Friday 28 May 2021

మొత్తానికి ముహూర్తం ఫిక్స్.. ఓటీటీలో నితిన్ ‘రంగ్ దే’

ఎంతో జోరుగా వరుస సినిమాలను లైన్లో పెట్టేశారు. అందులో రెండు సినిమాలు ఇప్పటికే విడుదలయ్యాయి. చెక్, సినిమాలు నితిన్ కెరీర్‌కు ప్లస్ అవ్వలేదు. చెక్ సినిమా అస్సాం వెళ్లిపోయిందంటూ నితిన్ స్వయంగా చెప్పుకొచ్చారు. రంగ్ దే ఈవెంట్‌లో చెక్ సినిమాపై నితిన్ చేసిన వ్యాఖ్యలు ఎంతగా వైరల్ అయ్యాయో అందరికీ తెలిసిందే. అలాంటి నితిన్ రంగ్ దే మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. చివరకు రంగ్ దే కూడా అలాంటి మిశ్రమ ఫలితాన్నే మిగిల్చింది. రంగ్ దే సినిమా కమర్షియల్‌గా వర్కవుట్ అవ్వలేదు. నిర్మాతకు భారీ నష్టాలనే మిగిలిచినట్టు ట్రేడ్ వర్గాలు పేర్కొన్నాయి. అలా మొత్తంగా నితిన్‌కు రెండు సినిమాలు ఫ్లాపులుగా మిగిలాయి. అయితే ఇప్పుడు రంగ్ దే సినిమా ఓటీటీలో అందుబాటులోకి రానుంది. మొదట నేరుగా ఓటీటీలోనే విడుదలచేయాలని భావించారు. కానీ అప్పుడు పరిస్థితులు కాస్తా మెరుగ్గా కనిపించడంతో థియేటర్‌‌లో రిలీజ్ చేశారు. అలా జీ5 సంస్థతో ముందుగా చేసుకున్న ఒప్పందాలను సవరించుకున్నారు. మొత్తానికి ఇప్పుడు రంగ్ దే సినిమా ఓటీటీలోకి రాబోతోంది. జూన్ 12 నుంచి ఈ మూవీ జీ5 యాప్‌లో అందుబాటులో ఉంటుంది. నితిన్ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ ఓటీటీ ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో లేదో చూడాలి. వెంకీ అట్లూరికి మరోసారి చేదు అనుభవమే ఎదురైంది. మిస్టర్ మజ్ను, రంగ్ దే సినిమాలతో వెంకీ అట్లూరి కాస్త వెనకపడ్డట్టు అయింది. ఇక నితిన్ ఇప్పుడు అంధాదున్ రీమేక్‌లో బిజీగా ఉన్నారు. లాక్డౌన్ వల్ల ఇప్పుడు షూటింగ్‌లు క్యాన్సిల్ అయిన విషయం తెలిసిందే.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3vwRQCH
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...