్యూరో సెంటర్ హాస్పిటల్‌లో చేరిన సంగతి తెలిసిందే. కొన్ని రోజులుగా కోవిడ్‌తో బాధపడుతున్న ఆయన మెల్లగా కోలుకుంటున్నారు. గత కొన్నిరోజులుగా ఆయన ఐసియూలోనే ఉండటంతో రాజశేఖర్ ఫ్యాన్స్ ఒకింత ఆందోళన చెందారు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ రోజు (శనివారం) ఆయన ఆరోగ్య పరిస్థితిపై హెల్త్ బులెటిన్ రిలీజ్ చేశారు వైద్యులు. ప్రస్తుతం రాజశేఖర్ ఆరోగ్యం నిలకడగా ఉందని తాజా రిపోర్ట్‌లో వెల్లడించారు. అనారోగ్యం నుంచి ఆయన కోలుకుంటున్నారని, ఆక్సిజన్ స్థాయిలు క్రమంగా మెరుగు పడుతున్నాయని తెలిపారు. ఆయన చికిత్సకు స్పందిస్తున్నారని, వైద్యులు నిరంతరం ఆయన ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తున్నారని తాజా బులెటిన్‌లో పేర్కొన్నారు. Also Read: ఇటీవలే తనతో పాటు తన ఫ్యామిలీ మొత్తం (ఇద్దరు కూతుళ్లు శివాత్మిక, శివాని, భార్య జీవిత) కరోనా బారిన పడ్డామని రాజశేఖర్ స్వయంగా పేర్కొనడంతో ఆయన అభిమానుల్లో ఆందోళన మొదలైంది. ఆ తర్వాత కొన్ని రోజుల్లోనే జీవిత, వాళ్ళ ఇద్దరు కూతుళ్లు కరోనా నుంచి కోలుకున్నప్పటికీ.. రాజశేఖర్ మాత్రమే ఇంకా కరోనాతో పోరాడుతూ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు. త్వరలో ఆయన పూర్తి ఆరోగ్యంతో తిరిగి రావాలని కోరుకుంటోంది సినీ లోకం.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2HK7I1k
v

Bigg Boss 4 Telugu: ఉత్కంఠకు తెరదించిన బిగ్ బాస్ మేనేజ్‌మెంట్.. కింగ్ ఈజ్ బ్యాక్.. ఇదిగో వీడియో

పక్కా.. ఈ వారం బిగ్ బాస్ సీజన్ 4 హోస్ట్‌గా మళ్ళీ నాగార్జుననే చూడబోతున్నాం. ఈ విషయాన్ని కన్ఫర్మ్ చేస్తూ బిగ్ బాస్ కోసం వస్తున్న వీడియో షేర్ చేసింది స్టార్ మా జయమాన్యం. దీంతో ఈ వారం బిగ్ బాస్ తెరపై అక్కినేని కోడలు పిల్ల సమంతనే మళ్ళీ మ్యాజిక్ చేస్తుందా? లేక ఆమె స్థానంలో వేరే ఎవరైనా వస్తారా? అనే ప్రశ్నలకు ఫుల్‌స్టాప్ పడింది. బిగ్ బాస్ టీం నాగార్జునకు స్పెషల్ ఫ్లైట్ అరేంజ్ చేసి రప్పించిందని టాక్. నాగార్జున తన కొత్త సినిమా 'వైల్డ్ డాగ్' షూటింగ్ నిమిత్తం మనాలి వెళ్లిన సంగతి తెలిసిందే. అక్కడే లాంగ్ షెడ్యూల్ ప్లాన్ చేయడంతో మూడు వారాలపాటు తిరిగి రానని కన్ఫర్మ్ చేస్తూ స్వయంగా వీడియో వదిలారు. దీంతో ఆ మూడు వారాలు బిగ్ బాస్ పరిస్థితి ఏంటి? అనే ఆలోచనలో పడిన ఆడియన్స్‌ని గత వారం అక్కినేని కోడలు సమంత అలరించింది. హోస్ట్‌గా తొలిసారి చేసిన సామ్.. బుల్లితెర ప్రేక్షకుల చేత భేష్ అనిపించుకుంది. కాకపోతే కొంతమంది నెటిజన్స్ మాత్రం అది చూసి బిగ్ బాస్ పూర్తిగా అక్కినేని ఫ్యామిలీ షో అయిందని విమర్శించారు. Also Read: దీంతో ఈ వారం సమంత స్థానంలో రోజా వస్తుందనే టాక్ కూడా బయటకొచ్చింది. కానీ ఈ పరిస్థితి గమనించిన నాగార్జున తానే స్వయంగా వచ్చి బిగ్ బాస్ షూట్ చేసుకొని వెళ్లిపోతానని చెప్పారట. ఈ మేరకు మనాలి నుంచి ఆయన ప్రత్యేకంగా హెలికాఫ్టర్‌లో బయల్దేరిన వీడియో షేర్ చేసి.. ఈ రోజు (శనివారం) రాత్రి 9 గంటలకు బిగ్ బాస్ తెరపై నాగార్జుననే చూడబోతున్నాం అని తెలిపింది బిగ్ బాస్ మేనేజ్‌మెంట్. ఈ మేరకు 'కింగ్ ఈజ్ బ్యాక్' అంటూ ఆసక్తికర ట్యాగ్ లైన్ జోడించి బిగ్ బాస్ అభిమానులను హూషారెత్తించారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/35TH0LF
v

ఆ వయసులోనే లైంగిక దాడి.. ఇండస్ట్రీలో సెక్సువల్ ఫేవర్ మస్ట్! గుట్టు బయటపెట్టిన సినీ నటి

చిత్రసీమలో మహిళలపై లైంగిక వేధింపులు జరుగుతున్నాయని, అవకాశాల పేరుతో అమ్మాయిలను వంచిస్తున్నారని ఇప్పటికే ఎందరో సినీ తారలు ఓపెన్ అయిన సంగతి తెలిసిందే. తాజాగా ఆ లిస్టులో బాలీవుడ్ నటి, 'దంగల్' ఫేమ్ చేరింది. తనకు సినీ ఇండస్ట్రీలో దారుణమైన అనుభవాలు ఎదురయ్యాయని పేర్కొంటూ సంచలన విషయాలు బయటపెట్టింది. ఓ బాలీవుడ్ మీడియాతో మాట్లాడిన ఫాతిమా సనా షేక్.. తన జీవితంలో జరిగిన భయంకర విషయాలు వెల్లడిస్తూ ఓపెన్ అయింది. సెక్సువల్ ఫేవర్ అనేది లేనట్లయితే ఇండస్ట్రీలో నిలబడటం చాలా కష్టమనే విషయాన్ని తనకు ఎంతోమంది చెప్పారని, వాళ్లంతా చెప్పినట్లుగానే తాను చాలా దారుణమైన పరిస్థితులు ఎదుర్కొన్నానని చెప్పుకొచ్చింది. సెక్సువల్ ఫేవర్ తిరస్కరించడంతో కొన్ని సందర్భాల్లో మంచి మంచి అవకాశాలు కూడా కోల్పోయానని తెలిపింది. Also Read: మహిళలపై లైంగిక వేధింపులు అనేవి కేవలం సినీ ఇండస్ట్రీలోనే కాదు.. అన్ని రంగాల్లోనూ ఉన్నాయని ఫాతిమా చెప్పింది. తాను మూడేళ్ల వయసులోనే వేధింపులకు గురయ్యాను అంటూ ఆవేదన వ్యక్తం చేసింది. దాన్నిబట్టే సెక్సిజం అనేది ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోండి అని ఆమె పేర్కొంది. కాకపోతే ఇప్పుడు చేస్తున్న పోరాటాలతో పరిస్థితులు మారుతున్నాయని, భవిష్యత్తు బాగుంటుందనే నమ్మకం తనకుందని తెలిపింది. బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్ 'దంగల్' మూవీలో గీతా ఫొగట్ పాత్రలో అద్భుతంగా నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది ఫాతిమా. 1997లో చైల్డ్ ఆర్టిస్ట్‌గా కెరీర్ ఆరంభించిన ఆమె పలు సినిమాలతో పాటు బుల్లితెర ప్రేక్షకులనూ అలరించింది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3jLvNBy
v

విడుదలకు రెడీ అయిన రొమాంటిక్ ఎంటర్‌టైనర్ 'మెరిసే మెరిసే'.. అంతా సిద్ధం!!

ప్రస్తుతం యూత్‌ని అలరించే సినిమాలకు డిమాండ్ ఎక్కువగా ఉంది. అది చిన్న సినిమా అయినా సరే కంటెంట్ బాగుందంటే చాలు యూత్ ఆడియన్స్ అంతా ఆదరించి ఆ చిత్రాన్ని సూపర్ హిట్ చేసేస్తున్నారు. తాజాగా అదేబాటలో అందరినీ ఆకట్టుకునే కథాంశంతో యూత్‌ఫుల్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది '' మూవీ. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీ తాజాగా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా ఫినిష్ చేసుకొని విడుదలకు రెడీ అయింది. చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా ఇప్పటికే విడుదలైన ఫస్ట్‌లుక్ పోస్టర్ సినిమాపై అంచనాలు నెలకొల్పింది. హీరోహీరోయిన్ల స్టైలిష్ లుక్స్ యువతను ఆకట్టుకున్నాయి. కొత్తూరి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై ప్రొడక్షన్ నెంబర్ 1గా నిర్మాత వెంకటేష్ కొత్తూరి ఈ 'మెరిసే మెరిసే' మూవీ నిర్మిస్తున్నారు. కామెడీ, లవ్, ఎమోషన్స్‌తో కూడిన కథాంశానికి పదునుపెట్టి పవన్ కుమార్.కె దర్శకత్వం వహిస్తున్నారు. చిత్రంలో హుషారు ఫేమ్ హీరోగా నటిస్తుండగా, గతంలో 'మళ్ళీ మళ్ళీ చూశా' సినిమాతో అలరించిన హీరోయిన్‌గా నటిస్తోంది. Also Read: మెరిసే మెరిసే పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేశామని, అతి త్వరలో విడుదలకు సన్నాహాలు చేస్తున్నామని చెప్పిన డైరెక్టర్ పవన్ కుమార్.. ఈ చిత్రంలో హీరోహీరోయిన్ల నటన మేజర్ అట్రాక్షన్ అవుతుందని, ఇద్దరూ చాలా బాగా నటించారని చెప్పారు. తమ సినిమా ఫీల్ గుడ్ ఎంటర్‌టైనర్‌గా అన్నివర్గాల ప్రేక్షకులకు నచ్చే విధంగా ఉంటుందని ఆయన తెలిపారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/37WX0z3
v

Jawaharlal Nehru: నెహ్రూ బలహీనుడంటూ దుమారం రేపిన కంగనా రనౌత్.. మహాత్మా గాంధీపై సంచలన వ్యాఖ్యలు

బాలీవు‌డ్‌లో నెపోటిజం, డ్రగ్స్ మాఫియా రాజ్యమేలుతోందంటూ సెన్సేషన్ క్రియేట్ చేసిన ఫైర్ బ్రాండ్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచింది. ఈ సారి ఏకంగా జాతిపిత , భారత దేశ తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూలపై తనదైన కోణంలో కామెంట్స్ చేసి సంచలనం సృష్టించింది. ఈ రోజు (అక్టోబర్ 31) సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా ఆయనకు నివాళులు అర్పిస్తూ మరో కాంట్రవర్సీకి తెరలేపింది. వల్లభాయ్ పటేల్‌ని పొగుడుతూనే గాంధీ, నెహ్రూలపై విరుచుకుపడింది. భారత ఉక్కు మనిషి వల్లభాయ్ పటేల్‌కు జయంతి సందర్భంగా ప్రత్యేక శుభాకాంక్షలు అని తెలుపుతూ ట్వీట్ పెట్టిన కంగనా.. మాకు ఈ అఖండ భారత దేశాన్ని అందించిన మాహానుభావులు మీరు అని కొనియాడింది. మీ నాయకత్వంలో విడిపోయి ఉన్న 562 సంస్థానాలను ఏకం చేసి, అఖండ భారత దేశాన్ని నిర్మించడంతో పాటు దేశ ప్రజలకు స్వతంత్ర భారత దేశాన్ని అందించి ఎందరికో ఆదర్శంగా నిలిచారని పేర్కొంది. భారత్‌కు తొలి ప్రధాని అయ్యే అవకాశం మీదే అయినప్పటికీ.. బలహీనుడైన నెహ్రూకు ఆ పదవిని త్యాగం చేసిన మహా మనిషి మీరు అని తెలిపింది. పటేల్ ఒక నిజమైన ఉక్కు మనిషని కితాబునిచ్చింది. Also Read: ఇకపోతే గాంధీ గురించి పేర్కొంటూ సెన్సేషనల్ కామెంట్స్ చేసింది కంగనా రనౌత్. పటేల్ లాంటి ఉక్కు మనిషిని వదిలిపెట్టి నెహ్రూ లాంటి బలహీన మనస్తత్వం ఉన్న వ్యక్తిని గాంధీ కావాలనే తొలి ప్రధానిగా ఎంచుకున్నారని వ్యాఖ్యానించింది. నెహ్రూను ముందుంచి దేశాన్ని తను నడిపించాలనేది మంచి ప్రణాళిక అనుకున్నా కూడా గాంధీ మరణం తర్వాత దేశ పరిస్థితి అధ్వాన్నంగా తయారైందంటూ అగ్గి రాజేసింది కంగనా. నెహ్రూ ఇంగ్లిష్ బాగా మాట్లాడగలడని గాంధీ నమ్మకమని, అయితే ఈ నిర్ణయం వల్ల వల్లభాయ్ పటేల్ బాధపడలేదు.. కానీ, కొన్ని దశాబ్దాల పాటు దేశం మాత్రం ఇబ్బందులు ఎదుర్కొందని పేర్కొంటూ కంగన వరుస ట్వీట్స్ చేసింది. దీంతో ఆమె చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో దుమారం రేపాయి.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/35OKe2V
v

ఎక్కువ భాషల్లో రీమేక్ అయిన తెలుగు సినిమా... విదేశీయులూ ఫిదా

ఒక భాషలో హిట్ అయిన సినిమాలను ఇతర భాషల్లో రీమేక్ చేయడం చూస్తూనే ఉంటాం. కొన్ని సినిమాలను ఒకట్రెండు భాషల్లో తెరకెక్కిస్తే.. మరికొన్నింటిని ఇంకా ఎక్కువ భాషల్లోనూ తీస్తుంటారు. అయితే తెలుగు తెరపై స్వచ్ఛమైన ప్రేమకథగా తెరకెక్కి ఘనవిజయం సాధించిన ఓ సినిమా ఏకంగా ఆరు భారతీయ భాషలు, రెండు విదేశీ భాషల్లో రీమేక్ చేశారంటే నమ్మగలమా?. ఆ సినిమానే సిద్ధార్థ, జంటగా ప్రభుదేవా దర్శకత్వంలో తెరకెక్కిన ‘’. ఈ సినిమాలో సిద్ధార్ధ్, త్రిష నటన ఎప్పటికీ మర్చిపోలేనిది. దేవీశ్రీ ప్రసాద్‌ సంగీతం, సిరివెన్నెల సాహిత్యం, ఎమ్మెస్ రాజు నిర్మాణం ఈ సినిమా విజయాన్ని మరో మెట్టు ఎక్కించాయి. తెలుగులో బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టిన ఈ సినిమాను ఆ తర్వాత తమిళ, కన్నడ, ఒరియా, బెంగాలీ, పంజాబీ, హిందీ భాషలతో పాటు బంగ్లాదేశ్, నేపాల్‌లోనూ రీమేక్ చేయగా అక్కడా విజయం సాధించింది. దీంతో ఎక్కువ భాషల్లో రీమేక్ అయిన తెలుగు చిత్రంగా ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’ రికార్డు సృష్టించింది. ఈ చిత్రానికి కలెక్షన్లు, ప్రశంసలతో పాటు అవార్డులు కూడా భారీగా వచ్చాయి. తెలుగులో ఆల్‌టైమ్ హిట్‌గా నిలిచిన ఈ సినిమాకు ఐదు నంది అవార్డులు, 9 ఫిలింఫేర్ అవార్డులు, రెండు సంతోషం అవార్డులు కూడా వచ్చాయి.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3kWI3k0
v

మాల్దీవులకు పంపమని కోరిన నెటిజన్‌.. సోనూ కౌంటర్ అదుర్స్

లాక్‌డౌన్ సమయంలో సినీనటుడు చేసిన సాయం అతడిని రియల్ హీరోగా చేసిన సంగతి తెలిసిందే. లాక్‌డౌన్ ముగిసి సాధారణ పరిస్థితులు నెలకొన్నప్పటికీ సాయం అనే ఆశ్రయించిన వారికి తనకు చేతనైనంత చేస్తూ అండగా నిలుస్తున్నారు. ఆయన చేసిన సేవలకు మెచ్చి ఐక్యరాజ్యసమితి ప్రత్యేక అవార్డు కూడా ఇచ్చింది. మరోవైపు ఆయన చేస్తున్న సేవలను ఎగతాళి చేస్తూ కొందరు నెటిజన్లు విమర్శలు చేస్తున్నాడు. అయితే తనపై ఎన్ని ఆరోపణలు చేస్తున్నా వాటిని పట్టించుకోకుండా తనకు వీలైనంత సాయం చేస్తూనే ఉంటానని సోనూసూద్ చెబుతున్నారు. Also Read: ఈ క్రమంలోనే పార్థ్ అనే ఓ నెటిజన్‌ సోనూకు వెరైటీ రిక్వెస్ట్ పెట్టాడు. ‘సార్ నాకు మాల్దీవులకు వెళ్లాలని ఉంది. సాయండి’ అని సోనూసూద్‌ను ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశాడు. దీనికి తనదైన శైలిలో స్పందించిన సోనూ.. మీకు సైకిల్ కావాలా?.. రిక్షా కావాలా? అని కౌంటర్ వేశారు. ఆయన సమాధానంపై స్పందించిన నెటిజన్లు.. ‘సూపర్ రిప్లయ్ సార్’ అంటూ కామెంట్ చేస్తున్నారు. Also Read:


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/31V7gnC
v

13ఏళ్లకే రజినీకాంత్‌కు తల్లిగా నటించిన శ్రీదేవి.. ఏ సినిమానో తెలుసా?

అతిలోక సుందరి శ్రీదేవి.. తనదైన అందం, నటనతో తెలుగు, తమిళంతో పాటు బాలీవుడ్‌లోనూ అగ్ర హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన సంగతి తెలిసిందే. తమిళ సూపర్‌స్టార్ రజినీకాంత్‌తోనూ ఆమె ఎన్నో సినిమాల్లో నటించి హిట్ పెయిరా పేరు తెచ్చుకున్నారు. ఈ క్రమంలోనే ఓ సినిమాలో రజినీకి సవతి తల్లిగా నటించింది. అదీ 13ఏళ్ల వయసులోనే. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. Also Read: కె.‌బాల‌చం‌దర్‌ తెర‌కె‌క్కిం‌చిన ‌‘మూండ్రు ముడిచ్చు’‌ సినిమాలో 1976లో విడుదలైంది. ఇందులో కమల్‌హాసన్, స్నేహితులు. ఇద్దరూ శ్రీదేవిని ప్రేమించగా ఆమె మాత్రం కమల్‌ను ఇష్టపడుతుంది. ఈ క్రమంలోనే కమల్ చనిపోగా.. దానికి కారణంగా రజినీయే అని ఆమె భావిస్తుంది. దీంతో అతడిపై పగ తీర్చుకునేందుకు రజినీ తండ్రిని పెళ్లి చేసుకుని సవతి తల్లిగా మారుతుంది. ఆ తర్వాత‌ వచ్చిన అనేక సినిమాల్లో రజినీకాంత్, శ్రీదేవి జంటగా నటించి మెప్పించారు. Also Read:


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/37YCUo6
v

Friday 30 October 2020

బ్రతికుండగానే తాను చనిపోయానని చెప్పుకున్న హీరో.. కారణమిదే

అందాల నటుడు భౌతికంగా లేకపోయినా తెలుగు ప్రజల గుండెల్లో ఆయన ఎప్పటికీ ఆంధ్ర సోగ్గాడు చిరస్థాయిగా నిలిచిపోయారు. తనను అందంగా చూసిన ప్రేక్షకులు ముసలితనంగా చూడలేరన్న భావనతో స్వచ్ఛందంగానే సినిమాలకు స్వస్తి పలికారాయన. కాలేజీలో చదువుతున్నప్పుడే శోభన్‌బాబుకు ఎన్టీఆర్, ఏఎన్నార్ సినిమాలంటే పిచ్చి. కాలేజీకి డుమ్మా కొట్టి మరీ సినిమాలు చూసేవారంట. అక్కినేని నాగేశ్వరరావు నటించిన ‘కీలుగుర్రం’ ఆయన చూసిన మొదటి సినిమా. మల్లీశ్వరి సినిమాను ఏకంగా 22సార్లు చూశారంట. డిగ్రీ పూర్తయ్యాక మద్రాసులో లా కోర్సులో జాయిన్ అయిన ఖాళీ సమయాల్లో సినిమా అవకాశాల కోసం ప్రయత్నించేవారు. 1959లో ఎన్టీఆర్‌తో ‘దైవ బలం’ అనే సినిమాలో మొదటగా నటించారు. ఆ తర్వాత భక్త శబరి, భీష్మ, అభిమన్యు, శ్రీ శ్రీ శ్రీ మర్యాద రామన్న, మనుషులు మారాలి, సంపూర్ణ రామాయణం, కురుక్షేత్రం, డాక్టర్ బాబు, సోగ్గాడు, గోరింటాకు, శ్రావణ సంధ్య, దేవత, కార్తీకదీపం, ముందడుగు, మహాసంగ్రామం స్వయంవరం, సంపూర్ణ ప్రేమాయణం, సంసారం, సర్పయాగం లాంటి చిత్రాల్లో నటించి తెలుగు ప్రేక్షకుల గుండెల్లో సోగ్గాడిగా నిలిచిపోయారు. కోడె త్రాచు, ఇల్లాలు ప్రియురాలు వంటి చిత్రాలతో కోదండరామిరెడ్డి, శోభన్‌బాబు మధ్య మంచి స్నేహం ఏర్పడింది. సినీ పరిశ్రమ హైదరాబాద్‌కి వచ్చేసినప్పటికీ శోభన్‌బాబు మద్రాసులోనే ఉండిపోయారు. ఓసారి కోదండరామిరెడ్డి మద్రాస్ వెళ్లినప్పుడు శోభన్‌బాబును కలిశారట. ఏంటి సినిమాలు చేయడం లేదు.. నీ అభిమానులు ఫీలవుతున్నారు.. అని కోదండరామిరెడ్డి అడిగారట. అందుకు ఆయన స్పందిస్తూ..‘ ఆ అందాల నటుడు శోభన్‌బాబు ఎప్పుడో చనిపోయాడు. జుట్టు ఊడిపోయి, ముడతలు పడిన శరీరంతో నేను తెరపై కనిపించడం ఇష్టం లేదు. అందుకే ఇంట్లో ఉండాలనుకుంటున్నారు. నా అభిమానులు వచ్చినప్పుడు కూడా... ‘నేనింక సినిమాల్లో నటించను, ఎంతో దూరం నుంచి నా కోసం రాకండి’ అని చెప్పేశానంటూ కోదండరామిరెడ్డితో చెప్పారంట శోభన్‌బాబు. Also Read:


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3oCVKXT
v

'ఆర్‌ఆర్‌ఆర్‌' కోసం ఆలియా గాత్రం.. రాజమౌళి క్రేజీ ప్లాన్!

బాలీవుడ్‌ భామ నటిగానే కాదు సింగర్‌గానూ ఫేమసే. హైవే, హంప్టీ శర్మకీ దుల్హనియా.. తదితర చిత్రాల్లో తన గానంతో ఆలియా అలరించింది. అయితే మరోసారి ఆమె తన గాత్రంతో ప్రేక్షకులకు మైమరపించేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్‌చరణ్ మల్టీస్టారర్‌గా తెరకెక్కుతున్న పాన్ ఇండియా సినిమా ‘’. ఇందులో సీత పాత్రలో రామ్‌‌చరణ్‌కు జోడీగా ఆలియా నటిస్తోంది. ఈ సినిమాలో ఆలియా భట్‌, రామ్‌చరణ్‌పై ఓ పాట ఉంది. ఈ సాంగ్‌ను ఆలియా భట్‌తో పాడించాలని రాజమౌళి ప్లాన్ చేస్తున్నారట. అయితే తెలుగు, తమిళ భాషల పదాలను ఆమె ఉచ్ఛరించడం కష్టం కాబట్టి.. ఆ రెండు భాషల్లో వేరే వాళ్లతో పాడించి.. హిందీలో మాత్రం ఆలియాతో పాడించాలని అనుకుంటున్నారట. బాహుబలి సినిమాలతో బాలీవుడ్‌లోనూ క్రేజ్ తెచ్చుకున్న రాజమౌళి.. అక్కడి ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని ‘ఆర్ఆర్ఆర్’పై చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/34GALLC
v

మళ్లీ ట్విస్ట్ ఇచ్చిన బండ్ల గణేష్... రోజాపై ఆసక్తికర కామెంట్

ఎప్పుడూ ఏదొక వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలిచే సినీనటుడు, నిర్మాత బండ్ల గణేష్‌ మళ్లీ ట్విస్ట్ ఇచ్చారు. వైసీపీ ఎమ్మెల్యే, ఏపీఐఐసీ చైర్ పర్సన్ రోజాకు ఆయనకు మధ్య కొంతకాలం క్రితం టీవీ లైవ్ డిబేట్‌లో జరిగిన గొడవ అందరికీ తెలిసిందే. ప్రత్యక్ష ప్రసారంలో ఉన్నామన్న సోయి లేకుండా ఇద్దరూ బూతులతో రెచ్చిపోయారు. అప్పటి నుంచి వీరిద్దరికి మాటలు లేవు. అయితే తాజాగా ఓ ప్రైవేట్ కార్యక్రమానికి హాజరైన వీరిద్దరు హాయిగా నవ్వుతూ ఫోటోకు ఫోజులిచ్చారు. Also Read: ఆ ఫోటోను తన ట్విటర్ అకౌంట్లో పోస్ట్ చేసిన ... చాలాకాలం తర్వాత గారినిక కలిశానని.. ఆమె కెరీర్ మరింత విజయవంతం కావాలని, ఆమెకు ఆరోగ్య, ఐశ్వర్యాలు లభించాలని కోరుకుంటున్నట్లు ట్వీట్ చేశారు. కొంతకాలం క్రితం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీద రోజా వ్యాఖ్యల నేపథ్యంలో వీరిద్దరి మధ్య మాటలయుద్ధం నడిచిన సంగతి తెలిసిందే. Also Read:


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/31Xyl9P
v

ఒక్క ఎపిసోడ్ కూడా చూడకుండానే చేశా..అంతా మామ వల్లే: సమంత

బిగ్‌బాగ్-4 సీజన్‌లో మెరుపులా దర్శనమిచ్చింది అక్కినేని వారి కోడలు సమంత. దసరా రోజును ఏకంగా మూడు గంటల పాటు హోస్టింగ్‌ చేసి మామను మించిన కోడలు అంటూ బుల్లితెర ప్రేక్షకులతో శభాష్ అనిపించుకుంది. మరికొంతమంది అయితే నాగార్జున కంటే సమంతే బాగా హ్యాండిల్ చేసిందని, ఆమెను వ్యాఖ్యాతగా కొనసాగించాలంటూ డిమాండ్ కూడా చేశారు. లేకపోతే బిగ్‌బాస్-5 సీజన్‌కు ఆమెను పూర్తిస్థాయిలో హోస్ట్‌గా తీసుకోవాలని సూచనలు కూడా చేసేస్తున్నారు. అయితే ఇంత పెద్ద రియాలిటీ షోను అంత బాగా హ్యాండిల్ చేసిందంటే.. ఆమె రోజూ బిస్‌బాస్ షో చూస్తూ హార్డ్‌వర్క్ చేసిందని అందరూ అనుకున్నారు. Also Read: అయితే తాను షో చేసేటప్పటికి బిగ్‌బాస్ ఒక్క ఎపిసోడ్ కూడా చూడలేదని చెప్పింది సమంత. బిస్‌బాస్‌‌కు హోస్టింగ్‌ చేయడంపై ఆమె ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా స్పందించింది. ‘ఎప్పటికీ గుర్తుంచుకోవాల్సిన అనుభవం. ‘బిగ్‌బాస్’ కార్యక్రమానికి హోస్ట్‌గా వ్యవహరిస్తానని ఎప్పుడూ అనుకోలేదు. కేవలం మామగారి వల్లే హోస్ట్‌గా వచ్చా. ఆ కార్యక్రమాన్ని హోస్ట్ చేసేందుకు ముందు నేను ఎన్నో భయాలను అధిగమించాల్సి వచ్చింది. ఇంతకుముందు నేను ఏ కార్యక్రమానికీ హోస్ట్‌గా వ్యవహరించలేదు. తెలుగు పెద్దగా రాదు. ఇంతకు ముందు బిగ్‌బాస్‌ ఒక్క ఎపిసోడ్ కూడా చూడలేదు. నా మీద నమ్మకముంచి నన్ను పోత్సహించినందుకు ధన్యవాదాలు మామ. ఆ ఎపిసోడ్ తర్వాత నాపై ప్రేమ కురిపించిన ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు’ అని సమంత పేర్కొంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/35Q6t8D
v

మారేడుమిల్లి ఫారెస్ట్‌కి వెళ్తున్న ‘పుష్ప’... భారీ షెడ్యూల్‌కు ఏర్పాట్లు

సుకుమార్- అల్లు అర్జున్‌ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘’ షూటింగ్‌ త్వరలోనే ప్రారంభం కానుంది. దీనికోసం యూనిట్ అడవిలోకి ప్రవేశించనుంది. మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మించనున్న ఈ సినిమా షూటింగ్ డిసెంబర్ 6 నుంచి షురూ కాబోతోందని తెలుస్తోంది. ఇందుకోసం మారేడుమిల్లి ఫారెస్ట్‌లో అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఎర్రచందనం అక్రమ రవాణా నేపథ్యంలో సాగే కథ కావడంతో కచ్చితంగా అడవుల్లోనే ఎక్కువ భాగం చిత్రీకరించాల్సి ఉంది. ఇందులో అల్లు అర్జున్‌ పుష్పరాజ్‌ అనే యువకుడిగా మాస్‌ పాత్రలో కనిపించనున్నాడు. పాన్‌ ఇండియా స్థాయిలో రూపొందబోతున్న ఈ చిత్రంలో అల్లు అర్జున్‌ సరసన రష్మిక మందానా నటిస్తోంది. ఈ సినిమా కోసం ఇద్దరూ చిత్తూరు యాసలో ట్రైనింగ్‌ తీసుకున్నారు. మారేడుమిల్లి అడవుల్లో నెల రోజుల పాటు కీలక సన్నివేశాలతో పాటు ఓ పాట కూడా షూట్ చేయనున్నట్లు యూనిట్ చెబుతోంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/320WKeu
v

ఘనంగా కాజల్, గౌతమ్ పెళ్లి: మెరిసిపోతున్న చందమామ.. ఫొటో వైరల్

టాలీవుడ్ అందాల చందమామ , వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లు వివాహ బంధంతో ఒక్కటయ్యారు. వీరి వివాహం శుక్రవారం రాత్రి ముంబైలోని తాజ్ మహల్ ప్యాలస్‌లో ఘనంగా జరిగింది. నూతన దంపతులు కాజల్-గౌతమ్ ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వైరల్ ఫొటోలో కాజల్ అగర్వాల్, గౌతమ్ సంప్రదాయ దుస్తుల్లో మెరిసిపోతున్నారు. కాజల్ లేత ఎరుపు రంగు లెహంగా ధరించగా.. గౌతమ్ లేత గులాబీ రంగు షేర్వాణీలో హుందాగా కనిపిస్తున్నారు. కాజల్ పెళ్లి మండపం కూడా చాలా అందంగా ఉంది. మొత్తం పువ్వులతోనే డెకరేట్ చేశారు. నూతన దంపతుల వెనుక లేత ఎరుపు రంగు గులాబీ పువ్వులతో డెకరేట్ చేశారు. ఇక అతిథులు కూర్చునే కుర్చీల చుట్టూ తెలుపు రంగు పువ్వులతో అలంకరించారు. ముంబైకి చెందిన వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లును వివాహం చేసుకుంటున్నట్టు అక్టోబర్ నెల ప్రారంభంలో కాజల్ అగర్వాల్ ప్రకటించిన విషయం తెలిసిదే. ఆయనతో నిశ్చితార్థం జరిగినట్టు ప్రకటించిన కాజల్.. ఆ ఫొటోలను మాత్రం ఫ్యాన్స్‌తో షేర్ చేసుకోలేదు. అక్టోబర్ 30న తమ వివాహం ముంబైలో జరగనున్నట్టు ప్రకటించారు. ఈ వివాహ వేడుక కోసం ఆమె అభిమానులు ఆసక్తిగా ఎదురుచూశారు. పెళ్లికి మూడు రోజులు ముందుగానే ముంబైలోని కాజల్ నివాసంలో ప్రీ వెడ్డింగ్ సందడి మొదలైంది. మెహందీ, హల్దీ, సంగీత్ వేడుకలను కుటుంబ సభ్యులు సందడిగా నిర్వహించారు. మెహందీ, హల్దీ ఫంక్షన్‌కు సంబంధించి కాజల్ ఫొటోలు ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈరోజు కూడా కాజల్, గౌతమ్ ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. కొవిడ్ నిబంధనలను పాటిస్తూ కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో కాజల్-గౌతమ్ వివాహం ఈరోజు రాత్రి ఘనంగా జరిగింది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3mIlfFv
v

పవన్ సినిమాలో కన్నడ స్టార్ హీరో.. అప్పుడు ఇందుకే కలిశారా?

ప్రత్యక్ష రాజకీయాల్లో పాల్గొనడం కారణంగా రెండేళ్ల పాటు సినిమాలకు దూరంగా ఉన్న పవర్ స్టార్ .. ‘వకీల్ సాబ్’ సినిమాతో మళ్లీ జోరు పెంచిన విషయం తెలిసిందే. ఆయన ఖాతాలో ఇప్పుడు నాలుగు సినిమాలు ఉన్నాయి. వీటిలో మలయాళ సూపర్ హిట్ ‘అయ్యప్పనుం కొషియుమ్’ రీమేక్ కూడా ఉంది. ఇటీవలే ఈ సినిమాకు సంబంధించి అధికారిక ప్రకటన వెలువడింది. ‘అప్పట్లో ఒకడుండేవాడు’ డైరెక్టర్ సాగర్ కె చంద్ర ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నారు. సితార ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ ఈ సినిమాను నిర్మించనున్నారు. ఈ సినిమాలు ఇద్దరు హీరోలుంటారు. మలయాళంలో పృథ్వీరాజ్ సుకుమారన్, బిజు మీనన్ నటించారు. తెలుగులో పవన్ కళ్యాణ్‌తో పాటు నటించే మరో హీరోను ఇంకా ఖరారు చేయలేదు. అయితే, ఈ హీరోకు సంబంధించి ఇప్పటికే బోలెడన్ని వదంతులు చక్కర్లు కొట్టాయి. ముఖ్యంగా రవితేజ పేరు బలంగా వినిపించింది. అయితే, ఇప్పుడు మరో నటుడి పేరు ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. ఆ నటుడు ఎవరో కాదు.. కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్. సుదీప్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. పవన్ కళ్యాణ్‌తో పోటీ పడే పాత్రలో ఆయన ఈజీగా నటించేస్తారు. అందుకే ఆయన్ని తీసుకున్నారని అంటున్నారు. మొన్నామధ్య పవన్ కళ్యాణ్‌ను సుదీప్ కలిశారు. అయితే, అప్పుడు పవన్‌ను ఆయన మర్యాద పూర్వకంగా కలిశారని ప్రకటించారు. కానీ, ఆ కలవడానికి కారణం ఈ సినిమానే అని ప్రెజెంట్ టాక్. మరి ఈ రూమర్‌లో నిజమెంతో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు ఆగాల్సిందే. ఇదిలా ఉంటే, ఈ సినిమాలో పవన్ కళ్యాణ్‌కు జోడీగా సాయి పల్లవి నటించనున్నారనే రూమర్ కూడా ఉంది. Also Read:


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3kLz3OW
v

Roja: సమంత అవుట్.. ఇక రోజాతో జబర్దస్తీ.. బిగ్ బాస్ టీమ్ భలే ప్లాన్ చేస్తోందే!

బుల్లితెర పాపులర్ షో బిగ్ బాస్ తెరపై దసరా సందర్భంగా సందడి చూసిన ఆడియన్స్.. ఈ వారం హల్చల్ చూడబోతున్నారని తెలుస్తోంది. నాగార్జున అందుబాటులో లేని కారణంగా ఆయన స్థానాన్ని భర్తీ చేస్తూ బిగ్ బాస్ హోస్ట్‌గా మెప్పించిన అక్కినేని కోడలు సమంత.. ఈ వారం కాస్త బిజీగా ఉన్న కారణంగా హోస్ట్‌గా చేయలేకపోతోందని టాక్. దీంతో మరో హోస్ట్ ఎవరిని తీసుకోవాలి? ఎవరితో అయితే బాగా ఆకట్టుకోవచ్చని ఆలోచన చేసిన యాజమాన్యం రోజా వైపు మొగ్గు చూపిందని సమాచారం. బిగ్ బాస్ సీజన్ 4 హోస్ట్‌గా చేస్తున్న నాగార్జున తన కొత్త సినిమా 'వైల్డ్ డాగ్' షూటింగ్ నిమిత్తం మనాలి వెళ్లారు. అక్కడే లాంగ్ షెడ్యూల్ ప్లాన్ చేయడంతో మూడు వారాలపాటు తిరిగి రానని కన్ఫర్మ్ చేస్తూ స్వయంగా వీడియో వదిలారు. దీంతో బిగ్ బాస్ హోస్ట్ సంగతేంటి? అని ప్రేక్షకులు ఆలోచించే లోపే సమంత పేరును అనౌన్స్ చేసి హుషారెత్తించింది బిగ్ బాస్ టీమ్. గత వారం మామ నాగార్జున స్థానాన్ని భర్తీ చేస్తూ బిగ్ బాస్ హోస్ట్‌గా పలువురి ప్రశంసలందుకుంది సమంత. Also Read: దీంతో మరో రెండు వారాలు సమంతనే హోస్ట్‌‌గా చేస్తే బెటర్ అని బుల్లితెర ప్రేక్షకులు భావిస్తుండగా.. సడెన్‌గా రోజా పేరు తెరపైకి వచ్చింది. ఈ వారం సమంత బిజీగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయని, దీంతో ముందు జాగ్రత్తగా రోజాను సంప్రదించి బిగ్ బాస్ హోస్ట్‌గా చేసేందుకు అంగీకారం తీసుకున్నారనే సమాచారం చెక్కర్లు కొడుతోంది. ఇలా మరోసారి బిగ్ బాస్ హోస్ట్ విషయమై ఉత్కంఠ నెలకొంది. Also Read: గత సీజన్‌లో కూడా నాగార్జున స్థానంలో రమ్యకృష్ణ గెస్ట్ హోస్ట్‌గా అదరగొట్టింది. అదేబాటలో రీసెంట్‌గా బిగ్ బాస్ తెరపై సమంత సత్తా చాటింది. మరి రోజాకు ఎలాగూ పలు షోలకు జడ్జిగా చేసిన అనుభవం ఉంది కాబట్టి ఆమె కూడా స్పెషల్‌గా అలరించడం ఖాయమే అని జనాల్లో టాక్ మొదలైంది. సో.. చూడాలి మరి ఈ వారం హవా సమంతదేనా లేక రోజాదా? అనేది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2TElJje
v

8 ఏళ్ల తరవాత తెలుగులోకి సిద్ధార్థ్.. వచ్చే నెల నుంచి ఫుల్ బిజీ

‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’, ‘బొమ్మరిల్లు’ వంటి బ్లాక్ బస్టర్ సినిమాలతో తెలుగు ప్రేక్షకుల మనసులు గెలుచుకున్న హీరో సిద్ధార్థ్.. సుధీర్ఘ విరామం తరవాత మళ్లీ తెలుగు తెర మీద మెరవబోతున్నారు. RX 100 ఫేమ్ అజయ్ భూపతి దర్శకత్వంలో రూపొందనున్న ‘మహాసముద్రం’ సినిమాలో ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. శర్వానంద్, అదితీరావు హైదరి ప్రధాన పాత్రలు పోషిస్తోన్న ఈ సినిమాను ఏకే ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ వచ్చే నెల నుంచి ప్రారంభం కానుంది. ఇదిలా ఉంటే, ఈ సినిమాలో నటిస్తుండటంపై సిద్ధార్థ్ ట్విట్టర్ ద్వారా శుక్రవారం స్పందించారు. 8 ఏళ్ల తరవాత ‘మహాసముద్రం’ సినిమాతో మళ్లీ తెలుగు చిత్ర సీమలోకి అడుగుపెడుతున్నట్టు ఆయన పేర్కొన్నారు. వచ్చే నెల నుంచి ‘మహాసముద్రం’ షూటింగ్‌లో పాల్గొంటానని తెలిపారు. తాను చెప్పినట్టుగానే మళ్లీ తెలుగులో సినిమా చేస్తున్నానని, అద్భుతమైన టీమ్, సహ నటులతో కలిసి పనిచేయబోతున్నానని సిద్ధార్థ్ వెల్లడించారు. చాలా ఆనందంగా ఉందని.. ప్రేక్షకుల దీవెనలు తనకు కావాలని సిద్ధార్థ్ కోరుకున్నారు. కాగా, లాక్‌డౌన్ కారణంగా సుమారు ఎనిమిది నెలలు ఖాళీగా ఉన్న సిద్ధార్థ్.. ఇకపై ఫుల్ బిజీ అయిపోనున్నారు. ఈ విషయాన్ని కూడా ఆయనే వెల్లడించారు. వరుస ప్రాజెక్టులతో క్షణం తీరిక లేకుండా ఆయన గడపనున్నారు. నెట్‌ఫ్లిక్స్ ప్రకటించిన ‘నవరస’ అనే తమిళ సంకలనంలో సిద్ధార్థ్ నటిస్తున్నారు. ఈ సంకలనంలో భాగంగా 9 షార్ట్ ఫిల్మ్స్‌ను నిర్మించనున్నారు. ఈ 9 సినిమాలను ప్రముఖ దర్శకుడు మణిరత్నం, క్యూబ్ సినిమా అధినేత జయేంద్ర పంచపకేసన్ సమర్పిస్తున్నారు. సిద్ధార్థ్ కూడా ఈ నిర్మాణంలో భాగం కానున్నారు. రతీంద్రన్ ప్రసాద్ దర్శకత్వం వహించే ఈ 9 లఘు చిత్రాల్లో సూర్య, అరవింద్ స్వామి, విజయ్ సేతుపతి, రేవతి, నిత్యా మీనన్, పార్వతి, ఐశ్వర్య రాజేష్, పూర్ణ, రిత్విక, ప్రకాష్ రాజ్, సిద్ధార్థ్, గౌతమ్ కార్తీక్, అశోక్ సెల్వన్ వంటి సుమారు 40 మంది టాలెంటెడ్ యాక్టర్స్ నటించనున్నారు. నవరసాలు అయిన శృంగారం, వీరం, కరుణ, అద్భుతం, హాస్యం, భయానకం, బీభత్సం, రౌద్రం, శాంతం ఆధారంగా ఈ 9 లఘు చిత్రాలు ఉండనున్నాయి. ప్రస్తుతమైతే ‘ఎస్కేప్ లైవ్’ అనే హిందీ వెబ్ సిరీస్‌లో సిద్ధార్థ్ నటిస్తున్నారు. తమిళంలో సిద్ధార్థ్ నటించిన నాలుగు సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. వచ్చే ఏడాది ఈ సినిమాలు విడుదల కానున్నాయి. వీటన్నిటితో పాటు ‘మహాసముద్రం’ కూడా ఇప్పుడు సిద్ధార్థ్ ఖాతాలో చేరింది. మొత్తం మీద కొవిడ్ సిచ్యువేషన్ తరవాత సిద్ధార్థ్ బాబు బాగా బిజీ అయిపోయారు. Also Read:


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/37PQJFo
v

Kushboo: రజినీకాంత్ ఆరోగ్యంపై కుష్బూ ట్వీట్.. సంతోషం కంటే ఏదీ ముఖ్యమైంది కాదంటూ మెసేజ్

సూపర్ స్టార్ అనారోగ్య కారణాల వల్ల రాజకీయ అరంగేట్రం చేయడంలేదని పేర్కొంటూ ఇటీవల ఓ లేఖ సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. రజినీ రాజకీయాల్లోకి వెళ్లకుండానే రాజకీయాలకు గుడ్ బై చెప్పాలని భావిస్తున్నట్లుగా ఆ లేఖలో రాసి ఉండటంతో జనాల్లో చర్చలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో ఆ లేఖ విషయమై రియాక్ట్ అయిన రజినీకాంత్ ఆ లేఖ ఫేక్ అని తెలిపారు. అయినప్పటికీ ఆ లేఖలో పేర్కొన్నట్టు తన ఆరోగ్య పరిస్థితి బాగోలేకపోవడం మాత్రం నిజమేనని వెల్లడించారు. దీంతో అంతా రజినీ ఆరోగ్య పరిస్థితిపై ఆరా దీస్తున్నారు. Also Read: ఈ క్రమంలో తాజాగా సీనియర్ హీరోయిన్, బీజేపీ నాయకురాలు సుందర్ స్పందించారు. ''డియర్ రజినీకాంత్ సర్. మీరు వజ్రం లాంటి వారు. మాకు మీ ఆరోగ్యం, సంతోషం కంటే ఏదీ ముఖ్యమైంది కాదు. ఆరోగ్యపరంగా ఏది చేస్తే మీకు మంచి జరుగుతుందో అదే చేయండి. మీరు ఎపుడు ఎక్కడా ఏ పార్టీ పెట్టినా.. మీపై మాకున్న గౌరవంలో ఎలాంటి మార్పు ఉండదు. మా జీవితాంతం మిమ్మల్ని ఆరాధిస్తూనే ఉంటాము'' అంటూ ట్వీట్ చేశారు ఖుష్బూ. కాగా సోషల్ మీడియాలో వైరల్ అయిన ఫేక్ లెటర్‌లో రజినీకాంత్ ఇక రాజకీయాల్లోకి రారని, ఈ మేరకు ఆయన ఈ ఏడాది డిసెంబర్‌లో తన తుది నిర్ణయాన్ని వెల్లడిస్తారని రాసి ఉండటంతో ఈ ఇష్యూ జనాల్లో హాట్ టాపిక్ అయింది. 2017 డిసెంబర్‌లో రజినీకాంత్ తన పొలిటికల్ ఎంట్రీ కన్ఫర్మ్ చేశారు. అది జరిగి ఇప్పటికి మూడేళ్లు గడుస్తున్నా పార్టీని స్థాపించడంపై ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో రజినీకాంత్ చేయబోయే రాజకీయాలపై పెద్ద ఎత్తున చర్చలు నడుస్తున్నాయి.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/35MHSSe
v

సినీ రంగంలోకి ‘ఫోర్బ్స్’ యువ వ్యాపారవేత్త.. ఒకేసారి మూడు సినిమాల ప్రకటన

కొవ్వూరి సురేష్‌రెడ్డి.. యానిమేషన్‌ గేమింగ్ రంగంలో ఈ పేరు సుపరిచితమే. అంతే కాదు, ప్రపంచ ప్రఖ్యాత వ్యాపార పత్రిక ఫోర్బ్స్‌ ఇటీవల ప్రకటించిన 30 ఏళ్ళ లోపు వయసు గల అత్యంత ప్రభావశీలురైన వ్యక్తుల జాబితాలో చోటు దక్కించుకున్న యువ వ్యాపారవేత్త, ఏకైక తెలుగు వ్యక్తి సురేష్‌రెడ్డి. గత 13 ఏళ్ళుగా ‘క్రియేటివ్‌ మెంటార్స్‌ యానిమేషన్‌ అండ్‌ గేమింగ్‌ కాలేజీ’ మేనేజింగ్‌ డైరెక్టర్‌ (ఎండీ)గా ఉన్నారు. ఆ కాలేజీ వ్యవస్థాపకులు ఆయనే. అలాగే, ప్రసాద్ ల్యాబ్స్ సహకారంతో ఫిలిం స్కూల్ నిర్వహిస్తున్నారు. ఎంతోమంది యానిమేటర్లుగా ఎదగడంలో ఆయన పాత్ర ఉంది. అటువంటి సురేష్‌రెడ్డి ఇప్పుడు తెలుగు చిత్ర పరిశ్రమలోకి ప్రవేశించారు. ‘పి19 ఎంటర్‌టైన్‌మెంట్‌’ సంస్థను స్థాపించిన ఆయన, శుక్రవారం నాడు మూడు చిత్రాలను ప్రకటించారు. ‘పి19 ఎంటర్‌టైన్‌మెంట్‌’లో ప్రొడక్షన్‌ నెం.1గా రూపొందనున్న చిత్రానికి ‘సూపర్‌స్టార్‌ కిడ్నాప్‌’, ‘పేపర్‌ బోయ్‌’ చిత్రాలకు దర్శకత్వ శాఖలో పని చేసిన ఆకాష్‌రెడ్డి దర్శకత్వం వహించనున్నారు. ‘ఛోరి’, ‘మరోజన్మ’, ‘ప్యూర్‌ సోల్‌’ వంటి అవార్డ్‌ విన్నింగ్‌ షార్ట్‌ ఫిల్మ్స్‌ రూపొందించిన ఆకాష్‌రెడ్డి, ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ‘పి19 ఎంటర్‌టైన్‌మెంట్‌’లో ప్రొడక్షన్‌ నెం.2గా రూపొందనున్న చిత్రానికి ఉత్తమ కథారచయితగా ‘ఋషి’కి గాను నంది పురస్కారంతో పాటు దర్శకుడిగా దాదా సాహెబ్‌ ఫాల్కె ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో పురస్కారం అందుకున్న రాజ్‌ మాదిరాజు దర్శకత్వం వహించనున్నారు. ‘ఋషి’ చిత్రానికి పలు జాతీయ, అంతర్జాతీయ పురస్కారాలు వచ్చాయి. ‘ఆంధ్రాపోరి’, ‘ఐతే 2.0’ చిత్రాలకు రాజ్‌ మాదిరాజు దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని ఎన్నారై రవికాంత్‌ జామితో కలిసి సురేష్‌రెడ్డి కొవ్వూరి నిర్మించనున్నారు. ‘పి19 ఎంటర్‌టైన్‌మెంట్‌’లో ప్రొడక్షన్‌ నెం.3గా రూపొందనున్న చిత్రానికి దర్శకుడు పూరి జగన్నాథ్‌ శిష్యుడు, ఆయన దగ్గర ఆరు చిత్రాలకు పని చేసిన ప్రదీప్‌ మద్దాలి దర్శకత్వం వహించనున్నారు. ఇంతకు ముందు ‘పెళ్ళి గోల’ వెబ్‌ సిరీస్‌, జీ5 ఓటీటీలో ఎక్స్‌క్లూజివ్‌గా విడుదలైన ‘47 డేస్‌’ సినిమాకు ఆయన దర్శకత్వం వహించారు. ఈ సినిమాకు రమేష్‌ ప్రసాద్‌ సమర్పకులు. హైదరాబాద్‌లోని ప్రసాద్‌ ల్యాబ్స్‌లో శుక్రవారం జరిగిన కార్యక్రమంలో ఈ మూడు చిత్రాలను ప్రకటించారు. మూడు చిత్రాల ప్రీలుక్స్‌, లోగోలను కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన ప్రసాద్స్ గ్రూప్ చైర్మన్ అక్కినేని రమేష్ ప్రసాద్, ప్రముఖ నిర్మాత ‘దిల్‌’ రాజు ఆవిష్కరించారు. ప్రముఖ ఆర్థోపెడిక్స్‌ డాక్టర్‌ దశరథరామిరెడ్డి, తెలుగు ఫిల్మ్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ సెక్రటరీ కె.ఎల్‌. దామోదర ప్రసాద్‌, నిర్మాత రాజ్‌ కందుకూరి, జీ5లో హెడ్ క్రియేటివ్, కంటెంట్‌ యాక్వేషన్ నిమ్మకాయల ‌ప్రసాద్, దర్శకులు రాజ్‌ మాదిరాజు, ప్రదీప్‌ మద్దాలి, ఆకాష్‌రెడ్డి, ‘పీ19 ఎంటర్‌టైన్‌మెంట్‌’ అధినేత కొవ్వూరి సురేష్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సినిమా లోగోలు ఆవిష్కరించిన అనంతరం రమేష్‌ ప్రసాద్‌ మాట్లాడుతూ.. ‘‘నేను ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నానంటే కారణం మా నాన్న ఎల్వీ ప్రసాద్‌గారే. ఆయన సంపాదించినదంతా సినిమాల్లోనే పెట్టారు. మాకు హైదరాబాద్‌, చెన్నైలో స్టూడియోలు ఉన్నాయి. ముంబై, కలకత్తాలో ఆఫీసులు ఉన్నాయి. నా జీవితమంతా సినిమాతో ముడిపడి ఉంది. మేం ప్రసాద్‌ ప్రొడక్షన్స్‌లో కొన్ని సినిమాలు నిర్మించాం. ఇంకా నిర్మిస్తాం. మేం చిత్రనిర్మాణం కొనసాగించాలని అనుకుంటున్నాం. ఈ రోజు మూడు చిత్రాలు ప్రారంభించడం సంతోషంగా ఉంది’’ అని అన్నారు. ‘దిల్‌’ రాజు మాట్లాడుతూ.. ‘‘కొవిడ్‌‌తో ప్రపంచం మొత్తం షేక్‌ అవుతుంటే మా రమేష్‌ ప్రసాద్‌గారు మళ్ళీ ఫిల్మ్‌ ఇండస్ట్రీకి ఎనర్జీగా 84 ఏళ్ళ వయసులో మూడు సినిమాల ప్రొడక్షన్‌ మొదలుపెట్టడం మామూలు విషయం కాదు. ఎల్వీ ప్రసాద్‌గారు సినిమా ఇండస్ట్రీకి చేసిన సేవలను ఆయన ఇప్పటికీ కొనసాగిస్తున్నందుకు థ్యాంక్స్‌ చెబుతున్నాను. చివరి శ్వాస వరకూ సినిమాతో ఉంటానని ఆయన చెప్పారు. ఎల్వీ ప్రసాద్‌ గారు వాళ్ళకు ఇచ్చిన ఆస్తి అదే. ఇవాళ కొత్త వాళ్ళతో కొత్త ప్రయత్నం చేస్తున్నారు. సురేష్‌రెడ్డిగారి ఆధ్వర్యంలో రాజ్‌ మాదిరాజు, ప్రదీప్‌, ఆకాష్‌ను దర్శకులుగా పెట్టుకుని మూడు సినిమాలు మొదలుపెట్టారు. ఈ రోజు సినిమా అనేది చాలా మారిపోయింది. సినిమా బావుంటే ప్రేక్షకులు సెల్‌ ఫోనుల్లో కూడా చూసి ఆదరిస్తున్నారు. మీరు చేసే ఈ ప్రయత్నం సక్సెస్‌ఫుల్‌ కావాలని ఆశిస్తున్నా’’ అని అన్నారు. సురేష్‌రెడ్డి కొవ్వూరి మాట్లాడుతూ.. ‘‘మేం రెండేళ్ళ నుండి ఎన్నో కథలు విన్నాం. మాకు స్టోరీలు నేరేట్‌ చేసిన ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్‌. వరల్డ్‌ సినిమాకి తెలుగు సినిమా ఎంతో కాంట్రిబ్యూట్‌ చేస్తోంది. ఎంతోమంది యంగ్‌ ట్యాలెంటెడ్‌ పీపుల్‌ వస్తున్నారు. నేను ‘కంటెంట్‌ ఈజ్‌ ది ఫిల్మ్‌ (కింగ్‌)’ అనేది నమ్ముతాను. వచ్చే నాలుగేళ్ళల్లో 20 చిత్రాలను నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నాను. ఈ మూడు సినిమాల విషయానికి వస్తే... మా దర్శకులు ముగ్గురూ ఆల్రెడీ తమ కథలతో ఇంతకు ముందే ప్రూవ్‌ చేసుకున్నారు. వాళ్ళ కథలపై నమ్మకంతో సినిమాలు ప్రారంభించాం. ప్రదీప్‌ మద్దాలి సినిమా చిత్రీకరణ వచ్చే ఏడాది ఫిబ్రవరి 1న మొదలుపెట్టి, మార్చి 15కి పూర్తి చేయాలని సన్నాహాలు చేస్తున్నాం. రాజ్‌ మాదిరాజు సినిమా చిత్రీకరణ ఈ ఏడాది డిసెంబర్‌ 22న మొదలవుతుంది. వచ్చే ఏడాది జనవరి నెలాఖరుకి పూర్తవుతుంది. ఆ సినిమాను వచ్చే వేసవిలో విడుదల చేయాలనుకుంటున్నాం. ఆకాష్‌రెడ్డి సినిమా చిత్రీకరణ నవంబర్‌, డిసెంబర్‌ నెలల్లో పూర్తి చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. నటీనటులు, ఇతర సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో వెల్లడిస్తాం’’ అని తెలిపారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/37PFhto
v

కారెడ్డం ఆడమాకు పిలగో.. అసలు నీ కథ ఏంటి? అంటూ ఆదా శర్మ హాట్ కిక్

యంగ్ హీరోయిన్ లేటెస్ట్ మూవీ '?'. శ్రీ కృష్ణ క్రియేషన్స్ పతాకంపై విప్రా దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాకు గౌరీ కృష్ణ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇటీవలే షూటింగ్ కార్య‌క్ర‌మాలు ఫినిష్ చేసుకున్న ఈ మూవీ విడుద‌ల‌కు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా చిత్రంలోని `రామ‌స‌క్క‌నోడివిరో` అనే పాట‌ను రిలీజ్ చేశారు మేకర్స్. యమ హుషారెత్తిస్తున్న ఈ పాట‌ను ర‌ఘు కుంచె స్వ‌ర‌ప‌ర‌చ‌గా బండి స‌త్యం సాహిత్యాన్ని స‌మ‌కూర్చారు. మంగ్లీ ఆల‌పించ‌గా శేఖ‌ర్ మాస్ట‌ర్ కొరియోగ్ర‌ఫీ చేశారు. ఆదా శర్మ తన స్టెప్పులతో హాట్ కిక్కిచ్చింది. హీరోయిన్ ఆదా శర్మ మాట్లాడుతూ..``ఒక డిఫ‌రెంట్ కాన్సెప్ట్‌తో ఈసినిమా వ‌స్తోంది. నేను తెలుగులో చేసిన సినిమాల‌న్నీ కూడా ప‌ర్ఫార్మెన్స్‌కి స్కోప్ ఉన్న చిత్రాలే . అదే కోవ‌లో ఈ సినిమాలో కూడా న‌ట‌ను ప్రాధాన్య‌త ఉన్న పాత్ర చేశాను. అలాగే ఇందులో పాట‌కు శేఖ‌ర్ మాస్ట‌ర్ గారు మంచి స్టెప్స్ కూడా నాతో వేయించారు. క‌రోనా టైమ్‌లో స్టార్ట్ చేసి క‌రోనా టైమ్‌లో రిలీజ్‌కి రెడీ అవుతోన్న మొద‌టి సినిమా మాది. సినిమా చాలా బాగా వ‌చ్చింది. డైర‌క్ట‌ర్స్ ఎక్స్ లెంట్‌గా డీల్ చేశారు. అంద‌రికీ న‌చ్చే సినిమా అవుతుంది`` అన్నారు. Also Read: సంగీత ద‌ర్శ‌కుడు ర‌ఘు కుంచె మాట్లాడుతూ..``ఈ చిత్రంలో మొద‌ట పాట పెట్టాల‌నుకోలేదు. షూటింగ్ పూర్త‌య్యాక అనుకొని ఈ సాంగ్ చేశాం. బండి స‌త్యం గారు అద్బుత‌మైన సాహిత్యాన్ని స‌మ‌కూర్చారు. శేఖ‌ర్ మాస్ట‌ర్ గారు కంపోజ్ చేసిన స్టెప్స్ ఆదాశ‌ర్మ‌గారు అద‌ర‌గొట్టారు. నిర్మాత గౌరికృష్ణ గారు ఎక్క‌డా కాంప్ర‌మైజ్ కాకుండా సినిమాను నిర్మించారు. ద‌ర్శ‌కుల ప‌నితీరు ఏంటో ఈ పాట‌ తోనే తెలుసుకోవ‌చ్చు. ఇక ఈ పాండ‌మిక్ టైమ్‌లో ఈ సినిమా రావ‌డం కొంత సంతోషాన్ని క‌లిగించే విష‌యం`` అన్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/31YOnjP
v

శ్రీదేవి సోడా సెంటర్: మనోడు లైటింగ్ ఎడితే..! మెరిపిస్తానంటూ సుధీర్ బాబు ఎంట్రీ..

కెరీర్ ఆరంభం నుంచే జయాపజయాలతో కలిసి ప్రయాణం చేస్తున్న యంగ్ హీరో ఇటీవలే మల్టీస్టారర్ మూవీ 'V'తో ప్రేక్షకులను పలకరించిన సంగతి తెలిసిందే. అదే స్పీడుతో ప్రస్తుతం '' సినిమా చేస్తున్నారాయన. తాజాగా ఈ మూవీ ఫ‌స్ట్‌లుక్, మోష‌న్ పోస్టర్‌ రిలీజ్ చేసి ఆకట్టుకున్నారు మేకర్స్. ''మనోడు లైటింగ్ ఎడితే ఊరంతా మెరిసిపోద్ది'' అని పేర్కొంటూ ఈ మోష‌న్ పోస్టర్‌ను తన ట్విట్టర్ ఖాతా ద్వారా షేర్ చేశారు సుధీర్ బాబు. ఇప్పటికే విడుదల చేసిన ప్రీలుక్‌లో గోలీ సోడాల కేస్, జిమ్కీ లైట్లు, వైర్లు, మ‌ల్లెపూలు వంటి ఎలిమెంట్స్‌తో ఆడియెన్స్‌ చూపును తమ వైపుకు తిప్పుకున్న చిత్ర యూనిట్‌.. మళ్ళీ అదే పంధాని కొన‌సాగించారు. 'శ్రీదేవి సోడా సెంట‌ర్' మోష‌న్ పోస్ట‌ర్‌లో సుధీర్ బాబు సోడా ప‌ట్టుకొని ఉన్న స్టైలిష్ స్టిల్ అందరినీ బుట్టలో వేసుకుంటోంది. ఇందులో హీరో సుధీర్ బాబు లైటింగ్ మెన్ పాత్ర పోషిస్తున్నారు. చిత్రానికి సంబంధించిన రెగ్యుల‌ర్ షూటింగ్ న‌వంబ‌ర్‌ నెలలో మొద‌లు పెడుతున్న‌ట్లుగా నిర్మాత‌లు వెల్లడించారు. Also Read: ప‌లాస 1978 సినిమాతో అరంగేట్రంలోనే మంచి పేరు సంపాదించిన క‌రుణ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో ఈ 'శ్రీదేవి సోడా సెంటర్' సినిమా తెరకెక్కుతోంది. 70 ఎమ్ ఎమ్ ఎంట‌ర్ టైన్మెంట్స్ బ్యాన‌ర్‌పై ప్రొడ‌క్ష‌న్ నెం 4గా నిర్మితమవుతున్న ఈ చిత్రానికి విజ‌య్ చిల్లా, శ‌శిదేవిరెడ్డి నిర్మాతలుగా వ్యవహరించనున్నారు. ఈ ఇద్దరి నిర్మాణంలో వచ్చిన తొలి సినిమా 'భ‌లే మంచి రోజు'లో హీరోగా సుధీర్ బాబే నటించారు. మళ్ళీ అయిదేళ్ల తర్వాత ఇప్పుడు‌ సుధీర్ బాబు ఇదే బ్యాన‌ర్‌లో 'శ్రీదేవి సోడా సెంటర్' చిత్రం చేస్తున్నారు. మెలోడి కింగ్ మ‌ణిశ‌ర్మ సంగీతం అందిస్తున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/31Wm4SO
v

తప్పలేక ఒప్పుకున్నాను.. ఇదీ పునర్నవి మ్యారేజ్ సీక్రెట్

రెండు రోజులుగా అభిమానులను టెన్షన్ పెడుతూ వచ్చిన ఎట్టకేలకు తన మ్యారేజ్ సీక్రెట్‌ను బయటపెట్టింది. ఇదంతా తన వెబ్ సిరీస్ ప్రమోషన్ కోసమేనని స్పష్టం చేసేసింది. కాకపోతే వెబ్ సిరీస్ ప్రమోషన్ కోసం ఫ్యాన్స్ ఎమోషన్స్‌తో ఆటలు ఆడటం ఏంటి అని సోషల్ మీడియాలో పున్ను ఫాలోవర్లు ప్రశ్నిస్తున్నారు. తన కుడిచేతి వేలికి ఉన్న డైమండ్ రింగ్‌ను చూపిస్తూ తీసుకున్న ఫొటోను ఈనెల 28న పునర్నవి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ‘మొత్తానికి జరిగిపోయింది’ అని క్యాప్షన్ కూడా పెట్టింది. దీంతో అంతా పునర్నవికి పెళ్లి కుదిరిందని అనుకున్నారు. ఎంగేజ్‌మెంట్ రింగ్‌నే ఆమె చూపించిందని భావించారు. ఆ తరవాత రోజు తన పార్న్‌నర్‌ను కూడా చూపిస్తూ పున్ను మరో పోస్ట్ చేసింది. దీంతో పున్నుకు కాబోయే భర్త ఇతనే అంటూ ప్రచారం జరిగింది. Also Read: ‘‘రేపు బిగ్ అనౌన్స్‌మెంట్ ఉంది’’ అని పున్ను బేబీ పేర్కొనడంతో పెళ్లి తేదీ ప్రకటిస్తుందేమోనని చాలా మంది భ్రమపడ్డారు. కానీ, ఊహించినట్టే పున్ను అందరికీ షాక్ ఇచ్చింది. ఈ పెళ్లి గోల అంతా తన వెబ్ సిరీస్ ప్రసారం కోసం స్పష్టం చేసింది. నిజానికి ఈ విషయాన్ని ముందుగానే చాలా మంది ఊహించారు. పునర్నవి, యూట్యూబ్ స్టార్ పృథ్వీరాజ్ సంపర (ఉద్భవ్ రఘునందన్‌గా పేరు మార్చుకున్నారు) ప్రధాన పాత్రల్లో ఓటీటీ సంస్థ ‘ఆహా’ ఒక వెబ్ సిరీస్‌ను రూపొందించింది. హిందీ వెబ్ సిరీస్ ‘పర్మనెంట్ రూంమేట్స్’కు రీమేక్‌గా రూపొందిన ఈ వెబ్ సిరీస్‌కు ‘కమిట్‌మెంటల్’ అని టైటిల్ పెట్టారు. అయితే, ఈ వెబ్ సిరీస్ విషయం చాలా మందికి తెలీదు. అందుకే, ఈ వెబ్ సిరీస్ ప్రచారం కోసం మేకర్స్ కాస్త భిన్నంగా ఆలోచించారు. పున్నుతో ఈ నాటకం ఆడించారు. కానీ, ఈ వెబ్ సిరీస్ గురించి తెలిసినవాళ్లు పున్ను పెళ్లి నాటకం కచ్చితంగా ప్రచారంలో భాగమేనని కనిపెట్టేశారు. కాగా, నవంబర్ 13 నుంచి ‘ఆహా’లో అందుబాటులోకి రానున్న ‘కమిట్‌మెంటల్’ ఫస్ట్ లుక్‌ను శుక్రవారం విడుదల చేశారు. ఈ పోస్టర్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన పున్ను.. ‘‘తప్పలేక ఒప్పుకున్నాను. ఇక ముందుంది అసలైన క్రేజీ రైడ్’’ అని పేర్కొన్నారు. మరోవైపు ఉద్భవ్ రఘునందన్ కూడా మరో ప్రచార చిత్రాన్ని ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు. తనకు పునర్నవి యస్ అని ఎందుకు చెప్పిందో త్వరలోనే ప్రేక్షకులు తెలుసుకుంటారని ఆయన పేర్కొన్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/31XYaGO
v

విజయ్ దేవరకొండ కొత్త బిజినెస్.. ఇచ్చట ఎలక్ట్రిక్ బైక్స్ అద్దెకు ఇవ్వబడును!

టాలీవుడ్ సెన్సేషనల్ హీరో మరో కొత్త వ్యాపారంలో భాగస్వామి అయ్యారు. హైదరాబాద్‌కు చెందిన వాట్స్ అండ్ వోల్ట్స్ మొబిలిటీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో ఆయన పెట్టుబడులు పెట్టారు. ఈ కంపెనీని విజయ్ మద్దూరి, కేదార్ సెలగంశెట్టి, వంశీ కారుమంచి నిర్వహిస్తున్నారు. శుక్రవారం హైదరాబాద్‌లో తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ ఆధ్వర్యంలో జరిగిన ఎలక్ట్రిక్ వెహికిల్ సమిట్‌లో ఈ కంపెనీ తమ బిజినెస్ ప్లాన్‌ను లాంచ్ చేసింది. వాట్స్ అండ్ వోల్ట్స్ కంపెనీ అందించే ఎలక్ట్రిక్ బైక్స్, స్కూటర్లను నగరవాసులు అద్దె చెల్లించి ఉపయోగించుకోవచ్చు. ప్రయాణించే దూరానికి తగినంత మొత్తం చెల్లించాల్సి ఉంటుంది. పర్యావరణ హితమైన ఈ ఎలక్ట్రానిక్ స్కూటర్లు, బైక్‌లతో కాలుష్యం తగ్గడంతో పాటు సమయం, డబ్బూ ఆదా కానున్నాయి. భవిష్యత్‌లో ఎలక్ట్రిక్ వెహికిల్స్‌కు మంచి డిమాండ్ ఏర్పడుతుందని, ఈ వాహనాల వల్ల రానున్న తరాలకు ఆరోగ్యవంతమైన పర్యావరణం అందుతుందని విజయ్ దేవరకొండ భావిస్తున్నారు. అందుకే వాట్స్ అండ్ వోల్ట్స్ సంస్థలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చినట్టు తెలిపారు. వచ్చే ఏడాది జనవరి నుంచి ఈ సంస్థ కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయి. కాగా, ఈ సదస్సులో మంత్రి కేటీఆర్ తెలంగాణ ఎలక్ట్రిక్ వెహికల్ పాలసీ 2020-30ని విడుదల చేశారు. Also Read:


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3jGCXau
v

Kajal Marriage Updates: పెళ్లి మండపానికి పయనమైన కాజల్.. నిషా అగర్వాల్ కంటతడి! ఫొటోలు వైరల్

టాలీవుడ్ చందమామ అగర్వాల్ పెళ్లి పీటలెక్కబోయే సుముహూర్తం దగ్గర పడింది. మరికొన్ని గంటల్లో పీటలపై కూర్చొని తన ప్రియుడు గౌతమ్‌ కిచ్లుతో మూడు ముళ్ళు వేయించుకోబోతోంది. దీంతో కాజల్ పెళ్లి ఫోటోలు నెట్టింట తెగ హంగామా చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఆమె పెళ్లి మండపానికి వెళ్తూ దిగిన కొన్ని పిక్స్ వైరల్ అయ్యాయి. అందంగా ముస్తాబైన ఈ పంచదార బొమ్మ అందరికీ హాయ్ చెబుతూ సంతోషంగా పెళ్లి మండపానికి బయల్దేరింది. తన తల్లి సుమన్ ‌అగర్వాల్‌తో కలిసి వివాహం జరగనున్న ‘తాజ్‌ ప్యాలెస్‌’ హోటల్‌కు పయనమైన కాజల్.. ముంబయిలోని తన నివాసం నుంచి బయటకొచ్చి అందరికీ అభివాదం తెలిపింది. విలేకర్లను నవ్వుతూ పలకరించడంతో వేలల్లో కెమెరా క్లిక్స్ ఆమెపై పడ్డాయి. తాజాగా అందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట షికారు చేస్తున్నాయి. ఇవి చూసి కాజల్‌కి పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలుపుతున్నారు నెటిజన్స్. ఈ రోజే (అక్టోబర్ 30) వ్యాపారవేత్త గౌతమ్‌ కిచ్లును పెళ్లాడనుంది కాజల్. ఈ నేపథ్యంలో గత 3 రోజుల నుంచే కాజల్, గౌతమ్ ఇళ్లలో పెళ్లితంతు సంబంధించిన కార్యక్రమాలు మొదలయ్యాయి. బుధవారం మెహందీ, గురువారం హల్దీ వేడుకలు కాజల్‌ నివాసంలో ఘనంగా జరిగాయి. ఈ వేడుకకు సంబంధించిన ఫొటోలను కాజల్ ఎప్పటికప్పుడు తన సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటోంది. ఈ క్రమంలోనే తన చెల్లెలు నిషా కంటతడి పెడుతున్న ఫొటోను ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో పోస్ట్ చేసింది కాజల్. అక్క కాజల్ కంటే ముందే పెళ్లి చేసుకున్న చెల్లెలు .. మెహందీ హల్ది వేడుకల్లో తీవ్ర భావోద్వేగానికి లోనైనట్లు తెలుస్తోంది. అక్కతో ఎప్పుడూ ఫ్రెండ్లీ ఉంటూ ఎంజాయ్ చేసే నిషా.. బాగా ఎమోషనల్ అయిందట. ఇకపోతే కరోనా కారణంగా కాజల్ వివాహ వేడుకకు కొద్దిమందిని మాత్రమే ఆహ్వానించారు. టాలీవుడ్ నుంచి కాజల్ బెస్ట్ ఫ్రెండ్, హీరో బెల్లంకొండ శ్రీనివాస్ ఈ వేడుకకు హాజరు కానున్నట్లు సమాచారం. ప్రస్తుతం కమల్ హీరోగా తెరకెక్కుతున్న `ఇండియన్-2`, మెగాస్టార్ చిరంజీవి హీరోగా రూపొందుతున్న `ఆచార్య` సినిమాలకు కమిటై ఉంది కాజల్. పెళ్లి తర్వాత ఈ సినిమాలు పూర్తిచేయడంతో పాటు కొత్త సినిమాలకు కూడా సైన్ చేస్తానని చెబుతోంది కాజల్ అగర్వాల్.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2HNpHDY
v

సుమంత్ అశ్విన్‌ సినిమాలో భూమిక.. శ్రీకాంత్‌తో కలిసి కీలక పాత్ర

నాలుగు పాత్రల చుట్టూ తిరిగే రోడ్ జ‌ర్నీ కాన్సెప్ట్‌తో గుర‌ప్ప ప‌ర‌మేశ్వర ప్రొడ‌క్షన్స్ పతాకంపై జి. మ‌హేష్ నిర్మిస్తోన్న తొలి చిత్రంలో అభిన‌యానికి అవ‌కాశం ఉన్న ఒక ప్రధాన పాత్రకు భూమిక‌ను ఎంపిక చేశారు. మిగ‌తా మూడు ప్రధాన పాత్రల‌ను సుమంత్ అశ్విన్‌, శ్రీ‌కాంత్‌, తాన్యా హోప్ పోషిస్తున్నారు. లాక్‌డౌన్ త‌ర్వాత గురువారం పునఃప్రారంభ‌మైన షూటింగ్‌లో ఆమె జాయిన్ అయ్యారు. గురుప‌వ‌న్ ద‌ర్శక‌త్వం వ‌హిస్తోన్న ఈ సినిమాకు ఇంకా టైటిల్ ఖరారు చేయలేదు. లాక్‌డౌన్‌కు ముందే ల‌డ‌ఖ్ షెడ్యూల్‌తో స‌హా 50 శాతం చిత్రీక‌ర‌ణ పూర్తి చేసుకున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైద‌రాబాద్‌లో కొవిడ్ నిబంధ‌న‌లు పాటిస్తూ జ‌రుగుతోంది. న‌లుగురు ప్రధాన పాత్రధారుల‌పై కీల‌క స‌న్నివేశాలు చిత్రీక‌రిస్తున్నారు. ఈ చిత్రంలో నటిస్తుండటంపై మాట్లాడుతూ.. ‘‘చాలా రోజుల త‌ర్వాత నేను సినిమా సెట్స్‌పైకి వ‌చ్చాను. శానిటైజ్ చేసుకుంటూ, మాస్క్‌లు ధ‌రిస్తూ, త‌ర‌చూ చేతులు శుభ్రం చేసుకుంటూ, అన్ని ర‌కాల జాగ్రత్తలు తీసుకుంటూ షూటింగ్ చేస్తున్నాం. మీ అంద‌రి ప్రేమానురాగాల‌ను కోరుకుంటున్నాం. త్వర‌లో మీ అంద‌ర్నీ తెర‌పై క‌లుసుకుంటాం’’ అని చెప్పారు. హీరో సుమంత్ అశ్విన్ మాట్లాడుతూ.. ‘‘మ‌ళ్లీ ప‌ని మొద‌ల‌వ‌డం, సెట్స్‌పైకి రావ‌డం సంతోషంగా అనిపిస్తోంది. భూమిక, శ్రీ‌కాంత్ గార్లతో ఈ సినిమాలో ప‌నిచేస్తున్నాను. అలాంటి వండ‌ర్‌ఫుల్ సీనియ‌ర్ యాక్టర్లతో క‌లిసి ప‌నిచేయ‌డం గౌర‌వంగా భావిస్తున్నా. భూమిక గారంటే నాకు నోస్టాల్జిక్ ఫీలింగ్‌. ఆమెతో క‌లిసి ప‌నిచేస్తున్నానంటే న‌మ్మలేక‌పోతున్నాను. మొద‌టిసారి ఆమెను సెట్‌లో క‌లిసిన‌ప్పుడు నేను చిన్నవాడ్ని. ఆమెతో క‌లిసి ప‌నిచేస్తాన‌ని నేనెప్పుడూ ఊహించలేదు. ఇప్పుడు ఈ సినిమాకు ప‌నిచేస్తుంటే చాలా నోస్టాల్జిక్‌గా, గొప్పగా అనిపిస్తోంది. ఇక శ్రీ‌కాంత్ గారి సినిమాలు చూస్తూ పెరిగాను. ఆయ‌నంటే నాకు చాలా గౌర‌వం. సినిమా షూటింగ్ బాగా జ‌రుగుతోంది’’ అన్నారు. హీరో శ్రీ‌కాంత్ మాట్లాడుతూ.. ‘‘ఏడు నెల‌ల త‌ర్వాత మ‌ళ్లీ షూటింగ్‌కు రావ‌డం హ్యాపీగా ఉంది. క‌రోనా వ‌చ్చి అన్ని రంగాలు దెబ్బతిన్నట్లే ఫిల్మ్ ఇండ‌స్ట్రీ కూడా స‌మ‌స్యలు ఎదుర్కొంది. ఇప్పుడు థియేట‌ర్లు ఓపెన్ కాక‌పోయినా సినిమా షూటింగ్‌లు మొద‌ల‌య్యాయి. అన్ని ర‌కాల జాగ్రత్తలు తీసుకుంటూ ధైర్యంగా షూటింగ్ చేస్తున్నాం. ఒక డిఫ‌రెంట్ కాన్సెప్ట్‌తో ఈ సినిమా తీస్తున్నారు. రోడ్ మూవీ. త్వర‌లో థియేట‌ర్లు కూడా తెరుచుకొని సినిమా ఇండ‌స్ట్రీ ప‌రిస్థితి మెరుగ‌వ్వాల‌ని మ‌న‌స్ఫూర్తిగా కోరుకుంటున్నాను’’ అని అన్నారు. హీరోయిన్ తాన్యా హోప్ మాట్లాడుతూ.. ‘‘లాక్‌డౌన్ త‌ర్వాత నేను షూటింగ్‌లో పాల్గొంటున్న ఫ‌స్ట్ ఫిల్మ్ ఇదే. భూమిక మేడ‌మ్‌, శ్రీ‌కాంత్ స‌ర్‌, సుమంత్ అశ్విన్‌తో క‌లిసి న‌టిస్తున్నందుకు ఎగ్జయిటింగ్‌గా ఉంది. ఇది బైక్ రైడింగ్ మూవీ. డైరెక్టర్ గురుప‌వ‌న్ చాలా బాగా తీస్తున్నారు’’ అని చెప్పారు. నిర్మాత జి. మ‌హేష్ మాట్లాడుతూ.. ‘‘ఒక రోడ్ ట్రిప్ నేప‌థ్యంలో ఈ సినిమా క‌థ న‌డుస్తుంది. ద‌ర్శకుడు గురుప‌వ‌న్ స‌మ‌కూర్చిన స్క్రీన్‌ప్లే హైలైట్ అవుతుంది. ప‌ర్ఫార్మెన్స్‌కు బాగా స్కోప్ ఉన్న ప్రధాన పాత్రకు వంద శాతం న్యాయం చెయ్యగ‌ల‌ర‌నే ఉద్దేశంతో భూమిక గారిని ఆ పాత్రకు తీసుకున్నాం. ఇప్పటివ‌ర‌కూ చేయ‌ని పాత్రల్లో సుమంత్ అశ్విన్‌, శ్రీ‌కాంత్ క‌నిపిస్తారు. అన్ని ర‌కాల జాగ్రత్తలు పాటిస్తూ షూటింగ్ నిర్వహిస్తున్నాం’’ అని తెలిపారు. ఈ సినిమాలో ఇంకా స‌ప్తగిరి, శ్రీ‌కాంత్ అయ్యంగార్‌, పృథ్వీ ఇత‌ర కీల‌క పాత్రలు పోషిస్తున్నారు. సునీల్ క‌శ్యప్ సంగీతం స‌మ‌కూరుస్తున్న ఈ చిత్రానికి సి. రామ్‌ప్రసాద్ సినిమాటోగ్రాఫ‌ర్‌గా వ‌ర్క్ చేస్తున్నారు. జునైద్ సిద్ధిఖి ఎడిటర్. పృథ్వీరాజ్‌ ఎడిటర్.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3jGvybc
v

Samantha: ఇలా జరుగుతుందని అస్సలు ఊహించలేదు.. చాలా భయమేసింది.. ఓపెన్‌ అయిన అక్కినేని కోడలు

టాలీవుడ్ స్టార్ హీరోయిన్, అక్కినేని కోడలు ఎంత యాక్టివ్ అనేది అందరికీ తెలుసిన విషయమే. వెండితెరపై తన చలాకీతనంలో అశేష అభిమాన వర్గాన్ని కూడగట్టుకున్న ఈ బ్యూటీ తొలిసారి బుల్లితెర హోస్ట్ అవతారమెత్తింది. ప్రస్తుతం నాగార్జున అందుబాటులో లేకపోవడంతో ఆయన హోస్ట్ చేస్తున్న బిగ్ బాస్ బాధ్యతలను భుజానికెత్తుకుంది. గత వారం `బిగ్‌బాస్` వీకెండ్ ఎపిసోడ్ హోస్ట్ చేసి అందరి చేత వావ్! అనిపించింది. అయితే తాజాగా ఈ రెస్పాన్స్‌పై తన ఫీలింగ్స్ బయటపెడుతూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టింది సామ్. ఇది ఎప్పటికీ గుర్తు పెట్టుకోవాల్సిన విషయం అని అందులో పేర్కొన్న సమంత.. బిగ్‌బాస్ హోస్ట్‌గా వ్యవహరిస్తానని అస్సలు ఊహించలేదని తెలిపింది. కేవలం మా మామగారి వల్లే ఆ కార్యక్రమానికి హోస్ట్‌గా వచ్చానని క్లారిటీ ఇచ్చింది. అయితే ఈ కార్యక్రమాన్ని హోస్ట్ చేసేందుకు మొదట తాను చాలా భయపడ్డానని, ఇంతకుముందు ఏ కార్యక్రమానికీ హోస్ట్‌గా వ్యవహరించలేదు పైగా తెలుగు కూడా అంతగా రాదు కాబట్టి భయమేసిందని పేర్కొంది. అలా ఎన్నో భయాలను అధిగమించి చివరకు మీ ముందుకు రావడం, మీరు ఇంతలా ఆదరించడం ఆనందంగా ఉందని తెలిపింది. Also Read: కాగా ఇంతకుముందు బిగ్‌బాస్‌కు సంబంధించి ఒక్క ఎపిసోడ్ కూడా చూడలేదని ఓపెన్‌గా చెప్పేసింది సమంత. తనపై నమ్మకముంచి పోత్సహించినందుకు ధన్యవాదాలు మామ అంటూ తన పోస్ట్‌లో రాసుకొచ్చింది. దసరా ఎపిసోడ్ తర్వాత తనపై ప్రేమ కురిపించిన ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు అని పేర్కొన్న సామ్.. ప్రస్తుతం ఆనందంలో తేలిపోతున్నట్లు చెప్పింది. దీంతో సమంత పెట్టిన ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2JaejlN
v

ఫ్యామిలీ లైఫ్‌ ఎంజాయ్‌ చేస్తున్నా.. అవన్నీ అవాస్తవాలే: సమీరా రెడ్డి

హిందీ, తెలుగుతో పాటు పలు సౌత్ ఇండియన్ భాషల్లో సినిమాలు చేసి కుర్రకారును షేక్ చేసిన .. గత కొన్ని రోజులుగా వెండితెరకు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. కొన్నేళ్లపాటు ప్రేక్షకులను ఉర్రూతలూగించిన ఈ అమ్మడు పెళ్లి చేసుకొని వెండితెరకు దూరమయ్యారు. అయినప్పటికీ సోషల్ మీడియా వేదికగా ప్రేక్షకులతో టచ్‌లో ఉంటూ తన, తన కుటుంబానికి సంబంధించిన రెగ్యులర్ అప్‌డేట్స్ ఇస్తున్నారు. అయితే సమీరా ఓ కోలీవుడ్ సినిమాతో రీ ఎంట్రీ ఇవ్వబోతోందంటూ గత కొన్నిరోజులుగా వార్తలు వస్తున్న నేపథ్యంలో తాజాగా వాటిపై స్పందిస్తూ క్లారిటీ ఇచ్చారామె. Also Read: ఆర్య, విశాల్‌ ప్రధాన పాత్రల్లో ఆనంద్‌ శంకర్‌ దర్శకత్వం వహించనున్న ‌చిత్రంలో సమీరా రెడ్డి నటిస్తోందనే టాక్ బయటకొచ్చింది. ఆమె రోల్ సినిమాకు కీలకం కానుందని చెప్పుకున్నారు. తాజాగా అట్టి వార్తలపై స్పందించిన సమీరా.. అవన్నీ అవాస్తవాలని, తాను ఏ సినిమాలోనూ నటించడం లేదని చెప్పారు. ప్రస్తుతానికి ఫ్యామిలీ లైఫ్‌ ఎంజాయ్‌ చేస్తున్నారని తెలిపారు. దీంతో సమీరా రీ ఎంట్రీ వార్తలకు ఫుల్‌స్టాప్ పడింది. 'మైనే దిల్‌ తుజ్కో దియా' అనే హిందీ సినిమాతో సిల్వర్ స్క్రీన్‌పై అడుగుపెట్టిన సమీరా రెడ్డి.. ఆ తర్వాత తెలుగు తెరపై కూడా అలరించారు. ఎన్టీఆర్‌తో కలిసి 'నరసింహుడు, అశోక్' అదేవిధంగా చిరంజీవితో కలిసి 'జై చిరంజీవ' చిత్రాలలో నటించారు. పెళ్లి అనంతరం వెండితెరకు దూరమై తన కుటుంబంతో సరదాగా గడుపుతున్నారు. అప్పుడప్పుడూ తన చిన్నారులతో దిగిన పిక్స్ షేర్ చేస్తూ ఆకట్టుకుంటూ ఉంటారు సమీరా.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/35IaQCG
v

ఆ రాత్రి జరిగింది ఎప్పటికీ మరవను.. ఆ సమయంలో నా శరీరం! చిన్నారి పెళ్లి కూతురు ఫేమ్ అవికా గోర్ ఆవేదన

ఫేమ్, సినీ నటి గత జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ ఆవేదన చెందింది. తెలుగు, హిందీ టీవీ సీరియల్స్‌లో బొద్దుగా కనిపించి ఆకట్టుకున్న అవిక.. ఇప్పుడు ఎవ్వరూ గుర్తుపట్టని విధంగా మారిపోయింది. ప్రస్తుతం గ్లామర్ బ్యూటీగా సోషల్ మీడియాను వేడెక్కిస్తోంది. సన్నగా నాజూగ్గా మారి యూత్‌లో మంచి ఫాలోయింగ్ కూడగట్టుకుంటున్న ఈ అమ్మడు.. తాజాగా తన సోషల్ మీడియా ఖాతాలో ఓ పోస్ట్ పెడుతూ ఎమోషనల్ అయింది. గతేడాది ఓ రోజు రాత్రి అనుభవించిన బాధను గుర్తుచేసుకుంటూ తెగ ఫీల్ అయింది. తన లేటెస్ట్ లుక్ పోస్ట్ చేసిన అవికా గోర్.. గతేడాది ఓ రోజు రాత్రి అద్దంలో తనను తాను చూసుకుని ఏడ్చానని చెప్పింది. ఆ క్షణాలను ఎప్పటికీ మర్చిపోలేనని, ఆ సమయంలో తన శరీరం, శరీర భాగాలు అస్సలు నచ్చకపోవడంతో కృంగి పోయానని.. దాని ఫలితమే తన ఊబకాయం అని పేర్కొంది. తన కాళ్ళు, చేతులు లావుగా ఉన్నాయని అదేవిధంగా శరీరాకృతి విషయంలో చాలాసార్లు బాధపడ్డానని ఆమె వెల్లడించింది. Also Read: ఆ సమయంలో ఎన్నో ఆలోచనలు తనకు మనశ్శాంతి లేకుండా చేయడమే గాక తనపై తనకే అసహ్యం వేసేదని.. అయితే చివరకు ఏదీ రాత్రికి రాత్రే మారిపోదని అర్థం చేసుకొని ఆరోగ్యకరమైన ఆహారం, వర్కవుట్లపై దృష్టి సారించానని తెలిపింది అవికా. ఎన్ని ఎదురుదెబ్బలు తగిలినప్పటికీ ఏ మాత్రం జంకకుండా ముందుకెళ్లి ఈ రూపం తెచ్చుకున్నానని పేర్కొంది. ఈ రోజు మళ్లీ అద్దంలో చూసుకొని ఎంతో అందంగా ఉన్నావని తనకు తానే చెప్పుకొని సంతోష పడుతున్నా తెలుపుతూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఎమోషనల్ పోస్ట్ పెట్టింది అవికా గోర్. 'చిన్నారి పెళ్లి కూతురు' సీరియల్‌తో మంచి గుర్తింపు సంపాదించుకున్న అవికా గోర్.. ఆ తర్వాత వెండితెరపై కూడా మెరిసింది. `ఉయ్యాలా జంపాలా` సినిమాతో టాలీవుడ్ ఆరంగేట్రం చేసి ''సినిమా చూపిస్తా మావా, రాజు గారి గది-3'' సినిమాలు చేసింది. ఆ తర్వాత కొంత కాలం గ్యాప్ తీసుకున్న ఈ అమ్మడు ఇప్పుడు సరికొత్తగా తయారై స్మార్ట్ లుక్‌‌తో యూత్ ఆడియన్స్‌ని బుట్టలో వేసుకుంటోంది. ‌


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/35MjjVt
v

రెమ్యునరేషన్ పెంచిన సోనూ.. బోయపాటికే చెమటలు పట్టాయట!

లాక్‌డౌన్ సమయంలో వేలాది కార్మికులకు సాయం చేసి రియల్ హీరో అనిపించుకున్నాడు బహుభాషా నటుడు . ఆయన చేసిన సేవలకు దేశమంతా ప్రశంసలతో ముంచెత్తింది. లాక్‌డౌన్ ముగిసి ప్రస్తుతం సాధారణ పరిస్థితులు నెలకొన్నప్పటికీ సాయమంటూ వస్తున్న వారిని కాదనకుండా ఆదుకుంటున్నాడు. దీంతో ఇటీవల అతడికి భారీగా ఫాలోయింగ్ పెరిగింది. చాలామంది దర్శక నిర్మాతలు సోనూని తమ సినిమాల్లో నటించాలని సంప్రదిస్తున్నారట. ప్రస్తుతం ఆయన తెలుగులో బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా తెరకెక్కుతున్న ‘అల్లుడు అదుర్స్’ సినిమాలో నటిస్తున్నాడు. అయితే ఇటీవల సోనూసూద్ రెమ్యునరేషన్‌ను భారీగా పెంచినట్లు తెలుస్తోంది. బోయపాటి, బాలయ్య కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమాలో కీలక పాత్ర కోసం సోనూసూద్‌ను సంప్రదించారు. అయితే ఆయన చెప్పిన రెమ్యునరేషన్ విని బోయపాటి టీమ్‌కు చెమటలు పట్టాయట. Also Read: సోనూసూద్ ఇప్పటివరకు సినిమాకు రూ.1-1.5కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకునేవాడు. అలాంటిది ఇప్పుడు ఏకంగా రూ.4కోట్లు డిమాండ్ చేస్తున్నాడట. దీంతో ఆయన కోసం వెళ్లిన తెలుగు దర్శక నిర్మాతలు ఏం మాట్లాడలేక వెనుదిరుగుతున్నారట. ఇలాగే మరో నిర్మాతకు కూడా ఇదే విధంగా షాక్ ఇవ్వడంతో ఇప్పుడు సోనూ రెమ్యునరేషన్‌ టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. సినిమాల ద్వారా ఎక్కువ సంపాదించి ఆ మొత్తాన్ని ఆపదలో ఉన్నవారిని ఆదుకునేందుకు వినియోగించాలన్న ఆయన ప్లాన్‌గా తెలుస్తోంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3oG52m0
v

వచ్చిన అవకాశాలను చేజార్చుకోవటం ఎలా? 7 నిమిషాల వర్కవుట్స్.. పూరి పాఠం వినాల్సిందే!

ఎప్పటిలాగే మరో పోడ్ కాస్ట్ ఆడియోతో మనముందుకొచ్చారు. ఈ ఆడియోలో నీకొచ్చే అవకాశాలను ఎలా పసిగట్టాలో తెలుపుతూ తనదైన స్టైల్‌లో చెప్పుకొచ్చారు. పూరి చెప్పిన ఈ మోటివేషనల్ పాఠం వింటే.. ''బుద్ధుడు చెప్పాడు.. వన్ డే కెన్ చేంజ్ లైఫ్.. అవకాశం అనేది ఎక్కడి నుంచి ఎలా వస్తుందనేది తెలియదు. చాలా సార్లు అసలు అవి మనకోసం వచ్చిన సువర్ణావకాశాలు అని మనకే తెలియదు. తెలియాలంటే లైఫ్‌లో చాలా అలర్ట్‌గా ఉండాలి. కొంతమందికి లక్ష్మీదేవి వచ్చి తలుపులు బాదుతూ అరుస్తున్నా వినిపించదు. పందుల్లా నిద్రపోతారు నా కొడుకులు. నాకో స్నేహితుడు ఉన్నాడు. అతడికి చాలా టాలెంట్‌ ఉంది. వచ్చిన అవకాశాలను చేజార్చుకోవటం ఎలా అని అతడో పుస్తకం రాశాడు. ఆ పుస్తకాన్ని తన దగ్గరే పెట్టుకుని తూచ తప్పకుండా పాటిస్తున్నాడు. అలాంటి వారు ఈ లోకంలో చాలామందే ఉన్నారు. Also Read: నీకేంట్రా నువ్వింకా చిన్నపిల్లోడివి అని ఎవరైనా అంటే నమ్మకండి. ఇక్కడ ఎవరికీ సమయం లేదు. కళ్లు మూసి తెరిచేలోపు అందరికీ 60 ఏళ్ళు వచ్చేస్తున్నాయి. మిమ్మల్నేవరూ ఎర్రతివాచీ పరిచి ఆహ్వానించరు. నీ విలువ అవతలి వాడికి తెలిసినప్పుడే నువ్వు బిజీ అవుతావు. ప్రారంభంలో అందరూ నిన్ను వాడతారు. వాడనీయ్.. అలా వాడుతున్నారంటే వాళ్లకు నువ్వు పనికొస్తున్నావని అర్థం. అన్నీ నేర్చుకో. అందరూ అలా వాడుతున్నప్పుడే నువ్వు అలర్ట్‌గా ఉండు. అన్నీ వాళ్లే నేర్పిస్తారు. నీ టైం బాగుంటే ఇలాంటి వారంతా ముందే ఎదురవుతారు. మరేం పర్లేదు వాళ్లే నిన్ను మార్చేస్తారు. రోజులో ఎదోఒకటి నేర్చుకోకుండా పడుకోవద్దు. ఎప్పుడూ ఫైర్‌తో ఉండు ఎలాంటి కడుపు నొప్పి ఉండదు. కసిగా ఉండు ఎలాంటి అనారోగ్య సమస్యలు కూడా రావు. మూడు పూటలా కలిపి ఎన్ని నిమిషాలు తింటే అంతసేపు వ్యాయామం చేయ్‌. జిమ్‌కు వెళ్లాల్సిన పనిలేదు. 7 నిమిషాల వర్కవుట్ కోసం యాప్‌లు కూడా ఉన్నాయి. అన్ని అవకాశాలు నీ ముందే ఉంటాయి.. నువ్వు అలర్ట్‌గా ఉంటే వాటిని వాడుకోవచ్చు. లేదంటే నీ కళ్ల ముందే అలా అలా డాన్స్ ఆడుతూ వెళ్లిపోతాయి'' అని చెప్పారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3oEAP6x
v

Thursday 29 October 2020

‘సర్కారు వారి పాట’లు మొదలెట్టేసిన తమన్

ప్రస్తుతం టాలీవుడ్‌లో హవా నడుస్తోంది. ‘అల వైకుంఠపురములో’ సినిమాతో ఆయన రేంజ్ మరింత పెరిగింది. నీ కాళ్ళను పట్టుకు వదలనన్నావి, బుట్టబొమ్మా, రాములో రాములో.. పాటలు సంగీత ప్రియులను విశేషంగా ఆకట్టుకోవడంతో పాటు యూట్యూబ్‌లో అనేక రికార్డలు క్రియేట్ చేశాయి. దీంతో తమన్‌ కోసం అగ్రహీరోలు పోటీపడుతున్నారు. ఈ క్రమంలోనే పరశురామ్, మహేశ్‌బాబు దర్శకత్వంలో తెరకెక్కనున్న ‘’ సినిమాకు సంబంధించి ఛాన్స్ దక్కించుకున్నాడు. Also Read: ఈ క్రమంలోనే ‘సర్కారు వాటి పాట’కు మ్యూజిక్ సిట్టింగ్స్ ప్రారంభమైనట్టు తమన్ తాజాగా వెల్లడించాడు. ఇప్పటికే కొన్ని పూర్తి చేయగా.. మిగిలిన వాటికి సిట్టింగ్‌ జరుగుతున్నట్లు తెలిపాడు. ‘సర్కారు వారి పాట’కు సంబంధించి అద్భుతమైన మ్యూజిక్ కంపోజింగ్స్ జరిగాయి. మహేష్ గారికి మంచి పాటలు అందించేందుకు వీలుగా అద్భుతమైన సన్నివేశాలను సృష్టించిన డార్లింగ్ డైరెక్టర్ పరశురామ్‌కు ధన్యవాదాలు. నిర్మాతలకు కృతజ్ఞతలు’ అని తమన్ ట్వీట్ చేశాడు. Also Read:


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3kIHeLB
v

ఒకే స్రీన్‌పై 20 మంది అగ్రతారలు.. టాలీవుడ్‌లో రికార్డ్ క్రియేట్ చేసిన సాంగ్

సాధారణంగా ఒక హీరో సినిమాలో మరో హీరో కాసేపు అలా కనిపిస్తేనే భారీగా హైప్ క్రియేట్ అవుతుంది. తమ హీరో మరో సినిమాలో గెస్ట్‌ రోల్ కనిపించాడంటే ఆయన అభిమానులు చేసే హడావుడి అంతా ఇంతా కాదు. అలాంటి కాంబినేషన్లు, పాత్రలు అన్ని సమయాల్లోనూ కుదరదు. కానీ కాంబినేషన్ సెట్ అయితే మాత్రం ఫ్యాన్స్ హంగామా మామూలుగా ఉండదు. తెలుగు తెరకు మల్టీస్టారర్లు కొత్తేమీ కాదు. ఎన్టీఆర్-ఏఎన్నార్ కాలం నుంచి.. ఇప్పుడు రామ్‌చరణ్-తారక్ కాలం వరకు అప్పుడప్పుడూ మల్టీస్టారర్ సినిమాలు ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నాయి. Also Read: అసలు విషయానికొస్తే.. వెంకటేష్‌, అర్జున్‌, రాజేంద్ర ప్రసాద్‌ కాంబినేషన్లో టి.సుబ్బిరామిరెడ్డి సమర్పణలో దర్శకుడు మురళీ మోహన్‌ రావు తెరకెక్కించిన చిత్రం ‘’. 1981లో వచ్చిన ‘నజీబ్‌’ అనే హిందీ చిత్రానికి రీమేక్‌ ఇది. బప్పీ లహరి సంగీతం అందించారు. ఈ చిత్రంలోని ఓ ఫంక్షన్ నేపథ్యంలో వచ్చే పాటలో ఏకంగా 20మంది నాటి అగ్రతారలు స్క్రీన్‌ షేర్‌ చేసుకున్నారు. శోభన్‌‌బాబు, చిరంజీవి, బాలకృష్ణ, కృష్ణంరాజు, నాగార్జున, దర్శకుడు కోదండ రామిరెడ్డి, కోడి రామకృష్ణ, శారద, విజయ నిర్మల, విజయ శాంతి, రాధ, జయమాలిని, పరుచూరి బ్రదర్స్, మురళీ మోహన్, గొల్లపూడి మారుతి దర్శనమిచ్చారు. అప్పటి నుంచి ఇప్పటివరకు మరే సినిమాలోనూ ఇంతమంది అగ్రనటులు కనిపించిన దాఖలాలు లేవు. తెలుగు సినీ పరిశ్రమకు సంబంధించి ఇదొక రికార్డు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3kGiZh7
v

Khushi: భూమిక నడుమును పవన్ నిజంగా చూడలేదట.. అది సూర్య ట్రిక్

పవర్‌స్టార్ పవన్‌ కల్యాణ్‌ సినీ కెరీర్‌లో ‘ఖుషీ’ చిత్రానికి ఓ ప్రత్యేక స్థానముంది. పవన్‌, భూమిక జంటగా నటించిన ఈ చితాన్ని ఎస్‌.జె.సూర్య తెరకెక్కించారు. కొత్తదనం నిండిన సరికొత్త కథతో తీసిన ఈ సినిమా అప్పట్లో ప్రేమకథా చిత్రాల్లోనే ట్రెండ్ సెట్టర్‌గా నిలిచింది. ఈ సినిమాలోని పాటలకు, పవన్‌ లవ్‌, యాక్షన్‌ హంగామాకు యూత్ ఊగిపోయింది. ముఖ్యంగా పవన్.. హీరోయిన్ నడుము చూసే సీన్ చాలా హైలెట్ అయింది. ఇన్నేళ్లయినా ఈ సీన్ గురించి ఎక్కడో చోట చర్చ జరుగుతూనే ఉంటుంది. Also Read: ఈ రొమాంటిక్‌ సీన్‌ వెనుక ఓ ఆసక్తికర కథ ఉంది. నిజానికి తెరపై అంత చక్కగా పండిన ఆ సన్నివేశం వెనుకు పవన్‌ కళ్యాన్ అద్భుతమైన నటన దాగి ఉందట. బ్లాక్ శారీలో ఉన్న భూమిక నడుమును చూసే సమయంలో పవన్ ముఖంలో పలికిన హావభావాలు చూస్తే నిజంగా భూమికను ఎదురుగా కూర్చోబెట్టి ఆ సన్నివేశం చిత్రీకరించారేమో అనిపిస్తుంది. కానీ అసలు విషయం ఏంటంటే.. పవన్‌ నిజంగా ఆమె నడుమును చూడలేదట. సూర్య పవన్‌ను ఓ బల్లపై కూర్చోబెట్టి ఎదురుగా భూమిక ఉన్నట్లు, ఆమె నడుమును చాటుగా చూస్తున్నట్లు నటించి చూపమన్నారట. అలా షూట్‌ చేసిన సన్నివేశాన్నే తర్వాత భూమిక నడుముతో కలిపి చూపించారు. అంతేకాని ఆ ఎపిసోడ్‌లో చూపించినట్లు పవన్‌.. భూమిక నడుమును నిజంగా చూడలేదు. కానీ సినిమాలో ఆ సన్నివేశం చూస్తున్నప్పుడు ఎంతో వాస్తవికంగా కనిపిస్తుంటుంది. పవన్ నటన, ఎస్.జె.సూర్య అద్భుతమైన టేకింగ్‌కు ఈ సీన్ ఉదాహరణగా చెప్పొచ్చు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3kHPsUv
v

కీర్తి సురేష్ రిస్క్ చేస్తోందా?.. టెన్షన్‌లో ఫ్యాన్స్

‘మహానటి’ సినిమాతో స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది కీర్తి సురేష్. ఆ క్రేజ్‌తో కెరీర్‌ను చక్కదిద్దుకోకుండా ఆమె తప్పటడుగులు వేస్తోందనిపిస్తోంది. స్టార్ హీరోల పక్కన అవకాశాలు వస్తున్నా పట్టించుకోకుండా లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తోంది. ఈ క్రమంలో ఆమె ఎన్నుకున్న కొన్ని కథలు ప్రేక్షకులను నిరాశ పరిచాయి. ఓటీటీలో విడుదలైన ‘పెంగ్విన్’ సినిమాపై అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్నా నిరాశపరిచింది. దీంతో పాటు ఆమె సినిమాలన్నీ కూడా వరుసగా ఓటీటీ వేదికలపైకి వచ్చేస్తున్నాయి. దీంతో కీర్తి సురేష్‌ క్రేజ్ కాస్త తగ్గిందనే చెప్పాలి. Also Read: ఈ టైమ్‌లోనే ఆమె తీసుకున్న నిర్ణయం అభిమానులకు ఆగ్రహం తెప్పిస్తోంది. తమిళంలో అజిత్ హీరోగా వచ్చిన ‘’ సినిమాను మెగాస్టార్ తెలుగులో రీమేక్ చేస్తున్నారు. దీనికి మెహర్ రమేష్ డైరెక్టర్. ఈ సినిమా కథ మొత్తం హీరో చెల్లెలి పాత్ర చుట్టూనే తిరుగుతుంది. దీంతో ఈ పాత్ర కోసం యూనిట్ సాయిపల్లవి, కీర్తిసురేష్‌ పేర్లను పరిశీలించి చివరికి కీర్తిని ఓకే చేశారు. ఈ రోల్‌కు కీర్తి సురేష్‌ కూడా ఓకే చెప్పేయడంతో ఆమె ఫ్యాన్స్ షాకయ్యారు. హీరోయిన్‌గా ఎన్నో అవకాశాలు వస్తుండగా ఇప్పుడు చిరంజీవికి చెల్లెలిగా నటించేందుకు సిద్ధం కావడం వారికి రుచించడం లేదు. ఒక్కసారి చెల్లెలి పాత్రలో నటిస్తే ఇక స్టార్ హీరోలెవరూ ఆమెవైపు కన్నెత్తి చూడరని, దీంతో కెరీర్ చేజేతులా నాశనం చేసుకున్నట్లు అవుతుందని ఆందోళన చెందుతున్నారు. అయితే నటనకు ప్రాధాన్యమున్న పాత్ర కావడంతోనే ఆ సినిమాలో నటించేందుకు ఒప్పుకుందని, దీని తర్వాత ఆమెకు అవకాశాలు మరింత పెరుగుతాయని కొందరు అంటున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/34DkAPc
v

ప్రభాస్‌కు షాకిచ్చిన టీవీ ప్రేక్షకులు.. ‘సాహో’ బుల్లితెరపైనా డిజాస్టరే

యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ హీరోగా ‘రన్‌ రాజా రన్‌’ ఫేమ్‌ సుజీత్‌ దర్శకత్వంలో భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన చిత్రం ''. ‘బాహుబలి’ రెండు పార్ట్‌ల తర్వాత ప్రభాస్‌ నుంచి వస్తున్న సినిమా కావడంతో దేశవ్యాప్తంగా దీనిపై భారీ అంచనాతో విడుదలైనా ఆశించినంగా అలరించలేకపోయింది. బాలీవుడ్‌ ప్రేక్షకులను ఆకట్టుకున్నా.. తెలుగు సహా ఇతర భాషల్లో విజయం సాధించలేదు. చివరికి దసరా సందర్భంగా బుల్లితెరపై ప్రసారం చేయగా అక్కడా భారీ షాకిచ్చింది. వెండితెరపై ఆకట్టుకోలేకపోయిన ఈ చిత్రం టీవీలో అయినా రికార్డులు క్రియేట్‌ చేస్తుందని ప్రభాస్‌ అభిమానులు భావించారు. అయితే వారి అంచనాలను తలక్రిందులు చేస్తూ అక్కడా బోల్తా పడింది. ఆదివారం జీటీవీలో వరల్డ్ ప్రీమియర్ షోగా ప్రసారం చేసిన ఈ సినిమా వచ్చిన టీఆర్పీ రేటింగ్ కేవలం 5.8 మాత్రమే. చిన్నహీరోల పాత సినిమాలు మళ్లీ మళ్లీ ప్రసారం చేసినా 3-5 టీఆర్పీ రేటింగులు వస్తుంటాయి. అలాంటిది పాన్ ఇండియ స్టార్‌ ఎదిగిన సినిమా తొలిసారి టీవీలో ప్రసారం చేస్తే పట్టించుకున్న ప్రేక్షకులే లేరు. మహేశ్ ‘సరిలేరు నీకెవ్వరు’ మూడోసారి ప్రసారం చేస్తే 11కి పైగా రేటింగ్ వచ్చింది. అలాంటిది సాహో తొలిసారి టెలికాస్ట్ చేస్తే 6కంటే తక్కువ రావడం నిజంగా షాకింగ్ విషయమే.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2J9nOBJ
v

ఇష్టం లేకపోయినా తప్పడం లేదు.. ఈ సినిమా భిన్నమైన అనుభవం: సూర్య

తమిళ అంటే తెలుగు ప్రేక్షకులు ప్రత్యేక అభిమానం చూపిస్తుంటారు. ఆయన చేసే సినిమాలు, ఎంచుకునే పాత్రలే దానికి కారణం. హీరోగా నిలదొక్కుకుంటూనే విలక్షణమైన పాత్రలు చేస్తుంటారాయన. తాజాగా ఆయన నటించిన ‘’ సినిమా నవంబర్ 12న ఓటీటీ ద్వారా విడుదల కాబోతోంది. సుధ కొంగర ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ సందర్భంగా హీరో సూర్య, దర్శకురాలు సుధ కొంగర ఆన్‌లైన్‌లో విలేకర్లతో ముచ్చటించారు. Also Read: ‘‘ఆకాశం నీ హద్దురా’.. లాక్‌డౌన్‌కి ముందే విడుదల కావాల్సిన సినిమా. అయితే కరోనా పరిస్థితుల వల్ల సాధ్యం కాలేదు. ఈ ఆరు నెలల విజువల్‌ ఎఫెక్ట్స్‌తో చిత్రాన్ని మరింత సహజంగా తీర్చిదిద్దింది మా టీమ్. థియేటర్‌ ప్రేక్షకుల కోసమే ఈ సినిమా తీసినా.. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకు తీసుకు రావల్సి వస్తోంది. మా డైరెక్టర్ సుధ ఈ విషయంలో అసంతృప్తిగానే ఉన్నారు. కానీ నిర్మాతగా, ఈ సినిమాలో భాగమైన ప్రతి ఒక్కరి కోసం ఓటీటీలో విడుదల చేయాలనే నిర్ణయం తీసుకున్నా. ఈ ప్లాట్‌ఫామ్ ద్వారా ఎక్కువమంది ప్రేక్షకులకు సినిమా చేరువ కానుండడం సంతోషంగా ఉంది’ ‘ఇది చాలా ప్రత్యేకమైన సినిమా. ఒక సాధారణ మనిషి, అసాధారణమైన కలల్ని కని సాకారం చేసుకున్న విధానం మా సినిమాలో చూపించాం. మనందరం తక్కువ ఖర్చుతో విమానయానం చేస్తున్నామంటే కారణం కెప్టెన్‌ గోపీనాథ్‌. ఒక స్కూల్ మాస్టర్ కొడుకైన ఆయన ఎయిర్ డెక్కన్ సంస్థను ఎలా స్థాపించగలిగారన్నది భావోద్వేగంగా చూపించగలిగాం. సుధ కొంగర స్క్రిప్టు వినిపించాక సంతృప్తి కలిగింది. సెట్స్‌పైకి వెళ్లడానికి కొన్ని నెలల ముందే ఈ చిత్రం కోసం స్క్రిప్ట్‌‌పై బాగా వర్క్ చేశాం.’ Also Read: ‘‘యువ’ సినిమా చేసేటప్పటి నుంచి సుధతో పరిచయం ఉంది. ఆ సినిమాకు అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా ఉన్న ఆమె.. ఓ సన్నివేశంలో నేను బాగా నటించలేదని మొహం మీదే చెప్పేసింది. దర్శకుడు మణి రత్నంకి ఆ సీన్ నచ్చినా నాతో మళ్లీ చేయించింది. ఈ సినిమాను కూడా వాస్తవికత ఉట్టిపడేలా ఆమె ఈ తీర్చిదిద్దిన విధానం చాలా బాగుంది’. ‘గజిని’, ‘సూర్య సన్‌ ఆఫ్‌ కృష్ణన్‌’, ‘సింగం’... ఇలా అనేక సినిమాల్లో చాలా రకమైన గెటప్పుల్లో కనిపించా. ఇందులో నటించడం మాత్రం భిన్నమైన అనుభవాన్నిచ్చింది. ఒక సగటు వ్యక్తిగా, ఎయిర్‌ ఫోర్స్‌ కెప్టెన్‌గా, ఎయిర్‌లైన్స్‌ అధినేతగా ఇలా పలు కోణాల్లో సాగే పాత్రలో కనిపించనున్నాను. మోహన్‌బాబు గారు ఈ సినిమాకి పెద్ద బలం. ఆయన సన్నివేశాలు, తమిళ యాస విషయంలోనూ ఆసక్తిగా అడిగి తెలుసుకునేవారు. ఆయన పాత్ర గుర్తుండిపోతుంది’ అని చెప్పుకొచ్చారు సూర్య.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2TySTAO
v

గుర్తుందా శీతాకాలం: ఆగిపోయిన తమన్నా, సత్యదేవ్ సినిమా!!

కన్నడ సూపర్ హిట్ మూవీ ‘లవ్ మాక్‌టైల్’ను తెలుగులో రీమేక్ చేస్తున్నట్టు ఈ ఏడాది జూలైలో ప్రకటించిన విషయం తెలిసిందే. ‘గుర్తుందా శీతాకాలం’ టైటిల్‌తో రూపొందనున్న ఈ రీమేక్‌ మూవీలో టాలెంటెడ్ యాక్టర్ , మిల్కీ బ్యూటీ హీరోహీరోయిన్లుగా నటించనున్నారు. ఈ చిత్రానికి నాగశేఖర్ దర్శకత్వం వహించనున్నారు. ఆయనే నిర్మాత కూడా. కాల భైరవ సంగీత దర్శకుడు. సెప్టెంబర్ నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం అవుతుందని అప్పట్లో నిర్మాత ప్రకటించారు. ఈ సినిమాను ప్రకటించిన దగ్గర నుంచీ ఇప్పటి వరకు చాలా వదంతులు వినిపించాయి. ఈ సినిమా కోసం మొదట తక్కువ రెమ్యునరేషన్ మాట్లాడుకున్న సత్యదేవ్.. ఆ తరవాత ఎక్కువ డిమాండ్ చేస్తున్నారని రూమర్లు వచ్చాయి. మహేష్ కోనేరుకు చెందిన ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్‌లో ‘తిమ్మరుసు’ అనే సినిమా చేస్తోన్న సత్యదేవ్.. అక్కడ కోటి రూపాయలు రెమ్యునరేషన్ తీసుకుంటున్నారని, అంతే మొత్తాన్ని ‘గుర్తుందా శీతాకాలం’ సినిమాకు ఆయన డిమాండ్ చేస్తున్నారని వదంతులు వ్యాపించాయి. ఈ రూమర్‌లో నిజమెంతో తెలియక ముందే మరో రూమర్ ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమలో చక్కర్లు కొడుతోంది. అదేంటంటే.. ‘గుర్తుందా శీతాకాలం’ సినిమా పూర్తిగా ఆగిపోయిందని. మరి ఈ సినిమా ఆగిపోవడానికి కారణాలు ఏంటో తెలీదు కానీ.. ఈ వార్త అయితే ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్. అయితే, ఈ విషయాన్ని చిత్ర యూనిట్ ఖరారు చేయాల్సి ఉంది. మరోవైపు, ‘గుర్తుందా శీతాకాలం’ సినిమా ఆగిపోవడం వల్లే సత్యదేవ్ ‘తిమ్మరుసు’ చిత్రాన్ని ప్రారంభించారనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2JfbS1n
v

‘లక్ష్మీ బాంబ్’ వివాదం.. టైటిల్ మార్చేసిన లారెన్స్

హీరోగా రాఘవ దర్శకత్వంలో తెరకెక్కిన ‘లక్ష్మీ బాంబ్’ సినిమా టైటిల్ మారింది. ‘లక్ష్మీ బాంబ్’ టైటిల్‌ను ‘లక్ష్మి’గా మార్చారు. ఈ వార్తను ఖరారు చేస్తూ బాలీవుడ్ ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ గురువారం ట్వీట్ చేశారు. ‘లక్ష్మీ బాంబ్’ టైటిల్‌కు వ్యతిరేకంగా పలు హిందూ సంస్థల నుంచి వస్తోన్న వ్యతిరేకత వల్ల మేకర్స్ టైటిల్‌ను మార్చినట్టు సమాచారం. ఈ సినిమా టైటిల్ లక్ష్మీ దేవిని అవమానించే విధంగా ఉందని, దీని వల్ల తమ మనోభావాలు దెబ్బతిన్నాయని హిందూవాదులు ఆందోళనకు దిగారు. రాఘవ లారెన్స్ దర్శకత్వంలో రూపొందిన ‘లక్ష్మీ బాంబ్’ టైటిల్‌ను తక్షణమే మార్చాలని డిమాండ్ చేస్తూ చిత్ర నిర్మాతలకు కర్ని సేన లీగల్ నోటీస్ పంపినట్టు సమాచారం. దీంతో ఈ వివాదాన్ని మరింత లాగకుండా టైటిల్ మార్చేసినట్టు బాలీవుడ్ టాక్. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికెట్ (CBFC)తో చర్చల అనంతరం సినిమా టైటిల్‌ను ‘లక్ష్మి’ అని మార్చడానికి మేకర్స్ అంగీకరించారని.. దీంతో గురువారం సెన్సార్ బోర్డు సెన్సార్ సర్టిఫికెట్ కూడా జారీ చేసిందని సమాచారం. కాగా, 2011లో రాఘవ లారెన్స్ దర్శకత్వంలో వచ్చిన ‘కాంచన’ మూవీకి ‘లక్ష్మి’ హిందీ రీమేక్. హిందీ ఆడియన్స్‌ను దృష్టిలో పెట్టుకుని ‘కాంచన’ టైటిల్‌ను ‘లక్ష్మీ బాంబ్’గా మార్చినట్టు గతంలో ఓ ఇంటర్వ్యూలో లారెన్స్ చెప్పారు. తమిళంలో లారెన్స్ పోషించిన పాత్రలో హిందీలో అక్షయ్ కుమార్ నటించారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. అక్షయ్ కుమార్ కామెడీ టైమింగ్, ట్రాన్స్‌జెండర్‌గా ఆయన నటన అబ్బురపరిచింది. ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని హిందీ ఆడియన్స్ వేచి చూస్తున్నారు. కాగా, ‘లక్ష్మి’ సినిమాను దీపావళి కానుకగా నవంబర్ 9న డిస్నీ+ హాట్‌స్టార్‌లో విడుదల చేస్తున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2TxAEf6
v

హిమాలయాల్లో ‘వైల్డ్ డాగ్’.. టీమ్‌తో కలిసి పోరాటాలు

అక్కినేని టైటిల్ రోల్ పోషిస్తోన్న ‘వైల్డ్ డాగ్‌’ సినిమా షూటింగ్ ప్రస్తుతం మనాలీలోని హిమాలయ పర్వతాల వద్ద జరుగుతోంది. లాక్‌డౌన్ కారణంగా సుమారు ఏడు నెలలు ఆగిపోయిన ‘వైల్డ్ డాగ్’ షూటింగ్ ఇటీవల మనాలీలో మొదలైన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని నాగార్జున స్వయంగా ఓ వీడియో మెసేజ్ ద్వారా ప్రేక్షకులకు తెలియజేశారు. ఎంత సుందరమైన ప్రదేశంలో తాము షూటింగ్ చేస్తున్నామో చెప్పారు. కాగా, అక్కడ జరుగుతున్న షూటింగ్‌కు సంబంధించి రెండు స్టిల్స్‌ను చిత్ర యూనిట్ గురువారం విడుదల చేసింది. ఈ స్టిల్స్ చాలా బాగున్నాయి. బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు వేసుకుని అడ్వాన్స్‌డ్ రైఫిల్స్ పట్టుకుని హిమాలయ అడవుల్లో ఏసీపీ విజయ్ వర్మ తన టీమ్‌తో కలిసి క్రిమినల్స్‌ను వేటాడుతున్నారు. కాగా, ఈ మనాలీ షెడ్యూల్ 21 రోజులపాటు జరగనుంది. ఈ షెడ్యూల్ పూర్తయిన తరవాత నాగార్జున అండ్ టీమ్ తిరిగి హైదరాబాద్ చేరుకోనుంది. యథార్థ ఘటనల ఆధారంగా తెరకెక్కుతోన్న ఈ సినిమాకు అహిషోర్ సాల్మన్‌ దర్శకత్వం వహిస్తున్నారు. మ్యాట్నీ ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్‌పై నిరంజ‌న్ రెడ్డి, అన్వేష్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నాగార్జున జోడీగా దియా మీర్జా న‌టిస్తున్న ఈ చిత్రంలో ఓ కీల‌క పాత్రలో స‌యామీ ఖేర్ క‌నిపించ‌నున్నారు. కిర‌ణ్ కుమార్ సంభాష‌ణ‌లు రాస్తున్న ఈ చిత్రానికి షానీల్ డియో సినిమాటోగ్రాఫ‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. డేవిడ్ ఇస్మలోన్‌ యాక్షన్ డైరెక్టర్. శ్రావణ్ కటికనేని ఎడిటర్.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/31VWA8f
v

కాజల్ ప్రీ వెడ్డింగ్ సందడి.. హల్దీ ఫంక్షన్‌లో డ్యాన్స్ చేస్తూ హీరోయిన్ హంగామా

హీరోయిన్ .. వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లును అక్టోబర్ 30న పెళ్లాడనున్న సంగతి తెలిసిందే. వివాహానికి రెండు రోజుల ముందు కాజల్ ఇంట పెళ్లి సందడి మొదలైపోయింది. నిన్న మెహందీ ఫంక్షన్ జరగగా.. నేడు హల్దీ ఫంక్షన్, సంగీత్ నిర్వహిస్తున్నారు. ఇప్పటికే కాజల్ మెహందీ ఫంక్షన్‌కు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ కాగా.. ప్రస్తుతం హల్దీ ఫంక్షన్‌కు సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. హల్దీ ఫంక్షన్‌లో పసుపు రంగు దుస్తుల్లో కాజల్ మెరిసిపోతున్నారు. అంతేకాకుండా, ఆమె ధరించిన ఆభరణాలు కూడా చాలా వెరైటీగా ఉన్నాయి. సప్రదాయబద్ధంగా పువ్వులతో ఈ ఆభరణాలను డిజైన్ చేశారు. అయితే, హల్దీ ఫంక్షన్‌లో కాజల్ డ్యాన్స్ చేస్తున్న వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ అవుతోంది. ఎల్లో కలర్ డ్రెస్‌కు మ్యాచ్ అయ్యేటట్టు ఎల్లో సన్‌గ్లాసెస్ పెట్టుకుని కాజల్ హుషారుగా డ్యాన్స్ చేస్తున్నట్టు వీడియోలో చూడొచ్చు. మరోవైపు, కాజల్ ప్రీ వెడ్డింగ్ ఫంక్షన్‌లో ఆమె సోదరి నిషా అగర్వాల్ కూడా సందడి చేస్తున్నారు. బేబీ పింక్ లెహెంగాలో మెరిసిపోతున్న నిషా.. ఫొటోగ్రాఫర్లకు స్వీట్స్ బాక్సులు పంచుతూ కనిపించారు. ఈ వీడియో సైతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ముంబైకి చెందిన వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లును వివాహం చేసుకుంటున్నట్టు ఈనెల ప్రారంభంలో కాజల్ అగర్వాల్ ప్రకటించారు. ఆయనతో నిశ్చితార్థం జరిగినట్టు ప్రకటించిన కాజల్.. ఆ ఫొటోలను మాత్రం ఫ్యాన్స్‌తో షేర్ చేసుకోలేదు. ఇదిలా ఉంటే, కాజల్ అగర్వాల్ ప్రీ-వెడ్డింగ్ సంబరాలు ముంబైలోని కాజల్ ఇంట్లోనే జరగనున్నట్టు హైదరాబాద్ టైమ్స్ నిషా అగర్వాల్ తెలిపారు. కొవిడ్-19 నిబంధనలకు లోబడి ఇంట్లోనే ప్రీ-వెడ్డింగ్ సెలబ్రేషన్స్‌ జరుపుకుంటున్నట్టు చెప్పారు. అయితే, పెళ్లి వేదిక ఎక్కడన్నది సస్పెన్స్.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/37QMysN
v

సుమంత్ ‘కపటధారి’ టీజర్: వేషాలు మార్చే ఆ హంతకుడు ఎవరు?

‘‘ఈ ప్రపంచంలో ఏదీ ఊరికే జరగదు. అన్నిటికీ ఓ కారణం ఉంటుంది’’ అని అంటున్నారు హీరో సుమంత్‌. ఆయన కథానాయకుడిగా ప్రదీప్ కృష్ణమూర్తి దర్శకత్వంలో రూపొందుతోన్న క్రైమ్ థ్రిల్లర్‌ ‘క‌ప‌ట‌ధారి’. ‘సుబ్రహ్మణ్యపురం’, ‘ఇదంజ‌గ‌త్‌’ చిత్రాల‌తో మళ్లీ ఫామ్‌లోకి వచ్చిన ఇప్పుడు ‘క‌ప‌ట‌ధారి’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. క‌న్నడలో సూప‌ర్‌ హిట్ అయిన ‘కవలుదారి’ సినిమాకు ఇది తెలుగు రీమేక్‌. జి.ధనంజయన్ సమర్పణలో క్రియేటివ్ ఎంట‌ర్‌టైనర్స్ అండ్ డిస్ట్రిబ్యూట‌ర్స్ బ్యాన‌ర్‌పై లలిత ధనంజయన్ ఈ సినిమాను తెలుగు, తమిళ భాషల్లో నిర్మిస్తున్నారు. తెలుగు టీజర్‌ను నటుడు రానా దగ్గుబాటి గురువారం విడుదల చేశారు. కన్నడలో రిషి పోషించిన ట్రాఫిక్ పోలీస్ సబ్ ఇన్‌స్పెక్టర్ పాత్రలో సుమంత్ నటించారు. ‘కపటధారి’ టీజర్‌ చూస్తుంటే ప్రపంచంలో జరిగే ప్రతి విషయం వెనుక బలమైన కారణం ఉంటుందనే పాయింట్‌ను బేస్‌ చేసుకుని కథను రూపొందించినట్లు అర్థమవుతోంది. అలాగే ఓ హత్య కేసును ఇన్వెస్టిగేట్‌ చేసే పోలీసులతో ట్రాఫిక్‌ పోలీస్‌ ఆఫీసర్‌ అయిన సుమంత్‌ జాయిన్‌ అవుతానని అడగటం.. చివరకు కేసును ఇన్వెస్టిగేట్‌ చేస్తున్న పోలీసులు కేసులో ఇన్‌వాల్వ్‌ కావద్దని సుమంత్‌కు వార్నింగ్‌ ఇవ్వడం వంటి సన్నివేశాలు ఎగ్జయిట్‌మెంట్‌ను పెంచుతున్నాయి. Also Read: టీజర్‌ చివరలో వచ్చే ‘వాడి అసలు మొహం దాచుకోవడానికి వేషాలు మార్చే వ్యక్తి’ అనే డైలాగ్‌తో పాటు టీజర్‌ బ్యాగ్రౌండ్‌లో వినిపిస్తున్న ‘రంగులు మార్చే లోకం.. పాచికలాడే న్యాయం.. నీతీ నియమం మరిచి.. జీవితమంటే యుద్ధం పోరాడటమే లక్ష్యం.. కన్నులు కప్పి తిరిగేవాడేరా..’’ అనే సాంగ్‌ కూడా వేషాలు మార్చే ఓ వ్యక్తి గురించి చెబుతుంది. ఇంతకూ ఆ వేషాలు మార్చే వ్యక్తి ఎవరు? అనేది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్‌. ఈ చిత్రానికి డాక్టర్ ధ‌నంజ‌య‌న్ స్క్రీన్‌ప్లే అడాప్షన్ చేస్తుండ‌గా.. బాషాశ్రీ మాట‌లు అందిస్తున్నారు. ప్రవీణ్ కె.ఎల్ ఎడిట‌ర్‌గా, స్టంట్ సిల్వ స్టంట్ మాస్టర్‌గా, విదేశ్ ఆర్ట్ డైరెక్టర్‌గా ప‌నిచేస్తున్నారు. ప్రస్తుతం సినిమా పోస్ట్‌ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు జరుగుతున్నాయని, సినిమా విడుదల తేదీని త్వరలోనే ప్రకటిస్తామని చిత్ర యూనిట్‌ ప్రకటించింది. ఈ చిత్రంలో సుమంత్ సరసన నందితా శ్వేత నటించింది. పూజాకుమార్‌, నాజ‌ర్‌, జ‌య‌ప్రకాశ్‌, సంప‌త్ ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. సైమన్ కె. కింగ్ సంగీతం సమకూరుస్తున్నారు. Also Read:


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3myanJZ
v

ఆ లెటర్ ఫేక్.. నా ఆరోగ్యం గురించి చెప్పింది మాత్రం నిజమే: రజినీకాంత్

తన ఆరోగ్య పరిస్థితి సరిగా లేకపోవడం వల్ల తాను రాజకీయాల్లోకి రాకపోవచ్చని తెలియజేస్తూ సూపర్ స్టార్ స్వయంగా రాసిన లేఖ ఒకటి బుధవారం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ లేఖ నిన్న పెద్ద దుమారమే రేపింది. దీనిపై రజినీ ఫ్యాన్స్‌తో పాటు విమర్శకులు తీవ్ర స్థాయిలో చర్చించుకున్నారు. అయితే, ఈ లేఖపై గురువారం రజినీకాంత్ స్వయంగా స్పందించారు. ఈ లేఖలో నిజం లేదని ఆయన స్పష్టం చేశారు. ఈ మేరకు ట్విట్టర్‌లో ఆయన ఒక ప్రకటన ఉంచారు. తాను రాజకీయాల్లోకి రావడం లేదని స్పష్టం చేస్తూ విడుదల చేసిన ఆ లేఖ ఫేక్ అయినప్పటికీ ఆ లేఖలో పేర్కొన్నట్టు తన ఆరోగ్య పరిస్థితి బాగోలేకపోవడం మాత్రం నిజమేనని రజినీ వెల్లడించారు. ‘‘నేను ప్రకటించినట్టు ఒక లేఖ సోషల్ మీడియాలో, ప్రెస్‌లో విపరీతంగా చక్కర్లు కొడుతోంది. ఇది నా ప్రకటన కాదని ప్రతి ఒక్కరికీ తెలియజేస్తున్నాను. అయితే, నా ఆరోగ్యం గురించి.. డాక్టర్లు నాకు ఇచ్చిన సలహాల గురించి పేర్కొన్న విషయాలన్నీ నిజమే. నా రాజకీయ ప్రవేశం గురించి ప్రజలకు నేనే స్వయంగా చెబుతాను. నా రజినీ మక్కల్ మండ్రమ్ సభ్యులతో చర్చించిన తరవాత సరైన సమయంలో ఈ ప్రకటన చేస్తాను’’ అని రజినీకాంత్ స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో వైరల్ అయిన ఫేక్ లెటర్‌లో రజినీకాంత్ ఇక రాజకీయాల్లోకి రారని, ఈ మేరకు ఆయన ఈ ఏడాది డిసెంబర్‌లో తన తుది నిర్ణయాన్ని వెల్లడిస్తారని పేర్కొన్నారు. ‘‘నా జీవితం గురించి నేను భయపడటం లేదు. ప్రజల సంక్షేమమే నాకు ముఖ్యం. రాజకీయాల్లో మార్పు తీసుకొస్తానని నేను ఇచ్చిన మాటకు కట్టుబడి రాజకీయ సంగ్రామంతో చురుకుగా పాల్గొంటాను. ఈ క్రమంలో నా ఆరోగ్యం క్షీణించినట్లయితే దాని వల్ల కొత్త సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అలాంటి పరిస్థితిలోనూ నేను రాజకీయాల్లోకి రావాల్సి వస్తే జనవరి 15 కంటే ముందే రాజకీయ పార్టీని నేను ప్రారంభిస్తాను. అంతేకాదు, నా నిర్ణయాన్ని డిసెంబర్‌లో తెలియజేస్తాను. పార్టీని నా అభిమానులకు వదిలిపెడతాను. అప్పటి పరిస్థితుల ఆధారంగా నేను ఏం చేయాలో ప్రజలే నిర్ణయించాలి. ప్రజల తీర్పు అంటే ఆ దేవుడి తీర్పు. జై హింద్’’ అని ఆ ఫేక్ లెటర్‌లో రాసుంది. రజినీకాంత్ రాజకీయాల్లోకి రావాలని ఆయన అభిమానులు ఎప్పటి నుంచో కోరుకుంటున్నారు. ఆయన కచ్చితంగా రాజకీయాల్లోకి వస్తారనే ప్రచారం కూడా జరిగింది. వీటిని నిజం చేస్తూ 2017 డిసెంబర్‌లో చెన్నైలోని రాఘవేంద్ర కళ్యాణ మండపంలో అభిమానులతో సమావేశం ఏర్పాటుచేసి తన పొలిటికల్ ఎంట్రీ గురించి రజినీకాంత్ ప్రకటించారు. ఆ సమయంలో రజినీ ప్రకటనపై విపరీతమైన చర్చ జరిగింది. రజినీ నిర్ణయాన్ని స్వీకరించినవారూ ఉన్నారు.. వ్యతిరేకించిన వాళ్లూ ఉన్నారు. అయితే, రజినీకాంత్ ప్రకటన చేసి మూడేళ్లు గడుస్తున్నా రాజకీయ పార్టీని స్థాపించడంపై ఇప్పటికీ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. కాకపోతే, ఆయన ఫ్యాన్ క్లబ్ రజినీ మక్కల్ మండ్రమ్ (RMM) రాజకీయ సంస్థగా మారిపోయింది. ఒకవేళ తన పార్టీ 2021 ఎన్నికల్లో పోటీ చేసినా తాను మాత్రం ముఖ్యమంత్రి అభ్యర్థిగా పోటీ చేయనని రజినీకాంత్ ఇప్పటికే స్పష్టం చేశారు. Also Read:


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2HNl5Nz
v

కాబోయే భర్తను పరిచయం చేసిన పునర్నవి.. ఎవరితను?

బిగ్ బాస్ బ్యూటీ, నటి భూపాలం తనకు పెళ్లి కుదిరినట్టు నిన్న సోషల్ మీడియా ద్వారా వెల్లడించిన విషయం తెలిసిందే. తనకు నిశ్చితార్థం అయినట్టు తెలియజేస్తూ ఉంగరం వేలును చూపుతూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పోస్ట్ పెట్టారు పునర్నవి. అంతకు మించి వివరాలేవీ బయటపెట్టలేదు. అయితే, ఈరోజు తన కాబోయే భర్తను పున్ను పరిచయం చేశారు. అతని పేరు ఉద్భవ్ రఘునందన్. ఆయన కూడా సినీ పరిశ్రమకు చెందినవారే. నటుడు, స్క్రీన్ రైటర్. నిన్నటిలానే ఈరోజు కూడా పునర్నవి తన ఎంగేజ్‌మెంట్ రింగ్ చూపిస్తూ కాబోయే భర్త ఫొటోను కూడా కాస్త బ్లర్ చేసి చూపించారు. ఈ ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన పున్ను.. ‘‘నేను అవును అని చెప్పాల్సి వచ్చింది. ఉద్భత్ రఘునందన్, నేను మా బిగ్ డే గురించి రేపు చెబుతాం’’ అని పేర్కొన్నారు. ఇక రఘునందన్ అయితే పున్నుతో తీసుకున్న ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ‘‘పునర్నవి యస్ చెప్పింది. చాలా ఆనందంగా ఉంది. ఆ బిగ్ డే గురించి రేపు మీకు చెప్పడానికి ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నా’’ అని రఘునందన్ పేర్కొన్నారు. ఈ ప్రకటనలు చూస్తుంటే ఎవరైనా వీళ్లకు నిజంగా నిశ్చితార్థం అయిపోయిందేమో, రేపు ప్రకటించబోయేది పెళ్లి తేదీనేమో అనే అనిపిస్తుంది. కానీ, కాస్త లోతుగా ఆలోచిస్తే ఇది వాళ్లు నటించిన వెబ్ సిరీస్ ప్రచారం అని అర్థమవుతోంది. ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫాం ‘ఆహా’ కోసం వీళ్లిద్దరూ ఒక వెబ్ సిరీస్‌లో నటించారు. ఇటీవలే వీరిద్దరూ డబ్బింగ్ కూడా పూర్తిచేశారు. హిందీ వెబ్ సిరీస్ ‘పర్మనెంట్ రూంమేట్స్’కు ఇది రీమేక్. ఈ వెబ్ సిరీస్ ప్రచారంలో భాగంగానే పున్ను ఈ ఎంగేజ్‌మెంట్ ప్లాన్ వాడుతున్నట్టు సమాచారం. నిజానికి ఈ ఉద్భవ్ రఘునందన్ అసలు పేరు పృథ్వీరాజ్ సంపర. సినిమాలంటే పిచ్చి. యూట్యూబ్‌లో ఈయనకు ‘చికాగో సుబ్బారావు’ అనే ఛానెల్ ఉంది. షార్ట్ ఫిలింస్ చేస్తూ ఈ ఛానెల్‌లో ఆయన పెడుతుంటారు. ఈ షార్ట్ ఫిలింస్‌కు దర్శకుడు, నిర్మాత కూడా ఆయనే. ఇప్పటి వరకు షార్ట్ ఫిలింస్ నటుడిగా ఉన్న ఈయన ఇప్పుడు వెబ్ సిరీస్ ద్వారా ఓటీటీ ప్లాట్‌ఫాంలోకి అడుగుపెడుతున్నారు. దీని కోసమే ఆయన తన పేరును ఉద్భవ్ రఘునందన్ అని మార్చుకున్నట్టున్నారు. Also Read:


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3mzhimo
v

ఇంటి దగ్గర మసాలాలు తయారు చేస్తున్నారా? అయితే Samsung Microwave తో నీనా గుప్తా ఎలా తయారు చేస్తున్నారో చూడండి

మసాలాలు తయారు చెయ్యడానికి కష్టపడకుండానే మన భారతదేశ సాంప్రదాయ వంటకాలను వండచ్చా? నీనా గుప్తా మాత్రం అవుననే అంటున్నారు (అయితే రెడీ‌మేడ్ మసాలాలతో మాత్రం కాదు). ఈ మధ్యనే నీనా తన సీక్రెట్ చెప్పారు: TM Microwave తో కష్టపడకుండానే త్వరగా ఇంటి దగ్గరే మసాలాలు తయారుచేసుకోవచ్చు. నీనా, తన కూతురు మసాబాకు ఇంటిలో చేసిన బిర్యానీ రుచి చూపిస్తూ Samsung Masala & Sun Dry TM Microwave తో స్పెషల్ బిర్యానీ మసాలాను ఎలా తయారు చెయ్యచ్చో చెప్పారు, మీరు కూడా చూడండి. అమ్మ బిర్యానీ మసాలాను ఎలా సిద్ధం చేసిందా అని మసాబా ఆశ్చర్యపడుంటుంది. నీనా గుప్తా మాత్రం Samsung Masala & Sun Dry TM Microwave కు ఖచ్చితంగా థాంక్స్ చెప్తుంది, ఎందుకంటే దీనితో ఇంటి దగ్గరే సులభంగా, ఎంతో బాగా ఫ్రెష్ మసాలాలను ఎవరైనా తయారుచేసుకోవచ్చు. కాబట్టి, ఇప్పుడు గతంలో కంటే తక్కువ సమయం, పనితో పూర్తి సాంప్రదాయ పద్దతిలో రుచికరమైన భారతీయ వంటకాలను ఇంటిలోనే వండి మీ ప్రియమైన వారికి వడ్డించొచ్చు. భారతీయ వంటకాల కోసం డిజైన్ చెయ్యబడింది. నీనా గుప్తా చెప్పినట్లు, Samsung Masala & Sun Dry TM ప్రత్యేకమైన మసాలా ఫీచర్‌తో వస్తోంది, ఇది నిమిషాల్లోనే మసాలాలను ఎంతో బాగా తయారుచేస్తుంది. మనం రోజూ ఇంటిలో వండుకునే పప్పు మరియు కథీలను మరింత రుచిగా వండడానికి అనేక రకాల తడ్కా (టెంపరింగ్) లను కూడా చేసుకోవచ్చు. కొన్ని బటన్లను ప్రెస్ చేస్తే చాలు, ఈ మైక్రో‌వేవ్ తక్కువ ఆయిల్‌ను వాడి మీకు రుచికరమైన తడ్కాలను అందిస్తుంది. ఆరోగ్యంపై శ్రద్ద ఉంటే, రుచితో రాజీ పడకుండా ఇది తయారుచేసే వంటలను తినడం ఎంతో సంతోషంగా ఉంటుంది. మీకు ఏదైనా కొత్తగా చెయ్యాలనిపిస్తే, దీనితో పిజ్జా చేసుకోవచ్చు. ఉదాహరణకు, ఈ మైక్రోవేవ్ నిమిషాల్లోనే ఎండలో ఎండబెట్టినట్టుగా టమాటో స్లైసెస్‌ను టాపింగ్ కోసం మీకందిస్తుంది. ఇందుకు దీని Sun Dry feature కు థాంక్స్ చెప్పాల్సిందే. చూస్తుంటే Samsung Masala & Sun Dry TM, నీనా గుప్తా ఫేవరెట్ కిచెన్ ఆల్-రౌండర్‌గా మారినట్టుంది. వేగం, తెలివి, వెర్సటైల్. చాలా సంవత్సరాల సాంప్రదాయ వంట పద్దతుల తరువాత, తక్కువ పనితో సాంప్రదాయ వంటలను అందించే ప్రీ-ప్రోగ్రామ్ రెసిపీలతో నీనా గుప్తా ఎంతో ఎంజాయ్ చేస్తోంది. ఇది చూడడానికి చాలా అందంగా డిజైన్ చెయ్యబడింది, Samsung Masala & Sun Dry TM Microwave హెల్తీ ఫుడ్, బేకింగ్, క్రిస్ప్ డ్రైయింగ్, రోస్టింగ్, గ్రిల్లింగ్ మరియు స్లిమ్ ఫ్రైయింగ్ వంటి అనేక ఫీచర్లను అందిస్తుంది. ఇందులో ఉన్న అనేక రకాల వంట పద్ధతులు మీ నోరూరేలా చేస్తాయి. ఇక మీరు రెడీమేడ్ మసాలాలకు టాటా చెప్పి, Samsung Masala & Sun Dry TM Microwave తో మన సాంప్రదాయ రుచులకు తిరిగి స్వాగతం చెప్పడానికి రెడీగా ఉన్నారా? మరింత సమాచారం కోసం, ఆకర్షణీయమైన క్యాష్‌బ్యాక్ ఆఫర్లు మరియు EMI ల కోసం . డిస్‌క్లైమర్: ఈ ఆర్టికల్ శాంసంగ్ తరపున టైమ్స్ ఇంటర్నెట్ స్పాట్‌లైట్ టీంచే వ్రాయబడింది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/37Q8hB7
v

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...