Friday 30 April 2021

‘వకీల్‌సాబ్’ టైటిల్ కార్డులో ఇంత అర్థం ఉందా.. వేణు శ్రీరామ్ నువ్వు మామూలోడివి కాదు!

రాజకీయాల కోసం సినిమాలకు దూరమైన పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్.. మళ్లీ ‘’ సినిమాతో రీఎంట్రీ ఇచ్చారు. హిందీలో సూపర్‌హిట్ సాధించిన ‘పింక్’ రీమేక్‌గా ఈ సినిమా రూపొందింది. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌పై దిల్ రాజు నిర్మించిన ఈ సినిమాకి దర్శకత్వం వహించాడు. ఏప్రిల్ 9న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. పవర్‌స్టార్‌ని ఓ పవర్‌ఫుల్ లాయర్ పాత్రలో చూసి.. అభిమానులు పండుగ చేసుకున్నారు. స్వతహాగా పవన్‌కళ్యాణ్ అభిమాని అయిన వేణు శ్రీరామ్ ఒక ఫ్యాన్ తన ఫేవరేట్ హీరోని ఎలా చూపించాలో సినిమాలో పవన్‌కళ్యాణ్‌ని అలాగే చూపించాడు. పవర్‌స్టార్ ఇమేజ్‌కి తగ్గట్లు స్క్రిప్ట్‌లో కొన్ని మార్పులు చేసి.. ఫ్యాన్స్‌కి ఫీస్ట్ అందించాడు. మాస్ యాంగిల్‌లో ఓ రేంజ్ ఎలివేషన్లతో పవర్‌స్టార్‌ రీఎంట్రీ అదిరిపోయేలా సినిమాని రూపొందించాడు దర్శకుడు. ఇక బాక్సాఫీస్‌ను షేక్ చేసిన ‘వకీల్‌సాబ్’ తాజాగా ఓటీటీలో విడుదలైంది. అమెజాన్ ప్రైమ్‌లో విడుదలైన ఈ సినిమా ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉంది. అయితే ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన ఓ ఆసక్తికర విషయం సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది. అదేంటంటే.. ఈ సినిమాలో పవన్‌కళ్యాణ్ టైటిల్ కార్డు. ఇంతకు ముందు పవన్‌కళ్యాణ్ సినిమాల్లో ఆయన టైటిల్ కార్డు మామూలుగానే ఉండేది. కానీ, వకీల్‌సాబ్ సినిమాలో మాత్రం పంచభూతాలు కలిసి ఒక నక్షత్రంగా ఏర్పడి.. ఆ తర్వాత పవర్‌స్టార్ అని వచ్చేలా టైటిల్‌కార్డును డిజైన్ చేయించాడు వేణు శ్రీరామ్. ఇప్పుడు ఈ పంచభూతాల కాన్సెప్ట్ అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటుంది. ఇందుకు సంబంధించిన ఫోటో ఒకటి సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది. ఇది చూసిన జనాలు ‘వేణు శ్రీరామ్.. నువ్వు మామూలోడివి కాదు.. నీ ఆలోచనకి హ్యాట్సాఫ్’ అంటూ కామెంట్ చేస్తున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3xO5wuS
v

Happy Birthday Ajith: తెలుగు సినిమాతో కెరీర్‌ స్టార్ట్.. తలనెరిసినా తగ్గని క్రేజ్.. సౌతిండియాకే ట్రెండ్ సెట్టర్‌

స్టార్ హీరో అంటే ఇలాగే ఉండాలి.. అనే కొలమానాలు ఇండస్ట్రీలో ఉన్నాయి. స్మార్ట్ లుక్స్, స్టైలిష్ డ్రెస్సింగ్ ఇలా చెప్పుకుంటూపోతే బొలెడన్ని క్వాలిటీస్ ఉంటేనే అతన్ని హీరోగా గుర్తిస్తారు. కానీ, అలాంటి అడ్డుగోడలు అన్ని బద్దలుకొట్టారు . తల, గడ్డెం నెరిసినా.. కనీసం రంగు కూడా వేసుకోకుండా యాక్టింగ్ చేస్తూ.. సౌతిండాలోనే ట్రెండ్ సెట్టర్‌గా నిలిచారు. సినిమా రంగంలోనే కాదు.. రేసింగ్‌లోనూ తన ప్రతిభ చూపిస్తూ.. కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నారు ఆయన. నేడు(మే 1వ తేదీ) ‘తలా’ 50వ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయన కెరీర్‌కు సంబంధించిన ఆసక్తికర విషయాలు కొన్ని తెలుసుకుందాం. అజిత్ 1971, మే 1వ తేదీన సికింద్రాబాద్‌లో జన్మించారు. ఆయన తండ్రి సుబ్రహ్మణ్యం కేరళకి చెందిన వ్యక్తి, తల్లి సింధిది కోల్‌కతా. పదవ తరగతిలో చదువు మానేసిన ఆయన.. ఆ తర్వాత ఓ మిత్రుడి ద్వారా కొంతకాలం రాయల్ ఎన్‌ఫీల్డ్‌లో మెకానిక్‌గా పని చేశారు. ఇలా చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తూనే ఆయన మోడలింగ్, చేయడం కూడా ప్రారంభించారు. ఈ క్రమంలో ప్రముఖ సినిమాటోగ్రాఫర్ పీ.సీ.శ్రీరామ్ ఆయనను గుర్తించి.. సినిమా రంగంవైపు అడుగులు వేయించారు. ఇక దివంగత గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం రికమండేషన్‌తో ఆయన ‘ఎన్‌ వీడు ఎన్ కనవర్’ అనే సినిమాలో ఓ చిన్న పాత్రలో నటించారు. ఆ తర్వాత తెలుగులో ‘ప్రేమ పుసక్తం’ అనే సినిమా ద్వారా ఆయన హీరోగా మారారు. కానీ, ఆ సినిమా దర్శకుడు గొల్లపూడి శ్రీనివాస్ మృతితో సినిమా ఆగిపోయింది. ఆ తర్వాత 1993లో ‘అమరావతి’ అనే సినిమా ద్వారా అజిత్ తొలిసారిగా వెండితెరపై కనిపించారు. కానీ, ఆయనకు ఆ తర్వాత పెద్దగా అవకాశాలు రాలేదు. కానీ, పట్టువదలని అజిత్ కొన్ని సినిమాల్లో సైడ్ క్యారెక్టర్లలో నటించారు. 1995లో విడుదలైన ‘ఆసాయ్’ అనే సినిమా ద్వారా తొలి సక్సెస్‌ని అందుకున్నారు అజిత్. అప్పటి నుంచి అజిత్ వెనక్కి తిరిగి చేసుకోలేదు. తన రెండో హిట్ సినిమా ‘కాదల్ కొట్టాయ్’తో అజిత్ జాతీయ అవార్డును సొంతం చేసుకున్నారు. 1997లో ఎస్‌జే సూర్య దర్శకత్వంలో తెరకెక్కిన ‘వాలీ’ అనే సినిమాతో ఆయన తమిళంతో పాటు తెలుగులో కూడా క్రేజ్ సంపాదించుకున్నారు. ఈ సినిమాతో ఆయన స్టార్ హీరో స్టేటస్‌ని సంపాదించుకున్నారు. ఇక 1999లో అజిత్ నటించిన ఆరు సినిమాలు విడుదల కాగా.. అన్ని సూపర్ హిట్లుగా నిలిచాయి. ఇక ‘బిల్లా’ సినిమా ద్వారా సపరేట్ క్రేజ్ తెచ్చుకున్నారు అజిత్. ఈ సినిమాలో ఆయన డ్యుయల్ రోల్‌లో నటించి అభిమానులతో పాటు విమర్శకుల నుంచీ ప్రశంసలు అందుకున్నారు. ఇక వెంకట్ ప్రభు దర్శకత్వంలో తెరకెక్కిన తన 50వ చిత్రం ‘మన్‌కథ (తెలుగులో గాంబ్లర్)’లో ఆయన తొలిసారిగా డిఫరెంట్‌లుక్‌లో కనిపించి అలరించారు. ఆ తర్వాత ‘ఆరంభం’, ‘వీరమ్’, ‘ఎన్నాయ్ అరిందాల్’, ‘వేదాలం’, ‘వివేగం’ ‘విశ్వాసం’ తదితర చిత్రాలతో దక్షిణాది ప్రేక్షకులకు చేరువయ్యారు అజిత్. దాదాపు 60 చిత్రాల్లో నటించిన అజిత్ తన సినిమా కెరీర్‌లో నాలుగు విజయ్ అవార్డులు, మూడు ఫిలిమ్ ఫేర్ అవార్డులు, తమిళనాడు రాష్ట్ర సినీ పురస్కారాలు అందుకున్నారు. యాక్టింగ్‌తో పాటు రేసింగ్‌లో అజిత్ పలు అవార్డులు సొంతం చేసుకున్నారు. ముంబై, ఢిల్లీ, చెన్నైలలో జరిగిన కారు రేసుల్లో పాల్గొన్న ఆయన.. అందులోనూ తన సత్తా చాటుకున్నారు. అంతర్జాతీయ వేదికగా ఫార్ములా కార్ రేసింగ్‌లో పాల్గొన్న అతి తక్కువ మంది భారతీయుల్లో ఆయన ఒకరు. 2000 సంవత్సరంలో ‘అమర్కళం’ సినిమాలో ఆయన హీరోయిన్‌గా నటించిన షామిలీని అజిత్ వివాహం చేసుకున్నారు. 2008లో వీరికి పాప జన్మించింది. ఇక హిందీలో సూపర్ హిట్ సాధించిన ‘పింక్’ తమిళ రీమేక్‌ ‘నెర్కొండ పార్వాయ్’లో అజిత్ నటించారు. ప్రస్తుతం ఆయన హెచ్.వినోథ్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘వాలిమై’ అనే సినిమాలో నటిస్తున్నారు. ఆయన తన కెరీర్‌లో మరిన్ని విజయాలను అందుకోవాలని కోరుకుంటూ.. ‘తెలుగు సమయం’ తరఫున అజిత్‌కు బర్త్‌డే విషెస్ తెలుపుతున్నాము.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2PCPMJJ
v

ఎమ్మెస్ నారాయణ సెట్‌కి తాగి వచ్చి నన్ను గదిలోకి లాక్కుపోయాడు.. నేను అలా చేసేసరికి..: నటి పద్మ జయంతి

సీనియర్ ఆర్టిస్ట్ చాలా చిత్రాల్లో కనిపిస్తూనే ఉంటుంది. దాదాపు 350కి పైగా చిత్రాల్లో నటించిన పద్మ జయంతి.. తల్లిగా.. వదినగా.. ఇతర పాత్రల్లో కనిపించింది. అయితే తాజాగా ఆమె ఓ యూట్యూబ్ ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూ టాలీవుడ్ ఇండస్ట్రీపైన సీనియర్ నటులపైన షాకింగ్ కామెంట్స్ చేసింది.. తాను 350 చిత్రాల్లో నటించినప్పటికీ ఇప్పటికీ ప్రేక్షకులు సరిగా గుర్తుపట్టడం లేదంటే.. దాదాపు 200 సినిమాల్లో తనని ఎదగనీయకుండా దొక్కేయడమే కారణం అంటూ సంచలన కామెంట్స్ చేసింది. ఈ సందర్భంగా చలపతిరావు, చంద్రమోహన్ తదితరులు సీనియర్ నటులపై తీవ్ర ఆరోపణలు చేయగా.. దివంగత నటుడు, స్టార్ కమెడియన్ తనతో తాగి వచ్చి మిస్ బిహేవ్ చేశారంటూ నాడు సెట్ ఆయన ఎలా ప్రవర్తించాడో చెప్పుకొచ్చింది. నేను ఇండస్ట్రీలో ఎన్ని బాధలు పడ్డానో.. నేను ఏడ్వడం కాదు.. ఎదుటి వాళ్లు ఏడుస్తారు. కానీ బయటకు చెప్పుకోలేను. ఎందుకుంటే.. నన్ను చూసి నా వెనుక చాలామంది ఏడుస్తారు. నన్ను చాలామంది చాలా రకాలుగా హింసించారు. సీనియర్ కమెడియన్ ఎమ్మెస్ నారాయణ గారు సెట్స్‌లోనే నాతో అసభ్యకరంగా ప్రవర్తించారు. మేం ఇద్దరం కలిసి ఓ సినిమాకి చేస్తున్నాం.. అప్పటికి నా పరిస్థితి ఏంటి అంటే మా అత్తగారు చనిపోయి నెలరోజులైంది. నెలకార్యం జరిపిస్తుండగా.. నేను షూటింగ్‌కి రావాల్సివచ్చింది. ఆ విషయంపై మా ఆయన్ని నానా మాటలు అన్నారు. అయినా షూటింగ్‌ నుంచి బయటకు వెళ్లే పరిస్థితి లేదు. అది దాదాపు 22 మంది కమెడియన్లతో సీన్.. తప్పుకుండా అందరూ ఉండాల్సింది. అయితే సెట్‌లో నేను కూర్చుని ఉండగా.. వెనుక నుంచి ఒకరు వచ్చి నా చేయి పట్టుకుని లాక్కుని వెళ్తున్నారు.. ఎవరా అని చూస్తే.. ఎమ్మెస్ నారాయణ గారు. ఆయన పర్సనాలిటీ నాలో సగం ఉంటుంది కానీ.. నన్ను పట్టుకుని లాక్కుపోతున్నారు. ఇదేంటి సార్ అంటే.. ఏం లేదు నీతో మాట్లాడే పని ఉంది. రా.. మాట్లాడాలి అని అన్నారు. అప్పటికే ఆయన దగ్గర మందు వాసన వస్తుంది. సెట్‌కి తాగి వచ్చేశారు. తాగిన మైకంలో నన్ను చేయిపట్టుకుని గదిలోకి లాక్కుపోతున్నారు. ఇదేంటి సార్.. అని అంటే.. ఎహే రావే అని ఆయన లాంగ్వేజ్‌లో మాట్లాడుతున్నారు. ఒక్కసారి చేయి విడిపించుకున్నా.. ఇదేం పనిసార్ అని సీరియస్ అయ్యాను. ఇంక ఆయన నువ్ బాగున్నావ్.. సెక్సీగా ఉన్నావ్ అంటూ ఏంటేంటో మాట్లాడి.. రా నీతో పని ఉందని అన్నారు. నా చేయి మాత్రం వదలడం లేదు. నాకు అతని పరిస్థితి అర్థమైంది.. పైగా తాగి ఉన్నాడని అర్థం చేసుకుని.. బలవంతంగా చేయి లాక్కుని.. ఏంటి సార్?? అసలు ఏం మాట్లాడుతున్నారు.. షూటింగ్‌లో ఉన్నాం.. లొకేషన్‌కి షూటింగ్ కోసం రాలేదా ఏంటి?? అని అడిగా. ఎహే.. షూటింగ్ చేసే మూడ్ లేదు నాకు అని అన్నారు. అయితే ఇంటికి వెళ్లిపోండి మూడ్ వస్తుంది అని అన్నారు. మా ఇద్దరి మధ్య చాలా గొడవ జరిగింది. ఆ తరువాత కూడా నాతో చాలా రఫ్‌గా బిహేవ్ చేస్తున్నారు. ఇక లాభం లేదనుకుని.. ఎంతవరకూ సరదాగా ఉండాలో అంతవరకే ఉండాలి అనుకుని.. నేను రాను అని గట్టిగా చెప్పాను. అయినా ఆయన అది కాదు అని మిస్ బిహేవ్ చేయబోయాడు. నాకు ఒళ్లు మండిపోయింది. వెంటనే పైకి లేచి పీకపట్టుకుని గోడదగ్గర నిలబెట్టేశా. ఆయన నాలో సగం ఉంటారు. గట్టిగానే తిప్పికొట్టా. దీంతో ఆయన నా పీక పట్టుకుందని గట్టి గట్టిగా అరవడం మొదలుపెట్టారు. అందరూ వచ్చేశారు.. ఆయన్ని పక్కకి తీసుకుని వెళ్లారు. అందరూ నన్ను కూల్ చేయడానికి ట్రై చేశారు. ఆయన పెద్ద కమెడియన్ కాబట్టి.. విషయాన్ని పెద్దది చేయకుండా మాట్లాడారు. అంటే నాకు ప్రాబ్లమ్ అవుతుందని సర్దిచెప్పారు. కానీ ఇష్యూ పెద్దది అయిపోయింది.. నేను వెళ్లి యూనియన్‌లో కంప్లైంట్ చేయడం.. పెద్దవాళ్లు వచ్చి మాట్లాడటాలు.. జరిగాయి. ఆ పెద్దలు నాకు ఫోన్ చేసి.. నీకు లైఫ్ ఉండదు.. పెద్ద కొండను ఢీ కొడుతున్నావ్ అని అన్నారు. నేను పడ్డ బాధల్లో ఇది ఎంతలే అని వెనక్కి తగ్గలేదు. ఈరోజు నేను వదిలేస్తే.. నా వెనుక వేరే వాళ్లు బాధపడతారని అనుకున్నా.. కానీ నాకు ఆ పరిస్థితులో ఒకటి అర్థం అయ్యింది మనకంటూ ఒక సపోర్ట్ కావాలి అని. సపోర్ట్ లేకపోతే ఎవడైనా అడ్వాంటేజ్ తీసుకుంటాడని అర్థమైంది. ఆ ఇష్యూతో దాదాపు 10 సినిమాల వరకూ పోయాయి. నటించకుండా చేశారు. చాలామంది బెదిరించారు. పొరపాటున ఏదైనా సినిమా చేస్తుంటే నిర్మాతకి చెప్పి క్యాన్సిల్ చేయించేవారు. ఆ తరువాత మెల్ల మెల్లగా నా సినిమాలు నేను చేసుకున్నాను’ అంటూ తనకి జరిగిన అన్యాయాన్ని బయటపెట్టింది క్యారెక్టర్ ఆర్టిస్ట్ పద్మ జయంతి.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3353rww
v

వామ్మో కల్పిక.. గ్లామర్ డోస్ మామూలుగా లేదుగా.. మోనోకినీలో తెలుగు అమ్మాయి అందాలు..!

టాలీవుడ్‌లో తెలుగు అమ్మాయిలు నిలదొక్కుకోవడం చాలా కష్టం. అలాంటి చాలాకాలంలో ఓ తెలుగు అమ్మాయి ఇండస్ట్రీలో నెట్టుకొస్తుంది అంటే అది ఎంతో గొప్ప విషయం అనే చెప్పుకోవాలి. ‘ప్రయాణం’ సినిమాతో టాలీవుడ్‌లో అడుగు పెట్టిన కల్పిక.. ఆ తర్వాత వరుస సినిమాలతో తెలుగు ప్రేక్షకులను అలరించింది. ముఖ్యంగా ‘జులాయి’, ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ సినిమాలలో తన నటనకు ప్రత్యేక గుర్తింపు లభించింది. ఇక సోషల్‌మీడియాలో ఈ భామ విపరీతంగా యాక్టివ్‌గా ఉంటుంది. సినిమాల్లో గ్లామర్ షోకి పూర్తి దూరంగా ఉండే ఆమె.. సోషల్‌మీడియాలో మాత్రం రెచ్చిపోతుంటుంది. హాట్ ఫోటోషూట్‌లు చేస్తూ.. కుర్రకారు గుండెల్లో హీటు పుట్టిస్తుంటుంది. ఈ మధ్యకాలంలో ఈ బ్యూటీ గ్లామర్ డోస్ బాగానే పెంచేసింది. ఆమె సినిమాల్లో చేసేది సపోర్టింగ్ పాత్రలే అయినా.. హీరోయిన్స్‌లా శరీరాకృతి మెయింటేన్ చేస్తుంది. అంతేకాదు.. హీరోయిన్లకు తాను ఏ మాత్రం తీసిపోనూ అనే రేంజ్‌లో సోషల్‌మీడియాలో ఫోటోలు పెడుతుంది. తాజాగా ఏకంగా ఓ మోనోకిని ధరించి ఆ ఫోటోని తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో అప్‌లోడ్ చేసింది. ఇంకేముంది కొంత సమయంలోనే ఈ ఫోటో సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది. కల్పిక ఈ ఏడాది ‘సీత ఆన్ ది రోడ్’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. వుమెన్ సెంట్రిక్‌గా సాగే ఈ సినిమా అంతలా ఆకట్టుకోలేదు. ఐదు వేర్వేరు ప్రాంతాల నుంచి వచ్చేన మహిళలు ఎదురుకొనే.. కష్టాలు, పరిస్థితుల చుట్టు ఈ కథ సాగుతోంది. ఇక ఆమె ప్రస్తుతం ‘మా వింతగాధ వినుమా’ అనే సినిమాలో నటిస్తోంది. ఆదిత్య మండలా దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో సిద్ధు జొన్నలగడ్డ, సీరత్ కపూర్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమా ఈ ఏడాది నవంబర్ 13న విడుదల అయ్యే అవకాశం ఉంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3nD0JYl
v

కొరటాల-ఎన్టీఆర్ సినిమాపై మరో ఆసక్తికర వార్త.. సినిమాలో తారక్ రోల్ అదేనట..!

‘అరవింద సమేత వీరరాఘవ’ సినిమా తర్వాత దర్శకధీరుడు రాజమౌళితో ‘ఆర్ఆర్ఆర్’ అనే ప్రతిష్టాత్మక సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. భారీ మల్టీస్టారర్‌గా రూపొందుతున్న ఈ సినిమాలో తారక్‌తో పాటు రామ్ చరణ్ నటిస్తున్నాడు. స్వతంత్ర పోరాట యోధులు అల్లూరి సీతరామ రాజు, కొమురం భీమ్ పాత్రల్లో వీరిద్దరు కనిపించనున్నారు. ఇప్పటికే దాదాపు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఈ ఏడాది అక్టోబర్‌లో విడుదల అయ్యే అవకాశం ఉంది. అయితే ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ తన కెరీర్‌లో 30వ సినిమా ఎవరితో చేస్తాడా అని ఎప్పటి నుంచో చర్చ జరుగుతోంది. తొలుత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌లో ఈ సినిమా చేస్తాడని అంతా అనుకున్నారు. దానికి ‘అయిననూ పోయిరావలే హస్తికకు’ అనే టైటిల్ కూడా ఫిక్స్ చేశారనే టాక్ బలంగా వినిపించింది. హీరోయిన్‌తో పాటు ఇతర తారాగణం కూడా ఫిక్స్ చేసేశారని అన్నారు. కానీ, చివర్లో ఎన్టీఆర్ ఈ వార్తలకు చెక్ పెట్టేశాడు. ‘జనతాగ్యారేజ్’ సినిమాతో తనకు సూపర్ హిట్ అందించిన కొరటాల శివతో తన 30 చిత్రం చేస్తున్నట్లు ప్రకటించాడు. ఈ సినిమాకి ఎన్టీఆర్ సోదరుడు కళ్యాణ్ రామ్ నిర్మాతగా వ్యవహరించనున్నాడు. అయితే ఈ ప్రకటన వచ్చినప్పటి నుంచి సినిమాపై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. సినిమా టైటిల్ ఏం ఉంటుందా..? తారక్ రోల్ ఎలా ఉంటుందా..? అని చర్చించుకోవడం ప్రారంభించారు. ఇదే క్రమంలో పుకార్లు కూడా పుట్టుకురావడం మొదలైంది. ఎన్టీఆర్ ఈ సినిమాలో అమాయక చక్రవర్తిగా నటిస్తున్నాడు అంటూ ఓ వార్త చక్కర్లు కొట్టింది. ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించి మరో వార్త సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది. అదేంటంటే.. ఈ సినిమాలో ఎన్టీఆర్ ఓ స్టూడెంట్ లీడర్ పాత్రలో కనిపించనున్నాడట. స్టూడెంట్ పాలిటిక్స్ నేపథ్యంలో ఈ సినిమా కథ సాగుతుందని టాక్. రాజకీయాల కారణంగా విద్యార్థుల భవిష్యత్తు దెబ్బతినవద్దు అనే ఉద్దేశంతో బరిలోకి దిగిన హీరోకి ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయి? వాటిని ఆయన ఎలా అధిగమిస్తాడు? చివరికి ఆయన అనుకున్నది సాధిస్తాడా.. లేదా? అనే నేపథ్యంలో ఈ సినిమా నడుస్తుందని అంటున్నారు. మరి ఈ వార్తలో ఎంత మేరకు నిజం ఉందో ఇప్పుడే చెప్పలేము.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2QCmonF
v

‘సిద్ధార్త్ ఒక నేరస్థుడు, అతనిపై కోర్టులో కేసు నడుస్తుంది’ బీజేపీ స్పోక్స్‌పర్సన్ సెన్సేషనల్ కామెంట్స్

తమిళనాడు బీజేపీకి చెందిన కొందరు తన ఫోన్‌ నెంబర్‌ని లీక్ చేయడంతో వందల సంఖ్యలో బెదిరింపు కాల్స్ వస్తున్నాయంటూ నటుడు గురువారం ట్వీట్ చేసిన విషయం తెలిసిందే. తనని తన కుటుంబాన్ని చంపేస్తామంటూ వాళ్లు బెదిరిస్తున్నారని అతను పేర్కొన్నాడు. అంతేకాక.. అత్యాచారం చేస్తామని కూడా బెదిరింపులు వచ్చాయని.. అన్ని కాల్స్‌ని రికార్డు చేసి పోలీసులకు అందజేస్తానని అతను ట్వీట్‌లో పేర్కొన్నాడు. దీంతో పాటు తనకు వచ్చిన వేధింపులకు సంబంధించిన వాటిలో ఒకదాని స్క్రీన్ షాట్ తీసి అతను పోస్ట్ చేశాడు. దేశానికి వైరస్ నుంచి విముక్తి వస్తుంది కానీ.. ఇలాంటి వాళ్ల నుంచి విముక్తి రాదంటూ అతను వ్యాఖ్యానించాడు. తాను చేసిన ట్వీట్‌లో సిద్ధార్త్ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాలను కూడా ట్యాగ్ చేశాడు. దీంతో దీన్ని తీవ్రంగా పరిణామించింది. సిద్దార్త్ తన ట్వీట్ల ద్వారా మోదీ, అమిత్ షాలను అవమానించాడు అంటూ తమిళనాడు బీజేపీ స్పోక్స్‌పర్సన్ నారాయణన్ తిరుపతి అన్నారు. ‘సిద్ధార్త్ అనే వ్యక్తి తరచూ నేరాలకు పాల్పడుతూ ఉంటాడు. గతంలో అతనిపై నేనే కేసు పెట్టాను.. ఆ కేసు ఇప్పుడు కోర్టులో ఉంది. తాజాగా అతను ప్రధాని మోదీ, హోం మంత్రి సీఎంలను దూషించి మరోసారి తప్పు చేశాడు. అతని లేటెస్ట్‌ ట్వీట్‌లో యోగి ఆదిత్యనాధ్‌ని కూడా దూషించాడు. అతనికి బెదిరింపులు నిజంగానే వస్తే.. దాన్ని చట్టపరంగా పరిష్కరించుకోవాలి. కానీ, ప్రధాని, హోం మంత్రి వంటి వారిని దూషించడం ఖండించదగిన చర్య’ అని నారాయణన్ అన్నారు. దీంతో పాటు బీజేపీ తమిళనాడు ఐటీ సెల్ వింగ్ హెడ్ నిర్మల్ కుమార్ కూడా దీనిపై స్పందించారు. బీజేపీ ఐటీ విభాగానికి చెందిన వ్యక్తులే తన ఫోన్ నెంబర్‌ని లీక్ చేశారు అంటూ సిద్ధార్త్ చేసిన ఆరోపణలను ఆయన తీవ్రంగా ఖండించారు. సిద్ధార్త్ చేస్తున్న ఆరోపణలకు తమకు ఎటువంటి సంబంధం లేదని ఆయన స్పస్టం చేశారు. ‘‘ఈ పాండమిక్ పరిస్థితుల్లో ప్రజలు ఎలా సహాయం చేయాలా, ఆహారం, వైద్యం ఎలా అందించాలో అనే విషయంపై దృష్టి పెట్టాలి. కాబట్టి సిద్ధార్త్ వంటి వ్యక్తులను పట్టించుకోవద్దని నేను అందరు మద్దతుదారులను కోరుతున్నాను. అతను కేవలం టామ్ పాస్ చేయడానికి ప్రయత్నిస్తున్నాడు’’ అంటూ నిర్మల్ కుమార్ ట్వీట్ చేశారు. తన ఫోన్ నెంబర్ ఆన్‌లైన్‌లో లీక్ కావడంతో ఒకే రోజులోనే ఐదు వందలకు పైగా బెదిరింపు కాల్స్ వచ్చాయంటూ సిద్ధార్త్ ట్వీట్‌లో పేర్కొన్నాడు. ఈ క్రమంలో తమిళనాడు పోలీసులు అతనికి భద్రత ఏర్పాటు చేశారు. అందుకు పోలీసులకు ధన్యవాదాలు తెలుపుతూ.. సిద్ధార్త్ మరో ట్వీట్ చేశాడు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/32Z7zOu
v

సాయి ధరమ్ తేజ్ పేరుతో మోసం.. డబ్బు వసూళ్లతో దందా.. రంగంలోకి సుప్రీం హీరో

ఒక్కోసారి కొన్ని వార్తలు వింటే నవ్వు వస్తుంటుంది. అయితే చివరకు అవే వార్తలు ఎంతో సీరియస్‌గా మారుతుంటాయి. ఆ మధ్య సోషల్ మీడియాలో ఓ మోసం కంటిన్యూగా జరుగుతూ వచ్చేది. ఫేస్ బుక్‌లో నకిలీ ఖాతాలు ఓపెన్ చేసి.. సదరు ఖాతాలోని ఫ్రెండ్స్ లిస్ట్‌లో ఉన్న వారిని డబ్బు సాయం చేయాల్సిందిగా కోరేవారు. అడిగేది తమ స్నేహితుడే అని కొందరు పొరబాటు పడి డబ్బులు కూడా పంపేవారు. అలాంటి మోసాల గురించి ఎన్నో చదివి ఉంటారు. ఇలాంటి ఘటనలన్నీ సాధారణ వ్యక్తుల విషయాల్లో జరుగుతుంటాయి. కానీ సుప్రీమ్ హీరో విషయంలోనూ జరగడం ఆశ్చర్యకరం. సాయి ధరమ్ తేజ్‌కు అవసరం పడి తన తోటీ నటీనటులను 15 వేలు అడగడం ఏంటో గానీ.. ఈ విషయంపై సాయి ధరమ్ తేజ్ వెంటనే స్పందించి పోలీసుల సాయం తీసుకున్నారు. ఈ మేరకు అందరూ జాగ్రత్తగా ఉండండి అంటూ సాయి ధరమ్ తేజ్ ఓ ప్రెస్ నోట్ వదిలారు. నా పేరు మీదుగా నేను నటించిన కో ఆర్టిస్ట్, ఇతర సభ్యుల దగ్గర డబ్బులు వసూళ్లు చేస్తున్నారని నాకు తెలిసింది. నాకు ఆర్థిక సాయం కావాలని వారిని డబ్బులు అడుగుతున్నానట. ఈ విషయంపై నేను పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నాను. మీ అందరూ కూడా జాగ్రత్తగా ఉండండి.. అలాంటి వాటిని నమ్మకండి.. నా పేరు మీద వచ్చే మెసెజ్‌లను పట్టించుకోకండి అని సాయి ధరమ్ తేజ్ ప్రకటన చేశారు. ఇక ఈ విషయంపై నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. అలా మోసం చేసేవాడికైనా సిగ్గు ఉండాలి.. డబ్బులు పంపేవాడికైనా సిగ్గుండాలి.. మెగా హీరో, సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్‌కు ఆర్థిక కష్టాలు ఏంటో? 15 వేలు అడగడం ఏంటో అని నెటిజన్లు కౌంటర్లు వేస్తున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3vq1JSi
v

‘ఆ సినిమా రీమేక్ చేస్తే.. ఉన్న పరువు పోతుంది’.. బెల్లంకొండ బ్రదర్స్‌పై ట్రోల్స్

ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేశ్ తనయుడిగా తెలుగు తెరకి పరిచయమైన బిగ్గెస్ట్ సక్సెస్‌ని అందుకోలేకపోతున్నాడు. స్టార్ హీరోయిన్లు, టాప్ డైరక్టర్లు, భారీ బడ్జెట్‌తో సినిమా చేసినా.. ఈ హీరో ఖాతాలో ఒక్క సూపర్ హిట్ కూడా లేదు. లేటెస్ట్‌గా ‘అల్లుడు అదుర్స్’ అంటూ శ్రీనివాస్ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కానీ, ఈ సినిమా డిజాస్టర్‌గా నిలిచింది. ఎలాగైనా టాలీవుడ్‌లో బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టాలని అతను పట్టుదలతో ఉన్నాడు. దీంతో లేటెస్ట్ తమిళ సూపర్ హిట్ చిత్రం ‘’ తెలుగు రీమేక్‌లో అతను నటించేందుకు సిద్ధమైనట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం బెల్లంకొండ శ్రీనివాస్ బాలీవుడ్ ఎంట్రీ కోసం రెడీ అవుతున్నాడు. రాజమౌళి, ప్రభాస్ కాంబినేషన్‌లో తెరకెక్కిన సూపర్‌హిట్ చిత్రం ‘ఛత్రపతి’ హిందీ రీమేక్‌లో అతను నటిస్తున్నాడు. వివి వినాయక్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో అనన్య పాండే హీరోయిన్‌గా నటిస్తుందని టాక్. బాలీవుడ్ ఆడియన్స్ టేస్ట్‌కి తగ్గట్టు సినిమా స్క్రిప్ట్‌లో కొన్ని మార్పులు చేసి రూపొందిస్తున్నారట. ఈ సినిమా ద్వారా బెల్లంకొండ శ్రీనివాస్ బాలీవుడ్‌లో హిట్ అందుకోవడం ఖాయమని సన్నిహితులు అంటున్నారు. అయితే తెలుగులోనే అతనికి ఇప్పటివరకూ సరైన హిట్ అందలేదు. మరోవైపు తన రెండో కుమారుడు గణేశ్‌ని కూడా హీరోగా పరిచయం చేయాలని బెల్లంకొండ సురేశ్ ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన ‘కర్ణన్’ సినిమా హక్కులు కొన్నారట. ధనుష్ హీరోగా తెరకెక్కిన ‘కర్ణన్’ సినిమా అక్కడ బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమాలో ధనుష్ ఓ వెనుకబడిన జాతికి నాయకుడిగా నటించాడు. అయితే ఇప్పుడు బెల్లంకొండ హీరోల్లో ఏ హీరోతో ఈ సినిమా రీమేక్‌ని తెలుగు చేస్తారా.. అనే చర్చ జరుగుతోంది. శ్రీనివాస్ ఛత్రపతి రీమేక్‌లో బిజీగా ఉన్నాడు కాబట్టి.. రెండో కుమారుడితో కర్ణన్ రీమేక్ చేస్తారనే టాక్‌ వినిపిస్తోంది. అదే జరిగితే కచ్చితంగా ఫలితం తేడా కొడుతుందని నెటిజన్లు అంటున్నారు. అసలు అలాంటి స్క్రిప్ట్‌ని రీమేక్ చేయాలనుకోవడమే తప్పు.. అలాంటిది శ్రీనివాస్ కానీ, అతను తమ్ముడు కానీ అందులో నటిస్తే.. ఉన్న పరువు కూడా పోతుందని నెటిజన్లు ట్రోల్స్ చేస్తున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2RgDzuA
v

బాహుబలికి అయ్యలా ఫీల్ అవుతున్నాడు.. ఆ అధికారిపై ఆర్జీవీ కామెంట్స్ వైరల్

రామ్ గోపాల్ ఎప్పుడు ఎవరి మీద పడతాడో ఎవ్వరికీ తెలియదు. గత కొన్ని రోజులుగా వరుస ట్వీట్లతో హల్చల్ చేస్తున్నారు. ఇండియా, కరోనా, ప్రధాని మోదీ, ప్రపంచ దేశాలు అంటూ అన్ని టాపిక్స్ మీదా కామెంట్లు చేస్తున్నారు. అయితే వర్మ సంధించే ప్రశ్నలు అందరిలోనూ ఆలోచనలు రేకెత్తిస్తున్నాయి. ప్రధాని మోదీపై విమర్శించేలా చేస్తోన్న ఈ ట్వీట్లు కాంట్రవర్సీకి కేరాఫ్ అడ్రస్ అవుతున్నాయి. అయితే ఇప్పుడు దేశం ఎలాంటి పరిస్థితిలో ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కరోనా ధాటికి అతలాకుతలం అవుతోంది. సరైన వైద్యం అందక, ఆస్పత్రిలో సౌకర్యాలు లేక, ఆక్సిజన్ కొరతతో ఎంతో మంది ప్రాణాలు వదులుతున్నారు. శవాలను కాల్చడానికి కూడా క్యూలో నిలబడాల్సిన పరిస్థితి వచ్చింది. కరోనాతో ఎన్నో శవాలు దిక్కులేనివిగా అలా పడి ఉన్నాయి. వాటన్నంటిపైనా ఆర్జీవీ తన స్టైల్లో స్పందించారు. ఇక ఢిల్లీలో ఆక్సిజన్ కొరతపై ఓ వీడియోను షేర్ చేశారు.అందులో భయంకరమైన దృశ్యాలున్నాయి. రోడ్డు మీదే ఆటో, కారులో ఇలా ఎక్కడబడితే అక్కడ ఆక్సిజన్ సిలిండర్ పెట్టుకుని తమ ప్రాణాలను కాపాడుకుంటున్నారు. ఇంతకంటే ఘోరమైన సన్నివేశాలను ఏ దర్శకుడైనా తెరకెక్కించగలరా? అని ఆర్జీవీ ప్రశ్నించారు. ఇక రెండు మూడు రోజుల నుంచి ఓ వీడియో వైరల్ కాసాగింది. కర్ఫ్యూ ఉందని తెలిసినా కూడా.. రాత్రి పది గంటల తరువాత అట్టహాసంగా పెళ్లి జరుపుకుంటున్న ఫంక్షన్ హాల్ దగ్గరికి పోలీస్ అధికారి వెళ్లి తన జులుం విదిచ్చాడు. పెళ్లి కొడుకుపై చేయి చేసుకున్నాడు. అడ్డు వచ్చిన వాళ్లని పక్కకి నెట్టేశారు. అనుమతి పత్రాన్ని చించి అవతల పారేశాడు. పెళ్లికి పర్మిషన్ ఇచ్చారు కానీ రాత్రి పది గంటల తరువాత కాదు.. కర్ఫ్యూ ఉందని తెలీదా? అని ఊగిపోయాడు. ఆ అధికారి చేసిన దౌర్జన్యం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై ఆర్జీవీ స్పందించాడు. ఇదే పని.. ఆక్సిజన్ కొరత రావడానికి కారణమైన వారిపై చేయగలడా? వైద్య సదుపాయాలు కల్పించలేని వారిపై చేయగలడా? అని ప్రశ్నించారు. ప్రభుత్వ అధికారి అంటే ప్రజలకు సేవ చేయాలి గానీ ఇలా.. ఈ మనిషిలా రజినీకాంత్ అమ్మలా.. బాహుబలి అయ్యలా విర్రవీగకూడదు అని కౌంటర్ వేశారు. ఇక ఆ కొత్తజంటకు తమకు జరిగిన ఈ అవమానంతో జీవితాంతం ఈ రోజు గుర్తుండిపోతుంది అని ఇలా వరుసగా ఆర్జీవీ ట్వీట్లు పెట్టేశారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3xybIa6
v

మరో ప్రయోగానికి సిద్ధమైన రావు రమేశ్.. త్వరలో విభిన్నమైన పాత్రలో ప్రేక్షకుల ముందుకు..

1980-90 కాలంలో టాలీవుడ్‌లో విలన్ అంటే ముందుగా గుర్తొచ్చే పేరు రావు గోపాల్ రావుదే. ఎన్నో సినిమాల్లో అద్భుతంగా విలనిజం పండించిన ఆయన తెలుగు ప్రేక్షకుల మనస్సులో చిరస్థాయిలో నిలిచిపోయారు. విలనిజంతో పాటు.. అటు సపోర్టింగ్ పాత్ర అయినా.. కామెడీ పాత్ర అయినా.. ఆయన చేస్తే ఆ పాత్రకే వన్నె వచ్చేది. అయితే అంత గొప్ప నటడి వారసుడిగా తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు . ప్రస్తుతం ఉన్న సపోర్టింగ్ నటులలో ఆయన తనకంటూ ఓ ప్రత్యేకమైన స్థానం ఏర్పరచుకున్నారు. విభిన్నమైన బాడీ లాంగ్వేజీ, డైలాగ్ డెలివరీతో ఆయన ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు. అయితే ఇండస్ట్రీలో అడుగుపెట్టిన క్షణం నుంచి తండ్రి తగ్గ తనయుడు అని అనిపించుకోవాలని రావు రమేశ్ ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఇప్పటికే ఆయనకి ఆ గుర్తింపు కూడా లభించింది. కానీ, ఆయన ప్రయోగాలు చేయడం మాత్రం మానేయలేదు. సినిమా సినిమాకి తన నటనలో వేరియేషన్ చూపిస్తూనే ఉన్నారు. అయితే ఇప్పుడు తన రాబోయే సినిమాలో ఓ సరికొత్త ప్రయోగంతో ప్రేక్షకుల ముందు వచ్చేందుకు సిద్ధమవుతున్నారట ఆయన. శర్వానంద్ హీరోగా ‘ఆర్ఎక్స్100’ ఫేమ్ అజయ్ భూపతి దర్శకత్వంలో ‘మహా సముద్రం’ అనే సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో హీరో సిద్ధార్త్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు. అయితే సినిమాలో రావు రమేశ్ విభిన్నమైన పాత్రలో కనిపించనున్నారట. కథ డిమాండ్ మేరకు ఆయన ఓ గూనివాడి పాత్రలో నటిస్తున్నారని టాక్. రావు రమేశ్ పాత్ర ఈ సినిమాకే హైలైట్‌గా నిలుస్తుందని అంటున్నారు. ఈ పాత్ర ద్వారా రావు రమేశ్ మూస పాత్రలకే పరిమితం అని తనపై ఉన్న అపవాదాన్ని రావు రమేశ్ చెరిపేస్తారని సన్నిహితులు అంటున్నారు. ఇక ఈ సినిమా స్క్రిప్ట్‌పై అజయ్ భూపతి దాదాపు రెండు సంవత్సరాలు వర్క్ చేశాడట. తన మొదటి చిత్రం ‘ఆర్‌ఎక్స్100’కు ఈ సినిమా పూర్తి భిన్నంగా ఉండనుందట. మాస్ ఆడియన్స్‌తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్‌ని కూడా ఆకట్టుకొనేలా ఈ సినిమాను రూపొందిస్తున్నారని తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో అదితి రావు హైదరి హీరోయిన్‌గా నటిస్తోంది. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై అనిల్ సుంకర ఈ సినిమాని నిర్మిస్తున్నారు. చేతన్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా ఈ ఏడాది ఆగస్టు 19న విడుదల అయ్యే అవకాశం ఉంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3u8LQ2j
v

2022లో ఒక్కరు కూడా మిగలరు! అమ్మాయి టీ- షర్ట్ చూపిస్తూ ఆర్‌జీవీ షాకింగ్ కామెంట్స్

దేశవ్యాప్తంగా కరోనా కేసులు ఉదృతంగా పెరిగిపోతున్నాయి. లక్షల సంఖ్యలో పాజిటివ్ కేసులు, వేల సంఖ్యలో మరణాలు సంభవిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావడానికి జంకుతున్నారు. బయటకు వచ్చినా.. మాస్కులు ధరిస్తూ.. భౌతిక దూరం పాటిస్తున్నారు. ఒకవేళ పొరపాటున కరోనా నిబంధనలు పాటించకపోతే.. వెంటనే వైరస్ అంటుకుంటుంది. ఇక వైరస్ సోకిన వారి పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ఆస్పత్రిలో సరైన వైద్య సౌకర్యాలు అందక వేలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు. మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహించేందుకు స్మశానవాటికల్లో చోటు లభించకపోవడం మరో దురదృష్టకర విషయం. వివాదాస్పద దర్శకుడు ఈ మధ్య తన రూటు మార్చారు. ఆ మధ్యకాలంలో కేవలం సినిమాలపై సినిమాకు సంబంధించిన వ్యక్తులపైనే ట్వీట్ చేసిన ఆయన గత కొంతకాలంగా దేశవ్యాప్తంగా పెరిగిపోతున్న కరోనా కేసులపై ట్వీట్ చేయడం ప్రారంభించారు. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో ఉత్తరాఖండ్‌లో జరిగిన కుంభమేళాపై వర్మ చేసిన ట్వీట్లు తీవ్ర దుమారం రేపాయి. కరోనా తీవ్రంగా వ్యాపిస్తుంటే.. కుంభమేళకు లక్షల సంఖ్యలో భక్తులు హాజరుకావడాన్ని ఆయన తప్పుబట్టారు. ఈసారి వైరస్ వ్యాప్తికి కుంభమేళనే కారణం అవుతుందని ఆయన పరోక్షంగా వ్యాఖ్యానించారు. అయితే వర్మ రోజుకో స్టైల్‌లో కరోనా కేసులపై ట్వీట్లు వేస్తున్నారు. లేటెస్ట్‌గా వచ్చే ఏడాదికి ఇక మనుషులే మిగలరు అంటూ ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. టీషర్ట్ ధరించిన ఓ అమ్మాయి ఫోటోని వర్మ ట్వీట్ చేశారు. ఆ ఫోటోలో అమ్మాయి టీషర్టుపై ‘2019లో నెగెటివ్ మనుషులని దూరం పెట్టాము. 2020లో పాజిటివ్ వ్యక్తులను దూరం పెట్టాము. 2021లో మనుషులనే దూరం పెట్టాల్సి వచ్చింది’ ని రాసి ఉంది. ఈ ఫోటోని షేర్ చేసిన వర్మ అసలు 2022లో మనుషులే ఉండకపోవచ్చు అంటూ క్యాప్షన్ పెట్టారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్‌మీడియాలో వైరల్ అవుతుంది. ‘పరిస్థితులు ఇలాగే కొనసాగితే.. వర్మ చెప్పిందే నిజం అవుతుంది’ అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3u8xEX9
v

అంబులెన్స్ డ్రైవర్‌గా మారిన నటుడు.. కారణం అదే.. సోషల్‌మీడియాలో ప్రశంసల వర్షం

రెండో దశలో కరోనా వ్యాప్తి దేశవ్యాప్తంగా విస్తృతంగా ఉంది. ప్రతీ రోజు లక్షల సంఖ్యలో కేసులు నమోదు కావడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. సరైన వైద్య సదుపాయాలు లేక వేలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు. పలు ప్రాంతాల్లో ఆక్సిజన్ కొరత కారణంగా రోగులు మరణిస్తున్నారు. ఈ భయంకర పరిస్థితుల్లో సెలబ్రిటీలు ప్రజలకు సహాయం చేసేందుకు ముందుకు వస్తున్నారు. ఎవరికి తోచిన పద్దతిలో వాళ్లు సహాయం అందిస్తున్నారు. అయితే కన్నడ నటుడు ఈ విపత్కర పరిస్థితుల్లో ఓ కీలక నిర్ణయం తీసుకున్నాడు. ప్రస్తుత పరిస్థితులను లెక్క చేయకుండా కొందరు సెలబ్రిటీలు విదేశాలకు విహారయాత్రకు వెళ్తున్నారు. మరికొందరు ఫ్యాన్సీ ఫోటోషూట్‌లు చేస్తూ.. వాటిని సోషల్‌మీడియాలో అప్‌లోడ్ చేయడంలో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలో అలాంటి సెలబ్రిటీలపై విమర్శల వర్షం కురుస్తోంది. అయితే అర్జున్ గౌడ చేసిన పనిని మెచ్చుకొని వాళ్లు లేరు అనడంలో అతిశయోక్తి ఎంత మాత్రం లేదు. కోవిడ్‌ రోగులను తరలించడానికి అతను అంబులెన్స్ డ్రైవర్ అవతారం ఎత్తాడు. అతను గత రెండు రోజులుగా కోవిడ్ రోగులకు సేవలు అందిస్తున్నాడు. ఈ విషయంపై అతను మాట్లాడుతూ.. ‘‘గత రెండు రోజులుగా నేను రోడ్డు మీదే ఉన్నాను. కోవిడ్‌తో మృతి చెందిన వారికి అంత్యక్రియలు నిర్వహించేందుకు తీసుకువెళ్లాను. కష్టాల్లో ఉన్న ప్రతీ ఒక్కరికి కచ్చితంగా సహాయం చేయాలనే బలమైన సంకల్పంతోనే ఈ పనిలోకి దిగాను’’ అని అతను అన్నాడు. ఇక తనపై పత్రికలో వచ్చిన కథనాన్ని షేర్ చేసిన అతను.. ‘‘నేను అన్ని జాగ్రత్తలతో ఈ పని చేస్తున్నాను. అందుకు అవసరమైన ట్రైనింగ్ కూడా తీసుకున్నాను. మీ అందరు నాకు అభినందనలు చెప్పడం ఎంతో సంతోషాన్ని కలిగించింది. కర్ణాటక ప్రజలకి సహాయం చేయడం నా బాధ్యతగా.. అది నాకు గౌరవంగా భావిస్తున్నాను’’ అంటూ పేర్కొన్నాడు. అర్జున్ ‘యువరత్న’, ‘ఒడెయా’, ‘రుస్తుం’, ‘అదృశ్య’ తదితర చిత్రాల్లో నటించాడు. కోవిడ్ కష్టకాలంలో ప్రజలకు సేవలు అందిస్తున్న అతనిపై సోషల్‌మీడియాలో ప్రశంసల వర్షం కురుస్తోంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2QzDUJb
v

భవిష్యత్ తలచుకుంటే బాధేస్తోంది.. ఆ రూల్ తీసుకురండి.. ప్రభుత్వాలకు సోనూసూద్‌ విజ్ఞప్తి

కష్టకాలంలో రియల్ హీరో అనిపించుకుంటూ సేవా కార్యక్రమాలు చేస్తున్న సినీ నటుడు సోనూసూద్ దేశంలో నెలకొన్న పరిస్థితులపై ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం కోవిడ్ సెకండ్ వేవ్ ఉదృతి కొనసాగుతోంది. పల్లె, పట్నం అనే తేడాలేకుండా మహమ్మారి వైరస్ వీరవిహారం చేస్తోంది. ఎంతోమంది కరోనా కాటుకు బలవుతుండటం ఆందోళన కలిగితోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వాలకు ఓ విజ్ఞప్తి చేశారు. తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలకు అండగా నిలబడాలని కోరారు. ఈ మేరకు తన సోషల్ మీడియా ఖాతాలో వీడియో ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సహా ఎన్‌జీఓలకు ఆయన రిక్వెస్ట్ చేశారు. ''8 నుంచి 12 సంవత్సరాలు వయసున్న ఎంతోమంది చిన్నారులు కరోనా కారణంగా తల్లిదండ్రులను కోల్పోతున్నారు. చాలా కుటుంబాల్లో తల్లో, తండ్రో లేకపోతే ఇద్దరూ చనిపోయి పిల్లలు అనాథలవుతున్నారు. ''అలాంటి పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచిస్తుంటే నాకెంతో బాధేస్తోంది. కాబట్టి అలాంటి పిల్లలకు అండగా నిలబడాల్సిన అవసరం ఎంతో ఉంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ఎన్‌జీవోలు ఇలాంటి పిల్లలకు అండగా నిలబడి వారికి ప్రాథమిక విద్య నుంచి కాలేజీ విద్య వరకు ఉచితంగా అందించాలి. ఇలా ప్రభుత్వాలు ఓ రూల్‌ను తీసుకు రావాలి'' అని సోనూసూద్‌ విజ్ఞప్తి చేశారు. కరోనా కారణంగా గతేడాది భారతదేశ వ్యాప్తంగా ఏర్పడిన సంక్షోభంలో పేదలకు, రోజు వారి కార్మికులకు అండగా నిలిచారు సోనూసూద్. ఇటు పనిలేక, అటు స్వస్థలాకు చేరుకోలేక బాధపడుతున్న వారిని తన సొంత ఖర్చుతో ఇంటికి చేర్చాడు. అంతేకాక ఉపాధి కోల్పోయిన వారికి కూడా తగిన సహాయంతో పాటు ఉపాధి కూడా కల్పించాడు. అలా అందరిచేత రియల్ హీరో అనిపించుకున్న సోనూసూద్.. సెకండ్ వేవ్ లోనూ పలు సహాయక కార్యక్రమాలు చేస్తున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3vvjM9F
v

సౌత్ ఇండస్ట్రీలోనే సరికొత్త రికార్డ్.. బాలయ్య ధాటికి చిరు ఖతం.. ‘అఖండ’విజయం ఖాయం

రికార్డులు క్రియేట్ చేయాలన్నా.. వాటిని తిరగరాయాలన్నా మేమే అంటూ సింహా సినిమాలో నందమూరి బాలకృష్ణ చెప్పిన డైలాగ్ అందరికీ గుర్తుండే ఉంటుంది. అది ఎవరి గురించి చెప్పారు.. ఎందుకు చెప్పారు అనే విషయం కూడా పరోక్షంగా అందరికీ తెలిసిందే. అయితే రికార్డుల విషయంలో ఎప్పుడూ కూడా మెగా నందమూరి అభిమానుల మధ్య వాగ్వాదం జరుగుతూనే ఉంటుంది. అయితే ఇప్పుడు మాత్రం ఎవ్వరికీ అందనంత ఎత్తులో ఉన్నారు. బాలయ్య బోయపాటి శ్రీను కాంబినేషన్ అంటే ప్రతీ ఒక్కరికీ అంచనాలు అందనంత ఎత్తులో ఉంటాయి. నందమూరి అభిమానులే కాకుండా సగటు సినీ ప్రేక్షకులు సైతం ఆ కాంబో మీద ప్రత్యేక శ్రద్దను కనబరుస్తుంటారు. ఇప్పుడు ఈ కాంబోలో హ్యాట్రిక్ చిత్రం రాబోతోంది. సింహా, లెజెండ్ వంటి బ్లాక్ బస్టర్ల తరువాత ఈ కాంబో మళ్లీ బాక్సాఫీస్ మీద దాడి చేసేందుకు రాబోతోంది. అంటూ అఘోరాగా బాలయ్య విశ్వరూపాన్ని చూపించేందుకు బోయపాటి రెడీ అయ్యారు. ఈ మేరకు వదిలిన చిన్నపాటి టీజర్, టైటిల్ పోస్టర్ సోషల్ మీడియాలో సంచలనాలు నమోదు చేస్తున్నాయి. బాలయ్య దెబ్బకు యూట్యూబ్ మోత మోగిపోతోంది. మొత్తం సౌత్ సినీ ఇండస్ట్రీలోనే బాలయ్యకు తిరుగులేకుండా పోయింది. సీనియర్ హీరోల్లో యాభై మిలియన్ల వ్యూస్ కొల్లగొట్టిన టీజర్ ఇప్పటి వరకు ఎవ్వరి ఖాతాల్లోనూ లేదు. అఖండ టైటిల్ రోర్ అంటూ వదిలిన ఈ చిన్న వీడియో ఇప్పటికీ 50 మిలియన్ల వ్యూస్‌ను కొల్లగొట్టింది. చిరంజీవి ఆచార్య టీజర్ మాత్రం అఖండకు ఆమడ దూరంలో ఉంది. ఈ లెక్కన బాలయ్య రికార్డులను చిరు అందుకోవడం అంతా సులభంగా జరిగే పని కాదు. ఇప్పటి వరకు 50 మిలియన్ల వ్యూస్ కొల్లగొట్టిన టీజర్ కూడా లేదు. మొన్నీ మధ్యే ఆర్ఆర్ఆర్ నుంచి ఎన్టీఆర్ కొమరం భీం టీజర్‌ ఈ ఫీట్ అందుకుంది. అలా మొత్తం బాలయ్య దెబ్బకు అందరి రికార్డులు బద్దలయ్యాయ్. ఇక ఈ టైటిల్ రోర్ ఇలా ఉంటే సినిమాకు అఖండ విజయం ఖాయమనిపిస్తోందంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3eLYo9o
v

నెట్టింట్లో వైరల్ అవుతున్న ‘పుష్ప’ స్టోరీ.. సుకుమార్ ఆ సినిమాని కాపీ కొట్టాడా..?

అప్పటివరకూ క్లాస్ డైరెక్టర్‌గా మాత్రమే తెలుగు ప్రేక్షకులకు తెలిసిన ‘రంగస్థలం’ సినిమాతో మాస్ చిత్రాలను కూడా ఓ రేంజ్‌లో రూపొందించగలడని నిరూపించుకున్నారు. ఇప్పుడు తనలోని మాస్ యాంగిల్‌ని మరింతగా పెంచుతూ.. అల్లు అర్జున్‌తో ‘’ సినిమాని తెరకెక్కిస్తున్నాడు. అడివిలో గంధపు చెక్కలు స్మగ్లింగ్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాలో ‘పుష్పరాజ్’ అనే లారీ డ్రైవర్ పాత్రలో కనిపించనున్నాడు. ఇప్పటికే విడుదలైన టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ముఖ్యంగా టీజర్‌లో అల్లు అర్జున్ చెప్పే ‘తగ్గేదే లే’ అనే డైలాగ్ హైలైట్‌గా నిలిచింది. అయితే ఇప్పుడ ఈ సినిమా స్టోరీ అన్‌లైన్‌లో లీక్ అయినట్లు సమాచారం. ‘పుష్ప’ కథ ఇదే అంటూ సోషల్‌మీడియాలో తెగ ప్రచారం జరుగుతోంది. లెజండరీ డైరెక్టర్ మణిరత్నం రూపొందించిన ‘విలన్’ సినిమా కథని ఆధారంగా తీసుకొని సుకుమార్ ‘పుష్ప’ కథ రాసుకున్నారనే వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. రామాయణం కథను ఆధారంగా చేసుకొని.. రావణాసురుడి పాయింట్ ఆఫ్‌ వ్యూలో ‘విలన్’ సినిమాని రూపొందించారు మణిరత్నం. తన చెల్లలికి జరిగిన అన్యాయంపై హీరో.. విలన్‌లపై ఏ విధంగా పగ తీర్చుకుంటాడు అనేదే ఈ సినిమా. అయితే సుకుమార్ కూడా ఈ కథని బేస్ చేసుకొనే ‘పుష్ప’ తెరకెక్కించారని టాక్. ‘పుష్ప’ సినిమాలో కూడా అల్లు అర్జున్‌కి ఓ చెల్లి పాత్ర ఉంటుందని మేకర్స్ గతంలోనే ప్రకటించారు. ఆ పాత్రలో ఐశ్వర్య రాజేశ్ నటిస్తున్నట్లు సమాచారం. దీంతో ఈ సినిమాలో కూడా పుష్పరాజ్ తన చెల్లెలికి అన్యాయం చేసిన వాళ్లపై రీవేంజ్ తీర్చుకోవడమే ప్రధాన కథాంశంగా ఉండబోతుందని వార్తలు వస్తున్నాయి. మరి నిజంగానే సుకుమార్ ‘విలన్’ సినిమాని కాపీ కొట్టారా..? లేదా..? అనే విషయం తెలియాలి అంటే ఇంకా కొన్ని రోజులు వేచి చూడాల్సిందే. ఇక మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై రూపొందుతున్న ‘పుష్ప’ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తోంది. దేవీ శ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతం అందించగా.. ప్రముఖ మలయాళం నటుడు ఫహద్ ఫాజిల్ ప్రతినాయకుడి పాత్ర పోషించారు. ఇక ఈ సినిమాలో అనసూయ, సునీల్ , జగపతి బాబు తదితరులు ప్రధాన పాత్రలో నటిస్తున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/33397XC
v

ఇలాంటి సమయంలోనే కలిసికట్టుగా ఉండాలి.. వారి కోసం సీపీ సజ్జనార్‌తో కలిసి సమంత అలా!

ప్రస్తుతం దేశంలోని పరిస్థితి, వైద్య సదుపాయాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఓ వైపు కరోనా దాడి చేస్తుంటే.. మరో వైపు వైద్య సదుపాయాలు లేక, ప్రాణవాయువు కరువై కొన్ని వేల మంది మరణిస్తున్నారు. దేశంలో ఇప్పుడు ఆక్సిజన్‌కు డిమాండ్ ఏర్పడింది. దీని కోసం రాష్ట్ర ప్రభుత్వాలు స్టీల్ ఫ్యాక్టరీల మీద ఆధారపడ్డాయి. అయితే సరఫరా లేక ఎంతో మంది బతుకులు గాల్లో కలిసిపోతోన్నాయి. ఆక్సిజన్ సిలిండర్లు పెట్టుకుని నడి రోడ్డు మీద ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నారు. అయితే ఇంకా కొన్ని ప్రాంతాల్లో ఆక్సిజన్ సరఫరా లేక ఎంతో మంది ప్రాణాలు కోల్పోతోన్నారు. ఇలాంటి కష్టకాలంలో కొందరికైనా సాయపడాలి అంటూ ముందుకు వచ్చారు. సమంత తన ప్రత్యూష ఫౌండేషన్ ద్వారా చేసే సేవా కార్యక్రమాల గురించి అందరికీ తెలిసిందే. తాజాగా కోవిడ్ పేషెంట్స్ కోసం సమంత ముందుకు వచ్చారు. ఒక్కోసారి వింత పరిస్థితి, కష్ట కాలం వస్తుంటుంది.. అలాంటి సమయంలోనే మనమంతా కలిసి ముందుకు రావాలి.. కష్టాల్లో ఉన్నవారిని ఆదుకోవాలి. ప్రస్తుతం ఆక్సిజన్ సిలిండర్స్ అవసరం ఉన్నవాళ్ల కోసం సాయం చేసేందుకు డొనేట్‌కేఆర్ట్ అనే సంస్థతో కలిసి ప్రత్యూష సంస్థ కూడా ముందుకు వచ్చింది. విరాళాలు సేకరించి అవసరంలో ఉన్న వారికి వైద్య సదుపాయం, ఆక్సిజన్ సిలిండర్ ఇలా ఏ అవసం ఉన్నా కూడా సాయం చేయాలని నిర్ణయించుకున్నాం. మాకు సజ్జనార్ గారి మద్దతు ఉన్నందుకు ఎంతో సంతోషంగా ఉంది. వారి సహకారంతో ఇంకా ముందుకు వెళ్తున్నాం.. మీరు ఇచ్చే ప్రతీ చిన్న మొత్తం ఎవరో ఒకరికి సాయపడుతుంది. మీకు చేతనైన సాయం చేయాలని అందరినీ కోరుతున్నాను. ఆపదలో ఉన్న ఏ ఒక్కరికైనా సాయం చేసేందుకు మనం కారణం అవ్వాలని కోరుకుంటున్నాను. ఈ కష్టకాలాన్ని కూడా మనం దాటేస్తాం.. అంటూ సమంత చెప్పుకొచ్చారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3e7FD1k
v

మరో పాన్ ఇండియా సినిమాను లైన్‌లో పెట్టిన రానా.. ఫుల్ జోష్‌లో దగ్గుబాటి వారసుడు

వరుస సినిమాలతో బిజీ అవుతున్నారు దగ్గుబాటి వారసుడు, స్టార్ హీరో . వైవిధ్యభరితమైన కథలను ఎంచుకొని ప్రేక్షకుల ముందుకు రావడంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఆయన 'లీడర్', 'కృష్ణంవందే జగద్గురుమ్', 'బాహుబలి', 'ఘాజీ', 'నేనే రాజు నేనే మంత్రి' లాంటి కొత్తదనంతో కూడిన కథలతో ఆకట్టుకున్నారు. అదే జోష్‌లో మరిన్ని విలక్షణ పాత్రలను ఎంచుకుంటూ ముందుకెళ్తున్న రానా.. మరో పాన్ ఇండియా సినిమాకు కమిటయ్యారు. సీహెచ్ రాంబాబుతో కలిసి విశ్వశాంతి పిక్చర్స్ అధినేత ఈ సినిమా నిర్మించనున్నారు. నందమూరి బాలకృష్ణ హీరోగా 'టాప్ హీరో', 'దేవుడు', ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వంలో 'జంబలకిడి పంబ', రాజేంద్రప్రసాద్ హీరోగా 'ఇద్దరు పెళ్ళాల ముద్దుల పోలీస్' సినిమాలను ఆచంట గోపినాథ్ నిర్మించారు. నయనతార ప్రధాన పాత్రలో నటించిన తమిళ హిట్ 'ఇమైక్క నొడిగల్'ను తెలుగులో 'అంజలి సిబిఐ'గా విడుదల చేశారు. అయితే కొంత విరామం తర్వాత రానా దగ్గుబాటి హీరోగా ఈ భారీ పాన్ ఇండియా సినిమా ప్లాన్ చేశారు ఆచంట గోపినాథ్. ప్రస్తుతం పవన్ కళ్యాణ్, రానా కాంబోలో తెరకెక్కుతున్న 'అయ్యప్పనుమ్ కోషియమ్' తెలుగు రీమేక్ చిత్రీకరణ పూర్తయిన తర్వాత ఈ సినిమా ప్రారంభం కానుందని మేకర్స్ చెప్పారు. కథ, కథనం, హీరో పాత్ర కొత్తగా ఉంటాయని నిర్మాతలు చెప్పారు. ఈ చిత్ర దర్శకుడు, సాంకేతిక నిపుణులు, హీరోయిన్ తదితర వివరాలను త్వరలో ప్రకటిస్తామని తెలిపారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3t7kyZ5
v

సమ్మర్ స్పెషల్.. అందుకే అలా మొత్తం ఫ్రీగా వదిలేశావా?.. పూజా హెగ్డే క్లీ వేజ్ షోపై నెటిజన్ల సెటైర్లు!

ప్రస్తుతం క్వారంటైన్‌కు పరిమితమైన సంగతి తెలిసిందే. కరోనా పాజిటివ్ వచ్చిందంటూ గత వారం ఈ బుట్టబొమ్మ ప్రకటించడంతో అంతా షాక్ అయ్యారు.ఇక ఆమె అభిమానులు తెగ ఆందోళన చెందారు. త్వరగా కోలుకోవాలంటూ విష్ చేశారు.అయితే ఈ భామ క్వారంటైన్‌లో ఉంటూనే సెగలు రేపుతోన్నట్టు కనిపిస్తోంది. తాజాగా పూజా హెగ్డే షేర్ చేసిన ఓ ఫోటో నెట్టింట్లో మంటలు పుట్టిస్తోంది. కొన్ని స్వల్ప లక్షణాలు కనిపించాయి. పరీక్ష చేయించుకుంటే కరోనా పాజిటివ్ అని తేలింది. గత రెండు మూడు రోజులుగా నన్ను కలిసిన వారంతా కూడా పరీక్షలు చేయించుకోండి.. అందరూ జాగ్రత్తగా ఉండండి.. ఇంట్లోనే ఉంటూ సురక్షితంగా ఉండండి అని పూజా హెగ్డే గత వారం ఓ పోస్ట్ చేశారు. ఇక పూజా హెగ్డే అప్పటి నుంచి స్వీయ నిర్భంధంలోనే ఉంటూ చికిత్స తీసుకుంటున్నారు. యోగా, ప్రాణాయామం ఎలా చేయాలి.. అది కరోనా నుంచి ఎలా కాపాడుతుందనే విషయాన్ని తన ఫాలోవర్లకు వివరించారు. ఇక నిన్న అల్లు అర్జున్ తనకు కరోనా పాజిటివ్ వచ్చిందనే విషయాన్ని ప్రకటించారు. ఈ క్రమంలో పూజా హెగ్డే ఓ సెటైర్ వేశారు. అమూల్యకు కంపెనీ ఇచ్చేందుకు బంటు కూడా వచ్చాడు అని అల వైకుంఠపురములో సినిమాలోని పాత్రలను గుర్తుకు చేసుకున్నారు పూజా హెగ్డే. అయితే తాజాగా పూజా హెగ్డే నెట్టింట్లో అగ్గి రాజేస్తున్నారు. హాట్ ఫోటోతో నానా రచ్చ చేస్తున్నారు. కరోనా వచ్చి బాధపడుతుందని అంతా అనుకుంటూ ఉంటే ఇలా ఒక్కసారిగా కనిపించి ఆశ్చర్యపరిచారు. క్లీవేజ్ షోలో ఇప్పుడు పూజా హెగ్డే సందడి చేస్తున్నారు. ఆమె షేర్ చేసిన ఫోటోలపై నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. సమ్మర్ అని గాలి తగలాలి అని అలా ఫ్రీగా వదిలేశావా? అంటూ కౌంటర్లు వేస్తున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3u616gp
v

‘ఆర్ఆర్ఆర్’ మళ్లీ వాయిదా.. ఆ సీన్లే ప్రధాన కారణం.. ‘జక్కన ఏందీ గోలా’ అంటున్న ఫ్యాన్స్!

సినిమా అంటే.. దానికి ఓ సెపరేట్ క్రేజ్ ఉంటుంది. బాహుబలి సినిమాతో ఓ క్రేజ్ ఇంకో లెవల్‌కి వెళ్లిపోయింది. జక్కన చెక్కిన ‘బాహుబలి’ అనే కళాఖండంతో తెలుగు సినిమాకు ప్రపంచస్థాయి గుర్తింపు వచ్చింది. ఇంతటి గ్రాండ్ సినిమా రూపొందించిన రాజమౌళి.. తదుపరి సినిమా ఏంటా అని అంతా అనుకున్నారు. అయితే ఆ ఊహలకు తగ్గట్లుగానే ఇద్దరు స్టార్ హీరోలతో ‘’ అనే సినిమాని స్టార్ట్ చేశాడు. రాజమౌళి. ఇద్దరు స్వతంత్ర సమరయోధులు అల్లూరి సీతారామ రాజు, కొమురం భీమ్‌ల మధ్య జరిగే ఓ కథ ఆధారంగా రూపొందుతున్న ఈ సినిమాలో , ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఆలియా భట్, ఒలీవియా మోరిస్‌లు హీరోయిన్లు. ఈ సినిమా ప్రకటించినప్పటి నుంచి అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. ఈ సినిమా ఎప్పుడు విడుదల అవుతుందా.. ఎప్పుడు థియేటర్లలో రామ్ చరణ్, ఎన్టీఆర్‌లను చూస్తామా..? అని ప్రేక్షకులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్నారు. మరోవైపు టీజర్లు, ఫస్ట్‌లుక్‌లతో సినిమా క్రేజ్‌ని ఇంకో రేంజ్‌కి తీసుకువెళ్లాడు రాజమౌళి. ఇక్కడవరకూ అంతా బాగానే ఉంది. కానీ, సినిమా విడుదల తేదీ విషయంలోనే అభిమానులు తీవ్ర నిరాశ పడుతున్నారు. తొలుత ఈ సినిమాని 2020, జూలై 30వ తేదీన విడుదల చేస్తామని ప్రకటించారు. కానీ, కరోనా రావడం.. లాక్‌డౌన్ తదితర కారణాలు అప్పుడు సినిమా విడుదలకు అడ్డంకిగా నిలిచాయి. ఆ తర్వాత కొంతకాలానికి ఈ ఏడాది జనవరిలో సినిమా విడుదల అవుతుందన్నారు. కానీ, అదీ జరగలేదు. కోవిడ్ పరిస్థితుల నేపథ్యంలో షూటింగ్ సరిగ్గా జరగకపోవడం.. తదితర కారణాలతో సినిమా విడుదల వాయిదాపడుతూ వచ్చింది. చివరిగా ఈ అక్టోబర్ 13న సినిమా పక్కాగా విడుదల చేస్తామని హామీ ఇచ్చింది చిత్ర యూనిట్.. కానీ, అభిమానులకు అప్పటికీ నమ్మకం కుదరలేదు. కానీ, చిత్ర యూనిట్ మాత్రం ఈసారి సినిమా విడుదలలో ఎటువంటి జాప్యం ఉండేది లేదంటూ బల్ల గుద్ది చెప్పింది. దీంతో అభిమానులు ఈసారి సినిమా పక్కా అని ఫిక్స్ అయ్యారు. అయితే ‘ఆర్ఆర్ఆర్’ చిత్ర యూనిట్ మరోసారి అభిమానులకు షాక్ ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. కరోనా రెండో వేవ్ కారణంగా సినిమా షూటింగ్ మరోసారి ఆగిపోయింది. అల్యూమినియం ఫ్యాక్టరీలో వేసిన ఓ భారీ సెట్‌లో సినిమాలో అతి కీలకమైన సన్నివేశాలు ఇంకా చిత్రీకరించాల్సి ఉందట. దీంతో సినిమా విడుదల మరోసారి వాయిదాపడే సూచనలు ఉన్నాయంటూ.. ఫిలిమ్ నగర్‌లో టాక్ వినిపిస్తోంది. కరోనా కేసులు తగ్గి.. మళ్లీ షూటింగ్ యధావిధిగా జరిగితే.. వచ్చే సంక్రాంతికి ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుందట. దీంతో అభిమానులు ‘జక్కన మాకేంటి గోలా’ అంటూ తలలు పట్టుకుంటున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3vuuZHF
v

రూటు మార్చిన పాయల్.. అందాల ఆరబోతకు బ్రేక్.. ఓ డిఫరెంట్‌ రోల్‌లో అలరించేందుకు రెడీ!

‘ఆర్‌ఎక్స్‌100’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ స్టేటస్ సంపాదించుకోలేకపోయింది. అందాల ఆరబోతకు ఏ మాత్రం వెనక్కి తగ్గకపోయినా.. ఈ బ్యూటీకి పెద్దగా అవకాశాలు రాలేదనే చెప్పుకోవాలి. ‘వెంకీమామ’, ‘డిస్కోరాజా’ సినిమాలతో స్టార్ హీరోలతో నటించిన.. ఆమెకు తగిన గుర్తింపు లభించలేదు. ఇక సోషల్‌మీడియాలోనూ ఈ అమ్మడు చాలా యాక్టివ్‌గా ఉంటుంది. తరచూ ఫోటో షూట్‌లు నిర్వహిస్తూ.. కుర్రకారులో హీటు పుట్టుస్తుంటుంది. మొత్తానికి ఏదో విధంగా సరైన బ్రేక్ సంపాదించాలని పట్టుదలతో ఉంది పంజాబీ బ్యూటీ పాయల్. అయితే అందుకోసం తన రూటు మార్చాలనే యోచనలో పాయల్ ఉన్నట్లు సమాచారం. ఇంతకాలంలో తన అందాలతో ఎంత కనువిందు చేసినా ఛాన్స్‌లు రాలేదు. దీంతో కొంతకాలం ఈ అందాల ఆరబోతకు బ్రేక్ వేసి డిఫరెంట్ మాడ్యులేషన్ ఉండే పాత్రల్లో నటించి.. ప్రేక్షకులను మెప్పించాలనే ప్రయత్నం ప్రారంభించిదట. గత ఏడాది లాక్‌డౌన్‌లో ‘అనగనగా ఒక అతిథి’ అనే సినిమాతో పలకరించింది పాయల్. తన కెరీర్‌లో తొలిసారిగా డీగ్లామర్ పాత్రలో కనిపించి.. మెప్పించింది. ప్రముఖ ఓటీటీ ‘’లో విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించింది. ఇప్పుడ అదే రూట్‌లో మరోసారి వెళ్లాలని పాయల్ ప్లాన్ చేస్తోందట. ఇందుకోసం ఆమె ఆహాతో కలిసి మరో వెబ్‌సిరీస్‌లో నటిస్తోందని టాక్. అయితే తొలిసారిగా ఈ వెబ్‌సిరీస్‌లో పాయల్ నెగెటివ్ రోల్‌లో కనిపించనున్నట్లు సమాచారం. ‘’ పేరుతో రూపొందుతున్న ఈ సిరీస్‌లో పాయల్ పాత్రే హైలైట్‌గా నిలువనుందట. దీంతో ఈ వెబ్‌సిరీస్ తర్వాత పాయల్‌ క్రేజ్ మరో రేంజ్‌కు వెళ్లే అవకాశం ఉందని సన్నిహితులు అంటున్నారు. మరి ఈ వెబ్‌సిరీస్ సక్సెస్ అయితే.. పాయల్ ఇదే రూట్‌లో కొనసాగుతుందో.. లేక మళ్లీ తన స్టైల్‌నే కొనసాగిస్తుందో వేచి చూడాలి.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/33041eC
v

చీటింగ్ కేసుపై యాంకర్ శ్యామల భర్త రియాక్షన్.. నిజానిజాలతో మీ ముందుకొస్తా.. అసలు జరిగింది ఇదీ!

యాంకర్ శ్యామల, బుల్లితెర నటుడు ఇటీవల అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. రాయదుర్గం పోలీసులు చీటింగ్‌ కేసులో ఆయనను అరెస్ట్ చేయడంతో ఒక్కసారిగా ఈ ఇష్యూ చర్చనీయాంశంగా మారింది. తన వద్ద కోటి రూపాయలు అప్పుగా తీసుకుని ఇవ్వకపోగా బెదిరింపులకు పాల్పడుతున్నాడంటూ నరసింహా రెడ్డిపై ఖాజా గూడకు చెందిన సింధూరా రెడ్డి అనే మహిళ చేసిన ఫిర్యాదుతో ఇష్యూ మొదలైంది. ఈ నేపథ్యంలో గత రెండు రోజుల క్రితం అరెస్ట్ అయిన లక్ష్మీ నరసింహా రెడ్డి.. బెయిల్‌పై బయటకు వచ్చి ఈ కేసు విషయమై స్పందించారు. తనపై తప్పుడు కేసు పెట్టారని.. నిజానిజాలతో త్వరలోనే అందరి ముందుకొస్తానని లక్ష్మీ నరసింహా రెడ్డి అన్నారు. ఈ మేరకు ఓ వీడియో ద్వారా రియాక్ట్ అయ్యారు. ఈ వీడియోను శ్యామల తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసింది. కేసుకు సంబంధించిన వివరాలు, వాటిని ఎలా తప్పుదోవ పట్టించారు అనే విషయాలన్నీ మీ ముందుంచుతానని లక్ష్మీ నరసింహా రెడ్డి చెప్పారు. ''నాపై ఎన్నో మోసపూరిత ఆరోపణలు వచ్చాయి. సోషల్ మీడియాలో చాలా రకాలుగా వార్తలు వచ్చాయి. ఈ పరిస్థితుల్లో కూడా నాకు అండగా నిలిచిన వాళ్లందరికీ కృతజ్ఞతలు. ఆ దేవుడి దయ వల్ల నేను ఇంటికి తిరిగి వచ్చాను. నేను రెండు రోజుల్లోనే బయటకు రావడం అనేది ఇదొక తప్పుడు కేసు అనడానికి నిరూపణ. కొన్నిసార్లు నిందలను కూడా భరించాల్సి వస్తుంది. అయితే ఈ కేసుకు సంబంధించి అన్ని నిజానిజాలను మీతో పంచుకోవడానికి మరికొన్ని రోజుల్లో మీ ముందుకు వస్తాను. అన్ని ఆధారాలతో మిమ్మల్ని కలుస్తాను. న్యాయం, న్యాయస్థానంపై నాకు పూర్తి నమ్మకం ఉంది'' అని అన్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3vwcPFv
v

‘నీతులు ముందు వాళ్లకు చెప్పు.. సిగ్గులేకుండా తిరుగుతున్నారు’.. కరీనాపై నెటిజన్లు ఫైర్

ఓవైపు కరోనా సెకండ్ వేవ్‌తో దేశం అట్టుడికిపోతుంది. ప్రతీరోజు లక్షల సంఖ్యలో కొత్త కేసులు, వేల సంఖ్యలో మరణాలు సంభవిస్తున్నాయి. పలు ప్రాంతాల్లో ఆక్సిజన్ కొరతతో రోగులు ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ ఉపద్రవాన్ని అడ్డుకొనేందుకు ప్రభుత్వాలు అన్ని విధాలుగా కృషి చేస్తున్నాయి. రాత్రి పూట కర్ఫ్యూలు, వారాంతపు లాక్‌డౌన్‌లు విధిస్తున్నాయి. మరికొన్ని రోజుల్లో మరోసారి పూర్తిస్థాయి లాక్‌డౌన్ విధించే పరిస్థితలు కనిపిస్తున్నాయి. అయితే దేశం ఇంత దుర్భరమైన పరిస్థితిలో ఉంటే కొందరు బాలీవుడ్ సెలబ్రిటీలు మాల్దీవులకు షికార్లకు వెళ్లడంపై సర్వత్ర విమర్శల వర్షం కురుస్తోంది. బాలీవుడ్ ప్రేమికులు ఆలియా భట్, రణ్‌బీర్ కపూర్ కొద్ది రోజుల క్రితం మాల్దీవులకు షికారుకు వెళ్లి ముంబైకి తిరిగి వచ్చారు. వీరే కాదు.. మరికొంత మంది సెలబ్రిటీలు కూడా విహారయాత్రలు చేస్తూ.. అక్కడ దిగిన ఫోటోలను సోషల్‌మీడియాలో పోస్ట్ చేశారు. దీనిపై నెటిజన్లు ఫైర్ అయ్యారు. దేశంలో ఇంత క్లిష్ట పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో మీరు విహారయాత్రలకు వెళ్లి ఎలా ఎంజాయ్ చేస్తారు అంటూ నెటిజన్లు వారిపై ఫైర్ అయ్యారు. నవాజుద్దీన్ సిద్ధికీ, శృతి హాసన్ తదితర సెలబ్రిటీలు కూడా వీరి హాలీడేలపై మండిపడ్డారు. అయితే తాజాగా ప్రముఖ బాలీవుడ్ నటి నెటిజన్ల ఆగ్రహానికి గురైంది. విస్తృతంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ప్రతీ ఒక్కరు తగిన జాగ్రత్తలు పాటించాలంటూ కరీనా తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ పెట్టింది. ‘‘ఈ దేశంలో ఎలాంటి విపత్కర పరిస్థితి ఉందో ఇంకా కొందరికి అర్థం కావడం లేదని తెలిసి నాకు ఆశ్చర్యం వేస్తోంది. ఒకసారి ఇంటి నుంచి బయటకు వెళ్లే ముందు, లేదా మీ గడ్డం కిందకు మాస్క్ ధరించినప్పుడు లేదా రూల్స్ అతిక్రమించినప్పుడు ఒకసారి మన వైద్యులు, సిబ్బంది గురించి ఆలోచించండి. వాళ్లు మన కోసం శారీరకంగా, మానసికంగా శ్రమిస్తున్నారు. అందుకు ఇది చదువుతున్న ప్రతీ ఒక్కరు బాధ్యత తీసుకోవాలి. ఇప్పుడ ఇండియాకు మీరు ఎంతో అవసరం’’ అంటూ కరీనా తన పోస్ట్‌లో పేర్కొంది. దీంతో నెటిజన్లు ఆమెపై ఫైర్ అవుతున్నారు. ‘ముందు ఈ నీతులు మీ వాళ్లకు చెప్పు. వాళ్లు సిగ్గు లేకుండా వేకెషన్‌లలో ఎంజాయ్ చేస్తున్నారు’.. ‘నీ కజిన్(రణ్‌బీర్ కపూర్) వారం రోజుల క్రితమే తన గర్ల్‌ఫ్రెండ్‌తో మాల్దీవులకు వెళ్లి వచ్చాడు. వాళ్లకు ఈ నీతులు వర్తించవా?’.. ‘మాల్దీవుల్లో షికార్లు చేస్తున్న నీ మిత్రులకు కూడా కాస్త అర్ధం అయ్యేలా చెప్పండి మేడం’ అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. కరీనా ప్రస్తుతం అమీర్ ఖాన్ హీరోగా చేస్తున్న ‘లాల్‌సింగ్ ఛడ్డా’ అనే సినిమాలో నటిస్తోంది. ఈ ఏడాది ఫిబ్రవరీలో కరీనా ఒక మగబిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3nytTrD
v

ఇంట్లోనే ఫ్రెండ్‌తో ప్రగతి రచ్చ.. హాట్ హాట్‌గా ఇద్దరూ కలిసి రెచ్చిపోయారు బాబోయ్! వీడియో వైరల్

యాక్ట్రెస్ .. ఈ సినీ నటి గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరమే లేదు. సినిమాల్లో ఎంత పాపులారిటీ సంపాదించిందో సోషల్ మీడియా ద్వారా అంతకుమించి అనేలా ఫేమ్ కూడగట్టుకుంది. ఈ మధ్యకాలంలో కాలంలో అయితే ఆమె పోస్ట్ చేస్తున్న ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియా దుమ్ముదులిపేస్తున్నాయి. హాట్ హాట్‌గా చిందులేస్తూ ఆయా వీడియోలతో రచ్చ చేస్తోంది ప్రగతి. దీంతో యువత చూపంతా ఈ నటీమణి సోషల్ మీడియా వాల్ పైనే ఉంటోంది. ఇప్పటికే చాలాసార్లు తన డాన్స్ వీడియోలతో స్పెషల్ కిక్కిచ్చిన ప్రగతి.. తాజాగా మరోసారి అదే సీన్ రిపీట్ చేస్తూ రచ్చ చేసింది. ఇరగదీసే స్టెప్పులేస్తూ దానికి గ్లామర్ డోస్‌ యాడ్ చేసి తనదైన ఎనర్జీతో ఆశ్చర్యపర్చింది. అంతేకాదు ఈ వీడియోలో ప్రగతి ఫ్రెండ్ కూడా ఆమెతో కలిసి చిందులేసింది. డ్రీముమ్ వేకుపమ్ అనే తమిళ పాటకు ఈ ఇద్దరూ కలిసి ఇంట్లోనే రెచ్చిపోయి డాన్స్ చేశారు. ఫాస్ట్ మూమెంట్స్‌కి తోడు ఇద్దరి గ్లామర్ డోస్ ఈ వీడియో వైరల్ కావడానికి ప్రధాన కారణమైంది. 44 ఏళ్ల వయసులో కూడా ఫిజికల్ ఫిట్‌నెస్‌పై ఫోకస్ పెట్టేసి ప్రగతి చేస్తున్న హంగామా చూసి ఫిదా అవుతున్నారు తెలుగు ప్రేక్షకులు. ఆమె ఎనర్జీ, డాన్సింగ్ స్కిల్ చూసి ముక్కున వేలేసుకుంటున్నారు. లుంగీ కట్టి తీన్మార్ స్టెప్పులేయాలన్నా, కిక్ బాక్సింగ్ చేయాలన్నా, క్లాసికల్ డాన్స్ వేయాలన్నా తనకు తానే సాటి అని నిరూపించుకుంటూ సోషల్ మీడియాను దున్నేస్తోంది ఈ సీనియర్ నటి. లేటు వయసులో ఘాటు అందాలతో మత్తెక్కిస్తుండటంతో ప్రగతికి సోషల్ మీడియా ఫాలోయింగ్ అంతకంతకూ పెరుగుతోంది. ఆమె గ్రేస్ చూసి వావ్! అంటున్నారు నెటిజన్లు. ఇలా సామజిక మాధ్యమాల ద్వారా రెగ్యులర్‌గా హాట్ ట్రీట్ ఇవ్వడం హాబీగా పెట్టుకుంది ప్రగతి. ఏదేమైనా వెండితెరపై ఎంతో పద్దతిగా అమ్మ, అక్క, వదిన పాత్రల్లో కలిపించే ప్రగతి.. సోషల్ మీడియాలో మాత్రం యంగ్ హీరోయిన్స్ సైతం కుళ్ళుకునేలా చేస్తోందని చెప్పడంలో అతిశయోక్తి లేదు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2SjFnUx
v

లాక్‌డౌన్‌లో నిఖిల్ కుటుంబం.. అతని మరణమే అందుకు కారణం.. హీరో సంచలన ప్రకటన

రెండో దశలో వైరస్ ప్రభావం సినీ పరిశ్రమపై తీవ్రంగా ఉంది. కరోనా వ్యాప్తిని దృష్టిలో పెట్టుకొని.. ఇప్పటికే సినిమా థియేటర్లను మూసివేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీంతో పాటు రాత్రి పూట కర్ఫ్యూ విధించడంతో పాటు.. త్వరలో పూర్తిస్థాయి పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక వైరస్ వ్యాప్తి నేపథ్యంలో సినిమా షూటింగ్‌లు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. దీంతో తారలు మరోసారి పూర్తిస్థాయిలో ఇంటికే పరిమితమయ్యారు. ఈ క్రమంలో సిద్ధార్త్ ఓ కీలక నిర్ణయం తీసుకుంటున్నట్లు ప్రకటించాడు. కరోనా వైరస్ వ్యాప్తి తగ్గే వరకూ తన కుటుంబం మొత్తం లాక్‌డౌన్‌లో ఉంటుందని అతను తెలిపాడు. నిఖిల్ ప్రస్తుతం.. ‘18 పేజెస్’, ‘కార్తీకేయ-2’ చిత్రాలలో నటిస్తున్నాడు. అయితే కరోనా కేసులు విస్తృతంగా పెరిగిపోతున్న నేపథ్యంలో ఈ రెండు సినిమాల షూటింగ్‌లను ఆపేశామని నిఖిల్ తెలిపాడు. ‘‘నా రెండు సినిమాల షూటింగ్‌లు సజావుగా సాగుతున్నాయి. ఒక్కసారిగా ఇండస్ట్రీలో కోవిడ్ కేసుల సంఖ్య పెరిగిపోయింది. ఎక్కడ చూసిన వైరస్సే కనిపించింది. ప్రతీ ఒక్కరు తమ మిత్రుడికో లేక బంధువుకో కరోనా సోకిందని చెబుతున్నారు. దీంతో మేము మా సినిమాల షూటింగ్‌లను తాత్కాలికంగా వాయిదా వేశాము. పరిస్థితులు మెరుగైన తర్వాత మళ్లీ షూటింగ్ ప్రారంభిస్తాము’’ అని నిఖిల్ పేర్కొన్నాడు. తన భార్య పల్లవితో కలిసి ప్రస్తుతం అన్ని జాగ్రత్తల మధ్య సెల్ఫ్ లాక్‌డౌన్‌లోకి వెళ్లామని నిఖిల్ తెలిపాడు. ‘‘ఎంతో మంది యువకులు ఈ వైరస్ బారిన పడుతున్నారు. నాకు తెలిసిన వ్యక్తి వైరస్ సోకి మరణించాడు. అతని వయస్సు 31 సంవత్సరాలే. ప్రతీ ఒక్కరు జాగ్రత్తగా ఉండాల్సిన సమయం ఇది. ఒక డాక్టర్‌గా నా భార్య పల్లవి రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకుంది. నేను వీలైనంత త్వరగా తీసుకోవాలని ప్రయత్నిస్తున్నాను. పరిస్థితులు మెరుగయ్యే వరకూ మా కుటుంబం మొత్తం సెల్ఫ్ లాక్‌డౌన్‌లోనే ఉంటాము’’ అని నిఖిల్ స్పష్టం చేశాడు. ఇక ఈ లాక్‌డౌన్‌లో కష్టాల్లో ఉన్నవారికి తగిన సహాయం అందించేందుకు అన్ని విధాలుగా కృషి చేస్తానని నిఖిల్ తెలిపాడు. బెడ్స్, ఆక్సిజన్, ప్లాస్మా తదితర అవసరాలు ఉన్నవారు తనని సంప్రదించాలని అతను అన్నాడు. అయితే సోషల్‌మీడియాలో చాలా తప్పుడు ప్రచారాలు జరుగుతున్నాయని.. దయచేసి అలాంటి వాటికి దూరంగా ఉండాలని అతను సూచించాడు. ప్రస్తుతం తనకు దొరికిన ఖాళీ సమయాన్ని ప్రజలకు సహాయం చేసి సద్వినియోగం చేసుకుంటానని అతను చెప్పాడు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3t5UCNh
v

Thursday 29 April 2021

నందమూరి ఫ్యాన్స్‌కి బ్యాడ్ న్యూస్.. రండి గెలుద్దాం అన్న యంగ్ టైగర్ వెనకడుగు.. ఎన్టీఆర్ షో కష్టమేనట!

తెలుగు తెరపై తనదైన నటనతో భారీ పాపులారిటీ కూడగట్టుకున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ బిగ్ బాస్ సీజన్- 1తో బుల్లితెరపైకి ఎంట్రీ ఇచ్చి సత్తా చాటిన సంగతి తెలిసిందే. అయితే ఆ తర్వాత సినిమాలతో బిజీ అయిన ఎన్టీఆర్.. రీసెంట్‌గా మరో షోతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు అఫీషియల్‌గా ప్రకటించారు. 'ఆట నాది.. కోటి మీది.. రండి గెలుద్దాం.. ఎవరు మీలో కోటీశ్వరులు' అంటూ పిలిచారు యంగ్ టైగర్. జెమినీ టీవీలో ఈ షో ప్రసారం కానున్నట్లు తెలిపారు. అయితే తాజా సమాచారం మేరకు ఈ షో క్యాన్సిల్ అయిందని తెలుస్తోంది. ‘ఎవరు మీలో కోటీశ్వరులు' అనే టైటిల్ ఫిక్స్ చేస్తూ ఇప్పటికే ఈ షో ప్రోమో రిలీజ్ చేయడంతో అందరిలోనూ ఆసక్తి నెలకొంది. ఎన్టీఆర్ మాటల తూటాలు బుల్లితెర ఆడియన్స్‌ని ఎంతగానో ఆకట్టుకున్నాయి. దీంతో వచ్చే నెల నుంచి ఈ షోను టెలికాస్ట్ చేసేలా ప్లాన్ చేశారు మేకర్స్. అయితే ఊహించని విధంగా కరోనా సెకండ్ వేవ్ దాడి ప్రారంభం కావడంతో షోని వాయిదా వేయక తప్పలేదట. తాజా సమాచారం మేరకు ఈ షో టెలికాస్ట్ కావడానికి మరికొన్ని నెలల సమయం పడుతుందని తెలుస్తోంది. కరోనా కారణంగా ఇప్పటికే ఎన్టీఆర్ కమిటైన సినిమాల షూటింగ్ ఆపేశారు. కోవిడ్ ఉదృతి తగ్గగానే ముందు ఆయా షూటింగ్స్ ఫినిష్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. సో.. ఇలాంటి సమయంలో ఈ షోకి ఎన్టీఆర్ డేట్స్ అడ్జస్ట్ చేయడం చాలా కష్టమవుతుందని, అందుకే జూన్ చివరి లేదా జూలై మొదటి వారంలో ఈ షో మొదలు పెట్టే అవకాశాలు ఉన్నాయనే టాక్ జనాల్లో నడుస్తోంది. ఏదిఏమైనా ఈ కరోనా సమయంలో ఇంట్లో కూర్చొని బుల్లితెరపై ఎన్టీఆర్ సందడి చూడాలనుకునే ప్రేక్షకులందరికీ ఇది బ్యాడ్ న్యూసే అని చెప్పుకోవాలి.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3gPzjwV
v

సినిమా రౌండప్: హాట్‌ హాట్‌గా ఎన్టీఆర్‌ హీరోయిన్ ఎంట్రీ.. పవన్ కళ్యాణ్ రెడీ! ప్రియాంక ఆవేదన

జోష్‌లో నందమూరి నటసింహం బాలకృష్ణ- బోయపాటి కాంబోలో రాబోతున్న 'అఖండ' మూవీ విడుదలకు ముందే సంచలనాలు సృష్టిస్తోంది. 'కాలు దువ్వే నంది ముందు రంగు మార్చిన పంది.. కారు కూతలు కూస్తే కపాలం పగిలిపోద్ది..' అనే డైలాగ్‌ రెండు తెలుగు రాష్ట్రాల్లో దద్దరిల్లుతోంది. ఇప్పటికే 'అఖండ' టీజర్‌ టాలీవుడ్‌లో ఫాస్టెస్ట్ 50మిలియ‌న్స్ వ్యూస్ సాధించిన టీజ‌ర్‌గా రికార్డు క్రియేట్ చేసింది. అప్పట్లోనే ఊపేసిన హీరోయిన్ మరోసారి హాట్‌గా.. ఎన్టీఆర్ హీరోగా వచ్చిన 'ఆది' సినిమాలో హీరోయిన్ కీర్తి చావ్లా గుర్తుందిగా. డెబ్యూ మూవీతోనే అందరి చూపు తనవైపు తిప్పుకున్న ఈ బ్యూటీ మళ్ళీ ఇన్నేళ్లకు మరింత హాట్‌గా వెండితెరపై కనిపించబోతోంది. ఆమె నటించిన లేడీ ఓరియంటెడ్ మూవీ ‘ఓ అమ్మాయి క్రైమ్ స్టోరీ’ విడుదలకు సిద్ధమైంది. పవన్ కళ్యాణ్ కోసం రెడీ! రీ- ఎంట్రీ తర్వాత వరుస సినిమాలకు కమిటవుతున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరో సినిమా ఓకే చేశారని తెలుస్తోంది. మహేష్ బాబుతో 'మహర్షి' రూపొందించిన వంశీ పైడిపల్లి పవన్ కోసం బలమైన కథ రెడీ చేసి దిల్ రాజుకు వినిపించారట. అతిత్వరలో దీనిపై పవన్ ఓ నిర్ణయం తీసుకోబోతున్నారని టాక్. అది చూసి ప్రియాంక ఆవేదన కరోనా సెకండ్ వేవ్ దాటికి భారత దేశం అల్లాడిపోతోంది. కోవిడ్ భయంతో జనం బిక్కుబిక్కుమంటున్నారు. ఆసుపత్రులలో బెడ్లు కూడా దొరకని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో భారత్‌ను ఆదుకునేందుకు ముందుకు రావాలంటూ బాలీవుడ్ ప్రముఖ నటి ప్రియాంక చోప్రా అంతర్జాతీయ సమాజానికి విజ్ఞప్తి చేశారు. భారత్ తన సొంత దేశమని, ఇప్పుడు రక్తమోడుతోందని ప్రియాంక ఆవేదన చెందారు. హిట్ సీక్వెల్‌తో మాస్ మహారాజా.. ఇటీవలే 'క్రాక్' సినిమాతో హిట్ అందుకున్న రవితేజ ప్రస్తుతం 'ఖిలాడి' మూవీ చేస్తున్నారు. దీంతో పాటు మరికొన్ని సినిమాలు చేసేందుకు రెడీ అవుతున్నారట మాస్ మహారాజ్. ఈ క్రమంలోనే అనిల్ రావిపూడి దర్శకత్వంలో 'రాజా ది గ్రేట్' సీక్వల్ కోసం రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3nxywSK
v

సినీ పరిశ్రమలో మరో విషాదం.. ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు కె. వి ఆనంద్ క‌న్నుమూత‌

సినీ ఇండీస్ట్రీని వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. ఓ వైపు కరోనా మహమ్మారి దాడి, మరోవైపు అనారోగ్యంతో పలువురు సినీ ప్రముఖుల మరణాలు ఇండీస్ట్రీ వర్గాల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. ఇటీవలే తమిళ హాస్యనటుడు వివేక్ మరణం తాలూకు విషాదం నుంచి పూర్తిగా తేరుకోకముందే కోలీవుడ్‌లో మరో విషాదం చోటుచేసుకుంది. ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు కె. వి ఆనంద్(54) గుండెపోటుతో కన్నుమూశారు. ఛాతిలో నొప్పి రావడంతో ఈ రోజు (ఏప్రిల్ 30) తెల్లవారుజామున చెన్నైలోకి ఓ ఆసుపత్రికి తీసుకెళ్లగా.. ఆయన ఉదయం 3 గంటల ప్రాంతంలో తుదిశ్వాస విడిచారని సన్నిహితులు తెలిపారు. ఆయన మరణవార్తతో కోలీవుడ్‌లో విషాద ఛాయలు అలుముకున్నాయి. మరణం పట్ల పలువురు సినీ నటులు, దర్శకనిర్మాతలు తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తున్నారు. చెన్నైలో పుట్టిన పెరిగిన కె.వి.ఆనంద్ ఫ్రీ లాన్స్ ఫొటో జ‌ర్న‌లిస్ట్‌గా కెరీర్ ప్రారంభించారు. క‌ల్కి, ఇండియా టుడే దినప‌త్రిక‌ల్లో పని చేసిన ఆయన.. ప్ర‌ముఖ సినిమాటోగ్రాఫ‌ర్ పీసీ శ్రీరామ్‌ వద్ద సినిమాటోగ్ర‌ఫీలో శిక్షణ పొందారు. ఆ తర్వాత ప్రేమ‌దేశం, ఒకేఒక్క‌డు, బాయ్స్, ర‌జినీకాంత్ శివాజీ లాంటి భారీ చిత్రాల‌కు సినిమాటోగ్రాఫ‌ర్‌గా సేవలందించారు. క‌ణా కండేన్ సినిమాతో ద‌ర్శ‌కుడిగా మారి సూర్య‌తో వీడొక్క‌డే(అయాన్‌)తో హిట్ కొట్టారు. ఆ తర్వాత బ్ర‌ద‌ర్స్‌(మాట్రాన్‌), అనేకుడు(అనేగ‌న్‌), కవ‌న్‌, బందోబ‌స్త్‌(కాప్పాన్‌) చిత్రాల‌ను ఆయన రూపొందించారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3e0THtk
v

కపూర్ ఫ్యామిలీలో కరోనా కలకలం.. రణధీర్ కపూర్‌కు పాజిటివ్ రావడంతో కుటుంబంలో ఆందోళన

దేశంలో అక్కడా ఇక్కడా అని లేదు ఎక్కడ చూసినా మహమ్మారి దాడి మాత్రమే కనిపిస్తోంది. లక్షలాది మంది కరోనా బారిన పడటం చూస్తున్నాం. సినీ ఇండస్ట్రీని సైతం కరోనా మహమ్మారి వీడటం లేదు. ఫస్ట్ వేవ్‌లో కొంతమంది సినీ ప్రముఖులు కరోనా బారినపడి మరణించిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు సెకండ్ వేవ్ కూడా ఇండస్ట్రీని పట్టిపీడిస్తోంది. ఇప్పటికే కొందరు సినీ ప్రముఖులు కరోనా సోకి చికిత్స తీసుకుంటుండగా.. తాజాగా ఆ మహమ్మారి కపూర్ ఫ్యామిలీలో ప్రవేశించిందని తెలియడం బాలీవుడ్ వర్గాల్లో ఆందోళన కలిగిస్తోంది. సీనియర్ నటుడు రణధీర్‌ కపూర్‌కు కొవిడ్‌ పాజిటివ్‌ అని తేలింది. ఆరోగ్యం విషమించడంతో వెంటనే ఆయనను ముంబైలోని కోకిలాబెన్ హాస్పిటల్‌లో చేర్పించారు. అక్కడి వైద్యుల పర్యవేక్షణలో ఆయనకు మెరుగైన చికిత్స అందిస్తున్నారు. కాగా గతేడాది సరిగ్గా ఇదే సమయం అనగా ఏప్రిల్ 30వ తేదీన రణధీర్‌ కపూర్‌ సోదరుడు, ప్రముఖ నటుడు రిషి కపూర్ మరణించిన సంగతి తెలిసిందే. ఆ ఘటన జరిగాక సంవత్సరానికి రణధీర్‌ కపూర్‌‌కి కరోనా సోకి ఆసుపత్రి పాలు కావడంతో ఆయన కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. అయితే రణధీర్ కపూర్ ఆరోగ్యంపై స్పందించిన కోకిలాబెన్ హాస్పిటల్‌ వైద్యులు.. గత రాత్రి నుంచి ఆయనకు చికిత్స అందిస్తున్నామని, ప్రస్తుతానికైతే ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని చెప్పడంతో అందరూ కాస్త ఊపిరి పీల్చుకున్నారు. రణధీర్ కపూర్ త్వరగా కోలుకొని తిరిగి పూర్తి ఆరోగ్యంతో బయటకు రావాలని పలువురు సినీ ప్రముఖులు సోషల్ మీడియాలో ట్వీట్స్ పెడుతున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3xvNDRr
v

చెత్త రాజకీయాల్లో జరిగేది అదే.. వాళ్లే రియల్ హీరోలు.. మళ్లీ గెలికిన పూనమ్ కౌర్

వేసే ట్వీట్లు ఒక్కోసారి అందరి దృష్టిని ఆకర్షిస్తుంటాయి. అలా ఆమె వేసే ట్వీట్లో ఎన్నో అర్థాలు నిగూఢంగా దాగి ఉంటాయి. ఎవరిని ఉద్దేశించి మాట్లాడుతుందో కూడా ఒక్కోసారి చెప్పలేని పరిస్థితి ఏర్పడుతుంది. ఆమె వేసే పరోక్ష ట్వీట్లు అందరినీ ఆలోచించేలా చేస్తుంటాయి. ఆమె కేవలం వ్యక్తిగత విషయాల గురించే కాకుండా సమాజం, రాజకీయ వ్యవస్థ మీదా కామెంట్లు చేస్తుంటారు. తాజాగా పూనమ్ ప్రస్తుత పరిస్థితిపై కౌంటర్లు వేశారు. ప్రస్తుతం మన దేశం ఎలాంటి పరిస్థితుల్లో ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎటూ చూసినా చావుకేకలు వినిపిస్తున్నాయి. కరోనా ధాటికి ప్రజలు అల్లాడిపోతోన్నారు. వైద్య సదుపాయాలు లేక, ఆక్సిజన్ కొరతతో ఎంతో మంది ప్రాణాలు వదిలేస్తున్నారు. అయితే ఈ సమయంలోనూ రాజకీయాలు చేసేవారున్నారు. ప్రభుత్వ పాలక, ప్రతిపక్షాలు ఒకరి మీద ఒకరు కామెంట్లు చేసుకుంటూనే ఉన్నారు. అయితే తాజాగా పూనమ్ కౌర్ ప్రస్తుత పరిస్థితి, రాజకీయ నాయకులు చేసే పనుల గురించి కామెంట్ చేశారు. కొందరు బాధపడుతూ ఉంటే.. వాటి వల్ల ఇంకొందరు సుఖపడుతున్నారు.. కానీ బాధపడేవారి స్థితి గురించి ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. ఇలాంటి చెత్త రాజకీయాల్లో అలానే ఉంటుంది.. ఒకరి కష్టం మరొకరికి సుఖంగా మారుతుంది.. కానీ ఎవ్వరైతే సేవలు చేస్తున్నారో వారు సెలైంట్‌గా చేసేస్తున్నారు.. వారే నిజమైన హీరోలు అని పూనమ్ కౌర్ చెప్పుకొచ్చారు. అయితే ఎందుకు ఎవరిని టార్గెట్ చేశారో.. ఎవరిని పొగిడారో స్పష్టంగా తెలియడం లేదు. నిన్న కూడా పూనమ్ కౌర్ ఇలాంటి ఓ ట్వీటే వేశారు. కాపీ మాస్టర్ అంటూ తెగ ఊగిపోయారు. అన్ని కాపీ చేస్తారు.. మీకు ఉపయోగపడేలా మార్చుకుంటారు.. అని కాపీ మాస్టర్ అంటూ పూనమ్ కౌర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2PxLjrJ
v

‘ఎలాంటి సహాయం కావాలన్నా.. ఆ ట్విట్టర్ ఖాతాని ఫాలో కండి’.. నెటిజన్లకు రాజమౌళి సలహా

‘ఆర్ఆర్ఆర్’ సినిమాకు సంబంధించిన అధికారిక ట్విట్టర్ ఖాతా గత కొంతకాలంగా చాలా యాక్టివ్‌గా ఉంటుంది. అయితే అందులో వాళ్లు సినిమా అప్‌డేట్‌లు ఇవ్వడం లేదు. కరోనా కారణంగా ఇబ్బందులు ఎదురుకుంటున్న వాళ్లకి తగిన సహాయం అందించేందుకు ఈ ట్విట్టర్ ఖాతా ద్వారా కృషి చేస్తున్నారు. కష్టాల్లో ఉన్నవారి వివరాలను తెలుసుకొని.. వారికి తగిన సహాయం అందేలా చేస్తున్నారు. దర్శకధీరుడు కూడా కరోనా కారణంగా ఇబ్బందులు పడుతున్న వారు ఎలాంటి సహాయం కావాలన్న ‘ఆర్ఆర్ఆర్’ ట్విట్టర్ ఖాతాని ఫాలో కావాలని సూచించారు. రెండో దశలో వ్యాప్తి భయంకరంగా ఉంది. ప్రతీ రోజు లక్షల సంఖ్యలో కేసులు నమోదు అవుతున్నాయి. వేలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ ఉపద్రవంలో ప్రజలకు సహాయం చేసేందుకు సెలబ్రిటీలు ముందుకొస్తున్నారు. బయటకు వెళ్లే అవకాశం లేకపోవడంతో సోషల్‌మీడియా ద్వారా కష్టాల్లో ఉన్నవారి వివరాలు తెలుసుకొని.. తగిన సహాయం అందిస్తున్నారు. ఈ క్రమంలో తమకు సహాయం చేయాలంటూ రాజమౌళిని చాలా మంది నెటిజన్లు కోరారు. దీనిపై ఆయన ట్విట్టర్ ద్వారా స్పందించారు. ‘‘పరిస్థితులు చాలా కఠినంగా ఉన్నాయి. ఇలాంటి సమయంలో తగిన సహాయం అందించడానికి మా టీమ్ ప్రతీ క్షణం కష్టపడుతుంది. కరోనాకు సంబంధించి ఎటువంటి సహాయం కావాలన్ని ‘ఆర్ఆర్ఆర్’ ట్విట్టర్ ఖాతాని ఫాలో అవ్వండి. అందులో తగిన సమాచారం తెలుసుకోండి. మీరు మీ చుట్టుపక్కల వారికి సహాయం చేయండి’’ అంటూ రాజమౌళి ట్వీట్ చేశారు. ఇక ‘బాహుబలి’ వంటి గ్రాండ్ సక్సెస్ తర్వాత రాజమౌళి ‘ఆర్ఆర్ఆర్’ పేరుతో మరో ప్రతిష్టాత్మక ప్రాజెక్టును రూపొందిస్తున్నారు. ఈ సినిమాలో మన్యం వీరుడు అల్లూరి సీతారామ రాజు పాత్రలో రామ్ చరణ్, గిరిజన యోధుడు కొమురం భీమ్ పాత్రలో ఎన్టీఆర్ నటిస్తున్నారు. చరణ్‌కు జోడీగా ఆలియా భట్, ఎన్టీఆర్‌కు జోడీగా ఒలివియా మోరిస్ నటిస్తున్నారు. కరోనా వ్యాప్తి కారణంగా ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ నిలిచిపోయింది. అంతా సవ్యంగా జరిగితే వచ్చే సంక్రాంతికి సినిమా విడుదల అయ్యే అవకాశం ఉంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2QJ9CUj
v

లిప్ లాక్‌తో హీరోయిన్ రచ్చ.. ఆ జంతువుతో అలా కానిచ్చేస్తోన్న సదా

కొందరికి ప్రకృతి అంటే ఇష్టం. ఇంకొందరికి పెంపుడు జంతువులు అంటే ఇష్టం. అలా సెలెబ్రిటీల్లో చాలా మంది పెట్స్ లవర్సే. దాదాపు అందరి ఇంట్లో పెంపుడు జంతువులుంటాయ్. అయితే వీటిల్లో ఎక్కువ మంది దగ్గర వెరైటీ డాగ్ బ్రీడ్స్ ఉంటాయ్. ప్రపంచ దేశాల్లోని మేలిమి జాతికి చెందిన బ్రీడ్ డాగ్స్‌ను తెచ్చి పెంచుకుంటారు. ఇంకొందరు పిల్లిలను ప్రేమగా పెంచుకుంటారు. ఈ కోవలోకి నాటి హీరోయిన్ కూడా చేరారు. జయం సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు సదా. వెళ్లవయ్యా వెళ్లు వెళ్లు అనే డైలాగ్‌తో రెండు రాష్ట్రాల్లో ఫేమస్ అయ్యారు. ఇప్పటికీ సదాను అదే డైలాగ్‌తో గుర్తిస్తుంటారు. సదాకు కోలీవుడ్‌లోనూ భారీ ఫాలోయింగ్ ఉంది. అయితే సదా మాత్రం ఎక్కువగా కాలం ఇండస్ట్రీలో నిలబడలేకపోయారు. తెలుగు ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగారు. ఆ తరువాత సదా వెండితెరకు దూరమైనా కూడా బుల్లితెర ద్వారా ప్రేక్షకులను పలకరిస్తూనే వచ్చారు. ఢీ షోలో సదా న్యాయ నిర్ణేత కొన్ని సీజన్లకు వ్యవహరించారు. ఆ సమయంలో సదా ఎప్పుడూ ట్రెండింగ్‌లోనే ఉండేవారు. అయితే ఢీ నుంచి కూడా సదా తప్పుకున్నారు. ఇప్పుడు సదా సోషల్ మీడియా ద్వారా తన అభిమానులను అలరిస్తుంటారు. తాజాగా సదా తన పెట్‌తో ముద్దులాట ఆడారు. తన పిల్లికి ముద్దులిస్తూ అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇక ఈ వీడియోను చూసి ఆ పిల్లికి దక్కిన అదృష్టానికి అందరూ కుళ్లుకున్నారు. పిల్లినైనా కాకపోతిని అంటూ సదా ముద్దులపై సెటైర్లు వేశారు. మొత్తానికి సదా ఇలా లిప్ లాక్ చేయడంతో అందరూ షాక్ అయ్యారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3aOWaVC
v

మంచు విష్ణు కుటుంబంలో చిచ్చుపెట్టిన ఐపీఎల్.. ‘ఎవరైన సహాయం చేయండి’ అంటూ ట్వీట్

భారత్‌లో క్రికెట్‌కి ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. క్రికెట్ మ్యాచ్ ఉందంటే చాలా పనులన్ని మానుకొని టీవీలకు అతుక్కుపోతుంటారు. ఇక ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రారంభం అయిన తర్వాత ఈ క్రేజ్ మరో లెవల్‌కి వెళ్లిపోయింది. ఇతర క్రికెట్ లీగ్‌లతో పోల్చుకుంటే.. ఐపీఎల్‌కి ఉండే ఫ్యాన్ బేస్ చాలా ఎక్కువ. ప్రపంచవ్యాప్తంగా ఈ లీగ్‌ ఎప్పుడు ప్రారంభం అవుతుందా.. ఎవరు గెలుస్తారా.. అంటూ అభిమానులు ఎదురుచూస్తుంటారు. ఇక ప్రస్తుతం కరోనా కారణంగా ఏర్పడిన తీవ్ర సంక్షోభంలో ఐపీఎల్ కాస్త ఉపశమనాన్ని ఇస్తుంది. గత ఏడాది కరోనా వ్యాప్తిని దృష్టిలో పెట్టుకొని ఐపీఎల్‌ను దుబాయ్‌లో నిర్వహించారు. అయితే పరిస్థితులు కాస్త మెరుగుకావడంతో ఈసారి భారత్‌లోనే మ్యాచులు జరుపుతున్నారు. పూర్తిస్థాయి కట్టుదిట్టమైన భద్రత మధ్యలో.. కరోనా నిబంధనలు పాటిస్తూ స్టేడియంలో అభిమానులు లేకుండానే మ్యాచులు నిర్వహిస్తున్నారు. అయితే ఈ ఐపీఎల్ కారణంగా హీరో ఇంట్లో గొడవలు జరుగుతున్నాయట. ఐపీఎల్ జరిగే సమయంలో తమ అభిమాన ఆటగాడు గొప్ప అంటూ.. ఇతర క్రికెటర్లను ట్రోల్ చేస్తుంటారు అభిమానులు. ముఖ్యంగా ధోనీ, కోహ్లీ అభిమానుల మధ్య తరచూ ఈ యుద్ధం జరుగుతుంటుంది. ఇప్పుడు ఇదే యుద్ధం మంచు విష్ణు ఇంట్లోనూ జరుగుతోందట. మంచు విష్ణు ఇద్దరు కూతుళ్లు అరియానా, వివియానా ఐపీఎల్ గురించి ఫైట్ చేస్తున్నారట. ‘అరియానా ధోనీకి అభిమాని, వివియానా కోహ్లీకి అభిమాని. వాళ్లిద్దరిలో ఎవరు ఉత్తమ ఆటగాడు అని ఇక్కడ వీళ్లిద్దరు గొడవపడుతున్నారు. ఈ గొడవ అసలు వేరే లెవల్‌లో ఉంది. దయచేసి ఎవరైన సహాయం చేయండి’ అంటూ మంచు విష్ణు ట్వీట్ చేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది. అభిమానులు దీనిపై రకరకాల కామెంట్లు పెడుతున్నారు. తాజాగా మంచు విష్ణు ‘మోసగాళ్లు’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కాజల్ అగర్వాల్ ఇందులో కథానాయిక. భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది. ప్రస్తుతం మంచు విష్ణు.. శ్రీను వైట్ల దర్శకత్వంలో తన సూపర్ హిట్ సినిమా ‘ఢీ’ సీక్వెల్‌గా తెరకెక్కుతున్న ‘డబుల్ డోస్’ సినిమాలో నటిస్తున్నాడు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3t3DmIG
v

బస్తీ బాయ్స్ కోసం అదిరిపోయే ప్లాన్.. ఐ ఫోన్‌తో వారికి గాలమేస్తోన్న నాగబాబు

మెగా బ్రదర్ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటారో అందరికీ తెలిసిందే. మరీ ముఖ్యంగా ఈ మధ్య తన ఫోకస్ అంతా కూడా యూట్యూబ్ మీదే పెట్టేశారు. ఇన్ స్టాగ్రాంలో నిత్యం తన ఫాలోవర్లతో టచ్‌లో ఉంటుంటారు. ఈ మధ్యే అంటూ నాగబాబు యూట్యూబ్‌లో హల్చల్ చేస్తున్నారు. చాలా గ్యాప్ తరువాత నాగబాబు నిర్మాణ రంగంలోకి మళ్లీ వచ్చారు. అదిరింది షోలో చేసిన కమెడియన్స్‌తో నాగబాబు ప్రయోగం చేసేందుకు ముందుకు వచ్చారు. జాతిరత్నాలు టైపులోనే సద్దాంను మెయిన్ లీడ్‌గా పెట్టి బస్తీ బాయ్స్ అంటూ వెబ్ సిరీస్ ప్లాన్ చేశారు. ఈ క్రమంలో మొదటి ఎపిసోడ్ విడుదలైంది. రెండ్రోజుల క్రితం విడుదలైన మొదటి ఎపిసోడ్ ఇప్పటికీ యూట్యూబ్‌లో ట్రెండ్ అవుతూనే ఉంది. వన్ మిలియన్ వ్యూస్ క్రాస్ చేయడం, ఇంకా ట్రెండింగ్‌లోనే ఉండటం, తన యూట్యూబ్ చానెల్ సబ్ స్క్రైబర్స్ 500k దాటిపోవడంతో ఫుల్ సెలెబ్రేషన్స్ చేసుకున్నారు. అయితే బస్తీ బాయ్స్‌ను ఇంకా ప్రమోట్ చేసేందుకు నాగబాబు మరింత యాక్టివ్ అయ్యారు. ఈ మేరకు మీమర్స్ సాయం తీసుకునేందుకు భారీ ప్లాన్ వేశారు. నాగబాబుకు మీమ్స్ అన్నా, మీమ్స్ వేసేవాళ్లన్నా ఎంతో ఇష్టం. ఇది వరకే మీమర్స్‌తో నాగబాబు స్పెషల్‌గా ఇన్ స్టాలో లైవ్ పెట్టేశారు. ఆ సమయంలో అనేక మంది మీమ్ క్రియేటర్స్ నాగబాబుతో మాట్లాడారు. ఇప్పుడు నాగబాబు మీమర్స్ సాయంతో బస్తీ బాయ్స్‌ను మరింత ఫేమస్ చేయాలని చూస్తున్నారు. ఈ మేరకు ఓ కాంటెస్ట్ పెట్టేశారు. అందులో గెలిచిన వారికి ఐ ఫోన్ బహుమతిగా ఇస్తానని అన్నారు. మీమ్స్ అలెర్ట్.. మీమ్ వేస్కో .. ఐఫోన్ తీస్కో, బస్తీ బాయ్స్ అన్నీ ఎపిసోడ్స్ చూసి మీమ్స్ వేయండి.. హయ్యస్ట్ రీచ్ వచ్చిన మీమ్‌కి ఐఫోన్ ఇస్తాం.. ఈ కాంటెస్ట్ బస్తీ బాయ్స్ లాస్ట్ ఎపిసోడ్ వరకు ఉంటుంది..! మీమ్ డిస్క్రిప్షన్‌లో #basthiboysmemes అనే హ్యాష్ ట్యాగ్ ఇవ్వండని నాగబాబు చెప్పుకొచ్చారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2R9zFDU
v

‘నిజం చెప్పాలంటే నాకు అది కూడా చేతకాదు.. యువకులే నా కంటే బాగా చేస్తారు!!’ ఓపెన్ అయిన ప్రియమణి

ఒకప్పుడు తన అందచందాలతో తెలుగు సిల్వర్‌స్క్రీన్‌ని షేక్ చేసిన నటి . ‘పెళ్లైన కొత్తలో..’ సినిమాతో తెలుగు ప్రేక్షకులను అలరించిన ఈ బ్యూటీ.. ఆ తర్వాత వరుస ప్రాజెక్టులతో బిజీ అయింది. తెలుగులోనే కాక.. తమిళం, కన్నడం, మలయాళం ఇండస్ట్రీలో దాదాపు అందరు స్టార్ హీరోలతో నటించింది. అంతేకాక.. ‘పరుత్తివీరన్’ సినిమాతో జాతీయ అవార్డు కూడా సొంతం చేసుకుంది ప్రియమణి. కెరీర్‌‌ కాస్త స్లో కావడంతో సినిమాలకు కొంతకాలం బ్రేక్ వేసింది. ఇప్పుడ సెకండ్ ఇన్నింగ్స్‌ను పకడ్బందీగా ప్లాన్ చేసుకుంటుంది ప్రియమణి. సినిమాలతో పాటు కొన్ని వెబ్ సిరీస్‌లు కూడా చేస్తోంది. ఇప్పటికే ‘ది ఫ్యామిలీ మ్యాన్’ వెబ్‌సిరీస్‌తో మంచి గుర్తింపు తెచ్చుకుంది. తాజాగా ‘హిజ్ స్టోరీ’ అనే వెబ్‌సిరీస్‌లో నటించింది. సత్యదీప్ మిశ్రా ఈ సిరీస్‌లో ప్రధాన పాత్రలో నటించాడు. ఈ సిరీస్‌లో ప్రియామణి చెఫ్ పాత్రలో మనకి కనిపిస్తుంది. ఈ నెల 25న విడుదలైన ఈ సిరీస్‌కి ప్రేక్షకుల ఆదరణ లభించింది. అయితే దీని గురించి మాట్లాడుతూ.. ప్రియమణి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. వెబ్‌సిరీస్‌లో చెఫ్‌గా నటించిన ఆమెకు నిజానికి వంట చేయడం అస్సలు రాదట. ‘నాకు కోడిగుడ్డు ఉడికించడం కూడా రాదు. సెట్‌లో ఉన్న యువకులు నా కంటే బాగా వంట చేసేవాళ్లు. నేను వంట చేసే ప్రయత్నం చేస్తే.. వాళ్లు నవ్వుకునే వాళ్లు.. నాపై జోకులు వేసేవాళ్లు. కానీ, వెబ్‌సిరీస్‌లో చెఫ్‌గా నా నటనపై ప్రశంసలు వస్తుంటే చాలా సంతోషంగా ఉంది’ అని ప్రియమణి ఓ ఇంటర్వ్యూలో స్పష్టం చేసింది. ప్రస్తుతం ప్రియమణి ఫ్యామిలీ మ్యాన్-2 వెబ్‌సిరీస్ చేస్తోంది. ఇందులో సమంత కీలక పాత్రలో కనిపించనుంది. దీంతో పాటు తెలుగులో ‘విరాటపర్వం’, ‘నారప్ప’ సినిమాల్లో నటిస్తోంది ప్రియమణి. హిందీలో అజయ్ దేవ్‌గన్‌తో కలిసి ‘మైదాన్’ అనే సినిమాలో నటిస్తోంది ఆమె.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3aKprkk
v

ఆ రోజు కోసం ఎదురుచూస్తున్నా.. జాన్వీ కపూర్ లేటెస్ట్ పోస్ట్ వైరల్

అతిలోక సుందరి శ్రీదేవి కుమార్తె గురించి కొత్త పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ‘ధడక్’ సినిమాతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన జాన్వీ ఆ సినిమాతో ఊహించినంత సక్సెస్ అందుకోలేకపోయింది. ఇప్పటికీ సరైన బ్రేక్ కోసం ఎదురుచూస్తుంది. అయితే సినిమాలతో పాటు.. జాన్వీ సోషల్‌మీడియాలో యమా యాక్టివ్‌గా ఉంటుంది. హాట్ ఫోటోషూట్లు, హాలీడే పిక్స్‌తో కుర్రకారులో హీటెక్కిస్తు ఉంటుంది. లేటెస్ట్‌గా ఈ భామ హాలిడే ఫోటోలు సోషల్‌మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. అయితే ఇప్పుడు జాన్వీ.. ఒక రోజు కోసం ఎంతగానో ఎదురుచూస్తుందట. అది ఆమె సినిమా విడుదల తేదీనో.. మరో ముఖ్యమైన రోజో కాదు.. మే 1వ తేదీ కోసం. కరోనా వైరస్‌ను అడ్డుకొనేందుకు ప్రభుత్వం దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియను ఈ ఏడాది జనవరి 17వ తేదీన ప్రారంభించిన విషయం తెలిసిందే. మొదటి దశలో కరోనా వారియర్స్‌కి ఈ వ్యాక్సిన్ అందించగా.. అప్పటి నుంచి దశలవారీగా ఈ వ్యాక్సినేషన్‌ని కొనసాగిస్తున్నారు. ఇక మే 1వ తేదీ నుంచి దేశవ్యాప్తంగా 18 సంవత్సరాలు దాటిన ప్రతీ ఒక్కరికి వ్యాక్సిన్ అందిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. రెండో దశలో కరోనా వైరస్ వ్యాప్తి రోజురోజుకీ భయకరంగా పెరిగిపోతుంది. ప్రతీ రోజు దేశ వ్యాప్తంగా లక్షల సంఖ్యలో కేసులు నమోదు అవుతున్నాయి. దీంతో ప్రతీ ఒక్కరు వీలైనంత త్వరగా వ్యాక్సిన్ తీసుకోవాలని భావిస్తున్నారు. వ్యాక్సినేషన్ సెంటర్లకు వెళ్తున్న ప్రజలు తమ వంతు ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తున్నారు. ఇక జాన్వీ కూడా ఎప్పుడు వ్యాక్సిన్ తీసుకుంటానా అని ఎదురుచూస్తుందట. మే 1వ తేదీ గురించి తాను ఎంతగానో ఎదురుచూస్తున్నట్లు జాన్వీ పోస్ట్ చేసింది. అందుకు సంకేతంగా ఆమె రెండో ఫోటోలు కూడా షేర్ చేసింది. అంతేకాక.. ప్రతీ ఒక్కరు రిజిస్టర్ చేసుకొని.. వ్యాక్సిన్ తీసుకోవాలని సూచించింది. చివరిగా ‘గుంజన్ సక్సేనా’ అనే బయోపిక్‌తో ప్రేక్షకులను పలకరించిన జాన్వీ.. ప్రస్తుతం ‘రూహీ’, ‘దోస్తానా 2’ తదితర సినిమాల్లో నటిస్తోంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3aMl1cG
v

బాలయ్యతో సినిమాకి అన్ని కోట్లా.. అనిల్ రావిపూడి ఏం ప్లాన్ చేస్తున్నాడబ్బా..!

‘పటాస్’ సినిమాతో టాలీవుడ్‌లో తన కెరీర్‌ ప్రారంభించిన దర్శకుడు ఆ తర్వాత వరుసగా హిట్లు సాధించి.. స్టార్ డైరక్టర్ స్థానం సంపాదించుకున్నాడు. లేటెస్ట్‌గా సూపర్‌స్టార్ మహేశ్‌బాబు హీరోగా అనిల్ తెరకెక్కించిన ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా ఏ రేంజ్ సక్సెస్ సాధించిందో అందరికి తెలిసిందే. ఈ సినిమా తర్వాత కాస్త గ్యాప్ తీసుకున్న అతను.. తన సూపర్‌హిట్ చిత్రం ‘ఎఫ్2’కి సీక్వెల్‌గా ‘ఎఫ్‌3’ సినిమాని రూపొందిస్తున్నాడు. ఎఫ్‌2 కంటే రెట్టింపు కామెడీ, ఫన్‌తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ సినిమా తర్వాత అనిల్ రావిపూడి.. నందమూరి బాలకృష్ణతో ఓ సినిమా చేస్తున్నాడని ఫిలిమ్ నగర్‌లో వార్తలు వస్తున్నాయి. బాలకృష్ణ ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న హ్యాట్రిక్ చిత్రం ‘’లో నటిస్తున్నారు. ఇటీవల విడుదలైన ఈ సినిమా టైటిల్ రోల్‌కి విశేషమైన ఆదరణ లభించింది. తన కెరీర్‌లో తొలిసారిగా బాలకృష్ణ ఈ సినిమాలో ఆఘోరీ లుక్‌లో కనిపించనున్నారు. ఇక ఈ సినిమా తర్వాత మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌లో గోపిచంద్ మలినేని దర్శకత్వంలో ఆయన మరో సినిమా చేయనున్నారు. దీని తర్వాత బాలకృష్ణ, అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో సినిమా వస్తుందని టాక్. ఇప్పటికే అనిల్ రావిపూడి ఓ పవర్‌ఫుల్ స్క్రిప్ట్‌ని బాలకృష్ణకి వినిపించాడట. ఈ విషయాన్ని అనిల్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. అయితే బాలకృష్ణ నుంచి ఇంకా గ్రీన్ సిగ్నల్ రాలేదని సమాచారం. కానీ అనిల్ ఇప్పటికే ఈ సినిమాపై కసరత్తు ప్రారంభించాడట. తన రెగ్యులర్ సినిమాల్లా కాకుండా.. బాలకృష్ణ రేంజ్‌కు తగ్గట్లు సినిమాని ప్లాన్ చేస్తున్నాడట. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై దాదాపు రూ.75 కోట్ల బడ్జెట్‌తో ఈ సినిమా రూపొందనుందని సమాచారం. ఈ మధ్య కరోనా నుంచి కోలుకున్న అనిల్.. త్వరలో ‘ఎఫ్‌3’ సినిమా షూటింగ్‌లో పాల్గొననున్నాడు. ఆ సినిమా పూర్తయిన వెంటనే బాలయ్య-అనిల్ కాంబో సినిమాపై ప్రకటన వెలువడే అవకాశం ఉంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3xx5Bmo
v

వాటి సైజు ఎంత అని అడిగారు.. నా టీనేజ్ నుంచే అవన్నీ! అయితే ఏంటంటూ ఇలియానా ఓపెన్ కామెంట్స్

హీరోయిన్ల బాడీ షేమింగ్ గురించి నెటిజన్స్ కామెంట్స్ చేయడం కొత్తేమీ కాదు. టెక్నాలజీ ఎంత పెరుగుతుంటే సెలబ్రిటీలకు- సాధారణ ప్రజలకు మధ్యదూరం అంత తగ్గిపోతోంది. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ ద్వారా తమ మనసులో ఏముందో సెలబ్రిటీల ముందు పెట్టేసే అవకాశం ఉండటంతో కొంతమంది నెటిజన్స్ రెచ్చిపోతున్నారు. ముఖ్యంగా హీరోయిన్ల గురించి ఇబ్బందికర కామెంట్స్ చేస్తుండటం చూస్తూనే ఉన్నాం. గోవా బ్యూటీ ఇలియానాకు ఇలాంటి అనుభవాలు లెక్కలేనన్ని ఉన్నాయట. తాజాగా ఈ విషయాన్ని బయటపెడుతూ షాకింగ్ కామెంట్స్ చేసింది ఇల్లీ బేబీ. తన శరీరాకృతి గురించి ఎన్నోసార్లు వేధింపులు ఎదుర్కొన్నానని చెప్పింది. మానసిక వేదనకు గురైన సందర్భాలు కూడా చాలానే ఉన్నాయంటూ ఓపెన్ అయింది. తన టీనేజ్ నుంచే అలాంటి అనుభవాలను భరిస్తూ వస్తున్నానని, కొన్నిసార్లు మాటల్లో చెప్పలేని కామెంట్స్ చూశానని చెప్పింది. ఏకంగా నీ పిరుదుల సైజు ఎంత? సర్జరీ చేయించుకోవచ్చుగా అని మెసేజ్ పెట్టేవారని చెప్పుకొచ్చింది. సామజిక మాధ్యమాల్లో రోజూ తనకు వచ్చే మెసేజ్‌లలో కనీసం 10 మెసేజ్‌లు ఇలాంటివే ఉంటాయని చెబుతూ ఆవేదన వ్యక్తం చేసింది. కొన్ని సందర్భాల్లో అలాంటి మెసేజీలు చూసి తన మీద తనకే అసహ్యం కలిగిందని ఇలియానా పేర్కొంది. మహిళల్లో హార్మోన్ల లోపం వల్ల శరీరంలో చాలా రకాల మార్పులు వస్తుంటాయి.. అలాగని ఇలాంటి కామెంట్స్ చేయడం సరికాదని ఇలియానా అంటోంది. శారీరక సమస్యలే ఓ ఇబ్బంది అనుకుంటే నెటిజన్స్ పెట్టే ఈ కామెంట్స్ మరింత బాధపెడుతుంటాయని ఆమె తెలిపింది. ఒక్కొక్కరి శరీరాకృతి ఒక్కోలా ఉంటుంది. అది వారి లోపంగా భావించకూడదనే విషయాన్ని నెటిజన్లు తెలుసుకోవాలని ఇలియానా చెప్పింది. మొదట్లో ఇలాంటి కామెంట్స్ చూసి మానసికంగా కృంగిపోయా కానీ ఇప్పుడు మాత్రం అలాంటివి పట్టించుకోవడం మానేశానని ఆమె తెలిపింది. ఒకానొక సమయంలో టాలీవుడ్ ప్రేక్షకులను ఉర్రూతలూగించిన ఇల్లీ బేబీ.. ప్రస్తుతం బాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2QF7hK0
v

వేరే ఆలోచనలు పెట్టుకోకుండా వేయించుకోండి.. వరుణ్ తేజ్ పోస్ట్ వైరల్

ప్రస్తుతం కరోనా కోరల్లో చిక్కుకుని మన దేశం ఎంతలా సతమతమవుతుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇండియాను చూసి ప్రపంచ దేశాలు గడగడవణికిపోతోన్నాయి. ఇప్పటికే మన దేశం మీద ఎన్నో ఆంక్షలను విధించింది. ఇక్కడి వారు తమ దేశాలకు రాకుండా నిబంధనలు పెట్టారు. అలా మనదేశంలో కరోనా ఉధృతికి అడ్డు కట్ట వేసేందుకు అందరికీ వ్యాక్సిన్ వేసే కార్యక్రమాన్ని భారత ప్రభుత్వం చేపట్టింది. ఈ క్రమంలో కోవిన్ అనే యాప్, వెబ్ సైట్ ద్వారా 18 ఏళ్లు నిండిన ప్రతీ ఒక్కరూ రిజిస్ట్రేషన్ చేసుకోవాలని ప్రభుత్వం ప్రకటించింది. ఈ క్రమంలో ఈ కార్యక్రమాన్ని మరింత విజయవంతం చేసేందుకు సెలెబ్రిటీలు రంగంలోకి దిగారు. వ్యాక్సిన్ మీదున్న అపోహలను తొలగిస్తూ ప్రతీ ఒక్కరూ వ్యాక్సిన్ వేయించుకోవాలని సూచిస్తున్నారు. ఈక్రమంలో మెగా ప్రిన్స్ ఓపోస్ట్ పెట్టారు. మే 1 నుంచి దేశంలో 18 ఏళ్లు నిండిన ప్రతీ ఒక్కరికీ వ్యాక్సిన్ వేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఈ క్రమంలో అందరూ కూడా ఆన్ లైన్‌లో ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించింది. ఇందులో భాగంగా వరుణ్ తేజ్ పోస్ట్ చేస్తూ.. ఎక్కువగా ఆలోచించకండి.. వ్యాక్సిన్ వేయించుకోండి అని చెప్పుకొచ్చారు. అందరూ కూడా http://cowin.gov.inలో రిజిష్టర్ చేసుకోండని సూచించారు. వరుణ్ తేజ్ ప్రస్తుతం గని సినిమాతో బిజీగాఉన్నారు. కానీ ఈ సెకండ్ వేవ్ దెబ్బకు షూటింగ్‌లను క్యాన్సిల్ చేసుకున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3e1Hh4t
v

సిద్ధార్త్ నెంబర్ లీక్.. ‘తగ్గేదే లేదు.. అందరు ఆ పార్టీకి చెందిన వాళ్లే’.. అంటూ ట్వీట్

‘బాయ్స్’, ‘బొమ్మరిల్లు’ తదితర సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు చేరువయ్యాడు నటుడు సిద్ధార్త్. కూల్ లవ్ స్టోరీ సినిమాలతో లవర్‌ బాయ్ ఇమేజ్‌ని సంపాదించుకున్నాడు అతను. కెరీర్ ఆరంభంలో సూపర్ హిట్ సినిమాలతో కొనసాగిన అతని హవా.. ఆ తర్వాత స్లో అయింది. వరుస ఫ్లాప్‌లతో అతను సతమలమవుతున్నాడు. అయితే సినిమాలను పక్కనపెడితే.. సోషల్‌మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటాడు. తన వ్యక్తిగత విషయాలను పంచుకుంటూనే.. సామాజిక అంశాలపై కూడా అతను స్పందిస్తుంటాడు. ప్రస్తుతం కరోనా కారణంగా దేశవ్యాప్తంగా భయంకర వాతావరణం నెలకొంది. రెండో దశలో లక్షలాది మంది వైరస్ బారిన పడుతుండగా.. వేలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ సందర్భంలో సిద్ధార్త్ కేంద్రంలో అధికారంలో ఉన్న పని తీరును ప్రశ్నిస్తూ.. పలు ట్వీట్లు చేశారు. ప్రభుత్వ అసమర్థత కారణంగానే ఈ విపత్కర పరిస్థితులు నెలకొన్నాయంటూ అతను పేర్కొన్నాడు. దీంతో అతనికి ఆ పార్టీకి చెందిన వారి వైరం ఏర్పడింది. బీజేపీ పార్టీ శ్రేణులు సిద్ధార్త్‌కు వ్యతిరేకంగా పోస్ట్‌లు, ట్వీట్లు చేశారు. అయితే తాజాగా ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు అతని ఫోన్ నెంబర్‌ని లీక్ చేశారట. దీంతో తనకి పెద్ద ఎత్తున బెదిరింపు కాల్స్ వస్తున్నాయని సిద్ధార్త్ వెల్లడించాడు. ‘నా ఫోన్ నెంబర్‌ని తమిళనాడు బీజేపీకి చెందిన వ్యక్తులు లీక్ చేశారు. ఫలితంగా నన్ను నా కుటుంబాన్ని తిడుతు, హత్య, అత్యాచారం చేస్తామని బెదిరిస్తూ.. గత 24 గంటల్లో 500లకు పైగా బెదిరింపు కాల్స్ వచ్చాయి. ప్రతీ కాల్‌(బీజేపీ లింకులు, డీపీలు ఉన్న)ని రికార్డు చేసి పోలీసుకు అందిస్తున్నాను. నేను వెనకడుగు వేసేది లేదు. ఇంకా ప్రయత్నించడి’ అంటూ ట్వీట్‌లో పేర్కొన్నాడు. దీంతో పాటు అతను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాను తన ట్వీట్‌లో ట్యాగ్ చేశాడు. దీంతో పాటు తనకు ఎదురైన వేధింపులకు సంబంధించిన ఓ స్క్రీన్ షాట్‌ని కూడా అతను ట్వీట్ చేశాడు. ‘‘నా ఫోన్ నెంబర్ లీక్ చేసిన అనేక మంది బీజేపీ సభ్యుల పోస్ట్‌లలో ఇది ఒకటి. ‘ఇతను కచ్చితంగా నోరు మూసుకోవాలి’ అంటూ వాళ్లు నన్ను వేధిస్తున్నారు, నాపై దాడి చేస్తున్నారు. మనం కోవిడ్‌తో పోరాడగలం.. కానీ ఇలాంటి వాళ్లతో కాదు’ అంటూ సిద్ధార్త్ ట్వీట్ చేశాడు. మరి ఈ వివాదం ఎంత దూరం వెళ్తుందో వేచి చూడాలి.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3u3XQ5m
v

‘ఉప్పెన’లాంటి టీఆర్పీ.. నేషనల్ వైడ్ ట్రెండ్.. దుమ్ములేపిన క‌ృతి శెట్టి-వైష్ణవ్ తేజ్

సినిమా సృష్టించిన సంచలనాలు అన్నీ ఇన్నీ కావు. ఆడియో పరంగా సోషల్ మీడియాలో వందల మిలియన్లను కొల్లగొట్టేసింది. ఇక బాక్సాఫీస్ వద్ద వంద కోట్ల గ్రాస్ కొల్లగొట్టి దుమ్ములేపేసింది. అలా ఉప్పెన సినిమా ప్రతీ చోటా తన సత్తా చాటుకుంది. ఇప్పుడు బుల్లితెరపైనా తన హవాను చూపించింది. గత వారం బుల్లితెరపై వరల్డ్ ప్రీమియర్‌గా ప్రసారమైన ఉప్పెన అదిరిపోయే టీఆర్పీని సొంతం చేసుకుని ఆశ్చర్యపరిచింది. ఈ మేరకు తాజాగా ఉప్పెన సినిమా నేషనల్ వైడ్‌గా హాట్ టాపిక్ అవుతోంది. మెగా హీరో అనే ఇమేజ్‌తో వచ్చినా కూడా ఉప్పెన సినిమాలోని కథ, అతని నటన సాధారణ ప్రేక్షకులను సైతం ఆకట్టుకుంది. ఇక ముఖ్యంగా ఉప్పెన సినిమాకు అందాలు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. విజయ్ సేతుపతి లాంటి స్టార్ హీరోతో సినిమా స్థాయి పెరిగింది. ఇక బుచ్చిబాబు సానా తెరకెక్కించిన విధానం, కథ, కథనం, మాటలు అన్నీ కూడా అందరినీ ఆకట్టుకున్నాయి. మరీ ముఖ్యంగా దేవీ శ్రీ ప్రసాద్ అందించిన సంగీతం సినిమా విజయంలో కీలకంగా మారింది. అలా అందరూ కలిసి ఉప్పెన సినిమాను అద్భుతంగా మలిచారు. కరోనా లాంటి సమయంలోనూ ఉప్పెనలాంటి కలెక్షన్లు వచ్చాయి. వంద కోట్ల గ్రాస్ కొల్లగొట్టి ఈ ఏడాదికి మొదటి బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. అలాంటి ఉప్పెన ఇప్పుడు బుల్లితెర మీదా రచ్చ చేయడం ప్రారంభించింది. గత వారం స్టార్ మాలో ప్రసారమైన ఈ మూవీకి 18.5 టీఆర్పీ వచ్చింది. అలా వెండితెర మీద బ్లాక్ బస్టర్ అయిన ఉప్పెన బుల్లితెర మీదా రికార్డులు క్రియేట్ చేసింది. అంతే కాకుండా ఇప్పుడు నేషనల్ వైడ్‌గా ఉప్పెన ట్రెండ్ అవుతోంది. ఇక నెట్ ఫ్లిక్స్‌లోనూ ఉప్పెన దూసుకుపోతోంది. ఓ డెబ్యూ హీరోకు బుల్లితెర మీద ఇలాంటి టీఆర్పీ రావడం రికార్డ్ అంటూ నెటిజన్లు రచ్చ చేస్తున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3gMxGAc
v

మా నాన్న ఎవ్వరినీ మర్డర్ చేయలేదు.. కార్తీకదీపం శౌర్య కామెంట్స్ వైరల్

సీరియల్ గురించి తెలియని తెలుగు ప్రేక్షకులెవ్వరూ ఉండరు. బుల్లితెరపై కార్తీకదీపం సీరియల్‌ది ఓ చరిత్ర. టీఆర్పీ విషయంలో కొత్త రికార్డులను క్రియేట్ చేస్తూ కొన్నేళ్లుగా అప్రతిహతంగా దూసుకుపోతూనే ఉంది. మొన్నీ మధ్యనే కార్తీకదీపం వెయ్యి ఎపిసోడ్‌లను పూర్తి చేసేసుకుంది. అంతగా పాపులర్ అయిన ఈ సీరియల్‌లో ప్రతీ పాత్ర జనాలకు బాగా కనెక్ట్ అయింది. కార్తీక్, డాక్టర్ బాబు పాత్రలో నిరుపమ్.. వంటలక్క, దీపగా ప్రేమీ విశ్వనాథ్ ఎనలేని క్రేజ్‌ను సంపాదించుకున్నారు. పిల్లల పాత్రలతోనే ఇప్పుడు సీరియల్ దూసుకుపోతోంది. హిమగా సహృద, శౌర్యగా దుమ్ములేపుతున్నారు. ఈ పిల్లలిద్దరూ బుల్లితెరపైనే కాకుండా సోషల్ మీడియాలోనూ దూసుకుపోతోంటారు. డ్యాన్స్ వీడియోలు షేర్ చేస్తూ ఫాలోవర్లను పెంచుకుంటుంటారు. అయితే శౌర్యగా సీరియల్‌లో గడుసరిగా కనిపించే కృతిక సోషల్ మీడియాలో మాత్రం విభిన్నంగా ఉంటారు. పరులకు సాయం చేయాలనే ఆలోచనతో సేవా కార్యక్రమాలు చేస్తుంటారు. విరాళాలు, వృద్దాశ్రమాలు అంటూ చిన్నతనంలోనే ఎన్నో మంచి పనులు చేస్తుంటారు. అంతేకాకుండా తన ఫాలోవర్లకు రిప్లైలు ఇస్తూ నిత్యం యాక్టివ్‌గా ఉంటారు. తన మీద వచ్చే మీమ్స్, జోక్స్‌లను కృతిక ఎంజాయ్ చేస్తుంటారు. తాజాగా అలాంటి ఓ మీమ్‌పై కృతిక రియాక్ట్ అయ్యారు. ఉప్పెన సినిమాలోనే ఓ ఫేమస్ డైలాగ్‌తో క‌‌ృతికపై మీమ్ వేశారు. అబద్దాలు ఆడితే అమ్మాయిలు పుడుతారంటారు.. ఇంత అందంగా పుట్టిందంటే వాళ్ల నాన్న మినిమమ్ మర్డర్ అయిన చేసుంటాడు.. అని వైష్ణవ్ తేజ్ చెప్పే డైలాగ్‌ను కృతిక కోసం వాడేశారు. అలా తన గురించి, తన తండ్రి గురించి చేసిన ఈ మీమ్‌పై నవ్వుతూ అదిరిపోయేలా రిప్లై ఇచ్చారు. హహహ.. మా నాన్న ఎవ్వరినీ మర్డర్ చేయలేదు అని రిప్లై ఇచ్చారు. ప్రస్తుతం కృతిక ఇచ్చిన రిప్లై నెట్టింట్లో వైరల్ అవుతోంది. కృతిక బుల్లితెరపైనే కాకుండా వెండితెర మీద దూసుకుపోతోన్నారు. సరిలేరు నీకెవ్వరు సినిమాతో కృతికకు ఎక్కువగా గుర్తింపు వచ్చింది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3u74eZI
v

ప్రభాస్ అలా అనడం జీవితంలో మర్చిపోలేను.. సీక్రెట్ బయటపెట్టిన 'బాహుబలి' యాక్టర్

డార్లింగ్ ప్రభాస్.. స్టార్ వారసుడే అయినా సాధారణ స్థాయిలో వెండితెరపై ఆరంగేట్రం చేసి అంచెలంచెలుగా ఎదిగారాయన. టాలీవుడ్ స్టార్ హీరోగా కీర్తించబడుతూనే రాజమౌళి రూపొందించిన 'బాహుబలి' సినిమాతో వరల్డ్ స్టార్ అయ్యారు. అయితే ప్రభాస్‌తో పని చేసిన ఏ వ్యక్తి అయినా ఆయన గురించి చెప్పేది ఒక్కటే. చాలా సింపుల్ పర్సన్. ఎంత క్రేజ్ ఉన్నా ఒదిగిఉండే అతి కొద్దిమంది నటుల్లో ఆయన ఒకరు. అతని వ్యక్తిత్వాన్ని దగ్గరి నుంచి చూసిన చాలామంది చెప్పే మాటిది. ఈ నేపథ్యంలో తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో ప్రభాస్ గురించి మాట్లాడారు డబ్బింగ్ ఆర్టిస్ట్ . ''బాహుబలిలో నేనో చిన్న రోల్ చేశాను. అందులో కాలకేయుడితో యుద్ధానికి వెళ్లే ముందు మేకను బలిచ్చే సన్నివేశంలో 'యుద్ధానికి వెళ్లకపోతే అమ్మ ఆగ్రహిస్తుంది పెనుముప్పు తప్పదు యువరాజా' అనేది నా డైలాగ్‌. అయితే ఆ డైలాగ్‌ చెప్పేటప్పుడు చాలా గట్టిగా చెప్పాను. దీంతో ప్రభాస్ నా దగ్గరకు వచ్చి డార్లింగ్‌ ఏమనుకోకు.. డైలాగ్‌ కొంచెం మెల్లిగా చెప్పవా.. నా డైలాగ్ మరిచిపోతున్నాను అన్నారు. నా జీవితంలోనే ఈ ఫన్నీ ఇన్సిడెంట్ మర్చిపోలేను'' అని చెప్పారు ఆదిత్య. ప్రభాస్ ఎంతో మంచి వ్యక్తి అని, ఆయన లాంటి మంచి మనసున్న హీరోను లైఫ్‌లో ఇంత వరకు ఎప్పుడూ చూడలేదని ఆదిత్య అన్నారు. సెట్‌లో అందరితో ఆయన ఎంతో సరదాగా మెదులుతుంటారని, తనతో పనిచేసే అందరికీ సమ ప్రాధాన్యం ఇస్తారని చెప్పారు. నిజంగానే ఆయన డార్లింగ్‌ అంటూ ప్రభాస్ వ్యక్తిత్వాన్ని కొనియాడారు. కాగా 'సాహో' డిజాస్టర్ తర్వాత సినిమాల వేగం పెంచారు ప్రభాస్. ఇప్పటికే తన లేటెస్ట్ మూవీ 'రాధేశ్యామ్' మేజర్ పార్ట్ ఫినిష్ చేసిన ఆయన ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతున్న భారీ సినిమా 'సలార్' చకచకా కంప్లీట్ చేస్తున్నారు. దీంతో పాటు ఓం రౌత్ దర్శకత్వంలో 'ఆదిపురుష్', అలాగే నాగ్ అశ్విన్ దర్శకత్వంలో మరో సినిమాను లైన్‌లో పెట్టారు ఈ యంగ్ రెబల్ స్టార్.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3u56KiO
v

ప్రభాస్ దర్శకుడి కీలక నిర్ణయం.. ‘నేను సమ్మతిస్తున్నా..’ అంటూ అడివి శేష్ ట్వీట్

రెండో దశలో కరోనా మహమ్మారి ప్రజలపై విరుచుకుపడుతుంది. కొంచం ఏమరపాటుగా ఉన్నా.. వైరస్ అంటుకుంటుంది. వైరస్ సోకిన రోగులు సరైన వైద్య సదుపాయాలు లేక.. ఆక్సిజన్ కొరతతో వేలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ దశలో ప్రభుత్వం మరోసారి పెట్టే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. అయితే దీనిపై ఇప్పటివరకూ స్పష్టమైన ప్రకటన లేదు. ప్రస్తుతానికైతే.. నైట్ కర్ఫ్య, వారాంతపు లాక్‌డౌన్‌తో సరిపెట్టేశారు. కానీ, వైరస్ కట్టడికి మాత్రం లాక్‌డౌనే సరైన మార్గం అనే వాదనలు కూడా బలంగా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ‘మహానటి’ సినిమాతో సూపర్‌హిట్ అందుకొని.. ఇప్పుడు రెబల్ స్టార్ ప్రభాస్‌తో సినిమా చేస్తున్న దర్శకుడు కీలక నిర్ణయం తీసుకున్నాడు. ప్రభుత్వం లాక్‌డౌన్ విధించినా.. విధించకపోయినా.. వచ్చే రెండు వారాలు తనకి తాను వ్యక్తిగతంగా లాక్‌డౌన్ విధించుకోవాలని నిర్ణయం తీసుకుంటున్నట్లు పేర్కొన్నాడు. ‘‘ప్రభుత్వం ప్రకటించినా.. లేకున్నా.. వచ్చే రెండు వారాలు వ్యక్తిగతంగా లాక్‌డౌన్‌లో ఉండాలి. అయితే లాక్‌డౌన్ ఎందుకు అని ప్రశ్నించే ప్రతీ ఒక్కరు.. ఒకసారి హాస్పిటల్స్‌కు వెళ్లండి. దయచేసి గత నెల రోజులుగా అక్కడ వైద్యులు, సిబ్బంది పడుతున్న కష్టాలను గమనించండి. మనం అందరం వ్యాక్సిన్ వేయించుకొని.. డాక్టర్లకు కాస్త ఉపశమనం కలిగించాలి’’ అంటూ అతను ట్వీట్ చేశాడు. అయితే ఈ ట్వీట్‌పై భిన్నమైన స్పందనలు వస్తున్నాయి. కొందరు ఇది సరైన నిర్ణయం కాదు అంటూ పలువురు నెటిజన్లు సూచిస్తున్నారు. లాక్‌డౌన్ విధించిన నేపథ్యంలో చిరు వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు ఎదురుకోవడమే కాక.. సరైన ఆదాయం లేక ఆకలిలో మరణించే అవకాశం ఉందని అంటున్నారు. అయితే నాగ్ అశ్విన్ ట్వీట్‌కి ప్రముఖ నటుడు అడివి శేష్ మద్దతు ఇచ్చాడు. తాను తీసుకున్న నిర్ణయాన్ని సమ్మతిస్తున్నట్లు అతను రీ ట్వీట్ చేశాడు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/32ZERwM
v

7 డేస్.. 6 నైట్స్.. పెళ్లి తర్వాత ప్రముఖ నిర్మాత కొడుకు పక్కా ప్లాన్! తండ్రితో కలిసి స్కెచ్

సినీ వారసులన్నాక సినిమాల్లో నటించడమే కాదు సినిమా రంగానికి సంబంధించిన అన్ని కార్యక్రమాల్లో భాగమవుతుండటం చూస్తున్నాం. ముఖ్యంగా నేటితరం సినీ వారసులు ఇటు నటనా పరంగా అడుగులేస్తూనే వ్యాపార రంగంలోనూ దూసుకుపోతున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రముఖ నిర్మాత కుమారుడు, యంగ్‌ హీరో సుమంత్‌ అశ్విన్‌ కొత్త జర్నీ ప్రారంభించబోతున్నాడు. ఇటీవలే పెళ్లి చేసుకొని ఓ ఇంటివాడైన ఆయన ఇక నిర్మాతగా మారబోతున్నాడు. 'తూనీగ తూనీగ' అనే సినిమాతో అప్పుడెప్పుడో హీరోగా పరిచయం అయిన .. ఆ తర్వాత ఎన్నో చిత్రాల్లో నటించాడు. కానీ పెద్దగా ఫేమ్ సంపాదించుకోలేకపోయాడు. కేరింత, కొలంబస్, ఫ్యాషన్ డిజైనర్ సన్నాఫ్ లేడీస్ టైలర్, ప్రేమకథ చిత్రం 2, హ్యాపీ వెడ్డింగ్ వంటి యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్స్‌లో హీరోగా నటించిన ఆయన ఇక తండ్రి వారసత్వాన్ని పుచ్చుకుంటూ నిర్మాణ రంగంలోకి అడుగుపెడుతున్నారు. వైల్డ్ హనీ ప్రొడక్షన్స్ పేరుతో సొంత నిర్మాణ సంస్థను ప్రారంభించి ఓ ప్రయోగాత్మక చిత్రానికి శ్రీకారం చుడుతున్నాడు. నిర్మాతగా మొదటి సినిమాను కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపొందించబోతున్నాడట సుమంత్. ఈ సినిమాకి అనే ఆసక్తికర టైటిల్ ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు ఆయన తండ్రి ఎంఎస్‌ రాజు దర్శకుడిగా వ్యవహరించబోతున్నారు. గతేడాది 'డర్టీ హరి' అనే సినిమాకు దర్శకత్వం వహించారు ఎంఎస్‌ రాజు. సో.. చూడాలి మరి ఈ తండ్రీకొడుకుల '7 డేస్.. 6 నైట్స్' స్కెచ్ ఏ మేర వర్కవుట్ అవుతుందనేది!.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3u2pMq5
v

హీరోయన్‌‌ని ఫిక్స్ చేసిన శంకర్.. రామ్ చరణ్‌తో మరోసారి జతకట్టనున్న బాలీవుడ్ భామ

రామ్ చరణ్-శంకర్ కాంబినేషన్‌‌‌లో సినిమా గురించి ప్రేక్షకలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ కాంబినేషన్‌లో సినిమా అనగానే అంచనాలు తారాస్థాయికి చేరుకున్నాయి. సినిమా అంటే కేవలం భారీ బడ్జెట్, పెద్ద సెట్టింగ్‌లు మాత్రమే కాదు.. ఓ మంచి సందేశం కూడా ఉంటుంది. ఇప్పడు రామ్ చరణ్‌తో చేసే సినిమాని కూడా ఓ సందేశాత్మక చిత్రంగా రూపొందించే పనిలో ఉన్నారట శంకర్. శివాజీ, భారతీయుడు స్టైల్‌లో అవినీతిపై యుద్ధం చేసే పాత్రలో రామ్ చరణ్‌ని చూపించనున్నారట. ఇక ఈ సినిమాలో హీరోయిన్‌ని కూడా ఫిక్స్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ‘ఆర్ఆర్ఆర్’, ‘ఆచార్య’ సినిమాలతో బిజీగా ఉన్నాడు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఆచార్య.. ఈ మే 14న విడుదల కావాల్సింది. కానీ, రెండో దశలో కరోనా ఉదృతంగా వ్యాప్తి చెందుతుండటంతో సినిమా విడుదలను వాయిదా వేశారు. ఇక రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న ‘ఆర్ఆర్ఆర్’లో చరణ్.. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజుగా కనిపించనున్నాడు. ఈ సినిమా 2022 సంక్రాంతికి విడుదల కానుంది. ఈ సినిమాల తర్వాత చరణ్, శంకర్ సినిమా సెట్స్‌పైకి వెళ్లనుంది. సినిమాలో చరణ్ అవినీతిపై పోరాటం చేసే ఓ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నట్లు టాక్. ఇక చరణ్ సరసన హీరోయిన్‌గా కియారా అడ్వాణీని శంకర్ ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లో ‘వినయ విధేయ రామ’ డిజాస్టర్‌గా నిలిచింది. ఆ తర్వాత కియారా మళ్లీ టాలీవుడ్ పైపు చూడలేదు. అయితే శంకర్ చెప్పిన స్క్రీప్ట్ నచ్చడంతో కియారా ఈ సినిమాకు ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో అదిరిపోయే డైలాగ్స్ కోసం ప్రముఖ రచయిత వివేక్‌ని రంగంలోని దింపారట శంకర్. గతంలో మెర్సల్, దర్బార్, బిగిల్, ఇరంబు థిరై, సోరారై పొట్రూ తదితర సినిమాలకు ఆయన రచయితగా పని చేశారు. ఈ సినిమాకి కూడా మాస్, పవర్‌ఫుల్ డైలాగ్స్ అందించేందుకు శంకర్‌తో పాటు వివేక్ ఇప్పటికే పని ప్రారంభించారని తెలుస్తోంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/32ZsbGo
v

తప్పని పరిస్థితుల్లో వెనక్కి తగ్గిన వెంకటేష్.. నారప్ప రిలీజ్ వాయిదా.. అఫీషియల్ స్టేట్‌మెంట్

ప్రస్తుతం దేశంలో నెలకొన్న భయానక పరిస్థితులు ప్రతి ఒక్కరిలో ఆందోళన నింపుతున్నాయి. కరోనా సెకండ్ వేవ్ ఉదృతి అంతకంతకూ పెరుగుతూ వస్తుండటం దేశ ప్రజల్లో గుబులు పుట్టిస్తోంది. దీంతో ఇల్లు వదిలి బయటకు రాకపోవడం ఒక్కటే ఇందుకు నివారణ చర్య అని గడపదాటి ఎక్కడికీ వెళ్లడం లేదు జనం. ఈ పరిస్థితుల్లో థియేటర్స్ గేట్లకు మళ్ళీ తాళాలు పడ్డాయి. ఇప్పటికే పలు సినిమాల విడుదల వాయిదా వేశారు. తాజాగా ఆ లిస్టులో '' కూడా చేరింది. తమిళంలో ధనుష్ నటించిన 'అసురన్'కు రీమేక్‌గా తెలుగులో 'నారప్ప' మూవీ రూపొందిస్తున్నారు. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో విక్టరీ వెంకటేష్ హీరోగా నటిస్తుండగా.. ప్రియమణి హీరోయిన్‌గా నటిస్తోంది. సురేష్ ప్రొడక్షన్స్, వి క్రియేషన్స్ బ్యానర్లు సంయుక్తంగా సమర్పిస్తున్నాయి. సురేష్‌బాబు, కలైపులి ఎస్‌.థాను నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. వెంకీ కెరీర్‌లో 74వ సినిమాగా రాబోతున్న ఈ చిత్రం ఇప్పటికే షూటింగ్ ఫినిష్ చేసుకొని మే 14న రిలీజ్‌కి రెడీ అయింది. అయితే ఊహించని రీతిలో కరోనా దాడి మళ్ళీ ప్రారంభం కావడంతో 'నారప్ప' విడుదల వాయిదా వేస్తున్నట్లు అఫీషియల్‌గా ప్రకటించారు మేకర్స్. ఈ విషయాన్ని తెలుపుతూ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ పెట్టారు వెంకటేష్. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అందరి ఆరోగ్యం, రక్షణ దృష్టిలో పెట్టుకొని ఈ సినిమాను వాయిదా వేస్తున్నామని తెలిపారు. పరిస్థితులు చక్కబడ్డాక అతిత్వరలో చిత్రాన్ని మీ ముందుంచే ప్రయత్నం చేస్తామని అన్నారు. 'అందరం మాస్కులు ధరించి, బౌతిక దూరాన్ని పాటిస్తూ ఎవరికీ వారు జాగ్రత్తగా ఉండటమే మనం సమాజానికి చేసే గొప్ప సాయం' అని ఆయన పేర్కొన్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3t2zNlR
v

ఆ సూపర్‌హిట్ సినిమా రీమేక్ చేస్తున్న బెల్లంకొండ శ్రీనివాస్.. ఈసారైనా సక్సెస్ వరిస్తుందా..?

‘అల్లుడు శీను’ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు స్టార్ ప్రొడ్యూసర్ బెల్లంకొండ సురేశ్ కుమారుడు బెల్లంకొడ శ్రీనివాస్. తొలి సినిమా కాస్త ఫర్వాలేదు అనిపించినా.. ఆ తర్వాత వచ్చిన సినిమాలేవీ అతనికి మంచి సక్సెస్‌ని అందించలేకపోయాయి. లేటెస్ట్‌గా నబా నటేశ్, అనూ ఇమ్మాన్యుయేల్ హీరోయిన్లుగా ‘అల్లుడు అదుర్స్’ అంటూ ప్రేక్షకులను పలకరించాడు అతను. కానీ, ఈ సినిమా కూడా తీవ్రంగా నిరాశపరించింది. బాక్సాఫీస్ వద్ద బోల్తా పడిన ఈ సినిమా ఓటీటీల్లోనూ ప్రేక్షకులను అలరించలేకపోయింది. దీంతో బెల్లంకొండ శ్రీనివాస్‌కి మరోసారి నిరాశే ఎదురుదైంది. ప్రస్తుతం బాలీవుడ్ బాటపట్టాడు. రాజమౌళీ, ప్రభాస్ కాంబినేషన్‌లో తెరకెక్కిన సూపర్ హిట్ సినిమా ‘’ హిందీ రీమేక్‌లో అతను హీరోగా నటిస్తున్నాడు. పెన్ స్టూడియోస్ నిర్మాణంలో వి.వి.వినాయక్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. అయితే ఈ సినిమాకి సంబంధించి కూడా ఓ రూమర్ అప్పట్లో తెగ వైరల్ అయింది. బెల్లంకొండ శ్రీనివాస్ పక్కన చేసేందుకు బీ-టౌన్ హీరోయిన్‌లు ఆసక్తి చూపించలేదని వార్తలు సోషల్‌మీడియాలో చక్కర్లు కొట్టాయి. స్టార్ హీరోయిన్లు కైరా అద్వానీ, దిశా పటాని, శ్రద్ధా కపూర్ మేనేజర్లను శ్రీనివాస్ సినిమా మేకర్స్ సంప్రదించారట. కానీ, వీళ్లంతా బెల్లంకొండ వారి ఆఫర్‌ను తిరస్కరించారని టాక్ వినిపించింది. చివరిగా అనన్య పాండే ఈ సినిమాకు ఓకే చెప్పినట్లు సమాచారం. అయితే ఈ సినిమా తర్వాత మరోసారి తెలుగులో తన అదృష్టాన్ని పరీక్షించుకొనేందుకు శ్రీనివాస్ సిద్ధమయ్యాడు. అందుకు ఓ సూపర్ హిట్ సినిమా కోసం అతను ఇంతకాలం ఎదురుచూశాడట. తమిళంలో ధనుష్ నటించిన ‘కర్ణన్’ సినిమాని శ్రీనివాస్ త్వరలో తెలుగులో రీమేక్ చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే బెల్లంకొండ సురేశ్ ఈ సినిమాపై హక్కులు కొన్నారట. దీంతో ఈ సినిమా తెలుగు రీమేక్‌ పక్కా అని వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. సినిమాకు మారి సెల్వరాజ్ దర్శకుడు. ఈ సినిమా దళిత బహుజన ఐడియాలజీ నేపథ్యంలో తెరకెక్కింది. ఈ సినిమా తెలుగు రీమేక్‌తో శ్రీనివాస్ బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టడం పక్కా అని సన్నిహితులు అంటున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3t3nBRO
v

Wednesday 28 April 2021

Pawan Kalyan: హరి హర వీరమల్లుపై అనుమానాలు.. ఇదే జరిగితే పవన్ ఫ్యాన్స్‌కి పండగే పండగ!!

రీ- ఎంట్రీ తర్వాత పవర్ స్టార్ మంచి ఫామ్‌లో ఉన్నారు. ఇప్పటికే 'వకీల్ సాబ్' సినిమాతో భారీ సక్సెస్ అందుకున్న ఆయన వరుస సినిమాలను లైన్‌లో పెట్టారు. అందులో ఒకటి ''. జాగర్లమూడి దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. శరవేగంగా షూటింగ్ జరిపి వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ మూవీ రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు మేకర్స్. అయితే దేశంలో కరోనా సెకండ్‌ వేవ్‌ ఉదృతి పెరగడంతో ఈ సినిమా రిలీజ్ డేట్‌పై అనుమానాలు నెలకొన్నాయి. ప్రస్తుతం కరోనా సెకండ్‌ వేవ్‌ వీరవిహారం చేస్తుండటంతో పలు సినిమాల షూటింగ్స్ స్వచ్ఛందంగా వాయిదా వేశారు దర్శకనిర్మాతలు. కొన్ని సినిమాల విడుదల తేదీలను సైతం మార్చేశారు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ 'హరి హర వీరమల్లు' సినిమా కూడా వాయిదా వేశారనే వార్తలు వస్తున్నాయి. తాజాగా వీటిపై స్పందించారు నిర్మాత ఎ.ఎం.రత్నం. ''అనుకున్నట్లుగా వచ్చే ఏడాది సంక్రాంతికే ఈ సినిమా తెరపైకి వస్తుంది. ఎన్ని అడ్డంకులొచ్చినా అనుకున్న సమయానికి షూటింగ్ పూర్తి చేస్తారు డైరెక్టర్ క్రిష్‌. పైగా సంక్రాంతికి ఇంకా చాలా సమయం ఉంది కాబట్టి ఈ మూవీ రిలీజ్ గురించి అనుమానాలు అవసరం లేదు'' అని ఆయన చెప్పారు. 17వ శతాబ్దం నేపథ్యంలో పీరియాడికల్‌ డ్రామాగా ఈ 'హరి హర వీరమల్లు' ప్రేక్షకుల ముందుకు రానుంది. పాన్‌ ఇండియా తెరకెక్కుతున్న ఈ సినిమాను ఎ.ఎం.రత్నం సమర్పణలో ఎ.దయాకర్‌ రావు నిర్మిస్తున్నారు. పవన్ సరసన ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తోంది. బాలీవుడ్‌ నటుడు అర్జున్‌ రాంపాల్‌ ఆరో మొఘల్‌ చక్రవర్తి ఔరంగజేబు పాత్రలో కనిపించబోతున్నారు. ఈ సినిమాపై పవన్ ఫ్యాన్స్ ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. సో.. చెప్పినట్లుగా సంక్రాంతికే సినిమా రిలీజ్ చేస్తే పవన్ ఫ్యాన్స్‌కి ఇక పండగే పండగ.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3dZpESQ
v

అర్ధరాత్రి వేళ కూతురుతో సురేఖా వాణి రచ్చ.. ఫుల్లుగా ఎంజాయ్! ఆయన ఫొటో ముందు పెట్టుకొని..

సురేఖా వాణి.. అబ్బో! ఈ నటీమణి గురించి ఎంత చెప్పినా తక్కువేనండోయ్. పేరుకు క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయినా హీరోయిన్లను మించిన ఫాలోయింగ్ తెచ్చుకుంది ఈ యాక్ట్రెస్. అక్క, వదిన, ఆంటీ పాత్రలతో వెండితెరపై అలరించడమే కాదు సోషల్ మీడియాను దున్నేస్తూ నేటితరం ఆడియన్స్‌కి కిక్కివ్వడమూ సురేఖా వాణికి తెలుసు. ఎప్పటికప్పుడు ట్రెండ్ ఫాలో అవుతూ తన కూతురు సుప్రితతో కలిసి రచ్చ చేస్తుంటుంది సురేఖ. అందుకే ఆమె సోషల్ మీడియా ఖాతాలకు యమ డిమాండ్. నిత్యం తన లేటెస్ట్ అప్‌డేట్స్ పోస్ట్ చేస్తూనే కూతురు సుప్రితతో దిగిన ఫొటోలు, డాన్స్ వీడియోలు షేర్ చేస్తూ నెటిజన్లను అట్రాక్ట్ చేస్తుంటుంది సురేఖావాణి. ఈ క్రమంలోనే గత రాత్రి ఇంట్లో చేసిన ఎంజాయ్ తాలూకు ఫొటోలు షేర్ చేసింది. నేడు (ఏప్రిల్ 29) తన పుట్టినరోజు సందర్భంగా కూతురు , అత్యంత సన్నిహితులతో కలిసి చిల్ అయింది . కూతురు సమక్షంలో కేక్ కట్ చేసి సంబరాలు చేసుకుంది. అయితే ఈ వేడుకలో తనకెంతో ఇష్టమైన భర్త సురేష్ తేజను మాత్రం విడిచిపెట్టలేదు. ఆయన ఫొటోను కేక్ ముందు పెట్టుకొని మరోసారి ప్రేమను చాటుకుంది. ఈ మేరకు తన పుట్టినరోజు ఏర్పాట్లన్నీ చేసి ఇంత గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసినందుకు కూతురు సుప్రితకు ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పింది సురేఖా వాణి. నా జీవితంలో నిన్ను మించిన ఆస్తి, ఆనందం ఇంకోటి లేదంటూ కామెంట్ చేసింది. దీంతో సురేఖా వాణి బర్త్ డే సెలబ్రేషన్స్ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. గతేడాది సురేఖా వాణి భర్త సురేష్ తేజ మరణించిన సంగతి మనందరికీ తెలుసు. అప్పటినుంచి కూతురుతో కలిసి ఉంటూ ఒంటరి జీవితం గడుపుతున్న ఆమె.. ఇటీవలి కాలంలో తన రెండో పెళ్లిపై వచ్చిన వార్తలను ఖండించింది. ఇదే విషయమై ఆమె కూతురు సుప్రిత కూడా ఘాటుగానే రియాక్ట్ అయింది. నిజానిజాలు తెలుసుకోకుండా ఇష్టమొచ్చిన వార్తలు రాస్తే అది జర్నలిజం అనిపించుకోదంటూ మీడియాపై మండిపడింది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2QwRjlh
v

సినిమా రౌండప్: రమ్యకృష్ణ సెకండ్ డోస్.. నయనతార డేరింగ్.. అజయ్ దేవ్‌గణ్ ఆపన్న హస్తం

కరోనా వ్యాక్సిన్ తీసుకున్న ఓ వైపు కరోనా విజృంభణ కొనసాగుతుంటే మరోవైపు దాని నివారణలో భాగంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతంగా జరుగుతోంది. అయితే తాను కరోనా సెకండ్ డోస్ వ్యాక్సిన్ కూడా తీసుకున్నానని తెలుపుతూ రమ్యకృష్ణ ట్వీట్ చేసింది. యంగ్ హీరోయిన్ ప్యాకప్ యంగ్ హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ తన లేటెస్ట్ మూవీ ‘అఖండ’ షెడ్యూల్‌ పూర్తి చేసుకొని ప్యాకప్‌ చెప్పేసింది. ఈ మేరకు స్టైల్‌గా నడుస్తున్న పిక్ షేర్ చేసింది. నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఈ మూవీ రూపొందుతోంది. డేరింగ్ అంతా కరోనాకు భయపడి షూటింగ్స్ రద్దు చేస్తుంటే రజినీకాంత్ ‘అన్నాత్తే’ షూటింగ్ మాత్రం శరవేగంగా సాగుతోంది. ఈ షూటింగ్ నిమిత్తం హైదరాబాద్ చేరుకుంది నయనతార. కరోనా పరిస్థితుల్లో కూడా ఆమె హైదరాబాద్ ల్యాండ్ కావడం నిజంగా డేర్ అంటున్నారు నెటిజన్స్. రూటు మార్చిన సెలబ్రిటీలు తమ తమ సినిమాల ప్రమోషన్స్‌ కోసం సోషల్‌ మీడియాను ఉపయోగించుకునే సినీ సెలబ్రిటీలు రూటు మార్చారు. ప్రమోషన్‌ కన్నా ప్రజా సేవే మిన్న అని మూకుమ్మడిగా ముందుకు కదులుతున్నారు. కోవిడ్ బాధితులకు ఆక్సిజన్‌, హాస్పిటల్ బెడ్స్‌, ప్లాస్మా తదితర విషయాల కోసం మాత్రమే తమ సోషల్ మీడియా హ్యాండిల్స్ వాడుతున్నారు. ఆపన్న హస్తం కరోనా మహమ్మారి విలయతాండవంలో మీకు మేము అండగా నిలుస్తాం అంటూ సెలబ్రిటీలు ఒక్కొక్కరుగా ముందుకొస్తున్నారు. బాలీవుడ్ హీరో అజయ్ దేవ్‌గణ్ తన ఎన్‌వై ఫౌండేషన్స్ ద్వారా ముంబై లోని శివాజీ పార్క్‌లో అత్యవసర వైద్య సేవల విభాగాన్ని ఏర్పాటు చేసేందుకు ఆర్థిక సాయం అందించారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3aQs04i
v

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...