Saturday 30 May 2020

అంతా తుస్.. బాలయ్య, చిరు మాట్లాడారు, ఏ గొడవాలేదు, నాగబాబూ కూలమ్మా!

హలో ఫ్యాన్సూ... చొక్కాలు చింపుకోకండ్రా నాయన్రారా అంటే.. వింటారా..? ఓ ఎగేసుకుని మరీ మా హీరో తోపూ.. ఆయన్నే అంత మాట అంటారా? మిమ్మల్ని అంత చేస్తాం ఇంత ఇస్తాం అంటూ ఎదుటి హీరోని వీళ్లు తిట్టడం.. వాళ్లతో మళ్లీ తిరిగి తిట్టించుకోవడం దశాబ్ధాలుగా తెలుగు సినిమా పరిశ్రమలో చూస్తూనే ఉన్నాం. చివర్లో గొడవకు కారణమైన హీరోలు నోరు మెదపకపోగా.. సినిమా ఈవెంట్లు, వివాహాదిశుభకార్యాల్లో భుజంపై చేయి చేయి వేసుకుని చేతులు ఊపుతుంటారు. ఈ మధ్య కిస్సులు కూడా పెట్టుకుంటున్నార్లెండి అది వేరే విషయం.. ఇక అసలు విషయానికి వస్తే టాలీవుడ్ పెద్దలు ప్రభుత్వ పెద్దలతో జరిపిన చర్చలకు తనను పిలవకపోవడంపై అలిగారు బాలయ్య. ఆయన అలిగితే యవ్వారం ఎలా ఉంటుందో తెలిసిందే కదా.. తేడా లొస్తే పబ్లిక్‌లోనే ఫ్యాన్స్‌ని వీరి ఉతుకుడు ఉతికే బాలయ్య.. తనను ఆ మీటింగ్‌కి పిలవకపోవడంతో హర్ట్ అయ్యి.. భూములు పంచుకోవడానికి మీటింగ్‌లు పెట్టుకున్నారంటూ ఓ రేంజ్‌లో ఫైర్ అయ్యారు.

అయితే బాలయ్య వ్యాఖ్యలపై మెగా బ్రదర్ నాగబాబు తెగ ఫీల్ అయిపోయి.. మర్యాదగా క్షమాపణ చెప్పుబాలయ్యా.. నోటి కొచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదు.. ఆఫ్ట్రాల్ నువ్వో హీరో మాత్రమే.. ఏం అనుకుంటున్నావ్ అంటూ భారీ భారీ డైలాగ్‌లో వీడియో వదిలారు. బాలయ్య యాక్షన్‌కి నాగబాబు రియాక్షన్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ కాగా.. నందమూరి-మెగా ఫ్యాన్స్ ఎంట్రీ ఇచ్చి ఒకర్నొకరు బండ బూతులు తిట్టుకుంటూ మా హీరో గొప్ప అంటే మా హీరో గొప్ప అని సోషల్ మీడియాలో తొడలు వాచేలా కొట్టుకుంటున్నారు.

ఇక ఈ వివాదం మరింత ముదరడంతో టాలీవుడ్ ట్రబుల్ షూటర్‌గా పేరొందిన పెద్దాయన తమ్మారెడ్డి భరద్వాజ మీడియా ముందుకు వచ్చి.. వివాదాన్ని పరిష్కరించే ప్రయత్నం చేశారు. అసలు వివాదం ఏం లేదు అంటూ క్లారిటీ ఇచ్చారు. ఆయన మాట్లాడుతూ.. సీసీసీ (కరోనా క్రైసిస్ ఛారిటీ) డబ్బులు పంచుకుంటున్నారు అంటూ పిచ్చి వాగుడు వాగుతున్నారు.. ఎవరో బుద్ది లేని వాళ్లు అలా మాట్లాడుతున్నారు.. ఏదో సాయం చేయడానికి ముందుకు వస్తే ఇలాగనే మాట్లాడేది. చిరంజీవి గారి ఇంట్లో మీటింగ్ పెట్టినందుకు చాలా మంది తెగ ఫీల్ అవుతున్నారు. గతంలో చాలా మీటింగ్‌లో దాసరిగారి ఇంట్లోనే జరిగేవి అప్పుడు ఎవరూ ఎందుకు మాట్లాడలేదు.

నిజానికి చిరంజీవి గారి ఇంట్లో ఇండస్ట్రీ మీటింగ్ కాదది. సీఎం గారి దగ్గరకు వెళ్లే ముందు కాని.. ఆ తరువాత కాని గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయ్యి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు చిరంజీవిని కలుస్తాం అంటే ఆయనే వస్తానని అన్నారు. మంత్రిగారు వెళితే ఇండస్ట్రీ మీటింగ్ ఎలా అవుతుంది. తలసాని వచ్చారు కాబట్టి చిరంజీవి గారితో పాటు మిగిలిన పెద్దలు కలిశారు. అనుకోకుండా జరిగిన మీటింగ్ ఇది. ఛాంబర్ నుంచి చేసింది ఛాంబర్‌లో చేశాం.. వ్యక్తిగతంగా చేయాల్సింది వ్యక్తిగతం చేశాం. గతంలో దాసరి గారు కూడా ఇలాగే చేశారు. ఇప్పుడు చిరంజీవి గారి ఇంట్లో మీటింగ్ జరిగితే ఏమైంది.. ఆయన సొంత వ్యాపారాల గురించి ఏమైనా మాట్లాడుకోలేదు కదా.. ఇండస్ట్రీ బాగు కోసమే కదా మాట్లాడింది. ఒకవేళ మాట్లాడినా తప్పులేదు. ఎందుకంటే ఆయన ఇష్టం.

తెలంగాణ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తరువాత ప్రతి మీటింగ్‌కి నన్ను పిలచేవారు. ఈ రెండు మూడు మీటింగ్‌లకు నన్ను పిలవలేదు. కాని ఇండస్ట్రీకి మంచి జరుగుతుందన్నప్పుడు మనల్ని పిలవకపోతే ఏమైంది? ఎవరితో పని అవుతుందో వాళ్లని పట్టుకుని వెళ్తాం. ఇప్పుడు బాలక్రిష్ణ గారిని పిలవలేదనడం కరెక్ట్ కాదు.. ఎందుకంటే ఎప్పుడూ ఎవర్నీ పిలవం. ఎందుకంటే ఆ మీటింగ్ జరిపింది ప్రభుత్వం. వెళ్లి తలసానినో లేక సీఎం కేసీఆర్‌నో అడగండి.. బాలయ్యను ఎందుకు పిలవలేదని. గతంలో తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు కేవలం కొంత మంది మాత్రమే వెళ్లారు.. మిగిలిన వాళ్లని పిలవలేదు అని ఎవరైనా అడిగారా?? ఇవాళ ఎందుకు వివాదం చేస్తున్నారు.

బాలయ్యను మీడియా రెచ్చగొట్టడం వల్ల ఆయన అలా మాట్లాడారు.. కావాలనే వివాదం చేస్తున్నారు. ఆయన చెప్పిందే రైట్ అనుకుందాం.. బాలయ్య హీరో అయ్యి 30 ఏళ్లు అయ్యింది.. ఈ 30 ఏళ్లలో ఎన్ని మీటింగ్‌లు జరిగాయి.. బాలయ్య ఎన్ని మీటింగ్‌లకు వచ్చారో చెప్పుతారా? నిజంగా ఆయన అన్ని మీటింగ్‌లకు వచ్చి ఉండి.. ఈ మీటింగ్‌కి పిలవకపోయి ఉంటే తప్పు మాది అయ్యేది. ఇండస్ట్రీకి మంచి జరుగుతుంది అన్నప్పుడు దీన్ని కాంట్రివర్శీ చేయడం ఎందుకు. బాలయ్యను పిలిచారా? భరద్వాజాని పిలిచారా అన్నది ముఖ్యం కాదు.. ఇండస్ట్రీకి మేలు జరిగిందా లేదా? అన్నదే ముఖ్యం. మీడియాకి చేతులెత్తి మొక్కుతున్నా.. దయచేసి దీన్ని ఇక్కడితో వదిలేయండి.. కాంట్రవర్శి చేయకండి.

ఇండస్ట్రీలో చిరంజీవి, బాలకృష్ణల మధ్య ఎలాంటి వివాదం లేదు. మధ్యలో ఉన్న వాళ్లు నోరు జారి ఉండవచ్చు... ఎవరు జారినా తప్పే. బాలకృష్ణ గారు మాట్లాడింది.. నాగబాబు గారు మాట్లాడింది తప్పే. వాళ్ల వ్యాఖ్యల్ని సినీ పెద్దగా ఖండిస్తున్నా. దీన్ని ఇక్కడితో వదిలేయండి. జరిగింది మరిచిపోండి. ఈ వివాదం తరువాత బాలకృష్ణ గారితో మాట్లాడాం.. అన్నీ అయిపోయాయి. చిరంజీవి గారితో కూడా మాట్లాడాం. వివాదానికి ముగింపు పలికాం. మీడియాకి చేతులెత్తి మొక్కుతున్నా.. దయచేసి దీన్ని ఇక్కడితో వదిలేయండి.. కాంట్రవర్శి చేయకండి.

దాసరి నారాయణ రావుగారి ప్లేస్‌ని చిరంజీవి గారూ భర్తీ చేస్తున్నారని అంటున్నారు. కాని ఆయన ప్లేస్‌ని ఎవరూ భర్తీ చేయలేరు. ఆయన సినిమా ఇండస్ట్రీకి సంబంధించి అన్ని పదవులూ చేశారు. ఆయన ప్రొడ్యుసర్, డైరెక్టర్, రైటర్, రాజకీయ వేత్త, మంత్రి.. ఆయనకి తెలియని విషయం అంటూ ఏమీ ఉండదు. సినిమా ఇండస్ట్రీలో ఏది ఎక్కడ ఎలా ఉందో ఆయనకి తెలుసు.. ప్రతి క్రాఫ్ట్‌పై ఆయనకు అవగాహన ఉంది. ఆయనలా అందరూ ఉండాలంటే సాధ్యం కాదు. కాని ప్రస్తుతం ఉన్న హీరోల్లో చిరంజీవి గారి కెపాసిటీ ఇండస్ట్రీకి ఉపయోగపడుతుంది. లేదంటే మరో హీరో అయినా అవ్వొచ్చు. సమస్య వచ్చినప్పుడు పరిష్కరించడానికి ఒక పెద్ద మనిషి కావాలి.. అది ఎవరైనా కావొచ్చు.

ఇండస్ట్రీకి మంచి జరుగుతుంది అంటే ఎవరి వెనుకు అయినా ఇండస్ట్రీ మొత్తం ఉండటానికి రెడీగా ఉంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో చిరంజీవి బాగా లీడ్ చేయగలరనే నమ్మకం మాకు ఉంది. పరిస్థితిని బట్టే అన్నీ మారుతుంటాయి.. రేపటి రోజున బాలకృష్ణ గారితో మంచి జరుగుతుంది అంటే ఆయన వెనకు ఉంటాం. మాకు కావాల్సింది ఇండస్ట్రీ మేలు. దాసరి గారు అయితే ఎలాంటి పరిస్థితి వచ్చినా ఆయన సాల్వ్ చేసేవారు. ఇప్పుడు చిరంజీవి గారితో సాధ్యం కావొచ్చని అనుకుంటున్నాం. పూర్తి అవగాహన రావడానికి కాస్త టైం పడుతుంది. దాసరి గారు అన్నీ తెలుసుకుని ఇండస్ట్రీకి వచ్చారు.. చిరంజీవి గారు ఇండస్ట్రీకి వచ్చిన తరువాత నేర్చుకుంటున్నారు.. మంచి చేయాలనుకుంటున్న ఆయన్ని ప్రోత్సహిద్దాం.. దయచేసి ఈ వివాదాన్ని ఇక్కడితో వదిలేయండి’ అంటూ వివాదానికి మొత్తం మీడియానే బాధ్యత చేస్తూ షాకింగ్ కామెంట్స్ చేశారు తమ్మారెడ్డి.



from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3chKqJp
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...