Sunday 31 May 2020

అఫీషియల్: కరణం మల్లీశ్వరి బయోపిక్ అనౌన్స్.. మరో పాన్ ఇండియా మూవీ!

ప్రస్తుతం వెండితెరపై బయోపిక్స్ హవా నడుస్తోంది. గొప్ప వ్యక్తుల జీవిత చరిత్ర, వారి వారి గొప్పతనాన్ని, సాధించిన విజయాలను వెండితెరపై చూసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు నేటితరం ప్రేక్షకులు. దీంతో ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టుగానే బయోపిక్స్ రూపొందించేందుకు ముందుకొస్తున్నారు దర్శకనిర్మాతలు. ఈ క్రమంలోనే తాజాగా ఒలింపిక్స్‌లో ప‌తకం సాధించిన తొలి భార‌తీయ మ‌హిళ అనౌన్స్ చేశారు కోన వెంకట్. ఈ రోజు (జూన్ 1) క‌ర‌ణం మ‌ల్లీశ్వ‌రి పుట్టిన‌రోజు సందర్భంగా ఈ ప్రాజెక్ట్ వివరాలు తెలుపుతూ అఫీషియల్ ప్రకటన చేశారు. ఒలింపిక్స్ మెడల్ సాధించిన తొలి భారతీయ మహిళ క‌ర‌ణం మ‌ల్లీశ్వ‌రి జీవిత చరిత్రను వెండితెరపై ఆవిష్కృతం చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ప్రత్యేక పోస్టర్ ద్వారా ఆమెకు బర్త్ డే విషెస్ తెలిపారు. ఎం.వి.వి.స‌త్య‌నారాయ‌ణ‌, ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఈ చిత్రాన్ని పాన్ ఇండియా సినిమాగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారట. Also Read: అయితే ఈ చిత్రంలో క‌ర‌ణం మ‌ల్లీశ్వ‌రి కనిపించబోయే హీరోయిన్ ఎవరనేది మాత్రం ప్రకటించకపోవడంతో అందరిలోనూ ఆసక్తి మొదలైంది.ఈ చిత్రంలో టాలీవుడ్ హీరోయిన్‌ని తీసుకుంటారా? లేక బాలీవుడ్ భామను ఫైనల్ చేస్తారా? అనే దానిపై అప్పుడే చర్చలు మొదలయ్యాయి. అతిత్వరలో ఈ విషయమై అధికారిక ప్రకటన రానుంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3cmngl9
v

ట్ర‌య‌ల్ అండ్ ఎర్రర్ మెథడ్: 'పుష్ప' కోసం సుకుమార్ ప్లాన్! వర్కవుట్ అయిందంటే..

కరోనా మహమ్మారి దేశవిదేశాలను ఓ కుదుపు కుదిపేసింది. ప్రపంచాన్నే గడగడలాడిస్తున్న ఈ వైరస్ మన దేశంలోనూ విలయతాండవం చేస్తుండటంతో కేంద్ర ప్రభుత్వం లాక్‌డౌన్ విధించిన సంగతి తెలిసిందే. ఇది సినీ ఇండస్ట్రీపై తీవ్ర ప్రభావం చూపింది. షూటింగ్స్ అన్నీ బంద్ కావడంతో చిత్ర పరిశ్రమలోని పేదల ఆర్ధిక స్థితిగతులు దెబ్బతిన్నాయి. అయితే ప్రస్తుతం లాక్‌డౌన్ అమలులో ఉన్నప్పటికీ సడలింపులు ఇస్తున్న ప్రభుత్వం త్వరలోనే షూటింగ్స్ రీ ఓపెన్ చేసుకునేందుకు పర్మిషన్స్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో క్రియేటివ్ డైరెక్టర్ '' మూవీ షూటింగ్ నిమిత్తమై పక్కా ప్లాన్ రెడీ చేస్తున్నారట. షూటింగ్స్ మొదలైనా కూడా కరోనా పట్ల నటీనటులు, సాంకేతిక నిపుణుల్లో ఉన్న భయాలు తొలగిపోయేలా కనిపించడం లేదు. అందుకే అందరిలో ధైర్యం నింపేలా 'ట్ర‌య‌ల్ అండ్ ఎర్రర్ మెథడ్' ఉపయోగించనున్నారట సుకుమార్. ఆగ‌స్ట్ నెల నుండి పుష్ప‌ షూటింగ్ మొదలు పెట్టేసి ఈ మెథడ్ అప్లై చేయనున్నారట. ఇందులో భాగంగా మొదటగా నెల రోజుల పాటు ప‌రిమిత సంఖ్య‌లో యూనిట్ స‌భ్యుల‌ను అల్లో చేసి షూటింగ్‌ స్టార్ట్ చేస్తార‌ట‌. ఆ స‌మ‌యంలో స‌భ్యులంద‌రూ ఓ ప్రాంతంలోనే ఉండేలా చూస్తూ.. వాళ్ళెవరూ ఇత‌రుల‌ను క‌ల‌వ‌డం, అదేవిధంగా ఇత‌రులు వీలున్న ప్ర‌దేశానికి రాకుండా జాగ్ర‌త్త‌లు తీసుకోవడం లాంటివి చేస్తారట. ఈ ప్లాన్ వర్కవుట్ అయిందంటేనే త‌దుప‌రి షెడ్యూల్స్ ప్లాన్ చేస్తార‌ట. సుకుమార్ తెరకెక్కిస్తున్న ఈ 'పుష్ప' మూవీలో అల్లు అర్జున్- రష్మిక మందన జంటగా నటిస్తున్నారు. లారీ డ్రైవర్ పుష్పరాజ్ రోల్‌లో బన్నీ నటిస్తుండగా, పల్లెటూరు పిల్లలా డిఫెరెంట్ క్యారెక్టర్ పోషిస్తోంది రష్మిక. ఇటీవలే విడుదలైన ఈ చిత్ర ఫస్ట్‌లుక్ పోస్టర్స్ సినిమాపై హైప్ క్రియేట్ చేశాయి.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2ZUDy1V
v

మెగా అభిమానులకు క్రేజీ అప్‌డేట్: రామ్ చరణ్‌ కోసం కొరటాల స్కెచ్!!

మెగా పవర్ స్టార్ ప్రస్తుతం RRR మూవీతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. రాజమౌళి రూపొందిస్తున్న ఈ భారీ ప్రాజెక్టుతో పాటు కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి హీరోగా రూపొందుతున్న మెగా ప్రాజెక్టు '' మూవీలోనూ భాగం కాబోతున్నారు చెర్రీ. షూటింగ్స్ రీ ఓపెన్ అయిన వెంటనే ఈ రెండు సినిమాల సెట్స్‌పైకి ఆయన వెళ్లనున్నారు. ఈ క్రమంలోనే 'ఆచార్య'లో చరణ్ కోసం వేట ప్రారంభించిన కొరటాల.. చివరకు ఓ క్రేజీ బ్యూటీని ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది. ఇటీవలి కాలంలో వరుస హిట్స్ ఖాతాలో వేసుకుంటూ టాలీవుడ్ క్రేజీ హీరోయిన్‌గా దూసుకుపోతున్న రష్మిక మందనను రామ్ చరణ్ సరసన నటింపజేసేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారట. ఈ మేరకు ఆమెతో సంప్రదింపుల కార్యక్రమాలు కూడా జరుపుతున్నారని టాక్. మరోవైపు ఈ సినిమాలో చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్‌ని కన్ఫర్మ్ చేశారు కొరటాల శివ. Also Read: లేటెస్ట్ సమాచారం మేరకు 'ఆచార్య' మూవీలో రామ్ చరణ్ రోల్ చాలా కీలకం అని తెలుస్తోంది. చర‌ణ్ పాత్ర చాలా ప‌వ‌ర్‌ఫుల్‌గా చిరంజీవికి మార్గ‌నిర్దేశం చేసేలా ఉంటుందని సమాచారం. దేవాలయాల్లో జరుగుతున్న అక్రమాల నేపథ్యంలో ఈ మూవీ కథ సిద్ధం చేసిన కొరటాల శివ.. మెగా అభిమానులు మెచ్చేలా ఆ కథకు తెర రూపం ఇవబోతున్నారట. సో.. రామ్ చరణ్ సరసన రష్మిక అని వస్తున్న ఈ క్రేజీ అప్‌డేట్ ఎంత వరకు నిజం కానుందో చూద్దాం మరి.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3gHZGCw
v

షాకింగ్: సినీ ఇండస్ట్రీలో మరో విషాదం.. కరోనాతో ప్రముఖ సంగీత దర్శకుడు మృతి

ఈ ఏడాది సినీ ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటు చేసుకోవడం ఆయా వర్గాలను కలవరపెడుతోంది. వరుస మరణాలతో సినీ పరిశ్రమను విషాద ఛాయలు వెంటాడుతున్నాయి. మే 31వ తేదీ (ఆదివారం) రాత్రి ప్రముఖ బాలీవుడ్ (42) కన్నుమూశారు. కొన్నాళ్లుగా గుండె, కిడ్నీ సమస్యలతో బాధపడుతున్న ఆయనకు ఇటీవలే కూడా సోకడంతో ముంబయిలోని కోకిలాబెన్ ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. పలు హిట్ సినిమాలకు సంగీతం సమకూర్చిన బాలీవుడ్ ఫేమ‌స్ సంగీత ద్వయం సాజిద్-వాజిద్లలో ఒకరైన మరణం బాలీవుడ్ వర్గాల్లో విషాద ఛాయలు నింపింది. సాజిద్- వాజిద్ ఖాన్ ద్వయం ఎక్కువుగా సల్మాన్ ఖాన్ సినిమాలకు సంగీతం సమకూర్చారు. సల్మాన్ బ్లాక్ బస్టర్ సినిమాలైన ''వాంటెడ్, దబాంగ్, ఏక్తా టైగర్'' తదితర చిత్రాలకు ఈ ద్వయమే బాణీలు కట్టింది. వాజిద్ ఖాన్ మృతి పట్ల పలువురు బాలీవుడ్ నటీనటులు సంతాపం వ్యక్తం చేస్తూ ట్వీట్స్ పెడుతున్నారు. వాజిద్ మరణవార్త తమను షాక్‌కి గురిచేసిందని ప‌లువురు బాలీవుడ్ ప్ర‌ముఖులు పేర్కొంటున్నారు. వాజిద్ మృతి పట్ల రియాక్ట్ అయిన ప్రియాంకచోప్రా.. ''వాజిద్ ఖాన్ నవ్వును మేమెప్పుడూ మర్చిపోలేం, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నా. వారి కుటుంబానికి ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నా'' అని పేర్కొంటూ ట్వీట్ చేశారు. ప్రముఖ బాలీవుడ్ సింగర్ సోనూ నిగమ్ ప్రగాడ సంతాపం తెలిపాడు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/306WomL
v

పూరి కథ కోసం ఎదురుచూస్తున్నా.. మహేష్ బాబు ఆసక్తికర వ్యాఖ్యలు

మహేష్ బాబు- క్రేజీ కాంబోలో సినిమా రావాలని తెలుగు ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే ఈ ఇద్దరి కాంబోలో వచ్చిన రెండు సినిమాలు ''పోకిరి, బిజినెస్‌మేన్'' సూపర్ డూపర్ హిట్స్ సాధించడంతో మళ్ళీ ఇప్పుడు అందరి చూపు ఈ కాంబోపై పడింది. అయితే తాజా పరిస్థితులు చూస్తుంటే మరి కొద్దిరోజుల్లోనే ప్రేక్షకుల కోరిక నెరవేరుతుందేమో అనిపిస్తోంది. నిన్న విడుదలైన మహేష్ కొత్త సినిమా టైటిల్ పోస్టర్ 'సర్కార్ వారి పాట' చూసి పూరి జగన్నాథ్ అభినందించడం, మరోవైపు కాసేపు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో మాట్లాడిన .. పూరితో సినిమా చేయడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పడం సూపర్ స్టార్ అభిమానుల్లో నూతనోత్సాహం నింపుతోంది. నిన్న (మే 31) సూపర్ స్టార్ కృష్ణ 77వ పుట్టిన రోజు సందర్భంగా ఇన్స్‌స్టా వేదికగా అభిమానులతో లైవ్ చాట్ చేశారు మహేష్ బాబు. ఈ కార్యక్రమంలో అభిమానులు అడిగిన అన్ని ప్రశ్నలకు ఓపికగా సమాధానాలిచ్చారు. ఇందులో భాగంగా ఓ నెటిజన్.. భవిష్యత్తులో పూరీతో కలిసి సినిమా చేస్తారా? దానికోసం మేము ఎంతగానో ఎదురుచూస్తున్నాం అని అడగగా మహేష్ ఆసక్తికరంగా స్పందించారు. ఖచ్చితంగా పూరి దర్శకత్వంలో సినిమా చేస్తానని, తనకు ఇష్టమైన దర్శకుల్లో పూరీ ఒకరని, ఆయన కథ నేరేట్ చేస్తారేమో అని ఇప్పటికీ ఎదురుచూస్తున్నానని చెప్పారు. దీంతో పూరి- మహేష్ కాంబోకి త్వరలోనే ముహూర్తం పెట్టడం ఖాయమని ఫిక్స్ అవుతున్నారు తెలుగు ప్రేక్షకులు. Also Read: ఇకపోతే ఈ ఏడాది ఆరంభం లోనే 'సరిలేరు నీకెవ్వరు' అనిపించుకుంటూ ఇండస్ట్రీ హిట్ కొట్టేసిన మహేష్ బాబు.. ఇప్పుడు 'సర్కార్ వారి పాట' అంటూ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. పరశురామ్ దర్శకత్వంలో రూపొందనున్న ఈ సినిమాను అతిత్వరలో సెట్స్ పైకి తీసుకురానున్నారు. మరోవైపు రాజమౌళి దర్శకత్వంలో మహేష్ మూవీ కోసం సన్నాహాలు జరుగుతున్నాయి. సో.. చూడాలి మరి ఇంతటి బిజీ షెడ్యూల్‌లో పూరి జగన్నాథ్ తన కథతో మహేష్ డేట్స్ పట్టేస్తాడా? లేదా? అనేది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/36OMyHt
v

పాలిటిక్స్‌తో పవన్ బిజీ.. అందుకే మామిడి పండ్లు పంపలేదు: ఆలీ

టాలీవుడ్ స్టార్ కమెడియన్ ఆలీ.. తన స్నేహితుడు, జనసేన అధినేత పవర్ స్టార్ గురించి ఆసక్తికర విషయాలు చెప్పారు. ఆదివారం ఓ న్యూస్ చానెల్‌తో మాట్లాడిన ఆలీ.. పవన్ కళ్యాణ్‌తో తన పరిచయం గురించి, ఆయనతో ఏర్పడిన బంధం గురించి చెప్పుకొచ్చారు. తాను చిరంజీవి కోసం ఆయన ఇంటికి వెళ్తున్నప్పుడు పవన్ కళ్యాణ్ అక్కడ ఉండేవారని.. ఆయనతో అలా పరిచయం ఏర్పడిందని చెప్పారు. అప్పటికి పవన్ కళ్యాణ్ ఇండస్ట్రీలోకి రాలేదని అన్నారు. ‘‘నేను అన్నయ్య కోసం వెళ్తున్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు అక్కడ ఉండేవారు. ఆయన్ను కలిసేవాడిని. అప్పటికి ఆయన ఇండస్ట్రీలోకి ఎంటర్ కాలేదు. ‘అన్నయ్య ఇప్పుడే వచ్చారు.. మీరు కూర్చోండి.. కాఫీ తాగుతారా, టీ తాగుతారా’ అని సరదాగా కబుర్లు మాట్లాడేవారు. అన్నీ సినిమా కబుర్లే. ఏం సినిమాలు చేస్తున్నారు అని అడిగేవారు. ఆ తరవాత ఆయన ‘అక్కడమ్మాయి ఇక్కడబ్బాయి’ సినిమా చేశారు. ఆ ఒక్క సినిమా తప్ప ఆ తరవాత ఇంచుమించుగా అన్ని సినిమాల్లో నేను నటించాను. Also Read: ఇటీవల ‘అజ్ఞాతవాసి’లో కూడా నేను నటించలేదు. ఆయన హీరోగా చేసిన 25 సినిమాల్లో 23 సినిమాల్లో నేను నటించాను. మొదట ‘గోకులంలో సీత’, తరవాత ‘సుస్వాగతం’, తరవాత ‘తొలిప్రేమ’ సినిమాలో నటించాను. ‘తొలిప్రేమ’ సినిమా నుంచి మా జర్నీ బలపడింది. పవన్ కళ్యాణ్ గారితో ఆఖరిగా చేసిన సినిమా కాటమరాయుడు’’ అని ఆలీ చెప్పుకొచ్చారు. బయట కార్యక్రమాల్లో ఆలీ ఎదురుగా కనబడినా, ఆయన మాట్లాడినా పవన్ కళ్యాణ్ నవ్వడం మొదలుపెడతారు. దీని గురించి ఆలీ మాట్లాడారు. ‘‘మేం కొన్ని సైగలు చేసుకుంటూ ఉంటాం. అవి మా ఇద్దరికీ తప్ప ఎవరికీ తెలీవు. నావి కొన్ని ఎక్స్‌ప్రెషన్స్ అంటే ఆయనకి చాలా ఇష్టం. అలాగే, బ్రహ్మానందం గారన్నా ఆయనకు చాలా ఇష్టం. చిరంజీవి గారికి, పవన్ కళ్యాణ్ గారికి బ్రహ్మానందం గారు చాలా దగ్గర. మెగా ఫ్యామిలీ ఏదైనా ఫంక్షన్ చేస్తే ఆహ్వానించే కొంత మంది పేర్లలో బ్రహ్మానందం గారి పేరు, నా పేరు కచ్చితంగా ఉంటాయి’’ అని ఆలీ వెల్లడించారు. Also Read: ప్రతి సంవత్సరం చిరంజీవి ఇంటి నుంచి తనకు ఆవకాయ పచ్చడి వస్తుందని ఆలీ తెలిపారు. పెద్ద జాడీతో ఆవకాయ పచ్చడి పంపుతారని చెప్పారు. పవన్ కళ్యాణ్ కూడా సేంద్రియ మామిడి పండ్లు పంపేవారని అన్నారు. ప్రస్తుతం రాజకీయాలతో పవన్ బాగా బిజీగా ఉన్నారు కాబట్టి ఈ సంవత్సరం మామిడి పండ్లు రాలేదని.. బహుశా వచ్చే ఏడాది రావచ్చేమోనని ఆలీ ఆశాభావం వ్యక్తం చేశారు. ఇక వైఎస్సార్‌సీపీలో చేరిన తరవాత తన రాజకీయాల గురించి ఆలీ మాట్లాడుతూ.. ‘‘మూడు నెలల నుంచి మా ఇంట్లో పాలిటిక్స్‌తో సరిపోతోంది. పిల్లలకి నాకు.. నాకు, మా ఆవిడకి రాజకీయాలు జరుగుతున్నాయి. కోవిడ్ అయిన తరవాత వెళ్లి కలుస్తా’’ అని ఆలీ చెప్పుకొచ్చారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/36MHmUg
v

గౌతమ్ కాబోయే హీరో.. రాజమౌళితో కచ్చితంగా సినిమా చేస్తా: మహేష్ బాబు చెప్పిన ఆసక్తికర విషయాలు

తన తండ్రి నటశేఖర కృష్ణ పుట్టినరోజు సందర్భంగా ఆదివారం (మే 31న) తన కొత్త సినిమా టైటిల్‌ను, ఫస్ట్ లుక్ పోస్టర్‌ను సూపర్ స్టార్ మహేష్ బాబు విడుదల చేశారు. ‘సర్కారు వారి పాట’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు మహేష్. ‘గీత గోవిందం’తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న పరశురామ్.. ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, జి మహేష్ బాబు ఎంటర్‌టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్లపై నవీన్ యెర్నేని, వై.రవిశంకర్, రామ్ ఆచంట, గోపి ఆచంట ఈ సినిమాను నిర్మిస్తున్నారు. తమన్ సంగీతం సమకూరుస్తున్నారు. ‘సర్కారు వారి పాట’ టైటిల్ పోస్టర్ చూసి మహేష్ బాబు ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అయిపోయారు. అయితే, ఆదివారం సాయంత్రం మహేష్ బాబు తన అభిమానులను మరోసారి ఫిదా చేశారు. ఆదివారం సాయంత్రం 5 గంటలకు ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు. సుమారు గంటపాటు ఈ ఛాట్ ప్రోగ్రాం సాగింది. అభిమానులు చాలా ఆసక్తికర ప్రశ్నలు అడిగారు. వాటికి అంతే ఆసక్తికరంగా మహేష్ బాబు సమాధానాలు చెప్పారు. గౌతమ్ హీరో అవుతాడా అని ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు.. ‘‘అతను కోరుకుంటున్నాడని నేను భావిస్తున్నాను. కాలమే చెబుతుంది’’ అని సమాధానం ఇచ్చారు. Also Read: అలానే, ‘‘రాజమౌళితో మీరు సినిమా చేస్తారని మేం ఆశించొచ్చా?’’ అని ఒక అభిమాని మహేష్‌ను అడిగారు. దీనికి మహేష్ అవుననే సమాధానం ఇచ్చారు. ‘‘అవును, కచ్చితంగా మీరు ఆశించొచ్చు. దీని కోసం ఆసక్తిగా ఎదురుచూసే వాళ్లలో నేనూ ఒకడిని’’ అని మహేష్ రిప్లై ఇచ్చారు. అంటే, RRR తరవాత రాజమౌళి పనిచేయబోయేది మహేష్‌తోనేనని ఒక స్పష్టత వచ్చింది. మహేష్ చెప్పిన మరికొన్ని సమాధానాల్లో ఆసక్తికరమైనవి మీకోసం.. ✪ లాక్‌డౌన్ తరవాత లైఫ్ ఎలా ఉండబోతోందని మీరు భావిస్తున్నారు? లాక్‌డౌన్ తరవాత జీవితం కచ్చితంగా వేరేగా ఉంటుంది. మాస్క్ ధరించి సురక్షితంగా ఉండాలి. జాగ్రత్త వహించాలి. ఈ కొత్త పరిస్థితిని మనందరం పాటించాలి. కాబట్టి, అందరూ సురక్షితంగా ఉండండి. ✪ మీకు ఇష్టమైన జంక్ ఫుడ్ ఏంటి సార్? బర్గర్లు, పిజ్జాలు ✪ మీ పెంపుడు శునకాల పేర్లేమిటి? నొబిటా, ప్లూటో ✪ మీ గురించి ఒక సీక్రెట్ చెప్పండి? ఇదొక రహస్యం. మీకు నేను ఎలా చెబుతాను. ✪ మీకు ఇష్టమైన క్రికెటర్ ఎవరు? మహేంద్రసింగ్ ధోనీ, విరాట్ కోహ్లి.. అలాగే నా ఆల్‌టైమ్ ఫేవరేట్ సచిన్ టెండూల్కర్. ✪ మీ నిక్ నేమ్ ఏంటి సార్? నాని ✪ ఖాళీ సమయంలో మీరు ఏం చేయడానికి ఇష్టపడతారు? పుస్తకాలు చదువుతాను. బోలెడన్ని సినిమాలు చూస్తాను. ఈతకొడతాను. నా పిల్లలతో ఆడుకుంటాను. అలాగే, నా శునకాలతో ఆడుకుంటాను. నా చేతిలో చాలా అంశాలు ఉన్నాయి. ✪ మీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు? నమ్రతా శిరోద్కర్ ✪ మీ కొత్త సినిమా థీమ్ ఏంటి సార్? ‘సర్కారు వారి పాట’ ఒక కంప్లీట్ ఎంటర్‌టైనర్. అలాగే, స్ట్రాంగ్ మెసేజ్ కూడా ఉంటుంది. ఈ సినిమా చేయడం పట్ల నాకు చాలా సంతోషంగా ఉంది. ✪ సితార, గౌతమ్.. వీరిద్దరిలో ఎవరిని మీరు ఎక్కువగా ఇష్టపడతారు? వారిద్దరూ నాలో భాగం. వారిలో ఒకరిని తక్కువగా ఎలా ప్రేమించగలను? ✪ టీ, కాఫీల్లో మీకు ఏది ఇష్టం? నేను కాఫీ పర్సన్‌ని. ✪ మీకు ఎంతో ఇష్టమైన మునగకాయ మటన్ వంటకం గురించి ఒక్క మాటలో చెప్పండి. ఇప్పుడు గుర్తుచేయొద్దు.. ✪ మీకు ఎవరి మీదైనా క్రష్ ఉందా? నాకు 26 ఏళ్ల వయసులో ఉండేది. అప్పుడే నమ్రతను పెళ్లిచేసుకున్నాను. ✪ వర్షం పడుతోంది, వాతావరణం చాలా బాగుంది. ఇలాంటప్పుడు మీకు ఏ స్నాక్ తినాలనిపిస్తుంది? అల్లం టీతో మిర్చి బజ్జీ ✪ పూరీ గారితో భవిష్యత్తులో ఒక సినిమా చేస్తారా? వెయిటింగ్ సార్ కచ్చితంగా చేస్తాను. నాకు ఎంతో ఇష్టమైన దర్శకుల్లో పూరి జగన్నాథ్ ఒకరు. ఆయన నా దగ్గరకు వచ్చి ఒక కథ చెబుతారని ఇప్పటికీ వేచి చూస్తున్నాను. ✪ టీ20, టెస్ట్ క్రికెట్.. ఈ రెండు ఫార్మాట్లలో ఏదంటే మీకు ఇష్టం? టెస్ట్!! ఈ విషయంలో రెండు అభిప్రాయాలు లేవు. ✪ మీ గురించి ఏం గుర్తుపెట్టుకోవాలని మీరు కోరుకుంటున్నారు? నేనొక గొప్ప నటుడిగా గుర్తుండిపోవాలని కోరుకుంటున్నాను. అలాగే, నా పిల్లలకు అద్భుతమైన తండ్రిగా, నా భార్యకు మంచి భర్తగా గుర్తిండిపోవాలి. ✪ హాయ్ సార్.. నా పేరు మణి.. మిమ్మల్ని ఒక జేమ్స్ బాండ్ మూవీలో చూడాలని కోరుకుంటున్నాం. భవిష్యత్తులో మేం ఆశించొచ్చా? మణి.. మీ దగ్గర స్క్రిప్ట్ ఉంటే నాకు పంపించండి. నాకు ఇలాంటి ఒక సినిమా చేయాలని ఉంది. ✪ సమంత, రష్మికల్లో మీరు ఎవరిని ఇష్టపడతారు? వాళ్లిద్దరూ నాకు ఎంతో ఇష్టం. వాళ్లు అద్భుతమైన సహనటులు. ✪ మీ పిల్లల కోసం మీరు వండగలిగే మంచి వంటకం ఏంటి? మ్యాగీ నూడిల్స్ ✪ మీ ఫేవరేట్ గేమ్ ఏంటి సార్? నా కొడుకుతో ఆన్‌లైన్‌లో టెన్నిస్, గోల్ఫ్, బేస్‌బాల్ ఆడటం అంటే ఇష్టం. ✪ మీకు ఇష్టమైన రంగు, ఆహారం ఏంటి? నాకు ఇష్టమైన రంగు నీలం. నాకు సంప్రదాయ హైదరాబాద్ బిర్యానీ అంటే చాలా ఇష్టం.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2ZXhL9N
v

హైదరాబాద్‌లో వర్షం.. ఫాం హౌస్‌లో ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తోన్న ప్రకాష్ రాజ్

హైదరాబాద్‌లో వాతావరణం చల్లబడింది. ఆదివారం మధ్యాహ్నం నగరంలో భారీ వర్షం కురిసింది. దీంతో ఇప్పటి వరకు ఎండలతో అల్లాడిపోయిన నగర ప్రజలకు కాస్త ఉపసమనం లభించింది. కరోనా మహమ్మారి కారణంగా లాక్‌డౌన్ ఏర్పడినప్పటి నుంచీ తన ఫ్యామిలీతో హైదరాబాద్‌లోని ఫాం హౌస్‌లో ఉంటున్నారు. ఎంతో మంది వలస కూలీలకు తన ఫాం హౌస్‌లోనే ఆశ్రయం ఇచ్చారు. ఇటీవల తెలంగాణ ప్రభుత్వం సాయంతో వలస కూలీలందరినీ వారి స్వస్థలాలకు పంపారు. ఇక అప్పటి నుంచీ తన భార్య పోనీ ప్రకాష్, కుమారుడు వేదాంత్‌తో ఫామ్ హౌస్‌లో ఎంతో సంతోషంగా గడుపుతున్నారు. Also Read: ఫాం హౌస్‌లో తమ సంతోష గడియలకు సంబంధించి ప్రకాష్ రాజ్ భార్య పోనీ ఎప్పటికప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌లో ఫొటోలు పెడుతూనే ఉన్నారు. ఫాం హౌస్‌లోకి నెమళ్లు రావడం, తమ కుమారుడు వేదాంత్ మామిడి కాయల వ్యాన్ ఎక్కడం, తాను మట్టి ప్రమిదలు చేయడం, ఇలా చాలా ఫొటోలను షేర్ చేశారు. తాజాగా ఫాం హౌష్‌లో తన భర్తతో కలిసి కూర్చొని వర్షాన్ని ఆస్వాదిస్తోన్న ఫొటోను పోనీ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. వర్షాకాలానికి స్వాగతం అని ఈ ఫొటోకు పోనీ క్యాప్షన్ పెట్టారు. కాగా, పోనీ స్వతహాగా కొరియోగ్రాఫర్. ఆమెను ప్రకాష్ రాజ్ రెండో పెళ్లి చేసుకున్నారు. ప్రకాష్ రాజ్ మొదట 1994లో తమిళ నటి లలిత కుమారిని పెళ్లి చేసుకున్నారు. ఈమె నటుడు శ్రీహరి భార్య డిస్కో శాంతి సోదరి. వీరికి ఇద్దరు కుమార్తెలు, కుమారుడు సంతానం. అయితే, 2009లో లలిత కుమారి నుంచి ప్రకాష్ రాజ్ విడిపోయారు. 2010లో కొరియోగ్రాఫర్ పోనీ వర్మను పెళ్లి చేసుకున్నారు. వీరికి వేదాంత్ సంతానం. ప్రకాష్ రాజ్ తన సంపాదనలో కొంత మొత్తం చారిటీకి కేటాయిస్తున్నారు. ఒక స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేశారు. హైదరాబాద్ శివారులో వ్యవసాయ క్షేత్రాన్ని కొనుగోలు చేసి అక్కడే ఎక్కువ సమయం గడుపుతున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2ZSAcwn
v

బాలయ్యకు బర్త్‌డే గిఫ్ట్.. పవర్‌ఫుల్ టైటిల్‌తో వస్తోన్న బోయపాటి!

నటసింహా నందమూరి బాలకృష్ణ పుట్టినరోజు మరో 10 రోజుల్లో రాబోతోంది. ఈ పుట్టినరోజునాడు తన అభిమానులకు అదిరిపోయే ఫీస్ట్ ఇవ్వబోతున్నారు. ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలకృష్ణ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఇది బాలయ్య 106వ చిత్రం. ఈ సినిమా టైటిల్‌ను, ఫస్ట్ లుక్ పోస్టర్‌ను బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా జూన్ 10న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారట దర్శక నిర్మాతలు. ఈ సినిమా కోసం బోయపాటి శ్రీను పవర్‌ఫుల్ టైటిల్‌ను ఫిక్స్ చేశారని టాక్. అదేంటంటే ‘మోనార్క్’. సాధారణంగా బాలకృష్ణ సినిమా టైటిల్స్ చాలా పవర్‌ఫుల్‌గా ఉంటాయి. బోయపాటి దర్శకత్వంలో బాలయ్య చేసిన రెండు సినిమాలకు ‘సింహా’, ‘లెజెండ్’ అనే పవర్‌ఫుల్ టైటిళ్లు పెట్టారు. అందుకే, ఈసారి కూడా టైటిల్ చాలా పవర్‌ఫుల్‌గా ఉండాలని ‘మోనార్క్’ ఫిక్స్ చేశారట. కథకు కూడా ఈ టైటిల్ చక్కగా సరిపోతుందని దీన్నే ఖరారు చేసుకున్నారట బోయపాటి, బాలయ్య. ‘మోనార్క్’ టైటిల్‌ను ఇప్పటికే ఫిల్మ్ ఛాంబర్‌లో రిజిస్టర్ చేయించారని అంటున్నారు. అంటే, జూన్ 10న నందమూరి అభిమానులకు సంబరాలే. Also Read: కాగా, ఈ సినిమా ఇప్పటికే ఒక షెడ్యూల్‌ను పూర్తిచేసుకుంది. లాక్‌డౌన్ కారణంగా ఇప్పటి వరకు షూటింగ్ జరగలేదు. ప్రభుత్వం అనుమతి ఇచ్చిన వెంటనే మళ్లీ షూటింగ్ మొదలవుతుంది. ప్రస్తుతానికి ఈ సినిమాలో ఇంకా హీరోయిన్‌ను ఖరారు చేయలేదు. హీరోయిన్ కోసం ఇప్పటికే పాయల్ రాజ్‌పుత్, నయనతార, కేథరిన్, శ్రియా పేర్లను పరిశీలించినట్టు చెబుతున్నారు. అలాగే, ఈ సినిమాలో హీరో వేణు కీలక పాత్ర పోషిస్తున్నారట. బాలయ్య రెండు విభిన్న పాత్రల్లో కనిపించనున్నారని టాక్. దీనిలో అఘోర పాత్ర కూడా ఉందని సమాచారం.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3clh3Wk
v

ప్రభాస్‌ భారీ ప్రాజెక్టులో బాలీవుడ్ స్టార్ హీరోయిన్.. డీల్ సెట్ చేసిన నాగ్ అశ్విన్!

యంగ్ రెబల్ స్టార్ హీరోగా ‘మహానటి’ ఫేమ్ దర్శకత్వంలో కొత్త సినిమా రానున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్ ప్రకటన రావడంతో తెలుగు ప్రేక్షకుల దృష్టంతా ఈ మూవీపైనే పడింది. మరోవైపు సోషల్ మీడియాలో వస్తున్న ఈ చిత్ర అప్‌డేట్స్ ప్రేక్షకుల్లో సరికొత్త ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. సోషియో ఫాంటసీ మూవీగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుందని సమాచారం. ప్రభాస్‌ కోసం భారీ కథను సిద్ధం చేసిన నాగ్ అశ్విన్.. 400 కోట్లతో ప్యాన్ ఇండియా మూవీగా ఈ సినిమాను రూపొందించనున్నారట. ఈ మేరకు నిర్మాత అశ్వినీదత్‌తో కూడా చర్చలు ముగిశాయని టాక్. ఇకపోతే ఈ సినిమాను నవంబర్ నెలలో సెట్స్ మీదకు తీసుకురావాలని ప్లాన్ చేస్తున్న దర్శకనిర్మాతలు.. ప్రభాస్ సరసన నటించబోయే హీరోయిన్, ఇతర నటీనటుల విషయమై ఫైనల్ డిసీజన్ తీసుకుంటున్నారట. Also Read: ఈ క్రమంలోనే ప్రభాస్ సరసన బాలీవుడ్ హీరోయిన్‌ని ఫిక్స్ చేయాలని ప్లాన్ చేశారట. అయితే మొదట ఆలియా భట్ అనుకున్న డైరెక్టర్ నాగ్ అశ్విన్.. ఫైనల్‌గా దీపిక పదుకొనెతో డీల్ సెట్ చేశారని వార్తలు వస్తున్నాయి. మరోవైపు 'మహానటి' సినిమాను అందరూ చూడండి అని దీపిక పోస్ట్ పెట్టడం, తెల్లవారుజామున కూల్ నోటిఫికేషన్ అందుకున్నాను అంటూ నాగ్ అశ్విన్ తన సోషల్ మీడియా పేజ్‌లో రాయడం ఆ వార్తలకు బలాన్నిస్తున్నాయి. సో.. చూడాలి మరి ప్రభాస్- దీపిక జోడీ సెట్ అవుతుందో లేదో అనేది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3cjaRyf
v

సూపర్ కృష్ణపై నాగబాబు ఆసక్తికర వ్యాఖ్యలు

గత కొన్ని రోజులుగా అనేక విషయాలపై స్పందిస్తూ వస్తున్న మెగా బ్రదర్, జనసేన నాయకుడు నాగబాబు తాజాగా కృష్ణ బర్త్ డే సందర్భంగా కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ట్విట్టర్ వేదికగా ఆయన సూపర్ స్టార్ కృష్ణకు ఆయన పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కృష్ణ గురించి నాగబాబు పలు విషయాలు తెలిపారు. 'నా అభిమాన నటుల్లో ఒకరైన కృష్ణ పుట్టినరోజు సందర్భంగా నేను కొన్ని విషయాలను ఆయన గురించి చెప్పాలనుకుంటున్నాను. మెగాస్టార్‌ శకం ప్రారంభం కాకముందు తెలుగు చలనచిత్ర పరిశ్రమకు నాలుగు స్తంభాల్లా అక్కినేని నాగేశ్వరరావు, ఎన్టీఆర్, శోభన్ బాబు, కృష్ణగారు ఉండేవారు. నా అభిప్రాయం ప్రకారం కృష్ణ గారు ట్రెండ్ సెట్టర్‌' అని అన్నారు నాగబాబు. అంతేకాదు 'మొదటి 70 ఎంఎం, డీటీఎస్, సినిమాస్కోప్, ఈస్ట్‌మన్‌ కలర్, స్పై సినిమాలు ఆయనవే. ఆయన మంచి మనసు ఉన్న వ్యక్తి.. చాలా మందికి సాయం చేశారు' అని నాగబాబు ట్వీట్ చేశారు. ఆయనను ఎప్పుడూ మరిచిపోలేం. ఆయనకు ఆయురారోగ్యాలు కలగాలని కోరుకుంటుూ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నానని చెప్పారు నాగబాబు. ఇక పోతే కృష్ణ పుట్టినరోజు సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి శుభాకాంక్షలు తెలిపిన విషయం తెలిసిందే. కృష్ణతో దిగిన ఫోటోని షేర్ చేస్తూ స్పెషల్ విషెస్ అందించారు చిరు. కథానాయకుడిగా 345 సినిమాలు దర్శకుడిగా 14 చిత్రాలు.నిర్మాతగా తెలుగుతో పాటు భారతీయభాషల్లో 50 చిత్రాలు.మొదటి సినిమాస్కోప్ సినిమా ఆయనదే.మొదటి 70mm చిత్రం కూడా ఆయనదే.అనితరసాధ్యం ఈ ట్రాక్ రికార్డ్‌. సాహసానికి మారుపేరు, పద్మభూషణ్ అవార్డు గ్రహీత, సూపర్ స్టార్ కృష్ణ గారికి జన్మదినశుభాకాంక్షలు అంటూ ట్వీట్ చేశారు. చిరుతో పాటు టాలీవుడ్‌కు చెందిన ఎందరో ప్రముఖులు కృష్ణకు బర్త్ డే శుభాకాంక్షలు తెలిపారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2yOuMrb
v

‘సర్కారు వారి పాట’ నీకు మరో మైలురాయి కావాలి: పూరి జగన్నాథ్

ప్రతి సంవత్సరం తన తండ్రి నటశేఖర కృష్ణ జన్మదినం పురష్కరించుకుని సూపర్ స్టార్ మహేష్ తన కొత్త సినిమాకు సంబంధించిన కచ్చితంగా ఒక అప్‌డేట్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారు. ఈసారి తన కొత్త సినిమా ‘సర్కారు వారి పాట’ను ప్రకటించారు. టైటిల్ పోస్టర్‌ను కూడా విడుదల చేశారు. ఈ పోస్టర్‌లో మహేష్ కాస్త పొడవాటి జుట్టు, ఇప్పుడిప్పుడే వచ్చిన గెడ్డం, మెడ మీద రూపాయి బిల్ల టాటూ, చెవికి రింగుతో మునుపెన్నడూ చూడని మాస్ లుక్‌తో కనిపించారు. ఈ పోస్టర్‌లో మహేష్ లుక్‌ను పూర్తిగా చూపించకపోయినా.. ఈ హాఫ్ మాస్ లుక్‌ను చూసి ఫ్యాన్స్ సంబరపడిపోతున్నారు. కాగా, ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్, జీఎమ్‌బీ ఎంటర్‌టైన్మెంట్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్లపై నవీన్ యెర్నేని, వై.రవిశంకర్, రామ్ ఆచంట, గోపి ఆచంట నిర్మిస్తున్నారు. పరశురామ్ దర్శకత్వం వహిస్తున్నారు. తమన్ సంగీతం సమకూరుస్తున్నారు. డైరెక్టర్ పరశురామ్ ఇండస్ట్రీలోని ఒక టాప్ హీరోతో పనిచేయడం ఇదే తొలిసారి. మహేష్‌తో సినిమా తన కల అని.. ఆ కల నెరవేరుతోందని ఆయన అంటున్నారు. అయితే, సెన్సేషనల్ డైరెక్టర్ పూరి జగన్నాథ్.. పరశురామ్‌కు శుభాకాంక్షలు తెలిపారు. Also Read: ‘‘నీ చిన్న తనం నుంచి నీ ప్రయాణాన్ని నేను చాలా దగ్గరగా చూశాను. ఇప్పుడు నీ ప్రయాణంలో ‘సర్కారు వారి పాట’ మరో మైలు రాయి కావాలి. ఈ సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ కావాలని కోరుకుంటున్నా పరశురామ్. ఫస్ట్ లుక్, టైటిల్ రెండూ బాగా నచ్చాయి. మహేష్ బాబు అభిమానులు కచ్చితంగా సంబరాలు చేసుకుంటారు. టీమ్ మొత్తానికి ఆల్ ది బెస్ట్’’ అని పూరి జగన్నాథ్ ట్వీట్ చేశారు. పూరి జగన్నాథ్‌కు పరశురామ్ తమ్ముడి వరస. పరశురామ్‌ది కూడా విశాఖపట్నం జిల్లా నర్సీపట్నం దగ్గర పల్లెటూరే. పూరి జగన్నాథ్‌ స్ఫూర్తితోనే దర్శకుడు కావాలని పరశురామ్ హైదరాబాద్ వచ్చారు. ఎంబీఏ పూర్తిచేసిన పరశురామ్.. సినిమాలపై ఆసక్తితో మొదట ‘బొమ్మరిల్లు’ భాస్కర్, పూరి జగన్నాథ్ వద్ద అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశారు. 2008లో ‘యువత’ సినిమాతో దర్శకుడిగా మారారు. తొలి సినిమాతో విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. ఆ తరవాత ‘ఆంజనేయులు’, ‘సోలో’ సినిమాలతో ఫర్వాలదేనిపించినా.. ‘సారొచ్చారు’తో డిజాస్టర్ అందుకున్నారు. ఈ సినిమా దెబ్బతో సుమారు నాలుగేళ్లు గ్యాప్ తీసుకోవాల్సి వచ్చింది పరశురామ్. అయితే, 2016లో ‘శ్రీరస్తు శుభమస్తు’ సినిమా ద్వారా నిర్మాత అల్లు అరవింద్.. పరశురామ్‌ను ఆదుకున్నారు. అదే బ్యానర్‌లో 2018లో పరశురామ్ చేసిన ‘గీత గోవిందం’ బ్లాక్ బస్టర్ అయ్యింది. ఈ సినిమాతో పరశురామ్ మళ్లీ హిట్ ట్రాక్ ఎక్కారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2ZPEF2V
v

అనసూయ పీరియడ్స్ స్టోరీ: ఫస్ట్ పీరియడ్ సమయంలో! చెబితే గానీ అర్థం కావంటూ ఓపెన్ కామెంట్స్

ప్రతీ అమ్మాయి జీవితంలో పీరియడ్స్ (నెలసరి) సమయం అనేది ఎంతో కీలకమైన అంశం. ఈ సృష్టికి మూలం కూడా అదే. అలాంటి పీరియడ్స్ గురించి మాట్లాడటానికి, బయట చెప్పుకోవడానికి సిగ్గు పడుతూ అదేదో నేరం అన్నట్లుగా గోప్యంగా ఉంచుతుంటారంతా. కానీ జబర్దస్త్ బ్యూటీ మాత్రం.. తాను అందరిలో బిన్నం అని నిరూపిస్తూ పీరియడ్స్ స్టోరీ చెప్పి ఆ విషయాలపై ఓపెన్ అయింది. ఈ మేరకు సోషల్ మీడియాలో ధైర్యంగా ఓ వీడియో షేర్ చేసి సంచలనం సృష్టించింది. దాదాపు 7 నిమిషాలున్న ఈ వీడియోలో పీరియడ్స్ గురించి నిర్మొహమాటంగా మాట్లాడింది అనసూయ. ఈ మేరకు తన మొదటి పీరియడ్ అనుభవాలను సైతం పంచుకుంది. మే 28న అంతర్జాతీయ నెలసరి పరిశుభ్రతా దినోత్సవం సందర్భంగా మెన్స్ట్రువల్ ఎడ్యుకేషన్‌కు సంభందించి ఓ స్వచ్ఛంధ సంస్థ నిర్వహించిన అవగాహనా కార్యక్రమంలో భాగంగా ఈ విషయాలపై స్పందించింది జబర్దస్త్ బ్యూటీ అనసూయ. Also Read: పీరియడ్స్ సమయంలో మహిళలకి సాయం అవసరమని, ఈ విషయాన్ని గోప్యంగా ఉంచడం సరైందికాదని చెప్పుకొచ్చింది. ఇప్పటికీ సమాజంలో చాలా చోట్ల పీరియడ్స్ గురించి ఎన్నో అపోహలు ఉన్నాయని, పీరియడ్స్ అనేది తప్పు కాదని.. అమ్మాయిలు వాటి గురించి మాట్లాడటానికి భయపడకూడని అభిప్రాయపడింది అనసూయ. కొందరు మగవాళ్ళు పీరియడ్స్ సమయంలో అమ్మాయిలను అర్థం చేసుకోకుండా లోకువగా చూడటం సహించరానిదంటూ సీరియస్ అయింది. ఇంటికి మహాలక్ష్మి, ప్రపంచానికి మూలం ఆడవాళ్లే అని ఆమె చెప్పింది. ఇక తన మొదటి పీరియడ్ అనుభవాల గురించి పేర్కొంటూ.. ఫస్ట్ పీరియడ్ సమయంలో చాలా టెన్షన్ పడ్డానని చెప్పింది. ఆ సమయంలో దాదాపు రెండు వారాలు ఇంట్లోనే ఓ మూలాన కూర్చోబెట్టారని, ఆ తర్వాత ప్రతి నెలా పీరియడ్స్ సమయంలో మూడు నాలుగు రోజులు ఎవరినీ కలిసే ఛాన్స్ ఉండేది కాదని చెప్పింది. అయితే మొదట్లో తనకు ఈ విషయమై ఏం జరుగుతుందో తెలియకపోయినా 17 ఏళ్లు వచ్చిన తర్వాత అంతా అర్థమైందని తెలిపింది. ఇలాంటి విషయాలు దాచుకోకూడదని.. ఇవి ఇలా బాహాటంగా చెబితేనే ఈ తరం వాళ్లకు అర్థమవుతుందని ఆమె చెప్పడం విశేషం. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/36SZ3Sk
v

అవసరాలు ఎక్కడికైనా తీసుకెళ్తాయి.. అయినా తప్పు చేయనపుడు భయమెందుకు: రామ్ గోపాల్ వర్మ

ఎప్పుడూ వివాదాలకు కేంద్ర బిందువుగా ఉంటూ తన అభిప్రాయాలు, ఆలోచనలను స్వేచ్ఛగా పంచుకుంటూ సెన్సేషన్ క్రియేట్ చేయడం స్టైల్. తనకేదనిపిస్తే అది మీడియా ముందే నిర్మొహమాటంగా బయటపెట్టే ఆయన.. ఈ కరోనా పరిస్థితుల్లో మరింత హల్చల్ చేశారు. కరోనా వైరస్‌పై తనదైన కోణంలో కామెంట్స్ చేసిన వర్మ.. అదే కరోనా వైరస్‌పై మూవీ కూడా రూపొందించారు. అయితే దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ అమలులో ఉండగా ఈ మూవీ ఎలా షూట్ చేశారు? ప్రభుత్వ నిబంధనలు అతిక్రమించారా? అనే దానిపై జనాల్లో నెలకొన్న అనుమానాలను తెరదించేలా తాజా ఇంటర్వ్యూలో కొన్ని విషయాలు చెప్పారు రామ్ గోపాల్ వర్మ. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల లాక్‌డౌన్ నిబంధనలకు అనుగుణంగానే తాను వ్యవహరించానని, రూల్స్ ఫాలో అవుతూనే కరోనావైరస్ సినిమాను రూపొందించడం జరిగిందని అన్నారు వర్మ. తాను తీసుకొన్న నిర్ణయంలో ఎలాంటి లొసుగులు లేవని ఆయన అంటున్నారు. సినీ పరిశ్రమకు సంబంధించిన ఏ యూనియన్ సభ్యుడిని షూటింగ్ కోసం తీసుకోలేదని, ఎవరినీ సంప్రదించలేదని ఆయన తెలపడం విశేషం. అయితే తమ పరిధిలోనే అన్నిరకాల జాగ్రత్తలు తీసుకొని ఈ సినిమాను షూట్ చేయడం జరిగిందని వర్మ తెలిపారు. Also Read: నిబంధనలకు అనుగుణంగా నడచుకొన్నప్పుడు ఎవరి అనుమతి తీసుకోనవసరం లేదని, అలాగే తప్పు చేయనప్పుడు ఎవరికి తలవంచనవసరం అస్సలు లేదని పేర్కొంటూ మరోసారి తన నైజం బయటపెట్టారు వర్మ. కరోనావైరస్ మూవీని లాక్‌డౌన్ అమలులోకి వచ్చిన వారం రోజుల తర్వాత ప్రారంభించి.. ప్రభుత్వం జారీ చేసిన అన్ని రకాల లాక్‌డౌన్ నిబంధనలు పాటిస్తూ లాక్‌డౌన్ ముగిసే లోపే కంప్లీట్ చేశామని ఆయన చెప్పడం గమనార్హం. తన నా ఆలోచనలను విజన్‌కు అనుగుణంగా మల్చుకున్నానని, అవసరాలు ఎక్కడికైనా తీసుకెళ్తాయని సంచలన కామెంట్ చేశారు వర్మ. మరోవైపు ఓటీటీ వేదికపై రిలీజ్ చేసేందుకు గాను శృంగార తార మియా మాల్కోవాతో 'క్లైమాక్స్' సినిమా ఫినిష్ చేశారు వర్మ. ఈ మూవీ టీజర్, ట్రైలర్ రిలీజ్ చేసి అట్రాక్ట్ చేసిన ఆయన.. జూన్ 6వ తేదీన ఆర్జీవీ వరల్డ్ థియేటర్ అనే ఆన్‌లైన్ వేదికపై రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. మొత్తానికి ఇదంతా చూస్తుంటే సినీ పరిశ్రమ అంతా కరోనా కారణంగా నాలుగు గోడల మధ్యే ఉంటే వర్మ మాత్రం తనపని తాను చేసుకుంటూ వెళ్లి మరోసారి విలక్షణత చాటుకున్నాడని తెలుస్తోంది కదూ!.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/36M3k9W
v

తేనెటీగల దాడి.. తృటిలో తప్పించుకున్న చిరంజీవి ఫ్యామిలీ

దోమకొండ సంస్థానం వారసుడు, రిటైర్డ్ ఐఏఎస్ కామినేని ఉమాపతిరావు అత్యక్రియల్లో పాల్గొన్న మెగాస్టార్ చిరంజీవి ఫ్యామిలీపై తేనెటీగలు దాడి చేశాయి. ఈ దాడి నుంచి చిరంజీవి, రామ్ చరణ్, ఉపాసన సహా ఇతర కుటుంబ సభ్యులు తృటిలో తప్పించుకున్నారు. కామినేని ఉమాపతిరావు అనారోగ్యంతో ఈనెల 27న మృతి చెందిన విషయం తెలిసిందే. ఈయన ఉపాసన కొణిదెల తాతయ్య. ఉమాపతిరావు అంత్యక్రియలను ఆదివారం నిజామాబాద్ జిల్లాలోని దోమకొండ మండలం కోటలో నిర్వహించారు. ఈ అంత్యక్రియల్లో చిరంజీవి ఫ్యామిలీ పాల్గొంది. అయితే, అంత్యక్రియలకు పార్థివదేహాన్ని తీసుకుళ్తోన్న సమయంలో అక్కడే ఓ చెట్టుపై నుంచి తేనేటీగలు దాడికి దిగాయి. దీంతో అప్రమత్తమైన సెక్యూరిటీ సిబ్బంది కామినేని కుటుంబ సభ్యులతో పాటు చిరంజీవి ఫ్యామిలీని వెంటనే ఇంటిలోకి తీసుకెళ్లారు. తేనెటీగలను అక్కడి నుంచి తరిమికొట్టే ప్రయత్నం చేశారు. ఈ దాడిలో చిరంజీవి, రామ్ చరణ్, ఉపాసన సుక్షితంగా తప్పించుకున్నారు. వీరంతా గాయపడ్డారని మొదట వార్తలు వచ్చినా వాటిలో నిజం లేదు. సెక్యూరిటీ సిబ్బంది అప్రమత్తతో చిరంజీవి ఫ్యామిలీ సురక్షితంగా బయటపడింది. కాగా, తేనెటీగలు కుట్టడంతో నలుగురు స్వల్పంగా గాయపడినట్టు సమాచారం. తేనెటీగలు దాడిచేసే సమయంలో కామారెడ్డి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.శరత్ కూడా అక్కడే ఉన్నారు. తేనెటీగలను చెదరగొట్టిన అనంతరం అంత్యక్రియలను కొనసాగించారు. కాగా, చిరంజీవి ఫ్యామిలీపై తేనెటీగలు దాడిచేశాయనే వార్త బయటికి రావడంతో అభిమానులు కాస్త కంగారు పడ్డారు. అయితే, వారంతా సురక్షితంగా బయటపడ్డారని తెలుసుకుని ఊపిరిపీల్చుకుంటున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2XgmOAk
v

కృష్ణ పాటకు టీడీపీ ఎంపీ కొడుకు స్టెప్పులు... బర్త్ డేకి స్పెషల్ గిఫ్ట్

కృష్ణ 77వ బర్త్ డే సందర్భంగా ఆయన అభిమానులు కుటుంబసభ్యులు రకరకాలుగా విషెస్ చెబుతున్నారు. తాజాగా అల్లుడు సుధీర్ బాబు కృష్ణ నటించిన అల్లూరి సీత రామరాజు సినిమాలో డైలాగ్స్‌తో అదరగొట్టాడు. తాజాగా 'జుంబారే..జుజుంబ‌రే' పాటకు మ‌హేశ్ బాబు మేనల్లుడు, టీడీపీ ఎంపీ కుమారుడు గ‌ల్లా అశోక్ డ్యాన్స్ చేశాడు. ఈ రోజు సందర్భంగా ఈ పాట ప్రొమోను విడుదల చేశారు. శ్రీ‌రామ్ ఆదిత్య ద‌ర్శ‌కత్వంలో ఓ సినిమాలో ఆయన నటిస్తోన్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో అచ్చం కృష్టలా అశోక్ డ్యాన్స్ చేసి ప్రేక్షకులను అలరించనున్నాడు.ఇందులో హీరోయిన్‌గా నిధి అగర్వాల్ నటిస్తోంది. ఎస్వీ కృష్ణారెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో వచ్చిన య‌మ‌లీల సినిమాలో 'జుంబారే' పాటకు ప్రత్యేకంగా కృష్ణ డ్యాన్సుతో అలరిస్తారు. ఈ పాటను బాలసుబ్రహ్మణ్యం పాడగా, సాహిత్యం జొన్న‌విత్తుల అందించారు. ఆ పాట‌లో కృష్ణ సరసన పూజా డ్యాన్స్ చేస్తుంది. కాగా, నటిస్తోన్న కొత్త సినిమాలో జ‌గ‌ప‌తి బాబు, న‌రేశ్‌, స‌త్యా ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాకు చిత్రీకరణ ఇప్పటికే 50 శాతం పూర్తయింది. ఈ సందర్బంగా గల్లా అజయ్ ట్వీట్ కూడా చేశారు. తాత నా ఎవర్ గ్రీన్ లెజెండ్.నాతో పాటు వేలాదిమందికి ఆయన ఆదర్శం. ఆయనను అతిదగ్గరగే చూసే అవకాశం నాకు కల్గినందుకు నేనెంతో అదృష్టవంతుడిని’ అంటూ అజయ్ ట్వీట్ చేశాడు. ‘భలే మంచి రోజు’, ‘శమంతకమణి’, ‘దేవదాస్‌’ చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న శ్రీరామ్‌ ఆదిత్య ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ‘ఇస్మార్ట్‌ శంకర్‌’ ఫేం నిధి అగర్వాల్‌ కథానాయిక పాత్ర పోషిస్తున్నారు. జిబ్రాన్‌ బాణీలు అందిస్తున్నారు. రిచర్డ్‌ ప్రసాద్‌ కెమెరా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. గల్లా పద్మావతి నిర్మాత. సూపర్‌స్టార్‌ కృష్ణ, గల్లా అరుణకుమారి కలిసి సినిమాను సమర్పిస్తున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/36MVcWO
v

పెళ్లికి ముందే ప్రెగ్నెన్సీ.. ఆరుబయటే అతనితో రొమాన్స్.. అబ్బో! ఆ హీరోయిన్ వేషాలు చూస్తే..

హీరోయిన్స్ అన్నాక డేటింగ్ వ్యవహారాలు, బ్రేకప్ సంగతులు, ఆ వెంటనే మరో వ్యక్తితో రొమాంటిక్ టూర్స్ అనేవి కామన్. కానీ డేటింగ్ చేసి ఏకంగా పెళ్లికి ముందే ప్రెగ్నెంట్ కావడం, పైగా ఆ విషయాన్ని స్వయంగా ప్రకటించడం మాత్రం చాలా అరుదైన విషయం. అయితే ఆ పని చేసి చూపించి సెన్సేషన్ క్రియేట్ చేసిన రోబో బ్యూటీ .. మరోసారి ప్రియుడితో ఆరుబయట రొమాన్స్ చేస్తున్న ఫోటో షేర్ చేసి సంచలనం సృష్టించింది. రీసెంట్‌గా ఓ బిడ్డకు తల్లైన అమీ.. బహిరంగంగా ఇలా రొమాన్స్ చేయడం, పైగా ఆ రొమాంటిక్ పిక్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం హాట్ ఇష్యూగా మారింది. హాట్ ఫొటోలు, వీడియోలు, రొమాన్స్‌కు సంబంధించిన పోస్టులు, బోల్డ్ స్టేట్‌మెంట్లు పోస్ట్ చేస్తూ సామాజిక మాధ్యమాల్లో ఎప్పుడూ చురుకుగా ఉండే అమీ జాక్సన్.. నాలుగు గోడల మధ్యలో చేసుకునే శృంగార సన్నివేశాన్ని ఆరుబయట పెట్టేసింది. బ్రిటన్‌కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త, మోడల్, యాక్టర్ జార్జ్‌ పనాయొటోతో ప్రేమాయణం కొనసాగిస్తున్న అమీ, అతనితో రెచ్చిపోయి రొమాన్స్ చేస్తోంది. పైగా అందుకు సంబంధించిన పిక్స్ పబ్లిక్‌లో పెట్టేస్తూ రచ్చ రచ్చ చేస్తోంది. తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో అమీ జాక్సన్ పోస్ట్ చేసిన ఫొటోలు చూసి నెటిజన్స్ షాక్ అవుతున్నారు. ప్రియుడు జార్జ్‌ పనాయొటోతో బహిరంగ ప్రదేశంలో రొమాన్స్ చేస్తూ ఆమె కనిపిస్తుండటం చూసి ఆశ్చర్యానికి గురవుతున్నారు. ఆరుబయట తన ప్రియుడిపై పడుకుని ఉన్న ఫొటో చూసి అబ్బో! ఈ బ్రిటిష్ భామ వేషాలు మామూలుగా లేవుగా అని కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ పిక్ నెట్టింట వైరల్ అవుతోంది. చాలా కాలంగా ప్రియుడు జార్జ్‌ పనాయొటో ప్రేమాయణం సాగిస్తున్న అమీ జాక్సన్.. . 2019 జనవరి 1 తేదీన ఆయనతో నిశ్చితార్థం చేసుకొని సహజీవనం చేస్తోంది. ఈ ఏడాది చివర్లో కానీ, వచ్చే ఏడాది ప్రారంభంలో కానీ వీరి వివాహం జరగనుందని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది. పెళ్లి తర్వాత ఆమె తిరిగి వెండితెరపైకి రీఎంట్రీ ఇవ్వబోతుందని కూడా వార్తలు వస్తున్నాయి.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3ciRaGP
v

నా అభిమాన సూపర్ స్టార్... కృష్ణ బర్త్ డే పై రోజా స్పెషల్ ట్వీట్

బర్త్ డే సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా సినీ నటి , వైసీపీ ఎమ్మెల్యే రోజా కృష్ణకు పుట్టినరోజు విషెస్ తెలిపారు. ‘ఇండస్ట్రీలో ఒక ట్రెండ్ సెట్టర్ గా పేరు గాంచి నాలాంటి ఎంతో మంది నటులకు స్ఫూర్తిగా నిలిచిన నా అభిమాన సూపర్ స్టార్ కృష్ణ గారికి హృదయ పూర్వక జన్మదిన శుభాకాంక్షలు’అంటూ రోజా ట్వీట్ చేశారు. రోజాతో పాటు టాలీవుడ్‌కు చెందిన అనేక ప్రముఖులు కృష్ణకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఆయన కుమారుడు మహేష్ బాబుతో పాటు, మెగాస్టార్ చిరంజీవి, బండ్ల గణేష్, టాలీవుడ్ దర్శకులు విషెస్ తెలిపారు. కృష్ణ హీరోగా చేసిన మొట్ట మొదటి సినిమా ‘తేనే మనసులు’. ఆ సినిమా నాటికే ఆయనకు ఇందిరతో పెళ్లి అయ్యింది. కృష్ణ పూర్తి పేరు ఘట్టమనేని శివరామకృష్ణమూర్తి. గుంటూరు జిల్లా, తెనాలి మండలములోని బుర్రిపాలెంలో 1942 మే 31న జన్మించారు. ఆగస్టు 11న విడుదలైన గూఢచారి 116 సినిమా సంచలన విజయం సాధించి కృష్ణ కెరీర్ మలుపుతిప్పింది. ఇది తొలి తెలుగు జేమ్స్‌బాండ్ తరహా సినిమా. కృష్ణకు ప్రేక్షకుల్లో ఆంధ్రా జేమ్స్‌బాండ్ అన్న పేరు వచ్చింది. ఈ విజయంతో కృష్ణ ఒకేసారి 20 సినిమాల్లో హీరోగా బుక్ అయ్యాడు. కృష్ణ, ఇందిరలకు ఇద్దరు కొడుకులు, ముగ్గురు కుమార్తెలు. పెద్ద కొడుకు రమేష్ బాబు హీరోగా కొన్ని సినిమాల్లో పనిచేసి, ప్రస్తుతం సినిమా నిర్మాణం చేస్తున్నాడు. చిన్న కొడుకు తెలుగు సినిమా రంగంలో ప్రముఖ నటునిగా పేరు ప్రఖ్యాతలు సంపాదించారు. 1967లో బాపు-రమణలు దర్శకత్వం వహించిన సాక్షి సినిమాలో కృష్ణ కథానాయకుడిగా, విజయనిర్మల కథానాయకిగా నటించింది. ఆ తర్వాత సర్కార్ ఎక్స్‌ప్రెస్ సినిమాలో హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సమయంలో కృష్ణ విజయనిర్మలను ప్రేమిస్తున్నానని పెళ్ళిచేసుకుంటానని చెప్పాడు. పరస్పర అంగీకారంతో మరో రెండేళ్ళకు 1969లో విజయనిర్మలను తిరుపతిలో కృష్ణ రెండో పెళ్ళి చేసుకున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/36NmEE0
v

ఓ సారి కృష్ణ గారు కార్ ఎక్కించుకొని.. ఆ సంఘటన ఎన్నటికీ మరిచిపోలేను: పూరి జగన్నాథ్

ఈ రోజు (మే 31) సూపర్ స్టార్ కృష్ణ 77వ పుట్టినరోజు సందర్భంగా ఆయన బర్త్ డే విషెస్‌తో సోషల్ మీడియా హోరెత్తిపోతోంది. చిత్రసీమలోని ప్రతి ఒక్క దర్శకుడు, నిర్మాత, నటీనటులు ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ టాలీవుడ్ లెజెండ్‌తో తమ తమ జ్ఞాపకాలను పంచుకుంటున్నారు. ఈ క్రమంలోనే తాజాగా డాషింగ్ డైరెక్టర్ ఓ ట్వీట్ చేస్తూ అప్పట్లో కృష్ణ గారితో ఉన్న మధుర జ్ఞాపకాన్ని అందరికీ తెలియజేశారు. కృష్ణ ఫోటోను తన ట్విట్టర్ ఖాతా ద్వారా షేర్ చేస్తూ.. ''పాతికేళ్ల క్రితం నేను తీసిన ఫోటో ఇది. ఒకసారి కృష్ణ గారు నన్ను కార్ ఎక్కించుకుని తీసుకెళితే సంగీత్‌లో సినిమా కూడా చూసాం. ఒకప్పుడు ఆయన సినిమాల కోసం క్యూలో నిలుచునే వాడిని, కానీ ఆ రోజు ఆయన పక్కన కూర్చోవడం అస్సలు మరిచిపోలేను. కృష్ణగారికి జన్మదిన శుభాకాంక్షలు. ఈ గ్రేట్ లెజెండ్ ఆరోగ్యంగా కలకాలం జీవించాలని కోరుకుంటున్నా'' అని పేర్కొన్నారు. ఈ ట్వీట్ చూసిన మహేష్ బాబు ఫ్యాన్స్ పెద్ద ఎత్తున స్పందిస్తూ.. పూరి- మహేష్ కాంబో మరోసారి రిపీట్ కావాలని కోరుతున్నారు. మహేష్ బాబు 28వ సినిమా మీదే కావాలంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరోవైపు పూరి జగన్నాథ్ చేసిన ఈ ట్వీట్‌ని ఛార్మి లైక్ చేయడం విశేషం. దీంతో ఈ ట్వీట్ నెట్టింట వైరల్ అయింది. ఇకపోతే ఇటీవలే ఇస్మార్ట్ శంకర్ సినిమాతో తిరిగి సక్సెస్ ట్రాక్ ఎక్కిన పూరి జగన్నాథ్.. ప్రస్తుతం విజయ్ దేవరకొండ హీరోగా ఓ మూవీ రూపొందిస్తున్నారు. ముంబై నేపథ్యంలో ప్యాన్ ఇండియా మూవీగా రాబోతున్న ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ సరసన బాలీవుడ్ బ్యూటీ అనన్యపాండే రొమాన్స్ చేస్తోంది. ఇప్పటికే కొంతభాగం షూటింగ్ ఫినిష్ చేసుకున్న ఈ మూవీని మరి కొద్ది రోజుల్లోనే సెట్స్ పైకి తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారు పూరి.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2Mg0Bw0
v

NTR 30: ఆ సెంటిమెంట్ మరిపించేలా త్రివిక్రమ్ ప్లాన్! ఇక నందమూరి అభిమానులకు పండగే..

యంగ్ టైగర్ హీరోగా రూపొందుతున్న తాజా సినిమా RRR. దర్శకధీరుడు రాజమౌళి ఈ సినిమాను భారీ రేంజ్‌లో రూపొందిస్తున్నారు. ఎన్టీఆర్ కెరీర్‌లో 29వ మూవీగా ఈ సినిమా రాబోతోంది. అయితే ఈ మూవీ చేస్తుండగానే మాటల మాంత్రికుడు శ్రీనివాస్ దర్శకత్వంలో తన 30వ సినిమా చేసేందుకు కమిట్ అయ్యారు ఎన్టీఆర్. కాగా ఈ మూవీని అతిత్వరలో సెట్స్ మీదకు తీసుకురావాలని సన్నాహాలు చేస్తున్న త్రివిక్రమ్.. నందమూరి అభిమానులను టెన్షన్ పెట్టిస్తున్న ఓ విషయంపై స్పెషల్ ఫోకస్ పెట్టారట. ఆ టెన్షన్ వీగిపోయేలా పక్కా ప్లాన్‌తో రెడీ అయ్యారని టాక్. రాజమౌళితో చేసిన వెంటనే మళ్ళీ అదే హీరో వెంటనే హిట్ కొట్టిన సందర్భాలు లేవు. మొన్న ప్రభాస్ విషయంలోనూ ఇదే ప్రూవ్ అయింది. దీంతో ఈ విషయమై నందమూరి ఫ్యాన్స్ బెంగ పెట్టుకున్నారు. తమ అభిమాన హీరోకి కలిసొస్తుందా? లేదా? అనే డైలామాలో పడ్డారు. ఈ నేపథ్యంలో తాజా పరిణామాలు గ్రహించిన త్రివిక్రమ్ తన కథను మరింత సానబట్టి జనాల్లో అలాంటి సెంటిమెంట్ పారద్రోలేలా స్కెచ్ వేస్తున్నారట. RRR తర్వాత ఎన్టీఆర్ చేయబోయే ఈ మూవీ భారీ హిట్ సాధించేలా సన్నివేశాలు రాసుకున్నారట. ఈ టాక్ విని నందమూరి ఫ్యాన్స్ కాస్త ఊపిరి పీల్చుకుంటున్నారు. నందమూరి అభిమానులకు కిక్కిచ్చే మరో విశేషం ఏమిటంటే.. త్రివిక్రమ్ రూపొందించబోతున్న ఈ మూవీలో ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ పోషించబోతున్నారని తెలుస్తుండటం. రాజకీయ నేపథ్యంలో ఈ మూవీ సాగిపోనుందని సమాచారం. హారికా హాసిని క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి 'అయినను పోయి రావలె హస్తినకు' అనే టైటిల్ పరిశీలనలో పెట్టారు. ఇకపోతే ఈ చిత్రంలో ఇద్దరు హీరోయిన్స్ నటించనున్నారని, అందులో ఒకరు సమంత అనే ఆసక్తికర విషయం ఎన్టీఆర్ అభిమానులను ఖుషీ చేస్తోంది. సో.. త్రివిక్రమ్ ఏ రేంజ్‌లో ప్లాన్ చేశారో తెలియాలంటే కొద్దిరోజులు ఆగాల్సిందే మరి.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3cpWQPv
v

Saturday 30 May 2020

సాహసానికి మారు పేరు.. కృష్ణకు బర్త్‌డే విషెస్ చెప్పిన చిరంజీవి

టాలీవుడ్ సూపర్ స్టార్ కృష్ణ ఇవాళ 77వ బర్త్ డే నిర్వహించుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయనకు సినీ సెలబ్రిటీలు సోషల్ మీడియా వేదికగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈ మధ్యే సోషల్ మీడియాలోకి వచ్చిన మెగాస్టార్ .. యాక్టివ్‌గా ఉంటున్నారు. ప్రతీ సందర్భంపై ఆయన స్పందిస్తున్నారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి..కృష్ణకు పుట్టినరోజు విషెస్ తెలిపారు. కృష్ణతో దిగిన ఫోటోని షేర్ చేస్తూ స్పెషల్ విషెస్ అందించారు. కథానాయకుడిగా 345 సినిమాలు దర్శకుడిగా 14 చిత్రాలు.నిర్మాతగా తెలుగుతో పాటు భారతీయభాషల్లో 50 చిత్రాలు.మొదటి సినిమాస్కోప్ సినిమా ఆయనదే.మొదటి 70mm చిత్రం కూడా ఆయనదే.అనితరసాధ్యం ఈ ట్రాక్ రికార్డ్‌. సాహసానికి మారుపేరు, పద్మభూషణ్ అవార్డు గ్రహీత, సూపర్ స్టార్ కృష్ణ గారికి జన్మదినశుభాకాంక్షలు అంటూ ట్వీట్ చేశారు. కృష్ణ పూర్తి పేరు ఘట్టమనేని శివరామకృష్ణమూర్తి. గుంటూరు జిల్లా, తెనాలి మండలములోని బుర్రిపాలెంలో 1942 మే 31న జన్మించారు. కృష్ణ హీరోగా చేసిన మొట్ట మొదటి సినిమా ‘తేనే మనసులు’. ఆ సినిమా నాటికే ఆయనకు ఇందిరతో పెళ్లి అయ్యింది. ఆగస్టు 11న విడుదలైన గూఢచారి 116 సినిమా సంచలన విజయం సాధించి కృష్ణ కెరీర్ మలుపుతిప్పింది. ఇది తొలి తెలుగు జేమ్స్‌బాండ్ తరహా సినిమా. కృష్ణకు ప్రేక్షకుల్లో ఆంధ్రా జేమ్స్‌బాండ్ అన్న పేరు వచ్చింది. ఈ విజయంతో కృష్ణ ఒకేసారి 20 సినిమాల్లో హీరోగా బుక్ అయ్యాడు. 1965 అక్టోబర్ 13 నాటికి పెద్ద కొడుకు రమేష్ బాబు పుట్టాడు. కృష్ణ, ఇందిరలకు ఇద్దరు కొడుకులు, ముగ్గురు కుమార్తెలు. పెద్ద కొడుకు రమేష్ బాబు హీరోగా కొన్ని సినిమాల్లో పనిచేసి, ప్రస్తుతం సినిమా నిర్మాణం చేస్తున్నాడు. చిన్న కొడుకు మహేష్ బాబు తెలుగు సినిమా రంగంలో ప్రముఖ నటునిగా పేరు ప్రఖ్యాతలు సంపాదించారు. మహేష్ తండ్రి కృష్ణ పుట్టినరోజును పురస్కరించుకొని మహేష్ కీలక ప్రకటన చేశారు. మహేష్ బాబు తన 27వ సినిమా అయిన ‘సర్కార్ వారి పాట’సినిమా టైటిల్‌తో పాటు తన ఫస్ట్ లుక్‌ను కూడా రిలీజ్ చేశారు. ముందుగా ప్రచారం అయినట్టు ఈ మూవీకి సర్కారు వారి పాట అనే టైటిల్ నిర్ణయించారు. చెవికిపోగు, మెడపై రూపాయి నాణెం టాటూ తో మహేష్ సరికొత్త లుక్ ఫ్యాన్స్‌ను విశేషంగా ఆకట్టుకుంటోంది. మహేష్ ఈ మూవీలో నెగెటివ్ షేడ్స్ ఉన్న రోల్‌లో మహేష్ కనిపించనున్నట్టు తెలుస్తుంది. దర్శకుడు పరుశురామ్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ మరియి మహేష్ బాబు ఎంటర్టైన్మెంట్స్ అలాగే 14 రీల్స్ కలిసి నిర్మించనున్నాయి.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2zDpNdr
v

కృష్ణ డైలాగులతో సుధీర్ బాబు వీడియో.. మామను దించేశాడు! వందేమాతరం అంటూ ఎమోషనల్ కిక్

నేడు (మే 31) టాలీవుడ్ నటశేఖరుడు, సూపర్ స్టార్ 77వ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు వెలువెత్తున్నాయి. ట్విట్టర్‌లో కృష్ణ బర్త్ డే ట్యాగ్ ట్రెండ్ అవుతోంది. నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా తెలుగు ప్రేక్షకుల గుండెల్లో స్థిరపడిపోయిన ఆయన ఇన్నో విజయాలందుకొని అశేష అభిమాన వర్గాన్ని సొంతం చేసుకున్నారు. పౌరాణిక, జానపద, సాంఘీక, జేమ్స్‌బాండ్, కౌబాయ్ ఇలా ఎలాంటి పాత్రలో అయినా ఒదిగిపోగల ఏకైన నటుడిగా ఫేమస్ అయిన కృష్ణకు ఆయన అల్లుడు హీరో స్పెషల్ విషెష్ పోస్ట్ చేస్తూ ఎమోషనల్ కిక్ ఇచ్చాడు. డబ్స్ ఫర్ లెజెండరీ సీన్ అంటూ కృష్ణ నటించిన 'అల్లూరి సీతారామరాజు' సినిమాలోని ఓ ఎమోషనల్ డైలాగ్ చెబుతూ ఆ వీడియో షేర్ చేశాడు సుధీర్ బాబు. బ్రిటిషు సైన్యం ఎదుట అల్లూరి సీతారామరాజుగా కృష్ణ చెప్పిన భావోద్వేగపూరిత డైలాగులను అచ్చం అలాగే చెప్పి వావ్! అనిపించాడు. 'అక్కడ కాదురా.. ఇక్కడ కాల్చు.. వందేమాతరం వందేమాతరం వందేమాతరం' అంటూ ఆకర్షించాడు సుధీర్ బాబు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సుధీర్ బాబు ఇటీవలే V సినిమాను పూర్తిచేశాడు. దిల్‌రాజు సమర్పణలో శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై రూపొందిన ఈ మూవీకి మోహన్‌కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వం వహించారు. నాని మరో హీరోగా నటించారు. షూటింగ్ ఫినిష్ చేసుకొని విడుదలకు సిద్దమైన ఈ మూవీ లాక్‌డౌన్ కారణంగా వాయిదా పడింది. ఈ చిత్రంలో నివేదా థామస్, అతిథి రావు హైదరీ హీరోయిన్లుగా నటించారు. డిఫరెంట్ కథాంశంతో రూపొందిన ఈ మూవీ ఫస్ట్‌లుక్ పోస్టర్స్ సినిమాపై అంచనాలను పెంచేశాయి. ఈ మూవీ విడుదల కోసం ప్రేక్షక లోకం ఆతృతగా ఎదురుచూస్తోంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2AqFYui
v

మహేష్ మెడ మీద రూపాయి బిల్ల.. సర్కార్ వారి పాట లుక్ అదుర్స్

మహేష్ బాబు షూరూ అయ్యింది. మహేష్ బాబు తన ట్విట్టర్ వేదికగా అఫీషియల్‌గా ప్రకటించాడు. తన కొత్త సినిమా సర్కార్ వారి పాట మరో బ్లాక్ బస్టర్ మూవీ హ్యాట్రిక్ కొట్టేందుకు వస్తుందంటూ మహేష్ ట్వీట్ చేశాడు. సినిమాకు సంబంధించిన పోస్టర్ రిలీజ్ చేశాడు. ఇందులో మహేష్ లుక్ అదిరిపోయిందంటున్నారు ఫ్యాన్స్. చెవి పోగు, మెడపై రూపాయి కాయిన్ టాటూతో డిఫరెంట్ హెయిర్ స్టైల్‌తో మహేష్ లుక్ కేక పెట్టాలా కనిపిస్తోంది. ఇచ్చిన మాట ప్రకారం తండ్రి పుట్టిన రోజున మహేష్ తన అభిమానులకు శుభవార్త అందించాడు. తన కొత్త సినిమాకు సంబంధించిన టైటిల్‌తో పాటు ఫస్ట్ లుక్ కూడా అందించాడు. మహేష్ బాబు తన 27వ సినిమా అయిన ‘సర్కార్ వారి పాట’ మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మించబోతోంది. ‘గీత గోవిందం’ ఫేం పరశురాం ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఇవాళ మహేశ్‌ తండ్రి, సూపర్‌స్టార్‌ కృష్ణ పుట్టినరోజు సందర్భంగా అభిమానులకు శుభవార్త చెప్పారు. జీఎమ్‌బీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌, 14 రీల్స్‌ సంస్థలు కూడా ఈ సినిమా నిర్మాణంలో భాగస్వామ్యం వహిస్తున్నాయి. అయితే ఈ సినిమాలో హీరోయిన్ ఎవరనేది ఇంకా తెలియలేదు. అయితే ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్‌గా థమన్ పనిచేస్తున్నారు. అల వైకుంఠపురములో సినిమాకు థమన్ అందించిన మ్యూజిక్ ఎంతగా హిట్ అయ్యిందో తెలిసిందే. 'సరిలేరు నీకెవ్వరు' చిత్రంతో ఈ ఏడాది ఆరంభంలోనే మహేశ్‌ హిట్‌ అందుకున్నారు. అనిల్‌ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఆయన మేజర్‌ అజయ్‌ కృష్ణ పాత్రలో కనిపించారు. ఈ సినిమాకు ముందు మహేష్ చేసిన మహర్షి, భరత్ అనే నేను సినిమా కూడా హిట్ టాక్ తెచ్చుకున్నాయి. మహర్షి సినిమా కూడా మహేష్ ఇమేజ్‌ను మరింత పెంచింది. దీంతో ఇప్పుడు సర్కార్ వారి పాట అనే పేరుతో మరో హిట్ కొట్టి హ్యాట్రిక్ సాధించేందుకు టాలీవుడ్ ప్రిన్స్ ప్లాన్ చేస్తున్నాడు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3chMSQ6
v

అనితరసాధ్యం ఈ ట్రాక్ రికార్డ్.. సూపర్ స్టార్‌ కృష్ణకి మెగాస్టార్ చిరంజీవి స్పెషల్ విషెస్

తెలుగు సినిమా చరిత్రలో అలుపెరగని సినీ ప్రయాణాన్ని కొనసాగిస్తున్న సూపర్ స్టార్ ఈ రోజు (మే 31) తన 77వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయనకు సోషల్ మీడియా వేదికలపై పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. టాలీవుడ్ చిత్ర పరిశ్రమలోని పెద్దలు, దర్శకులు, నిర్మాతలు, హీరోలు, నటీనటులు సహా అభిమానులు అందరూ పెద్ద ఎత్తున బర్త్ డే విషెస్ పోస్ట్ చేస్తున్నారు. అంతేకాదు 'హ్యాపీ బర్త్ డే కృష్ణ గారు' అనే హ్యాష్ ట్యాగ్ ట్విట్టర్‌లో ట్రెండ్ అవుతుండటం విశేషం. కాగా సందర్భంగా ఆయనకు స్పెషల్ విషెస్ చెబుతూ విలువైన సందేశాన్ని పోస్ట్ చేశారు మెగాస్టార్ . ''కథానాయకుడిగా 345 సినిమాలు దర్శకుడిగా 14 చిత్రాలు. నిర్మాతగా తెలుగుతో పాటు భారతీయ భాషల్లో 50 చిత్రాలు. మొదటి సినిమాస్కోప్ సినిమా ఆయనదే. మొదటి 70mm చిత్రం కూడా ఆయనదే. అనితరసాధ్యం ఈ ట్రాక్ రికార్డ్. సాహసానికి మారుపేరు, పద్మభూషణ్ అవార్డు గ్రహీత, సూపర్ స్టార్ కృష్ణ గారికి జన్మదినశుభాకాంక్షలు'' అని పేర్కొంటూ ఆయనతో దిగిన ఓ అపురూమైన పిక్ పంచుకున్నారు చిరంజీవి. చిరంజీవి పోస్ట్ చేసిన ఈ ట్వీట్ చూసి మెగా అభిమాన వర్గాలు పెద్ద ఎత్తున స్పందిస్తున్నాయి. అదే సోషల్ మీడియా వేదికగా కృష్ణకు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుతూ ఆన్ లైన్ వేదికలను హోరెత్తిస్తున్నారు మెగా ఫ్యాన్స్. కృష్ణ అంటే ఓ కెరటం అని, ఆ లెజెండరీ హీరో గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అని కామెంట్ చేస్తూ బర్త్ డే విషెస్ పోస్ట్ చేస్తున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2XOcKhd
v

HappyBirthDay Krishna: సుదీర్ఘ సినీ ప్రస్థానం.. ఎన్నెన్నో మలుపులు.. తెలుగు సినీ చరిత్రలో!!

టాలీవుడ్ సూపర్ స్టార్ కృష్ణ ఈ రోజు (మే 31) తన 77వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయనకు సంబంధించిన, ఆయన సినీ కెరీర్‌కి సంబంధించిన ముఖ్య విషయాలు మీ ముందుకు తీసుకొస్తున్నాం. అలుపెరగని సినీ ప్రస్థానం కొనసాగిస్తున్న కృష్ణ జీవితంలో ఎన్నో మలుపులు చోటు చేసుకున్నాయి. చిన్న నటుడిగా ఆరంగేట్రం చేసి సూపర్ స్టార్‌గా ఆయన ఎదిగిన తీరు ఎందరికో ఆదర్శం అని చెప్పుకోవచ్చు. 1942 సంవత్సరం మే 31న జన్మించారు. ఆయన పూర్తిపేరు ఘట్టమనేని శివరామకృష్ణమూర్తి. 1964కు ముందు పలు సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేసిన కృష్ణకు 1965లో హీరోగా వెండితెరపై మెరిశారు. ఆయన తొలి సినిమా ‘తేనె మనసులు’. తెలుగు ప్రేక్షకులకు హీరోగా పరిచయమై 55 ఏళ్లు పూర్తిచేసుకున్న ఆయన తన కెరీర్‌లో ఎన్నో మైలురాళ్ళు అధిగమించారు. నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగానే కాకుండా తెలుగు సినిమాకు సరికొత్త టెక్నాలజీని పరిచయం చేసిన ఘనుడిగా పేరు ప్రఖ్యాతలు సంపాదించారు. గూఢచారి 116 మూవీ కృష్ణ కెరీర్‌కి గట్టి పునాది వేసింది. సినీ పరిశ్రమలో నిలదొక్కుకునేందుకు దోహదపడింది. అలా పడిన పునాదిపై నాలుగు దశాబ్దాలకు పైగా కెరీర్‌ కొనసాగిస్తూ 340 పైచిలుకు సినిమాల్లో ప్రధాన పాత్రలో ఆయన అభినయించారు. 1983లో ప్రభుత్వ సహకారంతో స్వంత స్టూడియో పద్మాలయా స్టూడియోను హైదరాబాద్‌లో ఏర్పాటు చేసి పలు విజయవంతమైన సినిమాలు రూపొందించారు. నిర్మాతగా కూడా సక్సెస్ అయ్యారు. ఆ తర్వాత దర్శకుడి గానూ 16 సినిమాలు తీసిన ఘనత సూపర్ స్టార్ కృష్ణ సొంతం. ఇకపోతే తెలుగు సినీ ప్రేక్షకులకు మొట్టమొదటి కౌబాయ్, జేమ్స్ బాండ్ హీరో కూడా కృష్ణనే. ఆ రోజుల్లోనే ముందుచూపుతో టెక్నికల్‌గా తెలుగు సినిమాను ఖ్యాతిని ప్రపంచానికి చాటే గొప్ప ప్రయత్నాలు చేశారాయన. అలా ఎన్నో సినిమాలతో సంచలనాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తూ సాంఘిక, జానపద, పౌరాణిక,జేమ్స్‌బాండ్, కౌబాయ్ వంటి డిఫరెంట్ చిత్రాల్లో మెప్పించి అశేష అభిమాన వర్గాన్ని కూడగట్టుకున్నారు సూపర్ స్టార్ కృష్ణ. 1964లో ప్రముఖ దర్శక నిర్మాత ఆదుర్తి సుబ్బారావు అందరూ కొత్తవాళ్ళతో తాను తీస్తున్న 'తేనె మనసులు' మూవీ కోసం కొత్త నటులు కావాలని ఇచ్చిన పత్రికా ప్రకటన ఇచ్చారు. అది చూసి స్పందించిన కృష్ణ తెనాలి నుంచి తన ఫోటోలు పంపించారు. పలు వడపోతల తర్వాత మద్రాసు పిలిపించి కృష్ణకు స్క్రీన్ టెస్ట్ చేసి ఆదుర్తి కృష్ణను ఇద్దరు కథానాయకుల్లో ఒకడిగా ఎంపిక చేశారు. అలా సినీ కెరీర్ స్టార్ట్ చేసి తెలుగు సినీ చరిత్రలోనే విలక్షణ నటుడు, ఏ పాత్రలో అయినా ఒదిగిపోగల నటుడిగా పేరు ప్రఖ్యాతలు గడించారు కృష్ణ. కృష్ణ కుటుంబ నేపధ్యాన్ని చూస్తే.. ఆయనకు ముగ్గురు కూతుళ్లు. వారి పేర్లు పద్మావతి, మంజుల, ప్రియదర్శిని. ఇద్దరు కుమారులు రమేష్ బాబు, మహేష్ బాబు ఉన్నారు. పెద్ద కొడుకు రమేష్ బాబు హీరోగా రాణించలేక పోయాడు. 90ల్లో కొన్ని సినిమాల్లో హీరోగా ప్రయత్నించి, తర్వాతి దశలో సినీ నిర్మాతగా వ్యవహరించారు. 1987-90 మధ్యకాలంలో దాదాపు తన ఏడు సినిమాల్లో బాలనటుడిగా నటించిన రెండో కొడుకు మహేష్ బాబు 1999లో రాజకుమారుడు సినిమాతో హీరోగా పరిచయమై వరుస హిట్స్ సాధిస్తూ కృష్ణ నట వారసత్వాన్ని కొనసాగిస్తున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2ZP6UyJ
v

వలస కార్మికుల కోసం విమానం.. సోనూ సూద్ ‌పై సీఎం ప్రశంసలు

కరోనా లాక్ డౌన్ కారణంగా వలస కార్మికులు వెతలు పడుతున్న వేళ వారి పాలిట దైవంలా దిగివచ్చాడు... ప్రముఖ స్టార్ సోనూ సూద్. సినిమాల్లో విలన్ పాత్రల్లో మెప్పించిన.. సోనూ నిజ జీవితంలో మాత్రం నిజంగా హీరో అయ్యాడు. ఆయన వలస కార్మికుల కోసం చేసిన సాయం ఏ ఒక్క భారతీయుడు మరిచిపోలేనిది. సొంత రాష్ట్రాలకి వెళ్ళేందుకు ప్రాణాలని సైతం లెక్క చేయకుండా ఎందరో వలస కార్మికులు కాలి బాట పట్టారు. వీరిని చూసి చలించిన తన శక్తివంచన మేరకు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశాడు. వేలాది మంది వలస కార్మికులని సొంత గూటికి చేర్చారు. ఇటీవల కేరళలో చిక్కుకుపోయిన ఒడిశా యువతులను ప్రత్యేక ఫ్లైట్ ద్వారా స్వస్థలానికి చేర్చారు. కేరళలోని ఎర్నాకుళంలో కుట్టుమిషన్ల కంపెనీలో పనిచేస్తున్న 177 మంది మహిళలు తమ సొంత రాష్ట్రం ఒడిశాకు వెళ్లాలంటూ సోనూసూద్‌ను సాయం కోరారు. ఆ విషయం తెలిసిన వెంటనే వారి కోసం ఓ ప్రత్యేక విమానాన్ని ఏర్పాటు చేశాడు. తాజాగా సోనూ సూద్ చేసిన ఈ పనిని చూసి అంతా ఆశ్చర్యపోతున్నారు. ఆపత్కాలంలో సోనూ చేస్తున్న సేవలకు సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇటీవల కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ కూడా సోనూ సూద్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. తాజాగా ఒడిశా ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ సోనూను ప్రశంసించారు. ''ఒడిశా మహిళలకి సహాయం చేసేందుకు ముందుకు వచ్చిన బాలీవుడ్‌ నటుడు సోనూ సూద్‌కు ధన్యవాదాలు. కోవిడ్‌-19 లాక్‌డౌన్‌ కారణంగా కేరళలో చిక్కుకుపోయిన వారిని క్షేమంగా ఇంటికి చేర్చేందుకు చొరవ చూపారు. ఆయన మానవతాదృక్పథాన్ని ప్రశంసించి తీరాల్సిందే''అని ట్వీట్‌ చేశారు. సీఎం పట్నాయక్ ట్వీట్‌కి సోనూ సూద్ కూడా స్పందించారు. కేరళలో చిక్కుక్కుపోయిన నా అక్కా చెల్లెళ్ళని ఇంటికి పంపండం నా బాధ్యతగా భావించాను. మీ మాటలు నాలో స్పూర్తిని నింపాయి. ధన్యవాదాలు సార్. దేశంలోని వలస కార్మికులని వారి స్వస్థలాలకి పంపేందుకు నేనే ఎల్లప్పుడు సిద్ధంగానే ఉంటాను అని బదులిచ్చారు సోనూ. కర్ణాటక, ఉత్తర ప్రదేశ్, బీహార్, జార్ఖండ్, రాజస్థాన్ కార్మికులను ఇప్పటివరకు సోనూసూద్ ఇంటికి పంపించారు. ఈ కార్యక్రమంలో అతని కుటుంబం,స్నేహితులు సైతం అతనికి అండగా నిలిచారు. తనకు ప్రశంసలు అవసరం లేదని.. ప్రజల ఆశీర్వాదమే చాలని అంటున్నారు సోనూ.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2B9Q2Z5
v

మీరే నా సూపర్ స్టార్.. కృష్ణ పుట్టినరోజున మహేష్ బాబు ట్వీట్

టాలీవుడ్ నటశేఖరుడు, ఘట్టమనేని ఇవాళ 77వ పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్నారు. నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా ఆయన తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. ఎన్నో వైవిధ్యమైన పాత్రలతో అభిమానుల్ని అలరించారు. తెలుగు చలన చిత్ర సీమలో గ్లామరస్‌ నటుడు కృష్ణ. వెండితెరపై మెరిసిన అందగాడు. అలాంటి టాలీవుడ్ స్టార్ కృష్ణకు కళాప్రపూర్ణ పురస్కారం వరించింది. తెలుగు చలన చిత్ర సీమకు ఆయన చేసిన సేవకు గాను ఆంధ్ర విశ్వవిద్యాలయం ఈ గౌరవ డాక్టరేట్‌ను ప్రదానం చేసి సత్కరించింది.ఇవాళ కృష్ణ బర్త డే సందర్భంగా ఆయన తనయుడు మహేష్ బాబు, కోడలు నమ్రత, మనవరాలు సితారతో పాటు పలువురు సినీ ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. బర్త్ డే శుభాకాంక్షలు నాన్న.. మీకు ఎప్పటికీ రుణపడి ఉంటాను. మీరు ఎప్పటికీ నా సూపర్ స్టార్ అంటూ చేశారు. తన తండ్రితో చిన్నప్పుడు దిగిన ఫోటోని కూడా షేర్ చేస్తూ శుభాకాంక్షలు తెలియజేశారు. సితార తన ఇన్‌స్టాగ్రామ్‌లో కృష్ణ ఫోటో షేర్ చేస్తూ.. హ్యాపీ బర్త్ డే తాత గారు.. లవ్ యూ వెరీ మచ్.. ఈ రోజు మీకు మంచి జరగాలని కోరుకుంటున్నాను అని విషెస్ తెలిపింది. ఈ రోజు సందర్భంగా మహేష్ 27వ చిత్రం లాంచ్ కానుంది. పరశురాం దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ చిత్రానికి సర్కార్ వారి పాట అనే టైటిల్ పరిశీలిస్తున్నారు. మైత్రిమూవీ మేకర్స్, జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్స్, 14 రీల్స్ సంస్థలు సంయుక్తంగా చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. అయితే ఈ సినిమాలో మహేష్ మూడు పాత్రల్లో కనిపించబోతున్నారన్న ప్రచారం కూడా జరుగుతోంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2MdDKRZ
v

మరింత రెచ్చిపోయిన హాట్ హీరోయిన్.. ప్రియుడితో కలిసి! నెట్టింట వీడియో హల్చల్

లాక్‌డౌన్ నేపథ్యంలో ఇంట్లోనే ఉంటున్న సినీ తారలు ఎవరికి తోచిన పనుల్లో వారు నిమగ్నమైపోయారు. ఈ ఖాళీ సమయాన్ని వృధా చేయకూడదనే ఉద్దేశ్యంతో రకరకాల పనులు చేస్తున్నారు. ఈ క్రమంలోనే కొందరు హీరోయిన్స్ తమ తమ ఫిట్‌నెస్ విషయమై స్పెషల్ ఫోకస్ పెడుతూ వర్కవుట్స్ చేస్తున్నారు. నిత్యం వ్యాయామాలు చేస్తూ ఆ వీడియోలను సోషల్ మీడియా వేదికగా పంచుకుంటూ ప్రేక్షకులను హుషారెత్తిస్తున్నారు. ఇదే బాటలో తాజాగా మాజా విశ్వసుందరి, బాలీవుడ్ హాట్ హీరోయిన్ తన ప్రియుడితో కలిసి చేసిన వర్కవుట్స్ వీడియో షేర్ చేసి అట్రాక్ట్ చేసింది. ఇండియాలోనే ఫేమస్ అందగత్తెల్లో ఒకరిగా పేరొందిన సుస్మితా సేన్.. కొంత కాలంగా తనకన్నా చిన్నవాడైన ఓ కుర్రాడితో ఎఫైర్ నడుపుతున్న విషయం తెలిసిందే. ఆ కుర్రాడిని ఇంట్లోనే పెట్టుకొని సహజీవనం చేస్తోంది సుస్మిత. అతని పేరు . అంతేకాదు పెళ్లి కాకుండానే ఇద్దరు పిల్లలు రెనీ, ఐలాష్ లను దత్తత తీసుకొని ఆ ముగ్గురితో కలిసి ఎంచక్కా ఇంట్లోనే ఉంటూ సరదాగా గడిపేస్తున్న ఈ భామ లాక్‌డౌన్ పీరియడ్‌లో ఆయనతో తెగ వర్కవుట్స్ చేసింది. రోహ్మన్ షాతో డేటింగ్ విషయం బయటకు వచ్చాక మరింత రెచ్చిపోతోంది. అతడితో రొమాన్స్ చేస్తున్న ఫొటోలు, వీడియోలతో పాటు హాట్ వర్కౌట్‌కు సంబంధించిన పిక్స్‌ని సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేస్తూ హల్చల్ చేస్తోంది. ఇలా ఇప్పటికే ఎన్నోసార్లు వార్తల్లోకి నిలిచిన సుస్మిత.. తాజాగా మరోసారి హాట్ వీడియో షేర్ చేసి సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఒకే ఇంట్లో కలిసి ఉంటున్న ఈ జంట లాక్‌డౌన్‌లో హాట్ వర్కౌట్లు చేస్తున్న ఈ వీడియో చూపరులకు భలే కిక్కిస్తోంది. చాలా కష్టమైన ఆసనాలను వేస్తూ ఆరోగ్యాన్ని, అందాన్ని కాపాడుకుంటూనే సుస్మిత జోడీ ఇలా అట్రాక్ట్ చేయడం విశేషం.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2XJQWmN
v

బాలకృష్ణ కామెంట్స్‌పై వర్మ రియాక్షన్.. రెండు మూడు రోజులే అరవడం

టాలీవుడ్‌ పెద్దలపై చేసిన కామెంట్స్ హాట్ టాపిక్‌గా మారిన విషయం తెలిసిందే. బాలయ్య వ్యాఖ్యలకు కౌంటర్ ఇవ్వడంతో నందమూరి వర్సెస్ మెగా ఫ్యాన్స్ వార్ తయారైంది పరిస్థితి. ఫ్యాన్స్ రెండు గ్రూపులుగా విడిపోయి ఒకర్నొకరు దూషించుకుంటున్నారు. ఈ ఇష్యూపై స్పందిస్తూ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. ఆయన మాట్లాడుతూ.. ‘లాక్ డౌన్ నేపథ్యంలో సినీ కార్మికులు చాలా ఇబ్బందులు పడుతున్నారని అంటున్నారు.. నేను ఇప్పుడే కాదు ఎప్పుడూ పట్టింకోను. నా లైఫ్‌లో ఇప్పటి వరకూ ఎవరికీ ఛారిటీ ఇవ్వలేదు. డైరెక్ట్‌గా నాతో పనిచేస్తున్న వారిని మాత్రమే నేను చూస్తా.. చేయాలనిపిస్తే సాయం చేస్తా.. అంతేతప్ప జనరల్‌గా అందర్నీ చూడను. ఛారిటీ అంటారు అది ఎక్కడికి వెళ్తుంది? ఎందుకు అనేది ఎవరికీ తెలియదు. అందుకే వాటిపై నాకు నమ్మకం లేదు. చేయాలనిపిస్తే.. నేనే డైరెక్ట్‌గా చేస్తా. బాలయ్య కామెంట్స్‌పై స్పందిస్తూ.. ఆయన ఏదో కామన్‌‌గా మాట్లాడితే.. మీడియా పెద్ద బ్యాగ్రౌండ్ మ్యూజిక్ వేసి చూపించింది. బాలయ్య మాటల్లో అంతగా పట్టించుకోవాల్సిన విషయం ఉందని అయితే నేను అనుకోవడం లేదు. ఆయన కామెంట్ చేయడం ద్వారా ఏమైంది?? రెండు మూడు రోజుల అరుస్తారు.. తరువాత మెల్లగా సర్దుకుంటుంది. నాలుగు రోజుల తరువాత అందరూ మరిచిపోతారు. ఆ ముందు రోజుకి తరువాత రోజుకి పెద్దగా తేడా ఉండదు’ అంటూ చెప్పుకొచ్చారు వర్మ.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2ZP3aNG
v

Ram Gopal Varma ‘క్లైమాక్స్’ కొత్త ట్రైలర్: మియా.. భంగిమలు బెంబేలే!

వర్మ వీడియో వదిలితే వామ్మో అనడం కామనే.. అందులోనూ పోర్న్ స్టార్ మియా మాల్కోవాతో ‘క్లైమాక్స్’ ట్రైలర్ అంటే వర్మగారి క్రియేటివిటీ కొంత పుంతలు తొక్కేస్తుంటుంది. ఇప్పటికే క్లైమాక్స్ నుంచి టీజర్, ట్రైలర్, సాంగ్స్ వదిలిన వర్మ తాజాగా మరో హాట్ బాంబ్ వదిలారు. మియాను వివిధ భంగిమల్లో చూపిస్తూ నగ్న అవతారంలో మెరిపించజేశారు. ఇక ట్రైలర్ స్టార్టింగ్‌లో జీప్‌లో వెళ్తూ తన ప్రియుడ్ని కిస్ చేసే సీన్‌.. వర్మకి తప్ప ఇలాంటి శృంగారభరిత క్రియేటివిటీ ఇంకెవరకీ ఉండదేమో అన్నట్టుగా ఆమె శరీరాన్ని విల్లులా మార్చేశాడు వర్మ. ఒకటినన్నర నిమిషం నిడివితో ఉన్న ఈ ట్రైలర్‌‌లో సెక్స్ సీన్లతో పాటు యాక్షన్ పార్ట్‌ని ఇమిడింపచేశాడు. ఎడారిలో వచ్చే ఛేజింగ్ సీన్స్ ట్రైలర్‌కి హైలైట్‌గా నిలిచాయి. ఇక ఈ సినిమా విడుదల ఎప్పుడు? ఎక్కడ అనే విషయానికి వస్తే.. ‘దేవుడు కాదు కదా, సాక్షాత్తు కరోనా దిగివచ్చినా 'క్లైమాక్స్' సినిమాను ఆపలేదంటూ.. మే 29వ తేదీన తన 'క్లైమాక్స్' మీ ముందుకు రాబోతోందని సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు వర్మ.. అయితే ఆ దేవుడే దిగివచ్చాడో ఏమో కాని రిలీజ్ డేట్‌ను జూన్ 6కి మార్చుకున్నారు వర్మ. ఈ మూవీని RGVWorld.in/ShreyasET వేదికపై చూడొచ్చు. పే ఫర్ వ్యూ మోడల్‌లో ఈ సినిమా ఒక్కో వ్యూ కోసం 100 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2XeTlGY
v

తాప్సీ ఇంట్లో విషాదం.. శూన్యాన్ని వదిలి వెళ్లిందంటూ భావోద్వేగ పోస్ట్

బాలీవుడ్ సంచలన నటి ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. శనివారం నాడు తుది శ్వాస విడిచారు. ఈ విషయాన్ని ఇన్ స్టాగ్రామ్ ద్వారా తెలియజేస్తూ భావోద్వేగానికి గురయ్యారు తాప్సీ. గురుద్వారాలో తన బామ్మ అంతిమ సంస్మరణలకు చెందిన ఒక ఫోటోను పోస్ట్ చేసిన తాప్సీ.. ‘కుటుంబంలో పాత తరాల వారు ఎప్పటికీ నిలిచిపోయే శూన్యాన్ని మనకు వదిలి వెళతారు’ అంటూ భావోద్వేగానికి గురయ్యారు తాప్సీ. తెలుగులో మంచు మనోజ్ ‘ఝమ్మంది నాదం’ చిత్రంతో ఇండస్ట్రీకి పరిచయం అయిన తాప్సీ.. వస్తాడు నా రాజు, మిస్టర్ పర్ఫెక్ట్, వీరా, మొగుడు, దరువు, గుండెల్లో గోదారి, షాడో వంటి చాలా చిత్రాల్లో నటించినప్పుటికీ ఆమెలోని నటికి పనిచెప్పే పాత్ర ఒక్కటీ పడకపోవడంతో బాలీవుడ్‌కి షిప్ట్ అయ్యింది. బాలీవుడ్‌లో పింక్, ఘాజీ, తాపడ్ వంటి చిత్రాల్లో ప్రయోగాత్మక పాత్రలు చేసి సంచలన నటిగా గుర్తింపుతెచ్చుకుంది. తెలుగు, హిందీతో పాటు తమిళ్‌లోనూ పలు చిత్రాలు చేసింది తాప్సీ. టాలీవుడ్ నుంచి బాలీవుడ్‌కి వెళ్లిన తరువాత తాప్సీ కెరియర్ ఊపందుకుంది. ప్రాధాన్యత ఉన్న పాత్రల్లో నటిస్తూ మెప్పిస్తోంది తాప్సీ. ఇక వివాదాల్లోనూ ముందుంటే తాప్సీ.. దర్శకేంద్రుడు కె. రాఘంవేంద్రరావు హీరోయిన్స్ బుడ్డు చూపించి కొబ్బరి కాయలతో కొట్టించడంపై అభ్యతరం చెప్తూ వివాదాస్పద కామెంట్ చేసింది తాప్సీ.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/36IkwwY
v

Balakrishna: బాలయ్య రూ. 6 కోట్లు ఇచ్చి తన పేరు వద్దన్నారు, చిరంజీవితో వ్యవస్థ నిర్వీర్యం: నిర్మాత సంచలన కామెంట్స్

సినీ పెద్దల మీటింగ్ ఫిల్మ్ ఛాంబర్‌లో కాకుండా కొంతమంది వ్యక్తులతో ఇంట్లో జరపడంపై ఫైర్ అయ్యారు నిర్మాత ప్రసన్న కుమార్. గతంలో మీడియాతో సమస్య వచ్చినప్పుడు చిరంజీవి గారి తమ్ముడు పవన్ కళ్యాణ్ గారు కూడా ఫిల్మ్ ఛాంబర్ వద్దే నిరసన తెలిపారని ఆయన గుర్తు చేస్తూ చిరంజీవి నిర్వహించిన మీటింగ్‌ను తప్పు పట్టారు. ప్రసన్న కుమార్ మాట్టాడుతూ.. ‘ఇండస్ట్రీకి సంబంధించి ఏదైనా సమస్య వచ్చినప్పుడు మాట్లాడుకోవడానికి ఫిల్మ్ ఛాంబర్ ఉంది.. కొన్ని తరాలుగా ఇక్కడే మీటింగ్‌లు జరుగుతున్నాయి. ఆరోజు పవన్ కళ్యాణ్‌కి సమస్య వచ్చినప్పుడు మీటింగ్ ఇంట్లో పెట్టుకోలేదు.. ఛాంబర్‌కే వచ్చారు.. ఆయన వెనుకు నాగబాబు ఇతర మెగా హీరోలంతా ఛాంబర్‌కే వచ్చారు. ఫిల్మ్ ఛాంబర్ ఆరోజు గుర్తుకు వచ్చి ఈరోజు పక్కనపెట్టి మీ ఇంట్లోనే చర్చలు జరుపుకుంటే ఫిల్మ్ ఛాంబర్ ఎందుకు?? ఈరోజు చిరంజీవి, ఇండస్ట్రీకి రెండు కళ్లు. ఏ కన్నుని పక్కన పెట్టినా తప్పు. ఇండస్ట్రీలో అందర్నీ కలుపుకుని పోవాలి. ఈరోజు ఇండస్ట్రీలో క్రిష్ణ, క్రిష్ణంరాజు, మోహన్ బాబు ఇలా చాలా మంది ఉన్నారు. వాళ్లందర్నీ కలుపుకుని పోవాలనే బాధ్యతని విస్మరించి ప్రైవేట్‌గా మీటింగ్‌లు పెట్టడం తప్పు. కరోనా క్రైసిస్ ఛారిటీ అని పెట్టారు.. దాన్ని ఛాంబర్ ద్వారా నిర్వహించవచ్చు. దానికి చిరంజీవి గారినే చైర్మన్‌‌గా పెట్టండి.. తప్పులేదు.. కాని అలా చేయలేదు. గతంలో కర్నూల్ వరదలు వచ్చినప్పుడు బాలయ్య బాబు ఇలాగే చేశారా?? ఆరోజు వరదలు వచ్చినప్పుడు బాలయ్య బాబే డబ్బులు వసూలు చేసి.. దాసరి నారాయణ రావు గారికి అందిస్తే.. ‘బాలయ్యా నువ్ కష్టపడుతున్నావ్.. నీ పేరు మీదే కానియ్యి’ అంటే.. ‘లేదు.. ఛాంబర్ ద్వారానే చేస్తా అని.. రోశయ్య గారికి రూ. 6 కోట్లు అందించడం జరిగింది. ఇదే కాదు.. దాదాసాహెబ్ ఫాల్కే, రామానాయుడు గారి ఫంక్షన్, చిరంజీవి గారి పద్మ భూషన్ కార్యక్రమం ఇలా ఏది చూసుకున్నా.. తెలుగు ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షతనే జరిగింది. అలాంటి ఛాంబర్‌ని పక్కనపెట్టారు. అంతెందుకు మా ప్రెసిండెంట్ నరేష్ గారికి పిలుపు లేదు.. సెక్రటరీ జీవితా రాజశేఖర్‌కి పిలుపు లేదు. ఛాంబర్‌లో ఒక వ్యక్తిని పిలుస్తారు.. అక్కడ ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు. కౌన్సిల్‌లో ఒక వ్యక్తిని పిలుస్తారు.. ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు. అంటే మీరు సంస్థల్ని, వ్యవస్థల్ని, ఇండస్ట్రీని నిర్వీర్యం చేసి ప్రైవేటు ప్రాపర్టీగా తెలుగు సినిమా ఇండస్ట్రీని చేయదల్చుకున్నారా?? ఇది ఖచ్చితంగా తప్పు.. ఇప్పటికైనా కళ్లు తెరిచి సంస్థలు, వ్యవస్థల ద్వారానే మీరు ఏ పని అయినా చేయాలని కోరుకుంటున్నాను’ అంటూ మెగాస్టార్ చిరంజీవిపై సంచలన కామెంట్స్ చేశారు నిర్మాత ప్రసన్న కుమార్.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3cicX16
v

అల్లు బ్రదర్స్ విడిపోయారా? ఈ సెలబ్రేషన్స్ చూసి ఆ మాట అనగలరా?

ఈరోజు (మే 30) అల్లు వారి చిన్నబ్బాయి పుట్టిన రోజు. దీంతో ఫ్యామిలీతో కలిసి హ్యాపీగా బర్త్ డే సెలబ్రేషన్స్ నిర్వహించుకున్నారు. తన అన్నలు , అల్లు బాబీలతో పాటు తన వదినలు, పిల్లలు, అల్లు అరవింద్ సతీ సమేతంగా ఈ బర్త్ డే సెలబ్రేషన్స్‌లో పాల్గొన్నారు. స్వయంగా బన్నీ భార్య స్నేహా రెడ్డి మరిది కోసం కేక్ తయారుచేసి తీసుకువచ్చిందని తెలియజేస్తూ.. ఫ్యామిలీతో కలిసి దిగిన ఫొటోని షేర్ చేశారు అల్లు శిరీష్. ఇదిలా ఉంటే ప్రస్తుతం అల్లు శిరీష్ ఫ్యామిలీకి దూరంగా ఉంటున్నారు. ఇటీవలే సొంతంగా సెపరేట్ హౌస్ కొన్న అల్లు శిరీష్ ఆ కొత్త ఇంటికి షిప్ట్ అయ్యాడు. అయితే ఇటీవల అల్లు వారి అబ్బాయిలకు ఆస్తి పంపకాలు జరిగాయని వార్తలు రాగా.. ఆ పంపకాల్లో భాగంగా అల్లు శిరీష్ తన తట్టా బుట్టా చేత పట్టుకుని బయటకు వెళ్లిపోయాడు.. ఒంటరి వాడు అయిపోయాడు.. అయ్యో పాపం.. అంటూ ప్రముఖ వెబ్ సైట్స్‌లో కథనాలు వచ్చాయి. ఇష్టపడి కొనుక్కున్న ఇంటికి వెళ్లిన పాపానికి అల్లు శిరీష్‌కి తన ఫ్యామిలీతో చెడిందంటూ రూమర్స్ క్రియేట్ చేశారు. నిజానికి అల్లు శిరీష్ హీరోగా రెండు మూడు సినిమాల్లో నటించినప్పటికీ నిర్మాణ రంగంపైనే ఎక్కువ ఫోకస్ పెట్టారు. అందుకు అనుగుణంగా ఉండేందుకు అతను నచ్చినట్టుగా ఆఫీస్ అండ్ హౌస్ పర్పస్‌లో సొంతంగా ఓ కొత్త ఇంటిని నిర్మించుకున్నాడు. అలా కొత్త ఇంటికి షిఫ్ట్ కావడంతో అల్లు శిరీష్‌పై రకరకాల రూమర్స్ పుట్టుకొచ్చాయి. మొత్తానికి తన బర్త్ డే సందర్భంగా.. అల్లు ఫ్యామిలీ అంతా ఒకటే అని తెలియజేస్తూ తన ఫ్యామిలీతో కలిసి దిగిన ఫొటోని షేర్ చేసి రూమర్స్‌కి చెక్ పెట్టారు అల్లు శిరీష్. ఇక అల్లు అర్జున్ అయితే తన తమ్ముడు అంటే ఎంత ప్రేమో తెలియజేస్తూ.. ఈ ప్రపంచంలో నువ్ ఎప్పుడూ నా ఫేవరేట్ బేబీవి అంటూ తమ్ముడితో కలిసి దిగిన చిన్ననాటి ఫొటోతో ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. సో.. అల్లు బ్రదర్స్ విడియారంటూ ప్రచారం చేసిన వాళ్లు ఈ సెలబ్రేషన్స్ చూసి ఆ మాట అనగలరా అంటూ అల్లు హీరోల ఫ్యాన్స్ ప్రశ్నిస్తున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2XJnPjx
v

అంతా తుస్.. బాలయ్య, చిరు మాట్లాడారు, ఏ గొడవాలేదు, నాగబాబూ కూలమ్మా!

హలో ఫ్యాన్సూ... చొక్కాలు చింపుకోకండ్రా నాయన్రారా అంటే.. వింటారా..? ఓ ఎగేసుకుని మరీ మా హీరో తోపూ.. ఆయన్నే అంత మాట అంటారా? మిమ్మల్ని అంత చేస్తాం ఇంత ఇస్తాం అంటూ ఎదుటి హీరోని వీళ్లు తిట్టడం.. వాళ్లతో మళ్లీ తిరిగి తిట్టించుకోవడం దశాబ్ధాలుగా తెలుగు సినిమా పరిశ్రమలో చూస్తూనే ఉన్నాం. చివర్లో గొడవకు కారణమైన హీరోలు నోరు మెదపకపోగా.. సినిమా ఈవెంట్లు, వివాహాదిశుభకార్యాల్లో భుజంపై చేయి చేయి వేసుకుని చేతులు ఊపుతుంటారు. ఈ మధ్య కిస్సులు కూడా పెట్టుకుంటున్నార్లెండి అది వేరే విషయం.. ఇక అసలు విషయానికి వస్తే టాలీవుడ్ పెద్దలు ప్రభుత్వ పెద్దలతో జరిపిన చర్చలకు తనను పిలవకపోవడంపై అలిగారు బాలయ్య. ఆయన అలిగితే యవ్వారం ఎలా ఉంటుందో తెలిసిందే కదా.. తేడా లొస్తే పబ్లిక్‌లోనే ఫ్యాన్స్‌ని వీరి ఉతుకుడు ఉతికే బాలయ్య.. తనను ఆ మీటింగ్‌కి పిలవకపోవడంతో హర్ట్ అయ్యి.. భూములు పంచుకోవడానికి మీటింగ్‌లు పెట్టుకున్నారంటూ ఓ రేంజ్‌లో ఫైర్ అయ్యారు.

అయితే బాలయ్య వ్యాఖ్యలపై మెగా బ్రదర్ నాగబాబు తెగ ఫీల్ అయిపోయి.. మర్యాదగా క్షమాపణ చెప్పుబాలయ్యా.. నోటి కొచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదు.. ఆఫ్ట్రాల్ నువ్వో హీరో మాత్రమే.. ఏం అనుకుంటున్నావ్ అంటూ భారీ భారీ డైలాగ్‌లో వీడియో వదిలారు. బాలయ్య యాక్షన్‌కి నాగబాబు రియాక్షన్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ కాగా.. నందమూరి-మెగా ఫ్యాన్స్ ఎంట్రీ ఇచ్చి ఒకర్నొకరు బండ బూతులు తిట్టుకుంటూ మా హీరో గొప్ప అంటే మా హీరో గొప్ప అని సోషల్ మీడియాలో తొడలు వాచేలా కొట్టుకుంటున్నారు.

ఇక ఈ వివాదం మరింత ముదరడంతో టాలీవుడ్ ట్రబుల్ షూటర్‌గా పేరొందిన పెద్దాయన తమ్మారెడ్డి భరద్వాజ మీడియా ముందుకు వచ్చి.. వివాదాన్ని పరిష్కరించే ప్రయత్నం చేశారు. అసలు వివాదం ఏం లేదు అంటూ క్లారిటీ ఇచ్చారు. ఆయన మాట్లాడుతూ.. సీసీసీ (కరోనా క్రైసిస్ ఛారిటీ) డబ్బులు పంచుకుంటున్నారు అంటూ పిచ్చి వాగుడు వాగుతున్నారు.. ఎవరో బుద్ది లేని వాళ్లు అలా మాట్లాడుతున్నారు.. ఏదో సాయం చేయడానికి ముందుకు వస్తే ఇలాగనే మాట్లాడేది. చిరంజీవి గారి ఇంట్లో మీటింగ్ పెట్టినందుకు చాలా మంది తెగ ఫీల్ అవుతున్నారు. గతంలో చాలా మీటింగ్‌లో దాసరిగారి ఇంట్లోనే జరిగేవి అప్పుడు ఎవరూ ఎందుకు మాట్లాడలేదు.

నిజానికి చిరంజీవి గారి ఇంట్లో ఇండస్ట్రీ మీటింగ్ కాదది. సీఎం గారి దగ్గరకు వెళ్లే ముందు కాని.. ఆ తరువాత కాని గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయ్యి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు చిరంజీవిని కలుస్తాం అంటే ఆయనే వస్తానని అన్నారు. మంత్రిగారు వెళితే ఇండస్ట్రీ మీటింగ్ ఎలా అవుతుంది. తలసాని వచ్చారు కాబట్టి చిరంజీవి గారితో పాటు మిగిలిన పెద్దలు కలిశారు. అనుకోకుండా జరిగిన మీటింగ్ ఇది. ఛాంబర్ నుంచి చేసింది ఛాంబర్‌లో చేశాం.. వ్యక్తిగతంగా చేయాల్సింది వ్యక్తిగతం చేశాం. గతంలో దాసరి గారు కూడా ఇలాగే చేశారు. ఇప్పుడు చిరంజీవి గారి ఇంట్లో మీటింగ్ జరిగితే ఏమైంది.. ఆయన సొంత వ్యాపారాల గురించి ఏమైనా మాట్లాడుకోలేదు కదా.. ఇండస్ట్రీ బాగు కోసమే కదా మాట్లాడింది. ఒకవేళ మాట్లాడినా తప్పులేదు. ఎందుకంటే ఆయన ఇష్టం.

తెలంగాణ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తరువాత ప్రతి మీటింగ్‌కి నన్ను పిలచేవారు. ఈ రెండు మూడు మీటింగ్‌లకు నన్ను పిలవలేదు. కాని ఇండస్ట్రీకి మంచి జరుగుతుందన్నప్పుడు మనల్ని పిలవకపోతే ఏమైంది? ఎవరితో పని అవుతుందో వాళ్లని పట్టుకుని వెళ్తాం. ఇప్పుడు బాలక్రిష్ణ గారిని పిలవలేదనడం కరెక్ట్ కాదు.. ఎందుకంటే ఎప్పుడూ ఎవర్నీ పిలవం. ఎందుకంటే ఆ మీటింగ్ జరిపింది ప్రభుత్వం. వెళ్లి తలసానినో లేక సీఎం కేసీఆర్‌నో అడగండి.. బాలయ్యను ఎందుకు పిలవలేదని. గతంలో తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు కేవలం కొంత మంది మాత్రమే వెళ్లారు.. మిగిలిన వాళ్లని పిలవలేదు అని ఎవరైనా అడిగారా?? ఇవాళ ఎందుకు వివాదం చేస్తున్నారు.

బాలయ్యను మీడియా రెచ్చగొట్టడం వల్ల ఆయన అలా మాట్లాడారు.. కావాలనే వివాదం చేస్తున్నారు. ఆయన చెప్పిందే రైట్ అనుకుందాం.. బాలయ్య హీరో అయ్యి 30 ఏళ్లు అయ్యింది.. ఈ 30 ఏళ్లలో ఎన్ని మీటింగ్‌లు జరిగాయి.. బాలయ్య ఎన్ని మీటింగ్‌లకు వచ్చారో చెప్పుతారా? నిజంగా ఆయన అన్ని మీటింగ్‌లకు వచ్చి ఉండి.. ఈ మీటింగ్‌కి పిలవకపోయి ఉంటే తప్పు మాది అయ్యేది. ఇండస్ట్రీకి మంచి జరుగుతుంది అన్నప్పుడు దీన్ని కాంట్రివర్శీ చేయడం ఎందుకు. బాలయ్యను పిలిచారా? భరద్వాజాని పిలిచారా అన్నది ముఖ్యం కాదు.. ఇండస్ట్రీకి మేలు జరిగిందా లేదా? అన్నదే ముఖ్యం. మీడియాకి చేతులెత్తి మొక్కుతున్నా.. దయచేసి దీన్ని ఇక్కడితో వదిలేయండి.. కాంట్రవర్శి చేయకండి.

ఇండస్ట్రీలో చిరంజీవి, బాలకృష్ణల మధ్య ఎలాంటి వివాదం లేదు. మధ్యలో ఉన్న వాళ్లు నోరు జారి ఉండవచ్చు... ఎవరు జారినా తప్పే. బాలకృష్ణ గారు మాట్లాడింది.. నాగబాబు గారు మాట్లాడింది తప్పే. వాళ్ల వ్యాఖ్యల్ని సినీ పెద్దగా ఖండిస్తున్నా. దీన్ని ఇక్కడితో వదిలేయండి. జరిగింది మరిచిపోండి. ఈ వివాదం తరువాత బాలకృష్ణ గారితో మాట్లాడాం.. అన్నీ అయిపోయాయి. చిరంజీవి గారితో కూడా మాట్లాడాం. వివాదానికి ముగింపు పలికాం. మీడియాకి చేతులెత్తి మొక్కుతున్నా.. దయచేసి దీన్ని ఇక్కడితో వదిలేయండి.. కాంట్రవర్శి చేయకండి.

దాసరి నారాయణ రావుగారి ప్లేస్‌ని చిరంజీవి గారూ భర్తీ చేస్తున్నారని అంటున్నారు. కాని ఆయన ప్లేస్‌ని ఎవరూ భర్తీ చేయలేరు. ఆయన సినిమా ఇండస్ట్రీకి సంబంధించి అన్ని పదవులూ చేశారు. ఆయన ప్రొడ్యుసర్, డైరెక్టర్, రైటర్, రాజకీయ వేత్త, మంత్రి.. ఆయనకి తెలియని విషయం అంటూ ఏమీ ఉండదు. సినిమా ఇండస్ట్రీలో ఏది ఎక్కడ ఎలా ఉందో ఆయనకి తెలుసు.. ప్రతి క్రాఫ్ట్‌పై ఆయనకు అవగాహన ఉంది. ఆయనలా అందరూ ఉండాలంటే సాధ్యం కాదు. కాని ప్రస్తుతం ఉన్న హీరోల్లో చిరంజీవి గారి కెపాసిటీ ఇండస్ట్రీకి ఉపయోగపడుతుంది. లేదంటే మరో హీరో అయినా అవ్వొచ్చు. సమస్య వచ్చినప్పుడు పరిష్కరించడానికి ఒక పెద్ద మనిషి కావాలి.. అది ఎవరైనా కావొచ్చు.

ఇండస్ట్రీకి మంచి జరుగుతుంది అంటే ఎవరి వెనుకు అయినా ఇండస్ట్రీ మొత్తం ఉండటానికి రెడీగా ఉంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో చిరంజీవి బాగా లీడ్ చేయగలరనే నమ్మకం మాకు ఉంది. పరిస్థితిని బట్టే అన్నీ మారుతుంటాయి.. రేపటి రోజున బాలకృష్ణ గారితో మంచి జరుగుతుంది అంటే ఆయన వెనకు ఉంటాం. మాకు కావాల్సింది ఇండస్ట్రీ మేలు. దాసరి గారు అయితే ఎలాంటి పరిస్థితి వచ్చినా ఆయన సాల్వ్ చేసేవారు. ఇప్పుడు చిరంజీవి గారితో సాధ్యం కావొచ్చని అనుకుంటున్నాం. పూర్తి అవగాహన రావడానికి కాస్త టైం పడుతుంది. దాసరి గారు అన్నీ తెలుసుకుని ఇండస్ట్రీకి వచ్చారు.. చిరంజీవి గారు ఇండస్ట్రీకి వచ్చిన తరువాత నేర్చుకుంటున్నారు.. మంచి చేయాలనుకుంటున్న ఆయన్ని ప్రోత్సహిద్దాం.. దయచేసి ఈ వివాదాన్ని ఇక్కడితో వదిలేయండి’ అంటూ వివాదానికి మొత్తం మీడియానే బాధ్యత చేస్తూ షాకింగ్ కామెంట్స్ చేశారు తమ్మారెడ్డి.



from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3chKqJp
v

సినీ ఇండస్ట్రీకే షాక్... రూ.48కోట్లతో ఆఫీస్ పెట్టిన హీరోయిన్

బాలీవుడ్ హీరోయిన్ రూటే సపరేటు. వివాదాలకు కేరాఫ్‌గా ఉంటూనే తన పని తాను చేసుకుంటూ పోతోంది. తాజాగా ఈ భామ ఓ కీలక నిర్ణయం తీసుకుంది. భారత సినీ చరిత్రలో ఏ హీరో, ఏ హీరోయినూ చేయని పని చేసింది. రూ. 48 కోట్లు ఖర్చు పెట్టి ఆఫీసు కమ్ స్టూడియోను ఏర్పాటు చేసింది. ముంబై నడిబొడ్డున నెలకొల్పిన ఈ కార్యాలయాన్ని అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించింది. సొంతంగా భూమిని కొని స్టూడియో, ఆఫీసు ఎలా ఉండాలో ఆమే డిజైన్ చేయించింది. పురుషాధిక్యత ఎక్కువగా ఉండే బాలీవుడ్ లో మహిళగా తనదైన ముద్రను వేసింది. స్టార్ కిడ్ గా ఎంట్రీ ఇవ్వకపోయినా అగ్ర నటిగా ఎదిగింది. నటనలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. అంతేకాదు ఇతరులు అసూయపడేలా నిర్మాతగా, దర్శకురాలిగా కూడా మారింది. తాజాగా ముంబైలో రూ. 48 కోట్లు ఖర్చుపెట్టి ఓ ఖరీదైన ఆఫీసును ప్రారంభించింది. ఈ ఆఫీసుకు సంబంధించిన వీడియో ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది. ఈ సందర్భంగా కంగన మాట్లాడుతూ, చేతిలో కేవలం రూ. 1500తో ఇంటి నుంచి బయటకు వచ్చానని తెలిపింది కంగన. డబ్బు సంపాదించడానికే మా ఊరు నుంచి ముంబై వచ్చానని తెలిపింది. పురుషాధిక్య సమాజంలో ఓ మహిళ డబ్బు సంపాదిస్తే జీర్ణించుకోలేరని చెప్పింది. ఎన్నో పోరాటాల తర్వాత పెద్ద స్టార్ గా ఎదిగానని తెలిపింది. 50 ఏళ్ల వయసు వచ్చేసరికి అత్యంత ధనికురాలిగా నిలవడమే తన లక్ష్యమని చెప్పింది కంగన. కంగనా కొత్తగా ఏర్పాటు చేసిన ఆఫీస్ కమ్ స్టూడియోలో స్టీరో డిస్కషన్లు, వీడియోల రూపకల్ప, యాడ్స్ షూటింగ్ వంటివి జరగున్నాయి. అత్యాధునికంగా డిజైన్‌తో ఆఫీస్ అంతా అబ్బుర పరిచేలా ఉంది. లోపల ఉండూ ఇంటీరియర్స్, ఫర్నీచర్ అంతా వావ్ అనిపించేలా ఉన్నాయి. ఆఫీస్‌లో గ్రీనరీ కూడా ఉండేలా ఏర్పాట్లు చేసుకుంది కంగనా. అక్కడక్కడ చిన్న చిన్న మొక్కలు మనకు కనిపిస్తుంటాయి. లైటింగ్ విషయంతో పాటు.. గోడలకు పేయింటింగ్స్ వేసే కలర్స్ విషయంలో కూడా డిజైనర్స్ చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. అక్కడ గోడలపై కొన్ని కొటేషన్స్ కూడా రాశారు. గాలి వెలుతురు కూడా ఆఫీస్ లోపల పుష్కలంగా వచ్చేలా కూడా జాగ్రత్తలు తీసుకున్నామని ఆఫీస్‌ను డిజైన్ చేసిన షబనం చెబుతున్నారు. మొత్తానికి కంగనా కొత్త ఆఫీస్ చూస్తూ... అందరూ నోరెళ్లబెట్టాల్సిందే.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2XXpXV9
v

బాలయ్య Vs నాగబాబు వివాదంలోకి మెగా ప్రిన్స్ ఎంట్రీ.. వరుణ్ తేజ్ వార్నింగ్ ఎవరికి?

‘మేంమంతా ఒక్కటే.. అనవసరంగా మీరే చించుకుంటారు’ అని మహేష్ బాబు లాంటి స్టార్ హీరో బహిరంగంగానే ఫ్యాన్స్‌ని ఉద్ధేశించి మాట్లాడినా.. హీరోల మధ్య చిన్న చిన్న విభేదాలు మాటలు వచ్చినప్పుడు మాత్రం ఫ్యాన్స్ తమ తమ విశ్వరూపం చూపిస్తున్నారు. చొక్కాలు చింపుకుని మరీ.. ఏయ్.. వేసేస్తాం పొడిచేస్తాం అంటూ పోటుగాళ్లలా పిచ్చి పిచ్చి కామెంట్స్ చేసి చివరికి ఎవరినైతే వీళ్లు భుజాన వేసుకుని బయలు దేరారో వాళ్లే భూజాలపై చేతులేసుకుని కిస్సులు పెట్టుకుంటుంటే వీళ్ల కోసమేనా మేం కొట్టుకుచచ్చింది అని సిగ్గు పడిన సందర్భాలు చాలానే ఉన్నాయి. ఇప్పుడు టాలీవుడ్‌లో బాలయ్య-నాగబాబుల మధ్య వైరం నందమూరి వర్సెస్ మెగా ఫ్యాన్స్ వైరంగా మారింది. తాజాగా ఇండస్ట్రీ పెద్దలు చిరంజీవి నేతృత్వంలో ప్రభుత్వంతో చర్చలు జరపడం.. ఆ చర్చలకు నందమూరి ఫ్యామిలీని దూరం పెట్టడంపై ఫైర్ అయ్యారు బాలయ్య. తనకు ఇండస్ట్రీలో ఏం జరుగుతుందో తెలియదని.. తనని ఆ చర్చలకు పిలవలేదని.. భూములు పంచుకోవడం కోసమే ఈ చర్చలు జరిపినట్టు ఉన్నారంటూ బాలయ్య చేసిన వ్యాఖ్యలు టాలీవుడ్‌లో దుమారం రేపాయి. అయితే బాలయ్య వ్యాఖ్యలపై మెగా బ్రదర్ ఓ రేంజ్‌లో ఫైర్ అయ్యారు.. పిలవలేదంటే పిలవలేదని అడగాలి కాని.. రియల్ ఎస్టేట్ అంటూ మాట్లాడటం తప్పు.. మర్యాదగా క్షమాపణ చెప్పాలి లేదంటే బాగోదని వార్నింగ్ ఇచ్చారు నాగబాబు. బాలయ్య వ్యాఖ్యలపై నాగబాబు స్పందన ఆయన వ్యక్తిగతమే అయినా.. నందమూరి ఫ్యామిలీ ప్రస్తావన తీసుకుని రావడంతో రాజధాని భూములు తదితర అంశాలను ప్రస్తావించడంపై వివాదం మరింత ముదిరింది. తరచూ చిన్న విషయానికి పెద్ద విషయానికి నాగబాబు.. బాలయ్యను టార్గెట్ చేయడంపై నందమూరి ఫ్యాన్స్ రియాక్ట్ అయ్యారు. సోషల్ మీడియాలో నాగబాబుని స్నేక్ బాబు, సూసైడ్ స్టార్ అంటూ ఓ రేంజ్‌లో ట్రోల్ చేస్తూ పాత విషయాలని తవ్వితీస్తున్నారు నందమూరి ఫ్యాన్స్. గతంలో బాలయ్య ఎవరో తెలియదు అంటూ కామెంట్స్ చేసిన నాగబాబు ఇప్పుడు ఏ బాలయ్యను క్షమాపణ చెప్పమంటున్నారు అంటూ బూతులు తిడితూ వీడియోలు పెడుతున్నారు బాలయ్య ఫ్యాన్స్. ఇక మెగా ఫ్యాన్స్ కూడా బాలయ్యకు మద్దతు ప్రకటిస్తూ బాలయ్య ఫ్యాన్స్‌‌కి గట్టి కౌంటర్లు ఇస్తున్నారు. మొత్తానికి మెగా-నందమూరి హీరోల ఫ్యాన్స్ వార్ నేపథ్యంలో నాగబాబు సన్.. మెగా ప్రిన్స్ చేసిన ట్వీట్ హాట్ టాపిక్ అవుతోంది. ఎవర్ని అన్నారు.. ఎందుకు అన్నారు.. చెప్పకుండానే మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఎక్కుపెట్టిన బుల్లెట్ దిగాల్సిన వాళ్లకు దిగిపోయింది. ‘చేతిలో గన్ ఉన్నవాళ్లతో మాట్లాడుకోవడాల్లేవ్’ అంటూ.. గన్ చేతిలో పట్టుకున్న గద్దలకొండ గణేష్ పోస్టర్‌ను ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు వరుణ్ తేజ్. అయితే సేమ్ టు సేమ్ అంటూ బాలయ్య గన్ పట్టుకుని గిరా గిరా తిప్పుతున్న వీడియోలతో సమాధానం ఇస్తున్నారు నందమూరి ఫ్యాన్స్. ఇక వరుణ్ తేజ్‌ని సైతం ట్రోల్ చేస్తూ బూతులు మొదలుపెట్టారు. ఇక వరుణ్ తేజ్ ట్వీట్‌కి మెగా ఫ్యాన్స్ రియాక్ట్ అవుతూ.. సూపర్ కౌంటర్ అదిరపోయిందన్నా.. అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి బాలయ్య వర్సెస్ నాగబాబు వార్‌లోకి మెగా ప్రిన్స్ ఎంట్రీ ఇవ్వడం వివాదం మరింత రంజుగా మారింది. Read Also:


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2yM2OfH
v

Balakrishna: ‘పిచ్చి కుక్కలతో జాగ్రత్త’.. ఫొటోతో మరింత రచ్చ రేపిన నాగబాబు

మెగా బ్రదర్ వెనక్కి తగ్గేట్టు కనిపించడంలేదు. బాలయ్యతో వైరానికి సై అంటే సై అంటున్నారు. ప్రభుత్వ పెద్దలతో ఇండస్ట్రీ పెద్దల మీటింగ్‌కి తనను పిలవ లేదంటూ బాలయ్య చేసిన వ్యాఖ్యల్ని ఖండిస్తూ.. తక్షణమే క్షమాపణ చెప్పాలి లేదంటూ బాగోదు అంటూ గట్టి వార్నింగ్ ఇచ్చారు నాగబాబు. అయితే బాలయ్య మాట్లాడిన తీరు తప్పు కావొచ్చు కాని ఆయన వాదనలో న్యాయం ఉందని అనేవారు కొందరైతే.. రియల్ ఎస్టేట్ లాంటి పదాలను ఉపయోగించాల్సింది కాదంటూ విమర్శలు వినిపిస్తున్నాయి. అయితే నాగబాబు వ్యాఖ్యలపై బాలయ్య ఫ్యాన్స్ తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. స్నేక్ బాబు, సూసైడ్ స్టార్ అంటూ నాగబాబుని ఓ రేంజ్‌లో ట్రోల్ చేస్తున్నారు. ఎన్నికల ముందు బాలయ్య ఎవరో తెలియదంటూ నోటి కొచ్చినట్టు మాట్టాడిన నాగబాబు.. బాలయ్య ఎవరో తెలియకుండానే క్షమాపణ చెప్పమంటున్నారా? ఇంతకీ నాగబాబు ఏ బాలయ్యకి క్షమాపణ చెప్పమన్నారంటూ సెటైర్లు వేస్తున్నారు. మరికొందరైతే నాగబాబుని పచ్చిబూతులు తిడుతూ బహిరంగంగానే విమర్శలు గుప్పిస్తున్నారు. నందమూరి ఫ్యాన్స్ అంతా ఏకమై మెగా బ్రదర్ నాగబాబుని టార్గెట్ చేసి ఓ రేంజ్‌లో ఆడుకుంటున్నారు. ఈ తరుణంలో తనను ట్రోల్ చేస్తున్న వారిని పిచ్చి కుక్కలతో పోల్చుతూ మరో వివాదాస్పద పోస్ట్ చేశారు నాగబాబు. పళ్లు బయటకు పెట్టి అరుస్తూ భయంకరంగా ఉన్న పిచ్చి కుక్క ఫొటోని ట్విట్టర్‌లో షేర్ చేస్తూ.. ఇది పిచ్చి కుక్కల కాలం అంటూ మంట పెట్టే పోస్ట్ పెట్టారు. ‘పిచ్చి కుక్కలు చాలా డేంజర్.. జాగ్రత్తగా ఉండాలని ప్రజారోగ్యశాఖ చెబుతోంది. అలాంటి కుక్కల్ని నిర్బంధంలోనైనా ఉంచాలి.. చంపేయాలి.. కానీ అలా వదిలేయకూడదు.. అవి జీవితాన్ని బలి తీసుకుంటాయి.. అసలే ఇది పిచ్చి కుక్కల సీజన్’ అంటూ ట్వీట్ చేశారు నాగబాబు. అయితే ఈ ట్వీట్‌కి జనసైనికులు ఓ రేంజ్‌లో రియాక్ట్ అవుతూ.. నాగబాబుకి కౌంటర్లు ఇస్తున్నారు. ‘అందుకే పిచ్చి కుక్కలైనా మిమ్మల్ని 1 కి పరిమితం చేసాం. అది కూడా ఇపుడు మా ట్రీట్మెంట్‌తో దారిలోకి వచ్చింది. నీకేమో పాపం కళ్ళు మండుతున్నట్టున్నాయి’ అంటూ బాలయ్య ఫ్యాన్స్ రియాక్ట్ అవుతున్నారు. పాలకొల్లు, భీమవరం, నర్సాపురం అంటూ పవన్, నాగబాబు, చిరంజీవి ఫొటోలను పెట్టి మరీ ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు బాలయ్య అభిమానులు. అయితే మెగా ఫ్యాన్స్ నాగబాబుకి మద్దతు ప్రకటిస్తూ బాలయ్య సినిమాల్లోని డైలాగ్‌లను ఫొటోలను కామెడీ కోసం వాడేస్తూ ట్రోల్ చేస్తున్నారు. మొత్తానికి అటు బాలయ్య, ఇటు నాగబాబుల కామెంట్స్ నందమూరి వర్సెస్ మెగా ఫ్యాన్స్ మధ్య వైరంగా మారాయి.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/36J2PNN
v

మహేష్ బాబు పాటతో మైండ్ బ్లాక్ చేసిన డేవిడ్ వార్నర్

సంక్రాంతి పండగకి వచ్చి తెలుగు ప్రేక్షకుల్ని అలరించిన సినిమా అనిల్ రావిపూడి కంబినేషన్ లో వచ్చిన ‘సరిలేరు నీకెవ్వరు’. థియేటర్ల వద్ద కలెక్షన్ల వర్షం కురిపించి.. బ్లాక్ బస్టర్ కా బాప్ హిట్ కొట్టిన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా సాంగ్స్ కూడా బాగా ఫేమస్ అయ్యాయి. అందులో మైండ్ బ్లాక్ పాటకు వచ్చిన రెస్పాన్స్ అంతా ఇంత కాదు. ఈ పాటలో మహేష్ స్టెప్పులు, రష్మిక చిందుల్ని అందర్నీ కట్టిపడేశాయి. తాజాగా ఈ పాటకు ప్రముఖ ఆస్ట్రేలియా బ్యాట్స్ మెన్, సన్ రైజర్స్ హైదరాబాద్ టీం కెఫ్టెన్ స్టెప్పులేశాడు. తన భార్యతో కలిసి మైండ్ బ్లాక్ పాటకు డాన్స్ వేసి నెటిజన్స్‌ను ఫిదా చేశాడు. డేవిడ్ వార్నర్‌పై మహేశ్ బాబు ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్ ఇస్తానంటూ నిన్నే సోషల్ మీడియా వేదికగా తెలిపాడు. కరోనాతో ఇంటికే పరిమితమైన ఈ ఆసీస్ క్రికెటర్ టిక్‌టాక్‌లో దూసుకుపోతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా తెలుగు డైలాగ్స్, పాటలతో అభిమానుల ఉర్రూతలూగిస్తున్నాడు. తన వైఫ్ క్యాండిస్‌తో కలిసిఅదరగొడుతున్నాడు. అల్లు అర్జున్ పాటలకు కూడా వార్నర్ చిందులేసిన విషయం తెలిసిందే. అలవైకుంఠపురం మూవీలోని 'రాములో రాములా'‌తో మొదలెట్టి 'బుట్టబొమ్మ'తో అదరగొట్టాడు. వార్నర్ వీడియోలపై అల్లు అర్జున్ సైతం స్పందించాడు. ఇక మహేష్ బాబు బ్లాక్ బస్టర్ మూవీ పోకిరి, ప్రభాస్ బాహుబలి డైలాగ్స్‌తో మెప్పించి తెలుగు ఫ్యాన్స్‌ను ఉర్రూతలూగిస్తున్నాడు. అంతే కాదు కమల్ హాసన్ పాటకు కూడా వార్నర్ డాన్స్ వేశాడు. దాదాపు అందరి హీరోలను కవర్ చేసిన వార్నర్.. అందరివాడయ్యాడు. దీంతో ఆయా హీరోల అభిమానులు వార్నర్‌కు స్పెషల్ రిక్వెస్ట్‌లు పెడుతున్నారు. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ ఫ్యాన్స్ కోరిక మేరకు పక్కా లోకల్ సాంగ్‌తో బర్త్‌డే విషెస్ చెప్పి వారిని ఆనందంలో ముంచెత్తాడు. వార్నర్ సౌతిండియన్ స్టార్స్‌ను సంబంధించి టిక్ టాక్ చేయడంతో తెలుగు అభిమానులకు ఇప్పుడు వార్నర్‌ మరింత దగ్గరవుతున్నాడు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3dsQwYs
v

త్రిబుల్ రోల్‌లో మహేష్ బాబు? బొమ్మ దద్దరిల్లిపోవాల్సిందేనా..‌!

లాక్ డౌన్‌తో ఇంటికే పరిమితమైన సోషల్ మీడియాలో మాత్రం నిత్యం ఏదో ఓ వార్తతో చక్కర్లు కొడుతున్నారు . మహేష్ ఫ్యామిలీకి సంబంధించిన ఏదో ఒక అప్ డేట్‌తో పాటు..ఆయన చేస్తున్న కొత్త సినిమాలకు సంబంధించిన తాజా వార్తలు నిత్యం టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారుతున్నాయి. సరిలేరు నీకెవ్వరూ సినిమా సక్సెస్‌తో మంచి ఊపు మీద ఉన్న మహేష్ అదే ఊపుతో పరుశురాంతో మరో సినిమాకు సిద్ధమైన విషయం తెలిసిందే. త్వరలో ఈ చిత్రానికి సంబంధించి అధికారిక ప్రకటన వెలువడుతోంది. అయితే అంతవరకు మహేష్ కొత్త సినిమాకు సంబంధించిన గాసిప్స్ మాత్రం ఆగడం లేదు. తాజాగా ఈ సినిమా టైటిల్ కూడా బయటకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ మధ్య మహేష్ కొత్త సినిమాకి 'సర్కారు వారి పాట' అనే టైటిల్ ప్రచారంలోకి వచ్చింది. ఇక మళ్ళీ ఇప్పుడు ఈ సినిమా గురించి మరో వార్త సినీ వర్గాల్లో చక్కర్లు కొడుతుంది. అదేంటంటే... ఈ సినిమాలో మహేష్ బాబు త్రిపాత్రాభినయం చేస్తున్నారని టాక్ వినిపిస్తోంది. అంటే మహేష్ మూడు పాత్రలో కనిపించనున్నారు అని వార్తలు వస్తున్నాయి. దీనికోసం మహేష్ కూడా వర్కౌట్ చేస్తూ కొత్త మేకోవర్ కోసం ప్రయత్నిస్తున్నాడని సమాచారం. అయితే ఈ సినిమా గురించి మహేష్ మాత్రం ఇప్పటివరకు స్పందించలేదు. ఈ నెల 31 అంటే రేపు ( ఆదివారం ) తన తండ్రి కృష్ణ గారి పుట్టిన రోజు సందర్బంగా సినిమా గురించి అధికారిక ప్రకటన చేస్తారు అని మహేష్ అభిమానులు ఎదురు చుస్తునారు. మరోవైపు ఇప్పటికే మహేష్ యంగ్ లుక్‌లో కనిపిస్తున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 40 ఏళ్ల వయస్సులో మహేష్ 20 ఏళ్ల కుర్రాడిలో కనిపిస్తున్నారంటూ ఆయన అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు. అయితే పలువురు హీరోలు ఇంతవరకు డబుల్ రోల్, త్రిబుల్ రోల్ చేసిన విషయం తెలిసిందే. జూనియర్ ఎన్టీఆర్ జై లవకుశ సినిమాలో త్రిపాత్రభినయంతో మెప్పించారు. అయితే మహేష్ మాత్రం ఇంతవరకు ఏ సినిమాలో కూడా డబుల్ రోల్, త్రిబుల్ రోల్ చేసింది లేదు. ఇప్పుడు మహేష్ కొత్తగా త్రిపాత్రాభినయం చేస్తారన్న వార్తలతో ఆయన అభిమానులు మరిం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2XdmGSa
v

Attack: శృంగార నటి కుమారుడిపై కత్తులతో దాడి

కొడుకుపై కొందరు కత్తులతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. చెన్నై విరుగంబాక్కంలో ఉంటున్న మాయ ఇంటికి గురువారం రాత్రి ఎనిమిది మంది గుర్తు తెలియని వ్యక్తులు చొరబడి ఆమె కొడుకు విక్కీపై కత్తులదో దాడి చేశారు. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు దుండగులను పట్టుకునే ప్రయత్నం చేశారు. అయితే వారు అక్కడి నుంచి పరారయ్యారు. అయితే ఈ దాడిలో విక్కీకి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో అతన్ని స్థానికులు స్థానికంగా ఉన్న వడపళనిలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ప్రస్తుతం అతని ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు. మరోవైపు నుంగంబాక్కం పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. అయితే విక్కీ మద్యం సేవిస్తూ తరచూ స్థానికులతో గొడవ పడుతుంటాడని, అతని బాధితులు ఆరోపిస్తున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/36KnuBg
v

Friday 29 May 2020

శ్రీదేవిపై కీలక వ్యాఖ్యలు చేసిన మాధురి దీక్షిత్

అతిలోక సుందరి శ్రీదేవి మనందర్నీ విడిచి వెళ్లిన విషయం తెలిసింది. అయితే ఆమె చనిపోయిన ఇన్నాళ్ల తర్వాత... బాలీవుడ్‌లో ఒకప్పటి స్టార్ హీరోయిన్ మాధురి దీక్షిత్, శ్రీదేవిపై కీలక వ్యాఖ్యలు చేసింది. తనకు, శ్రీదేవికి మధ్య ఏనాడూ పోటీలేదని ఆమె పేర్కొంది. వీరిద్దరూ ఒకప్పుడు హీరోయిన్లుగా బాలీవుడ్‌ను షేక్ చేశారు. అనేక హిట్లు అందుకోవడంతోపాటు కోట్లాది అభిమానుల్ని సంపాదించుకున్నారు. ఈ నేపథ్యంలో అప్పట్లో శ్రీదేవి, మాధురీకి మధ్య పోటీ ఉందని చెప్పుకొనేవాళ్లు. తాజాగా మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాధురీని ఇదే ప్రశ్న అడిగారు. దీనిపై స్పందించిన ఆమె 'శ్రీదేవికి వృత్తిపట్ల అంకితభావం చాలా ఎక్కువ. ఆమె తన మొత్తం జీవితాన్ని నటనకే అంకితం చేశారు. ఆమె చేసిన సినిమాల్లో ఐదో భాగం కూడా నేను చేయలేదు. మా మధ్య ఎటువంటి పోటీ లేదు. మేం రేసు గుర్రాలం కాదు, కాబట్టి ఎవరు ముందు ఉన్నారనే విషయం గురించి ఆలోచించకండి' అని పేర్కొన్నారు. ఆ తర్వాత కరోనా వైరస్ లాక్‌డౌన్‌లో జీవితం గురించి మాట్లాడుతూ.. 'సమయం లేదని మనం ఎప్పుడూ అంటుంటాం. పనులతో తీరిక లేకుండా గడుపుతుంటాం. కానీ, ఇప్పుడు ఓ కారణం వల్ల కుటుంబ సభ్యులతో కలిసి సమయం గడిపే అవకాశం వచ్చింది. నేను కథక్‌ సాధన చేస్తున్నా. వంట కూడా చేస్తూ.. నన్ను నేను బిజీగా ఉంచుకుంటున్నా' అని అన్నారు. మాధురీ 'కళంక్‌' సినిమాతో 2019లో బాలీవుడ్‌లో రీ ఎంట్రీ ఇచ్చి మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ప్రస్తుతం ధర్మ ప్రొడక్షన్స్‌ తీస్తున్న నెట్‌ఫ్లిక్‌ సిరీస్‌లో నటిస్తున్నారు. 'డ్యాన్స్‌ దివానే' షోకు న్యాయనిర్ణేతగా పనిచేస్తున్నారు. మాధురీ తొలిసారి పాడిన పాటను కొన్ని రోజుల క్రితం విడుదల చేశారు. ప్రస్తుతం మాధురి వయసు 53 ఏళ్లు. పూర్తి పూరు మాధురి శంకర్ దీక్షిత్. ఆమెది మరాఠికి చెందిన బ్రాహ్మణ కుటుంబం. 1984లో మాధురి దీక్షిత్ "అబోద్" సినిమాతో వెండితెరకు పరిచయం అయ్యారు. 2003 లో ఆమె పేరు మీదగా "మై మాధురి దీక్షిత్ బన్నా చాహ్తీ హుం" అనే సినిమా విడుదల అయ్యింది. ఈ చిత్రంలో అంత్ర మాలి నటించారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2ZQjrlB
v

జగన్ ఏడాది పాలనపై ‘యాత్ర’ దర్శకుడి వీడియో.. 90 శాతం హామీలు అమలు!

తండ్రి వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి బాటలో నడుస్తూ నూతన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాదయాత్ర చేసి ప్రజల మనసులు గెలుచుకున్నారు వైఎస్సార్‌సీపీ అధినేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి. 151 సీట్లతో ఇప్పటి వరకూ ఎవరికీ సాధ్యం కాని రీతిలో ఘన విజయం సాధించి నవ్యాంధ్ర సీఎం పీఠం ఎక్కారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసి మే 30కి ఏడాది పూర్తవుతుంది. ఈ సందర్భంగా ‘యాత్ర’ సినిమా దర్శకుడు మహి వి రాఘవ్.. జగన్ ఏడాది పాలనపై ఒక ప్రత్యేక వీడియోను చేశారు. ఈ వీడియోను జగన్‌కు అంకితం ఇచ్చారు. ‘వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి అనే నేను’.. అని జగన్ ప్రమాణస్వీకారం చేసిన విజువల్‌తో ఈ వీడియోను మొదలుపెట్టారు మహి. ఈ ఏడాది కాలంలో జగన్ తీసుకున్న నిర్ణయాలు, అమల్లోకి వచ్చిన పథకాలను ఈ వీడియోలో చూపించారు. ‘‘ఈ మధ్యకాలంలో నా మతం, నా కులం గురించి కూడా మాట్లాడుతున్నారు. నా మతం మానవత్వం అని ఈ వేదిక మీద నుంచి తెలియజేస్తున్నా’’ అని బహిరంగ సభలో జగన్ చెప్పిన మాట వీడియోలో హైలైట్‌గా ఉంది. ‘తొలి యేడు - జగనన్న తోడు’ అనే క్యాప్షన్‌తో వీడియోను ముగించారు. అంతేకాదు, ఏడాది పాలనలో మేనిఫెస్టో చెప్పిన 90 శాతం పైగా హామీలు అమలయ్యాయని పేర్కొన్నారు. Also Read: మొత్తం మీద ఈ వీడియో వైఎస్సార్‌సీపీ శ్రేణులకు, జగన్ అభిమానులకు అదిరిపోయే గిఫ్ట్ అనే చెప్పుకోవాలి. వాళ్లలో ఉత్తేజాన్ని నింపే వీడియో. తన సుదీర్ఘ పాదయాత్రతో ప్రజల కష్టాలను తెలుసుకున్నాని చెప్పిన జగన్.. జనం కష్టాలను తీర్చడానికి ‘నవరత్నాలు’ తీసుకొచ్చారు. తన తండ్రి బాటలో నడుస్తూ.. సంక్షేమానికి పెద్ద పీట వేస్తున్నారు. ఈ నవరత్నాల అమలను ప్రధానం చేసుకునే మహి వి రాఘవ్ ఈ వీడియో చేశారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2B7iAlY
v

‘డెలివరీ బోయ్’గా మారిన నోయల్.. సపోర్ట్ చేయమంటోన్న రాహుల్

ఇంట్లో కూర్చొని మొబైల్‌లో చాలా సింపుల్‌గా మనకు ఇష్టమైన ఫుడ్‌ను ఆర్డర్ చేస్తే చాలు.. డెలివరీ బోయ్ అటుఇటుగా అరగంటలో పార్సిల్‌ను మన ముందు ఉంచుతాడు. కంపెనీ నుంచి వచ్చే ఒత్తిడి.. కస్టమర్‌కు సమయానికి ఫుడ్ అందజేయాలనే బాధ్యతతో ట్రాఫిక్ బారులు తీరినా ఎలాగోలా కష్టపడి ఆన్ టైమ్‌లో పార్సిల్ మన గుమ్మం ముందు పెడతాడు డెలివరీ బోయ్. లాక్‌డౌన్ సమయంలో అందరూ ఇళ్లలో ఉన్నా ముఖానికి మాస్క్ వేసుకుని మరీ ఫుడ్ డెలివరీ చేశాడు. అందుకే, అలాంటి డెలివరీ బోయ్‌కి ప్రముఖ ర్యాప్ సింగర్ నోయల్ సీన్ ఒక పాటను అంకితం ఇచ్చారు. ‘హే డెలివరీ బోయ్’ అంటూ అదిరిపోయే ర్యాప్ సాంగ్‌ను సంగీత ప్రియులకు అందించారు. Also Read: నోయల్ స్వయంగా రాసిన ఈ పాటను సింగర్ మోహన భోగరాజుతో కలిసి ఆలపించారు. ఎబెనెజర్ పాల్ స్వరపరిచారు. వినయ్ కుమార్ ఫైనల్ మిక్స్ చేశారు. అమీర్ సినిమాటోగ్రఫీ అందించారు. రాజేష్ కొరియోగ్రఫీ చేశారు. బ్లూ ర్యాబిట్ ఎంటర్‌టైన్మెంట్ సంస్థ ఈ పాటను నిర్మించింది. పాటలో నోయల్ ర్యాప్ చాలా బాగుంది. చాలా సింపుల్ పదాలతో అందరికీ అర్థమయ్యే విధంగా డెలివరీ బోయ్ మనసులోని మాటలను పాట రూపంలో చెప్పారు. ఈ పాటను మరో సింగర్, బిగ్ బాస్ తెలుగు సీజన్ 3 విన్నర్ రాహుల్ సిప్లిగంజ్ ప్రమోట్ చేస్తున్నారు. ‘‘మన అన్న నోయల్ సీన్ ‘డెలివరీ బోయ్’ మ్యూజికల్ వీడియో లీకయ్యింది, రిలీజ్ కూడా అయ్యింది. మీరంతా ఈ పాటను చూడండి. మీ సోషల్ మీడియా హ్యాండిల్స్‌లో షేర్ చేయండి. దయచేసి ప్రోత్సహించండి. ఇండిపెండెంట్ మ్యూజిక్ అండ్ ఆర్టిస్ట్’’ అని రాహుల్ సిప్లిగంజ్ ట్వీట్ చేశారు. రాహుల్ సిప్లిగంజ్, నోయల్ మంచి స్నేహితులు. అందుకే, నోయల్ పాటను రాహుల్ ప్రమోట్ చేస్తున్నారు. చూద్దాం ఈ పాటకు సంగీత ప్రియుల నుంచి ఎలాంటి ప్రశంసలు అందుకుంటుందో!


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2yKsBVr
v

వలసకూలీ వ్యధపై హరీష్ శంకర్.. కళ్లు చెమర్చే పోస్ట్

అగమ్యగోచరంగా వలస కూలీల బతుకులు.. కరోనా మహమ్మారితో దేశవ్యాప్తంగా వలసకూలీలు బతుకులు కకావికలమవుతున్నాయి.. ఉన్న చోట ఉందాం.. కడుపు నిండా తిందాం అంటే బతుకులు రెక్కాడితే కాని డొక్కాడని పరిస్థితి. పోనీ సొంత ఊర్లకు వెళ్లిపోదాం అంటే రవాణా సౌకర్యాలు లేవు. కాలి నడకే బతుకు బాట అయ్యింది. కరోనా వైరస్ తమని ఎక్కడ కబళిస్తుందోనన్న భయంతో.. ఈ కాలే కడుపుల బాధలు వర్ణానాతీతం. బిడ్డల్ని చంకనెట్టుకున్న తల్లి.. కాళ్లకు చెప్పులు కూడా లేని బిడ్డ.. రక్తమోడుతున్న పని కాళ్లు.. కడుపు తరుక్కుపోయే వలస కూలీ ధీన గాధ.. వందల, వేల కిలోమీటర్లు నడుస్తూ మార్గం మధ్యలోనే చనిపోతున్న ఈ వలస కూలీల బతుకుల్ని కళ్లకు కడుతూ కంటతడిపెట్టించేలా కవిత రాశారు దర్శకుడు . ‘బండరాళ్లని పిండి చేసిన చేతులు ఎడమపక్క డొక్క నొప్పికి లొంగిపోయాయి. పెద్ద పెద్ద ఇనుప చువ్వలని వంచిన వేళ్ళు మెత్తని పేగుల ముందు ఓడిపోయాయి. మేం వేసిన రోడ్లే మమ్మల్ని వెక్కిరిస్తుంటే బతకడం కోసం ఊరొదిలొచ్చిన మేము చచ్చేలోపు ఊరెళితే చాలనుకుంటూ.. ఆకలి అడుగులతో.. పేగులు అరుపులతో.. కాళ్లు, కడుపు ఒకేసారి కాలుతుంటే .. మమ్మల్ని చూసే లోకులకి బాధేస్తోంది.. జాలేస్తోంది.. కానీ మాకు మాత్రం ‘ఆకలేస్తోంది’!! నిస్సహాయతతో..’’ అంటూ మనసును కదిలించేలా రాసారు హరీష్ శంకర్.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3eyUtLk
v

బహుశా నేనే ఫస్ట్ ఆర్టిస్ట్.. సీఎం గారికి థ్యాంక్స్: సీనియర్ నటుడు నరేష్

తెలుగు సినిమా పరిశ్రమకు మళ్లీ పాత రోజులు వస్తున్నాయి. కరోనా మహమ్మారి కారణంగా రెండు నెలలకు పైగా ఆగిపోయిన సినిమా పనులు తిరిగి ప్రారంభమవుతున్నాయి. ప్రస్తుతానికి ప్రభుత్వ అనుమతితో పోస్ట్ ప్రొడక్షన్ పనులను ప్రారంభిస్తున్నారు. దీనిలో భాగంగా సీనియర్ నటుడు, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు వీకే నరేష్.. ‘జాతిరత్నాలు’ సినిమా కోసం డబ్బింగ్ మొదలుపెట్టారు. శుక్రవారం రామానాయుడు స్టూడియోలోని డబ్బింగ్ థియేటర్‌లో తన పాత్రకు డబ్బింగ్ చెప్పుకున్నారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ఈ మేరకు ఒక వీడియోను ట్వీట్ చేశారు. ‘‘నిన్న ప్రభుత్వం తెలుగు సినిమా పరిశ్రమకు అభయం ఇస్తూ, ధైర్యం ఇస్తూ, ఫ్రీడమ్ కూడా ఇచ్చింది. థాంక్యూ వెరీ మచ్ ముఖ్యమంత్రి గారికి. ఈరోజున మొట్టమొదటి సారిగా డబ్బింగ్ థియేటర్ ఓపెన్ చేసి ‘జాతిరత్నాలు’ సినిమాకి డబ్బింగ్ స్టార్ట్ చేశాం. బహుశా నేనే ఫస్ట్ ఆర్టిస్ట్‌ని అనుకుంటున్నాను. ఇండస్ట్రీ బాగుండాలి. పది మందికి పని జరగాలి. ధైర్యంగా ముందుకు వెళ్దాం. జాగ్రత్తలు తీసుకుందాం. ప్రభుత్వం, పరిశ్రమ ఎటువంటి సలహాలు, సూచనలు ఇచ్చినా పాటించి కచ్చితంగా ప్రభుత్వం మన మీద పెట్టిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా చక్కగా ఇండస్ట్రీని ముందుకు తీసుకువెళ్దాం’’ అని నరేష్ వీడియోలో వెల్లడించారు. Also Read: ఒక సీనియర్ ఆర్టిస్ట్‌గా, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా డబ్బింగ్ కార్యక్రమాన్ని తొలుత తాను ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందని నరేష్ అన్నారు. ‘జాతి రత్నాలు’ సినిమాతోనే రామానాయుడు స్టూడియోలోని డబ్బింగ్ థియేటర్ లాక్‌డౌన్ తరవాత తిరిగి తెరుచుకుందని నరేష్ తెలిపారు. ఇండస్ట్రీ బాగు కోసం అందరం ఆ దేవుడిని ప్రార్థిద్దామని అన్నారు. డబ్బింగ్ థియేటర్‌లో తాను డబ్బింగ్ చెబుతున్న స్టిల్స్‌ను కూడా ఈ వీడియోలో నరేష్ పొందుపరిచారు. కరోనాతో మనమంతా కలిసి జీవించాల్సి ఉందని.. కాబట్టి అన్ని జాగ్రత్తలు తీసుకొని ఒక బోల్డ్ స్టెప్‌తో ముందుకు వెళ్లక తప్పదని నరేష్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు. తన నిర్ణయం సహచర నటీనటులకు ప్రేరణగా నిలవాలన్నారు. కాగా, ‘జాతిరత్నాలు’ సినిమాను స్వప్న సినిమా బ్యానర్‌పై నాగ్ అశ్విన్ నిర్మిస్తున్నారు. అనుదీప్ కేవీ దర్శకత్వం వహించారు. నవీన్ పొలిశెట్టి, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రలు పోషించారు. మురళీ శర్మ, వీకే నరేష్, బ్రహ్మాజి, తనికెళ్ల భరణి ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. రథన్ సంగీతం సమకూరుస్తున్నారు. మనోహర్ సిద్ధమ్ సినిమాటోగ్రఫీ అందించారు. కామెడీ డ్రామాగా తెరకెక్కుతోన్న ఈ సినిమా థియేటర్లు తెరుచుకున్నాక విడుదలయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్‌లో నవీన్, రాహుల్, ప్రియదర్శి ఖైదీలుగా కనిపించారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2ZOR0ED
v

Actress Sai Sudha: నటి సాయి సుధకు పెళ్లి పేరుతో మోసం.. శ్యామ్ కె నాయుడు అరెస్ట్

నటి సాయి సుధతో సహజీవనం చేసి పెళ్లికి నిరాకరించి మోసం చేసిన కేసులో ప్రముఖ సినిమాటోగ్రాఫర్ శ్యామ్ కె నాయుడుని పోలీసులు అరెస్ట్ చేశారు. చోటా కె నాయుడు తమ్ముడు తనను పెళ్లి చేసుకుంటానని ప్రామిస్ చేసి తనతో సహజీవనం చేసి శారీరకంగా దగ్గరయ్యారని, కానీ ఇప్పుడు పెళ్లి చేసుకోవడానికి అంగీకరించడంలేదని నటి హైదరాబాద్‌లోని ఎస్.ఆర్.నగర్ పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఫిర్యాదును స్వీకరించిన తరవాత శ్యామ్‌ కె నాయుడుని ప్రశ్నించిన పోలీసులు.. విచారణ చేపట్టారు. వీరి విచారణలో శ్యామ్ కె నాయుడు.. సాయి సుధతో ఆరు నెలలు సహజీవనం చేశారని.. ఇటీవల వీరి మధ్య దూరం పెరగడంతో ఇద్దరినీ పోలీస్ స్టేషన్‌కు పిలిచి వారి మధ్య ఉన్న సమస్యలను పరిష్కరించడానికి ప్రయత్నించారు. అయితే ఇద్దరి మధ్య రాజీ ప్రయత్నాలు ఫలించకపోవడంతో.. శ్యామ్ కె నాయుడుపై ఐపీసీ సెక్షన్ 493 కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేసిన పోలీసులు రిమాండ్‌కి తరలించారు. ఇక సాయి సుధ విషయానికి వస్తే.. గుంటూరుకు చెందిన ఈమె ఫిజియోథెరపీ డాక్టర్. కొన్నాళ్ల పాటు డాక్టర్‌గా పనిచేసిన సాయి సుధ సినిమాలపై ఉన్న ఆసక్తితో డాక్టర్ ఉద్యోగం వదిలేసి యాక్టర్‌గా ట్రై చేశారు. బాడీగార్డ్, దమ్ము, అవును, అర్జున్ రెడ్డి, ఎవరు తదితర చిత్రాల్లో నటించారు సాయి సుధ. 2015 నుంచి శ్యాం కె నాయుడుతో రిలేషన్‌లో ఉన్న సాయి సుధ.. పలుమార్లు ఆయనతో పెళ్లి ప్రస్తావన తీసుకువచ్చినా లాభం లేకుండా పోయిందని.. శ్యాం కె నాయుడు అన్నయ్య చోటా కే నాయుడు తమకు పెళ్లి చేయిస్తానని మాట ఇచ్చారని ఇప్పుడు ఎవరూ స్పందించకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు మీడియాకి వివరించారు. అయితే గతంలో టాలీవుడ్ ఇండస్ట్రీని కుదిపేసిన డ్రగ్స్ కేసులో కూడా శ్యామ్ కే నాయుడు పేరు ప్రముఖంగా వినిపించింది. పూరీకి డ్రగ్స్ చేరవేసింది శ్యామ్ కే నాయుడే అంటూ అప్పట్లో మీడియాలో కథనాలు వచ్చాయి.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2XzQ3wU
v

నన్నే ఎవరూ పిలవలేదు.. నేను బాలయ్యను పిలవాలా: సి.కళ్యాణ్‌కు నరేష్ కౌంటర్

తెలుగు సినీ పరిశ్రమ పెద్దలు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌తో చర్చలు జరపడంపై నటుడు నందమూరి సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ప్రభుత్వంతో ఏం చర్చలు జరుగుతున్నాయో తనకు తెలీదని, అసలు ఆ చర్చలకు తనను ఎవరు పిలిచారని బాలయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో బాలకృష్ణ వ్యాఖ్యలు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారాయి. బాలకృష్ణ వ్యాఖ్యలపై ఇప్పటికే నిర్మాత సి.కళ్యాణ్, మెగా బ్రదర్ నాగబాబు స్పందించారు. తన వ్యాఖ్యలపై బాలయ్య క్షమాపణలు చెప్పాలని నాగబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. Also Read: ఇండస్ట్రీలో ఎవరినీ ఎవరూ ఈ చర్చలకు పిలవలేదని, ఎవరికి వారు తమ సమస్యలు ప్రభుత్వానికి చెప్పుకోవడానికి ముందుకు వచ్చారని సి.కళ్యాణ్ అన్నారు. బాలకృష్ణ వస్తే ఎవరూ కాదనరని కూడా అన్నారు. అంతేకాకుండా, చిరంజీవి నివాసంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సారథ్యంలో జరిగిన సమావేశానికి, ముఖ్యమంత్రి కేసీఆర్‌తో జరిగిన భేటీకి బాలకృష్ణను పిలుచుకోవాల్సిన బాధ్యత మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా)దేనని సి.కళ్యాణ్ చెప్పినట్టు ఓ వెబ్‌సైట్ రాసింది. అయితే, సి.కళ్యాణ్ వ్యాఖ్యలపై ‘మా’ అధ్యక్షుడు వీకే నరేష్ స్పందించారు. సి.కళ్యాణ్ వ్యాఖ్యలు తనను షాక్‌కు గురిచేశాయని అన్నారు. ఈ మేరకు ఆ వెబ్‌సైట్‌లో ప్రచురించిన వార్తను స్క్రీన్ షాట్ తీసి నరేష్ ట్వీట్ చేశారు. Also Read: ‘‘సీఎం గారు, చిరంజీవి గారితో సమావేశాలకు బాలకృష్ణ గారిని ఆహ్వానించాల్సిన బాధ్యత ‘మా’ది అని సి.కళ్యాణ్ గారు ఇచ్చిన స్టేట్‌మెంట్ చూసి నేను షాక్‌కు గురయ్యాను. ఒక ‘మా’ ప్రెసిడెంట్‌‌గా నన్ను కానీ, మా జనరల్ సెక్రటరీని కానీ ఏ సమావేశాలకు పిలవలేదు. అలాంటిది, ఈ మీటింగ్‌లకు వేరొకరిని ఎలా ఆహ్వానించగలను’’ అని ట్వీట్‌లో నరేష్ ప్రశ్నించారు. అయితే, కారణం ఏమిటో తెలీదు కానీ ఈ ట్వీట్‌ను కాసేపటికే నరేష్ డిలీట్ చేశారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/36GBD2d
v

Naga Babu: ‘బాలయ్య డబ్బులు కావాలి.. బాలయ్య వద్దా? క్షమాపణ ఏ బాలయ్య చెప్పాలి నాగబాబూ?’

నిజమే.. నందమూరి బాలకృష్ణ మాట్లాడిన దాంట్లోనూ న్యాయం ఉంది. ఇండస్ట్రీ పెద్దలు ఆస్తులు పంచుకునేందుకే తెలంగాణ ప్రభుత్వంతో చర్చలు జరిపారనే కామెంట్స్ ఇబ్బందికరమైనవే అయినా ఆయన్ని పిలవకపోవడం అనేది డిబేటబుల్. సర్ సర్ లే.. మమ్మల్ని మాత్రం పిలిచారా?? నేను మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్‌ని అని నరేష్ ఎందుకొచ్చిన గొడవలే అనుకుని సర్దిచెప్పుకున్నా.. మహేష్ బాబు, మోహన్ బాబు లాంటి వాళ్లు సైలెంట్‌గా ఉన్నా.. వారి మాదిరే బాలయ్య కూడా సైలెంట్‌గా ఉండాలని అనుకోలేం. ఎందుకుంటే బాలయ్యకి కాలితే ప్రాణం పెట్టే ఫ్యాన్స్‌నే వీరి ఉతుకుడు ఉతికేస్తారు. అలాంటిది తన ఇగోని హర్ట్ చేస్తే ఈ మాత్రం రియాక్షన్ ఉండటంలో పెద్ద ఆశ్చర్యం లేదు. అయితే బాలయ్య తనను పిలవలేదనే బలమైన వాదనతో పాటు.. రియల్ ఎస్టేట్ అదీ ఇదీ అంటూ నోరు జారటం ఆయన వాదనను బలహీన పరిచిందనే చెప్పాలి. ఆవేశంలో ఆ మాట అన్నారో.. ఆ చర్చల వెనుకు నిజంగానే ఏదైనా మర్మం ఉందో తెలియదు కాని.. బాలయ్య వ్యాఖ్యలపై నాగబాబు ఫైర్ అయిన తీరు మెగా వర్సెస్ నందమూరి ఫ్యామిలీల మధ్య వైరంగా మారాయి. ఎన్నికల ముందు అంతా నా ఇష్టం అంటూ యూట్యూబ్ ఛానల్‌ ఓపెన్ చేసిన నాగబాబు.. నందమూరి బాలకృష్ణను ఓ రేంజ్‌లో టార్గెట్ చేసి ఎపిసోడ్‌ల వారీగా ఆయనపై సంచలన కామెంట్స్ చేశారు. బాలయ్య ఎవరో తనకు తెలియదని.. పెద్ద ఫ్యామిలీ అంటే ఏంటి?? అంటూ వివాదాస్పద వీడియోలతో రచ్చ రచ్చ చేశారు నాగబాబు. అయితే నాగబాబు చేసిన వ్యాఖ్యలపై సైలెంట్‌గానే ఉండిపోయారు బాలయ్య. అప్పటి నుంచి బాలయ్య ఫ్యాన్స్ సైతం సైలెంట్‌గానే ఉన్నారు. అయితే తాజా ఇష్యూతో బాలయ్యపై నిప్పులు చెరుగుతూ నోటి కొచ్చినట్టు మాట్లాడితే ఊరకునేది లేదని.. వెంటనే బాలయ్య క్షమాపణ చెప్పాలంటూ నాగబాబు డిమాండ్ చేయడంతో బాలయ్య అభిమానుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. దీంతో నాగబాబుకు కౌంటర్ ఎటాక్ ఇస్తూ స్నేక్ బాబు, సూసైడ్ బాబు అంటూ ఓ రేంజ్‌లో టార్గెట్ చేశారు బాలయ్య ఫ్యాన్స్. ఈ సందర్భంగా నాగబాబుకి ప్రశ్నలు సంధిస్తున్నారు. ‘ఆయన 25 లక్షల రూపాయలు కరోనా క్రైసిస్ చారిటీ కి ఇచ్చారు, అవి తీసుకున్న వాళ్ళు మీటింగ్ కి పిలవలేరా?? అవి తీసుకోటం గుర్తుంది కానీ మీటింగ్ కి పిలవడం గుర్తు లేదా? అయినా కరోనా క్రిసిస్ చారిటీ కి నువ్వెంత ఇచ్చావ్ నాగ బాబు? నువ్ మాట్లాడేవాడివా?? అంటూ నాగబాబుపై మండి పడుతున్నారు బాలయ్య ఫ్యాన్స్. మరో అభిమాని స్పందిస్తూ.. ‘బాలయ్య ఎవరో నాకు తెలీదు అన్నావ్, ఎన్నికల ముందు ఆయన మీద విషం కక్కావ్.అప్పుడు కూడా ఆయన స్థాయి తన స్థాయి దిగి నీకు రిప్లయ్ ఇవ్వలేదు అయినా ఇప్పుడు బాలయ్య క్షమాపణ చెప్పాలి అంటున్నావ్... ఏ బాలయ్య చెప్పాలి? నీకు వేరే బాలయ్య తెలుసు కదా ఆయన్ని అడుగు’ అంటూ నాగబాబు గట్టి కౌంటర్స్ ఇస్తున్నారు. ‘మా బాలయ్య బాబు క్షమాపణ చెప్పాలా.. కాన్సర్ హాస్పిటల్ మీద ఇప్పటికి ఒక్క ఆరోపణ ఉందా? ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నా ఒక్కరన్నా ఆయన చేసే సేవ గురించి మాట్లాడారా?? మీ బ్లడ్ బ్యాంక్ మీద ఎన్ని ఆరోపణలు ఉన్నాయో చెప్పాలా?? నిన్ను వదిలే సమస్య లేదు సూసైడ్ స్టార్’ అంటూ నాగబాబుని హెచ్చరిస్తూ ట్రోల్ చేస్తున్నారు నందమూరి ఫ్యాన్స్.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2yJArP7
v

రెచ్చిపోయిన ఈషా రెబ్బా.. గేరు మార్చి అందాల వడ్డన.. పిక్స్ చూస్తే ఆ మాట అనాల్సిందే!

ఈ మధ్యకాలంలో హీరోయిన్స్ అందాల వడ్డనకు హద్దు అదుపు లేకుండా పోతోంది. వేగంగా విస్తరిస్తున్న టెక్నాలజీని అందిపుచ్చుకుంటూ సోషల్ మీడియాలో అందాలతో మాయ చేస్తున్నారు నేటితరం హీరోయిన్స్. అవకాశాలు అందిపుచ్చుకోవడం లోనూ, ఫాలోయింగ్ పెంచుకోవడంలోనూ ఇదే సరైన మార్గం అని గమనించి సెగలు రేపే ఫోటో షూట్స్‌లో పాల్గొంటూ వాటిని సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసి రచ్చ చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా యంగ్ అండ్ టాలెంటెడ్ బ్యూటీ షేర్ చేసిన కొన్ని పిక్స్ నెట్టింట వైరల్ అవుతూ యువ హృదయాలను కొల్లగొడుతున్నాయి. ఈ ఫొటోల్లో తెల్ల చొక్కా వేసుకొని కనిపిస్తున్న ఈషా.. మత్తెక్కించే కళ్ళలో మాయ చేస్తోంది. ఇక ఈ పిక్స్ చూస్తుంటే ఈషా ప్యాంట్ వేసుకోవడం మర్చిపోయిందా? లేక కావాలనే అందాలతో అలా ఆకర్షించిందా? అనే సందేహం కలుగుతోంది. ఈషాను ఇలా చూసిన ప్రతి వ్యక్తి వావ్! అనక తప్పదేమో అనిపిస్తోంది. ఏదేమైనా ఆమె గ్లామర్ డోస్ మాత్రం సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. నెటిజన్లంతా ఈ పిక్స్ చూసి మైమరచిపోతూ తమదైన స్టైల్‌లో రియాక్ట్ అవుతున్నారు. ''సెక్సీ స్టార్, సూపర్, బ్యూటిఫుల్, అందానికే అందం ఈషా'' అంటూ తెగ కామెంట్స్ చేస్తున్నారు. ‘అంతకు ముందు ఆ తర్వాత’ సినిమాతో సినీరంగ ప్రవేశం చేసిన అచ్చ తెలుగు భామ ఈషా రెబ్బా.. ఆ తర్వాత కొన్ని సినిమాల్లో నటించినా అవకాశాలను అందిపుచ్చుకోవడంలో సక్సెస్ కాలేకపోతోంది. అందం, టాలెంట్ రెండూ ఉన్నా తెరపై పద్దతిగా కనిపిస్తుండటంతో అవేవీ అంతగా కలసిరావడం లేదు. దీంతో గేరు మార్చిన ఈ అమ్మడు.. గత కొంతకాలంగా హాట్ హాట్ ఫోటో షూట్స్ చేస్తూ రెచ్చిపోతోంది. Also Read: మొన్న‌టి దాకా కాస్త ప‌ద్ద‌తిగానే కనిపించిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు మాత్రం స్విమ్ సూట్ వ‌ర‌కు వ‌చ్చేసింది. కథ డిమాండ్ చేస్తే బికినీకి కూడా సై అని చెప్పకనే చెబుతోంది. ''అమీతుమీ, అ!, అరవింద సమేత'' లాంటి సినిమాల్లో నటించిన ఆమె ఈ మధ్యే సత్యదేవ్ హీరోగా వచ్చిన 'రాగల 24 గంటల్లో' సినిమాలో కనిపించింది. ఇక ఇప్పుడు అందాలతో దర్శకనిర్మాతలకు గ్యాలం వేసే పని పెట్టుకుంది. చూద్దాం మరి ఈషా గ్లామర్ ట్రీట్ ఆమెకు‌ వరుస అవకాశాలు తెచ్చిపెడుతుందా? లేదా? అనేది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2zKj5SP
v

రకుల్‌కి ఉక్కబోత.. షర్ట్ బటన్స్ మొత్తం విప్పేసి బయటపెట్టేసిందంతా

వేసవి తాపమో.. ఆరబోయాలన్న ఆరాటమో తెలియదు కాని సమ్మర్‌లో సెగలు రప్పించే ఫొటోను వదిలింది ప్రీత్ సింగ్. అప్పట్లో ఇదో కొత్త రకం ఫ్యాషన్ అంటూ ఒంటి నిండా చిరుగులు ఉన్న జీన్స్‌తో ఒళ్లు మొత్తం కనిపించేట్టుగా ఫొటోలు వదిలి రచ్చ చేసిన తాజాగా బోల్డ్ అవతారంలో మెరిసింది. జీన్స్ షర్ట్ ధరించిన రకుల్ ప్రీత్ సింగ్ బటన్స్ మొత్తం విప్పేసి.. లో వస్త్రాలు లేకుండా ఎదభాగం కనిపించేట్టుగా ఫొటోకు పోజులు ఇచ్చింది. ఇంతకు ముందు వరకూ రకుల్ అందాల ప్రదర్శన ఓ లెక్క.. ఇది ఓ లెక్క అన్న మాదిరిగా మితిమీరి అందాలను ఆరబోసింది. ఎద అందాలతో కవ్విస్తూ.. కైపెక్కించే చూపులతో రకుల్ కాకరేపే ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కెరటం, వెంకటాద్రి ఎక్స్ ప్రెస్, లౌఖ్యం, కరెంట్ తీగ, పండగ చేస్కో, కిక్ 2, బ్రూస్ లీ, నాన్నకు ప్రేమతో, సరైనోడు, దృవ, స్పైడర్, మన్మథుడు 2 వంటి చిత్రాల్లో మహేష్ బాబు, ఎన్టీఆర్, రామ్ చరణ్, బన్నీ వంటి స్టార్ హీరోలతో జోడీ కట్టిన ఈ భామకు ప్రస్తుతం ఆఫర్లు కొరత ఏర్పడింది. నాలుగు సినిమాలు ఉన్నప్పుడు అన్నీ చక్కబెట్టుకోవాలనే ఉద్దేశంలో అమ్మడు కెరియర్ పీక్స్‌లో ఉన్నప్పుడే బిజినెస్ రంగంలో అడుగుపెట్టింది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్‌లలో జిమ్స్ ఓపెన్ చేసిన రకుల్.. జూబ్లీహిల్స్ ప్రాంతంలో ఖరీదైన బంగ్లాను కొనుగోలు చేసింది. అయితే మహేష్ బాబు ‘స్పైడర్’, నాగార్జున ‘మన్మథుడు 2’, సూర్య ‘ఎన్జీకే’ చిత్రాలు వరుసగా నిరాశ పరచడంతో అమ్మడు వైపు చూడటం మానేశారు మన హీరోలు. పైగా ప్రస్తుతం టాలీవుడ్‌లో రష్మిక జోరు కొనసాగుతుండటంతో రకుల్‌ డౌన్ అయ్యింది. ఇక బాలీవుడ్‌లోనూ అడుగుపెట్టిన ఈ బ్యూటీ క్లీవేజ్ షోతో రచ్చ చేసింది. అయినప్పటికీ పెద్దగా ప్రభావం లేకపోవడంతో హాట్ డోస్ పెంచి మరీ ఆఫర్ల కోసం వల విసురుతోంది రకుల్. చూడాలి మరి ఈమె కెరియర్ ఊపందుకుంటుందేమో!


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3c7B2I8
v

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...