Friday 30 October 2020

ఫ్యామిలీ లైఫ్‌ ఎంజాయ్‌ చేస్తున్నా.. అవన్నీ అవాస్తవాలే: సమీరా రెడ్డి

హిందీ, తెలుగుతో పాటు పలు సౌత్ ఇండియన్ భాషల్లో సినిమాలు చేసి కుర్రకారును షేక్ చేసిన .. గత కొన్ని రోజులుగా వెండితెరకు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. కొన్నేళ్లపాటు ప్రేక్షకులను ఉర్రూతలూగించిన ఈ అమ్మడు పెళ్లి చేసుకొని వెండితెరకు దూరమయ్యారు. అయినప్పటికీ సోషల్ మీడియా వేదికగా ప్రేక్షకులతో టచ్‌లో ఉంటూ తన, తన కుటుంబానికి సంబంధించిన రెగ్యులర్ అప్‌డేట్స్ ఇస్తున్నారు. అయితే సమీరా ఓ కోలీవుడ్ సినిమాతో రీ ఎంట్రీ ఇవ్వబోతోందంటూ గత కొన్నిరోజులుగా వార్తలు వస్తున్న నేపథ్యంలో తాజాగా వాటిపై స్పందిస్తూ క్లారిటీ ఇచ్చారామె. Also Read: ఆర్య, విశాల్‌ ప్రధాన పాత్రల్లో ఆనంద్‌ శంకర్‌ దర్శకత్వం వహించనున్న ‌చిత్రంలో సమీరా రెడ్డి నటిస్తోందనే టాక్ బయటకొచ్చింది. ఆమె రోల్ సినిమాకు కీలకం కానుందని చెప్పుకున్నారు. తాజాగా అట్టి వార్తలపై స్పందించిన సమీరా.. అవన్నీ అవాస్తవాలని, తాను ఏ సినిమాలోనూ నటించడం లేదని చెప్పారు. ప్రస్తుతానికి ఫ్యామిలీ లైఫ్‌ ఎంజాయ్‌ చేస్తున్నారని తెలిపారు. దీంతో సమీరా రీ ఎంట్రీ వార్తలకు ఫుల్‌స్టాప్ పడింది. 'మైనే దిల్‌ తుజ్కో దియా' అనే హిందీ సినిమాతో సిల్వర్ స్క్రీన్‌పై అడుగుపెట్టిన సమీరా రెడ్డి.. ఆ తర్వాత తెలుగు తెరపై కూడా అలరించారు. ఎన్టీఆర్‌తో కలిసి 'నరసింహుడు, అశోక్' అదేవిధంగా చిరంజీవితో కలిసి 'జై చిరంజీవ' చిత్రాలలో నటించారు. పెళ్లి అనంతరం వెండితెరకు దూరమై తన కుటుంబంతో సరదాగా గడుపుతున్నారు. అప్పుడప్పుడూ తన చిన్నారులతో దిగిన పిక్స్ షేర్ చేస్తూ ఆకట్టుకుంటూ ఉంటారు సమీరా.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/35IaQCG
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...