Monday 31 May 2021

ఆయనతో రొమాన్స్ చేసే ఛాన్స్ మూడుసార్లు మిస్.. ఇప్పుడా కోరిక నెరవేరుతోంది.. ప్రియమణి ఓపెన్ కామెంట్స్

ఒకానొక సమయంలో స్టార్ హీరోలతో నటించి తెలుగు ప్రేక్షకుల మెప్పు పొందింది . కెమెరా ముందు నటనా ప్రతిభ కనబర్చుతూనే తన అందచందాలతో అట్రాక్ట్ చేసి ప్రేక్షక లోకానికి కొత్త టేస్ట్ పరిచయం చేసింది. ఆ తర్వాత పెళ్లి చేసుకొని కొద్ది కాలం పాటు సినిమాలకు దూరంగా ఉంటూ వైవాహిక జీవితం గడిపిన ఆమె.. రీసెంట్‌గా సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి స్టార్ హీరోలకు బెటర్ ఛాయిస్ అవుతోంది. ఈ నేపథ్యంలోనే రెండు పెద్ద చిత్రాల్లో నటించే అవకాశం పట్టేసిన ప్రియమణి.. తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో తన మనసులోని మాటను బయటపెట్టింది. దగ్గుబాటి రానా- సాయిపల్లవి హీరో హీరోయిన్లుగా నటించిన 'విరాటపర్వం' సినిమాతో పాటు విక్టరీ సరసన '' సినిమాలోనూ నటించింది ప్రియమణి. తమిళంలో ‘అసుర‌న్‌’ పేరుతో విడుదలై సక్సెస్ సాధించిన సినిమాను తెలుగులో 'నారప్ప'గా ప్రేక్షకుల ముందుకు తెస్తున్నారు. ఇందులో వెంకటేష్ భార్యగా ప్రియమణి కనిపించనుంది. అయితే తాజాగా ఈ రెండు సినిమాల విషయమై మాట్లాడుతూ ఈ రెండు ప్రాజెక్ట్స్ తన కెరీర్‌‌లో మైల్ స్టోన్స్ అవుతాయని ఆమె చెప్పింది. ఇక సీనియర్ హీరో వెంకటేష్‌తో నటించే అవకాశం తనకు గతంలోనే మూడుసార్లు వచ్చినా.. కొన్ని కారణాల వల్ల ఆయనతో ఆన్ స్క్రీన్ రొమాన్స్ చేయలేకపోయానని, ఇన్నాళ్లకు మళ్ళీ వెంకటేష్‌తో నటించే ఛాన్స్ రావడం సంతోషంగా ఉందని పేర్కొంది. ఎప్పటినుంచో వెంకీతో నటించాలనే తన కోరిక నెరవేరిందని ఆమె తెలిపింది. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకొని విడుదలకు రెడీ అయినా ఈ సినిమాను కరోనా కారణంగా వాయిదా వేశారు మేకర్స్.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3vGUCW2
v

అకీరా ఎంట్రీ కన్ఫామ్.. హీరో అంటూ బడా ప్రొడ్యూసర్ కామెంట్.. అర్థమదేనా?

పవర్ స్టార్ తనయుడు అకీరా నందన్‌కు సోషల్ మీడియాలో ఉండే ఫాలోయింగ్ గురించి అందరికీ తెలిసిందే. టాలీవుడ్ స్టార్ హీరోలకంటే ఎక్కువగా క్రేజ్ ఉంది. అకీరాకు సంబంధించిన ఏ చిన్న విషయమైనా సరే సోషల్ మీడియాలో ట్రెండ్ అవ్వాల్సిందే. అలాంటిది పవన్ కళ్యాణ్, పక్కపక్కనే నిల్చున్న ఫోటోలు ఇంకెలా వైరల్ అవుతుంటాయో అర్థం చేసుకోవచ్చు. మామూలుగానే అకీరా సోషల్ మీడియా ప్రపంచానికి దూరంగా తన లోకమేదో తానే అన్నట్టుగా బతుకుతాడు. అకీరా ఫోటోలు కూడా సోషల్ మీడియాలో ఎక్కువగా కనిపించవు. అకీరాను చూపించండి అంటూ రేణూ దేశాయ్‌కి అభిమానులు ఎన్నిసార్లు రిక్వెస్ట్‌లు పెట్టినా కూడా నవ్వుతూ తిరస్కరిస్తుంటారు. అకీరాకు అలాంటివి ఇష్టముండవు, ఫోటోలు దిగడు అంటూ దాట వేస్తుంటారు. అయితే ఎప్పుడైనా సందర్భాను సారంగా అకీరా బయటకు వస్తే కొన్ని ఫోటోలు నెట్టింట్లో చక్కర్లు కొడుతుంటాయి. ఆ మధ్య అకీరా పంచెకట్టు ఫోటోలు సోషల్ మీడియాను ఊపేశాయి. అంతకు ముందు నిహారిక పెళ్లిలో దిగిన అకీరా ఫోటోలు నెట్టింట్లో హల్చల్ చేశాయి. ఇలా ప్రతీసారి అకీరా ఫోటోలు హాట్ టాపిక్ అవుతుంటాయి. తాజాగా తండ్రితో కలిసి ఉన్న అకీరా ఫోటోలు చూపి పవర్ స్టార్ అభిమానులు మురిసిపోతోన్నారు. ఇక ఇలాంటి ఫోటోలు బయటకు వస్తే.. ఆయన భక్తుడు ఊరికే ఉంటారా?. తన స్టైల్లో స్వామి భక్తిని ప్రదర్శించేయరూ. అంతేజోష్ అంతే స్పీడులో తన మాటల తూటాలను తీశారు. నా దేవుడితో నా హీరో అంటూ అదిరిపోయే కామెంట్ చేశారు. ఇక్కడ అకీరాను హీరో అనడంతో ఎన్నో అనుమానాలు వచ్చేశాయి. కొంపదీసి అకీరా ఎంట్రీ బండ్ల గణేష్ చూసుకుంటున్నారా? అంటూ నెటిజన్లు జుట్టు పీక్కుంటున్నారు. మొత్తానికి అకీరా ఎంట్రీ ఉంటుందని ఇలా పరోక్షంగా చెప్పావా? బండ్లన్న అని కామెంట్లు పెడుతున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3c7JIRv
v

ఒళ్లో తలవాల్చి సేద తీరుతోన్న బ్యూటీ.. పూజా హెగ్డే హల్చల్

బుట్టబొమ్మ ఫ్యామిలీతో ఎక్కువ సమయాన్ని గడపడం ఇష్టంగా ఫీలవుతుంది. అలా గతేడాది లాక్డౌన్ సమయంలో ఇంటి సభ్యులందరితో కలిసి పూజా హెగ్డే చేసిన అల్లరి అంతా ఇంతా కాదు. కజిన్స్, సోదరులు, గ్రాండ్ పేరెంట్స్ ఇలా అందరితో కలిసి పూజా హెగ్డే రచ్చ రచ్చ చేశారు. ఇక ఆ మధ్య పూజా హెగ్డే బామ్మ మరణించడంతో ఎంతో ఎమోషనల్ అయ్యారు. బామ్మను తలుచుకుంటూ పూజా హెగ్డే చేసిన పోస్ట్ అందరినీ కదిలిచింది. ఇప్పుడు పూజా హెగ్డే ఇంటి పట్టునే ఉంటూ ఫ్యామిలీతో విలువైన సమయాన్ని గడుపుతున్నారు. ప్రస్తుతం దేశంలో కరోనా పరిస్థితి ఎలా ఉందో తెలిసిందే. దాదాపు అన్ని రాష్ట్రాలు కూడా లాక్డౌన్‌ను పాటిస్తున్నాయి. ఈ క్రమంలో అందరూ ఇంటి పట్టునే ఉంటున్నారు. ఇక సెలెబ్రిటీలు గతేడాది మాదిరిగానే ఇంట్లో ఉంటూ ఎంజాయ్ చేస్తున్నారు. మొన్నీ మధ్య పూజా హెగ్డే వంటింట్లోకి దూరి తన నైపుణ్యాన్ని ప్రదర్శించారు. ఇక తాజాగా పూజా హెగ్డే తన అమ్మమ్మ ఒళ్లో సేదతీరుతోన్నారు. ఈ మేరకు ఓ పోస్ట్ చేశారు. బేసిగ్గా మనకు కావాల్సింది కూడా ఇదే అంటూ ప్రేమలో మునిగిపోతోన్నారు. ఎంత పెద్ద హీరోయిన్ అయినా కూడా తల్లి కూతురే.. బామ్మకు మనవరాలే కదా. పూజా హెగ్డే ప్రస్తుతం తెలుగులో భారీ ప్రాజెక్ట్‌లతో ప్రేక్షకులను పలకరించేందుకు రెడీగా ఉన్నారు. ప్రభాస్ రాధేశ్యామ్, చిరంజీవి రామ్ చరణ్ ఆచార్య, అఖిల్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచ్‌లర్ చిత్రాలు వరుసగా లైన్‌లో ఉన్నాయి. ఇక బాలీవుడ్‌లోనూ పూజా హెగ్డే పలు ప్రాజెక్ట్‌లలో ఎంపికయ్యారు. ఏకంగా సల్మాన్ ఖాన్ సినిమాలోనే ఛాన్స్ కొట్టేశారు. దళపతి విజయ్ పక్కన హీరోయిన్‌గానూ ఎంపికయ్యారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2RXyPLk
v

ఏది సంతోషాన్ని ఇస్తే అదే చేయండి.. లావణ్య త్రిపాఠి కొటేషన్ వైరల్

టాలీవుడ్ బ్యూటీ సోషల్ మీడియాలో ఎంత సరదాగా ఉంటుందో అందరికీ తెలిసిందే. అందాల రాక్షసి సినిమాతో అందరినీ కట్టిపడేసిన లావణ్య కెరీర్ భలేభలే మగాడివోయ్ సినిమాతో పీక్స్‌కు వెళ్లింది. అయితే మళ్లీ కెరీర్ కాస్త స్లో అయింది. అయితే అర్జున్ సురవరం సినిమాతో మళ్లీ సక్సెస్ బాట పట్టారు. అలా లావణ్యకు మళ్లీ ఆఫర్లు పెరిగాయి. చివరగా లావణ్య త్రిపాఠి ఏ1 ఎక్స్ ప్రెస్, చావు కబురు చల్లగా చిత్రాలతో అలరించారు. ఇందులో ఏ1 ఎక్స్ ప్రెస్ సినిమా ఓ మోస్తరుగా ఆడింది. ఇందులో హాకి ప్లేయర్‌గా లావణ్య త్రిపాఠి నటించారు. సినిమా పర్వాలేదనిపించడంతో పాటు ఆమె నటనకూ మంచి మార్కులే పడ్డాయి. ఇక ఎన్నో అంచనాల నడుము వచ్చిన చావు కబురు చల్లగా సినిమా బోల్తా కొట్టేసింది. కెరీర్‌లో మొదటిసారిగా డిఫరెంట్ పాత్రను పోషించిన లావణ్యకు సినిమా ఫ్లాప్ అవ్వడంతో ఎదురుదెబ్బ తగిలినట్టైంది. లావణ్య త్రిపాఠి ఈ మధ్య తన ఫిట్ నెస్ మీద ఎక్కువగా దృష్టి పెట్టినట్టు కనిపిస్తోంది. రాశీ ఖన్నా, నిహారిక, లావణ్య త్రిపాఠి వంటి వారంతా ఒకప్పుడు వర్కవుట్లతో హల్చల్ చేసేవారు. ఇప్పుడు మాత్రం లావణ్య ఒంటరిగా జిమ్‌లో కష్టపడుతోన్నట్టున్నారు. తాజాగా ఆమె జిమ్‌లో చేస్తోన్న పనుల గురించి చెబుతూ ఓ పోస్ట్ చేశారు. మీకు ఏదైతే సంతోషాన్ని ఇస్తుందో అదే చేయండనే సూక్తిని చెబుతూ తాను దిగిన సెల్ఫీలను షేర్ చేశారు. ప్రస్తుతం లావణ్య ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతానికి లావణ్య చేతిలో తెలుగు ప్రాజెక్ట్‌లు లేనట్టు కనిపిస్తోంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3fWfphZ
v

బుల్లి నిక్కర్‌లో అర్జున్ రెడ్డి భామ.. వింత ఎక్స్‌ప్రెషన్స్‌తో షాలినీ పాండే హల్చల్

అర్జున్ రెడ్డి సినిమాతో కొందరి దశ తిరిగిపోయింది. హీరో విజయ్ దేవరకొండ, హీరోయిన్ షాలినీ పాండే, దర్శకుడు సందీప్ రెడ్డి వంగా వంటి వారు ఓవర్ నైట్ స్టార్ అయిపోయారు. అలా అందాలకు, నటనకు అందరూ ఫిదా అయ్యారు. అర్జున్ రెడ్డి లాంటి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టినా కూడా షాలినీ కెరీర్ మాత్రం ఊపందుకోలేకపోయింది. తెలుగులో అంతగా అవకాశాలు రాకపోవడంతో షాలినీ పాండే కోలీవుడ్‌పైనా దృష్టిపెట్టేశారు. తమిళంలో 100 పర్సెంట్ కాదల్ (100 పర్సెంట్ లవ్ రీమేక్) సినిమాలో హీరోయిన్‌గా షాలినీ నటించి మంచి మార్కులు కొట్టేశారు. ఇక తెలుగులో మహానటి, 118 వంటి సినిమాలతో ఆడియెన్స్‌ను పలకరించారు. అయితే షాలినీ పాండేకు ఆశించిన విజయం మాత్రం ఇంత వరకు మళ్లీ దక్కలేదు. అయినా కూడా షాలినీ పాండే సోషల్ మీడియాలో ఫుల్ హల్చల్ చేస్తోంది. సోషల్ మీడియాలో షాలినీ పాండే చేసే రచ్చ అంతా ఇంతా కాదు. పొట్టి పొట్టి బట్టల్లో షాలినీ చేసే అందాల విందుకు అందరూ ఫిదా అవుతుంటారు. ఆమె షేర్ చేసే ఫోటోలన్నీ కూడా నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా ఆమె ఓ ఫోటోను షేర్ చేశారు. ఇందులో బుల్లి నిక్కర్లో దర్శనమిచ్చారు. అంతేకాకుండా ఆమె పెట్టిన ఎక్స్‌ప్రెషన్స్ కూడా అందరినీ ఆకట్టుకుంటున్నాయి. ప్రస్తుతం షాలినీకి తెలుగులో ఎలాంటి ఆఫర్లు లేవు. చివరగా జయేష్ భాయ్ జోర్దార్ అనే సినిమాతో పలకరించేందుకు రెడీగా ఉన్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2TmqaCo
v

నేను వెజిటేరియన్.. మటన్ షాప్‌లో నా పేరా? సోనూసూద్ షాకింగ్ రియాక్షన్

కరీంనగర్ సుల్తానాబాద్‌కు చెందిన కన్నయ్య మటన్ వ్యాపారం చేస్తుంటాడు. ప్రస్తుతం ఆయన మటన్ షాప్‌లో పేరిట అదిరిపోయే ఆఫర్ నడుస్తోంది. ఆఫర్ అంటే తన జేబులు నింపుకోవడానికి మాత్రమే కాదు.. కరోనా రోగులకు తన వంతు సాయంగా నిలబడటం కోసం కూడా. ప్రస్తుతం మార్కెట్‌లో కిలో మటన్ ధర రూ.700 నుంచి 800 వరకూ ఉంది. ఆన్ లైన్‌లో అయితే రూ.1000 వరకూ ధర పలుకుతుంది. అయితే కరీంనగర్ కన్నయ్య మటన్ షాపులో కిలో మటన్ ధర కేవలం రూ. 650 మాత్రమే. ఇందులో రూ.600 కన్నయ్య తీసుకుని మిగిలిన రూ.50 రూపాయిల్ని సోనూసూద్ చారిటబుల్ ట్రస్ట్‌కి విరాళంగా ఇస్తున్నాడు. ఈ ఆఫర్ ఏదో బాగుందే.. కరోనా రోజుల్లో మటన్ ముక్క తిన్నట్టుగానూ ఉంటుంది.. యాభై రూపాయిలు సాయం చేసినట్టుగా ఉంటుందని జనం కన్నయ్య మటన్ షాపు దగ్గర క్యూ కడుతున్నారు. అయితే ఈ విషయం తీన్మార్ వార్తలు ద్వారా సోనూసూద్‌కి చేరడంతో ఫన్నీగా రియాక్ట్ అయ్యారాయన. ‘నేను శాఖాహారిని.. మటన్ షాపు దగ్గర నా పేరా?? ఏదైనా వెజిటేరియన్ షాపు పెట్టుకుంటానంటే ఏదైనా సాయం చేస్తా’ అంటూ నవ్వుతున్న ఎమోజీతో ట్వీట్‌ చేశారు సోనూసూద్. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/34LIV4V
v

చావుబతుకుల్లో కొరియోగ్రాఫర్ తండ్రి.. అర్థరాత్రి పూట ఆదుకున్న మెగాస్టార్ అల్లుడు, తీవ్ర భావోద్వేగం

కరోనా నేపథ్యంలో మెగాస్టార్ స్టార్ చిరంజీని తనకు చేతనైన సాయం చేస్తున్నప్పటికీ కొంతమంది పనికట్టుకుని ఆయన్ని టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పిస్తున్నారు. ముఖ్యంగా నటుడు సోనుసూద్‌తో పోల్చుతూ మెగాస్టార్‌ని తక్కువ చేస్తూ మాట్లాడటంపై ఫైర్ అయ్యారు మెగా అభిమాని, కొరియోగ్రాఫర్ . సీసీఎస్ ద్వారా వందలాదిమంది సినీ కార్మికులను ఆదుకుని ఇప్పుడు సొంతంగా కోట్లు ఖర్చుపెట్టి ఆక్సిజన్ సరఫరా కేంద్రాలను ఏర్పాటు చేస్తుంటే.. ఆయన సేవల్ని గుర్తించాల్సింది పోయి విమర్శిస్తారా? అంటూ ఆట సందీప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు మెగాస్టార్ మాత్రమే ఎందుకు సాయం చేయాలి..? ఆయనా మనలాంటి మనిషే కదా.. చిరంజీవిగారు ఇంట్లో చేపలు కూర వండుకుంటే మీకేంటి నష్టం.. ఆయన చేపల కూర తినకూడదా? పనీపాటా లేనివాళ్లే ఆయన్ని విమర్శిస్తారంటూ ఓ రేంజ్‌లో కౌంటర్ ఇచ్చారు ఆట సందీప్. ఈ సందర్భంలో కేవలం గారు మాత్రమే కాదని.. ఆ ఫ్యామిలీ హీరోలంతా సాయం చేయడంలో ముందుంటారని తెలియజేస్తూ మెగాస్టార్ అల్లుడు తనకు చేసిన సాయాన్ని చెప్పుకుని ఎమోషనల్ అయ్యారు. ఆయన మాట్లాడుతూ.. ‘మా ఫాదర్ కిమ్స్ హాస్పటల్‌లో క్రిటికల్ కండిషన్‌లో ఉన్నప్పుడు.. నేను చిరంజీవి గారి అల్లుడు కళ్యాణ్ దేవ్‌కి కాల్ చేశా. సార్.. నేను ప్రాబ్లమ్‌లో ఉన్నా.. ఏం చేయాలో తెలియడం లేదు.. అపోలో హాస్పటల్‌కి తీసుకువెళ్లాలని అనుకుంటున్నా హెల్ప్ చేస్తారా? అని అడిగితే.. నువ్ ఫోన్ పెట్టెయ్.. నేను మళ్లీ చేస్తానని వెంటనే ఫోన్ చేసి.. సందీప్ ఇంటికి అంబులెన్స్ వస్తుంది.. హాస్పటల్‌కి తీసుకుని వెళ్లు అని చెప్పి డాక్టర్స్ అందరితోనూ మాట్లాడించి తెల్లవారుజామున మూడు వరకూ ఆయన నాతో మాట్లాడుతూనే ఉన్నారు. ఇలాంటి క్రిటికల్ కండిషన్‌లో హాస్పటల్ మార్చడం మంచిది కాదని.. అప్పటికే పరిస్థితి చేయిజారిపోయిందని డాక్టర్ల ద్వారా తెలుసుకున్న కళ్యాణ్ దేవ్ నాకు ధైర్యం చెప్పారు. నీకు ఎలాంటి ఫైనాన్సియల్ ప్రాబ్లమ్ వచ్చినా వెంటనే ఫోన్ చేయి సందీప్ అని చెప్పి నాకు భరోసా ఇచ్చారు. డబ్బు ఇవ్వడం కాదు... ఆపదని షేర్ చేసుకోవడం అందరికీ సాధ్యం కాదు. నాన్న ఇక బతకరనే విషయం డాక్టర్ల ద్వారా ముందే తెలుసుకున్న కళ్యాణ్ దేవ్.. ఆ విషయాన్ని నాతో చెప్పకుండా నా భార్యకి చెప్పి మెంటల్‌గా మమ్మల్ని ప్రిపేర్ చేశారు. నిజంగా ఆయన అంత చేయాల్సిన అవసరం లేదు. అయినా చేశారు. నేను ఆయన సినిమాకి ఒక పాట చేసి.. దానికి ఆయన డబ్బులు ఇచ్చారు. అయిపోయింది కదా అని వదిలేయలేదు.. ఆపదలో ఉన్నానని అర్థరాత్రి పూట ఆదుకున్నారు. నాకే కాదు.. జానీ మాస్టర్ వైఫ్‌కి సీరియస్ అయినప్పుడు ట్రీట్ మెంట్ మొత్తం రామ్ చరణ్ గారే చేయించారని జానీ మాస్టర్ చెప్పారు. ఇవన్నీ కెమెరా ముందు చెప్పి చేయలేదు కదా.. వాళ్లకి ప్రచారం అవసరం లేదు.. పని కావాలి అంతే. మెగా ఫ్యామిలీ వల్ల సాయం పొందుకున్న వాళ్లు ఇండస్ట్రీలో బోలెడు మంది ఉన్నారు. చిరంజీవి గారి లాగే మిగతా హీరోలు కూడా వేరే వాళ్లకి చేసి ఉండొచ్చు. కానీ అందరికీ చేయడం ఎవరికీ సాధ్యం కాదు’ అంటూ ఎమోషనల్ అయ్యాడు ఆట సందీప్.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3i4Y5Kd
v

ఇలా చేసినందుకు దయచేసి క్షమించండి.. పెళ్లిపై నోరు విప్పిన ప్రణీత

దక్షిణాది సినీ హీరోయిన్ వివాహాం నెట్టింట్లో హాట్ టాపిక్ అవుతోంది. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే ప్రణీత ఇలా ముఖ్యమైన విషయం గురించి ప్రకటన చేయకపోవడం, ముందే చెప్పకపోడంతో నెటిజన్లు షాక్ అవుతున్నారు. మరీ ముఖ్యంగా ఆమె అభిమానులు తెగ ఫీలవుతున్నారు. అయితే ప్రణీత ఇప్పుడు తన అభిమానులు శాంతపరిచేపనిలో పడ్డారు. అభిమానులందరినీ ఉద్దేశిస్తూ తన పెళ్లిపై ఓ ప్రకటన చేశారు. నేటి ఉదయం నుంచి ఫోటోలు నెట్టింట్లో వైరల్ కాసాగాయి. వ్యాపారవేత్త నితిన్ రాజును ప్రణీత వివాహామాడారు అంటూ వార్తలు వచ్చాయి. అయితే పెళ్లిపై ముందుగా ఎలాంటి ప్రకటన చేయకపోవడంతో అందరూ షాక్ అవుతున్నారు. తాజాగా ప్రణీత చేసిన పోస్ట్ అందరినీ ఆకట్టుకుంటోంది. ‘మే 30న మేం పెళ్లి చేసుకున్నామనే విషయాన్ని ప్రకటించడం ఎంతో ఆనందంగా ఉంది.. ఈ పెళ్లి గురించి ముందుగా మీకు ఎలాంటి సమాచారాన్ని అందించలేకపోయాం.. మీరు నన్ను క్షమించండి.. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో పెళ్లి తేదిని చివరి వరకు మేం కూడా నిర్ణయించుకోలేదు. అలా ఏదో ఒక డేట్ చెప్పి మీ అందరినీ కన్ఫ్యూజ్ చేయడం నాకిష్టం లేదు.. మీరు దయచేసి నా క్షమాపణలను స్వీకరించండి.. నా జీవితంలో ఎంతో ప్రత్యేకమైన ఈ రోజు మీరంతా భాగస్వామ్యం కావడం కంటే నాకు మరో ఆనందం లేదు.. మీరంటే నాకెప్పుడూ ప్రత్యేకమే.. పరిస్థితులన్నీ చక్కబడ్డాక మనందరం కలిసి సెలెబ్రేట్ చేసుకుందాం.. ప్రేమతో ప్రణీత అండ్ నితిన్’ అని చెప్పుకొచ్చారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3c5V606
v

గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా మొక్కలు నాటిన సీనియర్ హీరో, సూపర్ స్టార్ కృష్ణ

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ నేటికీ కొనసాగుతోంది. ఇప్పటికే ఎందరో సినీ, రాజకీయ ప్రముఖులు ఈ బృహత్తర కార్యక్రమంలో భాగమై మొక్కలు నాటారు. మొక్కలు నాటడం వల్ల భవిష్యత్ తరాలకు మంచి వాతావరణం ప్రసాదించిన వచ్చని, ఈ కార్యక్రమంలో ప్రతిఒక్కరూ భాగమై మొక్కలు నాటాల్సిందిగా పలువురు ప్రముఖులు చెప్పుకొచ్చారు. నేడు (మే 31) సూపర్ స్టార్ కృష్ణ ఈ కార్యక్రమంలో భాగమయ్యారు. జోగినిపల్లి సంతోష్ కుమార్ ట్విట్టర్ ద్వారా తనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసి వారు ఇచ్చిన పిలుపు మేరకు ఈ రోజు నానక్ రామ్ గూడా లోని తన నివాసంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా మొక్కలు నాటారు సీనియర్ హీరో, సూపర్ స్టార్ కృష్ణ. ఈ సందర్భంగా హీరో కృష్ణ మాట్లాడుతూ.. పచ్చదనాన్ని పెంచుతూ పర్యావరణాన్ని పరిరక్షించడం మన అందరిపై బాధ్యత ఉందని అన్నారు. రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అనే ఒక బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టి ప్రజల్లో పచ్చదనం పెంచడం కోసం చైతన్యం తీసుకురావడం చాలా సంతోషకరమైన విషయమని అతను చేస్తున్న కృషికి నేను మనస్పూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. గతంలో కూడా నేను గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటడం జరిగింది తెలిపారు. తన జన్మదినం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసిన సంతోష్ కుమార్ గారికి కృతజ్ఞతలు తెలియజేశారు కృష్ణ.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2SJCSuQ
v

దటీజ్ మహేష్ బాబు.. బుర్రపాలెంలో వ్యాక్సిన్ పంపిణీపై సర్వత్రా హర్షం

రీల్ లైఫ్‌లోనే కాదు రియల్ లైఫ్‌ హీరో అనిపిస్తున్నారు సూపర్ స్టార్ . ఇప్పటికే కొన్న వందలమంది చిన్నారులకు హార్ట్ ఆపరేషన్స్ చేయిస్తూ ప్రాణం నిలుపుతున్నా ఈ రియల్ హీరో.. తన స్వగ్రామం బుర్రిపాలెంని దత్తత తీసుకుని అనేక అభివృద్ది కార్యక్రమాలను చేపడుతున్న విషయం తెలిసిందే. కాగా నేడు సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజు కావడంతో మరో మంచి కార్యక్రమానికి పూనుకున్నారు మహేష్ బాబు. కరోనా వ్యాధి సోకకుండా తన సొంత గ్రామంలో ప్రజలందరికీ వ్యాక్సిన్ వేయించే కార్యక్రమానికి పూనుకున్నారు. వ్యాక్సిన్ పంపిణీకి సంబంధించిన ఏర్పాట్లు చేసి.. గ్రామ ప్రజలకు అవసరమైన వైద్య సదుపాయలను అందిస్తున్నారు. ఆరురోజుల పాటు ఈ వ్యాక్సిన్ పంపిణీ జరిగేలా చర్యలు చేపట్టారు. బుర్రిపాలెం గ్రామంలో మొత్తం 12 వార్డులు ఉండగా.. అందరికీ ఒకేసారి వ్యాక్సిన్ ఇవ్వడం కుదరదు కాబట్టి రోజుకి రెండు వార్డుల చొప్పున మొత్తం ఆరో రోజుల్లో 12 వార్డుల ప్రజలకు వ్యాక్సిన్ పంపిణీ చేయనున్నారు. ఈ వ్యాక్సిన్ పంపినీ సందర్భంగా సూపర్ స్టార్ మహేష్ బాబు సోషల్ మీడియా ద్వారా స్పందిస్తూ.. ఈ కార్యక్రమంలో వాలంటీర్స్‌గా సేవలు అందిస్తున్న ‘టీం మహేష్ బాబు’ సభ్యులకు ‘ఆంధ్రా హాస్పటల్’ వైద్యులకు ధన్యవాదాలు తెలుపుతూ ఫొటోలను షేర్ చేశారు. అయితే మహేష్ బాబు మాదిరే ఇతర హీరోలు కూడా ముందుకు వచ్చి ఈ కరోనా వ్యాప్తిని అరికట్టడానికి చర్యలు చేపడితే బాగుంటుందని అనేక మంది అభిప్రాయపడుతున్నారు. కాగా మెగాస్టార్ చిరంజీవి కూడా కరోనా వ్యాప్తిని అరికట్టడానికి అనేక చర్యల్ని చేపట్టారు. కరోనా సోకిన రోగుల కోసం కోట్లు ఖర్చు పెట్టి ఆక్సిజన్‌ని అందిస్తున్న విషయం తెలిసిందే.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3p3dAnw
v

రహస్యంగా ప్రణీత పెళ్లి.. వ్యాపారవేత్తను పెళ్లాడిన యంగ్ హీరోయిన్

లాక్ డౌన్ వేళ హీరోయిన్ పీటలెక్కింది. రహస్యంగా తన ప్రియుడు నితిన్‌ రాజు అనే వ్యాపారవేత్తని పెళ్లి చేసుకుంది ప్రణీత. అతి కొద్దిమంది బంధువులు, సన్నిహితుల సమక్షంలో బెంగుళూరులో ఈ వివాహ వేడుక జరిగింది. కరోనా కారణంగా బెంగుళూరులోని తన నివాసంలో కోవిడ్ నిబంధనలకు పాటిస్తూ ఈ పెళ్లి జరిగిందని సమాచారం. వివాహానికి హాజరైన ఓ స్నేహితుడు పెళ్లి ఫోటోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేయడంతో ఈ విషయం బయటకు వచ్చింది. గంటల వ్యవధిలోనే ప్రణిత పెళ్లి టాపిక్‌ హాట్‌ టాపిక్‌ అయింది. ఈ ఫోటోలు నెట్టింట తెగ చక్కర్లు కొడుతున్నాయి. ఇంత సడెన్‌గా ఆమె పెళ్లి విషయం బయటకు రావడంతో అంతా షాకయ్యారు. ప్రియుడు నితిన్‌ రాజు బ్యాక్ గ్రౌండ్ గురించిన విషయాలపై సెర్చింగ్ ప్రారంభించారు నెటిజన్లు. ''ఏం పిల్లో.. ఏం పిల్లడో'' సినిమాతో హీరోయిన్‌గా టాలీవుడ్‌‌లో ఎంట్రీ ఇచ్చిన ప్రణీత.. ఆ తర్వాత ''బావ, అత్తారింటికి దారేది, పాండవులు పాండవులు తుమ్మెద, రభస'' వంటి చిత్రాలలో నటించి తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. అందం, అభినయం ఉన్నప్పటికీ ఈ భామకు అదృష్టం మాత్రం అంతగా కలిసిరాలేదు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/34LkPHv
v

వైరల్ పిక్.. కొడుకుతో కలసి పవర్ స్టార్ ‘సరిగమప’.. వీడు ఆరడుగుల బుల్లెట్

వీడు ఆరడుగుల బుల్లెట్టూ.. అంటే పవన్ కళ్యాణ్‌కి పెద్దగా సెట్ కాలేదు కానీ.. పవన్ కొడుకు అఖిరానంద్‌కి మాత్రం పర్ఫెక్ట్ సూట్ అవుతుంది. జూనియర్ పవర్ స్టార్ మరీ ఇంత లెంగ్త్ ఉన్నాడేంటి అనేట్టుగా ఉన్నాడు తాజా ఫొటోలో. రేణూదేశాయ్‌తో విడిపోయినప్పటికీ పిల్లలు అఖిరా, ఆద్యల్ని తరచూ కలుస్తుంటారు పవన్ కళ్యాణ్. తాజాగా మరోసారి పవన్-అకిరా కలుసుకున్నారు. ఈ సందర్భంగా దిగిన ఫొటో సోషల్ మీడియాని షేక్ చేస్తుంది. పక్కన ఆరగుగుల బుల్లెట్ మాదిరిగా ఉన్నాడు అకిరా. తండ్రిపక్కన ఎంతో వినయంగా కనిపించి పవర్ స్టార్ అభిమానుల్ని ఫిదా చేశాడు . ఇదిలా ఉంటే పవన్ కళ్యాణ్ తన కొడుకు అకిరానందన్‌తో కలిసి సంగీతం నేర్చుకుంటున్నారట. ఇందుకోసం ఓ మ్యూజిక్ టీచర్‌ని కూడా పెట్టుకున్నారు. ఈ సందర్భంగా ఆమె సోషల్ మీడియాలో ఆనందాన్ని పంచుకుంటూ.. పవన్ కళ్యాణ్ అతని తనయుడు అకిరా తన వద్ద సంగీతం నేర్చుకుంటూ తనకి శిష్యులు కావడం చాలా ఆనందంగా ఉందని.. ఈరోజు వాళ్లకి డెమో క్లాస్ ఇవ్వడం జరిగిందని.. పవన్ కళ్యాణ్ గారి ఇంట్లోనే ఈ డెమో ఇచ్చానని చెప్పారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ గారితో కొన్ని గంటల పాటు మాట్లాడే అవకాశం లభించిందని.. ఆయన వయొలిన్ బాగా వాయిస్తారని నా డెమో క్లాస్ కూడా ఆయనకు నచ్చింది అంటూ ఆనందం వ్యక్తం చేశారు సంగీత టీచర్.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3c55vcO
v

Anchor Anasuya: హైపర్ ఆది కోసం అనసూయ డేరింగ్ స్టెప్.. ఫైనల్ డిసీజన్ తీసుకున్న జబర్దస్త్ యాంకర్

వెండితెరపై హీరోహీరోయిన్స్ ఏ రేంజ్‌లో రొమాంటిక్ కిక్కిస్తున్నారో అంతకుమించి అన్నట్లుగా వ్యవహరిస్తున్నాయి బుల్లితెర జోడీలు. ప్రేక్షకులకు ఇంట్లోనే కూర్చోబెట్టి వినోదం పంచడంతో పాటు కాస్త ఘాటు మసాలా కూడా దట్టిస్తూ పాపులర్ అవుతున్నారు బుల్లితెర నటీనటులు. ఇందులో ముఖ్యంగా చెప్పుకునే జోడీ రష్మీ- సుధీర్. ఈ ఇద్దరి మధ్య జరిగే కెమిస్ట్రీతో ప్రతి ఇంట చిన్నితెరలు షేక్ అవుతుంటాయి. ఇక అంత రేంజ్‌లో కాకపోయినా అనసూయ- పెయిర్‌కి మంచి డిమాండే ఉంది. తన పంచ్ టైమింగ్‌తో జబర్దస్త్ రేంజ్‌ని అమాంతం పెంచేసిన కమెడియన్ హైపర్ ఆది.. యాంకర్ కనిపిస్తే చాలు పంచుల మీద పంచులేస్తుంటాడు. అటువైపు అనసూయ కూడా వాటిని పాజిటివ్‌గా తీసుకొని రియాక్ట్ అవుతుండటం చాలాసార్లు చూసాం. అలా ఇద్దరికీ వచ్చి క్రేజ్‌తో పలు స్పెషల్ ప్రోగ్రామ్స్‌లో ఈ జోడీతో రొమాంటిక్ సాంగ్స్ కూడా షూట్ చేశారు. వాటిలో ఈ ఇద్దరి కెమిస్ట్రీ అదుర్స్ అనిపించింది. అయితే టెక్నాలజీ పెరిగి ఓటీటీ హవా నడుస్తుండటంతో వెబ్ సిరీస్‌లకు డిమాండ్ బాగా పెరిగింది. ఈ నేపథ్యంలో అనసూయ- హైపర్ ఆది కాంబోలో ఓ వెబ్ సిరీస్ ప్లాన్ చేసి రంగమ్మత్తకు భారీ రెమ్మ్యూనరేషన్ ఆఫర్ చేశారట ఓ నిర్మాత. ఓ వైపు వరుస సినిమాలతో బిజీగా ఉన్నా హైపర్ ఆదితో స్క్రీన్ షేర్ చేసుకోవడం పట్ల ఇంట్రెస్ట్ చూపిన అనసూయ వెంటనే ఓకే చెప్పేసిందట. అంతేకాదు తనతో పాటు హైపర్ ఆడికి కూడా భారీ రెమ్మ్యూనరేషన్ ఇవ్వాలని కోరిందట. దీంతో ఆ డీల్ సెట్టయిందని, త్వరలోనే దీనిపై అఫీషియల్ స్టేట్‌మెంట్ రానుందని ఫిలిం నగర్ టాక్.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2SJkan6
v

ప్రియాంక చోప్రాతో షారూఖ్ నైట్ పార్టీలు.. కిస్సులు, హగ్గులతో రెచ్చిపోయిన జోడీ! హీరో భార్య వార్నింగ్

బాలీవుడ్ స్టార్ హీరో లవ్ ఎఫైర్ గురించిన వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రాతో చాలా చనువుగా ఉండే షారుఖ్ ఆమెతో జీవితం పంచుకోవాలని చూశారట. అప్పటికే పెళ్లి చేసుకున్న షారుఖ్.. ఆయన భార్య వార్నింగ్ ఇవ్వడంతో వెనక్కి తగ్గక తప్పలేదని తెలుస్తోంది. అలా షారుఖ్ ఖాన్- సాగించిన ప్రయాణం గురించిన వార్తలు ప్రస్తుతం తెగ చెక్కర్లు కొడుతున్నాయి. షారుఖ్, ప్రియాంక కలిసి రెండే రెండు సినిమాల్లో నటించినప్పటికీ వాళ్ళిద్దరి మధ్య బంధం చాలా దూరం వెళ్లిందట. నిజానికి షారుఖ్, ప్రియాంక స్క్రీన్ షేర్ చేసుకోక ముందు నుంచే మంచి స్నేహితులుగా ఉండేవారట. బాలీవుడ్ పార్టీల్లో ఏర్పడ్డ ఆ స్నేహం మరింత ముదిరి సన్నిహితంగా మారిందట. ఎక్కడ పార్టీ జరిగినా ప్రియాంక రావాల్సిందే అని షారుఖ్ అనేవారట. పార్టీకి వచ్చిన ప్రియాంకను బుగ్గ మీద ముద్దులు పెడుతూ రిసీవ్ చేసుకునేవారట. అయితే ఈ విషయాలు తెలుసుకొని షారుఖ్‌ సతీమణి గౌరీ సీరియస్‌గానే వార్నింగ్‌ ఇచ్చిందట. ప్రియాంక చోప్రాతో తిరగడమే కాదు కలిసి సినిమాలు చేయడం కూడా ఆపేయాలని తెగేసి చెప్పిందట. వినకపోతే విడాకులు కూడా ఇచ్చేస్తా అని చెప్పిందట. దీంతో ప్రియాంకతో షారుఖ్ తెగదెంపులు చేసున్నారట. షారుక్ నుండి విడిపోవడం ప్రియాంకను సైతం తీవ్రంగా బాధించిందని సమాచారం. మొత్తానికి ఈ మ్యాటర్ మాత్రం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3fWdo5f
v

Sunday 30 May 2021

సినిమా రౌండప్: మెగాస్టార్ మూవీపై ఫుల్ క్లారిటీ.. రెడీ అనేసిన వెంకటేష్.. రేస్‌లో పవన్ కళ్యాణ్

లూసిఫర్ రీమేక్‌- ఫుల్ క్లారిటీ రీ- ఎంట్రీ తర్వాత జోష్‌లో ఉన్న చిరంజీవి వరుస సినిమాలు ఓకే చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే లూసిఫర్ రీమేక్‌ను స్టార్ట్ చేయాలని అనుకున్నారు. ఈ మూవీకి మోహన్ రాజా దర్శకత్వం వహించబోతున్నారు. అయితే ఈ మూవీ దర్శకుడిగా మోహన్ రాజా తప్పుకున్నాడని వస్తున్న వార్తలకు ఫుల్ స్టాప్ పెట్టేలా కొణిదెల ప్రొడక్షన్ - సూపర్ గుడ్ ఫిలిమ్స్ బ్యానర్స్ ఆయనకు బర్త్ డే విషెస్ అందించాయి. సంక్రాంతి రేస్‌లో పవన్ కళ్యాణ్ ప్రతి ఏడాది సంక్రాంతి సీజన్‌లో స్టార్ హీరోలు పోటీ పడుతుండటం చూస్తూనే ఉన్నాం. అయితే వచ్చే ఏడాది రేస్‌లో పవన్ కళ్యాణ్ నిలవబోతున్నరాట. దర్శకుడు క్రిష్ రూపొందిస్తున్న ‘హరిహర వీరమల్లు’ సినిమాను ‘సంక్రాంతి’ కానుకగా రిలీజ్ చేయబోతున్నారని సమాచారం. వెంకటేష్ హవా ప్రస్తుతం 'నారప్ప, దృశ్యం 2, ఎఫ్ 3' సినిమాలతో బిజీగా ఉన్న విక్టరీ వెంకటేష్ తాజాగా మరో చిత్రానికి ఓకే చెప్పినట్టు తెలుస్తోంది. 'కేరాఫ్ కంచరపాలెం' దర్శకుడు మహా వెంకటేష్ చెప్పిన కథకు ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని అంటున్నారు. 'సర్కారు వారి పాట' నుంచి క్రేజీ అప్‌డేట్ పరశురామ్ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా రూపొందుతున్న 'సర్కారు వారి పాట' నుంచి వస్తున్న అప్‌డేట్స్ సూపర్ స్టార్ ఫ్యాన్స్‌ని హుషారెత్తిస్తున్నాయి. తాజా సమాచారం మేరకు మెయిన్ విలన్ కోసం అరవింద్ స్వామిని ఎంపిక చేశారని తెలుస్తోంది. బాలయ్యతో కుదరదన్న రకుల్ బాలకృష్ణ తదుపరి సినిమా గోపీచంద్ మలినేనితో చేయబోతున్న సంగతి తెలిసిందే. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. అయితే ఈ మూవీలో హీరోయిన్ కోసం శృతి హాసన్‌ని సంప్రదించగా ఆమె నో చెప్పడంతో రకుల్ వద్దకు ఆఫర్ వెళ్లిందట. కానీ రకుల్ కూడా సింపుల్‌గా రిజెక్ట్ చేసిందని టాక్.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3fCpAJi
v

HBD krishna: తండ్రి కృష్ణపై ప్రేమ కురిపించిన మహేష్ బాబు.. వెల్లువెత్తుతున్న బర్త్ డే విషెస్

నేడు (మే 31) సూప‌ర్‌స్టార్ కృష్ణ 78వ పుట్టినరోజు. అయితే కరోనా పరిస్థితుల కారణంగా ఆయన పుట్టినరోజు వేడుకలు నిర్వహించడం లేదు. మరోవైపు గత రాత్రి నుంచే సోషల్ మీడియా వేదికగా పలువురు ప్రముఖుల నుంచి ఆయనకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఈ సందర్భంగా కృష్ణ తనయుడు, స్టార్ హీరో ఆయనకు స్పెషల్ విషెస్ తెలుపుతూ తండ్రిపై ప్రేమ కురిపించారు. తన ట్విట్టర్ ఖాతాలో తండ్రి కృష్ణతో కలిసి దిగిన ఓ పిక్ షేర్ చేస్తూ మహేష్ బాబు ట్వీట్ చేశారు. ''హ్యాపీ బర్త్ డే నాన్న, నేను ముందుకెళ్లడానికి నాకు అత్యుత్తమైన మార్గాన్ని చూపించినందుకు ధన్యవాదాలు. మీరు ఊహించనంతగా మిమ్మల్ని ఎప్పుడూ ప్రేమిస్తుంటాను'' అని తన ట్వీట్‌లో పేర్కొన్నారు మహేష్. ఈ ట్వీట్ చూసి సూపర్ స్టార్ ఫ్యాన్స్ పెద్దఎత్తున ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ప్రస్తుతం పరశురామ్ దర్శకత్వంలో ‘సర్కారువారి పాట’ మూవీ చేస్తున్నారు మహేష్. నిజానికి కానుకగా ఈ సినిమా టీజర్ విడుదల చేయాలనుకున్న మేకర్స్.. కోవిడ్ కారణంగా వాయిదా వేశారు. మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్, జి.మహేష్ బాబు ఎంటర్‌టైన్మెంట్ బ్యానర్లపై నవీన్ యెర్నేని, వై.రవిశంకర్, రామ్ ఆచంట, గోపి ఆచంట సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. థమన్ సంగీతం సమకూర్చుతుండగా, జి.ఎస్.వినోద్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. మహేష్ బాబు కెరీర్‌లో 27వ సినిమాగా ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3p4E5c8
v

క్రేజీ ఆఫర్ కొట్టేసిన జాతిరత్నాలు బ్యూటీ.. ఏకంగా బడా హీరోతో రొమాన్స్! అదృష్టం అంటే ఈ బ్యూటీదే..

చిత్రసీమలో హీరోహీరోయిన్స్ ఆఫర్స్ విషయంలో మరీ విచిత్రమైన పరిస్థితులు కనిపిస్తుంటాయి. అదేంటో.. కొందరు నటీనటులకు తొలి సినిమానే పెద్ద ఎసెట్ అవుతుంది. మొదటి సినిమానే ఓ మైలురాయిగా నిలిచిపోయి ఆఫర్ల వెల్లువకు కారణమవుతుంది. ఇలాంటి హీరో హీరోయిన్స్ లిస్టులో '' బ్యూటీ ఒకరు. 'చిట్టి'గా వెండితెరపై అలరించి ఫస్ట్ మూవీతోనే ఫుల్ పాపులర్ అయింది ఈ లోకల్ బ్యూటీ. దీంతో తాజాగా ఫరియా అబ్దుల్లాకు క్రేజీ ఆఫర్స్ వస్తున్నాయట. మోడల్‌గా కెరీర్‌ ఆరంభించిన ఫరియా.. ‘జాతి రత్నాలు' సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీ విడుదలకు ముందే ప్రభాస్ చేసిన కామెంట్స్‌తో ప్రతి ఒక్కరి కన్ను ఈ అమ్మడిపై పడింది. తీరా మూవీ రిలీజ్ తర్వాత నవీన్ పోలిశెట్టి లవర్‌గా యువత మనసు దోచేసింది ఫరియా. తనదైన హావభావాలు పలికించి సినిమా విజయంలో భాగం పంచుకుంది. చిట్టి ఆట, పాట చూసి యూత్ ఆడియన్స్ ఫిదా అయిపోయారు. దీంతో ఆమెకు వరుస ఆఫర్స్ వస్తున్నాయట. కాకపోతే సినిమా సెలక్షన్ విషయంలో అమ్మడు ఆచితూచి నిర్ణయం తీసుకుంటోందట. అయితే రీసెంట్‌గా ఓ భారీ సినిమా కథ నచ్చడంతో ఆమె ఓకే చెప్పిందనేది లేటెస్ట్ టాక్. టాలీవుడ్ బడా హీరో నుంచి రాబోతున్న ఓ సీక్వెల్‌లో ఫరియా అబ్దుల్లా అవకాశం దక్కించుకుందని తెలుస్తోంది. ఆ మూవీ దర్శకనిర్మాతలు ఆమెకు భారీ రెమ్మ్యూనరేషన్ కూడా ఆఫర్ చేశారట. కథలో ఆమెనే కీలకం కాబోతుందని అంటున్నారు. అయితే ఆ హీరో ఎవరనేది మాత్రం బయటకు రాలేదు. మొత్తానికైతే ఈ భారీ సినిమాలో భాగం కాబోతున్న విషయాన్ని అతిత్వరలో అఫీషియల్‌గా ప్రకటించబోతున్నారని సమాచారం. మరోవైపు సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటూ హవా నడిపిస్తోంది ఫరియా అబ్దుల్లా. నిత్యం గ్లామర్ ట్రీట్ ఇస్తూ అమ్మడు చేస్తున్న హంగామా అంతా ఇంతా కాదండోయ్. హాట్ హాట్ డ్యాన్స్ వీడియోలు, ఫోటోలు తన సోషల్ మీడియా ఖాతాల్లో షేర్ చేస్తూ అట్రాక్ట్ చేస్తోంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3fyhIc0
v

ఎప్పటి నుంచో అలాంటి కోరిక ఉండేది.. అసలు గుట్టు విప్పిన నటి ప్రగతి

ఒకప్పుడు నటి అంటే ఓ రకమైన ఇమేజ్ ఉండేది. హీరోలకు తల్లి, అత్త పాత్రలు పోషించే ప్రగతి గుర్తుకు వచ్చేవారు. మోడ్రన్ మదర్ క్యారెక్టర్‌లకు ప్రగతి కేరాఫ్ అడ్రస్‌గా ఉండేవారు. కానీ ఇప్పుడు ప్రగతి పూర్తిగా మారిపోయారు. వర్కవుట్లతో నానా హంగామా చేస్తున్నారు. హీరోయిన్ రేంజ్‌లో ఫిట్ నెస్ మెయింటైన్ చేస్తున్నారు. ఇక వెరైటీ స్టెప్పులు వేస్తూ సోషల్ మీడియాను షేక్ చేస్తున్నారు. మరీ ముఖ్యంగా ఆమె ఈ వయసులో చేస్తున్న భారీ భారీ వర్కవుట్లు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంటాయి. గత ఏడాది లాక్డౌన్ నుంచి ప్రగతి సోషల్ మీడియాను ఏలేస్తోన్నారు. గత ఏడాది నుంచి ప్రగతికి సోషల్ మీడియాలో క్రేజ్‌తో పాటు ఫాలోవర్లు పెరుగుతూనే వస్తున్నారు. ప్రగతి వేసే క్లాసికల్ స్టెప్పులు, లుంగీ కట్టి వేసే మాస్ డ్యాన్సులు ఎంతగా వైరల్ అయ్యాయో అందరికీ తెలిసిందే. ఇక నాలుగు పదులు వయసులోనూ వర్కవుట్లు చేసే తీరుకు అందరూ ఫిదా అవుతుంటారు.ఎంతో మంది మహిళల్లో ప్రగతి స్ఫూర్తిని నింపుతున్నారు. ఆమెను ఆదర్శంగా తీసుకుని ఎంతో మంది తమ ఆరోగ్యం, ఫిట్ నెస్ మీద దృష్టి పెడుతున్నారు. తాజాగా ప్రగతి లైవ్‌లోకి వచ్చారు. తన అభిమానలతో ముచ్చట్లు పెట్టేశారు.వారు అడిగిన రకరకాల ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. ఇక ఆమెను ఓ నెటిజన్ అసలు ప్రశ్నను సంధించాడు. ఇంతలా వర్కవుట్ చేయడానికి ఎవరు ఇన్సిపిరేషన్ అని అడగడంతో ప్రగతి అసలు విషయం చెప్పేశారు. ఎప్పటినుంచో ఫిట్‌గా ఉండాలనే కోరిక ఉండేది.. కానీ గత రెండేళ్ల నుంచి ఎక్కువగా వర్కవుట్లు చేస్తున్నా.. ఒక్కసారి రిజల్ట్ చూశాక మనకే ఇంకా చేయాలని అనిపిస్తుంది.. నా ఎనర్జీ, ఫిట్ నెస్ బాగా పెరిగిపోయింది.. అలా నాక్కూడా బాగా అనిపిస్తుండటంతో వర్కువుట్లు చేస్తున్నాను అని ప్రగతి అన్నారు. ఇక చాలా మంది నెటిజన్లు ఆమె అందం మీద కామెంట్లు చేశారు. ఎంతో అందగా ఉన్నారు.. ఫిట్‌గా ఉన్నారు.. నవ్వు బాగుంది అంటూ ఇలా రెగ్యులర్ కామెంట్లు వచ్చాయి. దానికి ప్రగతి చిరునవ్వుతో థ్యాంక్యూ అంటూ బదులిచ్చారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3i5NLBI
v

RAPO రేంజ్ ఇదే.. దూసుకుపోతోన్న ‘ఇస్మార్ట్’ హీరో

సినిమాతో కెరీర్ ఒక్కసారిగా పరుగులుపెట్టేసింది. అంతకు ముందు వరుసగా యావరేజ్, ఫ్లాపు సినిమాలు ఇచ్చిన రామ్.. ఒక్కసారిగా మాస్ విశ్వరూపాన్ని చూపించారు. పూరి జగన్నాథ్ కూడా చాలా రోజుల తరువాత ఎంతో కసిగా ఇస్మార్ట్ శంకర్‌ను మలిచినట్టు కనిపించారు. ఇస్మార్ట్ శంకర్ దెబ్బకు అటు హీరో,ఇటు డైరెక్టర్ ఇద్దరి కెరీర్‌లు జెట్ స్పీడ్‌లో దూసుకుపోయాయ్. ఇస్మార్ట్ శంకర్ వచ్చి రెండేళ్లు దాటినా కూడా దాని ఫీవర్ మాత్రం ఇంకా తగ్గడం లేదు. ఇస్మార్ట్ శంకర్ టాలీవుడ్ బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. చాలా రోజుల తరువాత మణిశర్మ సంగీతాన్ని తెలుగు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. అలా అన్ని కోణాల్లోంచి ఇస్మార్ట్ శంకర్ భారీగా క్లిక్ అయింది. అంతేకాకుండా ఇక మన తెలుగు సినిమాలకు ఉత్తరాదిన ఎంతటి డిమాండ్ ఉందో అందరికీ తెలిసిందే. రామ్, బెల్లంకొండ శ్రీనివాస్, అల్లు అర్జున్ సినిమాలు హిందీలో రికార్డు స్థాయిలో వ్యూస్‌ను క్రియేట్ చేస్తుంటాయి. తెలుగు సినిమా హిందీ డబ్బింగ్ వర్షెన్‌లు యూట్యూబ్‌లో వందల మిలియన్ల వ్యూస్ కొల్లగొడుతుంటాయి. అలా రామ్ నటించిన చిత్రాలు డబ్బింగ్ రూపంలో దుమ్ములేపుతుంటాయి. హలో గురు ప్రేమకోసమే, ఉన్నది ఒకటే జిందగీ, గణేష్ ఇలాంటి సినిమాలు యూట్యూబ్‌లో దుమ్ములేపేశాయి. ఇక ఇప్పుడు ఇస్మార్ట్ శంకర్ కొత్త రికార్డులను క్రియేట్ చేస్తోంది. రెండు వందల మిలియన్లు (20 కోట్ల) వ్యూస్‌ను రాబట్టి సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది. అంతేకాకుండా దాదాపు రెండు మిలియన్ల లైకులను కూడా సొంతం చేసుకుంది. మొత్తానికి ఇస్మార్ట్ శంకర్ హవా ఇంకా కొనసాగుతూనే ఉందని చెప్పడానికి ఇదో ఉదాహరణ.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3p2k1Hv
v

మహానటిలో ఈ కళ కూడా ఉందే.. అదరగొట్టేసిన కీర్తి సురేష్

వంట చేయడం అనేది ఓ కళ అంటుంటారు. ఇష్టమైన ఆహార పదార్థాలు, వెరైటీ పదార్థాలను ఇష్టంగా వండుకుని తినే తీరిక ఎక్కువగా ఉండదు. అలాంటి అవకాశాలు కూడా అంతగా రావు. మరీ ముఖ్యంగా సెలెబ్రిటీల జీవితాల్లో అలాంటి క్షణాలు చాలా తక్కువగా ఉంటాయి. కానీ కరోనా, లాక్డౌన్ పుణ్యమా అని వారు కూడా ఇంటి పట్టునే ఉంటున్నారు. ఇక కొందరు హీరోలు, హీరోయిన్లు వంట గదిలోకి దూరిపోయి కొత్త రకాలను వండేస్తున్నారు. తాజాగా కూడా రంగంలోకి దిగారు. తన చేతి వాటాన్ని చూపించారు. పాకశాస్త్రంలో తానెంత నిపుణురాలో అందరికీ చూపించారు. వెండితెర మీదే కాదు.. వంటగదిలోనూ తానే మేటి అని చూపించుకున్నారు. తనకెంతో ఇష్టమైన రెసిపీని వండారు. ఈ మేరకు ఆమె వదిలిన వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది. భోజన ప్రియులు ఈ వీడియోను చూస్తూ తెగ సంబరపడిపోతోన్నారు. ఈ వీడియోలో ఆ రెసిపీని ఎలా తయారు చేయాలో క్లియర్‌గా చూపించారు. టర్కీష్ పోచ్డ్ ఎగ్ అంటూ చేసిన ఈ వంటకం చూస్తే నోరూరిపోయేలా ఉంది. సండే రోజన బ్రంచ్ (బ్రేక్ ఫాస్ట్ ప్లస్ లంచ్) ఇదేనంటూ చెప్పుకొచ్చారు. ఇక కీర్తి సురేష్ ఆ వంటకాన్ని బాగానే లాగించినట్టున్నారు. కీర్తి సురేష్ ఈ మధ్య వార్తల్లో తెగ హల్చల్ అవుతున్నారు. ఈ మధ్య వ్యాక్సిన్ కూడా వేయించుకున్నారు. తమిళ నాడు ప్రభుత్వం తరుపున ప్రచారం చేస్తూ కోవిడ్ నిబంధనలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. కీర్తి సురేష్ ఇప్పుడు గుడ్ లక్ సఖి సినిమాతో ప్రేక్షకులను పలకరించేందుకు రెడీగా ఉన్నారు. అంతేకాకుండా సర్కారు వారి పాట షూటింగ్ కోసం ఆమె ఎదురుచూస్తున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3wKpnJS
v

పోల్చుకోవడానికి ఎంతో దగ్గరిగా ఉంది.. ఏక్ మినీ కథపై చాందినీ చౌదరి

ప్రస్తుతం టాలీవుడ్ సెలెబ్రిటీలను అనే సినిమా ఆకట్టుకుంటోంది. అమెజాన్ ప్రైమ్‌లో విడుదలైన ఈ మూవీకి మంచి ప్రశంసలు లభిస్తున్నాయి. అయితే ఏక్ మినీ కథ కొత్త కాన్సెప్ట్ అవ్వడం, బోల్డ్ కాన్సెప్ట్ అయినా కూడా ఎక్కడా ఆ ఛాయలు పడకుండా ఆద్యంతం వినోద భరితంగా తెరకెక్కించడంతో అందరూ కనెక్ట్ అవుతున్నారు. జననాంగం చిన్నదిగా ఉందనే అనుమానంలో హీరో ఉండటం, కథనం కూడా చిన్నగా ఉందే అనే హీరో బాధ చుట్టే తిరుగుతుంది. అలా చిన్న సమస్యతో సినిమా తీసి పెద్ద స్థాయిలో స్పందన రాబట్టుకున్నారు. తాజాగా ఈ మూవీపై ఓ హీరోయిన్ కామెంట్ చేశారు. ఏక్ మినీ కథపై సెలెబ్రిటీలు ఎక్కువగా స్పందిస్తున్నారు. ఈషా రెబ్బా, ప్రియాంక జవాల్కర్ వంటి వారంతా సినిమాను వీక్షించి ప్రశంసలు కురిపించారు. ఇక ఎప్పటిలానే వెన్నెల కిషోర్ తన స్టైల్లో పంచ్‌లు వేశారు. మరీ ముఖ్యంగా బ్రహ్మాజీ పాత్రకు, ఆయన నటనకు నెటిజన్లు ఫిదా అయ్యారు. తాజాగా ఈ మూవీని వీక్షించారు. ఈ మేరకు తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. ఏక్ మినీ కథపై చాందినీ చౌదరి తన స్టైల్లో స్పందించారు. ఎంతో సరదాగా సాగేసినిమా.. ఎంతో దగ్గరి సంబంధం ఉంటూనే.. రియాల్టీని చూపిస్తుంది. గత రాత్రి ఈ మూవీని చూశాను..సంతోష్ శోభన్‌తో ప్రతీ ఒక్క సీన్ గురించి చర్చించాను. దవడలను నొచ్చేంత నవ్వుకున్నాం. సంతోష్ దర్శన్ మధ్య ఉన్న బ్రొమాన్స్ కూడా అదిరిపోయింది. అమృత, స్వామి పాత్రలు బాగున్నాయ్ అంటూ చాందినీ చౌదరీ అన్నారు. ఇక చాందినీ చౌదరికి సైతం ఓటీటీతో మంచిపేరు వచ్చింది. గత ఏడాది వచ్చిన కలర్ ఫోటో సినిమాతో చాందినీ చౌదరి మరింతగా పాపులర్ అయ్యారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3fwoIGj
v

కెరీర్‌లో అతిపెద్ద ప్రాజెక్ట్.. విజయ్‌తో సినిమా.. వంశీ పైడిపల్లి కామెంట్స్

దిల్ రాజు కాంపౌండ్‌లో ఉంటారన్న సంగతి తెలిసిందే. మొదటి నుంచి కూడా వంశీ పైడిపల్లి ఆస్థాన దర్శకుడు. మహర్షి వంటి బ్లాక్ బస్టర్ హిట్ తరువాత మళ్లీ అదే కాంబో రిపీట్ కావాల్సింది. కానీ కొన్ని సమస్యల వల్ల మహేష్ బాబు వంశీ పైడిపల్లి దిల్ రాజు కాంబో క్యాన్సిల్ అయింది. తాను తదుపరి చేయబోయేది వంశీ పైడిపల్లితోనే అని మహేష్ బాబు కూడా స్వయంగా చెప్పుకొచ్చారు. కానీ పరిస్థితులు మారిపోయాయి. అలా మధ్యలో సరిలేరు నీకెవ్వరు సినిమా వచ్చింది. అలా ఓ సూపర్ కాంబో మళ్లీ మిస్ అయింది. అయితే ఇప్పుడు వంశీ పైడిపల్లికి అదిరిపోయే కాంబోను దిల్ రాజు సెట్ చేశారు. ఏకంగా తమిళ స్టార్ హీరో దళపతి విజయ్‌ను తెలుగులోకి తీసుకొస్తున్నారు. ఆ సినిమాకు వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించబోతోన్నారు. ఈ మేరకు వంశీ పైడిపల్లి స్వయంగా ఓ మీడియాతో ఈ విషయాలన్నీ పంచుకున్నారు. ఇన్ని రోజులు ఈ ప్రాజెక్ట్ మీద రకరకాల రూమర్లు వచ్చేవి. కానీ వంశీ పైడిపల్లి స్వయంగా నోరు విప్పి మాట్లాడటంతో ఈ ప్రాజెక్ట్ గురించి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ నడుస్తోంది. దళపతి 66వ సినిమా అంటూ ట్విట్టర్‌లో నేషనల్ వైడ్ ట్రెండ్ అవుతోంది. అయితే ఈ ప్రాజెక్ట్ గురించి వంశీ పైడిపల్లి మాట్లాడుతూ.. ‘నా కెరీర్‌లో అతి పెద్ద ప్రాజెక్ట్ కోవిడ్ తగ్గిన తరువాత ప్రారంభం కాబోతోంది. రాజుగారు నిర్మించే ఈ చిత్రంలో నటిస్తారు. ప్రస్తుతం కోవిడ్ సమయం కాబట్టి దీనిని ప్రకటించలేదు. పరిస్థితులు అన్నీ చక్కబడిన తర్వాత ఈ చిత్రాన్ని అధికారికంగా ప్రకటిస్తారు. అంతదాకా మిగిలిన సమాచారం అంతా సస్పెన్స్’అని ఆసక్తిని పెంచేశారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3uzaHMc
v

14 రీల్స్‌కి శర్వానంద్ కోర్టు నోటీసులు.? అసలు గొడవ డబ్బు కోసం కాదా?

సినీ ఇండస్ట్రీలో ఎప్పుడు ఎలాంటి లీకులు బయటకు వస్తాయో ఎవ్వరికీ తెలియదు. కొన్ని సార్లు అందులో నిజాలు ఉండొచ్చు..లేదా పుకార్లు మాత్రమే అయి ఉండొచ్చు. ఇంత వరకు క్లీన్ ఇమేజ్ ఉన్న మీద తాజాగా ఓ పుకారు వచ్చింది. శర్వానంద్ చివరగా సినిమాలో కనిపించారు. ఈ మూవీ భారీ అంచనాల నడుమ పడి అనుకున్నంతగా ఆకట్టుకోలేకపోయింది. అయితే సినిమాకు కాస్త నష్టమే వచ్చిందని తెలుస్తోంది. తాజాగా శర్వానంద్ తన రెమ్యూనరేషన్ గురించి నిర్మాణ సంస్థకు నోటీసులు పంపించాడనే టాక్ బయటకు వచ్చింది. శ్రీకారం సినిమాకు శర్వానంద్ 6 కోట్లు తీసుకున్నారట. ఇందులో 4.5కోట్లు సినిమా విడుదలకు ముందే చెల్లించారట. మిగతా రెండు కోట్లు సినిమా విడుదలయ్యాక ఇస్తామని నిర్మాతలు అన్నారట. సినిమా విడుదలైనా కూడా వ్యవహారం ముందుకు సాగకపోవడంతో శర్వానంద్ పదే పదే అడిగారట. అలా మరో యాభై లక్షలు నిర్మాతలు ఇచ్చారట. వారు ఇచ్చిన చెక్ బౌన్స్ అవ్వడంతో మిగిలిన 1.5 కోటి కోసం శర్వానంద్ ఇప్పుడు నిర్మాణ సంస్థకు నోటీసులు ఇచ్చారనే టాక్ నెట్టింట్లో ప్రచారం జరుగుతోంది. అయితే శర్వానంద్ మాత్రం ఇలా చేసే హీరో కాదని ఇండస్ట్రీలో అందరూ అనుకుంటున్నారు. డబ్బు గురించ‌యితే నిర్మాత‌, హీరోలు కూర్చుని సెటిల్ చేసుకుంటారు.. మాటల్లో పోయేదాన్ని ఇలా కొర్టుల దాకా, మీడియా దాకా తెచ్చారంటే ఇంకా ఏదో ఉండొచ్చని అంటున్నారు. కచ్చితంగా అది మనీ మేట‌ర్ కాదు.. ఇంకా ఏదో దాస్తున్నారనేది సమాచారం. డబ్బు గురించి రిలేష‌న్ పోగొట్టుకొరు క‌దా అనే టాక్ వస్తోంది. ఎవ‌రో ఎక్క‌డో హ‌ర్ట్ అయి ఉంటారని లేదా ఇంకేదో జ‌రిగి ఉంటుందని గుసగుసలాడుకుంటున్నారు. ఏది ఏమైనా ఎవరో ఒకరు బయటకు వచ్చి ఈ విషయంపై మాట్లాడితే తప్పా ఓ క్లారిటీ వచ్చేలా లేదు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3p3bEva
v

మత్తెక్కిస్తోన్న చిట్టి.. వయ్యారాలతో ఫరియా వల

జాతి రత్నాలు బ్యూటీ సోషల్ మీడియాలో ప్రస్తుతం దూసుకుపోతోన్నారు. ఒక్క సినిమాతో ఈ బ్యూటీ ఫేట్ మారిపోయింది. అంతకు ముందు కూడా సోషల్ మీడియా ఫ్లాట్ ఫాంలో దూసుకుపోయారు. అయితే జాతిరత్నాలు సినిమాతో సిల్వర్ స్క్రీన్ మీద మెరిశారు. అలా చిట్టి పాత్రతో తెలుగు ప్రేక్షకులకు ఫరియా దగ్గరయ్యారు. చిట్టి నీ నవ్వంటే అంటూ కుర్రకారు ఫిదా అయ్యారు. ఇక ఫరియా నెట్టింట్లో చేసే అల్లరి గురించి అందరికీ తెలిసిందే. మొన్నటికి మొన్న తన బర్త్ డే అంటూ సోషల్ మీడియాలో విషెస్ వెల్లువెత్తాయి. అవన్నీ చూసుకుంటూ నవ్వేసిన ఫరియా చివర్లో అసలు విషయం చెప్పేశారు. తన బర్త్ డే కాదని ఎవరో తప్పుడు సమాచారం ఇచ్చారని ఫరియా చెప్పుకొచ్చారు. అయినా సరే తనకు విషెస్ చెప్పినందుకు అందరికీ థ్యాంక్స్ అని అన్నారు. ఇక తాజాగా ఫరియా ఓ వీడియోను రిలీజ్ చేశారు. మనోహర అనే పాటకు (హిందీ వర్షెన్) ఫరియా మత్తెక్కించేలా డ్యాన్స్ చేశారు. తన వయ్యారాలను తిప్పుతూ నెటిజన్లను కట్టిపడేశారు. ఈ పాట చూడాలంటే సమయం, ఓపిక రెండూ ఉండాలని అన్నారు. ఈ పాటను ఎన్నో సార్లు విన్నాను. కానీ ఈ అనుభూతి ఎప్పుడూ రాలేదంటూ తన డ్యాన్స్ గురించి, తన మూమెంట్స్ గురించి చెప్పుకొచ్చారు. పాటకు తగ్గట్టు, రిథమ్‌కు తగ్గట్టుగా మూమెంట్స్ వేయడం బ్యాలెన్స్ నేర్చుకుంటున్నాను అని ఫరియా అన్నారు. మొత్తానికి ఈ చిట్టి మాత్రం నెట్టింట్లో తన స్టెప్పులతో అందరి గుండెలను కొల్లగొట్టేస్తున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3vFjgGI
v

మహేష్ బాబు-రాజమౌళి మూవీకి బ్రేక్.. RRR ఎఫెక్ట్‌తో ఆదిలోనే దెబ్బ.. క్లారిటీ ఇచ్చిన నిర్మాత

రాజమౌళి డైరెక్షన్‌లో మహేష్ బాబు మూవీ కోసం కోట్లాది మంది అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రానికి సీనియర్ నిర్మాత కెఎల్ నారాయణ నిర్మాతగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. క్షణ క్షణం, ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు, హలో బ్రదర్, సంతోషం, రాఖీ వంటి బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాలను నిర్మించిన కేఎల్ నారాయణ లాంగ్ గ్యాప్ తరువాత మహేష్-రాజమౌళి కాంబోలో భారీ బడ్జెట్ చిత్రానికి ప్లాన్ చేసిన విషయం తెలిసిందే. కంప్లీట్ కాగానే తన నెక్స్ట్ మూవీ మహేష్ బాబుతో ఉంటుందని ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు రాజమౌళి. అయితే కరోనా నేపథ్యంలో RRR షూటింగ్ ముందుకు కదలడం లేదు. పైగా ఇప్పటికే పలుమార్లు ఈ మూవీ రిలీజ్ డేట్‌ని వాయిదా వేస్తూ వస్తున్నారు రాజమౌళి. నిజానికి 2020 జనవరి 8న ఈ సినిమా విడుదల కావాల్సి ఉండగా.. లాక్ డౌన్ వల్ల వాయిదా పడుతూ వస్తోంది. అయితే అక్టోబర్ నెలలో ఈ మూవీ విడుదలకు ప్లాన్ చేయగా.. ఈసారి కూడా వాయిదా పడటం ఖాయంగా కనిపిస్తోంది. రాజమౌళి సినిమా కావడంతో వాయిదాలు కామన్ కాబట్టి.. ఆయన ఎప్పుడు రిలీజ్ చేస్తే అప్పుడే అన్నట్టుగా RRR కోసం ఎదురుచూస్తున్నారు అభిమానులు. ఇదిలా ఉంటే.. RRR పూర్తి కాగానే రాజమౌళి నెక్స్ట్ మూవీ మహేష్ బాబుతో అని అనౌన్స్ చేశారు. ఈ సినిమా ఎప్పుడెప్పుడు మొదలౌతుందా? అని ఫ్యాన్స్ ఎదురుచూస్తుండగా.. నిర్మాత కేఎల్ నారాయణ క్లారిటీ ఇస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం బయట పరిస్థితి ఎలా ఉందో అందరూ చూస్తున్నారు.. ఉన్న సినిమాలే ఎప్పుడు విడుదల అవుతాయో తెలియదు. థియేటర్లు తిరిగి ఎప్పుడు ఓపెన్ చేస్తారో తెలియదు. ఆల్రెడీ షూటింగ్స్ జరుపుకుంటున్న చిత్రాలు ఎప్పుడు కంప్లీట్ చేస్తారో తెలియడం లేదు. అయితే మహేష్ బాబు-రాజమౌళి కాంబో మూవీ 2021 ఎండింగ్‌లో ప్రారంభం అవుతుందని అనుకున్నాం. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో అది సాధ్యం కాదు. ఎందుకంటే RRR చిత్రం అక్టోబర్‌లో విడుదలౌతుందని అనుకున్నాం.. కానీ ఆ సినిమా మళ్లీ వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రొడక్షన్ వర్క్ ఎలా జరుగుతుందని నాకు తెలియదు కానీ.. ఇబ్బందులైతే ఉన్నాయనే అనిపిస్తుంది. ఏది ఏమైనా RRR పూర్తైన తరువాతే మా సినిమా ఉంటుంది. అది అక్టోబర్ కావచ్చు.. డిసెంబర్ కావచ్చు.. జనవరి కావచ్చు. అయితే మహేష్ బాబు-రాజమౌళి సినిమాకి సంబంధించి కథ ఇంకా లాక్ కాలేదు. అయితే మహేష్ బాబు గారు మాత్రం రాజమౌళి ఎప్పుడు అంటే అప్పుడు నేను రెడీగా ఉన్నానని ఇప్పుడు కాదు.. రెండేళ్ల క్రితమే చెప్పారు. నాకు కాస్త ముందు చెప్తే.. నేను ఎప్పుడైనా వచ్చేస్తా అని మహేష్ బాబు చెప్పారు. రాజమౌళి, మహేష్ బాబు కాంబోలో సినిమా తీద్దాం అని ఏడేళ్ల క్రితమే అనుకున్నా.. ఆరోజే ఇద్దరూ కూడా చేద్దాం అని అన్నారు. ఇవాళ్టికీ కూడా అదే మాటపై ఉన్నారు. బాహుబలి ఒకటికి రెండు అయ్యింది.. RRR కూడా చాలా టైం పట్టడంతో ఈ సినిమా ఆలస్యం అయ్యింది. ఆఫ్రికన్ ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్‌ అని.. విజయేంద్ర ప్రసాద్ గారు కథ ఇచ్చేశారని వస్తున్న వార్తల్లో నిజం లేదు. ఇవన్నీ ఊహాగానాలే. సబ్జెక్ట్ ఏంటి అనేది నాకే తెలియదు.. బయట వాళ్లకి ఏం తెలుస్తుంది. డైరెక్టర్ రాజమౌళి గారు RRR కథ లైన్ మీద వర్క్ చేస్తున్నారు. అయితే RRR లాంటి పెద్ద సినిమా చేస్తూ దానిపై ఫోకస్ చేయకుండా ఈ సినిమా గురించి ఆలోచించే వ్యక్తిత్వం రాజమౌళిది కాదు. వేరే కథ కోసం ఆలోచించరు.. ఆయన ఇప్పుడు RRRని ఎంత బాగా తీయొచ్చని ఆలోచిస్తారు తప్పితే.. తరువాత సినిమా కోసం ఆలోచిస్తారని నేను అనుకోను. ఎందుకంటే రాజమౌళి RRR సినిమా పట్ల అంత ఫోకస్‌గా ఉన్నారు. వేరే సినిమా కోసం డిస్కస్ చేసే అవకాశం ఉంది కానీ.. ఎక్కువగా RRR కోసం ఆలోచిస్తారు. ఆ సినిమా రిలీజ్ అయిన తరువాతే మహేష్ బాబు సినిమా కోసం ఆలోచిస్తారు’ అంటూ చెప్పుకొచ్చారు నిర్మాత కేఎల్ నారాయణ.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2R5p8Kp
v

‘కన్నులు చెదిరే’ లిరికల్ వీడియో.. ఆకట్టుకుంటోన్న శివానీ రాజశేఖర్

‘118’ వంటి విభిన్న చిత్రాన్ని తెరకెక్కించిన ప్రముఖ సినిమాటోగ్రాఫర్‌ కేవి గుహన్‌ అందరి దృష్టిని ఆకర్షించారు. మళ్లీ ఇప్పుడు మిస్టరీ థ్రిల్లర్‌ ‘డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ’ (ఎవరు,ఎక్కడ,ఎందుకు) అంటూ ప్రేక్షకుల ముందుకు రాబోతోన్నారు. అదిత్‌ అరుణ్, శివాని రాజశేఖర్‌ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రాన్ని రామంత్ర క్రియేషన్స్ పతాకంపై డా. రవి పి. రాజు దాట్ల నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్రంలోని ‘కన్నులు చెదిరే’లిరికల్ వీడియో సాంగ్ ను యంగ్ హీరో అడవి శేష్‌ విడుదల చేసి చిత్రయూనిట్‌కు ఆల్‌ ది బెస్ట్‌ చెప్పారు. ఇక ఈ లిరికల్ వీడియోలో అందరినీ ఆకట్టుకుంటోంది. ఈ సందర్భంగా దర్శకుడు కేవి గుహన్‌ మాట్లాడుతూ.. ‘డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ’ ఫస్ట్‌ కంప్యూటర్‌ స్క్రీన్‌ తెలుగు మూవీ. తెలుగు, తమిళ భాషల్లో ఏక కాలంలో సినిమా రూపొందుతోంది. ఇప్పటికే విడుదలైన టీజర్ సాంగ్స్ కి మంచి రెస్పాన్స్ వస్తోంది. తప్పకుండా థ్రిల్లర్‌ జోనర్‌లోనే ఇది ఒక డిఫరెంట్‌ మూవీగా నిలుస్తుంది అని అన్నారు. నిర్మాత రవి పి.రాజు దాట్ల మాట్లాడుతూ .. ‘మా రామంత్ర క్రియేష‌న్స్ బేన‌ర్‌లో రూపొందుతోన్న ఫ‌స్ట్ మూవీ ఇది. ఇప్పటికే సూపర్ స్టార్ మహేష్ బాబు రిలీజ్ చేసిన టీజర్, తమన్నా రిలీజ్ చేసిన నైలు నది సాంగ్ కి అద్భుతమైన స్పందన వచ్చింది. రీసెంట్‌గా రిలీజైన లాక్ డౌన్ ర్యాప్ సాంగ్‌కి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు కన్నులు చెదిరే సాంగ్‌ను యంగ్ హీరో అడివిశేష్ విడుదల చేయడం హ్యాపీగా ఉంది. ఈ సందర్భంగా మా రామంత్ర క్రియేషన్స్ తరపున అడివిశేష్‌కి దన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదిత్ అరుణ్, శివాని రాజశేఖర్ చక్కగా నటించారు. గుహ‌న్ ఈ సినిమాని అద్బుతంగా తెర‌కెక్కించారు. తప్పకుండా ఈ మూవీ చాలా పెద్ద హిట్ అవుతుంద‌ని న‌మ్మ‌కం ఉంద’ని అన్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3p1kx8D
v

అక్కడ జరిగేదంతా అదే.. ఇండస్ట్రీపై ఇలియానా సంచలన వ్యాఖ్యలు

టాలీవుడ్‌లో ఒకప్పుడు టాప్ హీరోయిన్‌గా దూసుకుపోయారు. మొదటి చిత్రం దేవదాస్‌తోనే ఈ గోవా బ్యూటీ తెలుగు ప్రేక్షకులను కట్టిపడేశారు. ఆ తరువాత పోకిరి సినిమాతో టాప్ హీరోయిన్‌గా సత్తాను చాటారు. అలా టాలీవుడ్ నెంబర్ వన్ హీరోయిన్ అయ్యాక బాలీవుడ్ బాట పట్టారు. కానీ అక్కడ సరైన సక్సెస్ చవిచూడలేకపోయారు. ఆ తరువాత మళ్లీ టాలీవుడ్ వైపు ప్రయత్నాలు మొదలుపెట్టారు. కానీ ఇక్కడా వర్కవుట్ కాలేదు. దేవుడు చేసిన మనుషులు, అమర్ అక్బర్ ఆంటోనీ అంటూ డిజాస్టర్లతో ఇలియానా ఫేడవుట్ అయిపోయారు. అలా మళ్లీ తిరిగి బాలీవుడ్‌కే వెళ్లారు. కానీ ఇంత వరకు ఇలియానాకు ఒక్కటంటే ఒక్క బ్లాక్ బస్టర్ హిట్ పడలేదు. దీంతో వెండితెర మీద అంతగా అవకాశాలు లేకపోవడంతో సోషల్ మీడియాలో ఈ అమ్మడు రచ్చ చేయడంప్రారంభించారు. ఇక ప్రియుడితో బ్రేకప్ అవ్వడం, గ్యాప్ తీసుకోవడంతో కూడా ఇలియానా వెనకబడింది. ఇలియానా చివరగా ది బిగ్ బుల్ అనే సినిమాలో నటించారు. కానీ అనుకున్నంతగా ఆకట్టుకోలేకపోయారు. అయితే ఇలియానా తాజాగా సినీ పరిశ్రమ గురించి సంచలన కామెంట్లు చేశారు. ఇండస్ట్రీ చాలా ఘోరమైంది.. ఇక్కడ టాలెంట్ ఎంత ఉన్నా పనికి రాదు. జనాలు మమ్మల్ని చూసినంత వరకు మాకు చాన్స్‌లు వస్తుంటాయి.. వారు మా సినిమాలను చూడటం మానేస్తే మా పని అయిపోయినట్టే. అయినా మన జీవితంలో అన్నీ కూడా మనకు నచ్చినట్టే జరగవంటూ వేధాంత ధోరణిలో మాట్లాడేశారు. పర్సనల్ లైఫ్, ప్రొఫెషనల్ లైఫ్‌ను బ్యాలెన్స్ చేయడం చాలా కష్టమైన పని.. అయితే నా విషయానికి వస్తే.. ప్రొఫెషనల్ లైఫ్ కంటే పర్సనల్ లైఫ్‌కే ఎక్కువగా ప్రాముఖ్యతను ఇస్తాను అని ఇలియానా చెప్పుకొచ్చారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3vyUTuc
v

నా మోరల్ సపోర్ట్ నువ్వే తమ్ముడూ: శిరీష్‌కి బన్నీ ఎమోషనల్ బర్త్ డే విష్

తమ్ముడు బర్త్ డే నాడు అన్నయ్య ఎమోషనల్ అయ్యాడు. నేడు (మే 30) సందర్భంగా విషెష్ అందించిన ఎమోషనల్ ట్వీట్‌ని షేర్ చేశారు. ‘పుట్టినరోజు శుభాకాంక్షలు తమ్ముడూ.. నువ్ నా బిగ్గెస్ట్ మోరల్ సపోర్ట్.. రాబోయే రోజులు అద్భుతంగా ఉండాలని కోరుకుంటున్నా’ అంటూ ట్వీట్ చేసిన అల్లు అర్జున్.. తమ్ముడితో కలిసి దిగిన ఫొటోని షేర్ చేసుకున్నారు. ఇక తన అన్న అల్లు అర్జున్ బర్త్ డే విషెష్‌పై శిరీష్ స్పందిస్తూ.. థాంక్యూ AA (అల్లు అర్జున్).. మీలాంటి అన్నయ్య ముందు నేను ఎదగడం నా అదృష్టంగా భావిస్తున్నా. నా బెస్ట్ ఫ్రెండ్.. నా గైడ్ మీరే’ అంటూ రిప్లై ఇచ్చాడు అల్లు శిరీష్. కాగా నేడు బర్త్ డే కానుకగా.. అను ఇమ్మన్యుయేల్‌లో కలసి నటిస్తున్న రొమాంటిక్ ఎంటర్ టైనర్ మూవీ ‘ప్రేమ కాదంట’ ఫస్ట్‌లుక్, టైటిల్‌ని రివీల్ చేశారు. ఈ చిత్రానికి ‘విజేత’, ‘జతకలిసే’ ఫేమ్ రాకేష్ శశి దర్శకత్వం వహిస్తుండగా.. జీఏ2పిక్చ‌ర్స్ బ్యాన‌ర్, శ్రీ తిరుమ‌ల ప్రొడ‌క్ష‌న్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/34zvuVe
v

Prema కాదంట: అల్లు శిరీష్, అను ఇమ్మాన్యుయేల్‌‌ మధ్య రొమాన్స్‌‌ రివీల్ అయ్యిందిలా

బ్లాక్ బస్టర్ హిట్ కోసం అల్లు వారి అబ్బాయి శిరీష్ గట్టి యుద్ధమే చేస్తున్నాడు. ‘గౌరవం’, ‘కొత్త జంట’, ‘శ్రీ రస్తు శుభమస్తు’ వంటి చిత్రాలతో ఆకట్టుకునే ప్రయత్నం చేసిన అల్లు శిరీష్ ఈసారి గేర్ మార్చి ప్యూర్ రొమాంటిక్ జానర్‌లోకి వచ్చేశాడు. అల్లు శిరీష్, అను ఇమ్మాన్యుల్ జంట‌గా ఓ సినిమా తెర‌కెక్కుతోన్న విష‌యం తెలిసిందే. దీనికి సంబంధించిన వరుసగా ఫ్రీ లుక్స్‌ని రిలీజ్ చేసి సినిమాపై హైప్ తీసుకుని రాగా.. నేడు (మే 30) అల్లు శిరీష్ బర్త్ డే కానుకగా.. ఫస్ట్ లుక్, టైటిల్‌ని విడుదల చేశారు. జీఏ2పిక్చ‌ర్స్ బ్యాన‌ర్, శ్రీ తిరుమ‌ల ప్రొడ‌క్ష‌న్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి ‘ప్రేమ కాదంట’ () అనే టైటిల్‌ని ఫిక్స్ చేస్తూ ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేశారు. ప్రీ లుక్స్‌లో చేతిని అడ్డంగా పెట్టి కిస్ చేసుకుంటున్న పోస్టర్స్‌ని రివీల్ చేసి ఈ ఫస్ట్ లుక్‌లో చూపించారు. ‘విజేత’, ‘జతకలిసే’ ఫేమ్ రాకేష్ శశి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో శిరీష్ తొలిసారి సిక్స్ ప్యాక్‌తో సంద‌డి చేయ‌నున్నాడు. ఈ సిక్స్ ప్యాక్‌కి సంబంధించిన ఫొటోలు ఇప్పటికే వైరల్ అయ్యాయి. ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్, అచ్చు రాజ‌మ‌ణి సంగీతాన్ని అందిస్తున్నారు. ఇదిలా ఉంటే.. గత కొంతకాలంగా అల్లు శిరీష్, అను ఇమ్మాన్యుల్ డేటింగ్‌లో ఉన్నట్టు వార్తలు వచ్చాయి. పెళ్లి కూడా చేసుకుంటారనే ప్రచారం గట్టిగానే నడిచింది. అయితే ఇప్పుడు ఈ ఇద్దరూ కలిసి ‘ప్రేమ కాదంట’ (Prema కాదంట) అని అంటుండటంతో ఈ సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2SFzbWS
v

Saturday 29 May 2021

చిరంజీవి గారే సాయం చేయాలా?.. మీకు కాళ్లూ చేతులూ లేవా? ఆట సందీప్ షాకింగ్ కామెంట్స్

కరోనా కష్ట కాలంలో మెగాస్టార్ ఆపద్బాంధవుడిలా నిలిచారు. సీసీసీ ద్వారా సినీకార్మికుల‌ను ఆదుకున్న మెగాస్టార్ చిరంజీవి.. తెలుగు రాష్ట్రాల్లోని ప్రతి జిల్లాలో ఆక్సిజ‌న్ ఉత్ప‌త్తి ప్లాంట్స్ ఏర్పాటు పూనుకున్నారు. అయితే కాయలు ఉన్న చెట్టుకే రాళ్లదెబ్బలు అన్నట్టుగా.. చిరంజీవి సాయం చేస్తున్నప్పటికీ ఆయనపై విమర్శలు వెల్లువెత్తున్నాయి. బాలీవుడ్ నటుడు సోనుసూద్‌తో పోల్చుతూ నోటికొచ్చినట్టు మాట్లాడుతుండటంతో ఆయన అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇండస్ట్రీలో ఇంతమంది హీరోలు ఉండగా.. సాయం చేయడానికి ముందుకు వచ్చిన మెగాస్టార్‌‌ని టార్గెట్ చేయడం ఎంత వరకూ న్యాయం అని ప్రశ్నిస్తున్నారు ఆయన అభిమానులు. ఈ నేపథ్యంలో ప్రముఖ కొరియోగ్రాఫర్, చిరంజీవి అభిమాని కీలక వ్యాఖ్యలు చేశారు. అసలు చిరంజీవి ఎందుకు సాయం చేయాలంటూ విమర్శించేవాళ్లని నిలదీశారు. ఆయన మాట్లాడుతూ.. ఇండస్ట్రీలో ఇంతమంది ఉండగా.. ఎందుకు చిరంజీవి గారే సాయం చేయాలి.? ఆయన కూడా మనలాగే ఒక వ్యక్తి. కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి.. ఇండస్ట్రీకి మెగా ఫ్యామిలీ వృక్షాన్ని ఇచ్చారు. మా తాత గారు ఇట్లా.. మా నాన్న గారూ ఇట్లా అని చెప్పుకుంటారు.. ఎందుకంటే వాళ్లు కష్టపడ్డారు.. వాళ్లలా నువ్వూ కష్టపడు. ఏ ఇష్యూ వచ్చినా ఇండస్ట్రీలో ఫస్ట్ రెస్పాండ్ అయ్యేది చిరంజీవి గారు. ఫస్ట్ బ్లడ్ బ్యాంక్ పెట్టింది.. ఎవరు?? ఆయనలా ఎవరు చేశారు.. ఎంతమంది బ్లడ్ బ్యాంక్‌లు పెట్టారు? ఐ బ్యాంక్ ఎప్పుడు పెట్టారు.. ఎంతమందికి సాయం చేశారు.. చేస్తున్నారు. ఇవన్నీ పక్కన పెట్టేద్దాం.. అసలు చిరంజీవి గారు ఎందుకు సాయం చేయాలి?? నీకు కాళ్లు ఉన్నాయి.. చేతులు ఉన్నాయి.. నీ బతుకు నువ్వు బతకలేవా? అయినా కష్టం అని వస్తే లేదనకుండా సాయం చేస్తారు చిరంజీవి గారు. ఇంత చేస్తున్నా ఆయన్నే ఎందుకు ప్రశ్నిస్తున్నారు? ఏ చిరంజీవిగారు ఇంట్లో చేపలు కూర వండుకుంటే మీకేంటి నష్టం.. ఆయన చేపల కూర తినకూడదా? ఫ్యామిలీతో హ్యాపీగా ఉండకూడదా? దేశంలో ఏ మూల ఏది జరిగినా ఆయనే స్పందించాలా? దానికి గవర్నమెంట్ ఉంది.. చిరంజీవి గారు చేయాలనుకుంటే చేస్తారు. ఆయన్ని విమర్శించే వాళ్లు పనిపాటా లేకుండా ఖాళీగా ఉన్న వాళ్లే. పావలా శ్యామల కష్టంలో ఉందంటే ఇదివరకే ఆయన రూ.2 లక్షలు ఇచ్చారు. మళ్లీ ఇప్పుడు లక్ష సాయం చేశారు. నేను కూడా నా ఫేస్ బుక్‌లో ఫండ్ రైజ్ చేశా.. చాలామంది మీడియా వాళ్లు డబ్బులు సాయం చేసి ఆవిడతో ఇంటర్వ్యూలు చేశారు. ఆ తరువాత ఆవిడ బాగానే ఉంది. కానీ ఈ మధ్య ఆవిడ ఆర్థిక పరిస్థితి బాగోలేదని వీడియోలో చూశాం. ఆ విషయం చిరంజీవి గారికి తెలియదు అని అనుకోవచ్చు కదా.. ఇండస్ట్రీలో ఎవరు ఎలా ఉన్నా చిరంజీవి గారే చూసుకోవాలా? ’’ అంటూ చిరంజీవిని విమర్శించే వారికి గట్టి కౌంటర్ ఇచ్చారు ఆట సందీప్.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3fWwEPX
v

సినిమా రౌండప్: నందమూరి ఫ్యాన్స్ కోసం ఇదీ బాలయ్య బాబు స్కెచ్.. ఎన్టీఆర్ మార్క్! హీరోయిన్ టెన్షన్‌

ఆ ప్రదేశంలో టెన్షన్ యంగ్ హీరోయిన్ రాశి ఖన్నా తన కొత్త సినిమా 'థాంక్యూ' షూటింగ్ అనుభవాలను పంచుకుంది. నాగ చైతన్య హీరోగా రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ కోసం ఇటీవలే ఇటలీ వెళ్ళొచ్చింది చిత్రబృందం. త్వరగా షూటింగ్ ఫినిష్ చేయాలని చాలా పెద్ద రిస్క్ చేశామని, ఇటలీ వెళ్లినప్పటికీ అందరిలోను టెన్షన్ ఉందని రాశి ఖన్నా చెప్పింది. కొన్ని లొకేషన్స్‌లో కరోనా కేసులు బయటపడటంతో మరింత టెన్షన్ పడ్డామని, ఎలాగోలా షూటింగ్ ఫినిష్ అయ్యాక హమ్మయ్య అనుకున్నామని చెప్పుకొచ్చింది. పెళ్లి తర్వాత కాజల్ స్పీడ్ ‘పేపర్‌బాయ్‌’ సినిమాతో తెలుగు తెరపై తన మార్క్ చూపించిన జయశంకర్‌ దర్శకత్వంలో కాజల్ ఓ సినిమా చేయబోతోందట. థ్రిల్లింగ్‌ కథతో హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీగా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారట. కాజల్‌కి స్క్రిప్ట్‌ నచ్చడంతో ఆమె వెంటనే ఓకే చెప్పిందని సమాచారం. యంగ్ టైగర్ న్యూ ఫీట్ నందమూరి వారసుడిగా సినీ ఎంట్రీ ఇచ్చి టాలీవుడ్ టాప్ హీరోల్లో ఒకరిగా నిలిచారు యంగ్ టైగర్ . వరుస హిట్స్‌తో సత్తా చాటుతున్న ఆయన తాజాగా ఓ అరుదైన మైలురాయిని అధిగమించారు. సోషల్ మీడియాలో తోటి హీరోలతో పోల్చితే అంతగా యాక్టివ్ కాకపోయినా.. కేవలం అయాన్ ఇమేజ్ తోనే ట్విట్టర్‌లో 5 మిలియన్ ఫాలోవర్ల మార్కు దాటారు ఎన్టీఆర్. అతి తక్కువ ట్వీట్లు చేసి ఐదు మిలియన్ల ఫాలోవర్లను దక్కించుకున్న హీరోగా ఆయన సరికొత్త రికార్డు నెలకొల్పారు. బాలయ్య బాబు భలే స్కెచ్చేశారే! సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ సినిమాల స్పీడు ఎలా ఉందో చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం బోయపాటి శ్రీనుతో 'అఖండ' మూవీ చేస్తున్న ఆయన గోపీచంద్ మలినేని దర్శకత్వంలో మరో సినిమా చేయబోతున్నారు. తన రాబోయే పుట్టిన రోజు (జూన్ 10)న ఈ రెండు సినిమాల నుంచి అభిమానుల కోసం భారీ సర్‌ప్రైజ్‌లు సిద్ధం చేయాలని చెప్పారట బాలయ్య. అతనితో అనుప‌మ ఎంజాయ్ త‌న సోద‌రుడు అక్ష‌య్ ప‌ర‌మేశ్వ‌ర‌న్‌తో సరదాగా ఎంజాయ్ చేసింది హీరోయిన్ అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్‌. సోదరుడి ప్రేమతో పొందిన ఆనందాన్ని ఫొటోల్లో బంధించి ఈ ఫొటోస్‌ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది ఈ యంగ్ హీరోయిన్.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2TsSBid
v

సమంత ఫిక్స్ అయింది కానీ ఆ మాట చెప్పడంతో! యాంకర్ ప్రదీప్ మూవీ సీక్రెట్స్ రివీల్ చేసిన డైరెక్టర్

'30 రోజుల్లో ప్రేమించటం ఎలా?' అంటూ ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చిన సంగతి తెలిసిందే. బుల్లితెరపై హవా నడిపిస్తూ తనకంటూ ఓ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న ఆయన.. ఈ సినిమాతో హీరోగా పరిచయమయ్యారు. ఈ మూవీలో ప్రదీప్ సరసన హీరోయిన్‌గా నటించింది. అయితే ముందుగా ఆ అవకాశం సమంతకు వచ్చిందట. ఈ కథను సమంతకు వినిపించారట . తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో మూవీ షూటింగ్‌కి ముందు జరిగిన గురించిన కొన్ని విషయాలు రివీల్ చేశారాయన. 30 రోజుల్లో ప్రేమించడం ఎలా? కథ రాసుకున్నాక హీరోహీరోయిన్ల వేట ప్రారంభించిన డైరెక్టర్ మున్నా.. ముందుగా స్టార్ హీరోయిన్ సమంతకు ఈ కథ చెప్పానని అన్నారు. మేనేజర్ వద్దకు వెళ్ళినప్పుడు ఆమెకు కథ చెబుతాను అంటే పైనుంచి కింద దాకా చూస్తూ అలా ఎలా కుదురుతుందని ప్రశ్నించాడని, అయితే ముందు ఆ కథను అతనికి చెప్పి మెప్పించాక సమంతకు కలిసే అవకాశం పొందానని అన్నారు మున్నా. ఇక కథ విన్న సమంత చాలా బాగుందని చెప్పిందని, కాకపోతే డేట్స్ అడ్జస్ట్ కాకపోవడంతో ఆమె ఈ సినిమాలో నటించనని చెప్పిందని ఆయన తెలిపారు. సమంతను హీరోయిన్‌గా అనుకున్నపుడు ఇంకా హీరోగా యాంకర్ ప్రదీప్‌ని ఫైనల్ చేయలేదని ఆయన చెప్పారు. ఆ తర్వాత ప్రదీప్ హీరోగా ఒప్పుకున్నాక అమృత అయ్యర్‌ని ఫైనల్ చేశానని.. ఇక ఆమెలోనే సమంతను చూసుకుంటూ సినిమా రూపొందించామని మున్నా చెప్పడం విశేషం. పునర్జన్మల నేపథ్యంలో తెరకెక్కిన '30 రోజుల్లో ప్రేమించటం ఎలా?' సినిమా ఈ ఏడాది మొదట్లో విడుదలై ఫర్వాలేదనిపించింది. చిత్రంలోని ''నీలి నీలి ఆకాశం ఇద్దామనుకున్నా'' సాంగ్ ఫుల్ పాపులర్ అయింది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3vDvhfY
v

శరీరాకృతిపై వింత ప్రశ్నలు.. కొలతలు అడిగిన నెటిజన్‌కు అలీ రెజా కౌంటర్

షోలో పాల్గొన్న కంటెస్టెంట్లు సోషల్ మీడియాలో మంచి క్రేజ్ తెచ్చుకుంటున్నారు. బిగ్ బాస్ మూడో సీజన్ కంటెస్టెంట్లు ఎక్కువగా యూట్యూబ్, ఇన్ స్టాగ్రాం వంటి సోషల్ మీడియాలో సాధనాల్లో ఫేమస్ అయ్యారు. సినీ అవకాశాలు అంతగా రాకపోయినా కూడా వారికి సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ వచ్చింది. అలాంటి వారిలో ఒకరు. బుల్లితెర, వెండితెర మీద పలు ఆఫర్లతో మంచి గుర్తింపును సాధించారు. కానీ చివరకు బిగ్ బాస్ షోనే తెలుగు ప్రేక్షకులకు దగ్గర చేసింది. అలా బిగ్ బాస్ మూడో సీజన్‌లో ఎంతో మంది అభిమానాన్ని సంపాదించుకుని అలీ రెజా టాప్ 5కి చేరుకున్నారు. మధ్యలోనే ఎలిమినేట్ అయినా కూడా మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చి షాక్ ఇచ్చారు. అలా చివరకు టాప్ 5 స్థానాన్ని సొంతం చేసుకున్నారు. బిగ్ బాస్ షో నుంచి బయటకు వచ్చాక సినిమా అవకాశాలేవీ అంతగా రాలేదు. నాగార్జున వైల్డ్ డాగ్ సినిమాతో అలీ రెజా వెండితెరపై మెరిశారు. అయితే ఆ మూవీ తరువాత సోలో హీరోగానూ ట్రై చేసేందుకు అడుగులు వేశారు. మొన్నీ మధ్యే తన బర్త్ డేను గ్రాండ్‌గా సెలెబ్రేట్ చేసుకున్నారు. బర్త్ డే సందర్బంగా తన కొత్త సినిమా అప్డేట్‌ను ఇచ్చారు. G.D అంటూ వదిలిన ఆ పోస్టర్ బాగానే క్లిక్ అయింది. తాజాగా అలీ రెజా తన అభిమానులతో ముచ్చట్లు పెట్టారు. ఈ క్రమంలో నెటిజన్లు రకరకాల ప్రశ్నలు సంధించారు. ఇందులో కొందరు వ్యక్తిగత విషయాలను కూడాఅడిగారు. ముద్దు పేరు ఏంటి? వదినను అస్సలు చూపించడం లేదేంటి? అని ప్రశ్నలు సంధించారు. చిన్నతనం నుంచి అందరూ అలీ అని పిలుస్తారని కానీ పెళ్లి తరువాత మాత్రం తన భార్య బాబు అని అంటుందని తెలిపారు. ఇక ఓ నెటిజన్ ఏకంగా బాడీ కొలతలు అడిగేశారు. దీనికి అలీ రెజా అవాక్కైనట్టున్నారు. మీరు నా కోసం బట్టలు కుట్టిస్తున్నారా ఏంటి? అని సెటైర్ వేసేశారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3p2xYFb
v

అతడితో శ్రీరెడ్డి గాఢ చుంబనం.. ఎప్పుడూ వీడి మూతేనా అంటూ ఆ ఫొటోపై బోల్డ్ కామెంట్

క్యాస్టింగ్ కౌచ్ ఉదంతంతో దగ్గుబాటి ఫ్యామిలీపై సంచలన ఆరోపణలతో వెలుగులోకి వచ్చింది . దగ్గుబాటి వారసుడు, సురేష్ బాబు కొడుకుతో సాగించిన రాసలీలల ఫొటోలను లీక్ చేసి టాలీవుడ్‌ని షేక్ చేసింది శ్రీరెడ్డి. ఆ తరువాత నుంచి ఒక్కొక్కటిగా వరుస పోస్ట్‌లను షేర్ చేస్తూ దగ్గుబాటి వారసుడి పరువుని రోడ్డుపైకి లాగింది. ముఖ్యంగా అభిరామ్‌-శ్రీరెడ్డి లిప్ లాక్ చేస్తూ ఉన్న బెడ్ రూం ఫొటో అప్పట్లో పెద్ద సంచలనం అయ్యింది. అయితే వీరిద్దరి ప్రస్తావన వచ్చిన ప్రతిసారీ కూడా ఆ ఫొటో తెరపైకి రావడంతో దీనిపై తనదైన శైలిలో రియాక్ట్ అయ్యింది శ్రీరెడ్డి. ఇంతకీ ఇప్పుడు ఈ ముద్దు ముచ్చట ఎందుకొచ్చిందంటూ.. ఇటీవల శ్రీరెడ్డి వైసీపీకి అనుకూలంగా వరుస పోస్ట్‌లను షేర్ చేస్తున్నారు. ముఖ్యంగా వైసీపీ రెబల్ ఎంపీ రఘురామక్రిష్ణం రాజుని ఓ రేంజ్‌లో ఆడుకుంటూ వరుస పోస్ట్‌లు చేస్తుంది. తాజాగా ఆర్ ఆర్ ఆర్ ఉద్దేశిస్తూ ఓ పోస్ట్ పెట్టగా.. ఆమె హేటర్స్ కొంతమంది ఎప్పటిలాగే ఆమెపై నెగిటివ్ కామెంట్స్ చేశారు. ఈ సందర్భంలో ఓ నెటిజన్ శ్రీరెడ్డి-అభిరామ్‌ల లిప్ లాక్ రొమాన్స్ ఫొటోని షేర్ చేశాడు. అయితే దీనిపై తనదైన శైలిలో స్పందించింది శ్రీరెడ్డి.. ఇంకెంతసేపూ వీడి మూతేనా?? ఇంకెవడి మూతి అయినా పెట్టి మీమ్స్ చేయండ్రా? అంటూ కౌంటర్ ఇచ్చింది. అయితే తప్పకుండా పెడతాం.. నీ లిస్ట్‌లో ఉన్న ఫొటోలు వదిలితే అంతకంటేనా? అంటూ కౌంటర్లు ఇస్తున్నారు నెటిజన్లు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2RTkIGR
v

ఇది మామూలు ప్రమోషన్స్ కాదు.. హీరోయిన్‌తో అల్లు శిరీష్ ఘాటు రొమాన్స్

ఒక్క హిట్ కోసం చాలా ఏళ్ల నుంచి శ్రమిస్తూనే ఉన్నారు. కెరీర్ ప్రారంభం నుంచీ కూడా విజయం కోసం పరితపిస్తూనే ఉన్నారు. ఇప్పటి వరకు ఆయన ఖాతాలో ఒక్కటంటే ఒక్క బ్లాక్ బస్టర్ హిట్ పడలేదు. కొత్తజంట, శ్రీరస్తు శుభమస్తు వంటి ఓ మోస్తరు సినిమాలున్నా కూడా సరైన విజయం మాత్రం దక్కలేదు. అలా అల్లు శిరీష్ ఓ సరైన సినిమా పడాలని ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అలాంటి అల్లు శిరీష్ ఎదురుచూపులు ఫలించేలానే ఉన్నాయి. అల్లు శిరీష్ చివరగా ఏబీసీడీ అంటూ మళయాలీ రీమేక్‌తో చేతులు కాల్చుకున్నారు. అయితే ఈ సారి మాత్రం మోస్ట్ రొమాంటిక్ బాయ్‌గా అలరించేందుకు రెడీ అయినట్టు కనిపిస్తోంది. అను ఇమాన్యుయేల్‌తో కలిసి అల్లు శిరీష్ ఓ రేంజ్ రొమాన్స్ చేసినట్టు పోస్టర్లను బట్టి చూస్తేనే తెలుస్తోంది. ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ ఇలా వర్కవుట్ అయింది కాబట్టే.. ఆఫ్ స్క్రీన్‌లో ఈ ఇద్దరూ రెచ్చిపోతోన్నట్టు తెలుస్తోంది. అల్లు శిరీష్‌ల మీద ఎన్ని రకాల రూమర్లు వచ్చాయో అందరికీ తెలిసిందే. వారిద్దరూ ఎంతో సన్నిహితంగా ఉన్న ఫోటోలు, వీడియోలు బయటకు రావడంతో అందరూ రకరకాలుగా మాట్లాడుకున్నారు. కానీ అదంతా సినిమాలోని కెమిస్ట్రీ కుదిరేందుకే అని ఇప్పుడిప్పుడే అర్థమవుతోంది. అల్లు శిరీష్ ఆరో సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ ఆల్రెడీ మొదలయ్యాయి. రేపు రాబోతోన్న టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ మీద మంచి బజ్ ఏర్పడేలా ప్రీ లుక్‌లను వదులుతున్నారు. ఇందులో భాగంగా మొన్న చేతులు అడ్డం పెట్టి ఉన్న ఫోటోను షేర్ చేశారు. ఇక ఇప్పుడు బెడ్ మీద ఇద్దరూ కలిసి రొమాన్స్ చేస్తోన్న పోస్టర్‌ను వదిలారు. మొత్తానికి రేపు ఉదయం 11 గంటలకు రాబోయే టైటిల్ పోస్టర్ మీద అందరికీ ఆసక్తిని కలిగించేలా చేశారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3wG1e7b
v

హాట్ బ్యూటీకి అరుదైన గౌరవం.. ఓ కన్నేసి ఉంచండంటోన్న గుంజన్

గురించి తెలియని వారెవ్వరూ ఉండరు. Wife,I అనే సినిమాతో అందాలను ఆరబోసి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఇక ఆమె నటన ఎంత బోల్డ్‌గా ఉందో.. మాటలు మరింత పచ్చిగా ఉంటాయి. మొహమాటమేమీ లేకుండా అన్ని విషయాల గురించి ఇంటర్వ్యూలో ఆమె చెప్పిన తీరుకు అంతా షాక్ అయ్యారు. అంతే కాకుండా ఇంటర్వ్యూలో మధ్యలోనే షర్ట్ విప్పేసి కూర్చోవడం అప్పట్లో తెగ కాంట్రవర్సీ అయింది. అలాంటి బ్యూటీ సోషల్ మీడియాలో ఇంకెలా రెచ్చిపోతుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పోర్న్ సినిమాలకు, బూతు సినిమాలకు ఎలాంటి బేధాలున్నాయని, తనను పోర్న్ స్టార్ అంటున్నారు కానీ అది నిజం కాదంటూ ఎంతో క్లియర్‌గా వివరించారు గుంజన్. అలాంటి గుంజన్ తాజాగా ఓ బుక్ కవర్ పేజీ మీద ప్రత్యక్షమైంది. ఇంత వరకు ఏ నటికి కూడా ఇలాంటి గౌరవం దక్కలేదని గుంజన్ చెబుతున్నారు. దర్పన్ గోయల్ అనే అంతర్జాతీయ రచయిత్రి రాస్తోన్న డయాబోలిక్యూ అనే పుస్తకంపై గుంజన్ కనిపించబోతోన్నారు. దీనిపై గుంజన్ మాట్లాడుతూ.. ఈ ప్రాజెక్ట్‌కు నేను ఎందుకు ఓకే చెప్పానంటే వారు నన్ను సహజంగా చిత్రీకరించారు. అది కేవలం నాకోసమే వచ్చినట్టు అనిపించింది.. అంతే కాకుండా అది ప్రతీ ఒక్క అమ్మాయికి సంబంధించిన విషయం అని అనిపించింది.. త్వరలోనే మీ ముందుకు రాబోతోన్నాను.. ఇంకా ఎక్కువ విషయాలు తెలుసుకోవాలని అనుకుంటున్నారా?.. అయితే నా మీద ఓ కన్నేసి ఉంచండి అని అన్నారు. చివరగా గుంజన్.. డెడ్లీ అఫైర్ అనే సినిమాతో పలకరించారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3yLE3dI
v

బాలయ్య గ్రేట్, క్యాస్ట్ ఫీలింగ్ లేదు.. మెగా హీరోల వల్ల కోట్లు నష్టపోయా.. చిరంజీవిని సినిమా అడగను: నిర్మాత సి. కళ్యాణ్

సీకే ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్‌లో నిర్మాత సి. కళ్యాణ్ భారీ బడ్జెట్ చిత్రాలను నిర్మించారు. నందమూరి బాలకృష్ణతో బాగా చనువుగా ఉండే ఈయన.. రూలర్, జై సింహా చిత్రాలను చేయడంతో ఈయన్ని బాలయ్య ప్రొడ్యుసర్ అని అంటుంటారు. ఇక మెగా హీరోలు వరుణ్ తేజ్‌తో లోఫర్, సాయి ధరమ్‌ తేజ్ తో ఇంటిలిజెంట్ సినిమాలు చేసిన ఆయన.. ఈ రెండు చిత్రాలు ఫ్లాప్ కావడంతో కోట్లలో నష్టపోయారు. అప్పటి నుంచి మెగా ఫ్యామిలీకి దూరమయ్యారని మెగా హీరోలతో విభేదాలు ఉన్నాయని వార్తలు రాగా వీటిపై క్లారిటీ ఇస్తూ బాలయ్యతో ఉన్న అనుబంధాన్ని అలాగే మెగా హీరోలతో గ్యాప్ రావడానికి గల కారణాలను తెలియజేశారు. ‘ గారు నన్ను తన సొంత ఫ్యామిలీ మెంబర్‌గా రిసీవ్ చేసుకున్నారు.. ఇందులో క్యాస్ట్ ఫీలింగ్ ఏం లేదు. మా క్యాస్ట్‌‌నే కదా అనే ఏమీ చేసేది ఉండదు. ఒకే కులం అయినా ఒకడ్నొకడు తోసేసుకుంటారు. మెగా ఫ్యామిలీ విషయానికి వస్తే ప్రస్తుతం ఉన్న ప్రొడ్యుసర్లు.. డేట్స్‌ కోసం హీరోల దగ్గరకు వెళ్లి పెర్ఫామెన్స్ చేస్తుంటారు. నాకు ఆ టైప్ పెర్ఫామెన్స్ చేయడం రాదు.. అలవాటు లేదు. బాలకృష్ణ గారి దగ్గర అలాంటి పెర్ఫామెన్స్ అవసరం లేదు. ఇలాంటి వాటికి ఇష్టపడరు. ఏదైనా ఉంటే సూటిగా.. కుండబద్దలు కొట్టినట్టే ఉంటుంది. సినిమాకి సంబంధించిన విషయాలు మాట్లాడుకుంటాం.. ఇండస్ట్రీకి సంబంధించిన విషయాలు ఆయన దగ్గర చెప్పలేరు.. చెప్పే ధైర్యం చేయరు. కానీ ఎందుకో బాలకృష్ణ గారు నాకు ఆ పర్మిషన్ ఇచ్చారు. ఏదైనా ఇష్యూ ఉంటే.. ఆయన దగ్గర చెప్తే కన్వెన్స్ అవుతారు. బాలయ్య దగ్గర నాకు ఆ చనువు ఉంది.. ఎదైనా విషయం నచ్చకపోతే.. లాగే పరిస్థితి ఉండదు. క్షణాల్లోనే నాకు ఇది నచ్చలేదు నేను చేయను అని చెప్పేస్తారు. ఇక మెగా ఫ్యామిలీ విషయానికి వస్తే.. నేను ఎవరికీ బాకీలేను అని చెప్పాను. కానీ నా ‘ఇంటిలిజెంట్’ సినిమా టాపిక్‌లో ఇన్సిడెంట్ ఉంది. నేను మెగా హీరోల్లో వరుణ్ తేజ్‌తో చేశా.. నాగబాబు అంటే నాకు బాగా ఇష్టం. ఆయనతో నాకు బాగా అటాచ్‌మెంట్ ఉంది. వరుణ్‌ని నా కొడుకు అనుకునే నేను సినిమా తీశా. కావాల్సిన దానికంటే ఎక్కువ ఖర్చు పెట్టా. కానీ వరుణ్ తేజ్‌తో చేసిన సినిమా (లోఫర్)కి ఏడు కోట్లు నష్టం వచ్చింది. పైగా ఆ సినిమాకి వరుణ్ తేజ్ ముందు సినిమాకంటే కూడా ఎక్కువ రెమ్యునరేషన్ ఇచ్చా. నేను పర్ఫెక్ట్‌గానే చేశాను కదా.. వాళ్ల సైడ్ నుంచే రెస్పాన్స్ వస్తుందని వెయిట్ చేస్తా. కానీ తరువాత రెండు మూడుసార్లు అనుకున్నాం కానీ.. కాంబినేషన్ కుదర్లేదు. నాకు నష్టం వచ్చింది కదా.. నాతో సినిమా చేయాల్సిందే అని వాళ్ల దగ్గరకు వెళ్లింది లేదు. ఈ సినిమానే కాదు.. ఏ సినిమాకి నష్టం వచ్చినా నాతో మరో మూవీ చేయండని నేను అడగను. ఆ తరువాత మరో మెగా హీరో సాయి ధరమ్ తేజ్‌తో ఇంటిలిజెంట్ సినిమా తీశాం. నిజానికి వి.వి వినాయక్‌ కాంబోలో ఎప్పటి నుంచో సినిమా తీద్దాం అనుకున్నాం. అది ఇంటిలిజెంట్‌తో సెట్ అయ్యింది కానీ.. సినిమా నిరుత్సాహ పరిచింది. టైం బాలేదు కాబట్టి ఫ్లాప్ అయ్యింది. ఈ సినిమా సబ్జెక్ట్ గురించి మొదటి నుంచి నేను చెప్తూనే ఉన్నాను అనుకున్నట్టుగా సినిమా తేడా కొట్టింది. ఆ సినిమా రిలీజ్ అప్పుడు కూడా హీరో సాయి ధరమ్ తేజ్ ఓవర్సీస్ రిలీజ్ చేయొద్దని ఆపాడు. ఆరోజు సాయి ధరమ్ తేజ్‌కి బయట వచ్చే రెమ్యూనరేషన్ కంటే ఎక్కువ చెప్తే.. నేను డైరెక్టర్‌తో మాట్లాడి సెట్ చేశాం. అయితే సినిమా అయిపోయిన తరువాత కూడా నేను హీరోకి రెమ్యూనరేషన్ బ్యాలెన్స్ సర్దేశా. ఆ సినిమా వల్ల నా లైఫ్‌లోనే కనీవినీ ఎరుగని రేంజ్‌లో డబ్బులు పోయాయి. అయినప్పటికీ నాకు వీవీ వినాయక్ అంటే కోపం లేదు.. నన్ను చాలా అభిమానిస్తాడు.. నేనూ అంతే గౌరవం ఇస్తా. ఆ సినిమా పోయినందుకు నాకంటే ఎక్కువ బాధపడ్డాడు వివి వినాయక్. ఏడాది వరకూ మనిషి కాలేకపోయాడు. మా అన్నయ్యకి ఇలా అయ్యిందే అని ఫీల్ అవుతుంటే.. నేనే వెళ్లి సర్ధిచెప్పా. వెంటనే బాలయ్య గారితో సినిమా చేయడానికి రెడీ అయ్యాం. మెగా ఫ్యామిలీతో ఈ రెండే ఇన్సిడెంట్లు. చిరంజీవి గారిని నేను ఎప్పుడూ సినిమా చేయమని అడగలేదు.. అడగను. కళ్యాణ్ లాంటి వాడికి ఒక సినిమా చేయాలని ఆయనకు అనిపిస్తే మంచిది. కానీ రామ్ చరణ్ చాలా గ్రేట్.. ఆయనే ముందుకు వచ్చి కలిసి సినిమా చేద్దాం అని అన్నారు. కానీ చాలా సినిమాలు లిస్ట్‌లో ఉండటంతో నేను మధ్యలో వెళ్లి దూరాలనుకోవడం లేదు. ఈరోజు సినిమా ఫీల్డ్‌లో ఎప్పుడు ఏ కాంబినేషన్ సెట్ అవుతుందో ఎవరికీ తెలియదు’ అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు నిర్మాత సి. కళ్యాణ్.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3uxJklF
v

పర్సనల్ నంబర్ అడిగిన నెటిజన్.. అప్పుడు ఇస్తానంటూ రేణూ దేశాయ్ షాకింగ్ రియాక్షన్

సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటారో అందరికీ తెలిసిందే. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో రేణూ దేశాయ్ తనకు వీలైనంత సాయాన్ని చేస్తున్నారు. కరోనా వల్ల జీవనోపాధి కోల్పోయి తిండి లేక అవస్థ పడుతున్న వారికి రేణూ దేశాయ్ అండగా నిలుస్తున్నారు. కరోనా వైద్యానికి కావాల్సిన మందులను కూడా అందిస్తూ సాయ పడుతున్నారు. ఈ మేరకు రేణూ దేశాయ్ గత పదిహేను రోజుల క్రితం తన ఇన్ స్టాగ్రాంలోని ఇన్ బాక్స్‌ను ఓపెన్ చేసిపెట్టారు. అవసరంలో ఉన్న వారు మెసెజ్ చేయండని రేణూ దేశాయ్ కోరారు. అలా రేణూ దేశాయ్ ఇచ్చిన మంచి అవకాశాన్ని కొందరు దుర్వినియోగం చేసుకున్నారు. హాయ్ అంటూ పనికి మాలిన మెసెజ్‌లు పెడుతూ కాలాన్ని వృథా చేసుకున్నారు. ఇక కొందరు సాయం పేరిట డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశారు.. డబ్బులు ఇవ్వకపోతే ఆత్మహత్య చేసుకుంటామని బెదిరించారు. ఇలాంటి సందేశాలతో విసుగెత్తిపోయిన రేణూ దేశాయ్ తన ఇన్ స్టాగ్రాం అకౌంట్‌లోని ఇన్ బాక్స్‌ను మూసి వేస్తున్నట్టు ప్రకటించారు. ఈ మేరకు నిన్న సాయంత్రం ఇన్ స్టాలో లైవ్‌లోకి వచ్చి ఈవిషయాన్ని ప్రకటించారు. ఇక నుంచి ఏ అవసరం ఉన్నా కూడా కామెంట్ల రూపంలో తెలపండని కోరారు. అది కూడా డబ్బుల రూపంలో అయితే తాను సాయం చేయనని, ఆహారం, నిత్యావసర సరుకులు, చిన్న మొత్తంలో దొరికే మందులు అయితేనే తాను సమకూర్చగలనని అన్నారు. ఆ మేరకు తాను గ్యారంటీ ఇస్తానని రేణూ దేశాయ్ అన్నారు. ఇలా రేణూ దేశాయ్ లైవ్‌లో చెబుతూ ఉంటే ఓ నెటిజన్ మాత్రం తన వెర్రితనాన్ని చూపించాడు. పర్సనల్ నంబర్ ఇవ్వండి అని అడిగేశాడు. అయితే వెటకారంగా అడిగాడో లేదా సాయం కోసం అడిగాడో కానీ రేణూ దేశాయ్ మాత్రం ఎంతో హుందాగా స్పందించారు. పర్సనల్ నంబర్ ఇవ్వలేను. ఎన్జీవో ప్రారంభిస్తే ఆ నంబర్ షేర్ చేస్తాను.. కానీ ఇప్పుడు నా పర్సనల్ నంబర్ ఇవ్వను అని రేణూ దేశాయ్ చెప్పుకొచ్చారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3wJFUhs
v

కోలీవుడ్‌లో విషాదం.. ప్రముఖ నటుడు ఇకలేరు.. కస్తూరీ శంకర్ వ్యాఖ్యలు వైరల్

సినీ పరిశ్రమలో కరోనా తీవ్ర విషాదాన్ని రేపుతోంది. వరుసగా సెలెబ్రిటీలు మృత్యువాత పడుతున్నారు. కరోనాతో సినీ ప్రముఖులు మరణించడం తీవ్ర దిగ్బ్రాంతిని కలగజేస్తోంది. తాజాగా నటుడు, నిర్మాత అయిన కరోనాతో మృతి చెందారు. శుక్రవారం అర్దరాత్రి దాటాక పరిస్థితి విషమించడంతో ఆయన తుది శ్వాస విడిచారు. ఇక ఆయన మరణంపై కోలీవుడ్ ప్రముఖులు తీవ్ర దిగ్బ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని పోస్ట్‌లు పెడుతున్నారు. వెంకట్ సుభాకు కరోనా సోకడంతో చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. అయితే పరిస్థితి విషమించడంతో ఆయన్ను ఐసీయూలో పెట్టి చికిత్స అందించారు. అయితే నిన్న అర్దరాత్రి దాటాక ఆయన మరణించారు. ఆయన మృతిపై రాధికా శరత్ కుమార్, ప్రకాష్ రాజ్, వంటి వారంతా స్పందించారు. ‘వెంకట్ సర్ ఇది నమ్మశక్యంగా లేదు.. ఉదయనిధి సినిమా షూటింగ్ నుంచి వచ్చారు.. తెల్లారే జ్వరం వచ్చింది.. కానీ పాజిటివ్ రాలేదు.. ఆ తరువాత కొన్ని రోజులకు మళ్లీ అనారోగ్యం పాలయ్యారు.. ఇప్పుడు ఆయన మరణించారు.. ఆయనింకా వ్యాక్సిన్ కూడా వేసుకోలేదు.. సారీ సుభా’ అంటూ కస్తూరీ చేసిన వ్యాఖ్యలపై నెటిజన్లు భగ్గుమంటున్నారు. అయితే ఇదంతా డీఏంకే వల్ల అయిందంటావా? వ్యాక్సిన్ వేసుకోకపోవడం వల్లే మరణించారంటావా? అని ప్రశ్నిస్తున్నారు. వెంకట్ సుభా మరణంపై రాధిక స్పందిస్తూ.. ‘మీకు వీడ్కోలు చెప్పేందుకు ఎంతో బాధగా ఉంది.. రాడాన్ సంస్థలో ఆయన భార్య నాతో ఎప్పటి నుంచో కలిసి పని చేస్తున్నారు.. వెంకట్ ఎంతో మంచి వారు.. ఆయన గత కొన్నేళ్ల నుంచి నాకు తెలుసు.. సుభా ఆయన ప్రాణాలు కాపాడటం కోసం ఎంతగానో ప్రయత్నించారు.. ఆయన మరణించడంతో నా గుండె ముక్కలైనట్టు అనిపిస్తోంద’ని అన్నారు. ప్రకాష్ రాజ్ స్పందిస్తూ.. ‘ఎంతో బాధగా ఉంది.. ఇలా ఒక్కొక్కరిగా ఫ్యామిలీ, ఫ్రెండ్స్‌ను కోల్పోవడం తట్టుకోలేకపోతోన్నాను.. నిస్సహాయుడిగా మిగిలిపోయాను. వారు జ్ఞాపకాలతో నా జీవితం ఎంతో భారంగా మారుతోంది.. నా ఈ జీవితప్రయాణంలో భాగస్వామివి అయినందుకు ధన్యవాదాలు.. నిన్ను ఎంతగానో మిస్ అవుతున్నాను.. నీ ఆత్మకు శాంతి కలగాల’ని కోరుకున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2R0NTqW
v

ఏడేళ్ల తరువాత మళ్లీ అలా.. చేసే పని ఏం లేక అంటూ జగ్గూ భాయ్ సెటైర్స్

టాలీవుడ్‌లో ఒకప్పుడు ఫ్యామిలీ హీరోగా ఫుల్ ఫాంలో ఉండేవారు. కానీ ఇప్పుడు భయంకరమైన విలనిజాన్ని చూపిస్తూ అందరినీ భయపెట్టేస్తున్నారు. సైడ్ ఆర్టిస్ట్, సపోర్టింగ్ రోల్, హీరో ఫాదర్, విలన్‌గా ఇప్పుడు టాలీవుడ్‌లో దూసుకుపోతోన్నారు. జగ్గూ భాయ్ లేని సినిమా అంటూ విడుదలయ్యేది కాదు ఆ మధ్య. అయితే ఇప్పుడు మళ్లీ ఆయన కెరీర్ కాస్త స్లో అయింది. దీనికి తోడు కరోనా సెకండ్ వేవ్, లాక్డౌన్ వల్ల షూటింగ్‌లు అన్నీ కూడా క్యాన్సిల్ అయ్యాయి. దీంతో సెలెబ్రిటీలందరూ కూడా ఇంటి పట్టునే ఉంటున్నారు. ఈ క్రమంలో కొంత మంది కొత్త భాషలు నేర్చుకుంటున్నారు. ఇంకొంత మంది సినిమాలు చూస్తూ కాలక్షేపం చేస్తున్నారు. మరి కొంత మంది తమ ఫిట్ నెస్ మీద దృష్టి పెడుతున్నారు. అయితే జగ్గూ భాయ్ మాత్రం తన రూపాన్ని మార్చేసుకున్నారు. దాదాపు ఏడేళ్ల తరువాత షేవింగ్ చేసుకున్నానని జగ్గూ భాయ్ చెప్పుకొచ్చారు. లెజెండ్ సినిమాతో జగ్గూ భాయ్ తన స్టైల్‌ను మార్చేశారు. గుబురు గడ్డం, పెప్పర్ సాల్ల్ లుక్కులో జగపతి దర్శనమిచ్చి షాకిచ్చారు. అప్పటి నుంచి జగపతి బాబు దాదాపు అదే లుక్కులో కనిపించారు. గడ్డంతో ఉన్న సినిమాలే ఎక్కువగా ఉన్నాయి. అయితే ఈ లాక్డౌన్‌లో చేసే పని ఏం లేక ఇలా క్లీన్ షేవ్ చేసుకున్నట్టు తన మీద తానే జగ్గూ భాయ్ సెటైర్ వేసుకున్నారు. నా గడ్డం చూస్తేనే నాకు పని లేదని తెలిసిపోతుంది.. దాదాపు ఏడేళ్ల తరువాత ఇలా క్లీన్ షేవ్ చేసుకున్నానని జగ్గూ భాయ్ చెప్పుకొచ్చారు. ఈ మధ్యే రజినీకాంత్ అన్నాత్తె సినిమా కోసం అదిరిపోయే లుక్కును ట్రై చేసినట్టు జగపతి బాబు పేర్కొన్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3fZog2u
v

లాక్‌డౌన్‌తో కలకి బ్రేక్‌లు పడ్డా.. స్నేహితులతో కలసి పేదలకు అన్నం పెడుతున్న యంగ్ డైరెక్టర్

ఇతరులకు మంచి చేయాలని చాలా మంది అనుకుంటారు. కానీ, కొద్ది మంది మాత్రమే దాన్ని ఆచరణలో పెడతారు. ఈ వీడియోలో కనిపిస్తున్న వ్యక్తి కూడా అలాంటివారే. పేరు . అప్‌కమింగ్ యంగ్ డైరెక్టర్. ఈయన మదిలో మొగ్గ తొడిగిన ఆలోచనకు తెలిసినవాళ్లు కూడా ఓకే చెప్పారు. వెంటనే అది కార్యరూపం దాల్చింది. కొంత డబ్బును సమకూర్చుకొని భోజనాలు తయారు చేయించారు. హైదరాబాద్ రోడ్ల వెంట తిరుగుతూ.. లాక్‌డౌన్‌తో ఇబ్బందులు పడుతున్న పేదలకు అన్నం పెట్టి, వారి కడుపు నింపారు. కరోనా మహమ్మారి విశ్వరూపం చూపిస్తున్న క్లిష్ట సమయంలో ఇంతకంటే గొప్ప సేవ ఏముంటుంది చెప్పండి. మల్లం శ్రీనివాస్ స్వస్థలం జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం కొడవటూరు గ్రామం. పేదరికంలోనే పుట్టి పెరిగాడు. సినిమాలపై ఆసక్తితో హైదరాబాద్ నగరం వచ్చాడు. ఎన్నో కష్టాలను చూశాడు. అలాగని ఇప్పుడు బాగా సెటిలయ్యాడనుకుంటే పొరపాటే. తన సినిమా కలకు లాక్‌డౌన్ బ్రేకులు వేస్తే.. ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నాడు. అయినా, కుంగిపోలేదు. ఉన్నదాంట్లోనే ఇతరులకు సేవ చేయాలనేది శ్రీనివాస్ నైజం. అందుకే ఇతరులకు తోచినంత సాయం చేస్తున్నాడు. స్నేహితులు వెంకట్, తిరుపతి, రవి, ఉస్మాన్ కూడా ఆయనకు తోడయ్యారు. వంట చేసిపెట్టడానికి ఓ కుటుంబం కూడా ముందుకొచ్చింది. దీంతో వీరి పని మరింత తేలికైంది. అలాగని ఇది అంత తేలికేం కాలేదు. కొన్ని ఆటంకాలు ఎదురయ్యాయి. అయితే, తనదైన చొరవ, వాక్చాతుర్యంతో వాటిని ఇట్టే పరిష్కరించుకున్నారు శ్రీనివాస్. ముఖ్యంగా లాక్‌డౌన్ సమయంలో రోడ్ల వెంట తిరగడంలో వారికి ఇబ్బందులు ఎదురయ్యాయి. పోలీసులు అడ్డుకున్నారు. కానీ, ఈ పవిత్ర కార్యం గురించి తెలుసుకున్న తర్వాత పోలీసులు కూడా దయార్ధ్ర హృదయంతో వారిని అనుమతించారు. మంచి మనసుతో చేసే పనికి దేవుడు కూడా సహకరిస్తాడు కదా..! మల్లం శ్రీనివాస్ ఇంతకుముందు ‘నేను సీతాదేవి’ అనే సినిమాకు దర్శకత్వం వహించారు. ప్రస్తుతం ‘ఊరు-పట్నం సినిమా’ అనే చిత్రానికి డైరెక్షన్ చేస్తున్నారు. 80 శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాలో తన జీవితం, తనకు బాగా కావాల్సిన వారి జీవితాలకు సంబంధించిన అంశాలనే చూపెట్టబోతున్నారట. ఇటు పట్నం వారికి, అటు గ్రామస్థులకు ఈ సినిమా బాగా కనెక్ట్ అవుతుందని ఆయన విశ్వాసంగా చెబుతున్నారు.. ఈ లాక్‌డౌన్ సమయంలో మరింత ఎక్కువ మంది పేదలకు ఆహారం అందించడానికి మరికొన్ని రోజులు కృషి చేస్తామని ఆయన చెప్పారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3vx5c1Z
v

HANUMAN అంటూ అదరగొట్టేశాడు.. మరో కొత్త జానర్‌లో ప్రశాంత్ వర్మ

భిన్న చిత్రాల దర్శకుడు మరో కొత్త జానర్‌తో ప్రేక్షకులను పలకరించేందుకు రెడీ అవుతున్నారు. అ!, కల్కి, జాంబీరెడ్డి అంటూ తన సత్తాను చాటుకున్నారు. తీసిన ప్రతీ సినిమా కొత్తగా ఉండాలనే తాపత్రయం ప్రశాంత్ వర్మలో కనిపిస్తుంటుంది. ఫలితాల గురించి పట్టించుకోకుండా ప్రయోగాల బాట పడుతూనే ఉంటారు. అలా ప్రశాంత్ వర్మ సినిమాలంటే తెలుగు ప్రేక్షకులకు ఓ స్థాయి అంచనాలుంటాయి. అయితే ఇప్పుడు ప్రశాంత్ వర్మ తన నాల్గో ప్రాజెక్ట్‌కు సంబంధించిన ప్రకటన చేశారు. ప్రశాంత్ వర్మ బర్త్ డే సందర్బంగా నేడు ఈ ప్రకటనను చేశారు. మరో కొత్త జానర్‌లో రాబోతోందని, అదేంటో గెస్ చేయండని ప్రశాంత్ వర్మ నిన్న ఓ హింట్ వదిలారు. హిమాలయాలను చూపిస్తూ వదిలిన ఆ పోస్టర్ అందరినీ ఆకట్టుకుంది. అయితే తాజాగా సినిమా టైటిల్‌ను ప్రకటించారు. ఈ సారి ఇండియన్ రియల్ సూపర్ హీరో మీద సినిమా తీసేందుకు రెడీ అయ్యారు. స్పైడర్ మెన్, ఐరెన్ మెన్ అంటూ మనం విదేశీ సూపర్ హీరోలను కీర్తిస్తుంటాం. కానీ మన పురాణాల్లోని రియల్ సూపర్ హీరోల గురించి ఎక్కువగా చెప్పుకోం. అలా రియల్ సూపర్ హీరో అయిన మీద ప్రశాంత్ వర్మ దృష్టిపెట్టేశారు. అంటూ వదిలిన ఈ టైటిల్ మోషన్ పోస్టర్ అందరినీ ఆకట్టుకుంటోంది. మొత్తానికి ఈ సారి మైథాలిజికల్ మూవీతో ప్రశాంత్ వర్మ మ్యాజిక్ చేయబోతన్నాడన్న మాట. అయితే ఈ మూవీకి సంబంధించిన వివరాలు త్వరలోనే ప్రకటిస్తామని అన్నారు. క్యాస్ట్ అండ్ క్రూపై రకరకాల వార్తలు వస్తున్నాయి కానీ ఇందులో ఏది నిజమో తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3wHIJ2l
v

Friday 28 May 2021

నటి చాందినితో మాజీ మంత్రి రాసలీలలు.. అశ్లీల ఫొటోలు, వీడియోతో బెదిరింపులు.. ఆధారాలతో సహా బట్టబయలు

మాజీ మంత్రి రాసలీలల బాగోతాన్ని బట్టబయలు చేసింది సినీ . తనని పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేసి.. గత ఐదేళ్లుగా శారీరంగా వాడుకుంటూ ఇప్పుడు పెళ్లి చేసుకోమని అడిగితే నీ దిక్కున్న చోట చెప్పుకోమని బెదిరిస్తున్నాడంటూ మాజీ మంత్రిపై తీవ్ర ఆరోపణలు చేసింది నటి చాందిని. త‌మిళ‌నాడుకి చెందిన మాజీ మంత్రి మ‌ణికంద‌న్ త‌న‌ను పెళ్లి చేసుకుంటాన‌ని నమ్మించి అన్ని విధాలా వాడుకున్నాడంటూ చెన్నై పోలీసుల‌కు ఫిర్యాదు చేసింది నటి చాందిని. తనతో రహస్యంగా ఐదేళ్లుగా కాపురం చేస్తున్నాడని.. తనని శారీరకంగా పీల్చి పిప్పి చేసి ఇప్పుడు ముఖం చాటేస్తున్నాడని తనకి న్యాయం చేయాలని పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది నటి. నోమాడ్స్ చిత్రంతో క్రేజ్ దక్కించుకున్న మలేషియా నటి చాందిని.. ఓ ప్రైవేట్ ఈవెంట్‌లో మంత్రిగారితో పరిచయం ఏర్పడగా.. అది సహజీవనానికి దారితీసింది. గత ఐదేళ్లుగా పెళ్లి చేసుకుంటానని చెప్తూ తనతో కాపురం చేస్తున్నాడని.. అయితే ఎంతకాలం ఇలా అని అడిగేసరికి ఇప్పుడు పెళ్లికి నో చెప్తున్నాడంటూ తీవ్ర ఆరోపణలు చేసింది చాందిని. తన మీద మోజు తీరిపోవడం పెళ్లికి నిరాకరిస్తున్నాడని.. పెళ్లి చేసుకుంటావా లేదా అని నిలదీసినందుకు ఇద్దరం ఏకాంతంగా గడిపిన అశ్లీల వీడియోలను సోషల్ మీడియాలో పెట్టిస్తా అని బెదిరిస్తున్నాడని.. రౌడీలతో దాడి చేయించడానికి ప్రయత్నిస్తున్నాడంటూ చెన్నై సిటీ పోలీసు కమీషనర్ కార్యాలయంలో ఫిర్యాదు చేసింది చాందిని. కాగా తమిళనాడులోని రామాథపురం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన మణికందన్.. జయలలిత సీఎంగా ఉన్న టైంలో ఐటీ శాఖామంత్రిగా పనిచేశారు. అయితే జయలలిత మరణం తరువాత చిన్నమ్మకి ముఖ్య అనుచరుడిగా మారాడు. ప్రస్తుతం ఈ మాజీ మంత్రిగారి రాసలీలలు ఇష్యూ తమిళనాట హాట్ టాపిక్ అవుతన్నాయి.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3yWPQ9c
v

ఎస్పీ బాలుది హత్య.. వాళ్లే చంపేశారు, ఆనందయ్య మందుని రానియ్యరు: వీరమాచినేని సంచలన వ్యాఖ్యలు

గాన గంధర్వుడు.. లెజెండరీ సింగర్ గత ఏడాది సెప్టెంబర్ 25న మరణించిన విషయం తెలిసిందే. కరోనా వైరస్ బారిపడి.. వయసు రీత్యా ఆయన తిరిగి కోలేకపోయారు. సుమారు 20 రోజుల పాటు చెన్నై ఎంజీఎం హాస్పటల్‌లో కరోనాతో పోరాడి తుదిశ్వాస విడిచారు బాలు. అయితే ఆయన మరణించి 8 నెలలు గడుస్తుండగా.. ఎస్పీ బాలు మరణంపై పలు అనుమానాలు వ్యక్తం చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు ప్రముఖ డైట్ స్పెషలిస్ట్, విశ్లేషకుడు రామకృష్ణ. విజయవాడకు చెందిన వీరమాచినేని.. స్పెషల్ డైట్ ద్వారా మధుమేహం, బీ.పీ, ఊబకాయం వంటి వ్యాధులకు డైట్ ఇస్తూ హాట్ టాపిక్ అయ్యారు. తెలుగు రాష్ట్రాలలో ఈయన చెప్పిన డైట్‌ను కొన్ని లక్షల మంది ఫాలో అవుతున్న విషయం తెలిసిందే. ఇదిలాఉంటే ప్రస్తుతం రెండు తెలుగురాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా నెల్లూరు ఆనందయ్య నాటు వైద్యంపై హాట్ టాపిక్ నడుస్తోంది. ఈ ఇష్యూ గురించి ఓ టీవీ ఛానల్‌ నిర్వహించిన డిబేట్‌లో పాల్గొన్న వీరమాచినేని.. కరోనాకి సరైన ట్రీట్ మెంట్ లేక ప్రజలు ఇబ్బందులు పడుతుంటూ కొంతమంది డాక్టర్లు బుద్ది, బుర్ర లేకుండా పనిచేస్తున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ బాలు మరణాన్ని గురించి ప్రస్తావిస్తూ.. ‘ఎస్పీ బాలుని హత్య చేసింది ఎవరు?? వీళ్లు కాదా.. ఆయన్ని చంపేసి తప్పించుకుని తిరగడం లేదా?? బాలసుబ్రహ్మణ్యం అనారోగ్యంతో హాస్పటల్‌కి వెళ్లాడా.? ఏదైనా యాక్సిడెంట్‌లో పచ్చడైపోయి హాస్పటల్‌కి వెళ్లలేదు కదా.. హాస్పటల్‌ని నడుచుకుంటూ పాటలు పాడుకుంటూ వెళ్లాడు. కానీ తిరిగిరాలేదు. ఆయనలా ఎంతమంది.. ఆయనపై ప్రయోగాలు చేసి చంపేశారు. ఆ ప్రయోగాలను ప్రొటోకాల్ లేదు. ఎస్పీ బాలు చికిత్సలో లోపాలు ఉన్నాయని నేను చెప్పడం కాదు.. వందలమంది డాక్టర్లు చెప్పారు. హాస్పటల్‌కి వెళ్లినప్పుడు ఎంతో హ్యాపీగా వెళ్లాడు.. ఏం లేదు పోవయ్యా అంటే ప్రాణంతో వచ్చేసేవారు. ఆరోగ్యంతో ఉన్న ఆయన్ని తీసుకుని వెళ్లి.. ప్రయోగాలు చేసి చంపేశారు. అన్ని మందులు ఇస్తే.. ఆయనే కాదు మనమైనా చచ్చిపోతాం. అసలు మనిషి స్టామినా ఎంత?? వాళ్లు ఇచ్చే మందుల పవర్ ఎంత?? మనిషి తట్టుకోగలడా?? ఈ మందుల పరిస్థితి ఎలా ఉందంటే.. ఇంట్లో ఎలుకని చంపాలంటే ఇళ్లు తగలబెట్టండి అన్నట్టుగా ఉంది. అదేంటండీ ఇల్లు కాలిపోతుంది అంటే.. నువ్ ఎలుక చావాలన్నావ్ గా.. ఇల్లు తగలబడనియ్ అంటారు. ఏ.. ఇల్లు కాలకుండా ఎలుక చావకూడదా? ఆ మాత్రం చేయలేరా? ఇప్పుడు ఆనందయ్య మందుకి కరోనా తగ్గుతుందని రుజువు అయ్యినా.. మన కేంద్ర ప్రభుత్వం, మీడియా దాన్ని తొక్కి అవతల పడేస్తారు. ఇందులో ఎలాంటి సందేహం లేదు. ఆనందయ్య మందు వచ్చినా వేరే వాళ్లు మందు వచ్చినా లక్షల కోట్లు దోపిడీ కుదరదు కాబట్టి.. వ్యాపార ప్రయోజనాలకోసం ఇలాంటి ఆనందయ్యల్ని ఎంకరేజ్ చేయరు. ఎందుకంటే.. ఇలాంటి వాళ్లు ఎలక్షన్ ఫండ్ ఇచ్చే అవకాశం ఉండదు. ఇవన్నీ పచ్చి నిజాలు’ అంటూ కుండబద్దలు కొట్టారు వీరమాచినేని.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2TgqUcb
v

మహానటి జ్ఞాపకాల్లో హీరోయిన్.. లుక్ టెస్ట్‌పై కీర్తి సురేష్ కామెంట్

సావిత్రి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కించిన ‘మహానటి’ సినిమా ఎంతటి ఘన విజయాన్ని సొంతం చేసుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తెలుగులో బయోపిక్ చిత్రాలకు నిఘంటువుగా మారింది ఈ చిత్రం. సావిత్రి జీవితాన్ని కళ్లకు కట్టినట్టు చూపించడం, ఆ పాత్రలో పరకాయ ప్రవేశం చేసినట్టుగా నటించడంతో తెలుగు ప్రేక్షకులకు సినిమాను తమ గుండెల్లో పెట్టుకున్నారు. విమర్శకుల ప్రశంసలతో పాటు కాసుల వర్షం కూడా కురిసింది. 2018లో విడుదలైన ఈ మూవీ ఇప్పటికీ ఏదో ఒక చోట చర్చకు దారి తీస్తూనే ఉంటుంది. పలు అంతర్జాతీయ వేదికల్లో ఈ సినిమాను ప్రదర్శించారు. జాతీయ స్థాయిలో ఎన్నో అవార్డులు దక్కాయి. అసలు ఈ సినిమా ప్రయాణం కూడా ఓ సాహసంతో కూడుకున్నదే. 2018లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కానీ మహానటికి పునాదులు మాత్రం అంతకు ముందు రెండేళ్ల క్రితమే పడ్డాయి. 2016లోనే మహానటి సినిమా పనులను నాగ్ అశ్విన్ ప్రారంభించారట. అలా రెండేళ్లుగా పడిన కష్టానికి తగిన ప్రతిఫలం వచ్చింది. నేను లోకల్ సినిమా చేస్తున్న సమయంలో మహానటి కోసం కీర్తి సురేష్‌ను సంప్రదించారట. మొదట్లో కీర్తి సురేష్ ఖంగారు పడినా కూడా దర్శకుడు ఇచ్చిన ధైర్యంతోనే ఇదంతా సాధ్యమైందని కీర్తి సురేష్ చెబుతుంటారు. అయితే సావిత్రిలా తెరపై కనిపించి మ్యాజిక్ చేయాలంటే అదేమీ సులభమైన విషయం కాదు. అందుకోసం కీర్తి సురేష్‌కు లుక్ టెస్ట్ కూడా పెట్టారట. ఆ విషయాన్ని కీర్తి సురేష్ తాజాగా పంచుకున్నారు. ఈ మేరకు నాడు కట్టుకున్న చీరను, అక్కడ లుక్ టెస్ట్ చేస్తోన్న సమయంలో దిగిన ఫోటోను కీర్తి సురేష్ షేర్ చేశారు. హహ.. లుక్ టెస్ట్ చేసిన మొదటి రోజు.. ఈ ఫోటో వెనకాల ఎన్నో మెమోరీస్ ఉన్నాయ్ అంటూ చెప్పుకొచ్చారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2RRJerT
v

ఆసక్తిరేపుతోన్న చిత్రయూనిట్.. సిగరేట్‌తో హీరో నిఖిల్ హల్చల్

ప్రస్తుతం సినీ పరిశ్రమ తన ప్రాభవాన్ని కోల్పోయింది. ఒక వేళ సెకండ్ వేవ్ ఇంత ఉధృతంగా లేకపోయి ఉంటే.. ఈ పాటికి సినిమాల జాతర ఉండేది. వరుసబెట్టి సినిమాలు లైన్‌లోకి వచ్చాయి. వెంటనే వెంటనే డేట్స్ ప్రకటిస్తూ కర్చీప్‌లు వేసుకున్నారు. కానీ ఈ సెకండ్ వేవ్ అన్నింటిని తలకిందులు చేసేసింది. పెద్ద పెద్ద సినిమాలన్నీ కూడా మళ్లీ వాయిదా పడ్డాయి. అయితే కొన్ని చిన్న సినిమాలు మాత్రం ఓటీటీకి మొగ్గుచూపుతున్నాయి. కొందరేమో అప్డేట్లు ఇచ్చేందుకు వెనకా ముందు ఆలోచిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో సినిమా అప్డేట్లు అంటూ హడావిడి ఎందుకని సైడ్ అయిపోతోన్నారు. అయితే అనుపమా కాంబినేషన్‌లో రాబోతోన్న 18Pages అనే సినిమా మాత్రం అందరినీ ఆకట్టుకునేందుకు రాబోతోంది. ఈ మూవీ నుంచి ఫస్ట్ లుక్ రాబోతోందంటూ చిత్రయూనిట్ ప్రమోషన్స్ కార్యక్రమాలను చేపట్టింది. జూన్ 1న 18Pages ఫస్ట్ లుక్ రాబోతోన్న విషయం తెలిసిందే. అయితే దానికి ఇంకా సమయం ఉండటంతో ప్రీ లుక్‌తో అందరినీ ఆశ్చర్యపరిచారు. తాజాగా నిఖిల్‌కు సంబంధించిన ప్రీ లుక్‌ను సుకుమార్ షేర్ చేశారు. ఇందులో సుకుమార్ క్రియేటివిటీ కనిపిస్తోంది. ఫస్ట్ లుక్ జూన్ 1న రాబోతోందంటూ చెబుతూనే. ఆ పేపర్‌ను తన సిగరేట్ కాల్చుతున్నట్టు కనిపిస్తోంది. మొత్తానికి నిఖిల్ మాత్రం మంచి మాస్ లుక్కులో దర్శనమివ్వబోతోన్నట్టు కనిపిస్తోంది. ఈ మూవీని సుకుమార్ రైటింగ్స్, జీఏ2 సంయుక్తంగా నిర్మిస్తోంది. కుమారి 21ఎఫ్ ఫేమ్ సూర్య ప్రతాప్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3usVbBp
v

హాట్ టాపిక్‌గా ఆనందయ్య మందు.. రేణూ దేశాయ్ సెన్సేషనల్ కామెంట్స్

ప్రపంచం మొత్తం కూడా కరోనా వైరస్‌ను కట్టడి చేయలేకపోతోంది. కొన్ని దేశాల్లో కరోనా వ్యాక్సిన్ అంటూ కొత్త కొత్త మందులను కనిపెడుతున్నారు. కానీ ఏదీ కూడా పూర్తి స్థాయిలో కరోనాను కట్టడి చేయలేకపోతోంది. అయితే ఈ క్రమంలో తెలుగు వాడైన తయారు చేసిన మందు ఒక్కసారిగా పాపులర్ అయింది. ఆయుర్వేద పద్దతులతో ఆనందయ్య తయారు చేసిన మందు కరోనాపై పని చేస్తోందనే వాదనలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఎంతో మంది ఆ మందు వల్ల కరోనా నుంచి కోలుకున్నారని, ఆక్సిజన్ లెవెల్స్ కూడా పెరుగుతున్నాయని చెబుతున్నారు. అలా ఆనందయ్య మందు ఫేమస్ అవ్వడం, పెద్ద ఎత్తున జనాలు కృష్ణపట్నంకు తరలివెళ్లడంతో అసలు సమస్య మొదలైంది. ఆనందయ్య మందు నిజంగానే పని చేస్తోందా? లేదా ఇదంతా ప్రచారమేనా? అని ప్రభుత్వం కూడా విచారణ చేయించడం ప్రారంభించింది. అది కేవలం పసరు మందు మాత్రమే అని కొందరు కొట్టిపారేస్తున్నారు. శాస్త్రీయత లేదని ఆనందయ్య మందును నిషేధించాలని ఇంకొందరు అంటున్నారు. అయితే మెజారిటీ జనాలు మాత్రం ఆనందయ్య మందుకే ఓటేస్తున్నారు. కార్పొరేట్ ఆస్పత్రుల దోపిడీ కంటే ఈ నాటుమందే నయమని కొందరు అంటున్నారు. ఇక ఇదే అదునుగా కొందరు ఆయుర్వేదం, అల్లోపతి, హోమియోపతి వంటి వాటిపై చర్చలు కూడా ప్రారంభించేశారు. తాజాగా ఆనందయ్య మందుపై తన అభిప్రాయాన్ని చెప్పుకొచ్చారు. ఆయుర్వేదాన్ని తాను నమ్ముతానని, అయినా కూడా ఆనందయ్య ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా మందు వేస్తున్నారు..అది పని చేస్తోందని ఎంతో మంది చెబుతున్నారంటే అందులో ఎంతో కొంత నిజముంటుంది కదా?.. నేను ఆయన మందును నమ్ముతున్నాను అని చెప్పుకొచ్చారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3uEfgoN
v

డ్రగ్స్ కేసులో మళ్లీ కదలికలు.. సుశాంత్ సింగ్ స్నేహితుడు అరెస్ట్

బాలీవుడ్ ఇండస్ట్రీలో గత ఏడాది జరిగిన విషాదాలు అన్నీ ఇన్నీ కావు. అన్నింటికంటే ముఖ్యంగా యంగ్ హీరో అనుమానాస్పద రీతిలో మరణించడం అందరినీ కుదిపేసింది. ముందుగా అది ఆత్మహత్య అని నిర్దారించారు పోలీసులు. ఆ తరువాత ఆ కేసులో ఎన్నో మలుపులు చోటుచేసుకున్నాయి. సుశాంత్ సింగ్‌ది హత్యేనని కుటుంబ సభ్యులు, అభిమానులు, ఆయన మిత్రులు చేసిన ఫిర్యాదు మేరకు చివరకు సీబీఐ వద్దకు కేసు చేరింది. అలా సీబీఐ ఎంట్రీ ఇచ్చాక సుశాంత్ సింగ్ కేసులో మరో ట్విస్ట్ బయటకు వచ్చింది. బాలీవుడ్ డ్రగ్స్ మాఫియా లింకులన్నీ బయటకు వచ్చాయి. సుశాంత్ సింగ్‌కు అతని ప్రేయసి రియా చక్రవర్తి డ్రగ్స్ సరఫరా చేసిందనే విషయం బయటకు వచ్చింది. సుశాంత్ కోరిక మేరకు అలా డ్రగ్స్ ఇచ్చానని రియా చక్రవర్తి చెప్పుకొచ్చారు. రియా, ఆమె సోదరుడిని కూడా ఎన్‌సీబీ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే సుశాంత్ సింగ్ మృతిపై విచారణ జరుగుతుండగానే ఇలా డ్రగ్స్ మాఫియా గుట్టు రట్టైంది. ఇందులో స్టార్ హీరో, హీరోయిన్ల పేర్లు కూడా బయటకు వచ్చాయి. శ్రద్దా కపూర్, దీపికా పదుకొణె వంటి స్టార్‌లు ఎంతటి ట్రోలింగ్‌కు గురయ్యారో అందరికీ తెలిసిందే. ఇక సుశాంత్ మరణించే సమయంలో ఆయన ఫ్లాట్‌లో ఉన్న సిద్దార్థ్ పితానీ ఈ కేసులో ముఖ్య సాక్షిగా ఉన్నారు. ఈయన చుట్టూ కూడా డ్రగ్స్ కేసు ఉచ్చు బిగుస్తోంది. సుశాంత్ కేసు విషయంలో ఇప్పటికే ఎన్నో మార్లు విచారణకు హాజరైన సిద్దార్థ్ పితానిని నేడు ఎన్సీబీ అరెస్ట్ చేసింది. డ్రగ్స్ కేసులో సిద్దార్థ్ పితానిని నేడు హైద్రాబాద్‌లో అరెస్ట్ చేసి ముంబై కోర్టులో ప్రవేశపెట్టారు. జూన్ 1 వరకు పోలీస్ కస్టడీలో ఉంచేందుకు కోర్టు అనుమతి ఇచ్చింది. ఆయన నివాసంలో ఎన్నో పత్రాలు, ఎలక్ట్రానిక్ పరికరాలు లభించాయని పోలీసులు తెలిపారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3c0mjS4
v

మొత్తానికి ముహూర్తం ఫిక్స్.. ఓటీటీలో నితిన్ ‘రంగ్ దే’

ఎంతో జోరుగా వరుస సినిమాలను లైన్లో పెట్టేశారు. అందులో రెండు సినిమాలు ఇప్పటికే విడుదలయ్యాయి. చెక్, సినిమాలు నితిన్ కెరీర్‌కు ప్లస్ అవ్వలేదు. చెక్ సినిమా అస్సాం వెళ్లిపోయిందంటూ నితిన్ స్వయంగా చెప్పుకొచ్చారు. రంగ్ దే ఈవెంట్‌లో చెక్ సినిమాపై నితిన్ చేసిన వ్యాఖ్యలు ఎంతగా వైరల్ అయ్యాయో అందరికీ తెలిసిందే. అలాంటి నితిన్ రంగ్ దే మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. చివరకు రంగ్ దే కూడా అలాంటి మిశ్రమ ఫలితాన్నే మిగిల్చింది. రంగ్ దే సినిమా కమర్షియల్‌గా వర్కవుట్ అవ్వలేదు. నిర్మాతకు భారీ నష్టాలనే మిగిలిచినట్టు ట్రేడ్ వర్గాలు పేర్కొన్నాయి. అలా మొత్తంగా నితిన్‌కు రెండు సినిమాలు ఫ్లాపులుగా మిగిలాయి. అయితే ఇప్పుడు రంగ్ దే సినిమా ఓటీటీలో అందుబాటులోకి రానుంది. మొదట నేరుగా ఓటీటీలోనే విడుదలచేయాలని భావించారు. కానీ అప్పుడు పరిస్థితులు కాస్తా మెరుగ్గా కనిపించడంతో థియేటర్‌‌లో రిలీజ్ చేశారు. అలా జీ5 సంస్థతో ముందుగా చేసుకున్న ఒప్పందాలను సవరించుకున్నారు. మొత్తానికి ఇప్పుడు రంగ్ దే సినిమా ఓటీటీలోకి రాబోతోంది. జూన్ 12 నుంచి ఈ మూవీ జీ5 యాప్‌లో అందుబాటులో ఉంటుంది. నితిన్ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ ఓటీటీ ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో లేదో చూడాలి. వెంకీ అట్లూరికి మరోసారి చేదు అనుభవమే ఎదురైంది. మిస్టర్ మజ్ను, రంగ్ దే సినిమాలతో వెంకీ అట్లూరి కాస్త వెనకపడ్డట్టు అయింది. ఇక నితిన్ ఇప్పుడు అంధాదున్ రీమేక్‌లో బిజీగా ఉన్నారు. లాక్డౌన్ వల్ల ఇప్పుడు షూటింగ్‌లు క్యాన్సిల్ అయిన విషయం తెలిసిందే.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3vwRQCH
v

ఏకంగా హీరోయిన్ బూ** సైజ్ అడిగిన నెటిజన్.. దిమ్మతిరిగేలా ఆ లెక్కలు చెప్పి షాకిచ్చిన బ్యూటీ

నేటితరం హీరోయిన్స్ సోషల్ మీడియాలో యమ యాక్టివ్ రోల్ పోషిస్తూ ఎప్పటికప్పుడు నెటిజన్లతో టచ్‌లో ఉంటున్నారు. లైవ్ చాట్స్ నిర్వహిస్తూ నెటిజన్స్ అడిగిన ప్రశ్నలపై సమాధానాలు ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో కొన్ని సందర్భాల్లో ఆ నెటిజన్స్ నుంచి అనుకోని ప్రశ్నలు ఎదురవుతుండటం చూస్తున్నాం. కొంతమంది హీరోయిన్స్ ప్రైవేట్ లైఫ్‌తో పాటు శారీరక కొలతల తాలూకు విషయాలు అడగడం వారికి కాస్త ఇబ్బంది కలిగిస్తోంది. అయితే తాజాగా హీరోయిన్ యషికా ఆనంద్‌కి అలాంటి ప్రశ్నే ఎదురుకావడంతో దిమ్మతిరిగే ఆన్సర్ చేసింది. 2016లో ధురువంగల్ పత్తినారు సినిమాతో సిల్వర్ స్క్రీన్‌ ఎంట్రీ ఇచ్చి.. 2018లో అడల్ట్ కామెడీ, ఇరుట్టు అరైయిల్ మురట్టు సినిమాలతో క్రేజీ హీరోయిన్‌గా మారి 2019లో కఝుగు 2, జాంబీ సినిమాలతో క్రేజ్ కొట్టేసింది యషికా. తమిళ బిగ్ బాస్‌లో కూడా పార్టిసిపేట్ చేసిన ఈ బ్యూటీ.. తెలుగులో విజయ్ దేవరకొండ హీరోగా వచ్చిన 'నోటా' సినిమాలో నటించింది. పెళ్లికి ముందు వర్జినిటీ కోల్పోవడం గురించి మాట్లాడి అప్పట్లో సంచలనం సృష్టించిన ఆమె తాజాగా మరోసారి వార్తల్లో నిలిచింది. అయితే తాజాగా అభిమానులతో లైవ్ చాట్ చేస్తుండగా యషికను అడగకూడని ప్రశ్న అడిగాడు ఓ నెటిజన్. ఏకంగా 'నీ బూ** సైజ్ ఎంత?' అని అడగడంతో ఆమె షాక్ అయింది. కాకపోతే ఏ మాత్రం జంకకుండా 'నీ బా** కంటే ఎక్కువే' అంటూ అతనికి పర్ఫెక్ట్ పంచ్ ఇచ్చింది. ఈ మేరకు ఈ స్క్రీన్ షాట్‌ని తన ఇన్స్‌స్టా స్టోరీలో పోస్ట్ చేయడంతో ఇష్యూ హాట్ టాపిక్ అయింది. ప్రస్తుతం ''ఇవాన్ తాన్ ఉతమన్, రాజా భీమ, కదమాయై సై, పంబట్టం, సల్పర్'' సినిమాలతో బిజీగా ఉంది యాషికా ఆనంద్.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3fsha7f
v

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...