Monday 30 September 2019

‘సామజవరగమన’ సాంగ్ లిరిక్స్.. సిరివెన్నెల సాహిత్యాన్ని మీరూ పాడేయండి!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, పూజా హెగ్డే జంటగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘అల... వైకుంఠపురములో...’. శ్రీమతి మమత సమర్పణలో హారిక అండ్ హాసిని క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ బ్యానర్లపై అల్లు అరవింద్, ఎస్.రాధాకృష్ణ (చినబాబు) నిర్మిస్తు్న్నారు. ఎస్.ఎస్.తమన్ సంగీతం సమకూరుస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. అయితే, ఈ సినిమాలో తొలిపాటను ఇటీవల విడుదల చేశారు. ‘సామజవరగమన’ అంటూ సాగే ఈ పాటకు ప్రేక్షకుల నుంచి విపరీతమైన స్పందన వస్తోంది. సిరివెన్నెల సీతారామశాస్త్రి అందించిన సాహిత్యం అద్భుతంగా ఉందంటూ కొనియాడుతున్నారు. సిద్ శ్రీరామ్ కూడా అంతే అద్భుతంగా ఆలపించారని ప్రశంసిస్తున్నారు. మరి ఈ పాటను మీకు కూడా పాడేయాలని ఉందా. అయితే.. ఇవిగో లిరిక్స్! పల్లవి నీ కాళ్లను పట్టుకుని వదలనన్నవి చూడే నా కళ్లు ఆ చూపులనల్లా తొక్కుకు వెళ్లకు దయలేదా అసలు (2 సార్లు) నీ కాళ్లను పట్టుకుని వదలనన్నవి చూడే నా కళ్లు ఆ చూపులనల్లా తొక్కుకు వెళ్లకు దయలేదా అసలు నీ కళ్లకు కావలి కాస్తయే కాటుకలా నా కలలు నువ్వు నులుముతుంటే ఎర్రగ కంది చిందేనే సెగలు నా ఊపిరి గాలికి ఉయ్యాలలూగుతు ఉంటే ముంగురులు నువ్వు నెట్టేస్తే ఎలా నిట్టూర్చవటే నిష్టూరపు విలవిలలు సామజవరగమన.. నిను చూసి ఆగ గలనా మనసు మీద వయసుకున్న అదుపు చెప్ప తగున (2) నీ కాళ్లను పట్టుకుని వదలనన్నవి చూడే నా కళ్లు ఆ చూపులనల్లా తొక్కుకు వెళ్లకు దయలేదా అసలు చరణం మల్లెల మాసమా.. మంజుల హాసమా.. ప్రతి మలుపులోన ఎదురుపడిన వెన్నెల వనమా.. విరిసిన పించెమా.. విరుల ప్రపంచమా.. ఎన్నెన్ని వన్నె చిన్నెలంటె ఎన్నగ వశమా.. అరె, నా గాలే తగిలినా.. నా నీడే తరిమినా.. ఉలకవా.. పలకవా.. భామా.. ఎంతో బ్రతిమాలినా.. ఇంతేనా అంగనా.. మదిని మీటు మధురమైన మనవిని వినుమా.. సామజవరగమన.. నిను చూసి ఆగ గలనా మనసు మీద వయసుకున్న అదుపు చెప్ప తగున (2) నీ కాళ్లను పట్టుకుని వదలనన్నవి చూడే నా కళ్లు ఆ చూపులనల్లా తొక్కుకు వెళ్లకు దయలేదా అసలు


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2mzWBxm
v

‘ఐష్ ప్రపంచంలోనే అందమైన యువతి.. ఆమెను ఇలా చేస్తారా?’

మాజీ ప్రపంచసుందరి ఐశ్వర్య రాయ్‌ను మించిన అందం ఈ భూమ్మీద మరొకటి లేదనే చెప్పాలి. ఆ తర్వాత ఎంతమంది మిస్ వరల్డ్, మిస్ యూనివర్స్ అయినా ఐష్ అందం ముందు తక్కువనే చెప్పాలి. ఆమె ఎలాంటి దుస్తుల్లోనైనా అందంగానే కనిపిస్తారు. అయితే ఇటీవల ఐష్ ప్యారిస్ ఫ్యాషన్ వీక్‌లో పాల్గొనేందుకు పారిస్ వెళ్లారు. లావెండర్ కలర్ దుస్తుల్లో ర్యాంప్ వాక్ చేశారు. అయితే ఐష్ దుస్తులపై ఇండియన్ ఫ్యాషన్ డిజైనర్ అయిన వెండెల్ రోడ్రిక్స్ కామెంట్ చేశారు. ‘ప్రపంచంలోనే అందమైన యువతి . అలాంటిది ఆమెకు ఈ చెత్త డ్రెస్ వేసి అసహ్యంగా తయారుచేస్తారా? ఐష్ డ్రెస్‌ను డిజైన్ చేసిన వ్యక్తిని వెంటనే తొలగించండి. వాడికి హాలోవీన్ పండగ వచ్చే నెలలో అని చెప్పండి’ అని ఇన్‌స్టాగ్రామ్‌లో ఐష్ ఫొటోను పోస్ట్ చేస్తూ కామెంట్ చేశాడు. ఐష్ వేసుకున్న డ్రెస్‌ని పారిస్‌కి చెందిన డిజైనర్ జియామ్ బటిస్టా వల్లీ డిజైన్ చేశారు. డ్రెస్ బాగానే ఉంది కానీ ఐష్ వేసుకున్న మేకప్ మాత్రం కాస్త ఓవర్ అయింది. కళ్లకు మల్టీకలర్డ్ రంగులు పూసుకున్నారు. చెప్పులు కూడా చూడటానికి ఫన్నీగా ఉన్నాయి. అయితే ఆ డిజైనర్ చేసిన కామెంట్‌పై ఐష్ ఇంకా స్పందించలేదు. అయినా ఐష్ ఇలాంటి కామెంట్స్‌ని అస్సలు పట్టించుకోరు. గతంలో ఆమె కేన్స్ ఫిలిం ఫెస్టివల్‌కి వెళ్లినప్పుడు పర్పుల్ కలర్ లిప్‌స్టిక్ వేసుకున్నారు. దాంతో ఆమె లుక్ తెగ వైరల్ అయింది. చాలా మంది అభిమానులకు ఐష్ అలాంటి లిప్‌స్టిక్ వేసుకోవడం నచ్చలేదు. తనపై అన్ని కామెంట్స్ వచ్చినా కూడా తాను పట్టించుకోనని ఐష్ తెలిపారు. ప్రస్తుతం ఐష్ వెళ్లిన ఫ్యాషన్ షోకు ఎప్పటిలాగే తన కుమార్తె ఆరాధ్యను కూడా తీసుకువెళ్లారు. ఇక ఐష్ వర్క్ విషయానికొస్తే చివరగా ఆమె హిందీలో ‘ఫ్యాన్నే ఖాన్’ సినిమాలో నటించారు. అనిల్ కపూర్, రాజ్ కుమార్ రావ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాలో ఐష్ ఫేమస్ సింగర్ పాత్రను పోషించారు. కానీ ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మిశ్రమ ఫలితాలను అందుకుంది. ఆ తర్వాత కొంతకాలం సినిమాల నుంచి గ్యాప్ తీసుకున్న ఐశ్వర్య.. ఇటీవల తన గురూజీ అయిన మణిరత్నం తెరకెక్కిస్తున్న ‘పొన్నియిన్ సెల్వన్’ అనే తమిళ సినిమాకు సంతకం చేశారు. ఇందులో ఐష్ చోళా మహారాజు భార్య పాత్రలో నటించనున్నారు. ఆమె విలన్‌గా డబుల్ రోల్ పోషించనున్నట్లు తెలుస్తోంది. ఏళ్ల తర్వాత ఐష్, మణిరత్నం కాంబినేషన్‌లో రాబోతున్న సినిమా కావడంతో దీనిపై చాలా అంచనాలు ఉన్నాయి.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2n9kMTF
v

షాకింగ్‌ : రానా ఇలా అయిపోయాడేంటి?

స్టార్‌ వారసుడిగా టాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చి తరువాత తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న టాలీవుడ్‌ యంగ్ హీరో రానా దగ్గుబాటి. మ్యాచో స్టార్ పేరు తెచ్చుకున్న ఈ యంగ్‌ హీరో తరువాత బాలీవుడ్‌, కోలీవుడ్‌లలోనూ సత్తా చాటాడు. అంతేకాదు హీరోగా క్యారెక్టర్సే చేస్తానంటూ మడి కట్టుకు కూర్చోకుండా పాత్ర బాగుంటే క్యారెక్టర్‌ రోల్స్‌తో పాటు విలన్‌ క్యారెక్టర్స్‌కు సై అంటున్నాడు. అయితే చివరగా ఎన్టీఆర్‌ మహానాయకుడు సినిమాలో కనిపించిన రానా తరువాత వెండితెర మీద కనిపించలేదు. అదే సమయంలో రానా ఆరోగ్యపరిస్థితిపై రకరకాల వార్తలు వినిపించాయి. రానా ఆరోగ్యం పూర్తిగా దెబ్బతినిందని, కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్‌ కోసం విదేశాలకు వెళ్లాడన్న ప్రచారం జరిగింది. అయితే నిజంగానే విదేశాలకు వెళ్లిన రానా, తన ఆరోగ్య పరిస్థితి మాత్రం బాగానే ఉందంటూ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు. కానీ రానా లుక్‌ చూస్తే మాత్రం రానా ఆరోగ్యం విషయంలో అనుమానాలు రాక మానవు. బాహుబలిలో బల్లాలదేవుడిగా భారీ ఖాయంతో కనిపించిన రానా ప్రస్తుతం బక్కచిక్కిపోయి కనిపిస్తున్నాడు. ఎన్టీఆర్‌ బయోపిక్‌ సమయంలో చంద్రబాబు నాయుడు పాత్ర కోసం బరువు తగ్గానని చెప్పినా ఆ తరువాత కూడా మరింతగా బరువు తగ్గాడు రానా. దీంతో రానా ఆరోగ్య పరిస్థితిపై అభిమానులు ఆందోళన చెందుతున్నారు. Also Read: తాజాగా ప్రచార చిత్రంలో రానా లుక్‌ చూసి అభిమానులతో పాటు ఇండస్ట్రీ వర్గాలు కూడా షాక్‌కి గురవుతున్నారు. సౌత్ మ్యాచో స్టార్‌ ఇలా మారిపోయాడేంటని బాధ పడుతున్నారు. మరి దగ్గుబాటి కుటుంబ సభ్యులు ఇప్పటికైన రానా ఆరోగ్యపరిస్థితిపై స్పందిస్తేగాని అభిమానుల అనుమానలకు, సోషల్ మీడియా పుకార్లకు తెరపడే అవకాశం లేదు. రానా ప్రస్తుతం తెలుగు, హిందీ భాషల్లో తెరకెక్కుతున్న హాథీ మేరీ సాథీ సినిమాను పూర్తి చేయాల్సింది. ఈ సినిమా షూటింగ్‌ మధ్యలోనే రానా విదేశాలకు వెళ్లిపోయాడు. దీనికి తోడు వేణు ఉగుడుల దర్శకత్వంలో విరాటపర్వం సినిమాను ప్రారంభించాడు. సాయి పల్లవి హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్‌ ప్రారంభించాల్సి ఉంది. దీనితో పాటు రాజా మార్తండ వర్మ కథతో తెరకెక్కుతున్న బహుభాషా చిత్రం, మరో హిందీ చిత్రాలకు అంగీకరించాడు. మరి ఈ సినిమా షూటింగ్‌ ఎప్పుడు ప్రారంభమవుతుంది. రానా తిరిగి హ్యాండ్సమ్‌ లుక్‌లోకి ఎప్పుడు వస్తాడు. అని అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2nkulPr
v

దీపిక పదుకోన్ స్కూల్ రిపోర్ట్ కార్డ్ చూశారా.. ఎన్ని రిమార్కులో

సెలబ్రిటీల రీల్ లైఫ్ కంటే రియల్ లైఫ్ గురించి తెలుసుకోవాలన్న ఆసక్తే అభిమానుల్లో ఎక్కువగా ఉంటుంది. వారు ఏ స్కూల్లో చదివారు, ఎలాంటి యూనిఫాం వేసుకుని వెళ్లేవారు, స్కూల్‌లో ఎన్ని మార్కులు వచ్చేవి.. ఇలాంటి అంశాలన్నీ తెలుసుకోవాలని అభిమానులకు ఉంటుంది. తాజాగా బాలీవుడ్ బ్యూటీ తన స్కూల్ రిపోర్ట్ కార్డ్‌ను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి అభిమానులను సర్‌ప్రైజ్ చేశారు. రిపోర్ట్ కార్డ్‌లో ఆమె టీచర్ రాసిన రిమార్క్స్ వైరల్ అవుతున్నాయి. దీపిక స్కూల్‌లో ఎక్కువగా మాట్లాడుతుండేవారట. ఆమె రూల్స్ సరిగ్గా పాటించడం నేర్చుకోవాలని రిమార్క్‌లో పేర్కొన్నారు. ఇది చూసిన దీపిక భర్త రణ్‌వీర్ సింగ్ స్పందిస్తూ.. ‘అవును టీచర్. నేనూ ఒప్పుకుంటాను’ అని ఫన్నీగా స్పందించాడు. ఇక టీచర్ రాసిన మూడో రిమార్క్ ఏంటంటే.. దీపిక ఎక్కువగా పగటి కలలు కంటుండేవారట. ఇది చూసిన నెటిజన్లు విపరీతంగా కామెంట్లు పెడుతున్నారు. సినీ ప్రముఖులు కూడా స్పందిస్తు్న్నారు. అయితే దీపిక టీచర్ రాసిన రిమార్క్స్ కాకుండా రణ్‌వీర్ కూడా ఓ రిమార్క్ రాశాడు. దీపిక ట్రబుల్ మేకర్ అట. దీపిక, రణ్‌వీర్ జంటకు బాలీవుడ్‌లో విపరీతమైన క్రేజ్ ఉంది. 2013లో వచ్చిన ‘గోలియోంకీ రాస్‌లీలా రామ్‌లీలా’ సినిమాతో వీరి ప్రేమాయణం మొదలైంది. కానీ ఎప్పుడూ మీడియా ముందు తమ ప్రేమ గురించి నోరు విప్పింది లేదు. వారు చెప్పకపోతేనేం. ఎక్కడికి వెళ్లినా చేతిలో చెయ్యి వేసుకుని వెళ్లడం, విహారయాత్రలకు కలిసే వెళ్లడం వంటివి చూసి వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని అందరికీ తెలిసిపోయింది. గతేడాది నవంబర్‌లో ఇటలీలోని లేక్ కోమోలో పంజాబీ, సింధి సంప్రదాయాల్లో వీరి వివాహం ఘనంగా జరిగింది. వీరిద్దరూ ‘బాజీరావ్ మస్తానీ’, ‘పద్మావత్’ సినిమాల్లో కలిసి నటించారు. పెళ్లయ్యాక దీపిక, రణ్‌వీర్ ‘83’ సినిమాలో రీల్ లైఫ్ భార్యాభర్తలుగా నటిస్తున్నారు. లెజండరీ క్రికెటర్ కపిల్ దేవ్ కెప్టెన్‌గా ఉన్నప్పుడు 1983లో టీమిండియా వరల్డ్ కప్‌ను ఎలా సాధించింది అన్న నేపథ్యంలో ఈ సినిమాను కబీర్ సింగ్ తెరకెక్కిస్తున్నారు. ఇందులో కపిల్ పాత్రలో రణ్‌వీర్, ఆయన భార్య రోమీ దేవ్ పాత్రలో దీపిక పదుకోన్ నటిస్తున్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్ 10న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2oQmREp
v

Chiranjeevi: ‘సైరా’ రూ. 500 కోట్లు ఆలిండియా షేర్ గ్యారంటీ.. రిలీజ్‌కి ముందే ‘కత్తి’ లాంటి కలెక్షన్స్

పెద్ద పెద్ద స్టార్లు నటించారు.. దండిగా డబ్బులు కూడా పెట్టారు.. ప్రమోషన్స్‌ కూడా కనీవినీ ఎరుగని రేంజ్‌లో చేస్తున్నారు. ఇక టీజర్, ట్రైలర్‌లు చూస్తే బొమ్మ హిట్టు అనేవారే తప్ప రెండో మాటలేదు. మెగాస్టార్ నటించిన ‘సైరా నరసింహారెడ్డి’ విడుదల కావడమే లేటు కాని.. బాక్సాఫీస్ వద్ద స్వైరవిహారం చేయడం ఖాయమే అంటూ లెక్కలు కట్టేస్తున్నారు మూవీ అనలిస్ట్‌లు. తొలి తెలుగు స్వాతంత్య్ర పోరాట యోధుడు ‘ఉయ్యాలవాడ నరసింహారెడ్డి’ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన మోస్ట్ వెయిటెడ్ ప్యాన్ ఇండియా మూవీ ‘సైరా’ భారీ అంచనాల నడుమ అక్టోబర్ 2 గాంధీ జయంతి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. కొణెదల ప్రొడక్షన్స్‌లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌ ఈ చిత్రాన్ని సుమారు రూ. 300 కోట్ల రూపాయల భారీ బడ్జెట్‌తో నిర్మించగా.. చిరంజీవి సత్తాకి ఈ కోట్లు వెనక్కి తిరిగిరావడం పెద్ద కష్టం కాదంటున్నాడు మూవీ క్రిటిక్ మహేష్ కత్తి. పవన్ కళ్యాణ్ అంటే అంతెత్తున లేచిపడే మహేష్ కత్తి.. అన్న చిరు అంటే మాత్రం అభిమానమే. ఎంత అభిమానం అంటే.. సినిమా విడుదలకు ముందే ‘సైరా రూ. 500 కోట్ల ఆల్ ఇండియా షేర్ గ్యాంరంటీ’ అనేంత. మెగాస్టార్ చిరంజీవి సత్తా అంటే ఇదీ.. అంటూ రూ. 500 కోట్ల ఆల్ ఇండియా షేర్ రాబట్టడటం పక్కా అంటూ పోస్ట్ పెట్టాడు మహేష్ కత్తి. మొత్తానికి ఈ మూవీ క్రిటిక్‌ నుండి పాజిటివ్ పోస్ట్ రావడం అరుదు. సైరా విషయంలో అది జరగడం శుభపరిణామమే. ఇక సైరా విషయానికి వస్తే.. విడుదలకు రెండే రోజులు మిగిలిఉండటంతో ప్రమోషన్స్‌లో వేగవంతం చేశారు. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ భారీ చారిత్రాత్మక తెలుగుతో పాటు హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో భారీ ఎత్తున విడుదల చేస్తున్నారు. అమితాబ్ బచ్చన్, నయనతార, తమన్నా, కిచ్చా సుదీప్, విజయ్ సేతుపతి, జగపతిబాబు, అనుష్క శెట్టి వంటి స్టార్లు నటించారు. అమితి త్రివేది ఈ చిత్రానికి సంగీతం సమకూర్చారు. రత్నవేలు సినిమాటోగ్రఫీ అందించారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2na9BtB
v

‘సైరా’లో చిరంజీవికి డబ్బింగ్ చెప్పింది ‘చాణక్య’ విలన్!

మాచో హీరో గోపీచంద్ హీరోగా వస్తోన్న స్పై థ్రిల్లర్ ‘చాణక్య’. తమిళ దర్శకుడు తిరు తెరకెక్కించారు. ఈ సినిమా ద్వారా బాలీవుడ్ నటుడు, డబ్బింగ్ ఆర్టిస్ట్, స్క్రీన్ రైటర్ రాజేష్ ఖట్టర్ తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవుతున్నారు. ‘చాణక్య’లో ఖురేషి పాత్రలో ఆయన నటించారు. ఇది విలన్ పాత్ర. ఇంత మంచి సినిమా ద్వారా టాలీవుడ్‌లోకి అడుగుపెట్టడం తనకు ఎంతో ఆనందంగా ఉందని ఖట్టర్ అంటున్నారు. అయితే, అంతకన్నా ఆయనకు ఆనందమైన విషయం ఇంకోటి ఉంది. అదే, మెగాస్టార్ చిరంజీవికి హిందీలో డబ్బింగ్ చెప్పడం. మెగాస్టార్ చిరంజీవి హీరోగా వస్తోన్న చారిత్రాత్మక చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’. తెలుగు గడ్డపై ఆంగ్లేయులపై కత్తెత్తిన తొలి పోరాట యోధుడు, రేనాటి సూరీడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన చిత్రం ఇది. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించారు. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్‌పై రామ్ చరణ్ నిర్మించారు. బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ అమిత్ త్రివేది సంగీతం సమకూర్చారు. నయనతార, తమన్నా ప్రధాన నటీమణులు. అలాగే అమితాబ్ బచ్చన్, కిచ్చా సుదీప్, విజయ్ సేతుపతి, జగపతిబాబు, రవికిషన్ కీలక పాత్రల్లో నటించారు. Also Read: సుమారు రూ.270 కోట్ల భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా మూవీగా రూపుదిద్దుకున్న ‘సైరా’.. తెలుగు సహా ఐదు భాషల్లో అక్టోబర్ 2న బ్రహ్మాండంగా విడుదలవుతోంది. అయితే, హిందీలో మెగాస్టార్ చిరంజీవికి రాజేష్ ఖట్టర్ డబ్బింగ్ చెప్పారు. ఈ విషయాన్ని ‘చాణక్య’ దర్శకుడు తిరు.. ఆదివారం రాత్రి వైజాగ్‌లో జరిగిన చిత్ర ప్రీ రిలీజ్ వేడుకలో వెల్లడించారు. వాస్తవానికి రాజేష్ ఖట్టర్ వాయిస్ చాలా బాగుంటుంది. ‘సైరా’ హిందీ ట్రైలర్ చూస్తే ఈ విషయం అర్థమవుతుంది. కాకపోతే, ఆ డబ్బింగ్ చెప్పిన వ్యక్తి ఎవరో ఇప్పటి వరకు తెలుగు ప్రేక్షకులకు తెలీదు. తిరు పుణ్యమా అని ఆ విషయం తెలిసిపోయింది. ఖట్టర్ ‘చాణక్య’ సినిమాలో విలన్‌గా నటించడం కన్నా చిరంజీవి డబ్బింగ్ చెప్పారనే విషయంతోనే బాగా పాపులర్ అవుతున్నారు. కాగా, ‘చాణక్య’ సినిమా అక్టోబర్ 5న ప్రేక్షకుల ముందుకు వస్తోంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2nSLKyR
v

చిరంజీవి అబద్దం చెప్పారా?.. అందుకే కేసులు వెనక్కి తీసుకున్నారా?

సైరా...దేశం మొత్తం ఆతృతగా ఎదురుచూస్తున్న ఈ భారీ బడ్జెట్ సినిమా మరికొన్ని గంటల్లో ప్రేక్షకులముందుకు రాబోతుంది. అయితే నిన్నమొన్నటివరకు ఈ సినిమా కథకి డబ్బులు చెల్లించాలి అని డిమాండ్ చేసి, కోర్ట్‌కి కూడా వెళ్లారు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వారసులు.ఆ రోజు కోర్ట్‌లో వాదనల అనంతరం తదుపరి విచారణ సోమవారానికి వాయిదా వేశారు. కానీ ఇప్పుడు మాత్రం ఈ సినిమాపై వాళ్ళు వేసిన కేసులు వెనక్కి తీసుకున్నారు. దాంతో ఎలాంటి వివాదాలు లేకుండా క్లీన్ ఇమేజ్‌తో రిలీజ్‌కి రెడీ అయ్యింది సైరా. Also Read: వాళ్ళు చెబుతున్న దాని ప్రకారం ఈ సినిమా షూటింగ్ టైమ్‌లో ఉయ్యాలవాడ వంశస్థులు సైరా కోసం డబ్బులు డిమాండ్ చేశారు. అయితే అప్పుడు రామ్ చరణ్ ఆ వంశంలోని మొత్తం 23 కుటుంబాలకు ఒక్కొక్కరికి 15 లక్షల చొప్పున సాయం చేస్తా అని మాట ఇచ్చారట. కానీ ఎక్కడ తేడా వచ్చిందో ఏమో కానీ ఉయ్యాలవాడ వారసులు కుటుంబానికి రెండు కోట్లు డిమాండ్ చేస్తున్నారు అంటూ ఒక వార్త బయలుదేరింది. చిరంజీవి కూడా ఆ మాట నిజం అని చెప్పుకొచ్చారు. Also Read: అయితే తమకు అన్యాయం జరుగుతుంది అంటూ వాళ్ళు ముందు పోలీస్ కేస్ పెట్టారు, ఆ తరువాత కోర్ట్ మెట్లు ఎక్కారు?. తమకి ముందు లీగల్‌గా అగ్రిమెంట్ చేసి ఇప్పుడు మాత్రం దాన్ని పట్టించుకోవట్లేదు అని వాళ్ళు కేస్ వేశారు. ఆ కేస్ పై కోర్ట్ కూడా విచారణ చేపట్టింది. అయితే వాళ్ళు సినిమా ఆపాలని వేసిన కేసుని, సినిమా ముందు తమకు చూపించాలని వేసిన కేస్‌ని కూడా కొట్టేసారు. దాంతో ఈ వివాదం ఏ మలుపు తిరుగుతుందో అని అనుకున్నారు అంతా. Also Read: కట్ చేస్తే ఇప్పుడు వాళ్ళు తాము వేసిన కేసుని ఉపసంహరించుకుంటున్నట్టు ప్రకటించారు. సినిమా రిలీజ్ అవుతున్న టైమ్‌లో సినిమాపై వివాదాలు కరెక్ట్ కాదు అని వాళ్ళు ఫీలై కేసులు ఉపసంహరించుకున్నారా? లేక అసలు ఏం జరిగింది అనేది తెలియాల్సి ఉంది. ఇప్పటికయితే ఆ వివాదం మాత్రం క్లోజ్ అయ్యింది. దీంతో సైరా యూనిట్ అండ్ చిరంజీవి అభిమానులు హ్యాపీ‌గా ఫీల్ అవుతున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2oETKUB
v

చేతిలో బిడ్డతో ఎత్తైన పర్వతాన్ని ఎక్కిన ఎన్టీఆర్ హీరోయిన్

ఏదేమైనా బాలీవుడ్ భామ సమీరా రెడ్డికి ధైర్యం ఎక్కువేనండోయ్. లేకపోతే.. పర్వతాన్ని అధిరోహించడమే ఒక ఎత్తైతే.. చేతిలో రెండు నెలల బిడ్డను పెట్టుకుని మరీ ఎక్కితే ఇంకేమైనా ఉందా? కానీ సమీరా మాత్రం భయపడకుండా పర్వతాన్ని ఎక్కేశారు. ఇటీవల సమీరా పండండి ఆడబిడ్డకు జన్మనిచ్చారు. ఫ్యామిలీ వెకేషన్‌లో భాగంగా సమీరా ప్రస్తుతం కర్ణాటకలో ఉన్నారు. అక్కడ ముల్లయనగిరి అనే ఎత్తైన పర్వతం ఒకటి ఉంది. దానిని చూడంగానే సమీరాలో ఉత్సాహం పొంగుకొచ్చిందో ఏమో చేతిలో పసి పిల్ల ఉందన్న ఆలోచన కూడా లేకుండా పర్వతాన్ని ఎక్కేసింది. అది చాలదన్నట్లు ఆ సమయంలో తీసిన వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ‘నైరా(పాప పేరు)ను ఎత్తుకుని ముల్లనయగిరి పర్వతాన్ని ఎక్కేశాను. ఎక్కుతున్నప్పుడు మధ్యలో ఆగాల్సి వచ్చింది. ఎందుకంటే మధ్యలో ఊపిరి పీల్చుకోలేకపోయా. కర్ణాటకలోనే ఇది ఎత్తైన పర్వతం. దీని ఎత్తు 6300 అడుగులు. కొత్తగా తల్లైన చాలా మంది మహిళలు అన్ని ప్రాంతాలను పర్యటించాలని చాలా ఆరాటపడుతుంటారు. వారిలో నేనూ ఒకదానిని. నా ట్రావెల్ స్టోరీస్ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నందుకు మంచి స్పందనే వస్తోంది. అందుకు చాలా సంతోషంగా ఉంది. బిడ్డ పుట్టాక మనం చేయాలనుకున్నవి చేయలేకపోతామన్న బాధ ఉండిపోతుంది. ఆ బాధ నాలో ఏమాత్రం ఉండకుండా చూసుకుంటున్నా’ అని వెల్లడించారు సమీరా. అయితే ఇలా చంటిబిడ్డను మోసుకుని పర్వతాన్ని ఎక్కడం అనేది మంచి పద్ధతి కాదని, పైగా పర్వతం ఎక్కుతున్న సమయంలో ఊపిరి ఆడక పడిపోయి ఉంటే ఎంత ఘోరం జరిగి ఉండేదంటూ కొందరు నెటిజన్లు సమీరాను తిట్టిపోస్తున్నారు. ఆమెను స్ఫూర్తిగా తీసుకుని మరెవరైనా ఇలాంటి ప్రయత్నాలు చేస్తే ఆ తర్వాత జరగరానిది ఏదన్నా జరిగితే ఎవరు బాధ్యులు అని ప్రశ్నిస్తున్నారు. ఈ విన్యాసం చేయడానికి ముందు ఆమె ఎన్నైనా జాగ్రత్తలు తీసుకుని ఉండొచ్చు. కానీ చేతిలో బిడ్డను వేసుకుని అలాంటి విన్యాసాలకు పాల్పడటం మంచిది కాదనే చెప్పాలి. ఏదేమైనా సమీరా ధైర్యాన్ని మెచ్చుకోవాల్సిందే. తెలుగులో సమీరా యంగ్ టైగర్ ఎన్టీఆర్‌తో కలిసి ‘నరసింహుడు’, ‘ అశోక్’ సినిమాల్లో నటించారు. చిరంజీవితో కలిసి ‘జై చిరంజీవ’, సూర్యతో కలిసి ‘సూర్య సన్నాఫ్ కృష్ణన్ సినిమాల్లో నటించారు. సమీరా చివరిగా ‘వరదనాయక’ అనే కన్నడ సినిమాలో నటించారు. ఆ తర్వాత ఆమె ముంబయికి చెందిన వ్యాపారవేత్త అక్షయ్ వర్దేను వివాహం చేసుకున్నారు. దాంతో పూర్తిగా సినిమాలకు దూరమయ్యారు. సమీరాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. ప్రస్తుతం ఆమె తన కుటుంబం కోసమే సమయాన్ని కేటాయిస్తున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2mfqeDO
v

Sye Raa Narasimha Reddy Jukebox


Sye Raa Narasimha Reddy Jukebox

from BharatStudent - Telugu - Actor Actress|Photo,Picture Galleries|Wallpapers|Screensavers|Movie Trailers|Film News and Gossips https://ift.tt/2ml9GdM

‘14 సినిమాలు ఫ్లాప్స్ వచ్చాయ్.. నా కెరీర్ అయిపోయిందనుకున్నా’

బాలీవుడ్‌లో ఖాన్‌లకు పోటీగా నిలిచారు నటుడు అక్షయ్ కుమార్. ఆయన నటించే ఏ సినిమా అయినా రూ.100 కోట్ల క్లబ్‌లో చేరాల్సిందే. హిట్స్ ఉన్నా లేకపోయినా ఏడాదికి వరుసగా నాలుగైదు సినిమాలు చేయాల్సిందే. ఆ సత్తా అక్షయ్ కుమార్‌కి మాత్రమే ఉంది. అయితే ఏ హీరో, హీరోయిన్ కెరీర్‌లో అయినా ఫ్లాప్స్ కామనే. కెరీర్‌లోనూ బోలెడన్ని ఫ్లాప్ సినిమాలు ఉన్నాయ్. అయితే ఆయన స్టా్ర్‌డం ముందు ఆ ఫ్లాప్‌లన్నీ తుస్సుమన్నాయ్. కానీ తన కెరీర్ రోడ్డు మీదకు వచ్చేసిందనే అనుకున్నారట అక్షయ్. ఈ విషయాన్ని ఆయన ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ‘ముప్పై ఏళ్లుగా ఈ ఇండస్ట్రీలో కొనసాగుతున్నా. నా కెరీర్‌లో 14 ఫ్లాప్ సినిమాలు ఉన్నాయ్. దాంతో నా జీవితం రోడ్డు మీదకు వచ్చేసిందనుకున్నా. నా మీద నాకే నమ్మకం లేకుండాపోయింది. కానీ నాకు మార్షల్ ఆర్ట్స్‌లో పట్టు ఉంది కాబట్టి డిసిప్లైన్డ్‌గా ఎలా ఉండాలో నేర్పింది. ఆ 14 ఫ్లాప్‌లు నేర్పిన గుణపాఠం వల్లే ఈరోజు నేను హిట్ సినిమాలు చేయగలుగుతున్నా’ అన్నారు. మార్షల్ ఆర్ట్స్‌పై మంచి పట్టు ఉన్న నటుడు కాబట్టే ఎక్కవగా ఆయన యాక్షన్ కాన్సెప్ట్ ఉన్న సినిమాల్ల నటిస్తున్నారు. అంతేకాదు కామెడీ, హార్రర్, సోషల్ మెసేజ్, థ్రిల్లర్ సినిమాల్లోనూ నటించారు. ఆయన నటించిన క్రైమ్ థ్రిల్లర్ చిత్రం ‘రుస్తుం’కు జాతీయ అవార్డును అందుకున్నారు. ఇటీవల కాలంలో అక్షయ్ నటించిన ‘ఎయిర్‌లిఫ్ట్, టాయ్‌లెట్- ఏక్ ప్రేమ్‌కథా, మిషన్ మంగళ్, స్పెషల్ 26, ఓఎంజీ సినిమాలు మంచి విజయాలు అందుకున్నాయి. అందుకే ఆయన అమెరికన్ బిజినెస్ మ్యాగజైన్ ఫోర్బ్స్‌లో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్న హీరోగా టాప్ 100 సెలబ్రిటీల లిస్ట్‌లో చోటు సంపాదించుకున్నారు. ప్రస్తుతం అక్షయ్ ‘హౌస్‌ఫుల్ 4’ సినిమాతో బిజీగా ఉన్నారు. ఫర్హాద్ సంఝీ దర్శకత్వం వహించారు. ఇందులో ఆయనతో పాటు రితేష్ దేశ్‌ముఖ్, బాబీ డియోల్, కృతి సనన్, కృతి కర్బంద, పూజా హెగ్డే మెయిన్ రోల్స్‌లో నటించారు. అక్టోబర్ 26న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో పాటు ఆయన ‘లక్ష్మీ బాంబ్’, ‘సూర్యవంశి’ ‘పృథ్వీరాజ్’ సినిమాలతో బిజీగా ఉన్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2nLRIRX
v

'సైరా'పై అల్లు అర్జున్ స్పందన.. బన్నీ మనసులో ఇంతుందా?

సినిమాపై అందరికి భారీ అంచనాలున్నాయి. అంతేకాదు బాహుబలి తరువాత మళ్ళీ ఒక తెలుగు సినిమా ఆ రేంజ్‌లో సంచలనం సృష్టించబోతోంది అన్న ఆనందం ప్రతిఒక్కరిలో ఉంది. కానీ ఈ సినిమా ట్రైలర్ గుంరించి బన్నీ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఏదైనా చిన్న సినిమా విజయం సాధిస్తేనే బేషజానికి పోకుండా ఆ సినిమాని సోషల్ మీడియాలో పొగిడి దానికి మైలేజ్ తెచ్చే బన్నీ అంత పెద్ద సినిమా, అంతా అద్భుతం అంటూ ఆకాశానికి ఎత్తేస్తున్న సినిమా, స్వయానా సొంత మేనమామ అయిన సినిమా గురించి కనీసం కూడా స్పందించకపోవడంతో అంతా బన్నీని ఏకేస్తున్నారు. అలానే సైరా ప్రీ రిలీజ్ ఫంక్షన్‌కి రానందుకు కూడా బన్నీని ట్రోల్ చేస్తున్నారు. Also Read: అప్పుడు సైలెంట్‌గా ఉన్న బన్నీ ఇప్పుడు మాత్రం తన సోషల్ మీడియా అకౌంట్‌లో సైరా గురించి ఒక సుదీర్ఘమయిన పోస్ట్ పెట్టాడు.' సైరా నరసింహారెడ్డి..మెగాస్టార్ చిరంజీవి గారు నటించిన ఒక మాగ్నమ్ ఓపస్ ఇది. ఇది నిజంగా తెలుగు సినిమా గర్వించదగ్గ విషయం. చాలా సంవత్సరాల క్రితం నేను మగధీర సినిమా చూసినప్పుడు ఎప్పుడోఅప్పడు చిరంజీవిగారిని కూడా అలాంటి ఒక గ్రాండ్ ఎపిక్ సినిమాలో చూడాలి అనుకున్నాను. ఆ ఆశ ఇప్పుడు నెరవేరింది. చిరంజీవి గారితో ఇలాంటి ఎపిక్ సినిమా తీసినందుకు ఈ సినిమా ప్రొడ్యూసర్ మరియు నా సోదరుడు అయిన రామ్ చరణ్‌కి థాంక్స్ చెబుతూ అభినందిస్తున్నాను. ఒక తండ్రికి ఒక కొడుకు ఇవ్వగలిగిన బెస్ట్ గిఫ్ట్ ఇదే. కన్న తండ్రి ఘనవారసత్వానికి అసలయిన నివాళి. ఈ సినిమాకి పని చేసిన కాస్ట్ అండ్ క్రూ అందరికి కూడా బెస్ట్ విషెస్. డైరెక్టర్ సురేందర్ రెడ్డి గారికి ప్రత్యేకంగా గౌరవం తెలుపుతున్నాను. ఈ సినిమా మన గుండెలపై ఎప్పటికి నిలిచిపోయే ఒక మ్యాజిక్ క్రియేట్ చెయ్యాలని, ఆ సినిమా పేరు మన గుండెల్లో ఎప్పుడూ ప్రతిధ్వనించాలని కోరుకుంటున్నా' అంటూ సుదీర్ఘంగా సైరా సినిమాకి విషెస్ చెప్పాడు. బన్నీ రాసిన లేఖలో ఎలాంటి తప్పు లేదు. కానీ అప్పుడు సైరా ని విస్మరించడానికి, ఇప్పుడు రిలీజ్ ముందు మళ్ళీ ఇలా ఇంత రేంజ్‌లో పొగడడానికి కారణం ఏంటి?. బన్నీ తాను చేసింది తప్పు అని తానే రియలైజ్ అయ్యాడా? లేక ఎవరయినా చెబితే ఇలా స్పందించాడా? అనే విషయంపై ఇంకా రకరకాలుగా కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇంకొంతమంది అయితే ఇప్పుడు ఈ సినిమాని పక్కనబెడితే నటిస్తున్న అల..వైకుంఠపురములో సినిమాకి కూడా నెగెటివిటీ వస్తుంది అని ఇలా రియాక్ట్ అయ్యాడా? అని కూడా మాట్లాడుతున్నారు. కానీ ఎంతయినా ఒకే కుటుంబం, పైగా తాను నటుడు అవ్వడానికి ఇన్స్పిరేషన్ గా నిలిచిన మేనమామ సినిమా ...పొగడకుండా ఎందుకుంటాడు. కాకపోతే బన్నీ ఇక్కడ చెప్పిన మాటలన్నీ కూడా ప్రీ రిలీజ్ ఈవెంట్స్‌లో చిరంజీవి చరణ్ గురించి,ఈ సినిమా గురించి చెప్పినమాటల్లాగా ఉండడం కొసమెరుపు. Also Read:


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2mgpDBX
v

కాకపుట్టిస్తున్న స్టార్ హీరో భార్య యోగా పోజులు

పిల్లలు పుట్టాక ఎలాగైనా ప్రెగ్నెన్సీ వెయిట్ తగ్గించేసుకోవాలని చూసే ఆడవాళ్లు ఎందరో ఉంటారు. ఇందుకోసం కొందరు కష్టపడి వర్కవుట్స్ చేసి మరీ తగ్గించుకుంటారు. మరికొందరైతే ట్రీట్‌మెంట్స్ చేయించుకుని ప్రాణాల మీదకు తెచ్చకుంటూ ఉంటారు. ఈ విషయంలో సెలబ్రిటీలు మరింత జాగ్రత్తగా ఉంటారు. నటీమణులైతే మరీనూ. ఎక్కడ ఒళ్లు చేస్తే వారిని చూసేవారు ఉండరో అని కంగారుపడిపోతుంటారు. మరికొందరైతే సినిమాల కోసం పిల్లల్ని కనడం వద్దనుకుని సరోగసీ పద్ధతులు ఎంచుకుంటున్నారు. ఇక్కడ ప్రస్తావన బాలీవుడ్ నటుడు షాహిద్ కపూర్ భార్య గురించి. మీరా ఎలాంటి సరోగసీ పద్ధతులు ఎంచుకోలేదు. 24 ఏళ్లకే ఆమెకు ఇద్దరు పిల్లలు తల్లయింది. దాంతో సహజంగానే కాస్త ఒళ్లు చేసింది. దాంతో తన భర్తతో కలిసి రోజూ జిమ్‌కి, యోగాకు వెళ్తున్నారు. తాజాగా మీరా రాజ్‌పుత్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఓ ఫొటో సోషల్ మీడియాలో కాక పుట్టిస్తోంది. యోగా దుస్తులు ధరించి వేలాడుతున్నట్లుగా ఉన్న ఫొటోను పోస్ట్ చేసి ‘హ్యాంగింగ్ ఇన్ దేర్’ అని క్యాప్షన్ ఇచ్చారు. ‘వావ్ హాట్ బాడీ’ అంటూ నెటిజన్లు తెగ కామెంట్లు పెడుతున్నారు. నటీమణులతో పోలిస్తే మీరా రాజ్‌పుత్ ఫిట్‌నెస్ విషయంలో ఏమాత్రం తీసిపోరు. ఆమె ఎలాంటి సినిమాల్లో నటించకపోయినప్పటికీ స్టార్ హీరో భార్య కాబట్టి ఆ స్థాయికి తగ్గట్టుగా తన బ్యూటీని మెయింటైన్ చేసుకుంటున్నారు. షాహిద్ కపూర్ భార్యగా మీరాకు బాలీవుడ్‌లో మంచి పాపులారిటీ ఉంది. ఆమె ఇన్‌స్టాగ్రామ్ ఖాతాకు ఇరవై లక్షలకు పైగా ఫాలోవర్స్ ఉన్నారు. స్టార్ హీరో భార్య కావడంతో ఆమె చేత టీవీ ప్రకటనలు కూడా చేయిస్తున్నారు. షాహిద్ కంటే మీరా వయసులో పదేళ్లు చిన్నది. దిల్లీకి చెందిన మీరాకు షాహిద్‌కు 2015లో పెళ్లైంది. ఓ హీరో భార్య కావడంతో మీరా మొదట్లో ఫ్యాన్స్ నుంచి బాగా ఇబ్బందిపడేవారు. బయటికి వెళ్లేటప్పుడు క్యాజువల్‌గా వెళ్లేవారు. దాంతో ఫ్యాన్స్ ఆమెను ముట్టుకోవడానికి ట్రై చేసేవారట. ఈ విషయాన్ని మీరా షాహిద్‌కు చెప్పడంతో ఆమె కోసం ఓ బాడీగార్డ్‌ను నియమించాడు. అంతేకాదు.. త్వరలో షాహిద్, మీరా మళ్లీ పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నారట. ఈ విషయాన్ని మీరా ఒకానొక సందర్భంలో వెల్లడించింది.



from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2mfMe1v
v

చరణ్ గురించి చిరు.. బెంగుళూరులో కూడా పవన్ క్రేజ్ పీక్స్

రిలీజ్‌కి ఎంతో టైమ్ లేదు. చూస్తుండగానే రిలీజ్ డేట్ రోజుల్లో నుండి గంటల్లోకి వచ్చేసింది. దీంతో సైరా టీమ్ కూడా ప్రమోషన్స్‌లో జోరు పెంచింది. ముందు నుండి కాస్త డల్‌గా ఉన్న టీమ్ ఇప్పుడు మాత్రం సైరా ప్రచారాన్ని హోరెత్తిస్తుంది. హిందీలో అమితాబ్, మలయాళంలో పృథ్విరాజ్, కన్నడలో శివరాజ్ కుమార్ ఈ సినిమా ప్రమోషన్స్‌కి అటెండ్ అయ్యారు. అయితే ఇప్పటివరకు చరణ్ గురించి పెద్దగా ఓపెన్ అవ్వని కన్నడ ప్రీ రిలీజ్ ఫంక్షన్‌లో మాత్రం తన ఉద్వేగాన్ని ఆపుకోలేకపోయారు. వెళ్లిన ప్రతి చోట ఇలాంటి సినిమా తీసినందుకు చరణ్‌ని అంతా పొగుడుతుంటే చూసి మురిసిపోయిన చిరంజీవి బెంగుళూరులో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో తన మనసులోని మాటలను బయటపెట్టారు. Also Read: 'చిరంజీవి నువ్వు ఏం సాధించావు అంటే ముందు నా అభిమానులు అని చెబుతాను.కానీ నేను వేరు నా అభిమానులు వేరు కాదు కాబట్టి నువ్వు ఏం సాధించావు అంటే రామ్ చరణ్‌ని సాధించాను అని చెబుతాను'' అని అన్నారు. ఆ టైమ్‌లో ముందు చిరంజీవి ముఖంలో, ఆ‌మాట చెబుతున్నప్పుడు రామ్ చరణ్ ముఖంలో కూడా ఒక రకమయిన భావోద్వేగం కనిపించాయి. ఇద్దరూ కూడా పెల్లుబికి వస్తున్న ఆనందభాష్పాలను కంట్రోల్ చేసుకున్నారు. Also Read: అయితే అంతకుముందు చరణ్ గురించి చాలా చెప్పుకొచ్చారు చిరంజీవి. మగధీర సినిమా వచ్చినప్పుడు అది చూసి,ఆ పాత్ర చూసి తనకు ఇప్పటివరకు అలాంటి సినిమా రాలేదు అని చెప్పాను అని అది తాను మర్చిపోయినా చరణ్ మర్చి పోకుండా ఇప్పుడు తనకు చరిత్రలో నిలిచిపోయే సైరా నరసింహారెడ్డి అనే సినిమా ఇచ్చాడు అని చెప్పుకొచ్చాడు.'ఎవరయినా కొడుకును ప్రోమోట్ చెయ్యాలనుకుంటారు, కానీ ఇక్కడ నా బిడ్డ నా కోరిక తీరుస్తూ నన్ను మరొక లెవెల్‌లో ఉంచేలాగా, ఒక అద్భుతమయిన క్యారెక్టర్ నా సినీ జీవితంలో మిగిలిపోయేలాగా చేసిన రామ్ చరణ్ ‌ని నేను మనస్ఫూర్తిగా, ఈ సభాముఖంగా...'' అంటూ ముద్దాడారు. 'హి ఈజ్ మై ప్రౌడ్ సన్' అంటూ పొగిడేశారు.ఇది ఆ ఈవెంట్ మొత్తానికి హై లైట్ ఇన్సిడెంట్‌గా నిలిచింది. Also Read: ఈ ఫంక్షన్ కి ముఖ్య అతిథిగా వచ్చిన శివన్న కూడా మెగాఫ్యామిలీ గురించి ఒక రేంజ్‌లో పొగిడారు. అయితే ఆ స్పీచ్ మధ్యలో ప్రస్తావన వచ్చింది. శివరాజ్ కుమార్ ''రామ్ చరణ్ అందంగా ఉంటాడు,ఆ ఫ్యామిలీ మొత్తం అందంగా ఉంటారు, పవన్ కళ్యాణ్ అందంగా ఉంటారు'' అన్నారు. పవన్ కళ్యాణ్ అనే మాట వినబడగానే ఈలలు, గోల. తరువాత శివరాజ్ కుమార్ మాట్లాడడానికి కామ్‌గా ఉండమని అక్కడి వాళ్ళను రిక్వెస్ట్ చెయ్యాల్సి వచ్చింది. మళ్ళీ తాను పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అని ఆయన చెప్పగానే మళ్ళీ అంతా విజిల్స్. ఈ ఇన్సిడెంట్‌తో పవన్ క్రేజ్ కేవలం తెలుగు వరకే పరిమితం కాదు అని మరొకసారి ప్రూవ్ అయ్యింది. ఓవరాల్‌గా కన్నడ ప్రీ రిలీజ్ ఈవెంట్‌తో మాత్రం సైరాకి ఫుల్ మైలేజ్ వచ్చింది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2oy0Vhc
v

ఆ సినిమా కోసం 100 ఇళ్లపై నుంచి దూకిన స్టార్ హీరో

డేర్ డెవిల్ స్టంట్స్ చేయాలంటే చాలా మంది హీరోలు ఎందుకులే రిస్క్ అనుకుని డూప్ చేత చేయించుకుంటారు. ఇలాంటి రిస్కీ స్టంట్స్ చేసే అతి కొద్ది మంది బాలీవుడ్ హీరోల్లో అక్షయ్ కుమార్, , హృతిక్ రోషన్ మాత్రమే ఉన్నారు. ఇప్పుడు టైగర్ ష్రాఫ్, హృతిక్ రోషన్ ప్రధాన పాత్రల్లో ‘వార్’ అనే సినిమా వస్తోంది. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్నారు. అసలే ఇద్దరు యాక్షన్ సూపర్‌స్టార్స్. వీరి చేత యాక్షన్ ఎపిసోడ్స్ చేయించాలంటే గత సినిమాలకంటే భిన్నంగా ఉండాలి. అందుకే వారి ఇమేజ్‌ని, ప్రేక్షకుల అంచనాలను దృష్టిలో పెట్టుకుని సినిమాను తెరకెక్కించారు సిద్ధార్థ్. అయితే ఈ సినిమాలో టైగర్ ష్రాఫ్ చేసిన స్టంట్స్ గురించి ఓ ఆసక్తికరమైన విషయం బయటికి వచ్చింది. సినిమాలోని ఈ స్టంట్స్ అన్నీ ఇటీలోని మటేరా అనే టౌన్‌లో తెరకెక్కించారు. ఈ నేపథ్యంలో టైగర్ దాదాపు వంద ఇళ్ల మీద నుంచి పార్కూర్ (పల్టీలు కొట్టడం) జంప్స్ చేశాడట. ఈ విషయాన్ని దర్శకుడు మీడియా ద్వారా వెల్లడించారు. ‘ఇండియాలో పార్కూర్ స్టంట్స్ చేయడంలో టైగర్‌ను మించినవారు లేరు. ఆయన స్కిల్స్‌ని ఈ సినిమాలో మరింత బాగా వాడుకోవాలని అనుకున్నాం. అందుకే ఇటలీలో ఆయనకు సంబంధించిన స్టంట్స్ అన్నీ తీశాం. దాదాపు 100 ఇళ్ల పై నుంచి టైగర్ జంప్స్ చేశాడు. ఇలాంటి జంప్స్ చేయాలంటే చాలా కష్టం. ఇందుకోసం టైగర్ మా కంటే నాలుగు రోజుల ముందే ఇటలీకి వెళ్లాడు. అక్కడి మటేరా టౌన్‌లోని ఇళ్లపై జంప్స్ చేయడం ప్రాక్టీస్ చేశాడు. అలా ఒక రోజు మొత్తం ఈ స్టంట్స్ షూట్ చేశాం. ఇన్ని స్టంట్స్ మీరు ఏ సినిమాలో చూసి ఉండరని కచ్చితంగా చెప్పగలం’ అని వెల్లడించారు సిద్ధార్థ్. ఈ సినిమాతో టైగర్ ష్రాఫ్ చిరకాల కోరిక నెరవేరింది. తన గురువైన హృతిక్‌తో కలిసి పనిచేయాలని ఎప్పటినుంచో టైగర్ కలలు కంటున్నాడు. వార్ సినిమాతో ఆ కల నెరవేరింది. ఇందులో వాణీ కపూర్ కథానాయికగా నటించారు. యశ్ రాజ్ ఫిలింస్ సంస్థ భారీ బడ్జెట్‌తో సినిమాను తెరకెక్కించింది. అక్టోబర్ 2న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2n2gD3z
v

గోపీచంద్ ‘చాణక్య’: ఫస్టాఫ్ సరదాగా.. సెకండాఫ్ యాక్షన్

గోపీచంద్, మెహ్రీన్ హీరో హీరోయిన్లుగా న‌టించిన చిత్రం `చాణక్య`. బాలీవుడ్ హీరోయిన్ జరీన్‌ఖాన్ కీల‌క పాత్రలో న‌టించారు. తిరు ద‌ర్శక‌త్వంలో ప్రముఖ నిర్మాణ సంస్థ ఎ.కె.ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై రామబ్రహ్మం సుంక‌ర నిర్మాత‌గా ఈ సినిమా రూపొందుతోంది. అక్టోబ‌ర్ 5న విడుద‌లవుతున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ వైజాగ్‌లో ఆదివారం రాత్రి జ‌రిగింది. ఈ కార్యక్రమంలో హీరో , డైరెక్టర్ తిరు, అనిల్ సుంకర, రామజోగయ్య శాస్త్రి, రాజేష్ ఖట్టర్, ఎం.వి.వి.సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హీరో గోపీచంద్ మాట్లాడుతూ.. ‘‘నా నుంచి ప్రేక్షకులు ఎలాంటి అంశాలను కోరుకుంటారో అవ‌న్నీ ఈ సినిమాలో ఉన్నాయి. మంచి ఫైట్స్‌, డైలాగ్స్ ఉన్నాయి. డైరెక్టర్ తిరు ఓ హీరోను ఎలా చూపించాలో అలా చూపించారు. అబ్బూరి ర‌వి చాలా మంచి డైలాగ్స్ రాశారు. పాట‌లకు కూడా మంచి స్పంద‌న వ‌స్తుంది. విశాల్ చంద్రశేఖ‌ర్‌, శ్రీచ‌ర‌ణ్ పాకాల అద్భుత‌మైన సంగీతాన్ని అందించారు. అనిల్ సుంక‌ర‌ గారికి సినిమాలంటే ఎంతో ఇష్టం. అలాంటి వ్యక్తితో క‌లిసి ప‌నిచేయ‌డాన్ని ఆశ్వాదించాను. మీ అందరి ప్రేమతో అక్టోబర్ 5న మళ్లీ నేనేంటో నిరూపించుకుంటాను’’ అని అన్నారు. డైరెక్టర్ తిరు మాట్లాడుతూ.. ‘‘గోపీచంద్‌ గారు స‌రికొత్త పాత్రలో న‌టించారు. ఆయ‌న ఫేవ‌రెట్ సినిమాల లిస్టులో ఈ సినిమా కూడా ఉంటుంది. అక్టోబ‌ర్ 5న విడుద‌ల‌వుతున్న ఈ సినిమాను ప్రతి ఒక్కరూ ఎంజాయ్ చేస్తారు. శ్రీచ‌ర‌ణ్ పాకాల‌, విశాల్ చంద్రశేఖ‌ర్ మంచి సంగీతాన్ని, బ్యాగ్రౌండ్ స్కోర్‌ను అందించారు. వెట్రిగారు చాలా మంచి విజువ‌ల్స్ ఇచ్చారు. అబ్బూరి ర‌విగారు అద్భుత‌మైన డైలాగ్స్ రాశారు. అలాగే రామ‌జోగ‌య్య శాస్త్రిగారు చాలా మంచి పాట‌ల‌ను రాశారు. సినిమా ఎంట‌ర్‌టైన్ చేసేలా ఉంటుంది. గోపీచంద్‌గారు చాలా హార్డ్ వ‌ర్క్ చేసిన చిత్రమిది’’ అని చెప్పారు. Also Read: రామ‌జోగయ్య శాస్త్రి మాట్లాడుతూ.. ‘‘సినిమా ప్రేక్షకుల అంచ‌నాల‌ను మించేలా ఉంటుంది. డైరెక్టర్ తిరు మ‌న తెలుగువాడే. ఆయ‌న నిర్మాత‌ల‌తో క‌లిసి సినిమాను బ్రహ్మాండంగా తీర్చిదిద్దుతున్నారు. వైవిధ్యమైన చిత్రాల‌ను ఆద‌రిస్తున్న తెలుగు ప్రేక్షకులు ఈ సినిమాను కూడా ఆద‌రిస్తారనే న‌మ్మకంతో ఉన్నాం. విశాల్ చంద్రశేఖ‌ర్‌, శ్రీచ‌ర‌ణ్ పాకాల మంచి మ్యూజిక్‌ను అందించారు. ఫస్టాఫ్ స‌ర‌దాగా.. సెకండాఫ్‌లో మంచి యాక్షన్ పార్ట్ ఉంటుంది. అంద‌రినీ మెప్పించేలా సినిమా ఉంటుంది’’ అని అన్నారు. బాలీవుడ్ నటుడు రాజేష్ ఖట్టర్ మాట్లాడుతూ.. ‘‘నేను తెలుగు సినిమాల్లో న‌టించాల‌ని ఎదురు చూస్తున్న త‌రుణంలో నాకు ద‌క్కిన అవ‌కాశ‌మిది. చాణ‌క్య సినిమాతో నేను గోపీచంద్‌ గారిని క‌ల‌వ‌డం, ఆయ‌న‌తో క‌లిసి పనిచేయ‌డం సంతోషంగా ఉంది. ఈ సినిమాలో ఖురేషి పాత్రలో క‌న‌ప‌డ‌తాను. తెలుగులో నేనే డ‌బ్బింగ్ చెప్పుకున్నాను’’ అని వెల్లడించారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2mbsoUY
v

Sunday 29 September 2019

‘అర్జున్ రెడ్డి రీమేక్‌లో నటించే అవకాశం వచ్చింది.. కానీ’

‘అర్జు్న్ రెడ్డి’ సినిమాలో విజయ్ దేవరకొండను కాకుండా మరొకరిని ఊహించుకోలేం. అదే విధంగా దీనికి హిందీ రీమేక్‌గా వచ్చిన ‘కబీర్ సింగ్’లో బాలీవుడ్ నటుడు షాహిద్ కపూర్‌ను తప్ప ఇంకో హీరోను ఊహించుకోలేం. అయితే సినిమాలో మొదట బాలీవుడ్ నటుడు అర్జున్ కపూర్‌ను ఎంపిక చేసుకోవాలని అనుకున్నారట. అర్జున్ కపూర్ హీరోగా 2018లో ‘ముబారక’ అనే సినిమా వచ్చింది. ఈ సినిమా నిర్మాతలైన అశ్విన్, మురాద్‌లు కలిసి అర్జున్ రెడ్డి రీమేక్ రైట్స్ కొనుక్కున్నారు. అర్జున్ రెడ్డి రీమేక్‌లో అర్జున్ కపూర్‌ని ఎంపిక చేసుకోవాలన్న ఉద్దేశంతోనే రీమేక్ హక్కులు కొనుక్కున్నారు. కానీ హిందీ రీమేక్‌ను కూడా సందీప్ రెడ్డి వంగా చేతే డైరెక్ట్ చేయించుకోవాలని అనుకున్నారు. ఈ విషయం సందీప్ రెడ్డికి తెలీగానే తన మైండ్‌లో షాహిద్ కపూర్‌ను ఊహించుకున్నారు. ఆ తర్వాత సందీప్, షాహిద్ కలిసి అర్జున్ రెడ్డి సినిమా చూశారు. అలా ఆ సినిమా షాహిద్ చేతుల్లోకి వెళ్లిపోయింది. దీని గురించి అర్జున్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘నాతో అర్జున్ రెడ్డి సినిమాను తెరకెక్కించాలన్న ఉద్దేశంతోనే అశ్విన్, మురాద్ కలిసి సినిమా హక్కులను కొనుక్కున్నారు. కానీ దర్శకుడు సందీప్ రెడ్డి వంగాకు ఎవరు నచ్చితే వారితోనే సినిమా చేయాలి. ఆయన షాహిద్ కపూర్‌ను ఊహించుకుని కథలో మార్పులు చేసుకున్నారు. దాంతో సినిమా నా చెయ్యి దాటిపోయింది. అంతేకానీ ఈ సినిమా కోసం నేను కరెక్ట్ కాదన్న ఉద్దేశంతో కాదు. ఇందులో షాహిద్ కపూర్‌ను ఎంపిక చేసుకోవడం వల్ల మంచిదే అయింది. సినిమా బ్లాక్ బస్టర్ విజయం అందుకుంది. షాహిద్ ఫెంటాస్టిక్‌గా నటించాడు’ అని వెల్లడించారు అర్జున్. అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్ సినిమాలను ఎన్నో వివాదాలు చుట్టుముట్టాయి. కానీ ఈ రెండు సినిమాలు ఇద్దరు హీరోల జీవితాలను మార్చేశాయి. షాహిద్ కపూర్ ఎటూ హీరోగా టాప్ స్థానంలో ఉన్నాడు కాబట్టి అతను ప్రత్యేకంగా ప్రూవ్ చేసుకోవాల్సింది ఏమీ లేదు. కానీ అరకొర పాత్రలు చేస్తూ ఉన్న విజయ్ దేవరకొండకు మాత్రం ఈ సినిమా ఓ వరంలాగే దొరికింది. సినిమాలో హీరో పొగ తాగాడు, ముద్దు పెట్టుకున్నాడు, సెక్స్ చేశాడు అన్న విమర్శలు పక్కన పెడితే ఈ సినిమాతో టాలీవుడ్ చిత్ర పరిశ్రమకు విజయ్ దేవరకొండలాంటి ట్యాలెంటెడ్ హీరో దొరికాడు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2otfL8x
v

రొమాంటిక్ ఫస్ట్ లుక్: హాట్ కాదు...అరాచకం అంతే

ఒకప్పుడు బాలీవుడ్‌కి మాత్రమే పరిమితమయిన హాట్ సీన్స్, బోల్డ్ సీన్స్, లిప్ లాక్స్ ఇప్పుడు తెలుగు సినిమాల్లో కూడా కామన్ అయిపోయాయి. ఇంకా కరెక్ట్‌గా చెప్పాలంటే అవి లేకుండా సినిమా తియ్యడానికి కూడా ఎవరూ ఇష్టపడట్లేదు. పెద్ద హీరో అయినా, యంగ్ హీరో అయినా కూడా సినిమాకి మైలేజ్ పెంచే ఆ సీన్స్ మాత్రం కామన్ కంటెంట్. పెద్ద సినిమాలో అయినా కూడా లిప్ లాక్స్ లేకపోతే ట్రెండ్‌కి దూరంగా ఉన్నారు అనేస్తున్నారు అని ఆ తరహా సీన్ ఒకటయినా ఉండేలా చూసుకుంటున్నారు. Also Read: బోల్డ్ సీన్స్‌ని తెరకెక్కించడంలో పూరి మార్క్ వేరు. ఎలాంటి హీరోకి అయినా తన సినిమాలో మేకోవర్‌తో ఒక కొత్త లుక్‌తో పాటు కొత్త ఇమేజ్ కూడా ఇచ్చే పూరి హీరోయిన్స్‌కి అయితే తన సినిమాతో ఏకంగా లైఫ్ ఇచ్చేస్తాడు. ఇలియానా నుండి ఇప్పుడు నభా నటేష్ వరకు అనేకమంది హీరోయిన్స్ పూరి ప్రోడక్ట్స్. ఆయన కళ్ళలో పడి మెప్పించగలిగితే ఆమె హాట్ ఎస్సెట్స్ ఏంటి అనేది తన సినిమాల్లో వెండితెరపై ఆరబోసి మరీ ప్రూవ్ చేస్తాడు. ఇప్పుడు పూరి స్కూల్ నుండి వస్తున్న రొమాంటిక్ సినిమాలో హీరోయిన్ దశ కూడా ఈ ఒక్క సినిమాతో మారిపోతుంది అనిపిస్తుంది రొమాంటిక్ సినిమా ఫస్ట్ లుక్ చూస్తుంటే. ఎక్స్పోజింగ్ అనే మాటని పీక్స్‌లో ప్రెసెంట్ చేసి చూసుకున్నోళ్లకి చూసుకున్నంత అనేలా ఆ ఫస్ట్ లుక్‌ని ప్రెజెంట్ చేసారు. Also Read: ఆ పోస్టర్‌లో కేతికా శర్మ టాప్ లెస్‌గా కనిపిస్తుంది. ఆకాష్ పూరిని గట్టిగా హత్తుకుంది. ఆ హాట్ కౌగిలి ఆవిరిలోని ఆనందాన్ని అనుభవిస్తూ తన్మయత్వంతో కళ్ళు మూసుకున్నాడు రొమాంటిక్ హీరో . కానీ ఆ ఫస్ట్‌లుక్ పై నుండి కళ్ళు తిప్పుకోలేకపోతున్నారు కుర్రాళ్ళు. ఆ సినిమా టైటిల్‌కి జస్టిఫికేషన్ చేస్తూ ఫస్ట్ లుక్‌లోనే ఈ రేంజ్‌లో ట్రీట్ ఇచ్చారంటే సినిమాలో ఇంకెలాంటి డోస్ ఉండబోతుంది అనేది అర్ధం చేసుకోవచ్చు. ఇస్మార్ట్ శంకర్‌తో విజయం అందుకున్న పూరి కనెక్ట్స్‌కి ఈ సినిమా కూడా అదే రేంజ్ విజయం అందించబోతుందని అనే ఇంప్రెషన్ కలిగించింది ఈ పోస్టర్. గతంలో కళ్యాణ్ రామ్ కంపెనీలో విజువల్ ఎఫెక్స్ట్ సూపర్ వైజర్‌గా పనిచేసిన అనిల్ పాదూరి ఈ సినిమాతో డైరెక్టర్ గా పరిచయం అవుతున్నాడు. అతనికి కూడా డైరెక్టర్‌గా స్టాండ్ ఇచ్చేలా ఉంది ఈ ఫస్ట్ లుక్. Also Read: ఆకాష్ పూరి నటించిన ఆంధ్రాపోరి, మెహబూబా రెండు సినిమాలు కూడా నిరాశపరచడంతో ఇప్పటివరకు రొమాంటిక్ సినిమాపై అంచనాలు లేవు. కానీ ఇప్పుడు మాత్రం ఈ సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని యూత్ మొత్తం ఎదురుచూసేలా ఈ ఫస్ట్ లుక్‌ని ఆవిష్కరించారు. ఇస్మార్ట్ శంకర్‌లో మాస్‌ని టార్గెట్ చేసిన పూరి ఈ సారి యూత్‌ని టార్గెట్ చేశారు. మొత్తానికి ఈ ఒక్క పోస్టర్‌తో రొమాంటిక్ రచ్చ స్టార్ట్ చేసేసాడు. థియేటర్స్‌లో రాక్ చేస్తాడో లేదో చూడాలి.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2owjjal
v

Mardaani 2: ఆపేది లేదంటూ చితక్కొట్టిన రాణీ ముఖర్జీ

‘హిచ్కీ’ సినిమాతో సెకెండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టారు బాలీవుడ్ బ్యూటీ . ఈ సినిమా మంచి విజయం సాధించింది. ఇప్పుడు ‘మర్దానీ 2’ సినిమాతో తనలోని రౌడీ పోలీస్‌ని మరోసారి పరిచయం చేయడానికి వస్తున్నారు. 2014లో వచ్చిన బ్లాక్ బస్టర్ చిత్రం ‘మర్దానీ’కి ఇది సీక్వెల్‌గా రాబోతోంది. గోపీ పుత్రన్ దర్శకత్వం వహిస్తున్నారు. యశ్‌రాజ్ ఫిలింస్ బ్యానర్‌పై తన భర్త ఆదిత్య చోప్రా నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. కాగా ఈ సినిమాకు సంబంధించిన డేట్ అనౌన్స్‌మెంట్ టీజర్‌ను చిత్రబృందం తాజాగా విడుదల చేసింది. పవర్‌ఫుల్ పోలీసు అధికారిణి శివానీ శివాజీ రాయ్ పాత్రలో రాణీ ఎంట్రీ హైలైట్‌గా నిలిచింది. ‘వారు ఆపేంతవరకు ఆమె ఆపదు’ అన్న క్యాప్షన్‌తోనే సినిమాను ఏ రేంజ్‌లో తెరకెక్కించారో తెలుస్తోంది. నడిరోడ్డుపై ఓ వ్యక్తిని బెల్టు తీసుకుని రాణీ ముఖర్జీ చితక్కొడుతున్న సన్నివేశం అదుర్స్ అనిపించింది. ఇందులో 21 ఏళ్ల విలన్‌తో రాణి పోటీపడతారు. వాడిని ఎలా ఎదిరించార అన్నదే ఈ సినిమా కథ. ఇక మిగతా పిక్చర్ ఎలా ఉండబోతోందో తెలియాలంటే మరికొంత కాలం ఆగాల్సిందే. వయసవుతున్నప్పటికీ రాణీలో ఉన్న ఆ ఫైర్ ఇంకా అలాగే ఉంది. ఇందులో విక్రమ్ సింగ్ చౌహాన్, శ్రుతి బాప్నా కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇంకా షూటింగ్ జరుగుతోంది. డిసెంబర్ 13న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. 2014 వరకు ఎన్నో విజయవంతమైన సినిమాల్లో నటించారు రాణీ ముఖర్జీ. అప్పటికే ఆమె లెజండరీ నిర్మాత యశ్ చోప్రా కుమారుడు ఆదిత్య చోప్రాతో ప్రేమలో ఉన్నారు. దాంతో ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఎక్కడ మీడియా వర్గాల కళ్లకు తమ పైనే ఉంటాయోనని భావించి 2014 ఏప్రిల్ 21న ఇటలీలో రహస్యంగా వివాహం చేసుకున్నారు. వీరికి 2018లో ఆడపిల్ల పుట్టింది. పాపకు తన పేరు తన భర్త పేరు కలిసేలా అధీరా అని నామకరణం చేశారు. ఇక ఆదిత్య చోప్రాను పెళ్లి చేసుకోవడంతో రాణీ ముఖర్జీ సినిమాలకు గుడ్‌బై చెప్పేసినట్లే అనుకున్నారు చాలా మంది. కానీ ‘హిచ్కీ’ అనే విభిన్నమైన కాన్సెప్ట్‌తో తెరకెక్కిన సినిమాలో నటించిన తన సెకండ్ ఇన్నింగ్స్‌ను మొదలుపెట్టారు. ఈ సినిమా రూ.100 కోట్ల క్లబ్‌లో చేరి అందరినీ ఆశ్చర్యపరిచింది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2mZ3UP5
v

సెక్స్ చేయాలనిపిస్తే చేసేయండి- కంగన బోల్డ్ కామెంట్స్

బోల్డ్ వ్యాఖ్యలు చేయడంలో బాలీవుడ్ నటి కంగనా రనౌత్‌కు మించినవారు ఎవ్వరూ ఉండరు. అందుకే చాలా మంది నటీనటులు ఆమెతో వాదనలు పెట్టుకోకపోవడమే మంచిది అనుకుంటారు. ఇప్పటికే బాలీవుడ్ నటులు హృతిక్ రోషన్, ఆలియా భట్, నిర్మాత కరణ్ జోహార్ తదితరులు కంగన చేత తిట్లు తిని మీడియా ముందు తమ పరువు పోగొట్టుకున్నారు. ఎన్ని వివాదాల్లో చిక్కుకున్నప్పటికీ కోట్లాది మందికి కంగన రోల్ మోడల్‌గా నిలిచారు. తాజాగా కంగన దిల్లీలో నిర్వమించిన మైండ్ రాక్స్ అనే ఈవెంట్‌లో పాల్గొన్నారు. ఈ ఈవెంట్‌లో ఆమె సెక్స్ గురించి చేసిన బోల్డ్ వ్యాఖ్యలు షాక్‌కు గురిచేసేలా ఉన్నాయి. ప్రతి ఒక్కరి జీవితంలో సెక్స్ అనేది ఇంపార్టెంట్ విషయమని అన్నారు. సెక్స్ చేయాలనిపిస్తే చేసేయాలని అన్నారు. ‘ఒక వ్యక్తిని చూపించి పెళ్లి చేసుకోమని తల్లిదండ్రులు మనకి చెబుతారు. మనకు కూడా ఇష్టం ఉంటే ఆ వ్యక్తి పట్ల ఫీలింగ్స్ పెంచుకుంటాం. నేను సెక్స్ విషయంలో చాలా యాక్టీవ్‌గా ఉంటానని తెలిసినప్పుడు నా తల్లిదండ్రులు షాకయ్యారు. కానీ అంత షాక్ అవ్వాల్సిన అవసరం లేదు. పిల్లలకు సెక్స్ విషయంలో నాలెడ్జ్ ఉన్నందుకు వారు సంతోషించాలి. అయితే సెక్స్‌ని ఓ బాధ్యతగా ఫీలవ్వాలి. సెక్స్‌లో పాల్గొనమని తల్లిదండ్రులే వారిని ప్రోత్సహించేలా ఉండాలి’ అన్నారు. అంతేకాదు కంగన మాటలు ఆసక్తికరంగా ఉన్నాయని అక్కడివారు ఆమెను మరింత రెచ్చగొట్టాలని చూశారు. కంగనకు, హృతిక్ రోషన్‌కు మధ్య ఎప్పటినుంచో విభేదాలు ఉన్నాయన్న సంగతి అందరికీ తెలిసిందే. దాంతో ఈ విషయంపైనే ఆమెకు ఓ ప్రశ్న వేశారు. ‘మీరు ఒకరోజు ఉదయాన్నే లేవగానే హృతిక్ రోషన్‌లా మారిపోతే ఏం చేస్తారు?’ అడిగారు. ఇందుకు కంగన స్పందిస్తూ.. ‘వెంటనే ఫోన్ తీసుకుని కంగనా రనౌత్‌కు కాల్ చేస్తాను. ఇప్పటివరకూ జరిగిన దానికి క్షమాపణ కోరతాను’ అన్నారు. అనంతరం తన తొలి రిలేషన్ షిప్ గురించి, తొలి ముద్దు గురించి మాట్లాడుతూ.. ‘17 ఏళ్ల వయసు ఉన్నప్పుడు నేను ఒక పంజాబీ అబ్బాయిని ఇష్టపడ్డాను. అతను చాలా అందంగా ఉండేవాడు. అప్పటికి అతని వయసు 28. నన్ను చిన్నపిల్లా అని పిలిచినప్పుడు నా గుండె ఆగిపోయింనంత పనైంది. కానీ ఎలాగోలా నా ప్రేమ విషయాన్ని ఆయనకు చెప్పాను. అతను కూడా నన్ను ఇష్టపడ్డాడు. కొంతకాలం ఇద్దరం రిలేషన్‌లో ఉన్నాం. ఆ తర్వాత విడిపోయాం. ఇక తొలి ముద్దు గురించి చెప్పాలంటే నాకు ముద్దు పెట్టడం అసలు వచ్చేది కాదు. నా చేతిమీద ముద్దు పెట్టుకుంటూ ఉండేదాన్ని. అలా నేను ముద్దు పెట్టడం నేర్చుకున్నా. తొలిసారి ఓ వ్యక్తిని ముద్దుపెట్టేటప్పుడు చాలా టెన్షన్ పడ్డాను’ అని వివరించారు కంగన. దీనిని బట్టి చూస్తే జరిగిన దానికి హృతిక్ ఎప్పటికైనా తనకు క్షమాపణ చెప్పకపోడా అని కంగన ఎదురుచూస్తున్నట్లు ఉన్నారు. ఈ వ్యాఖ్యలు హృతిక్ వింటే ఎలా స్పందిస్తాడో చూడాలి. ఎందుకంటే ప్రస్తుతం వీరిద్దరి మధ్య పరిస్థితి పచ్చి గడ్డి వేస్తే భగ్గుమనేలా ఉంది. హృతిక్‌కు పెళ్లైనప్పటికీ తనను ప్రేమించాడని, కొన్నాళ్ల తర్వాత మోసం చేశాడని రెండేళ్ల క్రితం కంగన మీడియా ముందు రచ్చ చేసింది. దీనిపై హృతిక్ స్పందిస్తూ అదంతా అబద్ధమని తాను ఆడపిల్లలతో అంత నీచంగా ప్రవర్తించనని చెప్పాడు. ఇద్దరి మధ్య మాటా మాటా పెరిగింది. ఒకరికొకరు నోటీసులు ఇచ్చుకునేదాకా వెళ్లారు. ప్రస్తుతం పరిస్థితి కాస్త సర్దుమణిగింది. ఇప్పుడు కంగన చేసిన వ్యాఖ్యలతో మళ్లీ ఏం ముందుకొస్తుందో చూడాలి.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2mNHkcr
v

Salman Khan: కత్రినాను మర్చిపోలేకపోతున్నాడు, ఆ హీరోయిన్‌ని ‘క్యాట్’ అని పిలిచేస్తున్నాడు

బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్‌కి.. బార్బీ డాల్ కత్రినా కైఫ్ అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కెరీర్ పరంగా కత్రినాకు సల్మాన్ పిల్లర్‌లా నిలిచాడు. అవకాశాలు లేకపోతే తన సినిమాల్లోనే హీరోయిన్‌గా ఎంపిక చేసుకున్నాడు. కత్రినా విషయం తెలీదు కానీ.. మాత్రం ఆమెను చాలా ప్రేమించాడు. కానీ పాపం ఆయన ప్రేమ ఫలించలేదు. సల్మాన్ కంటే రణ్‌బీర్ కపూర్ బెటర్ అనుకున్న కత్రినా అతనితో లివిన్ రిలేషన్‌షిప్‌లో ఉండటానికి నిర్ణయించుకుంది. సరే.. జరిగిందేదో జరిగిపోయింది. ప్రేమ ఫలించకపోయినప్పటికీ సల్మాన్, కత్రినా ఇప్పటికీ మంచి ఫ్రెండ్స్‌లా ఉంటున్నారు. చూడబోతే సల్మాన్ కత్రినాను మర్చిపోలేకపోతున్నట్లున్నారు. ఏ హీరోయిన్‌ని చూసినా పొరపాటున కత్రినా అని పిలిచేస్తున్నారు. ఆదివారం సల్మాన్ తాను ఎప్పటినుంచో హోస్ట్ చేస్తూ వచ్చిన బిగ్ బాస్ 13 సీజన్‌ను ప్రారంభించారు. ఈ షోలో బాలీవుడ్ నటి కోయినా మిత్రా కూడా పాల్గొన్నారు. అయితే ఆమెను పొరపాటున ‘క్యాట్’ (కత్రినా ముద్దు పేరు) అని పిలిచేశారు. దాంతో అక్కడున్నవారంతా ఓ..ఓ.. అంటూ కేకలు వేశారు. ఆ తర్వాత తన మిస్టేక్ తెలుసుకున్న సల్మాన్ కోయినా అని పిలవడం మొదలుపెట్టారు. దీనిని బట్టే అర్థమవుతోంది సల్మాన్ కత్రినాను మర్చిపోలేకపోతున్నారని. అంతేకాదు.. ఓసారి ఓ మీడియా ఛానెల్ సల్మాన్‌ను ప్రశ్నిస్తూ.. ‘మీరు కలిసి పనిచేసిన హీరోయిన్ల గురించి మూడు ముక్కల్లో చెప్పండి’ అని అడిగారు. ఇందుక సల్మాన్.. కరీనా కపూర్ గురించి, ఐశ్వర్య రాయ్ గురించి ఇంకా చాలా మంది గురించి కేవలం కొన్ని సెకన్లు మాత్రమే మాట్లాడారు. కానీ కత్రినా కైఫ్ గురించి మత్రం దాదాపు మూడు నిమిషాల పాటు మాట్లాడుతూనే ఉన్నాడు. ఇప్పటికీ సల్మాన్‌కు కత్రినాపై అంతే ప్రేముంది. కత్రినాను సల్మాన్ కాకుండా మరెవ్వరూ అంత ప్రేమగా చూసుకోలేరేమో. ఏదైతేనేం.. ప్రస్తుతం ఇద్దరూ మంచి ఫ్రెండ్స్‌గా ఉంటున్నారు. ఇప్పటివరకు ఎన్నో సినిమాల్లో కలిసి నటించారు. మున్ముందూ మరిన్ని సినిమాలు రావాలని అభిమానులూ కోరుకుంటున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2mY45Kx
v

అమ్మాయిలను తెచ్చుకోగలను, 200 కోట్లు కావాలి- ప్రియాంకకు కమెడియన్ పంచ్

ఎంత సీరియస్‌గా ఉన్నవారినైనా తన సెన్స్ ఆఫ్ హ్యూమర్‌తో ఇట్టే నవ్వించేస్తాడు ప్రముఖ బాలీవుడ్ కమెడియన్ కపిల్ శర్మ. ఆయన హోస్ట్ చేస్తున్న కామెడీ షో ‘ది కపిల్ శర్మ షో’. ఈ షోకు ఎన్నో ఏళ్లుగా విపరీతమైన పాపులారిటీ ఉంది. కాగా.. ఆదివారం జరిగిన ఎపిసోడ్‌కు గ్లోబల్ స్టార్ హాజరయ్యారు. తాను కథానాయికగా నటించన ‘ది స్కై ఈజ్ పింక్’ ప్రమోషన్స్‌లో భాగంగా ఈ షోకు హాజరై కపిల్‌తో కలిసి సందడి చేశారు. ఈ సందర్భంగా ప్రియాంక కపిల్‌ను ఓ ప్రశ్న అడిగారు. ‘నీకు రూ.200 కోట్లు కావాల? లేక అమ్మాయిలతో కలిసి మాల్దీవ్స్‌కి ఫ్రీ ట్రిప్ కావాల? రెండింట్లో దేనిని ఎంచుకుంటావ్?’ అని ప్రశ్నించారు. ఇందుకు కపిల్ స్పందిస్తూ.. ‘నాకు రూ.200 కోట్లు కావాలి. ఎందుకంటే నేను చీప్ టికెట్‌పై మాల్దీవ్స్‌కు వెళ్లడానికి అమ్మాయిలను తెచ్చుకోగలను’ అని సమాధానమిచ్చారు. దాంతో ప్రియాంక చోప్రాతో పాటు అక్కడున్నవారంతా షాకై పగలబడి నవ్వుకున్నారు. దీనికి సంబంధించిన బిట్వీన్ ది షూట్ వీడియోను కపిల్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. దాంతో ఇది కాస్తా తెగ వైరల్ అవుతోంది. మిగతా ఎపిసోడ్లకు సంబంధించిన వీడియోలు కూడా కావాలంటూ నెటిజన్లు కపిల్‌ను రిక్వెస్ట్ చేస్తున్నారు. బాలీవుడ్‌లో కపిల్ శర్మ షో‌కు బీభత్సమైన టీఆర్‌పీ రేటింగ్స్ వస్తుంటాయి. గతంలో ‘కామెడీ నైట్స్ విత్ కపిల్’ పేరుతో మొదలైన ఈ షోకు మంచి స్పందన వచ్చింది. ఇందులో ప్రముఖ మాజీ క్రికెటర్, రాజకీయ నేత నవ‌జ్యోత్ సింగ్ సిద్ధూ జడ్జ్‌గా వ్యవహరించేవారు. ఇందులో బాలీవుడ్ కమెడియన్ సునీల్ గ్రోవర్ మషూర్ గులాటి అనే కామెడీ వైద్యుడి గెటప్‌ను వేసేవారు. దాదాపు మూడేళ్ల పాటు ఈ షో మూడు పువ్వులు ఆరు కాయలుగా మంచి పాపులారిటీ తెచ్చుకుంది. దాదాపు పదికి పైగా అవార్డులను దక్కించుకుంది. కానీ ఓసారి సునీల్, కపిల్ కలిసి ఓ ఈవెంట్ కోసం ఫారిన్ టూర్‌కి వెళ్లారు. ఆ సమయంలో సునీల్ కపిల్ కంటే ముందు ఫుడ్ ఆర్డర్ చేసుకుని తిన్నాడని అతనిపై కోపం వచ్చి చెప్పుతో కొట్టాడు కపిల్. నోటి కొచ్చిన బూతులు తిట్టాడు. దాంతో సునీల్ గ్రోవర్ ఈ షో నుంచి ఎగ్జిట్ అయ్యారు. ఆ తర్వాత కపిల్ కొన్నాళ్ల పాటు ఆల్కహాలిజంతో బాధపడ్డాడు. దీని నుంచి కోలుకోవడానికి కొన్ని నెలలు అమెరికా వెళ్లాడు. కోలుకున్నాక భారత్ వచ్చి తన ప్రియురాలిని పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు ‘ది కపిల్ శర్మ షో’తో మళ్లీ ప్రేక్షకులను నవ్వించడానికి వచ్చాడు. ఈ షోకు రావాలని ఎందరో సెలబ్రిటీలు ఎదురుచూస్తున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2mVEstW
v

Gaddalakonda Ganesh Deleted Scene (Valmiki)


Gaddalakonda Ganesh Deleted Scene (Valmiki)

from BharatStudent - Telugu - Actor Actress|Photo,Picture Galleries|Wallpapers|Screensavers|Movie Trailers|Film News and Gossips https://ift.tt/2mLt8ka

O Sye Raa Video Song


O Sye Raa Video Song

from BharatStudent - Telugu - Actor Actress|Photo,Picture Galleries|Wallpapers|Screensavers|Movie Trailers|Film News and Gossips https://ift.tt/2or5tG6

మంచు విష్ణు హాలీవుడ్ మూవీలో బాలీవుడ్ హీరో

మంచు విష్ణు హీరోగా ఓ హాలీవుడ్ మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. హాలీవుడ్ డైరెక్టర్ జెఫెరీ చిన్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో కీలక పాత్ర కోసం బాలీవుడ్ హీరో సునీల్ శెట్టిని చిత్ర యూనిట్ సంప్రదించింది. కథ విన్న సునీల్ శెట్టి వెంటనే ఓకే చెప్పేశారు. కథ ఆయనకు బాగా నచ్చిందని చిత్ర యూనిట్ వెల్లడించింది. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. సునీల్ శెట్టి అతి త్వరలో షూటింగ్‌లో పాల్గొననున్నారని చిత్ర యూనిట్ తెలిపింది. తెలుగు, ఇంగ్లీష్ ద్విభాషా చిత్రంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో విష్ణు సరసన కాజల్ అగర్వాల్, రుహానీ సింగ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్‌పై మంచు విష్ణు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. కాగా, గత కొంతకాలంగా మంచు విష్ణు బాగా వెనకబడిపోయారు. గడిచిన ఐదేళ్లుగా విష్ణుకు వరుసగా ప్లాపులే వచ్చాయి. ఈ ఏడాది ‘ఓటర్’ సినిమాతో వచ్చినా వర్కౌట్ కాలేదు. ఇప్పుడు ఏకంగా హాలీవుడ్ సినిమా చేస్తున్నాడు. తానే నిర్మాతగా తెరకెక్కిస్తున్నారు కాబట్టి, కచ్చితంగా ఈ సినిమాలో ఏదో ప్రత్యేకత ఉండే ఉంటుంది. ఇప్పటి వరకు అయితే ఈ సినిమా గురించి పెద్దగా ప్రచారం ఏమీ లేదు. చూద్దాం ఈ సినిమా ఎలా ఉండబోతుందో..!


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2mEzeml
v

పూరి హీరోయిన్ పిచ్చ హాట్.. కుర్రాళ్లకు పండగే!

డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ సినిమాల్లో హీరోయిన్లు చాలా హాట్‌గా ఉంటారు. ఆయన గత చిత్రాలు చూస్తే ఈ విషయం ఎవ్వరికైనా అర్థమవుతుంది. తెలుగు కుర్రాళ్ల గుండెల్ని కొల్లగొట్టే అమ్మాయిల్ని వెతికిపట్టుకొని వాళ్లను హీరోయిన్లుగా పరిచయం చేయడంలో పూరి దిట్ట. రక్షిత, అయేషా టకియా, హన్సిక, నేహా శర్మ, దిశా పటాని ఇలా చాలా మంది హాట్ హీరోయిన్లను తెలుగు ప్రేక్షకులకు ఆయన పరిచయం చేశారు. ఇప్పుడు మరో హాట్ బ్యూటీని పరిచయం చేయబోతున్నారు. పూరి జగన్నాథ్ కుమారుడు ఆకాశ్ పూరి హీరోగా తెరకెక్కుతోన్న రెండో చిత్రం ‘రొమాంటిక్’. పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్, పూరి కనెక్ట్స్ బ్యానర్లపై పూరి జగన్నాథ్, ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే, మాటలను పూరి జగన్నాథ్ అందిస్తున్నారు. అనిల్ పాదూరి దర్శకత్వం వహిస్తున్నారు. ఆయనకు ఇదే తొలి చిత్రం. అందమైన ప్రేమకథా చిత్రంగా తెరకెక్కుతోన్న ‘రొమాంటిక్’ షూటింగ్ పూర్తిచేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. రేపు ఈ చిత్ర ఫస్ట్ లుక్‌ను విడుదల చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ఈ సినిమా ద్వారా ఢిల్లీకి చెందిన మోడల్ కేతికా శర్మను హీరోయిన్‌గా పరిచయం చేస్తున్నారు. కేతికాకు ఇదే తొలి సినిమా అయినా.. సోషల్ మీడియాలో ఈ బ్యూటీకి బోలెడంత ఫాలోయింగ్. ఎప్పుడూ హాట్ హాట్ ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తూ ఉంటుంది. ఇన్‌స్టాలో ఈమెకు 1.6 మిలియన్ ఫాలోవర్లు ఉన్నారంటే ఈమె క్రేజ్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అందాలను తెగ ఆరబోస్తూ ఫొటోషూట్లు చేస్తూ ఉంటుంది. ఇంత హాట్ బ్యూటీని వెతికిపట్టుకుని తన కొడుకు పక్కన హీరోయిన్‌ను చేసేశారు పూరి. ఇన్‌స్టాగ్రామ్‌లోనే రెచ్చిపోతోన్న ఈ 23 ఏళ్ల అమ్మాయి ఇక వెండితెరపై ఆగుతుందా.. అందాల ఆరబోత ఖాయం. ఇంకేముంది, మన కుర్రాళ్లకు పండగే. సోమవారం ఈ చిత్రం ఫస్ట్ లుక్ విడుదల కాబోతోంది. ఈ ఫస్ట్‌ లుక్‌లో కచ్చితంగా హీరోహీరోయిన్లను చూపిస్తున్నారు. ఎందుకంటే, ఆదివారం విడుదలైన ప్రీ లుక్‌లో ఆకాశ్ భుజాలపై కేతికా శర్మ కూర్చున్న లుక్‌ను వెనుక నుంచి చూపించారు. రేపు వీళ్లిద్దరినీ ముందు నుంచి చూపించే అవకాశం ఉంది. ఏదేమైనా తన ఖాతాలో మరో హ్యాట్ బ్యూటీని వేసేసుకున్నారు పూరి.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2olf9Su
v

పవన్ కళ్యాణ్‌కి అమితాబ్ ప్రశంసలు..ఒక సెటైర్ కూడా

ప్రమోషన్స్ కోసం చాలా టైమ్ కేటాయించారు. అలాగే చరణ్ కూడా దగ్గరుండి మరీ ఆ కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నారు. అయితే పాన్ ఇండియా సినిమాలకు హార్ట్ లాంటిది బాలీవుడ్ మార్కెట్. కనీసం అక్కడివాళ్లను మెప్పించగలిగినా కూడా సినిమా సేఫ్ అయిపోతుంది. అంత స్టామినా ఉన్న మార్కెట్ అది. అందుకే అక్కడ అమితాబ్‌తో కలిసి ఒక ఇంటర్వ్యూ‌లో పాల్గొన్నారు చిరు. అయితే ఆ ఇంటర్వ్యూ అంతా కూడా ఎదో రొటీన్‌గా కాకుండా చాలా సరదాగా సాగింది. చిరు చాలా ఫార్మల్‌గా మాట్లాడుతున్నా కూడా అమితాబ్ మాత్రం తన స్పాంటేనిటీతో, తన మార్క్ చమక్కులతో నవ్వించారు. Also Read:

అయితే ఆ ఇంటర్వ్యూ‌లో సైరా అనేది చిరంజీవి సినిమా మాత్రమే కాదు ఆ సినిమాలో మొత్తం చిరంజీవి కుటుంబం అంతా ఇన్వాల్వ్ అయ్యిందని చెప్పుకొచ్చారు బిగ్ బి. 'చిరంజీవి తనయుడు చరణ్, అలాగే కూతురు సుస్మిత కూడా సినిమాకోసం పనిచేసారు. ఆమె టాలెంట్ చూసి ఆమెకి కాంప్లిమెంట్స్ ఇచ్చాను' అని చెప్పారు. ఆ సందర్భంలో చిరంజీవి సైరా సినిమాకి వాయిస్ ఓవర్ ఇచ్చిన విషయాన్ని గుర్తుచేశారు. 'ఈ సినిమాకోసం నా తమ్ముడు పవన్ కళ్యాణ్ వాయిస్ ఇచ్చాడు... సినిమా స్టార్టింగ్‌లో ఎండింగ్‌లో కూడా వాయిస్ వస్తుంది, అతని వాయిస్ కూడా ఈ సినిమా గురించి చాలా చెబుతుంది' అని చెప్పగానే అమితాబ్ పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడారు. 'తెలుగు సినిమాకి సంబంధించినంత వరకు పవన్ కళ్యాణ్‌కి చాలా ప్రాముఖ్యత ఉంది. అక్కడ అతనికి హ్యుజ్ ఫాలోయింగ్ ఉంది' అంటూ పవన్ గురించి ప్రత్యేకంగా మాట్లాడారు అమితాబ్. Also Read: ఇక ఇంటర్వ్యూ మొదట్లో చిరంజీవి తో తన పరిచయాన్ని గుర్తుచేసుకుంటున్న క్రమంలో అమితాబ్ అప్రయత్నంగానే చిరంజీవి‌ పై ఒక కౌంటర్ వేశారు. తర్వాత రజినీ కాంత్, పవన్ కళ్యాణ్‌లకు కూడా దాన్ని ఆపాదించారు. 'నేను చిరంజీవికి చాలా సలహాలు ఇస్తుంటాను, కానీ అవేమీ ఆయన పాటించరు. రాజీకీయాల్లోకి వెళ్లొద్దు అని చెప్పాను.రజినీ కాంత్‌కి చెప్పాను...కొంతకాలం తర్వాత చిరు రాజకీయాల్లో నుండి తిరిగివచ్చేసా అన్నాడు, కానీ తరువాత వాళ్ళ తమ్ముడు వెళుతా అంటే అతనికి కూడా చెప్పాను...వినలేదు...అతను రాజీకీయాల పట్ల చాలా ఆసక్తి కలిగిఉంటాడు'' అని నవ్వేసారు. దానికి చిరు స్పందిస్తూ ''నేను రాజకీయల్లోకి వెళ్లినందుకు ఇప్పుడు రిగ్రెట్ ఫీల్ అవుతున్నాను, కానీ పవన్ కళ్యాణ్ మాత్రం ఆ అర్హత కలిగి ఉన్నాడు'' అంటూ సపోర్ట్ చేశారు. Also Read: ఎప్పుడు చిరు, పవన్ కలవకపోయినా మెగా ఫ్యామిలీలో కలతలు అని రాసేసేవాళ్లకు ఆ ఛాన్స్ లేకుండా చేసాడు చిరంజీవి. సైరాకి వాయిస్ చెప్పినందుకు నేషనల్ మీడియాలో సైతం అతన్ని హైలైట్ చేసి, పవర్ స్టార్ అంటే తనకు ఎంత ప్రేమ అనేది చెప్పకనే చెప్పాడు. సైరా సినిమాని బాలీవుడ్‌కి చేరువ చెయ్యాలి అనే ఆ టీమ్ ప్రయత్నం ఈ ఒక ఒక్క ఇంటర్వ్యూ‌తో ఫుల్‌ఫిల్ అయ్యింది. అలుపులేకుండా సైరా టీమ్ చేస్తున్న ప్రమోషన్స్‌తో అక్టోబర్ 2న బాక్సాఫీస్ దగ్గర సైరా సంచలనాలు మామూలుగా ఉండవు అనే క్లారిటీ అయితే వచ్చేసింది. అది ఏ రేంజ్ చరిత్ర సృష్టిస్తుంది అనేది మాత్రం చూడాలి.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2nG2Q2y
v

పాలిటిక్స్ వద్దు అని చెప్పా, చిరంజీవి వినలేదు.. నవ్వుతూనే చురకలేసిన అమితాబ్

అమితాబ్ బచ్చన్, చిరంజీవి.. వీరిద్దరూ మెగాస్టార్లే. హిందీలో దిగ్గజ నటుడు అమితాబ్ అయితే.. తెలుగులో కోట్ల మంది అభిమానులను సంపాదించుకున్న లెజెండ్ చిరంజీవి. అయితే, ఈ ఇద్దరి మధ్య మంచి స్నేహం ఉంది. ఆత్మీయ అనుబంధం ఉంది. ఈ బంధంతోనే చిరంజీవికి అమితాబ్ బచ్చన్ ఎన్నో సలహాలు ఇచ్చారట. కానీ, వాటిలో చిరంజీవి ఒక్కటి కూడా పాటించలేదట. ఈ విషయాన్ని అమితాబ్ స్వయంగా చెప్పారు. చిరంజీవి హీరోగా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ‘సైరా నరసింహారెడ్డి’ సినిమా అక్టోబర్ 2న విడుదలవుతోన్న సంగతి తెలిసిందే. తెలుగుతో పాటు హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో ఈ సినిమా విడుదలవుతోంది. దీంతో అన్ని భాషల్లో భారీగా ప్రమోషన్స్ చేస్తున్నారు. ఈ ప్రమోషన్లలో భాగంగా తాజాగా చిరంజీవి, అమితాబ్‌లను హిందీలో ఈ సినిమాను విడుదలచేస్తోన్న ఫర్హాన్ అక్తర్ ఇంటర్వ్యూ చేశారు. ఈ ఇంటర్వ్యూలో ఈ స్టార్లు ఇద్దరూ పలు విషయాలను పంచుకున్నారు. Also Read: ఈ సందర్భంగా చిరంజీవి రాజకీయాల్లోకి ప్రవేశించడం గురించి అమితాబ్ బచ్చన్ మాట్లాడుతూ.. ‘‘మేమిద్దరం ఇప్పటికీ మాట్లాడుకుంటూనే ఉంటాం. నేను ఈయనికి సలహాలు ఇస్తూనే ఉంటాను.. కానీ, ఎప్పుడూ వాటిని పాటించలేదు. నేను పాలిటిక్స్‌లోకి వెళ్లాలని అనుకుంటున్నాను అని నాకు చెప్పారు. దయచేసి ఆ తప్పు చేయొద్దు అని చెప్పాను. రజినీకాంత్‌కు ఇదే సలహా ఇచ్చాను, మీకూ చెప్తున్నాను దయచేసి రాజకీయాల్లోకి వెళ్లొద్దు అని చెప్పాను. అయినప్పటికీ ఈయన వెళ్లారు. కొంతకాలానికి మళ్లీ బయటికి వచ్చేశారు’ అని నవ్వుతూనే చురకలంటించారు. అమితాబ్ ఈ విషయాలు చెబుతున్నంసేపు చిరంజీవి కూడా నవ్వు ఆపుకోలేకపోయారు. ‘‘ఈ అద్భుతమైన డ్రీమ్ ప్రాజెక్ట్‌లోకి మీరు ఎలా వచ్చారు?’’ అని అమితాబ్‌ను ఫర్హాన్ అక్తర్ అడిగారు. దీనికి అమితాబ్ సమాధానం ఇస్తూ.. ‘‘చాలా కాలంగా నేను, చిరంజీవి బెస్ట్ ఫ్రెండ్స్. ఆయన నన్ను ఏదైనా అడగడం చాలా అరుదు. అలాంటి వ్యక్తి ఈ పాత్ర చేస్తారా? అని అడిగారు. కచ్చితంగా చేస్తానని చెప్పాను. ఇంత పెద్ద ప్రాజెక్ట్‌లో ఆ పాత్రకు చిరంజీవి నన్ను ఎంపిక చేసుకోవడం నాకు దక్కిన గౌరవం. ఈ సినిమాలో నేను చేసింది చిన్న పాత్రే అయినా ఇంత పెద్ద ప్రాజెక్ట్‌లో భాగమైనందుకు చాలా సంతోషంగా ఉంది’’ అన్నారు. ఇక అమితాబ్‌ను తీసుకోవడంపై చిరంజీవి స్పందిస్తూ.. ‘‘ఈ సినిమా చేద్దామని నిర్ణయించుకున్న తరవాత గురువు పాత్ర ఎవరు చేస్తారు అని మా డైరెక్టర్ నన్ను అడిగారు. ఎందుకంటే నిడివి ప్రకారం చూస్తే అది చిన్న పాత్ర. కానీ, నా పాత్ర కంటే గొప్ప పాత్ర. ఎవరు చేయాలి అని అనుకున్న సమయంలో నాకు గుర్తొచ్చిన ఒకే ఒక్క పేరు అమితాబ్ గారు. కానీ, ఆయన చేస్తారా అనే అనుమానం. నేను ట్రై చేస్తాను సురేందర్.. ఆయన చేయనంటే నిరుత్సాహపడొద్దు అని చెప్పా. నేను ఫోన్ చేసిన వెంటనే అస్సలు సమయం తీసుకోకుండా అమితాబ్ ఓకే చెప్పారు. ఈ పాత్రకు నేనే కరెక్ట్ అని నువ్వు అనుకుంటున్నావా అని మాత్రమే ఆయన నన్ను అడిగారు’’ అని చెప్పారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2nHJ32I
v

‘రొమాంటిక్’ ప్రీ లుక్: పూరి భుజాలపై పోరి!

డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ‘మెహబూబా’ సినిమా ద్వారా తన కుమారుడు ఆకాశ్ పూరిని సోలో హీరోగా పరిచయం చేశారు. ఈ సినిమాకు పూరి జగన్నాథే దర్శకుడు, నిర్మాత. ఛార్మి సహనిర్మాతగా పూరి కనెక్ట్స్ బ్యానర్‌లో వచ్చిన ఈ చిత్రం డిజాస్టర్‌గా మిగిలిపోయింది. ఈ సినిమాకు పూరి మంచి హైప్ క్రియేట్ చేసినా అంచనాలను అందుకోవడంతో ఘోరంగా విఫలమైంది. దీంతో, తన సినీ వారసుడిగా ఆకాశ్‌ను నిలబెట్టే సినిమా ఇవ్వాలని మరో చిత్రాన్ని పూరి నిర్మిస్తున్నారు. ఆకాశ్ పూరి హీరోగా నటిస్తోన్న రెండో చిత్రం ‘రొమాంటిక్’. కేతిక శర్మ హీరోయిన్. అనిల్ పాదురి దర్శకత్వం వహిస్తున్నారు. లావణ్య సమర్పణలో పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్, పూరి కనెక్ట్స్ బ్యానర్లపై పూరి జగన్నాథ్, ఛార్మి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్ర ఫస్ట్‌లుక్ సోమవారం ఉదయం 11 గంటలకు విడుదలకానుంది. ఈ విషయాన్ని పూరి జగన్నాథ్ ట్విట్టర్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు. అంతేకాకుండా, ‘రొమాంటిక్’ ప్రీ లుక్‌ను విడుదల చేశారు. ఈ ప్రీ లుక్ పోస్టర్‌లో ఆకాశ్ పూరి భుజాలపై ఢిల్లీ పోరి కేతిక శర్మ దర్జాగా కూర్చుంది. ఆకాశ్ ఆమెను మోసుకుంటూ బీచ్‌లో హాయిగా నడుస్తున్నాడు. ‘‘లవ్ బర్డ్స్.. బీచ్‌లో విహరిస్తున్నారు’’ అని ఈ పోస్టర్‌కు పూరి జగన్నాథ్ క్యాప్షన్ కూడా పెట్టారు. కాగా, ఈ చిత్రానికి సునీల్ కశ్యప్ సంగీతం సమకూరుస్తున్నారు. భాస్కరభట్ల సాహిత్యం అందిస్తున్నారు. Also Read: కాగా, ‘ఇస్టార్మ్ శంకర్’ సినిమా షూటింగ్ సమయంలోనే ‘రొమాంటిక్’ మూవీ షెడ్యూళ్లను కూడా పూర్తిచేశారు. గోవాలో ఈ రెండు చిత్రాలను ఒకేసారి చిత్రీకరించారు. గోవా పరిసర ప్రాంతాల్లో 45 రోజుల పాటు ‘రొమాంటిక్’ సినిమాకు సంబంధించి సన్నివేశాలను చిత్రీకరించినట్లు అప్పట్లో ఛార్మి వెల్లడించారు. ప్రస్తుతం ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. ‘ఇస్మార్ట్ శంకర్’తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన పూరి, ఛార్మి.. ఈ ‘రొమాంటిక్’తో ఎలాంటి హిట్ కొడతారో చూడాలి..!


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2olshHf
v

సాఫ్ట్‌వేర్ సుధీర్ : మొత్తం కామెడీనే

ఢీ షో లో అస్తమాను హీరో అంటూ ఒక మేనరిజం పెట్టుకుని అందరిని అలరించిన, అలరిస్తున్న సుధీర్ ఇప్పుడు హీరోగా మారాడు. అక్కడ సుధీర్ హీరో అవుతా అనగానే సెటైర్స్ పడ్డాయి. కానీ ఇప్పుడు మాత్రం నిజంగానే హీరో అయిపోయాడు. అతను నటించిన సినిమా టీజర్ కూడా రిలీజ్ అయ్యింది. ఎక్స్ట్రా జబర్దస్త్‌లో సుడిగాలి సుధీర్‌గా నవ్విస్తున్న అతను ఇప్పుడు ''‌గా మారాడు. ఆ‌ టీజర్‌లో ముందు ఎదో యాక్షన్ హీరోలా రెండు మూడు బిల్డప్ షాట్స్ ఇచ్చిన సుధీర్ ఆ తరువాత మాత్రం అవుట్ అండ్ అవుట్ కామెడీ చెయ్యడానికి ప్రయత్నించాడు.అతని ఒరిజినల్ కామెడీ టైమింగ్ ఈ సినిమాలో కూడా బాగా పండినట్టు అనిపిస్తుంది. అలాగే డైలాగ్స్ చెప్పటప్పుడు ఈజ్ కూడా బావుంది. Also Read: చాలామంది బుల్లితెర నటులు కూడా హీరోలుగా వచ్చినా కూడా క్లిక్ కాలేదు. కానీ సుధీర్ మాత్రం వాళ్ళకి భిన్నంగా వెళుతున్నట్టు కనిపిస్తున్నాడు. పేరుకి ఒక పేరడీ సినిమా టైటిల్‌లా ఉన్నా కూడా ఈ సినిమాలో ఎదో చెప్పుకోదగ్గ మ్యాటర్ కూడా ఉంది అనిపిస్తుంది. ఎందుకంటే ఈ సినిమాలో షియాజీ షిండే, నాజర్, ఇంద్రజ, పోసాని కృష్ణమురళి లాంటి చాలామంది స్టార్ కాస్ట్ ఉన్నారు. అయితే మరొక విశేషం ఏంటంటే ప్రజాగాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్న గద్దర్ ఈ సినిమాలో ఒక పాట పాడాడు, సినిమాలో ఆ పాటలో ఆయనే నటించాడు కూడా. ఇక టెక్నీషియన్స్ లిస్ట్‌లో కూడా పెద్ద పేర్లే కనిపిస్తున్నాయి. భీమ్స్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఇక పెద్ద పెద్ద సినిమాలకు DOP గా పనిచేసిన సి.రామ్ ప్రసాద్ ఈ సినిమాకి సినిమాటోగ్రాఫర్. అలాగే గౌతమ్ రాజు ఎడిటింగ్ బాధ్యతలు తీసుకున్నారు. Also Read: ఈ సినిమాలో సుధీర్‌కి జోడిగా ధన్య బాలకృష్ణ నటిస్తుంది. ఈ టీజర్‌కి ప్రేక్షకులనుండి స్పందన కూడా బావుంది. అయితే సుధీర్‌కి జోడీగా రష్మీ అయితే బావుండేది అని కామెంట్స్ చేస్తున్నారు చాలామంది. శేఖర ఆర్ట్స్ క్రియేషన్స్ పై శేఖర రాజు నిర్మిస్తున్న ఈ సినిమాకి రాజశేఖర్ రెడ్డి డైరెక్టర్. అయితే ఈ సినిమాని అంత తేలిగ్గా తీసిపడెయ్యడానికి లేదు. ఇంతమంది పెద్ద వాళ్ళు ఈ సినిమాకి పనిచేస్తున్నారు అంటేనే సినిమాలో ఎదో ఒక బలమయిన ఎలిమెంట్ ఉండి ఉంటుంది. కానీ టీజర్ కాబట్టి సుధీర్‌ని హీరోగా పరిచయం చేస్తూ కేవలం కామెడీ ఉండేలా శాంపిల్ చూపించారు. ట్రైలర్ రీలీజ్ అయితేగానీ ఈ సినిమాలో ఏముంది అనేది పూర్తిగా తెలియదు. Also Read:


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2nCQnwG
v

స్నేహారెడ్డి బర్త్‌డే.. భార్యకు బన్నీ స్వీట్ విషెస్

టాలీవుడ్‌లోని క్యూటెస్ట్ కపుల్ జాబితాలో ముందు వరుసలో ఉన్న జంట , స్నేహారెడ్డి. ప్రేమించి.. పెద్దలను ఒప్పించి.. పెళ్లిచేసుకున్న వీరు అన్యోన్య దాంపత్య జీవితాన్ని గడుపుతున్నారు. బన్నీ సినిమాలతో బిజీబిజీగా గడుపుతుంటే.. స్నేహ పిల్లల ఆలనా పాలనా చూసుకుంటున్నారు. అయితే, ఆదివారం స్నేహారెడ్డి తన పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా తన భార్యకు బన్నీ స్వీటెస్ట్ విషెస్ చెప్పారు. చాలా సింపుల్‌గా.. ‘‘హ్యాపీ బర్త్‌డే క్యూటీ’’ అని ఇన్‌స్టా‌గ్రామ్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. తన భార్యను హత్తుకుని తీసుకున్న ఫొటోను కూడా పోస్ట్ చేశారు. కాగా, అల్లు అర్జున్-స్నేహారెడ్డిల వివాహ బంధానికి ఎనిమిదేళ్లు. మార్చి 6న వీరిద్దరూ తమ ఎనిమిదో వివాహ వార్షికోత్సవం జరుపుకున్నారు. 2011 మార్చి 6న హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో బన్నీ, స్నేహల వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. వారి ప్రేమకు ప్రతిరూపంగా 2014 ఏప్రిల్ 4న అయాన్ జన్మించాడు. 2016లో కూతురు అర్హ జన్మించింది. Also Read: ఇదిలా ఉంటే, అల్లు అర్జున్ ప్రస్తుతం ‘అల... వైకుంఠపురములో...’ అనే చిత్రంలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఎస్.ఎస్.తమన్ సంగీతం సమకూరుస్తున్నారు. పూజా హెగ్డే హీరోయిన్. తాజాగా ఈ సినిమాలోని తొలిపాటను విడుదల చేశారు. ‘సామజవరగమన’ అంటూ సాగే ఈ పాటకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. సిరివెన్నెల సీతారామశాస్త్రి రచించిన ఈ పాటను సిధ్ శ్రీరామ్ ఆలపించారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2m2HH2d
v

మాస్‌రాజా మళ్ళీ బలుపు చూపిస్తాడా?

ఈ మధ్య అస్సలు ఫామ్‌లో లేడు. ఎదో రాజా ది గ్రేట్‌తో హిట్ అందుకున్నాడు, కానీ మళ్ళీ ఈ మధ్య మాత్రం పరాజయాల పరంపర కొనసాగిస్తున్నాడు. ఒక్క హిట్ తరువాత హ్యాట్రిక్ ఫ్లాప్స్ అందుకున్న రవితేజ ప్రస్తుతం డిస్కోరాజా సినిమా చేస్తున్నాడు. ముందు బడ్జెట్ సమస్యలతో లేట్‌గా స్టార్ట్ అయిన ఆ సినిమా ఇప్పుడు మాత్రం ఫుల్ స్వింగ్‌లో షూటింగ్ జరుపుకుటుంది. అయితే ఆ సినిమా తరువాత మహాసముద్రం చేద్దాం అనుకున్న రవితేజ ఇప్పుడు ఆ సినిమా క్యాన్సిల్ కావడంతో మరొక సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు టాక్. గతంలో రవితేజకి డాన్ శ్రీను అనే మాస్ హిట్ ఇచ్చి డైరెక్టర్‌గా తన కెరీర్ స్టార్ట్ చేసిన గోపిచంద్ మలినేని ఆ తరువాత కూడా మళ్ళీ బలుపు అనే సినిమా కూడా చేసాడు. ఆ సినిమా కూడా హిట్‌గా నిలిచింది. ఆ తరువాత భారీ బడ్జెట్‌తో సాయి ధరమ్ తేజ్ హీరోగా నటించిన విన్నర్ ప్లాప్ అవ్వడంతో గోపీచంద్ మలినేని కూడా అవకాశాలు రాలేదు.దాంతో కాస్త గ్యాప్ ఇచ్చి ఈ గ్యాప్ లో మళ్ళీ తనకు రెండు హిట్స్ ఇచ్చిన రవితేజ కోసం కథ రెడీ చేసుకుని రవితేజతో ఓకే అనిపించుకున్నాడు. అయితే గతంలో బలుపు సినిమాలో హీరోయిన్‌గా నటించిన కూడా తన వ్యక్తిగత కారణాలతో గత కొంతకాలంగా సినిమాలకు దూరం అయ్యింది. కానీ ఆమె కూడా మళ్ళీ ఇప్పుడు మళ్ళీ రీ ఎంట్రీ ఇవ్వాలని చూస్తుంది. దీంతో ఆమెని ఈ సినిమాలో హీరోయిన్ గా తీసుకున్నారట. ఇదేదో గాసిప్ కాదు. గతకొంతకాలంగా ఈ మాట వినిపిస్తున్నా కూడా ఇప్పుడు ఫైనల్ అయ్యింది.అంతేకాదు ఇక నుండి ఆమె తెలుగు సినిమాలకే ప్రిఫరెన్స్ ఇవ్వాలి అనుకుంటుందట. అంటే రవితేజ హీరోగా, శృతి హాసన్ హీరోయున్‌గా గోపీచంద్ మలినేని డైరెక్షన్‌లో సినిమా ఫైనల్ అయ్యింది. బలుపు కాంబో మళ్ళీ ఫిక్స్ అయ్యింది. కాకపోతే ఆ టైమ్‌లో అంతా ఫామ్‌లో ఉన్నారు. ఇప్పుడు మాత్రం డిస్కోరాజా హిట్ అయితే రవితేజ ఈ కాంబో‌కి బజ్ తెచ్చే ఫ్యాక్టర్ అవుతాడు. అదేమయినా తేడా కొడితే అప్పుడు పరిస్థితి ఇంకా దారుణంగా ఉంటుంది. ఈ సినిమాకి బుర్ర సాయిమాధవ్ రైటర్‌గా పనిచేస్తున్నాడు. అందుకే ఈ సినిమా స్టోరీ కాస్త సెన్సిబుల్‌గా ఉంటుంది అని టాక్ వినిపిస్తుంది.రవితేజ అండతో టాప్ మ్యూజిక్ డైరెక్టర్ గా ఎదిగిన థమన్ ఈ సినిమాకి మ్యూజిక్ అందించే అవకాశాలున్నాయి అని టాక్. గతంలో కూడా ఫామ్‌లో లేని శ్రీను వైట్లని నమ్మి అమర్ అక్బర్ ఆంటోనీ సినిమా చేసి డిజాస్టర్ అందుకున్న రవితేజకి మరి గోపీచంద్ ఎలాంటి రిజల్ట్ ఇస్తాడో చూడాలి.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2mO5GCz
v

షాకింగ్: సరిలేరు నీకెవ్వరు సంక్రాంతికి కాదా?..సమ్మర్ రిలీజ్?

మహర్షి సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో మంచి ఊపుమీద సెట్స్‌కి వెళ్ళాడు మహేష్ బాబు. అలాగే F2తో హిట్ కొట్టి సినిమా పట్టిన అమీర్ రావిపూడి కూడా జెట్ స్పీడ్‌లో స్క్రిప్ట్ కంప్లీట్ చేసి బౌండెడ్ స్క్రిప్ట్ రెడీ చేసాడు. ఇప్పుడు షూటింగ్ సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌లా పరిగెడుతుంది. ఈ సినిమాని సంక్రాంతి రిలీజ్ అని ఎప్పుడో ప్రకటించారు. దాంతో షెడ్యూల్ బ్రేక్స్ కూడా లేకుండా లాగించేస్తున్నారు. అలాగే విజయశాంతి రీ ఎంట్రీ ఇవ్వడం కూడా ఈ సినిమాకి కలిసొచ్చే అంశమే. అందుకే సంక్రాంతి రిలీజ్ అనుకున్న సినిమాల్లో బజ్ పరంగా సరిలేరు నీకెవ్వరు ఫస్ట్ ప్లేస్‌లో ఉంది. Also Read: కానీ ఇప్పుడు వినిపిస్తున్న లేటెస్ట్ టాక్ ఏంటంటే భారీ హైప్ ఉన్న సరిలేరు నీకెవ్వరు పొంగల్ రేస్ నుండి తప్పుకుందని. మాహేష్ బాబు ఈ సినిమాని సమ్మర్‌కి రిలీజ్ చేస్తే ఎలా ఉంటుంది అనే ప్రొపోజల్ పెట్టాడట. ఎందుకంటే ఇప్పుడు సంక్రాంతికి కూడా ఒక పక్క దర్బార్, మరో పక్క అల..వైకుంఠపురములో సినిమాలు రిలీజ్ డేట్స్ ఫిక్స్ చేసుకున్నాయి. దీంతో మహేష్ సినిమాకి సరయిన డేట్ దొరకట్లేదు. ఎటు వెళ్లినా కూడా కాస్త కన్ఫ్యూజ్‌ గానే ఉంది.పోనీ సినిమా ముందే రెడీ అవుతుంది కాబట్టి ముందుకి వెళదామా అంటే ఆల్రెడీ సెంటిమెంట్‌తో దెబ్బతిని ఉన్న మహేష్ మళ్ళీ రిక్స్ చెయ్యలేడు. సమ్మర్‌లో వచ్చిన చాలా సార్లు హిట్ అందుకున్నాడు మహేష్. అవన్నీ అలోచించి సమ్మర్‌కి వస్తే బెటర్ అనే డిస్కషన్ నడిచినట్టు ఫిల్మ్ నగర్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. Also Read: ముందు నుండి సంక్రాంతికి డౌట్ అన్న అల..వైకుంఠపురములో కూడా ఇప్పుడు ప్రమోషన్స్ స్టార్ట్ చేసింది. కానీ ఈ సినిమా షూటింగ్ ఎంత ఫాస్ట్ గా జరిగిన ప్రచారం పరంగా మాత్రం అస్సలు ఊసే లేదు. ఇప్పట్లో మొదలుపెట్టే ఆలోచన కూడా ఉన్నట్టు కనిపించట్లేదు. మిగతా సినిమాలకు ముందు నుండి అలెర్ట్‌గా ఉన్న మహేష్ పర్సనల్ డిజిటల్ టీమ్ ఈ సినిమా విషయంలో మాత్రం కామ్ గా చూస్తున్నారు. ఇవన్నీ గమనిస్తే ఈ రూమర్ నిజమయ్యే అవకాశాలే ఎక్కువ. సర్దుకుపోకుండా ముందుకుపోయి దెబ్బయిపోవడం అనేది ఇండస్ట్రీలో ఎవరికీ మంచిది కాదు. అందుకే నిర్మాతలు కూడా ఈ ప్రొపోజల్‌ని ముందుకు తీసుకెళ్లడానికి ఓకే అనుంటారు. Also Read: ఈ సినిమా తరువాత మళ్ళీ మహేష్ బాబు సినిమా ఏంటి అనేది ఏది కూడా పక్కాగా కన్ఫర్మ్ అవ్వలేదు. అందుకే సంక్రాంతికి సరిలేరు నీకెవ్వరు వస్తే మళ్ళీ నెక్స్ట్ సినిమా ఆల్మోస్ట్ 2021 సమ్మర్‌కి అవ్వొచ్చు. పైగా 2020 సమ్మర్‌లో RRR తప్ప పెద్ద సినిమా ఏదీ లేదు. ఇప్పుడు ఆ సినిమా షూటింగ్ నడుస్తున్న తీరు చూస్తే ముందు చెప్పిన డేట్ అనేది అనుమానమామే. అందుకే అంతా ఆవురావురుమంటూ ఉంటారు. ఆ టైమ్‌లో మహేష్ సినిమా రిలీజ్ చేస్తే మాత్రం మళ్ళీ మరొకసారి కెరీర్ బెస్ట్ హిట్ అందుకునే అవకాశాలున్నాయి. అందుకే మహేష్ అలా డిసైడ్ అయ్యి ఉండొచ్చు. ఈ విషయంపై అధికారిక ప్రకటన కోసం అంతా వెయిట్ చేస్తున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2okoJFd
v

Ala..Vaikunthapurramloo :అల్లు అర్జున్ రేంజ్ ఇది.. దూసుకుపోతున్న రేస్ గుర్రం

అల్లు అర్జున్ మెగా హీరో గా ఎంట్రీ ఇచ్చి తన స్కిల్‌తో టాప్ హీరోగా ఎదిగాడు. అయితే బన్నీకి గత కొంతకాలంగా అన్ని విషయాల్లో నెగెటివిటీ ఎదురవుతుంది. సరైనోడు సినిమా హిట్ అయినా కూడా పవన్ కళ్యాణ్ కాంట్రవర్సీలో ఇరుక్కున్నాడు. DJ టైమ్‌లో మీడియా మీద ఎదురుదాడి చేస్తే అప్పుడొక రభస జరిగింది. అన్నీ క్లియర్ అయిపోయాయి అనుకుని భారీ బడ్జెట్‌తో నా పేరు సూర్య...నా ఇల్లు ఇండియా సినిమా చేస్తే అది కెరీర్‌లోనే వరస్ట్ డిజాస్టర్ అయ్యింది. ఇక రీసెంట్‌గా సైరా ఫంక్షన్‌కి రాలేదు అని ఏకేస్తున్నారు. ఇన్ని చిరాకుల్లో కూడా బన్నీకి మంచి బూస్టింగ్ ఇచ్చింది సినిమా నుండి రిలీజ్ అయిన ఫస్ట్ సింగిల్. Also Read: త్రివిక్రమ్ డైరెక్షన్‌లో తన మూడో సినిమా 'అల...వైకుంఠపురములో'లో నటిస్తున్నాడు బన్నీ. ఆ సినిమా సంక్రాంతికి రిలీజ్ అవుతుంది. అయితే ఏ సినిమాకి అయినా కూడా సినిమా రిలీజ్‌కి ముందు మంచి ఇంప్రెషన్ కలిగించేది ఆ సినిమా ఆడియో. పైగా అక్కడినుండే సినిమా పై ఎక్స్పెక్టేషన్స్ కూడా మొదలవుతాయి. స్టార్ హీరోల సినిమాల విషయంలో కీలకమయిన ఓపెనింగ్స్ తీసురావడంలో కూడా ఆడియో కీలకపాత్ర వహిస్తుంది. అలాంటి కీలకమయిన ఆడియో విషయంలో మాత్రం అల...వైకుంఠపురములో సినిమాకి సూపర్ ఛాన్స్ వచ్చింది. ఇంతకుముందు అరవింద సమేత సినిమా కోసం త్రివిక్రమ్‌తో పనిచేసిన థమన్ ఆ సినిమాకి అదిరిపోయే మ్యూజిక్ ఇచ్చాడు. అదే ట్యూనింగ్‌తో గురూజీతో టీమ్ అప్ అయిన థమన్ అల...వైకుంఠపురములో సినిమాకి మొదటి పాటతోనే అదిరిపోయే టాక్ తీసుకొచ్చాడు. Also Read: ఈ మధ్య థమన్ సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. దాంతో ''నీ కాళ్ళను పట్టుకు వదలనన్నవి చూడే న కళ్ళు...'' అంటూ సాగిన ఆ పాట ఇప్పుడు అందరికి పట్టేసింది. థమన్ మ్యూజిక్ తోడు సీతారామశాస్త్రి సాహిత్యం కూడా అదుర్స్ అనిపించేస్తుంది. గాత్రంలోని మ్యాజిక్ కూడ జతకలిసి ఆ పాటని ట్రెండింగ్‌లో నిలబెట్టాయి. ఆ పాట రిలీజ్ అయిన కొన్ని గంటల్లోనే యూ ట్యూబ్ ట్రెండింగ్‌లో నెంబర్ 1 ప్లేస్‌కి చేరింది. కేవలం ఇక్కడ మాత్రమే కాదు నేషనల్ వైడ్‌గా కూడా టాప్ 10 లో ప్లేస్ దక్కించుకుంది 'సామజవరగమన'. Also Read: అల్లు అర్జున్‌కి తెలుగు స్టేట్స్ తో పాటు కేరళలో కూడా భారీ ఫ్యాన్ బేస్ ఉండడం వల్ల, కర్ణాటకలో కూడా మంచి ఫాలోయింగ్ ఉండడం వల్ల ఈ పాట నేషనల్ రేంజ్‌లో ట్రెండ్ అవుతుంది. బన్నీ డబ్బింగ్ సినిమాలకు బాలీవుడ్‌లో ఉన్న క్రేజ్ గురించి ఆ సినిమాల వ్యూస్ చెబుతాయి. 100 మిలియన్స్ మార్క్ అనేది బన్నీ సినిమాలకు అలవోకగా అందుకునే టార్గెట్‌గా మారింది.అలా విస్తరించిన అల్లు అర్జున్ క్రేజ్ అల...వైకుంఠపురములో సినిమాకి బాగా ఉపయోగపడుతుంది. ఒక్క పాటతోనే సెన్సేషన్ క్రియేట్ చేసిన బన్నీ అల...వైకుంఠపురములో తో హిట్ అందుకుంటే ఈ రేస్ గుర్రం మళ్ళీ టాప్ లీగ్ రేస్ లోకి దూసుకొచ్చినట్టే.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2nxNXj4
v

Saturday 28 September 2019

పవన్ కళ్యాణ్ 'సైరా' కథ ఇమ్మన్నాడు..రామ్ చరణ్‌కి కూడా నో చెప్పాం

సైరా...ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్లో డిస్కషన్ పాయింట్‌గా మారిన సినిమా. ఆ సినిమా రూపుదిద్దుకోవడానికి రెండున్నరేళ్లు పట్టినా కూడా ఆ కథ పుట్టి మాత్రం పదేళ్లు దాటింది. ఇదే విషయాన్ని స్వయంగా తెలియజేసారు పరుచూరి గోపాలకృష్ణ. '2006లో చిరంజీవి గారికి ఈ సినిమా కథ చెప్పాం. ఆ కథ విని అదిరిపోయింది అని దాన్ని డెవలప్ చెయ్యడం కోసం మా అన్నయ్యని దుబాయ్ తీసుకెళ్లారు, బ్యాంకాక్ తీసుకెళ్లారు, ఈ కథ పై కూర్చుంటూనే ఉన్నారు. 2008 వరకు ఈ సినిమా కథపై ఉన్నారు. ఆ తరువాత రాజకీయాల్లోకి వెళ్లిపోయారు. అప్పుడు చాలా బాధవేసింది' అని సైరా కథ గురించి అనేక ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు. Also Read: 'చిరంజీవి గారు రాజకీయాల్లోకి వెళ్ళిపోయాక చాలామంది సైరా కథ ఇవ్వమని అడిగారు కానీ మేము మాత్రం ఈ కథ చిరంజీవి గారికి మాట ఇచ్చాం, ఎప్పటికయినా ఆయనే చెయ్యాలి అని చెప్పాం. ఒక‌సారి కూడా సైరా కథ ఒక్కసారి చెప్పండి, అన్నయ్య ఆ కథని ఎందుకు అంత ప్రేమిస్తున్నాడు అని అడిగారు. మధ్యలో చిరంజీవి గారు కూడా ఒక వేళ ఈ కథ నేను చెయ్యలేకపోతే రామ్ చరణ్‌కి సూట్ అవుతుందా ఒక్కసారి ఆలోచించండి అన్నారు. కానీ మేము మాత్రం ఈ కథ చేస్తే మీరే చెయ్యాలి అని చెప్పాం. చిరంజీవి సినిమాల్లోకి తిరిగొచ్చాక మళ్ళీ ఈ సినిమా గురించి డిస్కషన్ వచ్చింది. కానీ అప్పుడు మార్కెట్ ఎలా ఉందో తెలుసుకోవాలి అని ఖైదీ నెంబర్ 150 చేసారు' అంటూ సైరా కథ వెనుక జరిగిన మొత్తం కథని వివరించారు ఈ డైనమిక్ రైటర్. ఖైదీ నెంబర్ 150 విజయం తరువాత, రాజమౌళి బాహుబలి తీసాక ఈ సినిమాని ఇంత హై బడ్జెట్‌తో తెరకెక్కించారట. Also Read: ఏ సినిమా ఆడియో ఫంక్టన్‌కి అయినా,ప్రీ రిలీజ్ ఫంక్షన్ అయినా పరుచూరి గోపాలకృష్ణ వస్తే ఆ సినిమా హీరో అభిమానులను ఉర్రుతలూగించేలా మాట్లాడతారు.అయితే సైరా కథ పుట్టుకలో కీలక పాత్ర పోషించిన ఆయన సైరా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి రాకపోవడం ఒక వింతయిన విషయం. ఆ లోటు ఆ వేదిక దగ్గర క్లియర్‌గా కనిపించింది. అయితే దాని వెనుక ఉన్న కారణాన్ని కూడా ఆయన చెప్పుకొచ్చారు. 'సైరా ఫంక్షన్‌కి నేను రాకపోవడం గురించి కూడా చాలామంది అడుగుతున్నారు. కానీ ఆ టైమ్‌లో నా ఆరోగ్యం బాలేదు. సైరా ఈవెంట్ టైమ్‌లో మూడు రోజులు వెనుక నరం పట్టెయ్యడంతో అడుగుతీసి అడుగువెయ్యలేని పరిస్థితిలో ఉన్నాను' అంటూ ఆ వేడుకకు ఆయన రాకపోవడానికి కారణాన్ని వివరించారు. Also Read: ఏది ఏమైనా ఒక హీరో కోసం 13 సంవత్సరాలపాటు ఒక కథని హోల్డ్ చెయ్యడం అనేది మామూలు విషయం కాదు. ఆ కథని కోటి కాదు అంతకంటే ఎక్కువే అడిగినా కూడా ఇచ్చి ఎవరో ఒకరు కొనుక్కునేవారు. కానీ పరుచూరి బ్రదర్స్ అంత డబ్బును కూడా ఒక్క మాట కోసం వదులుకున్నారు. అందుకే వాళ్ళ కలను నెరేవేరుస్తూ సైరా భారీ క్రేజ్‌తో అక్టోబర్ 2న బ్రహ్మాండమయిన విడుదలకు సిద్దమైంది. ఈ సినిమా బాహుబలి రికార్డ్‌ని కూడా దాటుతుంది అనే అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలు ఎంతవరకు నిజం అవుతాయి అనేది వచ్చే బుధవారం తేలుతుంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2ocHR7S
v

Sye Raa Review: ‘సైరా’ ఫస్ట్ రివ్యూ: ఇతని రేటింగ్‌ని నమ్మలేం

మెగాస్టార్ చిరంజీవి సినిమా అంటేనే హైప్ ఓ రేంజ్‌లో ఉంటుంది. అందులోనూ ఆయన ఎన్నాళ్ల నుండో చేయాలనుకుంటున్న పాత్రను సొంత నిర్మాణంలో చేస్తున్నారు. తొలి తెలుగు స్వాతంత్య్ర పోరాట యోధుడు ‘ఉయ్యాలవాడ నరసింహారెడ్డి’ పాత్రను చిరంజీవి పోషిస్తూ.. ‘సైరా’గా అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. బాహుబలి, సాహో చిత్రాల తరువాత టాలీవుడ్ నుండి రాబోతున్న భారీ బడ్జెట్ ప్యాన్ ఇండియా మూవీ ఇదే కావడంతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. టీజర్, ట్రైలర్‌లతో ఈ అంచనాలు రెట్టింపుకావడంతో ఈ సినిమా రిజల్ట్ కోసం అభిమానులు ఎంతో ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు. ఈ సందర్భంలో సినిమాకి ఉన్న హైప్‌ని క్యాష్ చేసుకుంటూ విడుదలకు ముందే రివ్యూలు ఇచ్చే దుబాయ్ సెన్సార్ బోర్డ్ సభ్యుడుగా చెప్పుకునే మూవీ మార్కెట్ పీఆర్ ఎక్స్ పర్ట్ ఉమైర్ సంధు ‘సైరా’ చిత్రానికి ఫస్ట్ రివ్యూ ఇచ్చేశారు. ‘సైరా చిత్రం ఎమోషనల్ రైడ్‌తో అద్భుతంగా ఉంది. రోమాలు నిక్కబొడుచుకునే సన్నివేశాలతో సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ పొందుతారు. బాహుబలి చిత్రం కల్పన కాని.. ఇది వాస్తవ కథ ఆధారంగా రూపొందించబడింది. ఏపీ అన్ని రికార్డ్‌లను సైరా స్మాష్ చేస్తుంది. మెగాస్టార్ అభిమానులకు ఈ చిత్రం పండగే’ అంటూ నాలుగు ఫైర్ స్టార్‌లు వేసేశాడు. అయితే ఇతను నిజంగానే సినిమాలను చూసి రివ్యూలు ఇస్తాడా? లేక హైప్‌ని దృష్టిలో పెట్టుకుని రివ్యూలు ఇస్తాడో తెలియదు కాని.. హిట్ చిత్రాలతో పాటు కొన్ని అట్టర్ ఫ్లాప్ చిత్రాలకు సైతం ఐదు స్టార్లు వేసిన ఘనత ఇతనికి ఉంది. పవన్ కళ్యాణ్ ‘అజ్ఞాతవాసి’, మహేష్ బాబు ‘స్పైడర్’, అల్లు అర్జున్ ‘నాపేరు సూర్య’ వంటి అట్టర్ ఫ్లాప్ చిత్రాలకు ఈయన టాప్ రేటింగ్ ఇచ్చారు. రీసెంట్‌గా ‘సాహో’ చిత్రానికి సైతం మైండ్ బ్లోయింగ్ అంటూ రివ్యూ ఇచ్చారు. ఈ లెక్కన ఆయన రివ్యూలను నమ్మే పరిస్థితి లేదని చెప్పాలి. ఇతని రివ్యూ సంగతి పక్కనపెడితే.. ‘సైరా’ తప్పకుండా విజయం సాధిస్తుందనే నమ్మకం ప్రేక్షకుల్లో అయితే బలంగానే ఉంది. ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు మూవీ లవర్. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ భారీ చారిత్రాత్మక చిత్రం తెలుగుతో పాటు హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో భారీ ఎత్తున విడుదల చేస్తున్నారు. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్‌పై రామ్ చరణ్ నిర్మించిన ఈ సినిమా ప్రమోషన్స్ ఓ రేంజ్‌లో జరుగుతున్నాయి. ఈ చిత్రంలో నటించిన చిరు, అమితాబ్ బచ్చన్, నయనతార, తమన్నా, కిచ్చా సుదీప్, విజయ్ సేతుపతి, జగపతిబాబు వంటి స్టార్లు ప్రమోషన్స్ నిర్వహిస్తున్నారు. నిర్మాత రామ్ చరణ్‌తో పాటు మెగా డాటర్స్‌ కూడా ‘సైరా’ ను ప్రమోట్ చేస్తున్నారు. సుమారు రూ.270 కోట్ల బడ్జెట్‌తో రామ్ చరణ్ నిర్మించిన ఈ చిత్రానికి అమితి త్రివేది సంగీతం సమకూర్చారు. రత్నవేలు సినిమాటోగ్రఫీ అందించారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2nEPlQF
v

పూరీ బర్త్ డే వేడుకలో చార్మి భావోద్వేగం.. ఇస్మార్ట్‌కి ముందు రూ. 50 వేలు కూడా లేవు

నేడు (సెప్టెంబర్ 28) డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ బర్త్ డే సందర్భంగా ఆయన పుట్టిన రోజు వేడుకలను హైదరాబాద్‌లో అభిమానుల సమక్షంలో ఘనంగా నిర్వహించారు హీరోయిన్ . ఈ సందర్భంగా.. ఇండస్ట్రీలో సినిమాలు లేక ఖాళీగా ఉన్న 20 మంది డైరెక్టర్లు, కో డైరెక్టర్లు ఒక్కొక్కరికి 50 వేల చొప్పున ఆర్ధికసాయం అందించారు చార్మి. ఈ పుట్టిన రోజు వేడుకలో ఎమోషనల్ స్పీచ్‌తో ఆకట్టుకున్నారు చార్మి. ఆమె మాట్లాడుతూ.. ‘నేను కెమెరా ముందు నటించడానికి, స్టేజ్‌ మీద మాట్లాడటానికి పెద్దగా భయపడను. కాని ఈరోజు ఎందుకో ఏం మాట్లాడాలి? దేనిపై మాట్లాడాలని టెన్షన్‌గా ఉంది. అప్పట్లో దాసరి గారు చెప్పారు.. పూరీ జగన్నాథ్ నా వారసుడు అని. ఆ మాట విన్న పూరీ గారు నా దగ్గర చాలా ఎమోషన్ అయ్యారు. ఆరోజు నా మనసులో అనిపించింది.. దాసరిగారు అంత పెద్ద మాట పూరీ గురించి అన్నప్పుడు దాన్ని రెస్పాన్సిబిలిటీగా తీసుకుని ముందుకు వెళ్లాలని. Read Also: పూరీ ప్రొడక్షన్‌లో పనిచేస్తున్న నేను.. ఆయనకు ఏం కావాలో అది ఇవ్వడమేనా? సినిమాలు తీయడమేనా? హిట్లు కొట్టడమేనా? అనే ఆలోచన వచ్చినప్పుడు అయితే మా దగ్గర డబ్బులు లేవు. ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాకి పూరీ నేను ఫైనాన్సియల్‌గా ఇబ్బందుల్లో ఉన్నాం. ఈ విషయాన్ని ఎప్పుడూ మేం ఎవరివద్ద డిస్కస్ చేయలేదు. ఎవరి సాయం కోరలేదు. ఆ టైంలో మా దగ్గర కేవలం రూ. 50 వేలు మాత్రమే ఉన్నాయి. ఆ టైంలో ఒకరికి ఒకరం బలంగా నిలబడ్డాం. ఆ టైంలో పూరీ గారు.. నాకు ఒక మాట చెప్పారు. ‘రేయ్.. ఈరోజు మన దగ్గర డబ్బుల్లేవు చాలా కష్టాల్లో ఉన్నాం. కాని.. ముందు మనం మన హెల్త్‌ని బాగా చూసుకుందాం. నేను హెల్త్‌ని చూసుకుంటూ కథలు రాస్తా. నువ్ ఎక్కడ ఏ సినిమా చేయాలని మనం ప్లాన్ చేద్దాం. ఏమీ కాదు.. ఆస్తులు వస్తాయి పోతాయి. మనం స్ట్రాంగ్‌‌గా ఉందాం అని చెప్పారు. కాని ఇస్మార్ట్ శంకర్‌ సెట్ కావడానికి చాలా టైం పట్టింది. హీరో రామ్.. రియల్ లైఫ్‌ హీరో అనిపించారు. పూరీ గారి కథ చెప్పినప్పుడు ఎలాంటి డౌట్‌లు లేకుండా ఆయన్ని నమ్మారు. మేం కష్టాల్లో ఉన్నామా? మాకు హిట్లు ఉన్నాయా? ఫ్లాప్‌లు ఉన్నాయా? ఇలాంటివేం చర్చించకుండా ఆయన పూరీతో చేయాలనే ఒకే ఒక్క నిర్ణయంతో ఓకే చేశారు. మనస్పూర్తిగా చెబుతున్నా.. సాయం చేసే గుణం అతనిలో చూశా. ఇస్మార్ట్ శంకర్‌ సినిమాతో ఆయన మళ్లీ హిట్ అందుకున్నారు. ఆయన సత్తా ఏంటో అందరికీ తెలిసింది. పూరీ కోసం నాకు ఒక మెసేజ్ పంపించారు.. అందులో ఆయన.. ‘మనం అందరం ఏదో సాధించాలని తపన పడుతుంటాం. అయితే కొంతమంది స్టార్స్ అవుతారు. మిగతా వాళ్లు కాలేరు. అంతే వాళ్లు సక్సెస్ అయినట్టు మిగతా వాళ్లు ఫెయిల్ అయినట్టు కాదు. నా అభిప్రాయం ప్రకారం నిజమైన సక్సెస్ ఏంటంటే.. నీకిష్టమైన పనికోసం కష్టమొచ్చినా.. నష్టమొచ్చినా దానికోసం చావడమే నిజమైన సక్సెస్. ఆ పని వల్ల పది రూపాయిలు రావచ్చు. కోటిరూపాయిలు రావచ్చు. ఇష్టమైన పనికోసం చావండి’ అని చెప్పారు. ఈ విషయాన్ని మీకు చెప్పమన్నారంటూ పూరీ సందేశాన్ని అందించింది చార్మి.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2ob2xgN
v

Puri Birthday: నచ్చిన పనికోసం చచ్చిపోండి: పూరీ బర్త్ డే మెసేజ్

ఇండస్ట్రీకి ఎంతో మంది దర్శకులు వస్తుంటారు.. పోతుంటారు.. కాని పూరీ లాంటి దర్శకులు అప్పుడప్పుడూ మాత్రమే పుడుతుంటారు. గొప్ప సినిమాలు తీశారని కాదు.. గొప్ప మనసు ఉంది కాబట్టే ఆయన గ్రేట్ డైరెక్టర్ అయ్యారు. స్టార్ హీరోలకు బ్లాక్ బస్టర్‌ హిట్లు ఇచ్చిన ఆయన ఒకప్పుడు అత్యధిక పారితోషికం తీసుకున్న డైరెక్టర్. అయితే కాలం కలిసి రాకపోవడంతో స్టార్ హీరోలు మెల్లగా సైడ్ అయ్యారు. చేతిలో కనీసం రూ. 50 వేలు లేని స్థితికి వచ్చేసినా.. పూరీ.. ఎవరి ముందూ చేయి చాచలేదు. తాను నమ్ముకున్న మెగా ఫోన్‌కి పదును పెట్టారు. ఇస్మార్ట్ శంకర్ చిత్రంతో తిరిగి హిట్ కొట్టి తానేంటో నిరూపించుకున్నారు. నేడు బర్త్ డే సందర్భంగా.. అభిమానుల సమక్షంలో పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు హీరోయిన్ చార్మి. ఈ సందర్భంగా సినిమాలు లేక ఖాళీగా ఉన్న ఓ 20 మంది డైరెక్టర్లు, కో డైరెక్టర్లు ఒక్కొక్కరికి 50 వేల చొప్పున సాయం చేయచేశారు. కష్టం విలువ తెలిసిన పూరీ మరోసారి ది గ్రేట్ డైరెక్టర్ అనిపించుకుని ఆదర్శంగా నిలిచారు. ప్రస్తుతం పూరీ జగన్నాథ్.. గోవాలో విజయ్ దేవకొండ సినిమా స్క్రిప్ట్ పనిలో ఉండగా.. తన బర్త్ డే మెసేజ్‌ను చార్మి ద్వారా షేర్ చేశారు. ఇందులో ఆయన మాట్లాడుతూ.. ‘మనం అందరం ఏదో సాధించాలని తపన పడుతుంటాం. అయితే కొంతమంది స్టార్స్ అవుతారు. మిగతా వాళ్లు కాలేరు. అంతే వాళ్లు సక్సెస్ అయినట్టు మిగతా వాళ్లు ఫెయిల్ అయినట్టు కాదు. నా అభిప్రాయం ప్రకారం నిజమైన సక్సెస్ ఏంటంటే.. నీకిష్టమైన పనికోసం కష్టమొచ్చినా.. నష్టమొచ్చినా దానికోసం చావడమే నిజమైన సక్సెస్. ఆ పని వల్ల పది రూపాయిలు రావచ్చు. కోటిరూపాయిలు రావచ్చు. ఇష్టమైన పనికోసం చావండి’ అంటూ చార్మీ ద్వారా మెసేజ్ పంపారు పూరీ జగన్నాథ్.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2mBTbdm
v

‘ఆ సినిమాను వదులుకోలేదు కాబట్టి సరిపోయింది’

ఒక సినిమాతో మన జీవితమే మారిపోవచ్చు. అది చిన్న సినిమా అవ్వచ్చు లేదా భారీ బడ్జెటెడ్ ఫిలిం అయినా అవ్వచ్చు. బాలీవుడ్ నటుడు విక్కీ కౌశల్‌ జీవితం కూడా ఒక్క సినిమాతో దశ తిరిగింది. అదే.. ‘ఉరి- ది సర్జికల్ స్ట్రయిక్స్’. పాకిస్థానీ ఉగ్రవాదులు మన భారత్‌లోకి చొరబడి దాడులు జరిపి ఎంతో మంది జవాన్లను పొట్టనబెట్టుకున్నారు. దాంతో ప్రతీకార చర్యగా భారత్.. దాయాదిపై సర్జికల్ స్ట్రయిక్స్ నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ కథ ఆధారంగా ‘ఉరి-ది సర్జికల్ స్ట్రయిక్స్’ సినిమాను దర్శకుడు ఆదిత్య ధర్ తెరకెక్కించారు. మన దేశ గొప్పతనం గురించి నిజాయతీగా చాటి చెప్పిన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ విజయం అందుకుంది. ఈ సినిమాతో విక్కీ కౌశల్‌కు జాతీయ అవార్డు వరించింది. అతన్ని అగ్ర హీరోల్లో ఒకరిగా నిలిపింది. అయితే ఈ సినిమా అవకాశం తనకు వచ్చినప్పుడు దాదాపుగా నో చెప్పబోయాడట విక్కీ. ఈ విషయాన్ని ఆయన ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ‘నేను ఉరి సినిమాకు నో చెప్పబోయాను. ఎందుకంటే ఆ సమయంలో నేను ‘రాజి’ సినిమా షూటింగ్‌లో ఉన్నాను. అప్పుడు నాకు నిర్మాత రోన్నీ నుంచి ఫోన్ వచ్చింది. ఓ యాక్షన్ సినిమా స్క్రిప్ట్ పంపుతున్నాను చదవండి అన్నారు. ఈ స్క్రిప్ట్ ఇంతవరకు ఏ హీరోకు ఇవ్వలేదు అన్నారు. ఆ సమయంలో నేను రాజిలో ఓ ఎమోషనల్ సన్నివేశంలో పాల్గొన్నాను. దాంతో నాకు మైండ్ పనిచేయకుండా పోయింది. చాలా డిస్టర్బ్‌డ్‌గా ఉన్నాను. ఇంటికి వెళ్లాక స్క్రిప్ట్ చదివాను. సర్జికల్ స్ట్రయిక్స్ గురించి అని అర్థమైంది. అయితే నాకు సర్జికల్ స్ట్రయిక్స్ గురించి పూర్తిగా తెలీదు. దాంతో తెలుసుకుందామని స్క్రిప్ట్ మొత్తం చదవాలనుకున్నాను. కానీ అప్పటికే చాలా అలసిపోయాను. దాంతో నాలుగు గంటల పాటు స్క్రిప్ట్ చదివినా నాకు అర్థం కాలేదు. ఎందుకంటే స్క్రిప్ట్‌లో ఆర్మీ భాష ఎక్కువగా ఉంది. అదీకాకుండా రాజీ సినిమాలో నేను పాకిస్థానీ ఆఫీసర్‌గా నటించాను’ ‘సడెన్‌గా ఉరి స్క్రిప్ట్ చూసి నేను ఇండియన్ ఆఫీసర్‌ పాత్రలో నటించాలని ఉంది. దాంతో అసలు కనెక్ట్ చేసుకోలేకపోయాను. మరుసటి రోజు నేను రాజీ షూటింగ్‌కు వెళ్లిపోయాను. అప్పుడు ఇంట్లో ఉన్న ఉరి స్క్రిప్ట్‌ను మా నాన్న చదివారు. నేను ఇంటికి వచ్చాక ఆ స్క్రిప్ట్ గురించి ఏం ఆలోచించావ్ అని అడిగారు. నేను ఆ జోన్‌లోకి వెళ్లలేకపోతున్నాను అని చెప్పా. సాధారణంగా నాకు ఏదన్నా స్క్రిప్ట్ ఇస్తే రెండు గంటల్లో పూర్తి చేస్తాను. కానీ ఉరి స్క్రిప్ట్ మాత్రం నాలుగు గంటలు పట్టింది. ఈ సినిమా నువ్వు చేయకపోతే ఇంతకంటే స్టుపిడ్ నిర్ణయం మరొకటి ఉండదు అని నాన్న అన్నారు. అప్పుడు నేను మరోసారి ఆ స్క్రిప్ట్ చదవాలని అనుకున్నాను. గంటన్నర పాటు స్క్రిప్ట్ చదివాను. చదివాక వెంటనే రోన్నీకి ఫోన్ చేసి ఈ సినిమా నేను తప్పకుండా చేస్తాను, దయచేసి మరో హీరోను సంప్రదించవద్దు అని చెప్పారు’ అన్నారు. నిజంగానే ఈ స్క్రిప్ట్ వదులుకుని ఉంటే విక్కీ ఎంత పశ్చాత్తాపపడేవాడో ప్రత్యేకంగా చెప్పలేదు. ఎందుకంటే ఈ సినిమా వల్లే విక్కీలో ఉన్న గొప్ప నటుడు బయటపడ్డాడు. ఈ సినిమా వల్లే ఆయనకు జాతీయ అవార్డు వచ్చింది. ఒకవేళ చేయకపోయి ఉంటే మాత్రం విక్కీ కేవలం ఓ బాలీవుడ్ నటుడిగానే మిగిలిపోయి ఉండేవాడు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2nZjXN1
v

Sye Raa Interview - Chiranjeevi, Amitabh Bachchan


Sye Raa Interview - Chiranjeevi, Amitabh Bachchan

from BharatStudent - Telugu - Actor Actress|Photo,Picture Galleries|Wallpapers|Screensavers|Movie Trailers|Film News and Gossips https://ift.tt/2noa6QM

Sirivennela Seetharama Sastry Garu About Samajavaragamana Song


Sirivennela Seetharama Sastry Garu About Samajavaragamana Song

from BharatStudent - Telugu - Actor Actress|Photo,Picture Galleries|Wallpapers|Screensavers|Movie Trailers|Film News and Gossips https://ift.tt/2o72NNP

SS Thaman About Samajavaragamana Song | Ala Vaikunthapurramuloo


SS Thaman About Samajavaragamana Song | Ala Vaikunthapurramuloo

from BharatStudent - Telugu - Actor Actress|Photo,Picture Galleries|Wallpapers|Screensavers|Movie Trailers|Film News and Gossips https://ift.tt/2o6MVL9

Saaho : Baby Won't You Tell Me Full Video


Saaho : Baby Won't You Tell Me Full Video

from BharatStudent - Telugu - Actor Actress|Photo,Picture Galleries|Wallpapers|Screensavers|Movie Trailers|Film News and Gossips https://ift.tt/2o6MUa3

ఆ టీచర్‌‌ను నిజాయతీగా ప్రేమించాను- బాలీవుడ్ హీరో

అమ్మాయిల సంగతి ఎలా ఉన్నా.. అబ్బాయిలకు మాత్రం ఫస్ట్ క్రష్ కానీ ఫస్ట్ లవ్ కానీ స్కూల్ టీచర్‌పై ఉండి ఉంటుంది. ఫలానా టీచర్ అందంగా కనిపిస్తే చాలు ఆమె కోసమైనా ఒక్క రోజు కూడా క్లాస్ ఎగ్గొట్టకుండా వెళ్లిన విద్యార్థులు ఉండకపోరు. బాలీవుడ్ నటుడు కూడా ఈ కోవకు చెందిన కుర్రాడేనట. ఆయన కెరీర్ మొదలుపెట్టిన ఆరేళ్లలో సారా అలీ ఖాన్, కృతి సనన్, రియా చక్రవర్తిలతో డేటింగ్‌ చేశాడని ఎన్నో వార్తలు వచ్చాయి. కానీ తాను మాత్రం వారెవ్వరినీ ప్రేమించలేదని ఇండియా టుడే మైండ్ రాక్స్ దిల్లీ అనే ఈవెంట్‌లో వెల్లడించారు. ‘నేను నాలుగో తరగతిలో ఉన్నప్పుడే నిజమైన ప్రేమను చూశాను. ఓ టీచర్‌‌ను చాలా నిజాయతీగా ప్రేమించాను. కానీ నేను ఆమెకు ఆ విషయాన్ని చెప్పలేకపోయాను. ఎందుకంటే పరీక్షల్లో ఫెయిల్ అయిపోతానేమోనని భయం. ఆ తర్వాత పరీక్షలు పూర్తయ్యాక కూడా ఈ విషయాన్ని ఆమెకు చెప్పలేకపోయాను. అంతేకాదు నేను నా జీవితంలో ఇప్పటివరకు ఎవ్వరికీ ఐ లవ్యూ అని చెప్పింది లేదు. నేను తొమ్మిదో తరగతి చదువుతున్నప్పుడు నాకు ఫస్ట్ ప్రపోజల్ వచ్చింది. ఆ తర్వాత కాలేజ్‌కి వెళ్లాక నా ఇంజినీరింగ్ ఫ్రెండ్స్‌కి క్లాసెస్ చెప్పేవాడిని. వారి నుంచి డబ్బులు కూడా తీసుకునేవాడిని. వచ్చిన డబ్బుతో బైక్ కొనుక్కున్నాను. ఆ తర్వాత ఒక అమ్మాయితో డేట్‌కి వెళ్లాను. తనను నా బైక్ ఎక్కించుకుని పరోటాలు తినిపించడానికి తీసుకువెళ్లాను’ అని వెల్లడించారు సుశాంత్. అయితే ఇక్కడ ఒక విషయంలో సుశాంత్ దొరికిపోయాడు. ఆయన తన కెరీర్‌లో ‘పవిత్ర రిష్తా’ అనే హిందీ సీరియల్‌తో ప్రారంభించారు. ఇందులో బాలీవుడ్ నటి అంకితా లోఖాండే ఆయనకు భార్య పాత్రను పోషించారు. ఆ తర్వాత వీరిద్దరి మధ్య ప్రేమ పుట్టి కొంతకాలం డేటింగ్ చేశారు. తాను ప్రేమలో ఉన్నానని సుశాంత్ కూడా అప్పట్లో ఒప్పుకొన్నాడు. ఆ తర్వాత సుశాంత్ సినిమాల్లోకి వచ్చేశాడు. దాంతో ఇద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చి విడిపోయారు. అయితే అంకితతో ప్రేమలో ఉన్నానని చెప్పిన సుశాంత్ తన జీవితంలో ఎవ్వరికీ ఐ లవ్యూ చెప్పలేదని అంటున్నారు. ఐ లవ్యూ చెప్పకుండా అంకితతో ఎలా డేటింగ్ చేశారో ఆయనకే తెలియాలి. సుశాంత్ నటించిన ‘చిచ్ఛోరే’ చిత్రం ఇటీవల విడులైంది. శ్రద్ధా కపూర్ కథానాయికగా నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబట్టింది. నితేశ్ తివారీ దర్శకత్వం వహించిన ఈ సినిమా రూ.100 కోట్ల క్లబ్‌లో చేరింది. మరోపక్క సుశాంత్ నటించిన ‘డ్రైవ్’ సినిమా థియేటర్‌లో విడుదలకు నోచుకోవడంలేదు. ఈ సినిమాను నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2mp2dKP
v

Ravi Babu’s Aaviri Teaser 1


Ravi Babu’s Aaviri Teaser 1

from BharatStudent - Telugu - Actor Actress|Photo,Picture Galleries|Wallpapers|Screensavers|Movie Trailers|Film News and Gossips https://ift.tt/2modD1r

Venu Madhav: ఆ రాత్రి.. వేణు మాధవ్ నేను ఒకే బెడ్‌పై పడుకున్నాం.. అతను ఇలా చేశాడు: షకీలా

‘రాత్రి పూట, లైట్స్ అన్నీ బంద్‌లో ఉన్నాయి. వేణు నా బెడ్‌పై పడుకుని నిన్ను ఒకటి అడుగుతూ కాదనకూడదు.. అని హస్కీ వాయిస్‌తో అడుగుతుంటుంటే.. ఏంట్రా నీ ప్రాబ్లమ్ అని గట్టిగా అడిగా. ఆ టైంలో వేణు ఏం చేస్తున్నాడంటే’.. అంటూ చిలిపి చేష్టలను తలుచుకుంటూ ఆసక్తికరమైన విషయాన్ని తెలియజేశారు శృంగార తార . వేణు మాధవ్ అకాల మరణంతో ఇండస్ట్రీ మొత్తం ఆయనతో ఉన్న తీపి జ్ఞాపకాలను నెమరువేసుకుంటున్నారు. ఇటీవల ‘కొబ్బరి మట్ట’ చిత్రంలో నటించిన షకీలా.. ఆ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా మాట్లాడుతూ.. వేణు మాధవ్ స్నేహానికి ఎంత విలువనిస్తాడో ఒక సంఘటన ద్వారా తెలియజేశారు. ప్రస్తుతం ఆ వీడియో వైరల్ అవుతోంది. Read Also: ‘వేణు నేను ఓ సినిమా షూటింగ్‌కి వెళ్లాం.. అక్కడ బ్రహ్మానందం, రఘుబాబు ఇలా చాలామంది ఉన్నారు. బయట నుండి చాలా మంది ఆడియన్స్ మమ్మల్ని చూడటానికి హోటల్‌కి వచ్చేవారు. ఆ టైంలో వేణు నా గదిలోనే ఉన్నాడు. అప్పుడు ఒకడొచ్చి బెడ్ మీద పడి వేణుతో మాట్లాడుతున్నాడు. వాళ్లు రూంలు వాళ్లు క్లీన్‌గా ఉంచుకునేవాళ్లు. నా రూమ్‌‌ మాత్రం దరిద్ర్యం చేసేవాళ్లు. అందుకే నా రూమ్ నీట్‌గా లేకపోవడంతో వేణు.. నీ రూంకి వస్తా పడుకుంటా అని అడిగా. సరే రా అన్నాడు. ఇద్దరం కలిసి ఒకే బెడ్ మీద పడుకున్నాం. కాసేపు అయిన తరువాత ఎవరో ఏదో చేస్తున్నారనే డిస్టబెన్స్ అనిపించింది. టీవీ అద్దంపై ఒక షాడోలా కనిపిస్తుంది. ఆ టైంలో వేణు మాధవ్.. ‘నేను నిన్ను ఒక మాట అడగనా.. నిన్ను ఒకటి అడుగుతా దానికి ఒప్పుకుంటావా? అన్నాడు. అరే.. నేను ఫ్రెండ్ అని వచ్చానే.. నిజంగా తప్పుగా అడిగితే మా మధ్య ఫ్రెండ్ షిప్ ఉండదనుకుని.. సరే అడిగి చావు అన్నాను. Read Also: నువ్ దానికి నో చెప్పకూడదు.. అంటూ హస్కీ వాయిస్‌‌తో మాట్లాడుతున్నాడు. రాత్రి పూట, లైట్స్ అన్నీ బంద్‌లో ఉన్నాయి. వేణు నా బెడ్‌పై పడుకుని దానికి ఒప్పుకుంటావా? అని అడుగుతుంటుంటే.. ఏంట్రా నీ ప్రాబ్లమ్ అని గట్టిగా అడిగా. ఆ టైంలో వేణు ఏం చేస్తున్నాడంటే.. మా ఇద్దరి మధ్యలో అడ్డుగా పిల్లోలు (తలదిండులు) పెడుతున్నాడు. ఏం రా.. ఇది అంటే.. ‘ఏం లేదు.. నాకు పెళ్లై ఇద్దరు బిడ్డలు ఉన్నారు తెలుసు కదా నీకు.. వాళ్లు బాగుండాలంటే నేను బతికి ఉండాలి.. నువ్ నిద్రలో నీ పెద్ద పెద్ద కాళ్లు తీసి నాపై వేస్తే బతకడం కష్టం. నువ్ కాళ్లు వేయాలనుకుంటే ఆ తలదిండులపై వేసుకో’ అని అన్నాడు. దానికి నేను నైట్ అంతా నవ్వి.. నెక్స్ట్ డే కూడా నవ్వుతూనే ఉన్నా. ఈ విషయం బ్రహ్మానందం, రఘు అందరికీ చెప్పేశా. ఇది కదా ఫ్రెండ్ షిప్ అంటే.. నేను తప్పుగా అనుకున్నానే అని బాధపడ్డా’ అంటూ వేణు మాధవ్ గురించి చెప్పుకొచ్చింది షకీలా.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2movBRp
v

‘Ram Charan.. లవ్యూ రా లవ్యూ రా..’

‘ఈ అడవి నాదే వేటా నాదే’ అంటూ తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమయ్యారు మెగాస్టార్ చిరంజవి తనయుడు రామ్ చరణ్. ఆయన నటించిన తొలి చిత్రం ‘చిరుత’. తొలి సినిమాను డ్యాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్‌తో చేశారు. సినిమా వంద రోజుల పాటు ఆడి బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. ఇందులో నేహా శర్మ కథానాయికగా నటించారు. మణిశర్మ సంగీతం అందించారు. సినిమా విడుదలైన నేటికి 12 ఏళ్లు అవుతోంది. ఈ సందర్భంగా ప్రముఖ లిరిసిస్ట్ రామజోగయ్య శాస్త్రి సినిమాతో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. సినిమాలోని ‘లవ్యూ రా లవ్యూ రా నా మనసంతా నువ్వేరా’ అనే పాట గుర్తుందా. ఈ పాటకు రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ రాశారు. చరణ్ కోసం ఆయన రాసిన మొదటి పాట ఇదేనని ట్విటర్ వేదికగా వెల్లడించారు. అంతేకాదు సినిమా షూటింగ్‌ను కూడా పాటతోనే మొదలుపెట్టినట్లు తెలిపారు. చిరంజీవి కొడుకు కావడంతో సినిమా ఓ రేంజ్‌లో దూసుకెళ్లింది. రామ్ చరణ్ కెరీర్‌ విజయవంతంగా సాగేలా చేసింది. చిరు ఫ్యామిలీ నుంచి ఎవరైనా ఇండస్ట్రీలోకి వచ్చారంటే వారిపై ఏ రేంజ్‌లో అంచనాలు ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక చిరు కుమారుడే ఎంట్రీ ఇస్తున్నాడంటే హైప్ ఎంతుంటుందో ఆలోచించండి. అందుకే సినిమా ఆడకపోయినా ఫర్వాలేదు కానీ తన తండ్రి స్థాయికి మాత్రం ఎలాంటి చెడ్డపేరు తీసుకురాకూడదని చరణ్ చాలా జాగ్రత్తలు తీసుకున్నాడు. మొత్తానికి తొలి చిత్రంతోనే చిరు కొడుకా మజాకా అనిపించాడు. చిరుత సినిమాకు వైజయంతి మూవీస్ బ్యానర్‌పై అశ్వినీ దత్ నిర్మాతగా వ్యవహరించారు. రూ.18 కోట్ల బడ్జెట్‌తో సినిమాను తెరకెక్కిస్తే బాక్సాఫీస్ వద్ద రూ.22.5 కోట్ల కలెక్షన్స్ వచ్చాయి. ప్రకాశ్ రాజ్, ఆశిష్ విద్యార్థి, బ్రహ్మానందం, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, అలీ సహాయ పాత్రలు పోషించారు. ఈ సినిమాకు వచ్చిన సక్సెస్ రేట్‌ను చూసి బెంగాలీలో ‘రంగ్‌బాజ్’ అనే టైటిల్‌తో రీమేక్ చేశారు. ఆ తర్వాత ఇదే టైటిల్‌తో హిందీలో డబ్బింగ్ కూడా చేశారు. సినిమా కాన్సెప్ట్ ఒక ఎత్తైతే.. ఇందులో పాటలు మరో ఎత్తు. పాటలకు చాలా మంది స్పందన వచ్చింది. పాటలకు సంబంధించిన క్యాసెట్లు, సీడీలు హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి. ఇప్పుడు రామ్ చరణ్ మెగా పవర్‌స్టార్ ట్యాగ్‌తో కోట్లాది మంది అభిమానుల్ని సంపాదించుకున్నారు. ఆయన చివరగా నటించిన ‘వినయ విధేయ రామ’ సినిమా అట్టర్ ఫ్లాప్ అయింది. ప్రస్తుతం దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఆర్ ఆర్ ఆర్’ సినిమాతో చరణ్ బిజీగా ఉన్నారు. దీంతో పాటు తన తండ్రి నటించిన ‘సైరా నరసింహారెడ్డి’ సినిమా నిర్మాణ పనులను కూడా చూసుకుంటున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2nXpYd5
v

Samajavaragamana Full Song - Ala Vaikuntapuramlo


Samajavaragamana Full Song - Ala Vaikuntapuramlo

from BharatStudent - Telugu - Actor Actress|Photo,Picture Galleries|Wallpapers|Screensavers|Movie Trailers|Film News and Gossips https://ift.tt/2mzWkKy

Friday 27 September 2019

నయనతార, విఘ్నేష్ శివన్ పెళ్లి అక్కడేనా?

లేడీ సూపర్ స్టార్ పెళ్లి మీదే ఇప్పుడు అభిమానుల చూపులు ఉన్నాయి. ప్రముఖ తమిళ దర్శకుడు విఘ్నేష్ శివన్‌తో దాదాపు ఐదేళ్లుగా డేటింగ్‌లో ఉన్నారు నయన్. విఘ్నేష్ తనకు కాబోయే భర్త అని ఓ వేదికపై నయన్ ప్రకటించేశారు కూడా. ఇద్దరూ తరచూ విహారయాత్రలకు వెళుతున్నారు. అక్కడి ఫొటోలను విఘ్నేష్ ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఇటీవల విఘ్నేష్ పుట్టినరోజు సందర్భంగా నయన్ ఘనంగా పార్టీ కూడా ఏర్పాటుచేశారు. కాగా.. ఇప్పుడు వీరిద్దరూ తమ ప్రేమను మరో మెట్టు ముందుకు తీసుకువెళ్లాలనుకుంటున్నారట. డిసెంబర్‌లో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు కోలీవుడ్ వర్గాల సమాచారం. వీరి పెళ్లి విదేశాల్లో జరగనున్నట్లు తెలుస్తోంది. ఇండియాలో అయితే అభిమానులు, మీడియా వర్గాల వల్ల ప్రైవసీ ఉండదని డెస్టినేషన్ వెడ్డింగ్‌ను ప్లాన్ చేసుకోవాలని అనుకుంటున్నారట. అయితే ఎక్కడ పెళ్లి చేసుకోబోతున్నారన్న విషయం మాత్రం తెలియరాలేదు. తరచూ నయన్, విఘ్నేష్ విహారయాత్రల నిమిత్తం విదేశాలకు వెళ్లి వస్తుంటారు. వారు వెళ్లిన ప్రదేశాల్లోనే ఎక్కడో ఒక చోట వివాహ బంధంతో ఒకటి కాబోతున్నారట. నయన్ నటించే సినిమాల కంటే పెళ్లి విషయమే ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఇప్పటికే విఘ్నేశ్ తన ఇంట్లోవారికి నయన్‌ను పరిచయం చేశారు. విఘ్నేశ్ కంటే ముందు నయన్‌ తమిళ నటుడు శింబుతో ప్రేమలో ఉన్నారు. కానీ కొన్ని కారణాల వల్ల వీరు విడిపోయారు. ఆ తర్వాత ప్రముఖ కొరియోగ్రాఫర్, దర్శకుడు ప్రభుదేవాను నయన్ పెళ్లి చేసుకోవాలనుకున్నారు. దాంతో ప్రభుదేవా తన భార్యకు విడాకులు కూడా ఇచ్చేశారు. నయన్ బ్యాంకాక్‌కు వెళ్లి మరీ ప్రభుదేవా పేరును పచ్చబొట్టు వేయించుకున్నారు. అంతా బాగానే ఉందనుకున్న సమయంలో వీరిద్దరి మధ్య ఏం జరిగిందో తెలీదు కానీ బ్రేకప్ అయ్యారు. ప్రభుదేవా టాట్టూను తొలగించుకోవడానికి నయన్ బ్యాంకాక్ వెళ్లారు కూడా. 2015లో వచ్చిన ‘రైడీ ధాన్’ సినిమా సెట్‌లో నయనతార, విఘ్నేశ్ శివన్ కలుసుకున్నారు. ఆ తర్వాత వీరి స్నేహం ప్రేమగా మారింది. వర్క్ పరంగా ప్రస్తుతం నయనతార తమిళంలో ‘నెట్రికాన్’ అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాకు విఘ్నేశ్ నిర్మాతగా వ్యవహరిస్తు్న్నారు. సినిమాలో నయన్ అంధురాలి పాత్రలో నటించనున్నట్లు తెలుస్తోంది. మరోపక్క నయన్ కథానాయికగా నటించిన ‘సైరా నరసింహారెడ్డి’ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. సూపర్ స్టార్ రజనీకాంత్‌కు జోడీగా ‘దర్బార్’ సినిమాలో నటిస్తున్నారు. మరోపక్క ప్రముఖ తమిళ నటుడు విజయ్‌కు జోడీగా ‘బిగిల్’ సినిమతోనూ బిజీగా ఉన్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2o4D74j
v

‘ఆ దర్శకుడు ముగ్గుర్ని లైంగికంగా వేధించాడు, నిర్దోషి అని ప్రూవైతే...’

ఉద్యమం నేపథ్యంలో ఎందరో సెలబ్రిటీల పేర్లు బయటికి వచ్చిన సంగతి తెలిసిందే. అలా మీటూలో దోషులైన వారందరికీ ఇండస్ట్రీలో పని లేకుండా పోయింది. వారిలో బాలీవుడ్ దర్శకుడు సాజిద్ ఖాన్ ఒకరు. ఇండస్ట్రీలో ఆయనకు మంచి పేరుంది. అలాంటిది ముగ్గురు నటీమణులు తమను సాజిద్ లైంగికంగా వేధించాడు అని చెప్పగానే అందరూ షాకయ్యారు. ఈ ఆరోపణలు బయటికి వచ్చినప్పుడు సాజిద్.. ‘హౌస్‌ఫుల్ 4’ సినిమాకు దర్శకత్వం వహించాల్సి ఉంది. ఇందులో ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. సాజిద్‌పై ఆరోపణలు రావడంతో అక్షయ్‌కు కోపం వచ్చింది. ఈ కేసు తేలే వరకు సినిమా చిత్రీకరణలో పాల్గొనేది లేదని ఆయన తేల్చిచెప్పేశారు. దాంతో సాజిద్ సినిమా నుంచి తప్పుకొన్నారు. దాంతో సాజిద్ స్థానంలో ఫర్హాద్ సంఝీని ఎంపిక చేశారు. శుక్రవారం సినిమా ట్రైలర్ విడుదలైంది. ఈ సందర్భంగా పలు మీడియా వర్గాలు అక్షయ్‌ని ఓ ప్రశ్న అడిగాయి. ‘మీరు సాజిద్ ఖాన్‌తో కలిసి పనిచేస్తారా?’ అని. ఇందుకు అక్షయ్ స్పందిస్తూ.. ‘అసలు ఈ కేసు విషయంలో ఏం జరిగిందో నాకు తెలీదు. కానీ ముగ్గురు అమ్మాయిలు సాజిద్ తమను లైంగికంగా వేధించాడంటూ న్యాయం కోసం మీడియా ముందుకొచ్చారు. వారు చెప్తోంది నిజమో కాదో న్యాయస్థానం నిర్ణయిస్తుంది. ఒకవేళ ఈ కేసులో సాజిద్ నిర్దోషి అని ప్రూవైతే తప్పకుండా అతనితో కలిసి సినిమాలు చేస్తాను. లేకపోతే అసలు ఆయన ముఖం కూడా చూడను. సినిమా క్రెడిట్స్‌లో సాజిద్‌కు క్రెడిట్ ఇవ్వలేదు. ఇది నేను తీసుకున్న నిర్ణయం కాదు. నిర్మాణ సంస్థ తీసుకున్న నిర్ణయం. మీటూ ఉద్యమం మొదలై దాదాపు ఏడాది కావొస్తోంది. నాకు ఇప్పుడు ఇండస్ట్రీలో మార్పులు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ప్రతి నిర్మాణ సంస్థలో లైంగిక వేధింపులను పరిష్కరించడానికి ప్రత్యేక అధికారులను నియమించారు. ఏ ఆడపిల్ల విషయంలో అలాంటి తప్పు జరగకుండా జాగ్రత్త పడుతున్నారు. సినిమా సెట్స్‌లో ఏ అమ్మాయి ఇలాంటివి ఎదుర్కోకూడదు’ అని వెల్లడించారు. అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ‘హౌస్‌ఫుల్ 4’ ట్రైలర్ విడుదలైంది. ఇందులో అక్షయ్‌తో పాటు రితేశ్ దేశ్‌ముఖ్, బాబీ డియోల్ మరో ఇద్దరు కథానాయకులుగా నటిస్తున్నారు. అక్షయ్ కుమార్‌కు జోడీగా కృతిసనన్, రితేశ్ దేశ్‌ముఖ్‌కు జోడీగా పూజా హెగ్డే, బాబీ డియోల్‌కు జోడీగా కృతి కర్బంద నటించారు. రానా దగ్గుబాటి భయంకరంగా కనిపించే విలన్ పాత్రను పోషించారు. ట్రైలర్‌లో అక్షయ్ కుమార్ క్యారెక్టర్ ఇంట్రొడక్షన్ చాలా ఫన్నీగా ఉంది. దీపావళికి ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2njjdC9
v

40 ఏళ్ల వయసులో అంత ఎక్స్‌పోజింగా.. పవన్ హీరోయిన్‌కి ధైర్యం ఎక్కువే

‘వయసనేది కేవలం సంఖ్య మాత్రమే’ ఇప్పుడు ఏ హీరోయిన్ నోట విన్నా ఇదే మాట. వయసు ఎక్కువని ఫీలైతే ఎక్కడ సినిమా అవకాశాలు రావో అని అలా చెప్తారో ఏమో తెలీదు కానీ వయసు మీదపడుతున్నా క్లీవేజ్ ఎక్కువగా కనిపించే దుస్తులు వేసుకుంటున్నారు. ఇటీవల ముంబయిలో వోగ్ బ్యూటీ అవార్డ్స్ జరిగాయి. ఈ వేడుకకు బాలీవుడ్ నటి కూడా హాజరయ్యారు. వైట్ చిఫాన్ గౌను ధరించి ఈవెంట్‌కు షాకింగ్ ఎంట్రీ ఇచ్చారు. ఇక షాకింగ్ విషయం ఈమె ఈవెంట్‌కు రావడం కాదు ఆమె వేసుకున్న డ్రెస్. ముందు ప్రైవేట్ పార్ట్స్ కనిపించేలా ఉన్న ఆ డ్రెస్ చూసి చాలా మంది అవాక్కయ్యారు. అయితే ఆమె ప్రియుడు, బాలీవుడ్ నటుడు అర్జున్ కపూర్ మాత్రం ఆ డ్రెస్‌లో ఆమెను చూసి ఫిదా అయిపోయాడు. నా గర్ల్‌ఫ్రెండ్ కేక అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు పెట్టాడు. 17 ఏళ్ల కుర్రాడికి తల్లైన మలైకా నాలుగు పదుల వయసులో ఇలాంటి దుస్తులు వేసుకోవడం ఏంటి అని నెటిజన్ల నుంచి కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి. సల్మాన్ ఖాన్ సోదరుడు, నిర్మాత అయిన అర్బాజ్ ఖాన్‌ను మలైకా పెళ్లి చేసుకున్నారు. వీరికి 17 ఏళ్ల కుమారుడు కూడా ఉన్నాడు. కొన్నేళ్ల క్రితం వీరి మధ్య మనస్పర్ధలు వచ్చాయి. అర్బాజ్‌తో గొడవ పడుతున్నప్పుడు మలైకాకు అర్జున్ పరిచయమయ్యాడు. వీరిద్దరి మధ్య ఏర్పడిన స్నేహం ఆ తర్వాత ప్రేమగా మారింది. అర్జున్ కంటే మలైకా వయసులో పదేళ్లు పెద్దది. ఈ విషయాన్ని అర్జున్ తన ఇంట్లో వారితో కూడా చెప్పాడు. ఆయన తండ్రి బోనీ కపూర్ మాత్రం హెచ్చరించాడు. సల్మాన్ ఖాన్ కుటుంబంతో పెట్టుకుంటే కెరీర్ లేకుండాపోతుందని, మలైకాకు దూరంగా ఉండాలని చెప్పాడు. కానీ అర్జున్ వినలేదు. అప్పటిదాకా రహస్యంగా ప్రేమాయణం సాగిస్తున్న వీరు కొన్ని నెలల క్రితం అవును మేమిద్దరం ప్రేమించుకుంటున్నాం అని మీడియా ముందు బయటపెట్టేశారు. మలైకా వయసు 45 ఏళ్లు అయినప్పటికీ ఆమె క్రమం తప్పకుండా యోగా చేస్తూ తన వయసు తెలీకుండా మెయింటేన్ చేస్తున్నారు. ఆమె యాబ్స్ చూస్తే ఈ వయసులో ఇంత ఫిట్‌గా కూడా ఉండొచ్చా అనిపిస్తుంది. ఇప్పుడనే కాదు మలైకా వేసుకునే దుస్తులపై సోషల్ మీడియాలో ఎప్పుడూ కామెంట్లు వస్తూ ఉంటాయి. 17 ఏళ్ల కుమారుడిని ఇంట్లో పెట్టుకుని ఇలాంటి దుస్తులు వేసుకుంటే ఎంత అసహ్యంగా ఉంటుందో ఆలోచించండి అంటూ పలువురు నెటిజన్లు ఉచిత సలహాలు కూడా ఇస్తుంటారు. కానీ మలైకా వాటిని అస్సలు పట్టించుకోదు. పైగా నా బాడీ నా రూల్స్ అని ఘాటుగా స్పందించి వారి నోటికి తాళం వేస్తుంటారు. ఇక మలైకా కెరీర్ విషయానికొస్తే ఆమె కేవలం ఐటెం సాంగ్స్‌కే పరిమితం అయ్యారు. ‘ఛయ్య ఛయ్య’ పాటతో బాలీవుడ్‌లో పాపులర్ అయిన మలైకా ఎన్నో ఐటెం సాంగ్స్‌లో నటించారు. తెలుగులో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన ‘గబ్బర్ సింగ్’ చిత్రంలో ‘కెవ్వు కేక’ పాటలో ఆడిపాడారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2lNEOSO
v

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...