Sunday 28 February 2021

Golden Globe Awards 2021: విజేతల వివరాలు చూస్తే..

ప్రతిష్టాత్మక గోల్డెన్ గ్లోబ్ 2021 అవార్డుల వేడుకలు అమెరికాలో జరుగుతున్నాయి. కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఎప్పటి మాదిరిగా తారల సందడి కనిపించకపోవడంతో ఈ 78వ గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ ఫంక్షన్ కాస్త బోసిపోయిట్లుగా ఉంది. ఈ కార్యక్రమాన్ని న్యూయార్క్‌లోని రెయిన్బో రూమ్, లాస్ ఏంజిల్స్‌లోని బెవర్లీ హిల్స్‌లోని బెవర్లీ హిల్టన్ నుంచి టీనా ఫే, అమీ పోహ్లెర్ నిర్వహిస్తున్నారు. టీవీ, సినిమా రంగాల్లోని ఉత్తమమైన కంటెంట్, నటన, ప్రతిభ ఆధారంగా ఈ అవార్డులకు విజేతలను ఎంపిక చేస్తారు. మరి ఈ ఏడాది గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ ఎవరెవరికి వరించాయో చూద్దామా.. ఉత్తమ చిత్రం: నోమ్యాడ్‌ల్యాండ్ ఉత్తమ కామెడీ/ మ్యూజికల్ చిత్రం: బోరాట్ సబ్‌సీక్వెంట్ మూవీ ఫిలిం ఉత్తమ టెలివిజన్ సిరీస్ డ్రామా: ది క్రౌన్ ఉత్తమ నటుడు డ్రామా: చాడ్‌విక్ బోస్‌‌మెన్ (మా రైనీస్ బ్లాక్ బాటమ్) ఉత్తమ నటి డ్రామా: ఆండ్రా డే ( ది యునైటెడ్ స్టేట్స్ వర్సెస్ బిల్లీ హాలీడే) ఉత్తమ నటుడు కామెడీ/ మ్యూజికల్ చిత్రం: సాచా బారోన్ కోహెన్ (బోరాట్ సబ్‌సీక్వెంట్ మూవీ ఫిలిం) ఉత్తమ సహాయ నటి: జోడి ఫాస్టర్ (ది మారిటానియన్) ఉత్తమ విదేశీ చిత్రం: మినారీ


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3szb74I
v

హీరోయిన్ పూజా హెగ్డే ఇంట విషాదం.. బామ్మ మృతితో ఎమోషనల్ అయిన బుట్టబొమ్మ

పలు టాలీవుడ్, బాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉన్న హీరోయిన్ నెలకొంది. పూజా బామ్మ మరణించారు. ఈ విషయాన్ని స్వయంగా తన సోషల్ మీడియా ఖాతా ద్వారా వెల్లడించిన పూజా.. ఆమెను తలచుకుంటూ ఎమోషనల్ కామెంట్స్ చేసింది. ''ఈ క్యూటీని మేం కోల్పోయా. కష్టాల్లో ఉన్నా న‌వ్వుతూనే ఉండాల‌ని ఆమె మాకు నేర్పించింది. ధైర్యంగా ఉండ‌డం, కావ‌ల‌సిన వారి కోసం ఈగోల‌ను ప‌క్క‌న పెట్ట‌డం అన్నీ అలవాటు చేసింది. నా బామ్మ ఎప్పుడు నాతోనే ఉంటుంది. ల‌వ్ యూ ఆజీ. నీ ఆత్మ‌కు శాంతి చేకూరాల‌ని మ‌న‌స్పూర్తిగా ప్రార్ధిస్తున్నాను'' అని పేర్కొంటూ బామ్మపై ఉన్న ఇష్టాన్ని వెల్లడించింది పూజా. పూజా హెగ్డే సినిమాల విషయానికొస్తే.. ఇటీవలే 'అల.. వైకుంఠపురములో' సినిమాతో సూపర్ సక్సెస్ అందుకున్న ఆమె, ప్రస్తుతం ప్రభాస్ సరసన 'రాధేశ్యామ్' సినిమాలో నటిస్తోంది. రాధాకృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ భారీ సినిమాను పీరియాడికల్ లవ్ స్టోరీగా ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. జూలై 30వ తేదీన ఈ సినిమా విడుదల కానుంది. దీంతో పాటు అక్కిని అఖిల్ సరసన 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్' మూవీలో నటిస్తోంది పూజా.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3sEj34S
v

18 ఏళ్ల వయసులో తొలి ముద్దు.. ఆ హీరో ప్రేమలో! డేటింగ్ సీక్రెట్స్‌ ఓపెన్‌‌గా చెప్పిన పరిణితి చోప్రా

హీరో హీరోయిన్లకు లవ్ ఎఫైర్స్, డేటింగ్స్ అనేవి కామనే అని అనుకుంటాం. మరీ ముఖ్యంగా బాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ కల్చర్ చాలా ఎక్కువ. కానీ తాను మాత్రం ఎప్పుడూ డేట్‌కి వెళ్లలేదని చెబుతోంది బాలీవుడ్ హీరోయిన్ . ఆమె లేటెస్ట్ మూవీ ‘ది గర్ల్‌ ఆన్‌ ది ట్రైన్‌’ ప్రమోషన్స్‌లో భాగంగా కొన్ని సీక్రెట్స్ బయటపెట్టింది పరిణితి. ‘డూ యూ రిమెంబర్‌’ అనే ఛాలెంజ్‌లో పాల్గొన్న ఆమె.. తన తొలిముద్దు అనుభవాన్ని పేర్కొంటూ ఓపెన్ అయింది. చిన్నతనంలో ఉన్నప్పుడు సైఫ్‌ అలీఖాన్‌ను తాను ఎంతగానో ప్రేమించానని, తనకు 18 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు ఒకరిని ముద్దు పెట్టుకున్నానని.. అయితే అదే తన తొలిముద్దు పరిణితి చోప్రా వెల్లడించింది. ఇకపోతే తాను ఎప్పుడూ, ఎవ్వరితో డేట్‌కి వెళ్లలేదని చెప్పుకొచ్చింది ఈ బ్యూటీ. తాను హీరోయిన్‌గా చేసిన తొలి సినిమా ‘లేడీస్‌ వర్సెస్‌ రిక్కీబాల్‌’ విడుదలైన తర్వాత ఓ అభిమాని నుంచి ఓ పుస్తకం స్పెషల్‌ గిఫ్ట్‌గా వచ్చిందని, అన్నీ లేఖలే ఉన్న ఆ పుస్తకం తనకెంతో ప్రత్యేకంగా అనిపించిందని పేర్కొంది. పరిణితి చోప్రా నటించిన ‘ది గర్ల్‌ ఆన్‌ ది ట్రైన్‌’ మూవీ రిభూ దాస్‌ గుప్తా దర్శకత్వంలో రూపొందింది. రిలయన్స్ ఎంటర్‌టైన్‌‌మెంట్స్ పతాకంపై చిత్రీకరించిన ఈ మూవీని ఇటీవలే ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌పై రిలీజ్ చేశారు. దీంతో పాటు పలు బాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉన్న పరిణితి చోప్రా.. భారత బ్యాట్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న సినిమాలో నటిస్తోంది. 'సైనా' అనే పేరుతో రాబోతున్న ఈ మూవీ కోసం ప్రత్యేకంగా బ్యాట్మింటన్‌లో శిక్షణ తీసుకుంది పరిణితి.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2NPxWSP
v

రేయ్ రేయ్.. పేరు మార్చేయ్ ఇక! అల్లరి నరేష్‌పై నాని కామెంట్స్ వైరల్

స్నేహితులన్నాక 'ఏరా.., ఒరేయ్' అని పిలుచుకోవడంలో ఉన్న మజానే వేరు. సాధారణ ప్రజలు మొదలుకొని సెలబ్రిటీల దాకా స్నేహం విలువ, ఆ పిలుపులో తేడా అనేది ఉండదు. అయితే టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి కొంతమంది హీరోల్లో ఏరా.. అని పిలుచుకునేంత స్నేహ బంధం ఉంది. తాజాగా నాచురల్ స్టార్ అలాంటి చనువుతోనే అల్లరి నరేష్‌పై చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తెలుగు చిత్రసీమలో కామెడీ పండిస్తూనే హీరోగా రాణిస్తూ కెరీర్ కొనసాగిస్తున్నారు అల్లరి నరేష్. అప్పుడప్పుడూ విలక్షణ పాత్రల్లో నటించి తన నటనా ప్రతిభను చాటుకున్న ఈ అల్లరోడు.. చాలా ఏళ్లకు '' రూపంలో బిగ్గెస్ట్ హిట్ ఖాతాలో వేసుకున్నారు. ఇటీవలే రిలీజ్ అయిన ఈ సినిమా లాభాల బాటలో కొనసాగుతోంది. ఈ మూవీలో అల్లరి నరేష్ కనబర్చిన నటనపై సర్వత్రా ప్రశంసలు దక్కుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా 'నాంది' చూసిన హీరో నాని ట్విట్టర్ ద్వారా రియాక్ట్ అయ్యారు. ఇక నీ భవిష్యత్తంతా బంగారుబాటే అన్నట్లుగా హింట్ ఇస్తూ ట్వీట్ చేశారు. ''మొత్తానికి ‘నాంది’ సినిమా చూశాను. రేయ్‌ రేయ్‌ రేయ్‌.. ‘’ పేరు మార్చేయ్‌ ఇంక.. అల్లరి గతం.. భవిష్యత్తుకు ఇది నాంది. నీలో ఓ గొప్ప నటుడిని చూశాను. చాలా సంతోషంగా అనిపిస్తోంది. ఇకపై ఇలాంటివి నీ నుంచి మరిన్ని రావాలని కోరు కుంటున్నాను'' అని పేర్కొంటూ ట్వీట్ చేశారు నాని. దీంతో ఈ ట్వీట్ క్షణాల్లో వైరల్ కావడం జరిగింది. నాని ఫ్యాన్స్ పెద్దఎత్తున స్పందిస్తూ అల్లరి నరేష్ నటనను మెచ్చుకుంటూ కామెంట్స్ పెడుతున్నారు. కొత్త దర్శకుడు విజయ్‌ కనకమేడల రూపొందించిన ఈ 'నాంది' సినిమాను ఎస్వీ 2 ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై సతీష్‌ వేగేశ్న నిర్మించారు. వ‌ర‌ల‌క్ష్మీ శ‌ర‌త్‌కుమార్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం ఫిబ్రవరి 19న విడుదలై సూపర్ హిట్ సాధించింది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/301IDo6
v

అల్లు అర్జున్ బర్త్ డేపై కన్నేసిన సుకుమార్.. బన్నీ అభిమానుల కోసం స్పెషల్ సర్‌ప్రైజ్!!

సాధారణంగా హీరో హీరోయిన్ల బర్త్ డే అంటే వారి వారి సినిమాల స్పెషల్ అప్‌డేట్స్ ఇస్తుంటారు మేకర్స్. అలాంటిది ఆ ఛాన్స్ లాంటి క్రియేటివ్ డైరెక్టర్‌కి వస్తే ఊరుకుంటారా? అది కూడా లాంటి స్టార్ హీరోతో!. వచ్చే నెలలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పుట్టిన రోజు రాబోతోంది. ఓ వైపు ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ '' మూవీ రూపొందుతోంది. ఈ నేపథ్యంలో సుకుమార్ భారీ గానే ప్లాన్ చేశారట. బన్నీ అభిమానుల కోసం స్పెషల్ సర్‌ప్రైజ్ రెడీ చేయాలని ఫిక్స్ అయ్యారట. అల్లు అర్జున్ ఫ్యాన్స్‌కి స్పెషల్ డే కాబట్టి తన సర్‌ప్రైజ్ కూడా ఆ రేంజ్ లోనే ఉండాలని ఇప్పటి నుంచే ప్లాన్స్ స్టార్ట్ చేశారట సుక్కు. ఎంతో ప్రతిష్టాత్మకంగా తాను రూపొందిస్తున్న 'పుష్ప' మూవీ నుంచి విజువల్ ట్రీట్ ఇవ్వాలని డిసైడ్ అయిన సుకుమార్, చిత్రయూనిట్ అందరితో కలిసి ఆ పనులు మొదలు పెట్టేశారని తెలుస్తోంది. ఆ విజువల్ ట్రీట్ మరేంటో కాదు.. 'పుష్ప' టీజర్. గతంలో ఎన్నడూ చూడని విధంగా తన క్రియేటివిటీకి పదును పెడుతూ ఈ టీజర్ కట్ చేయాలని చూస్తున్నారట సుక్కు. 'రంగ‌స్థ‌లం'తో బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ అందుకున్న సుకుమార్ ఇప్పుడు 'పుష్ప'తో రంగంలోకి దిగుతున్నారు. ''ఆర్య‌, ఆర్య 2'' లాంటి సూపర్ హిట్స్ అందుకున్న బన్నీ- సుకుమార్ కాంబోలో రాబోతున్న సినిమా కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. పాన్ ఇండియా మూవీగా రూపొందుతోన్న ఈ చిత్రంలో లారీ డ్రైవర్ పుష్పరాజ్ పాత్రలో బన్నీ నటిస్తుండగా.. ఆయన సరసన రష్మిక మందన హీరోయిన్‌గా నటిస్తోంది. ఎర్ర‌చంద‌నం స్మ‌గ్లింగ్ నేప‌థ్యంలో మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఆగ‌స్ట్ 13న తెలుగు, త‌మిళ, హిందీ, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో రిలీజ్ చేయాలనేది మేకర్స్ ప్లాన్.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3syNlFW
v

రామ్ సమక్షంలో అవినాష్, అరియానా డ్యాన్స్.. బిగ్ బాస్ జంట రొమాంటిక్ షో!

‘జబర్దస్త్’ షో ద్వారా పాపులర్ అయిన ‘ముక్కు’ అవినాష్.. బిగ్ బాస్ సీజన్ 4లో పాల్గొనడం ద్వారా తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యాడు. ముఖ్యంగా ఈ షోలో అరియానా గ్లోరీతో అవినాష్ కెమిస్ట్రీ బాగా పండింది. అవినాష్ కోసం అరియానా ఏడ్వడం.. అవినాష్ ఊరుకోబెట్టడం.. ఇదంతా చూసిన ప్రేక్షకులు వాళ్లిద్దరి మధ్య ఏదో ఉందని అనుకోవడం ఇవన్నీ తెలిసిన విషయాలే. బిగ్ బాస్ షో నుంచి బయటికి వచ్చిన తరవాత కూడా వీళ్లిద్దరూ తమ ఫ్రెండ్‌షిప్‌ను కొనసాగిస్తున్నారు. అయితే, ఈ జంట తాజాగా ‘ఎ1 ఎక్స్‌ప్రెస్’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో సందడి చేసింది. సందీప్ కిషన్ హీరోగా రూపొందిన చిత్రం ‘ఎ1 ఎక్స్‌ప్రెస్’. టాలీవుడ్‌లో రూపొందిన తొలి హాకీ ఫిల్మ్‌ ఇది. ఈ చిత్రం ద్వారా షార్ట్ ఫిలిం మేకర్ డెన్నిస్ జీవ‌న్ క‌నుకొల‌ను ద‌ర్శకుడిగా ప‌రిచ‌య‌మ‌వుతున్నారు. లావ‌ణ్య త్రిపాఠి హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ‌, అభిషేక్ అగ‌ర్వాల్ ఆర్ట్స్‌, వెంక‌టాద్రి టాకీస్ ప‌తాకాల‌పై టి.జి.విశ్వప్రసాద్‌, అభిషేక్ అగ‌ర్వాల్‌, సందీప్ కిష‌న్‌, ద‌యా ప‌న్నెం సంయుక్తంగా నిర్మించారు. మార్చి 5న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ చిత్ర ప్రచారంలో భాగంగా ఆదివారం హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ‘ఎ1 ఎక్స్‌ప్రెస్’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా రామ్ పోతినేని విచ్చేశారు. సుమ కనకాల వ్యాఖ్యాతగా వ్యవహరించిన ఈ ఈవెంట్‌లో అవినాష్, అరియానా అదనపు ఆకర్షణ అయ్యారు. అయితే, వీరిద్దరితో ఒక పాటకు డ్యాన్స్ వేయించారు. ‘ఎ1 ఎక్స్‌ప్రెస్’ సినిమా నుంచి పాపులర్ అయిన ‘అమిగో’ పాటకు అవినాష్, అరియానా డ్యాన్స్ చేశారు. రామ్, సందీప్ కిషన్, లావణ్య.. వీరిందరి ముందు అవినాష్, అరియానా జంట డ్యాన్స్ చేసింది. అయితే, ఈ నృత్య ప్రదర్శన పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. వీళ్ల నృత్య ప్రదర్శన చూసి రామ్ కూడా నవ్వుకున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3uyYWqi
v

తన సినిమాలో నటించిన మల్లయోధులను సన్మానించిన పవన్ కళ్యాణ్

తన సినిమాలో నటించే స్టంట్‌మెన్, ఫైటర్స్‌ను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ ఎప్పుడూ గౌరవిస్తూ ఉంటారు. ‘గబ్బర్ సింగ్’ విలన్ గ్యాంగ్‌‌‌ను ఆయన ఏ విధంగా సత్కరించారో గతంలో చూశాం. ఆ గ్యాంగ్‌లో ఉన్న ప్రతి ఒక్క ఆర్టిస్ట్ పవన్ కళ్యాణ్‌ను దేవుడిలా కొలుస్తారు. అయితే, తాజాగా పవన్ కళ్యాణ్ మరోసారి తన సినిమాలో నటించిన ఫైటర్స్‌పై తన అభిమానాన్ని, గౌరవాన్ని చాటుకున్నారు. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో ప్రస్తుతం పవన్ కళ్యాణ్ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. మెగా సూర్య ప్రొడక్షన్ బ్యానర్‌పై ఎ.ఎం.రత్నం ఈ సినిమాను నిర్మిస్తున్నారు. పీరియాడిక్ డ్రామాగా రూపొందుతోన్న ఈ చిత్రానికి యం.యం.కీరవాణి సంగీతం సమకూరుస్తున్నారు. ఈ సినిమాలో ప్రాచీన యుద్ధ కళలను చూపించబోతున్నారు. ఈ యుద్ధ కళలతో కూడిన ఒక ఫైట్ సీక్వెన్స్‌లో నటించడానికి ఉత్తరప్రదేశ్‌, హర్యానా, మహారాష్ట్ర నుంచి 16 మంది మల్లయోధులను రప్పించారు. షూటింగ్ కూడా పూర్తి చేశారు. చిత్రీకరణ సమయంలో ఆ మల్లయోధుల ప్రతిభకు ముగ్ధులైన పవన్ కళ్యాణ్ వారందరినీ సత్కరించి పంపించారు. హైదరాబాద్‌లోని జనసేన కార్యాలయానికి ఆ మల్లయోధులను తీసుకువెళ్లి వారిని సన్మానించారు. ప్రతి ఒక్కరినీ పేరు పేరునా ఆత్మీయంగా పలకరించి శాలువా కప్పి, వెండి హనుమంతుడి విగ్రహాన్ని బహూకరించారు. తెలుగు మల్లయోధుడు కోడి రామ్మూర్తి నాయుడు గొప్పతనాన్ని వారికి వివరించారు. శ్రీకాకుళం జిల్లా మారుమూల పల్లెలో పుట్టిన ఆయన ప్రపంచ ప్రఖ్యాత యోధుడుగా ఎలా ఎదిగారు, దేశవిదేశాల్లో సాహస కృత్యాలు చేసే స్థాయికి ఎలా చేరుకున్నారో వారికి తెలియజేశారు. చివరగా మల్లయోధుల బృందానికి గధను బహుమతిగా అందించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. గురు పరంపరతో అభ్యసించే యుద్ధ విద్యలు మన దేశానికి చాలా అవసరమని, దేశీయ యుద్ధ విద్యలైన కుస్తీ, కర్రసాము వంటివాటిని ప్రోత్సహించాలని అన్నారు. అవినీతిపై పోరాటం చేయాలంటే మానసిక దారుఢ్యంతో పాటు శారీరక దారుఢ్యం చాలా అవసరమన్నారు. మానసికంగా, శారీరకంగా బలంగా లేకపోతే రౌడీలు, అవినీతిపరులు రాజ్యమేలుతారని హెచ్చరించారు. “ప్రాచీన యుద్ద విద్యలకు మన దేశం పేరెన్నికగన్నది. అయితే కొన్ని దశాబ్దాలుగా ఆదరణకు నోచుకోక అంతరించిపోయే దుస్థితి నెలకొంది. ఉత్తరప్రదేశ్‌, మహారాష్ట్ర, హర్యానా వంటి రాష్ట్రాల్లో ఇప్పటికీ యుద్ధ విద్య సంస్కృతి బతికే ఉంది. చిన్నప్పుడు చీరాలలో ఉన్నప్పుడు మా నాన్నగారు కుస్తీ పోటీలకు తీసుకెళ్లేవారు. స్థానికంగా ఉండే పహిల్వాన్‌ అప్పారావు గారి లాంటి యోధుల యుద్ధ విద్యలను దగ్గరుండి చూసేవాడిని. నేర్చుకోవాలనే తపన ఉండేది కానీ శరీరం సహకరించేది కాదు. కోడి రామ్మూర్తి నాయుడు గారిలా దేహ దారుఢ్యం సంపాదించాలనే కోరిక ఉండేది కానీ తీరలేదు. కొన్నేళ్ల తర్వాత మార్షల్‌ ఆర్ట్స్‌‌లోకి వెళ్లి కొంత సాధన అయితే చేశాను. కిక్‌ బాక్సింగ్‌, కరాటే, ఇండోనేషియా మార్షల్‌ ఆర్ట్స్‌‌లో నైపుణ్యం పొందాను’’ అని పవన్ కళ్యాణ్ వెల్లడించారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2PjE5Hw
v

నాలుగు భాషల్లో ‘నాంది’.. దిల్ రాజు భారీ ప్లాన్.. రీమేక్ రైట్స్ కొనేసిన బడా నిర్మాత!!

అల్లరి నరేష్, వరలక్ష్మీ శరత్‌కుమార్ ప్రధాన పాత్రల్లో విజయ్ కనకమేడల దర్శకత్వంలో వచ్చిన ‘నాంది’ మూవీ విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ప్రేక్షకులు ఈ సినిమాను బాగా ఆదరించారు. చిన్న సినిమాగా విడుదలైన ‘నాంది’ పెద్ద విజయమే అందుకుంది. ఇటీవలే ప్రముఖ నిర్మాత దిల్ రాజు ‘నాంది’ టీమ్‌ను మీడియా సమక్షంలో అభినందించారు. అయితే, తాజాగా ఇండస్ట్రీ వర్గాల నుంచి వస్తోన్న సమాచారం ప్రకారం ‘నాంది’ రీమేక్ రైట్స్ దిల్ రాజు కొనుగోలు చేశారట. నాలుగు భాషల్లో ఆయన ‘నాంది’ని రీమేక్ చేయబోతున్నారట. See Photos: ‘నాంది’ సినిమాను హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో రీమేక్ చేసేందుకు హక్కుల నిమిత్తం రూ. 2.75 కోట్లు దిల్ రాజు చెల్లించారని విశ్వసనీయ వర్గాల సమాచారం. ‘నాంది’ సినిమాను హిందీలో రీమేక్ చేయడానికి ఓ ప్రముఖ బాలీవుడ్ నిర్మాణ సంస్థతో దిల్ రాజు చేతులు కలిపారని అంటున్నారు. మరోవైపు, ‘నాంది’ బాక్సాఫీసు వద్ద ఇప్పటి వరకు రూ. 5.28 కోట్ల షేర్ వసూలు చేసిందని సమాచారం. మరికొద్ది రోజుల్లో ‘నాంది’ సినిమా ‘ఆహా’లో స్ట్రీమింగ్ కానుంది. ఈ సినిమా ఓటీటీ రైట్స్‌ను ‘ఆహా’ రూ.2.5 కోట్లకు కొనుగోలు చేసిందట. కాగా, ‘నాంది’ సినిమా ద్వారా విజయ్ కనకమేడల దర్శకుడిగా పరిచయమయ్యారు. ఎస్‌వి2 ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై సతీష్ వేగేశ్న ఈ చిత్రాన్ని నిర్మించారు. ఫిబ్రవరి 19న విడులైన ఈ చిత్రంలో న‌వ‌మి, హ‌రీష్ ఉత్తమ‌న్‌, ప్రవీణ్‌, ప్రియ‌ద‌ర్శి, దేవీప్రసాద్‌, విన‌య్ వ‌ర్మ, సి.ఎల్‌.న‌ర‌సింహారావు, శ్రీ‌కాంత్ అయ్యంగార్‌, ర‌మేష్‌రెడ్డి, చ‌క్రపాణి, రాజ్యల‌క్ష్మి, మ‌ణిచంద‌న‌, ప్రమోదిని, గ్రిగ్నేశ్వర రావు ఇతర పాత్రల్లో నటించారు. శ్రీ‌చ‌ర‌ణ్ పాకాల‌ సంగీతం సమకూర్చారు. అబ్బూరి ర‌వి డైలాగులు రాశారు. సిద్‌ సినిమాటోగ్రఫీ అందించారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3syNo4D
v

నటి అలేఖ్య ఏంజెల్‌కు ఎమ్మెల్సీ కవిత సన్మానం.. కారణం ఏంటంటే!

కరోనా మహమ్మారి వల్ల గతేడాది సామాన్య ప్రజలు ఎంతో ఇబ్బంది పడ్డారు. నిరుపేదలు నరక యాతన అనుభవించారు. కరోనా విజృంభనను అరికట్టేందుకు లాక్‌డౌన్ విధించడంతో దేశం స్తంభించిపోయింది. ఇలాంటి క్లిష్ట పరిస్థితిలో చాలా మంది మానవతావాదులు నిరుపేదలకు అండగా నిలబడ్డారు. వారికి ఆహారాన్ని అందించారు. నిత్యవసరాలు పంపిణీ చేశారు. సినిమా పరిశ్రమ నుంచి సైతం ఎంతో మంది ప్రముఖులు పేదలకు నిత్యవసరాలను సరఫరా చేశారు. వీరిలో నటి అలేఖ్య ఏంజెల్ కూడా ఉన్నారు. లాక్‌‌డౌన్ సమయంలో దాదాపు న‌ల‌భై వేల మందికి పైగా నిరుపేద‌ల‌కు నిత్యవసరాలను పంపిణీ చేశారు న‌టి అలేఖ్య. ఆమె సేవలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం.. కొవిడ్ వారియర్ రియల్ హీరో 2021 అవార్డుతో అలేఖ్యను సత్కరించింది. ఇటీవల ముంబైలో జరిగిన దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డ్స్ 2021 వేడుకలో కొవిడ్ వారియర్ రియల్ హీరో పురస్కారాన్ని అలేఖ్య అందుకున్నారు. ఒక తెలంగాణ అమ్మాయి ఇంత గొప్ప అవార్డును అందుకోవడంతో ఆమెను ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సత్కరించారు. ఆమెను ఆదివారం తన ఇంటికి పిలుపించుకుని సన్మానించారు. ఇలాంటి మంచి కార్యక్రమాన్ని చేపట్టి అందరికీ ఆదర్శంగా నిలిచారని అలేఖ్యను కవిత ప్రశంసించారు. ఎమ్మెల్సీ కవితను తాను కలిసిన విషయాన్ని అలేఖ్య ఇన్‌స్టాగ్రామ్ ద్వారా వెల్లడించారు. తనను కవిత సన్మానించిన ఫొటోలను సైతం షేర్ చేశారు. కవిత తనను సత్కరించడం గౌరవంగా భావిస్తున్నానన్నారు. ఆమె మాటలు ఇచ్చిన స్ఫూర్తితో మరిన్న సేవా కార్యక్రమాలు చేపడతానన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ ఫిలిం చాంబ‌ర్ చైర్మన్ డా. ప్రతాని రామ‌కృష్ణగౌడ్ మాట్లాడుతూ.. ‘‘లాక్‌డౌన్ స‌మ‌యంలో ఎంతో మందికి సాయ‌ప‌డిన అలేఖ్యను, దాదాపు 15 వేల మంద‌కి నిత్యవ‌స‌రాలు పంపిణీ చేసిన మా తెలంగాణ ఫిలిం చాంబ‌ర్‌ను అభినందిస్తూ మ‌రెన్నో ఇలాంటి మంచి కార్యక్రమాలు చేప‌ట్టాల‌ని, మీకు మా ప్రభుత్వం త‌ర‌ఫున ఎటువంటి సాయ‌మైనా అందించ‌డానికి సిద్ధంగా ఉంటామ‌ని కవిత భ‌రోసా ఇచ్చారు. క‌విత గారు ఇచ్చిన కాంప్లిమెంట్స్‌తో భ‌విష్యత్తులో ఇలాంటివి మ‌రెన్నో కార్యక్రమాలు చేయాల‌న్న ఆస‌క్తి పెరిగింది’’ అని అన్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3aZbmjC
v

సంపూర్ణేష్ బాబు హీరోగా కొత్త సినిమా.. డిఫరెంట్ సబ్జెక్ట్‌తో వస్తోన్న బర్నింగ్ స్టార్

బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు హీరోగా ఓ హిలేరియ‌స్ ఎంట‌ర్‌టైన‌ర్‌ను నిర్మించేందుకు మ‌ధుసూధ‌న క్రియేష‌న్స్‌, రాధాకృష్ణ టాకీస్ స‌న్నాహాలు చేస్తున్నాయి. ఆర్‌.కె.మ‌లినేని ద‌ర్శక‌త్వం వ‌హించే ఈ చిత్రానికి ఆశాజ్యోతి గోగినేని నిర్మాత‌. సంపూర్ణేష్ బాబు స‌ర‌స‌న నాయిక‌గా వ‌సంతి న‌టించ‌నున్నారు. ఈ చిత్రానికి శ్రీ‌ధ‌ర్ స‌మ‌ర్పకునిగా వ్యవ‌హ‌రిస్తున్నారు. ఒక డిఫ‌రెంట్ స‌బ్జెక్ట్‌తో, ఔట్ అండ్ ఔట్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా ఈ మూవీ రూపొంద‌నుంది. ఇంత‌వ‌ర‌కూ ఇలాంటి క‌థ‌ను కానీ, ఇలాంటి పాత్రను కానీ సంపూర్ణేష్ బాబు చేయ‌లేద‌ని ద‌ర్శకుడు ఆర్‌.కె. మ‌లినేని తెలిపారు. ఒక చ‌క్కని క‌థ‌తో, సంపూర్ణేష్ బాబు హీరోగా చిత్రాన్ని నిర్మిస్తున్నందుకు ఆనందంగా ఉంద‌ని.. మార్చిలో రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభిస్తామ‌ని నిర్మాత‌లు తెలిపారు. ఈ చిత్రంలో ఇంకా పోసాని కృష్ణముర‌ళి, వైవా హ‌ర్ష, గెట‌ప్ శ్రీ‌ను, రోహిణి నటిస్తున్నారు. ఈ చిత్రానికి గోపీ కిరణ్ కథను అందించగా.. రైటర్ మోహన్, శివరామ్ డైలాగులు రాస్తున్నారు. పూర్ణాచారి, సురేష్ బనిశెట్టి సాహిత్యం అందిస్తు్న్నారు. ప్రజ్వల్ సంగీతం సమకూరుస్తున్నారు. ముజీర్ మాలిక్ సినిమాటోగ్రఫీ అందించనున్న ఈ సినిమాకు బాబు ఎడిటర్. శశి కొరియోగ్రాఫర్. నందురాజ్ యాక్షన్ కొరియోగ్రాఫర్. ఇదిలా ఉంటే, సంపూర్ణేష్ బాబు హీరోగా రూపొందుతోన్న ‘బజార్ రౌడీ’ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. అలాగే, ‘గోల్డ్‌మేన్’ అనే సినిమాలోనూ సంపూ హీరోగా నటిస్తున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2MxIJRb
v

తల్లి కాబోతున్న రిచా గంగోపాధ్యాయ.. ఓ సీక్రెట్ దాచి పెట్టాం అంటూ ఓపెన్ అయిన బ్యూటిఫుల్ హీరోయిన్

రిచా గంగోపాధ్యాయ.. ఈ బ్యూటీ వెండితెరకు దూరమై చాలారోజులే అయినా ప్రతి ఒక్కరికీ గుర్తుండే ఉంటుంది. 'లీడర్‌' సినిమాతో వెండితెరకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ.. ''మిరపకాయ్, మిర్చి'' లాంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకుల మనసు దోచేసింది. అందం, అభినయం పరంగా భేష్ అనిపించుకున్నా కెరీర్‌ పరంగా ఎక్కువ రోజులు నిలువలేదు. సినీ పరిశ్రమలో ఉంటూనే చివరకు తన ప్రియుడిని పెళ్లిచేసుకొని ఓ ఇంటిదైపోయింది. అయితే సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటున్న ఆమె.. తాజాగా ఓ సీక్రెట్ బయటపెడుతూ ఓపెన్ అయింది. చిన్ననాటి స్నేహితుడైన జో లాంగేల్లాను వివాహమాడిన .. పెళ్లి గురించి ముందుగా ఎవ్వరికీ సమాచారం ఇవ్వకుండా సీక్రెట్ మెయిన్‌టైన్ చేసింది. ఆ తర్వాత సడెన్‌గా వీరి పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో దర్శనమివ్వడంతో వీరి పెళ్లి మ్యాటర్ బయటకొచ్చింది. ఇదే కంటిన్యూ చేస్తూ తన ప్రెగ్నెన్సీ మ్యాటర్‌ కూడా సీక్రెట్‌గా ఉంచిన రిచా.. తాజాగా తన బేబీ బంప్ లుక్ పోస్ట్ చేస్తూ అసలు విషయం బయటపెట్టింది. తాను తల్లి కాబోతోన్నాని ఆనందం వ్యక్తం చేస్తూ తన భర్తతో కలిసి దిగిన ఓ పిక్ షేర్ చేసింది రిచా గంగోపాధ్యాయ. ఇన్నాళ్లు సీక్రెట్‌గా ఉంచాం కానీ.. జూన్‌లో పండండి బిడ్డకు జన్మనివ్వబోతున్నామంటూ ఓపెన్ అయింది. దీంతో ఆమె చేసిన ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది. ఆమెకు ఆల్ ది బెస్ట్ చెబుతూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. చివరగా 2013లో వచ్చిన ‘భాయ్' సినిమాలో కనిపించింది రిచా గంగోపాధ్యాయ. ఆ తర్వాత సినిమాలకు గుడ్ బై చెప్తున్నట్లు సోషల్ మీడియా ద్వారా వెల్లడించి తన స్వస్థలమైన అమెరికాలో స్థిరపడింది. సినిమాలే తన జీవితం కాదని అంతకుమించి చేయాల్సిన పనులు చాలా ఉన్నాయని చెబుతూ ఆమె వెండితెరకు గుడ్ బై చెప్పింది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2O90JSp
v

ఈ కథలో పాత్రలు కల్పితం: రిలీజ్ డేట్ పోస్టర్ లాంచ్ చేసిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్

ఈ రోజుల్లో సినిమాను రూపొందించడం ఒకెత్తయితే.. దాన్ని జనాలకు తెలిసేలా ప్రమోట్ చేయడం మరో ఎత్తు. అందుకే ఈ జనరేషన్ మేకర్స్ పలు రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. స్టార్ హీరోలు, స్టార్ దర్శక నిర్మాతలతో పాటు రాజకీయ నాయకుల సహకారం పొందుతూ తమ తమ సినిమాలను ప్రమోట్ చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే మొన్నా మధ్య '' అనే పాటను వైఎస్ షర్మిల చేతుల మీదుగా రిలీజ్ చేయించారు. అది బాగానే వర్కవుట్ కావడంతో ఈ సారి మంత్రి చేతుల మీదుగా లీజ్ డేట్ పోస్టర్‌ను వదిలారు. పవన్‌ తేజ్‌ కొణిదెల, మేఘన జంటగా నటిస్తున్న చిత్రం 'ఈ కథలో పాత్రలు కల్పితం'. అభిరామ్ ఎమ్‌. దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాను మాధవి సమర్పణలో ఎంవిటి ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై రాజేష్‌ నాయుడు నిర్మిస్తున్నారు. ఇప్ప‌టికే విడుద‌లైన ఈ మూవీ పోస్టర్స్‌‌, సాంగ్స్ ప్రేక్షకుల నుండి విశేష స్పందన తెచ్చుకున్నాయి. డిఫరెంట్ టైటిల్ కావడంతో జనం అట్రాక్ట్ అయ్యారు. ఒక్కో అప్‌‌డేట్‌తో మూవీపై అంచనాలు పెంచేసిన యూనిట్.. తాజాగా చిత్ర రిలీజ్ డేట్ అనౌన్స్ చేసింది. ఇటీవలే సెన్సార్ పనులను జరుపుకున్న ఈ సినిమాను మార్చి 19వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నట్లు ప్రకటిస్తూ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చేతుల మీదుగా రిలీజ్ డేట్ పోస్టర్ లాంచ్ చేశారు. సినిమా టైటిల్ చాలా వెరైటీగా ఉందని చెప్పిన తలసాని.. చిత్రయూనిట్ మొత్తానికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు మూవీ సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు తెలిపారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3sx8Wyw
v

క్రిష్‌, వైష్ణవ్‌ తేజ్‌ సినిమా టైటిల్ ఫిక్స్.. ఫైనల్‌గా డిసైడ్ అయ్యారిలా!

తొలి సినిమా 'ఉప్పెన'తో భారీ సక్సెస్ అందుకున్నారు మెగా కాంపౌండ్ హీరో వైష్ణవ్ తేజ్. సాయి ధరమ్ తేజ్ సోదరుడిగా రంగంలోకి దిగిన ఈ నటుడు, కెమెరా ముందు తన హావభావాలతో తనకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు. తన రెండో సినిమాను స్టార్ డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో చేస్తున్న ఆయన.. ఈ సినిమాతో స్టార్ స్టేటస్ పట్టేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా ఈ సినిమా టైటిల్ ఫిక్స్ చేశారని తెలుస్తోంది. ప్రెజెంట్ పవన్‌కల్యాణ్‌తో ఓ సినిమా చేస్తున్న క్రిష్.. దానికి ప్యారలల్‌గా మెగా మేనల్లుడు వైష్ణవ్‌ తేజ్‌‌తో చేస్తున్న సినిమా కంప్లీట్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ పార్ట్ ఫినిష్ చేశారని సమాచారం. ఈ చిత్రంలో వైష్ణవ్‌ తేజ్ సరసన స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్‌గా నటించింది. పక్కా ప్లానింగ్‌తో తక్కువ రోజుల్లోనే ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసిన క్రిష్.. టైటిల్ విషయంలో ఓ క్లారిటీకి వచ్చేశారట. ఓ వైపు పోస్ట్ ప్రొడక్షన్ పనులు చేస్తూనే చిత్రానికి 'జంగిల్‌ బుక్‌' అనే టైటిల్‌ ఫిక్స్ చేశారట. త్వరలోనే ఈ టైటిల్‌ను అధికారికంగా ప్రకటించనున్నారని సమాచారం. కొండ మీద నివాసం ఉండే ఓ గ్రామంలోని ప్రజలు అక్కడ వ్యవసాయం చేయడం, అడవుల్లోని జంతువులతో వారి సావాసం, అక్కడి వాతావరణంలో వారు ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నారనే కథాంశంతో సినిమా తెరకెక్కిందని తెలిసింది. 'ఉప్పెన'తో సక్సెస్ అందుకున్న వైష్ణవ తేజ్.. ఈ సినిమాతో మరో మెట్టు ఎక్కడం ఖాయం అనే టాక్ వినిపిస్తోంది. మరోవైపు వైష్ణవ్ తేజ్‌కి వరుస అవకాశాలు వస్తున్నాయని, ఇప్పటికే నాగార్జున నిర్మాణంలో రూపొందనున్న ఓ సినిమాకు వైష్ణవ్ ఓకే చేశారని తెలుస్తోంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2ZUJl6o
v

‘సలార్’ రిలీజ్ డేట్ ఫిక్స్.. వేసవిని మరింత వేడెక్కించనున్న ప్రభాస్

‘కె.జి.యఫ్’ లాంటి సెన్సేషనల్ మూవీని రూపొందించిన దర్శకుడు ప్రశాంత్ నీల్, నిర్మాత విజయ్ కిరగందూర్ ద్వయం ప్రస్తుతం రెబల్ స్టార్ ప్రభాస్‌తో ‘సలార్’ సినిమాను తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాపై దేశ వ్యాప్తంగా భారీ అంచనాలున్నాయి. ఇప్పటి వరకు ప్రేక్షకులు చూడని సరికొత్త అవతారంలో ప్రభాస్‌ను చూపించనున్నారు ప్రశాంత్ నీల్. జనవరి 15న లాంఛనంగా ప్రారంభమైన ఈ చిత్రం ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. అయితే, ఈ చిత్ర విడుదల తేదీని నిర్మాణ సంస్థ హోంబలే ఫిలింస్ ఆదివారం ప్రకటించింది. వచ్చే ఏడాది వేసవిలో ‘సలార్’ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఏప్రిల్ 22న ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల చేయనున్నారు. ఈ మేరకు హోంబలే ఫిలింస్ ఆదివారం మధ్యాహ్నం ట్వీట్ చేసింది. హోంబలే ఫిలింస్ నిర్మాణంలో వస్తోన్న మూడో పాన్ ఇండియా మూవీ ఇది. ఇప్పటికే ‘కె.జి.యఫ్: చాప్టర్ 1’తో కన్నడ సినిమా స్థాయిని పాన్ ఇండియా లెవెల్‌కు తీసుకెళ్లింది హోంబలే. ఇప్పుడు ‘కె.జి.యఫ్: చాప్టర్ 2’ను అత్యంత భారీగా నిర్మించి ఈ ఏడాది జులై 16న విడుదల చేస్తోంది. దీని తరవాత మూడో పాన్ ఇండియా మూవీగా ‘సలార్’ను వచ్చే ఏడాది ఏప్రిల్ 22న ప్రేక్షకుల ముందుకు తీసుకురానుంది. కాగా, ‘సలార్’ విడుదల తేదీని ప్రకటిస్తూ ప్రభాస్ కొత్త పోస్టర్‌ను విడుదల చేసింది చిత్ర నిర్మాణ సంస్థ. ఈ పోస్టర్‌లో ప్రభాస్ రఫ్ లుక్‌లో కనిపిస్తున్నారు. చాలా సీరియస్‌గా నడుచుకుంటూ వెళ్తున్నారు. పోస్టర్ బ్లాక్ థీమ్‌లో ఉంది. ఈ సినిమాకు మొత్తం ‘కె.జి.యఫ్’ టెక్నికల్ టీమే పనిచేస్తుంది. రవి బస్రూర్ సంగీతం సమకూరుస్తున్నారు. భువన గౌడ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. తెలుగుతో పాటు కన్నడ, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది. ఇదిలా ఉంటే ప్రభాస్, పూజా హెగ్డే జంటగా రూపొందుతోన్న మరో పాన్ ఇండియా మూవీ ‘రాధేశ్యామ్’ జులై 30న విడుదల కానుంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3047GXj
v

సంక్రాంతి బరిలో పవన్ కళ్యాణ్.. మహేష్ బాబుతో ఆసక్తికర పోరు

సంక్రాంతి అంటే తెలుగు ప్రజలకు పెద్ద పండుగ మాత్రమే కాదు సినిమా పండుగ కూడా. స్టార్ హీరోల అభిమానులు, సినీ ప్రేక్షకులు సంక్రాంతికి వచ్చే సినిమాల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉంటారు. స్టార్ హీరోలు సైతం సంక్రాంతి సీజన్‌ను టార్గెట్ చేసుకుని సినిమాలను ప్లాన్ చేసుకుంటారు. వచ్చే సంక్రాంతి సీజన్‌ను సూపర్ స్టార్ మహేష్ బాబు ఇప్పటికే టార్గెట్ చేశారు. ఆయన హీరోగా పరుశురామ్ దర్శకత్వంలో రూపొందుతోన్న ‘సర్కారు వారి పాట’ సంక్రాంతికి విడుదలకానుంది. అయితే, సంక్రాంతికి మరో స్టార్ హీరో సినిమా కూడా వస్తోంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో రూపొందుతోన్న భారీ చిత్రం సంక్రాంతి బరిలో నిలిచింది. ఈ విషయాన్ని చిత్ర నిర్మాణ సంస్థ ఆదివారం అధికారికంగా ప్రకటించింది. పవన్ కళ్యాణ్ 27వ సినిమాగా రూపొందుతోన్న ఈ చిత్రానికి ఇంకా టైటిల్ ఖరారు చేయలేదు. ప్రస్తుతానికి PSPK27గా పిలుస్తున్నారు. ఈ సినిమాను 2022 సంక్రాంతికి విడుదల చేయనున్నట్టు చిత్ర నిర్మాణ సంస్థ మెగా సూర్య ప్రొడక్షన్ ఆదివారం ప్రకటించింది. ‘ఖుషి’ లాంటి బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత పవన్ కళ్యాణ్‌తో ప్రముఖ నిర్మాత ఎ.ఎం.రత్నం నిర్మిస్తోన్న చిత్రం కావడం.. ఇప్పటి వరకు పోషించని పాత్రను పవన్ కళ్యాణ్ ఈ సినిమాలో పోషిస్తుండటంతో అంచనాలు భారీగా ఉన్నాయి. పీరియాడిక్ డ్రామాగా రూపొందుతోన్న ఈ చిత్రం సంక్రాంతి బరిలో నిలవడంతో ఒక్కసారిగా అందరిలోనూ ఆసక్తి పెరిగిపోయింది. మహేష్ బాబు హీరోగా రూపొందుతోన్న యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘సర్కారు వారి పాట’ను పవన్ కళ్యాణ్ సినిమా ఢీకొట్టబోతోంది. కాబట్టి, ఈ సంక్రాంతికి బాక్సాఫీసు వద్ద భారీ యుద్ధం ఖాయం. కాగా, పవన్ కళ్యాణ్ సినిమాకు యం.యం.కీరవాణి సంగీతం సమకూరుస్తున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3ku9fqY
v

నిర్మాత సందీప్ కొరిటాల హఠాన్మరణం.. నారా రోహిత్ భావోద్వేగం

తెలుగు సినీ పరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. నిర్మాత సందీప్ కొరిటాల హఠాన్మరణం చెందారు. ఆదివారం గుండెపోటుతో ఆయన కన్నుమూశారు. సందీప్ కొరటాల మరణానికి సంతాపం తెలుపుతూ హీరో నారా రోహిత్, దర్శకుడు సుధీర్ వర్మ ట్వీట్లు చేశారు. సుధీర్ వర్మ దర్శకత్వంలో నిఖిల్ సిద్ధార్థ్ హీరోగా వచ్చిన ‘స్వామిరారా’, పాటల రచయిత కృష్ణ చైతన్య దర్శకత్వంలో నారా రోహిత్ హీరోగా వచ్చిన ‘రౌడీ ఫెలో’ సినిమాలకు సందీప్ కొరిటాల సహ నిర్మాతగా వ్యవహరించారు. సందీప్ కొరిటాల కన్నుమూసిన విషయాన్ని ముందుగా నారా రోహిత్ ఖరారు చేశారు. ‘నా రౌడీ ఫెలో సినిమా సహ నిర్మాత, నా శ్రేయోభిలాషి సందీప్ కొరిటాల ఇకలేరనే వార్త విని చాలా బాధపడ్డాను. ఈరోజు ఇంత బాధాకరంగా ప్రారంభమవుతుందని అనుకోలేదు. ఓం శాంతి’’ అని నారా రోహిత్ ఎమోషనల్ ట్వీట్ చేశారు. అలాగే, ‘స్వామిరారా’ దర్శకుడు సుధీర్ వర్మ కూడా సందీప్ కొరిటాల మృతికి సంతాపం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు. ‘‘నా ఆత్మీయ స్నేహితుడు సందీప్ కొరిటాల మరణవార్త విని చాలా బాధపడ్డాను. ‘స్వామిరారా’ రూపొందించడంలో మీ ప్రోత్సాహాన్ని ఎప్పటికీ మరిచిపోలేను. మీ ఆత్మకు శాంతి చేకూరాలి సోదర. నిన్ను మేం కోల్పోతున్నాం’’ అని సుధీర్ వర్మ ట్వీట్‌లో పేర్కొన్నారు. ‘స్వామిరారా’ సెట్స్‌లో సందీప్‌తో దిగిన వర్కింగ్ స్టిల్స్‌ను సుధీర్ వర్మ షేర్ చేశారు. వీరితో పాటు సినీ పరిశ్రమకు చెందిన పలువురు సందీప్ కొరిటాల మృతికి సంతాపాన్ని తెలియజేశారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3r1ZGlR
v

Saranga Dariya: డాన్స్ సాంగ్ ఆఫ్ ది సీజన్ అంటూ సాంగ్ రిలీజ్ చేసిన సమంత.. ఇరగదీసిన సాయి పల్లవి

అక్కినేని , హీరోహీరోయిన్లుగా శేఖర్‌ కమ్ముల రూపొందిస్తున్న 'లవ్‌స్టోరి' మూవీ నుంచి '' లిరికల్ సాంగ్ రిలీజ్ అయింది. సమంత రిలీజ్ చేసిన ఈ సాంగ్ క్షణాల్లోనే సోషల్ మీడియాలో వైరల్ అయి మిలియన్‌కి పైగా వ్యూస్ రాబట్టింది. "డాన్స్ సాంగ్ ఆఫ్ ది సీజన్.. సాయిపల్లవి నువ్వు మెస్మరైజ్‌ చేశావు" అని పేర్కొంటూ ఈ లిరికల్ సాంగ్‌ని ట్విట్టర్ ద్వారా షేర్ చేసింది సమంత. 'దాని కుడీ భుజం మీద కడువా.. దాని పుస్తెపు రైకలు మెరియా.. అది రమ్మంటె రాదు సెలియా.. దాని పేరే సారంగ దరియా' అనే ఫోక్ సాంగ్‌ను రీమిక్స్ చేశారు. చక్కని తెలంగాణ జానపదానికి సాయిపల్లవి ఎనర్జిటిక్‌ స్టెప్స్ తోడుకావడం, శేఖర్ కమ్ముల టేకింగ్ ఈ సాంగ్‌ని ఎక్కడికో తీసుకెళ్లాయి. శేఖర్‌ మాస్టర్‌ ఈ సాంగ్‌కు డాన్స్ కంపోజ్ చేశారు. ఓ అమ్మాయి గుణగణాలను పొగుడుతూ సాగే ఈ పాటను సుద్దాల అశోక్‌ తేజ రాయగా, మంగ్లీ ఆలపించారు. పాటకు తగ్గట్టు పవన్ సీహెచ్ మంచి బీట్‌తో కూడిన బాణీలు కట్టారు. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్ పీ, అమిగోస్ క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా ఈ 'లవ్ స్టోరీ' సినిమాను నిర్మిస్తున్నాయి. కె నారాయణదాస్ నారంగ్, పి. రామ్మోహన్ రావు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్‌ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఏప్రిల్‌ 16వ తేదీన ఈ బ్యూటిఫుల్ లవ్ స్టోరీని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు నిర్మాతలు ప్రకటించారు. 'ఫిదా' వంటి బ్లాక్‌బస్టర్‌ హిట్‌ తర్వాత శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో రాబోతున్న సినిమా కావడంతో ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3bKxAFh
v

Saturday 27 February 2021

అమితాబ్ బచ్చన్‌కు శస్త్ర చికిత్స.. ఆందోళన చెందుతున్న ఫ్యాన్స్

బాలీవుడ్ బడా హీరో, బిగ్ బీ మరోసారి సర్జరీ చేయించుకోబోతున్నారట. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా తన బ్లాగ్ ద్వారా వెల్లడించడంతో ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. అమితాబ్ ఆరోగ్య పరిస్థితిపై ఆరా దీస్తున్నారు. అసలు అమితాబ్‌కు ఏమైందనే ఆలోచనలతో విజయవంతం కావాలని, ఆయన సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి రావాలని కోరుకుంటున్నారు. సర్జరీ జరుగనున్న నేపథ్యంలో తాను బ్లాగ్‌లో సమాచారం ఇవ్వలేకపోయాను అంటూ అమితాబ్ వెల్లడించడం చర్చనీయాంశంగా మారింది. అమితాబ్ ఆరోగ్య పరిస్థితి సరిగా ఉండకపోవడం వల్ల సర్జరీ చేయాలని ముంబై వైద్యుల బృందం తెలిపినట్లు తెలుస్తోంది. 1982లో 'కూలీ' సినిమా షూటింగ్ సమయంలో యాక్షన్ సీన్లు చిత్రీకరిస్తుండగా అమితాబ్ గాయపడ్డారు. ఆ సమయంలో శస్త్ర చికిత్స చేయడంతో క్రమంగా కోలుకున్నారు. ఆ తర్వాత 2005 సంవత్సరంలో తీవ్రమైన కడుపునొప్పితో బాధపడ్డప్పుడు మరోసారి ఆయనకు శస్త్ర చికిత్స జరిగింది. రీసెంట్‌గా కరోనా బారిన పడి కోలుకున్నారు. ఈ నేపథ్యంలో మళ్లీ ఇప్పుడు తనకు సర్జరీ జరగనుందని తెలపడంతో అభిమానుల్లో ఆందోళన మొదలైంది. ఇటీవలే మెగాస్టార్ చిరంజీవి మూవీ 'సైరా నరసింహా రెడ్డి' సినిమాలో ముఖ్యపాత్రలో కనిపించి మెప్పించిన అమితాబ్.. ప్రస్తుతం బాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉన్నారు. దర్శకుడు నాగరాజ్ పోపట్‌రావు మంజులే దర్శకత్వంలో 'జుండ్' అనే మూవీలో నటిస్తున్నారు. 'చహ్రే' అనే మరో సినిమాలో ముఖ్యపాత్ర పోషిస్తున్నారు. ఆ రెండు సినిమాలు అతిత్వరలో విడుదల కానున్నాయి.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3uHbXxY
v

సునీల్ సర్‌ప్రైజింగ్ బర్త్ డే గిఫ్ట్.. అప్పుడు 'మర్యాద రామన్న' ఇప్పుడు 'మర్యాద క్రిష్ణయ్య'

నేడు (ఫిబ్రవరి 28) టాలీవుడ్ కమెడియన్, నటుడు బర్త్ డే. ఈ సందర్భంగా ఆయన కొత్త సినిమా అనౌన్స్ చేస్తూ సర్‌ప్రైజింగ్ బర్త్ డే గిఫ్ట్ ఇచ్చారు. కమెడియన్‌గా ఈ జనరేషన్‌కి బాగా దగ్గరైన సునీల్.. అవకాశం దొరికినప్పుడల్లా హీరోగా తనను తాను ప్రూవ్ చేసుకోవాలనే ప్రయత్నం చేస్తున్నారు. ‘అందాల రాముడు’ సినిమాతో హీరోగా మారిన ఆయన, ఆ తర్వాత ‘మర్యాద రామన్న’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. ఇక ఆ తర్వాత చేసిన సినిమాలేవీ పెద్దగా వర్కవుట్ కాలేదు. ఈ నేపథ్యంలో ఇప్పుడు ''గా మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు సునీల్. తాజాగా సునీల్ బర్త్ డే పురస్కరించుకొని ఈ సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. వి.ఎన్. ఆదిత్య దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీని ఏటీవీ ఒరిజినల్స్‌, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. కిషోర్‌ గరికపాటి, టీజీ విశ్వప్రసాద్‌, అర్చనా అగర్వాల్‌ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. వివేక్‌ కూచిబొట్ట సహ నిర్మాతగా వ్యవహరిస్తుండగా సాయికార్తీక్‌ సంగీతం అందిస్తున్నారు. తాజాగా విడుదల చేసిన ఈ ఫస్ట్‌లుక్ పోస్టర్‌లో సునీల్ గోడ చాటు నుంచి భయం భయంగా ఎవరినో గమనిస్తూ భయంతో కనిపిస్తున్నారు. దీంతో సునీల్‌ ఇందులోనూ 'మర్యాద రామన్న' తరహాలోనే భయస్థుడి పాత్రలో కనిపిస్తాడేమో అనే సందేహం కలుగుతోంది. మొత్తానికైతే 'మర్యాద క్రిష్ణయ్య' అనే టైటిల్ కాస్త ఇంప్రెసివ్‌ గానే ఉందని చెప్పుకోవాలి. అతిత్వరలో ఈ చిత్రానికి సంబంధించిన ఇతర వివరాలు ప్రకటించనున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3dXmgYX
v

ముదిరిన శృతి హాసన్ డేటింగ్ వ్యవహారం.. కొత్త బాయ్ ఫ్రెండ్‌తో చిల్లింగ్.. తండ్రితో ఇద్దరి మీట్

స్టార్ హీరోయిన్ శృతిహాసన్ కొద్ది రోజులపాటు సినిమాలు కూడా పక్కన పెట్టేసి తన మాజీ ప్రియుడు, ఇంగ్లండ్ సింగర్ మైకేల్ కోర్స‌లేతో పీకల్లోతు ప్రేమలో మునిగితేలిన సంగతి తెలిసిందే. ఒకానొక సందర్భంలో ఆయన్ను ఇండియాకు తీసుకొచ్చి తన తల్లిదండ్రులకు కూడా పరిచయం చేసింది. దీంతో ఈ ఇద్దరి పెళ్లి కన్ఫర్మ్ అని అంతా ఫిక్సయ్యాక.. మెల్లగా అతనితో కట్ చేసుకుంది శృతి. కారణాలేంటనేవి బయటకురానప్పటికీ వారి ప్రేమ బంధానికి మాత్రం ఫుల్‌స్టాప్ పడింది. ఆ తర్వాత తిరిగి సినిమాల్లోకి రీ- ఎంట్రీ ఇచ్చిన శృతి.. కొద్ది రోజులుగా మరో వ్యక్తితో ప్రేమాయణం నడుపుతోందని, డేటింగ్ వ్యవహారం ముదిరిందని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఆ వార్తలకు బలం చేకూరుస్తూ తన కొత్త బాయ్ ఫ్రెండ్ శంతను హజారికా‌ను తండ్రి కమల్ హాసన్‌కి పరిచయం చేసింది . ముంబైకి చెందిన ఆర్టిస్టు శంతను హజారికాతో కలిసి చెన్నైలో ఆమె చేసిన హంగామా, తండ్రి కమల్ హాసన్‌కి పరిచయం చేయడం చూస్తుంటే ఈ ఇద్దరి లవ్ ఎఫైర్ ఎక్కడిదాకా వెళ్లిందో అర్థమవుతోంది. రాజకీయ పార్టీ వ్యవహారాల్లో బిజీగా ఉన్న కమల్ హాసన్‌కు శంతను హజారికా ఓ అపురూపమైన గిఫ్ట్ ఇవ్వడం గమనార్హం. తమిళ రాజకీయ ప్రక్షాళనకై బయల్దేరిన కమల్..‌ ఓ చేతిలో గొడ్డలి, మరో చేతిలో టార్చ్ లైట్‌ పట్టుకొని అలా నడుచుకుంటూ వస్తున్నట్లు తానే స్వయంగా గీసిన ఆర్ట్‌ను ప్రెజెంట్ చేశారు శృతి బాయ్ ఫ్రెండ్ శంతను. ఈ ఆర్ట్ వర్క్ తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేస్తూ ఆయన్ను ప్రశంసించారు కమల్. ఇకపోతే చెన్నైలో తన ప్రియుడు శంతను హజారికాతో కలిసి హంగామా చేసిన శృతి.. అతన్ని కౌగిలించుకొని సన్నిహితంగా దిగిన ఫొటోలను తన సోషల్ మీడియా వాల్‌పై పోస్ట్ చేసింది. పైగా 'చెన్నైలో చిల్లింగ్ సీన్స్' అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చింది. దీంతో శృతి ప్రేమ వ్యవహారం మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3dPORiZ
v

ఖరీదైన ఇల్లు సొంతం చేసుకున్న బాలయ్య.. దాని కోసం ఎన్ని కోట్లు వెచ్చించారంటే!

నందమూరి నటసింహం హైదరాబాద్‌లో ఓ విలాసవంతమైన ఇంటికి కొనుగోలు చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే జూబ్లీ హిల్స్ లోని ఖరీదైన ప్రాంతంలో తన సొంతిట్లో ఉంటున్న ఆయన ఇటీవల అదే జూబ్లీహిల్స్‌లో మరో ఇంటిని కొనుగోలు చేశారని టాక్ నడుస్తోంది. గత వారం రోజులుగా ఇందుకు సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో తెగ చెక్కర్లు కొడుతున్నాయి. అత్యంత ఖరీదైన ప్రాంతంలో బాలయ్య ఇల్లు కొన్నారని, ఆ ఇంటి కోసం 15 కోట్ల రూపాయలకు పైగా వెచ్చించారని సమాచారం. ఇది రెండంతస్థుల భవంతి అని, అత్యాధునిక సదుపాయాలతో సుందరంగా ఉన్న ఈ ఇల్లు.. బాలకృష్ణ భార్య వసుంధర పేరు మీద రిజిస్టర్ చేయించారని సోషల్ మీడియాలో వస్తున్న వార్తల సారాంశం. 9,395 చదరపు అడుగుల విస్తీర్ణం గల ఆ ఇంటి కోసం బాలయ్య 7.5 లక్షల రిజిస్ట్రేషన్ ఫీజు, 82.5 లక్షల స్టాంప్ డ్యూటీ చెల్లించారని అంటున్నారు. ఫిబ్రవరి నెల 11వ తేదీన ఈ డీల్ జరిగిందని తెలుస్తోంది. ఈ వార్తలతో బాలయ్య ఆ ఇంటికి ఎప్పుడు షిఫ్ట్ కాబోతున్నారు? అనే చర్చలు మొదలయ్యాయి. ఇకపోతే సీనియర్ హీరోగా వెండితెరపై సత్తా చాటుతూనే ఉన్నారు బాలయ్య. వరుస సినిమాలు చేస్తున్న ఆయన, ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ షూటింగ్ శరవేగంగా సాగుతోంది. అనే వర్కింగ్ టైటిల్‌తో రూపొందుతున్న ఈ సినిమాకు `గాడ్‌ఫాదర్` అనే టైటిల్ ఫిక్స్ చేశారని సమాచారం. ఇటీవలే ఈ మూవీ నుంచి విడుదల చేసిన ‘బీబీ3 ఫస్ట్ రోర్’ నందమూరి అభిమానులు పెట్టుకున్న అంచనాలకు రెక్కలు కట్టింది. మే నెల 28వ తేదీన ఈ సినిమాను గ్రాండ్‌గా రిలీజ్ చేయనున్నట్లు తెలిపారు మేకర్స్.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3q2EjPK
v

‘పైన పటారం.. లోన లొటారం.. కెలికిసూడు’ అంటూ చెలరేగిన అనసూయ వీడియో

‘పైన పటారం.. ఈడ లోన లొటారం.. ఇను బాసూ చెబుతాను లోకం యవ్వారం. పైకి బంగారం లోన గూడు పుటారం.. కెలికి చూడు తెలిసిపోద్ద అస్సలు బండారం’.. ఇదేందయ్యో!! ఈ యవ్వారం కాస్త తేడాగానే ఉంది.. అనేట్టుగానే ఉంది ఈపాట. అందులోనూ అనసూయ ఈ పాటకు చీరకు పైకి ఎగ్గొట్టి మరీ స్టెప్పులు వేస్తుంటే అబ్బో మాస్ ఆడియన్స్‌కి పండకే. జబర్దస్త్ యాంకర్‌గానే కాకుండా ఐటమ్ సాంగ్స్‌తోనూ అల్లాడించే అనసూయ ‘పైన పటారం’ అనే ఐటమ్ సాంగ్‌తో రచ్చ చేస్తుంది. తాజాగా ఆమె ఖాతాలో మరో ఐటమ్ సాంగ్ చేరింది. కార్తికేయ గుమ్మకొండ, లావణ్యా త్రిపాఠి జంటగా నటిస్తున్న ‘చావు కబురు చల్లగా’ చిత్రంలో అనసూయపై ఐటమ్ సాంగ్ చిత్రీకరించిన విషయం తెలిసిందే. ఇటీవల ఈ ఐటమ్ సాంగ్‌కి సంబంధించిన పోస్టర్స్ రిలీజ్ చేయడంతో మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా శనివారం నాడు ఈ ఐటమ్ సాంగ్‌కి సంబంధించిన ప్రోమో విడుదల చేశారు. పూర్తి పాట మార్చి 1న సాయంత్రం 4.05 గంటలకు విడుదల చేయనున్నారు. ‘పైన పటారం.. ఈడ లోన లొటారం.. కెలికి చూడు తెలిసిపోద్ద అస్సలు బండారం’ అంటూ అనసూయ వేస్తున్న మాస్ స్టెప్పులు జబర్దస్త్ అనేట్టుగానే ఉన్నాయి. లిరిక్స్‌కి తగ్గట్టుగా అనసూయ పలికించే హావభావాలు ఓ రేంజ్‌లో ఉన్నాయి. మంగ్లి, సాకేత్ పాడిన ఈ పాటకు జాక్స్ బేజోయ్ ట్యూన్స్ అందించారు. సా నా రే ఈ పాటను రాశారు. కౌశిక్ పెగళ్లపాటి అనే కొత్త దర్శకుడు డైరెక్ట్ చేసిన ఈ సినిమా మార్చి 19న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3dQYfCQ
v

చంద్రబాబు జూమ్ మీటింగ్స్.. ఏడ్చిన సందర్భాలు బోలెడు: దివ్యవాణి షాకింగ్ కామెంట్స్

పార్టీలో ఉన్న అంతర్గత సమస్యల్ని ఫేస్ చేస్తూ.. బయటవాళ్లని ఎదుర్కోవడమే నిజమైన రాజకీయం అని ఈ కరోనా తరువాత నాకు బాగా అర్థమైందని అన్నాడు అధికార ప్రతినిధి, సినీనటి . ఇటీవల ఆమె పార్టీ మారతారనే వార్తలు రావడంతో వాటిపై స్పందించిన ఆమె.. దేనికైనా టైం రావాలని అన్నారు. ఇక తెలుగుదేశం పార్టీ ఇన్ సైడ్ పాలిటిక్స్ గురించి ఆమె ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. నాకు రాజకీయాలు చేతకావు.. అంతా ఫేస్ టు ఫేస్ ప్రస్తుతం నేను టీడీపీ పార్టీలో హ్యాపీగానే ఉన్నాను.. నాకు రాజకీయాలు చేయడం చేతకాదు.. ఉన్నది ఉన్నట్టు మాట్లాడేస్తుంటా. ఈ షార్ట్ పొలిటికల్ జర్నీలో నాకు చంద్రబాబు గారు ఉన్నతమైన స్థానం ఇచ్చారు. పార్టీ అధికార ప్రతినిధి అని మంచి హోదా ఇచ్చారు. పార్టీ అధికారంలోకి రాకపోవడం బ్యాడ్ లక్ కానీ.. చంద్రబాబు గారు పార్టీ కోసం బాగా కష్టపడుతున్నారు. ఆయనలాగ ఇంకొకరు పుట్టరు.. పుట్టబోరు. అటువంటి వ్యక్తి దొరకడం అరుదు. అటువంటి వ్యక్తితో సహవాసం చేస్తూ నడుస్తుంటే చాలా నేర్చుకోవచ్చు. అలాంటి వ్యక్తిదగ్గరకు నిజాన్ని చేరవేయడానికి వెయ్యి మంది అడ్డు పడినా.. నేను చెప్పాల్సింది చెప్తా. విశ్వ ప్రయత్నం చేస్తుంటా.. అదొక్కటే కష్టంగా అనిపిస్తుంటుంది. చంద్రబాబు జూమ్ మీటింగ్‌లు.. మాట్లాడే అవకాశం ఇవ్వరు సార్.. తరచుగా జూమ్ మీటింగ్‌లు పెడుతుంటారు. అవి మాకు కొత్త.. సార్‌తో కూడా నేను ఓపెన్‌గానే చెప్పాను.. సార్ మాకు ప్రోపర్ గైడెన్స్ లేదు.. ఎలా వెళ్లాలి.. ఏం చేయలని అడిగాను. స్త్రీలకు గుర్తింపు.. ప్రత్యేక స్థానం అని అంటుంటారు. కానీ జూమ్ మీటింగ్‌లో 500 మంది ఉంటే.. కనీసం ఇద్దరు మహిళలకు మాట్లాడే అవకాశం ఉండదు. కనెక్ట్ చేయరు. ఎంత తహతహలాడుతుంటారో మాట్లాడాలని కానీ ఆ అవకాశం ఉండరు. ఏడ్చిన సందర్భాలు అనేకం.. నేనైతే రేపు జూమ్ మీటింగ్ అని అనగానే... ఈరోజు నుంచే ప్రిపేర్ అవుతా. ఒక పార్టీ వాయిస్ నా నోటి నుంచి వస్తున్నప్పుడు తప్పు మాట్లాడకూడదని పెద్ద పెద్ద గ్రంథాలే తిరగేస్తుంటా. అంతలా ప్రిపేర్ అవుతా. పాయింట్ టు పాయింట్ ప్రిపేర్ అవుతా. ఇంట్లో మా బాబు కూడా మమ్మీ సివిల్స్‌కి ప్రిపేర్ కావచ్చు అని అంటుంటాడు. అంత కష్టపడి ప్రిపేర్ అయితే కనీసం కాల్ కనెక్ట్ చేయరు. పోనీ ఒక్కసారి పోతే ఒక్కసారైనా కనెక్ట్ చేస్తారనుకుంటే అదీ లేదు. కాల్ కనెక్ట్ చేయండని అడగడానికి నేను పడే బాధ నాకే తెలుసు. ఆ ఉక్రోశం నేను తట్టుకోలేను. ఆపరేటర్స్‌తో కొట్లాడిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఏడ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే నేను సెన్సిటివ్.. పార్టీ నుంచి ఏమీ ఆశించి రాజకీయాల్లోకి రాలేదు నేను. ఈ కారణంతోనే టీడీపీ అక్కడా ఇక్కడా ఓడిపోయింది టీడీపీలో ఉన్న ప్రధాన మైనస్ ఏంటంటే.. కార్యకర్తలు చాలా బలంగా ఉన్నారు. హైదరాబాద్‌లో కూడా బాబు గారు అంటే ప్రాణాలు పెట్టే కుటుంబాలు లక్షల్లో ఉన్నారు. చంద్రబాబు తిరిగి రావాలనే కోరిక జనంలో బాగా ఉంది. నాకు ఫోన్ చేసి చాలామంది ఇదే విషయం చెప్పారు. కానీ.. పార్టీలో ఉండే ఇన్ సైడ్ పాలిటిక్స్ దెబ్బకొడుతున్నాయి. పార్టీని తీసుకుని వెళ్లే విధానం కానీ.. పార్టీ కేడర్ సరిగా లేకపోవడం వల్లనే అటు ఏపీలో ఇటు తెలంగాణలో ఓడిపోవడానికి కారణం అని నాకు అనిపిస్తుంది. ఇది నా వ్యక్తిగత కారణం మాత్రమే. దేవుని సాక్ష్యం చెప్పడానికి డబ్బులు తీసుకుంటానా?? నేను డబ్బులు తీసుకుని దేవుడి సాక్ష్యం చెప్తానని ఓ వ్యక్తి నన్ను విమర్శించాడు.. ఆయన మాట్లాడిన తీరు చూసి నేనే ఏడ్చేశా. మనం నోటితో ఏది మాట్లాడితే దేవుడికి లెక్క చెప్పుకోవాలి. నోరు ఉందని మాట్లాడేయడం కాదు కదా.. నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నా.. దివ్యవాణి దేవుని సాక్ష్యం చెప్పడానికి వెళ్లినప్పుడు డబ్బులు అడిగిందని ఒక్కరితో అయినా చెప్పించమనండి. ఎందుకంటే నేను ఇండియాలోనే కాదు.. వరల్డ్ వైడ్‌గా నన్ను ఆహ్వానిస్తుంటారు. ఎవరైనా నాకు డబ్బులు ఇస్తానంటే.. మినిస్ట్రీస్ కోసం వాడండి బ్రదర్ అని చెప్తా.. దేవుని చిత్తమై కలిసినప్పుడు ఖచ్చితంగా తీసుకుంటా అని చెప్పా. కానీ నా గురించి తప్పుగా ప్రచారం చేశారు. ఓ పది కత్తులు తీసుకుని పొడిచేసినా పర్లేదు కానీ.. దేవుడి విషయంలో అలా మాట్లాడే సరికి చాలా బాధపడ్డా.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2O41f3V
v

‘చెక్’ ఫస్ట్ డే కలెక్షన్స్.. నిర్మాతలకు గట్టిదెబ్బ.. భీష్మ కంటే వీక్

నితిన్, రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా ప్రకాష్ వారియర్ హీరో హీరోయిన్లుగా నటించిన ‘చెక్’ చిత్రం శుక్రవారం నాడు భారీ అంచనాలతో థియేటర్స్‌లో విడుదలైంది. మోస్ట్ వ‌ర్స‌టైల్ డైరెక్టర్ చంద్రశేఖర్ యేలేటి ఈ చిత్రానికి దర్శకత్వం వహించగా.. ‘భవ్య క్రియేషన్స్’‌ బ్యానర్ పై వి. ఆనందప్రసాద్‌ భారీ బడ్జెట్‌తో నిర్మించారు. అయితే ఈ చిత్రానికి యావరేజ్ టాక్ రావడంతో ఆ ప్రభావం కలెక్షన్లపై పడింది. ప్రపంచ వ్యాప్తంగా 875పైగా స్క్రీన్స్‌లో విడుదలైన ఈ చిత్రం.. తొలిరోజు 3.59 కోట్ల షేర్ వచ్చినట్టు తెలుస్తోంది. నైజాం 1.46 కోట్ల షేర్ సీడెడ్ 0.47 కోట్ల షేర్ ఉత్తరాంధ్ర 0.34 కోట్ల షేర్ ఈస్ట్ 0.14 కోట్ల షేర్ వెస్ట్ 0.10 కోట్ల షేర్ గుంటూరు 0.58 కోట్ల షేర్ కృష్ణా 0.21 కోట్ల షేర్ నెల్లూరు 0.09 కోట్ల షేర్ ఏపీ + తెలంగాణ (టోటల్) 3.39 కోట్ల షేర్ రెస్ట్ ఆఫ్ ఇండియా 0.10 కోట్ల షేర్ ఓవర్సీస్ 0.10 కోట్ల షేర్ వరల్డ్ వైడ్ (టోటల్) 3.59 కోట్ల షేర్ నితిన్ గత చిత్రం ‘భీష్మ’తో పోల్చుకుంటే ‘చెక్’ చిత్రానికి ఫస్ట్ డే కలెక్షన్స్ వీక్ అనే చెప్పాలి. ‘భీష్మ’ చిత్రం తొలిరోజు రూ. 6.42 కోట్ల రికార్డ్ కలెక్షన్లు రాబట్టింది. దాంట్లో సగానికి మాత్రమే పరిమితం అయ్యింది ‘చెక్’. ఇక చిత్రానికి దాదాపు రూ.16.10 కోట్ల బిజినెస్ జరిగింది. తొలిరోజు రూ.3.59 కోట్లు కలెక్షన్లు రావడంతో బ్రేక్ ఈవెన్ సాధించాలంటే మరో 13.03 కోట్లు రాబట్టాల్సి ఉంటుంది. వైష్ణవ్ తేజ్ నటించిన ఉప్పెన మూవీ రీసెంట్‌గా విడుదలై తొలిరోజు రూ.10.42 రికార్డ్ కలెక్షన్లు సాధించింది. ఆ లెక్కన చూసుకున్న అందులో సగం కలెక్షన్లకు కూడా ‘చెక్’ పెట్టలేకపోయింది నితిన్ ‘చెక్’. Read Also:


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3aWWxOj
v

A: డిఫరెంట్ కథ ఇంప్రెస్ చేసిందన్న విజయ్ సేతుపతి.. చూడగానే థ్రిల్ అయ్యారట

కోలీవుడ్ సూపర్ స్టార్ టాలీవుడ్‌లో కూడా సత్తా చాటుతున్నారు. వచ్చిన అవకాశాన్ని పర్ఫెక్ట్‌గా వాడుకుంటూ తెలుగు ప్రేక్షకులను బాగా దగ్గరవుతున్నారు. ప్రేక్షకులకు నచ్చే కథలను ఎంపిక చేసుకుంటూ విలక్షణ రోల్స్ పోషిస్తున్న ఆయన ఇటీవలే 'ఉప్పెన' విజయంలో కీలకం అయ్యారు. ఇదిలా ఉంటే తాజాగా 'A' అనే తెలుగు మూవీకి సపోర్ట్‌గా నిలుస్తూ ఆ కథ ఎంతో బాగుందని చెబుతూ సినిమాపై హైప్ పెంచేశారు విజయ్ సేతుపతి. నితిన్ ప్రసన్న, హీరోహీరోయిన్లుగా యుగంధర్ ముని దర్శకత్వంలో ‘A’ మూవీ రూపొందింది. అవంతిక ప్రొడక్షన్స్ పతాకంపై గీతా మిన్సాల నిర్మించిన ఈ చిత్రం డిఫరెంట్ థ్రిల్లర్‌గా అలరించనుందట. విజయ్ కురాకుల సంగీతం అందించారు. ఇటీవలే ఈ సినిమా ట్రైలర్‌ను మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి విడుదల చేయగా ఆ ట్రైలర్‌కు మంచి స్పందన వచ్చింది. దీంతో ముంబైలో షూటింగ్స్‌లో పాల్గొంటున్న విజయ్ సేతుపతిని ప్రత్యేకంగా కలిసి తమ సినిమాకు సపోర్ట్‌గా నిలిచినందుకు కృతజ్ఞతలు తెలిపారు దర్శకనిర్మాతలు. ఈ సందర్భంగా A చిత్రంలోని కొంత పార్ట్‌ని చూసి అయన ఎంతో థ్రిల్ అయ్యారని చిత్ర దర్శకనిర్మాతలు పేర్కొన్నారు. ఈ చిత్రం మంచి సక్సెస్ అందుకుంటుందని ఆయన అన్నారట. ఈ మేరకు 'A' మూవీ టీమ్ మొత్తాన్ని విజయ్ సేతుపతి అభినందించారట. ఓ చిన్న సినిమాకు ఇలాంటి పెద్ద హీరోల సపోర్ట్ ఎంతో మేలు చేస్తుంది. తాజాగా తమ సినిమా విషయంలో అదే జరుగుతోందని, జనాల్లో సినిమాపై అంచనాలు పెరిగాయని చిత్రయూనిట్ చెబుతోంది. నిజాలు కల్పితాల కంటే చాలా బలంగా ఉంటాయనే డిఫరెంట్ కాన్సెప్ట్‌తో రాబోతున్న ఈ మూవీ మార్చి 5వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. PVR పిక్చర్స్ వారు ఘనంగా విడుదల చేయబోతున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3bNILN8
v

జోరుమీదున్న వైష్ణవ్ తేజ్.. నాని కాదన్న కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన మెగా కాంపౌండ్ హీరో!

మెగా కాంపౌండ్ హీరోగా 'ఉప్పెన' సినిమాతో తెరంగేట్రం చేసిన .. తొలి సినిమాతోనే పలువురు సినీ ప్రముఖుల ప్రశంసలందుకున్నారు. కెమెరా ముందు ఈ హీరో చూపిన హావభావాలు, నటన తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. దీంతో ఆయనకు ఆఫర్స్ వెల్లువెత్తుతున్నాయట. పలువురు దర్శకనిర్మాతలు వైష్ణవ్ డేట్స్ కోసం క్యూ కడుతున్నారట. ఈ నేపథ్యంలోనే హీరో రిజెక్ట్ చేసిన ఓ కథను వైష్ణవ్ ఓకే చేశారని తెలుస్తోంది. ఇటీవల నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్ ఓ కొత్త దర్శకుడు చెప్పిన కథను ఓకే చేశాడు. అది హీరో నాని చేస్తే బాగుంటుందని భావించిన ఆయన నానికి కథ చెప్పగా.. నాని రిజెక్ట్ చేశారట. దీంతో అదే కథను మెగా కాంపౌండ్ కొత్త హీరో వైష్ణవ్ తేజ్‌కు వినిపించడంతో ఆ స్టోరీ నచ్చి వైష్ణవ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారని ఫిలిం నగర్ టాక్. త్వరలోనే ఈ మూవీ సెట్స్ మీదకు వెళ్లనుందని అంటున్నారు. ఇకపోతే దర్శకుడు క్రిష్‌తో ఓ సినిమా చేస్తున్న వైష్ణవ్ తేజ్.. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్‌పై మరో సినిమా, భోగవల్లి ప్రసాద్ బ్యానర్‌పై ఇంకో సినిమా చేయబోతున్నారట. మొత్తానికి ‘ఉప్పెన’ సక్సెస్‌తో వైష్ణవ్ జోష్ నడుస్తోంది. ఇదిలా ఉంటే మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌పై రూపొందించిన 'ఉప్పెన' మూవీ ఆశించిన దానికి మించి ఫలితం రాబట్టడంతో హీరో హీరోయిన్లు వైష్ణవ్ తేజ్, కృతి శెట్టి, డైరెక్టర్ బుచ్చిబాబుకు స్పెషల్ గిఫ్ట్ ఇచ్చారట నిర్మాతలు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3dUOC66
v

శ్రీవారిని ద‌ర్శించుకున్న ఉప్పెన టీమ్.. కాలినడక కొండెక్కిన వైష్ణవ్ తేజ్, కృతి శెట్టి

'ఉప్పెన' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన మెగా కాంపౌండ్ హీరో వైష్ణవ్‌ తేజ్ తొలి సినిమా తోనే సూపర్ సూపర్ హిట్ ఖాతాలో వేసుకున్నాడు. సుకుమార్ శిష్యుడు, నూతన దర్శకుడు బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా కలెక్షన్ ప్రవాహం పారిస్తూ నిర్మాతలకు లాభాల పంట పండిస్తోంది. ఇక ఈ చిత్రంలో హీరోయిన్ నటనకు తెలుగు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. దీంతో ఒక్కసారిగా 'ఉప్పెన' టీమ్ మొత్తానికి అవకాశాలు వెల్లువెత్తున్నాయి. ఈ ఆనందంలో టీమ్ అంతా కలిసి నేడు (శనివారం) తిరుమ‌ల‌ శ్రీవారిని ద‌ర్శించుకున్నారు. , కృతి శెట్టి, నిర్మాత నవీన్, డైరెక్టర్ బుచ్చిబాబు అంతా కలిసి శ్రీవారి దర్శనం చేసుకున్నారు. హీరో వైష్ణవ్ తేజ్, హీరోయిన్ కృతి శెట్టి కాలినడకన కొండెక్కడం విశేషం. వారు కొండెక్కుతుండ‌గా తీసిన వీడియోలు, ఫొటోలు సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్ అవుతున్నాయి. శ్రీవారిని దర్శించుకున్న అనంతరం డైరెక్టర్ బుచ్చిబాబు మీడియాతో మాట్లాడుతూ.. ''ఈ సినిమా స్క్రిప్ట్‌ను స్వామి వారి పాదాల చెంత ఉంచి ఆశీస్సులు పొందాము. ఆ ఆశీస్సులతో ఉప్పెన సినిమా విజ‌యం సాధించింది. తదుపరి సినిమా స్క్రిప్ట్‌ను కూడా శ్రీవారి పాదాల చెంత ఉంచి ఆశీస్సులు పొందా. ఆ సినిమా వివరాలు త్వరలో ప్రకటిస్తా'' అని తెలిపారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/37RMIQ6
v

Friday 26 February 2021

ప్రతి అమ్మాయికి అలాంటోడే కావాలంటూ లాజిక్ బయటకు తీసిన శ్రీ విష్ణు.. 'గాలి సంపత్'కి రాజమౌళి సపోర్ట్

నటకిరీటి టైటిల్ రోల్ పోషించిన చిత్రం ‘’. ఈ సినిమాలో యంగ్ హీరో , లవ్‌లీ సింగ్ హీరో హీరోయిన్లుగా నటించారు. అనీష్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి అనిల్ రావిపూడి దర్శకత్వ పర్యవేక్షణ చేయడం విశేషం. షైన్ స్క్రీన్స్, ఇమేజ్ స్పార్క్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్స్‌పై సాహు గారపాటి, హరీష్ పెద్ది, ఎస్. క్రిష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అచ్చు రాజమణి సంగీతం సమకూర్చారు. ఇటీవలే షూటింగ్ కంప్లీట్ చేసి మార్చి 11వ తేదీన ఈ సినిమాను విడుద‌ల చేయబోతున్న చిత్రయూనిట్ ప్రమోషన్స్ గట్టిగా చేస్తోంది. ఇందులో భాగంగా తాజాగా దర్శక ధీరుడు రాజమౌళి చేతుల మీదుగా చిత్ర ట్రైలర్ లాంచ్ చేయించారు. 2 నిమిషాల 17 సెకనుల నిడివితో కట్ చేయబడిన ఈ ట్రైలర్‌తో సినిమాపై హైప్ పెంచేశారు మేకర్స్. ''పిల్లలు తప్పు చేస్తే తల్లిదండ్రులు చాలా ఓపికగా ఆ తప్పులను కరెక్ట్ చేస్తారు. అదేంటో కాస్త మీసాలు వచ్చేసరికి పెద్దోళ్ళు ఏమి చేసినా ఊరికే చిరాకులొచ్చేస్తాయి.. కోపాలు వచ్చేస్తాయి.. నేను కూడా మా నాన్నని కాస్త ఓపికగా ప్రేమగా అడగాల్సింది'' అంటూ హీరో శ్రీ విష్ణు చెప్పే డైలాగ్‌తో ప్రారంభమైన ఈ ట్రైలర్ ఆసక్తికరంగా సాగిపోయింది. ''ప్రతి అమ్మాయికీ డ‌బ్బున్నోడే కావాలి.. లేక‌పోతే ఫారినోడు కావాలి.. డ‌బ్బున్నోడు ఏం ఇస్తాడండీ? డ‌బ్బే ఇస్తాడు. టైమ్ ఎక్క‌డి నుంచి ఇస్తాడు'' అంటూ హీరోయిన్‌తో లాజికల్ డైలాగ్ చెప్పిన శ్రీ విష్ణు తన నటనతో ఆకట్టుకున్నారు. మొత్తానికి ఈ 'గాలి సంపత్' సినిమాలో కామెడీతోపాటు తండ్రికొడుకుల ఎమోషన్, లవ్ అన్నీ కాస్త కొత్తగా చూపించబోతున్నారని ట్రైలర్ ద్వారా స్పష్టమైంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3svEm8l
v

Nithiin: బతుకు బస్టాండ్ అయిందంటున్న నితిన్.. పెళ్లి తర్వాత పడుతున్న కష్టాలన్నీ చెప్పుకున్న యంగ్ హీరో

రీసెంట్‌గా మ్యారేజ్ చేసుకొని ఓ ఇంటివాడైన నితిన్.. పెళ్లి తర్వాత పడుతున్న కష్టాలను పాట రూపంలో ప్రెజెంట్ చేశారు. పెళ్లి తర్వాత బతుకు బస్టాండ్ అయిపోయిందంటూ తన గోడు వినిపించారు. కాకపోతే ఇది రియల్ లైఫ్ స్టోరీ కాదు.. రీల్ లైఫ్ స్టోరీ. అదేనండీ.. హీరోగా రాబోతున్న రొమాంటిక్ లవ్ స్టోరీ 'రంగ్ దే' మూవీలో మ్యాటరే ఇది. తాజాగా ఈ సినిమా నుంచి 'బతుకు బస్టాండ్' సాంగ్ రిలీజ్ చేసి పెళ్లి తర్వాత నితిన్ కష్టాలను తెలిపారు. వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'రంగ్ దే' మూవీ మార్చి 26వ తేదీన విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలు వేగవంతం చేసిన చిత్రయూనిట్ తాజాగా ఈ సాంగ్ రిలీజ్ చేశారు. నితిన్, కీర్తి సురేష్‌లపై అందమైన లొకేషన్స్‌లో షూట్ చేసిన ఈ సాంగ్ యూత్ ఆడియన్స్‌ని అట్రాక్ట్ చేస్తోంది. నితిన్ గోడు వెలిబుచ్చుతూ ఈ పాటను సాగర్ ఆలపించగా, శ్రీమణి లిరిక్స్ అందించారు. దేవీ శ్రీ ప్రసాద్ బాణీలు కట్టారు. సితార ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌‌పై సూర్యదేవర నాగవంశీ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. నితిన్, జంటగా నటించారు. సీనియర్ నటుడు నరేష్, వినీత్, రోహిణి, కౌసల్య, బ్రహ్మాజీ, వెన్నెల కిషోర్, సత్యం రాజేష్, అభినవ్ గోమటం, సుహాస్, గాయత్రి రఘురామ్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాపై నితిన్ ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3bHGHGx
v

మనసులో మాట బయటపెట్టిన ప్రియా ప్రకాష్.. అల్లు అర్జున్‌తో ఆ ఛాన్స్ కోసం వెయిటింగ్ అంటూ ఓపెన్

కన్నుకొట్టి ఓవర్ నైట్ స్టార్‌గా మారిపోయిన బ్యూటిఫుల్ హీరోయిన్ తన తొలి తెలుగు సినిమా `చెక్‌`తో ప్రేక్షకుల ముందుకొచ్చింది. చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో నితిన్‌ హీరోగా నటించగా, మరో హీరోయిన్‌గా రకుల్ ప్రీత్ సింగ్ నటించింది. కాగా టాలీవుడ్‌పై ఫుల్ ఫోకస్ పెట్టిన ఈ ముద్దుగుమ్మ అప్పుడే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌పై కన్నేసింది. ఆయనతో నటించాలని ఉందంటూ మనసులో మాట బయటపెట్టింది. ఆ మధ్యకాలంలో అల్లు అర్జున్ సినిమాలో నటించే ఛాన్స్ వస్తే ప్రియా ప్రకాష్ రిజెక్ట్‌ చేసిందంటూ వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా ఆ విషయానికి చెక్ పెట్టేస్తూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది ప్రియా. తాను చిన్నప్పటి నుంచే బన్నీ సినిమాలు చూస్తూ పెరిగానని, బన్నీ అంటే తనకెంతో అభిమానం అని చెప్పుకొచ్చింది. ఆయన సినిమాలో నటించే అవకాశం నాకు వచ్చిందని, నేను ఆ ఆఫర్‌ను తిరస్కరించానని రీసెంట్‌గా వార్తలు నిజం కాదని ప్రియా స్పష్టం చేసింది. ఏది ఏమైనా అల్లు అర్జున్ సరసన నటిస్తానని, ఒకవేళ ఆ అవకాశం రావాలే గానీ అస్సలు వదిలేదే లేదంటూ క్లారిటీ ఇచ్చేసింది ప్రియా ప్రకాష్. ప్రస్తుతం సూపర్ ఫామ్‌లో ఉన్న ప్రియాకు టాలీవుడ్ నుంచి వరుస ఆఫర్స్ వస్తున్నట్లు టాక్. ఇప్పటికే తేజ సజ్జకు జోడీగా ఓ సినిమాలో నటిస్తోంది ప్రియా. సో.. చూడాలి మరి అల్లు అర్జున్‌తో కలిసి నటించాలనే ఈ వింకీ బ్యూటీ కోరిక ఎప్పుడు నెరవేరుతుందనేది!.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/37Opvy0
v

భారతదేశపు మొట్టమొదటి మడ్ రేస్ మూవీ `మడ్డీ`.. టీజ‌ర్‌ రిలీజ్ చేసిన అనిల్ రావిపూడి

పాన్ ఇండియా చిత్రంగా రూపొందుతున్న భారతదేశపు మొట్టమొదటి మడ్ రేస్ చిత్రం `మడ్డీ`. భారీ బడ్జెట్‌తో తెలుగు, కన్నడ, హిందీ, తమిళ, మలయాళ భాషల్లో ఎన్నడూ చూడని కాన్సెప్ట్‌తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. చిత్రంలో యువన్, రిధాన్ కృష్ణ ప్రధాన పాత్రలు పోషిస్తుండగా.. డాక్టర్ ప్రగభల్ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. PK7 క్రియేషన్స్ బ్యానర్ పై ప్రేమ కృష్ణదాస్ నిర్మిస్తున్నారు. చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా ఈ 'మడ్డీ' మూవీ తెలుగు టీజర్‌ను బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి రిలీజ్ చేసి టీమ్ అంద‌రికీ ఆల్ ది బెస్ట్ చెప్పారు. ఇక ఈ 'మడ్డీ' టీజర్‌లో రవి బస్రూర్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, కెజీ రతీష్ సినిమాటోగ్రఫీ చాలా క్రిస్ప్‌గా ఉండి టీజ‌ర్‌ను నెక్ట్స్ లెవ‌ల్‌కి తీసుకెళ్లాయి. టీజ‌ర్‌ చూస్తుంటే మడ్డీ చిత్రం ప్రేక్షకులను ఒక థ్రిల్లింగ్ రైడ్‌కి తీసుకెళ్ళడం ఖాయం అనిపిస్తోంది. సాహసోపేతమైన సన్నివేశాలతో యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ చిత్రం ప్రేక్షకులకు అద్భుత అనుభవాన్ని అందించనుంది. టీజ‌ర్‌‌తో సినిమా మీద ఆసక్తి, అంచనాలు మరింత పెరిగాయి. చిత్ర దర్శకుడు ప్రగభల్‌కి ఆఫ్ రోడ్ రేసింగ్ పట్ల ఉన్న ఆసక్తి, అనుభవం నుండే ప్రధానంగా మడ్డీ రూపొందింది. అయిదు సంవత్సరాల రీసెర్చ్ అనంతరం పక్కా స్క్రిప్ట్ సిద్ధం చేసుకుని ఈ సినిమా తీస్తున్నారు. ప్ర‌ధానంగా రెండు వేర్వేరు జట్ల మధ్య శత్రుత్వం, ప్రతీకారం నేపథ్యం అయినప్పటికీ ఫ్యామిలీ డ్రామా, హాస్యం, సాహసం ఇలా ప్ర‌తి ఎమోష‌న్ ఈ మూవీలో ఉండనుందట. ఈ సినిమా కోసం ఆఫ్-రోడ్ రేసింగ్‌లో ప్రధాన నటులకు రెండేళ్లు శిక్షణ ఇచ్చామని, ఆర్టిస్టులు ఏ డూప్ లేదా జూనియర్ స్టంట్ మేన్ లేకుండా సాహసోపేత సీన్స్, స్టంట్స్ చేశారని దర్శకనిర్మాతలు చెప్పారు. ఈ చిత్రంలో యువన్, రిధాన్ కృష్ణ, అనుషా సురేష్, అమిత్ శివదాస్ నాయర్, హరీష్ పెరాడి, ఐ ఎం విజయన్ & రెంజీ పానికర్ ప్ర‌ధాన పాత్ర‌లు పోషిస్తున్నారు. ఇకపోతే ఇతర భాషల్లో ఈ మడ్డీ టీజర్‌ను అర్జున్ కపూర్, ఫాహద్ ఫాసిల్, జయం రవి మరియు శివ రాజకుమర్ రిలీజ్ చేశారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/37UKkIi
v

ఆ మాటంటూ స్టార్ హీరోయిన్ భయపడింది.. వెంటనే కాజల్‌కి కాల్ చేయడంతో! సీక్రెట్ చెప్పిన మంచు విష్ణు

గత కొన్నేళ్లుగా కెరీర్‌లో సరైన హిట్ పడక సతమతమవుతున్న .. ఓ భారీ స్కామ్‌ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చి థ్రిల్ చేయడానికి రెడీ అవుతున్నారు. ఈ సారి ఎలాగైనా పాన్ ఇండియా రేంజ్‌లో హిట్ కొట్టాలని 'మోసగాళ్లు' సినిమాతో బరిలోకి దిగుతున్నారు. 50 కోట్లకు పైగా కేటాయించి హై టెక్నికల్ వాల్యూస్‌తో ఈ మూవీ తెరకెక్కించారు. చిత్రంలో మంచు విష్ణుకి చెల్లెలిగా హీరోయిన్ కాజల్ అగర్వాల్ ముఖ్యపాత్ర పోషించారు. ఈ నేపథ్యంలో తాజాగా జరిగిన ఓ మీడియా సమావేశంలో కొన్ని ఆసక్తికర విషయాలు చెప్పారు విష్ణు. ఈ సినిమాలో సిస్టర్ పాత్రకు మొదట ప్రీతీ జింటాను అనుకున్నామని, కానీ అమెరికాకు సంబంధించిన మనీ స్కామ్ స్టోరీ అనగానే ఆమె నన్ను కన్విన్స్ చేయడానికి ప్రయత్నించారని మంచు విష్ణు చెప్పుకొచ్చారు. ఈ సినిమాలో నటించలేను. ఇలాంటి సినిమా చేస్తే నన్ను కొడతారు. నా ఫ్యామిలీ మొత్తం యూఎస్‌లో ఉంటోందని ఆమె చెప్పారని విష్ణు పేర్కొన్నారు. దీంతో కాజల్‌కు ఫోన్ చేయడంతో వెంటనే ఒప్పుకుందని ఆయన తెలిపారు. రిస్క్ అని తెలిసినా కూడా మోసగాళ్ళు సినిమా నా మార్కెట్ పరిధిని బ్రేక్ చేయగలదనే నమ్మకం ఉందని విష్ణు తెలిపారు. జెఫ్రీ గీ చిన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో మంచు విష్ణు, కాజల్‌లతో పాటు సునీల్ శెట్టి, నవీన్ చంద్ర, నవదీప్, వైవా హర్ష ముఖ్య పాత్రలు పోషించారు. అయితే కాజల్ రోల్ చిత్రానికి మేజర్ అసెట్ కానుందని సమాచారం. ప్రపంచంలో జరిగిన అతిపెద్ద ఐటీ స్కామ్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాను ఏవీఏ ఎంటర్‌టైన్మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్లపై మంచు విష్ణు స్వయంగా నిర్మిస్తుండటం విశేషం. ఇటీవలే చిరంజీవి రిలీజ్ చేసిన ఈ మూవీ ట్రైలర్ ప్రేక్షకుల నుంచి విశేష స్పందన తెచ్చుకుంటోంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3aYEAiE
v

కన్నడ వాళ్లు నాకు ఇచ్చిన రెస్పెక్ట్ తెలుగు వాళ్లు కూడా ఇవ్వలేదు: జగపతిబాబు

కన్నడ ఛాలెంజింగ్ స్టార్ ద‌ర్శన్ క‌థానాయ‌కుడిగా రూపొందిన చిత్రం ‘రాబర్ట్’. తరుణ్ కిషోర్ సుధీర్ దర్శకత్వం వహించారు. ఉమాప‌తి ఫిలింస్ బ్యాన‌ర్‌పై ఉమాప‌తి శ్రీనివాస గౌడ నిర్మించారు. ఈ సినిమాను అదే పేరుతో తెలుగులో అనువాదం చేసి విడుదల చేస్తున్నారు. కన్నడలో మాస్ హీరోగా మంచి ఇమేజ్ ఉన్న దర్శన్.. ఇప్పుడు ‘రాబర్ట్’ ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమవుతున్నారు. ఈ సినిమాను మార్చి 11న విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా చిత్ర ప్రచారంలో భాగంగా ‘రాబర్ట్’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను శుక్రవారం (ఫిబ్రవరి 26న) హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ ఈవెంట్‌లో హీరో దర్శన్‌తో పాటు ఈ సినిమాలో కీలక పాత్ర పోషించిన జగపతిబాబు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జగపతిబాబు మాట్లాడుతూ హీరో దర్శన్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. ‘‘నేను ఫంక్షన్లకు రావడం మానేశాను.. ఆ విషయం మీ అందరికీ తెలుసు. కానీ, ఈ ఫంక్షన్‌కు నేను రావాలి అని అనుకున్నాను. ఎందుకంటే కన్నడ వాళ్లను చూడాలి, వాళ్లతో మాట్లాడాలి, వాళ్ల గురించి చెప్పాలి. ఇంతకు ముందు నేను కన్నడ సినిమాలు చేశాను. అన్నీ ఫ్లాపయ్యాయి. సాధారణంగా నాకు ఆలస్యంగానే హిట్లొస్తాయి. ఈ సినిమా కథ చెప్పగానే ఇది సూపర్ డూపర్ హిట్ అనే నమ్మకం నాకు కలిగింది. తరుణ్ అంత బాగా నాకు స్క్రిప్ట్ నెరేట్ చేశాడు. తరుణ్ లాంటి డైరెక్టర్, దర్శన్ లాంటి హీరో, ఉమాపతి గారు లాంటి నిర్మాత ఉన్నప్పుడు ఈ సినిమానే కాదు ఏ సినిమా అయినా చేస్తాను. వాళ్లు వద్దనుకున్నా నేను సినిమా చేస్తాను. అంతకంటే మంచి మనుసులు, మనసులు ఉండవు. దర్శన్ కాళ్లు ఎప్పుడూ నేలపైనే ఉంటాయి అని ఇందాక ఎవరో అన్నారు. కాళ్లే కాదు తల కూడా నేల మీదే ఉంటుంది. కానీ, మనిషి ఎప్పుడూ ఆకాశంలో ఉంటాడు. అతనొక రియల్ స్టార్. ఎందుకంటే, నటులు చాలా మంది ఉంటారు.. నటించడం గొప్ప విషయం కాదు.. లైఫ్‌లో హీరోగా ఉండటం గొప్ప. ఎవరికి ఏది కావాలంటే అది ఇచ్చేస్తాడు, ఏమీ ఆలోచించడు.. అవి కోట్లయినా కావచ్చు ఇంకేమైనా కావచ్చు. ఆయన గురించి చాలా విన్నాను.. చూశాను. అలాగే, నేను కర్ణాటక వెళ్లి అక్కడ సినిమా చేస్తున్నప్పుడు నాకు వీళ్లిచ్చిన రెస్పెక్ట్ తెలుగు వాళ్లు కూడా ఇవ్వరు. అంత రెస్పెక్ట్ ఇస్తారు. వాళ్లు ఒక్కటే చెప్పారు.. మా ఇంటికొచ్చారు, మీరు మా గెస్ట్, మా గెస్ట్‌ను మేం బాగా చూసుకుంటాం అని నిర్మాత దగ్గర నుంచి డైరెక్టర్, హీరో ఇలా ప్రతి ఒక్కరూ నన్ను చాలా బాగా చూసుకున్నారు. కాబట్టి, మార్చి 11న ‘రాబర్ట్’ మన ఇంటికి వస్తోంది.. మన తెలుగింటికి వస్తోంది. మనవాళ్లు వస్తున్నారు.. మన గడపకు వస్తున్నారు. వాళ్లను గుండెల్లో పెట్టుకుని మనం చూసుకోవాలి. ‘రాబర్ట్’ ఎలాగూ సూపర్ హిట్ అవుతుంది. కానీ, మనస్ఫూర్తిగా చూస్తే ఇంకా బాగుంటుంది. ఆ ఇండస్ట్రీ మనతో కలిసిపోవాలి.. మనందరం కలిసి ఉండాలి అనేది నా ఆశ. నిజానికి నేను ఇదే నిర్మాతతో వేరే సినిమా చేశాను. మైసూర్‌లో షూటింగ్ చేస్తున్నాం. నేనున్నానని తెలిసి దర్శన్ నా కోసం అందరినీ పిలిచి నాకు మరోసారి స్వాగతం చెబుతూ గెట్ టుగెదర్ జరిపాడు. దీన్ని బట్టి ఆ మనిషి ఒక మంచి వ్యక్తో మీరు ఆలోచించుకోవచ్చు. మీ అందరికీ తెలుసు నేను ఎవరినీ పొగడనని.. నేను నిజమే చెబుతాను. అంతకంటే నాకు ఏం రాదు’’ అంటూ దర్శన్‌పై, కన్నడిగలపై ప్రశంసల వర్షం కురిపించారు జగపతిబాబు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3bIaHCf
v

ఫ్యాన్స్‌ను సర్‌ప్రైజ్ చేయబోతున్న ఎన్టీఆర్.. వచ్చే వారమే ప్రోమో!!

పాపులర్ రియాలిటీ గేమ్ షో ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ కొత్త సీజన్‌కు యంగ్ టైగర్ ఎన్టీఆర్ వ్యాఖ్యాతగా వ్యవహరించనున్నట్టు ఇప్పటికే ఖరారైంది. ‘బిగ్ బాస్’ తొలి సీజన్‌ను హోస్ట్ చేసి శభాష్ అనిపించుకున్న ఎన్టీఆర్.. ఆ షో విపరీతంగా పాపులర్ కావడానికి దోహదపడ్డారు. ఎన్టీఆర్ తొలి సీజన్‌ను మాత్రమే హోస్ట్ చేసినా ఇప్పటికీ ఆయన్నే బెస్ట్ హోస్ట్‌గా అంతా చెబుతుంటారు. అంతలా ఆయన ఇంపాక్ట్ క్రియేట్ చేశారు. అయితే, ఇప్పుడు ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ ద్వారా బుల్లితెరపై సెన్సేషన్ క్రియేట్ చేయడానికి వస్తున్నారు తారక్. ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ ప్రచారంలో భాగంగా తాజాగా ప్రోమోను చిత్రీకరించారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో ఈ ప్రోమో క్రియేటివ్‌గా రూపొందుతోందని సమాచారం. ఈ ప్రోమో వచ్చే వారం అందుబాటులోకి వస్తుందని అంటున్నారు. ఈ ప్రోమోతో ప్రచార కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. వచ్చే నెల నుంచి ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ టీవీలో ప్రసారమవుతుందని సమాచారం. ఇప్పటికే బ్యాక్‌గ్రౌండ్ వర్క్ అంతా పూర్తయిందట. ఈ సీజన్ జెమిని టీవీలో ప్రసారం కానుంది. ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ ఇప్పటి వరకు నాలుగు సీజన్లు జరిగాయి. 2014 జూన్‌లో తొలి సీజన్‌ నాగార్జున హోస్ట్‌గా ప్రారంభమైంది. అదే ఏడాది డిసెంబర్‌లోనే రెండో సీజన్ కూడా ప్రారంభమైంది. 2015 నవంబర్‌లో మూడో సీజన్‌ను ప్రసారం చేశారు. ఈ మూడు సీజన్లకు అక్కినేని నాగార్జునే వ్యాఖ్యాతగా వ్యవహరించారు. 2017లో ప్రసారమైన నాలుగో సీజన్‌ను మాత్రం మెగాస్టార్ చిరంజీవి హోస్ట్ చేశారు. ఈ నాలుగు సీజన్లు మా టీవీలో ప్రసారమయ్యాయి. అయితే, ఇప్పుడు ఎన్టీఆర్ హోస్ట్ చేయబోయే ఐదో సీజన్ మాత్రం జెమిని టీవీలో ప్రసారం కానుంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3bG0DcR
v

‘శ్రీకారం’లో ఆ డైలాగ్ చాలా బాగుంది.. శర్వానంద్ సినిమాకు త్రివిక్రమ్ కితాబు

శర్వానంద్ హీరోగా 14 రీల్స్ ప్లస్ పతాకంపై రామ్ ఆచంట, గోపీ ఆచంట సంయుక్తంగా నిర్మించిన చిత్రం ‘శ్రీకారం’. కిషోర్ బి. దర్శకత్వం వహించారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్‌కి మంచి స్పందన వచ్చింది. మిక్కీ జె. మేయర్ ఈ చిత్రానికి అద్భుతమైన స్వరాలను సమకూర్చారు. కాగా ‘శ్రీకారం’ చిత్రంలోని టైటిల్ సాంగ్‌ని మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ విడుదల చేశారు. శుక్రవారం హైదరాబాద్ దసపల్లా హోటల్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో త్రివిక్రమ్‌తో పాటు చిత్ర నిర్మాతలు రామ్ ఆచంట, గోపీ ఆచంట, చిత్ర దర్శకుడు కిషోర్ బి, నటుడు సప్తగిరి, పాటల రచయిత రామజోగయ్య శాస్త్రి పాల్గొన్నారు. ఈ చిత్రం మార్చి 11న ప్రపంచ వ్యాప్తంగా విడుదలవుతోంది. ఈ సందర్భంగా త్రివిక్రమ్ మాట్లాడుతూ.. ‘‘14 రీల్స్ రామ్, గోపీ నాకెంతో ఇష్టమైన నిర్మాతలు. వాళ్లు దూకుడికి ఎప్పుడో శ్రీకారం చుట్టారు. కానీ ఇప్పుడు కొత్తగా మరో చాప్టర్ స్టార్ట్ చేసి దానికి ‘శ్రీకారం’ చుడుతున్నారు. మా రాంజో బ్యూటిఫుల్ లిరిక్స్ రాశారు. ఈ చిత్రంలోని మూడు పాటలు చూశాను. చాలా బాగున్నాయి. ‘శ్రీకారం’ టైటిల్ సాంగ్.. 4వ పాట నా చేతుల మీదుగా విడుదలవడం సంతోషంగా ఉంది. టీజర్ చూశాను.. నాకు బాగా నచ్చింది. స్టోరీ విన్నాను.. చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది. ‘వ్యవసాయం చేసేవాళ్ళు నెత్తి మీద జుట్టంత ఉంటే.. దానిని పండించేవాళ్ళు మూతి మీద మీసం అంత మంది ఉన్నారు’.. ఆ డైలాగ్ సూపర్బ్ గా ఉంది. ఈ చిత్రానికి ‘శ్రీకారం’ అనేది పర్ఫెక్ట్ యాప్ట్ టైటిల్. నాకు తెలిసి నెక్స్ట్ ప్రపంచానికి బిగ్ థింగ్ వ్యవసాయం. వ్యవసాయం ఎంతో పాతది అయినా దానిమీద ఆధారపడి కొన్నివేల సంవత్సరాల నుండి బతుకుతున్నాం. జనాభా పెరిగే కొద్దీ తినేవాళ్ళ సంఖ్య పెరుగుతుంది. అలాంటప్పుడు వ్యవసాయం లాభసాటిగా మారాలి. కానీ నష్టాల్లో కూరుకుపోతుంది. దానికి సొల్యూషన్ చెప్పడానికి దర్శకుడు కిషోర్ ‘శ్రీకారం’ ద్వారా ప్రయత్నం చేశాడు. ఒక పాత పద్ధతికి స్వస్తి చెప్పి కొత్త పద్ధతికి శ్రీకారం చుట్టబోతున్నారు. ‘అఆ’కు మ్యూజిక్ చేసిన మిక్కీ ఈ చిత్రానికి కూడా అద్భుతమైన పాటలు ఇచ్చాడు. ఈ సినిమాకి పనిచేసిన ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ అందరికీ నా శుభాకాంక్షలు’’ అని అన్నారు. పాటల రచయిత రామజోగయ్య శాస్త్రి మాట్లాడుతూ.. ‘‘నా అనుభవంలోంచి వచ్చిన పదాలతో టైటిల్ సాంగ్ రాశాను. దాన్ని నాకు ఎంతో ఆత్మీయ సన్నిహితుడు త్రివిక్రమ్ లాంచ్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. ఇది నా లైఫ్ లాంగ్ గుర్తుండిపోతుంది. ఒక మంచి ఆలోచింపజేసే పాయింట్‌తో కిషోర్ ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. అతనికి ఎంతో వెన్నుదన్నుగా నిలబడి సపోర్ట్ చేసిన శర్వానంద్, నిర్మాతలకు అభినందనలు. పాట విని ఎంజాయ్ చేయండి’’ అని అన్నారు. చిత్ర దర్శకుడు బి. కిషోర్ మాట్లాడుతూ.. ‘‘నాలుగేళ్ళ క్రితం ఒక షార్ట్ ఫిల్మ్ తీశాను. ఇప్పుడు ‘శ్రీకారం’తో ఫ్యూచర్ ఫిల్మ్ చేశాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన మా శర్వానంద్ అన్నకు.. రామ్, గోపీ గారికి కృతజ్ఞతలు. కొత్త డైరెక్టర్‌ని అయినా ఎంతో సపోర్ట్ చేస్తూ.. మంచి సినిమా తీశారు. యువరాజ్ బ్యూటిఫుల్ ఫోటోగ్రఫీ చేశాడు. అలాగే మిక్కీ ఎక్స్ లెంట్ మ్యూజిక్ కంపోజ్ చేశారు. పాటలకి అద్భుతమైన స్పందన వస్తోంది. వ్యవసాయంతో పాటు ఒక తండ్రీకొడుకుల మధ్య రిలేషన్, లవ్ ఫెయిల్యూర్, మనకి - మన ఊరికి వచ్చిన చిన్న గ్యాప్‌ని ఎలా ఫుల్‌ఫిల్ చేయొచ్చో ఈ చిత్రంలో చూపించాం. ఇంకా ప్రతి ఒక్కరూ ఆలోచింపజేసే విధంగా చాలా విషయాలను శ్రీకారంలో చూపించబోతున్నాం. సాయి మాధవ్ బుర్రా అద్భుతమైన డైలాగ్స్ రాశారు. మార్చి 11న ఈ చిత్రం రిలీజ్ అవుతుంది. అందరూ ఈ సినిమా చూసి పెద్ద హిట్ చేయాలని కోరుకుంటున్నాను’’ అని వెల్లడించారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3qXx2SR
v

విజయ్ సేతుపతి, నిహారిక జంటగా సినిమా.. విడుదల తేదీ ఖరారు

మెగా డాటర్ నిహారిక కొణిదెల చివరిగా ‘సైరా నరసింహారెడ్డి’ సినిమాలో కనిపించారు. ఆ తరవాత ఆమె వెంకట చైతన్యను పెళ్లాడారు. పెళ్లి తరవాత ఇక ఆమెను వెండితెరపై చూడటం కష్టమే అనుకుంటున్న ఫ్యాన్స్‌కు ఒక గుడ్ న్యూస్. తెలుగు ప్రేక్షకులు నిహారికను మళ్లీ వెండితెరపై చూడబోతున్నారు. అయితే, ఇది తెలుగు సినిమా కాదు. తమిళ సినిమా అనువాదం. నిహారిక నటించిన ఏకైక తమిళ సినిమా తెలుగులోకి అనువాదమై విడుదలవుతోంది. విజయ్ సేతుపతి, నిహారిక కొణిదెల జంటగా ఆరుముగా కుమార్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘ఓరు నల్ల నాల్ పాతు సోలరెన్’. 2018 ఫిబ్రవరిలో విడుదలైన ఈ చిత్రం విజయవంతం అయ్యింది. మూడేళ్ల తరవాత ఇప్పుడు ఈ చిత్రాన్ని తెలుగులోకి అనువాదం చేసి ‘ఓ మంచి రోజు చూసి చెప్తా’ అనే టైటిల్‌తో విడుదల చేస్తున్నారు. శ్రీమతి రావూరి అల్లికేశ్వరి సమర్పణలో అపోలో ప్రొడక్షన్స్ పతాకంపై డాక్టర్ రావూరి వెంకటస్వామి ఈ చిత్రం తెలుగు హాక్కులను సొంతం చేసుకున్నారు. ఈ చిత్రాన్ని మార్చి 19న విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా నిర్మాత డాక్టర్ రావూరి వెంకటస్వామి మాట్లాడుతూ.. ‘ఓ మంచి రోజు చూసి చెప్తా చిత్రం తమిళంలో మంచి విజయం సాధించింది. విజయ్ సేతుపతి నటన ఈ చిత్రానికే ఒక హైలైట్. విలక్షణ నటనతో ప్రేక్షకులని అలరిస్తారు. నిహారిక కొణిదెల ఎప్పుడూ చేయని పాత్రలో కనిపిస్తారు. ఇది ఒక మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్. తెలుగు ప్రేక్షకులకి కచ్చితంగా నచ్చుతుంది. ఈ చిత్రాన్ని మార్చి 19న భారీగా విడుదల చేస్తున్నాం’ అని తెలిపారు. జస్టిన్ ప్రభాకరన్ సంగీతం సమకూర్చిన ఈ చిత్రంలో గౌతమ్ కార్తీక్, గాయత్రీ శంకర్, వీజీ చంద్రశేఖర్, రమేష్ తిలక్ ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. శ్రీ శరవణన్ సినిమాటోగ్రఫీ అందించిన ఈ చిత్రానికి ఆర్.గోవింద రాజ్ ఎడిటర్.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2Pf2s9f
v

శ్రీ రెడ్డి 'క్లైమాక్స్'కి సెన్సార్ బోర్డు క్లియరెన్స్.. రిపోర్ట్ చూస్తే!!

సంచలన తారగా నిత్యం వార్తల్లో నిలుస్తున్న వెండితెరపై తన ప్రతాపం చూపించే సమయం వచ్చేసింది. టాలీవుడ్, కోలీవుడ్ సెలెబ్రిటీలపై లైంగిక ఆరోపణలతో విరుచుకుపడుతున్న ఆమె '' అనే మూవీ పూర్తి చేసింది. ఇందులో తన లైఫ్‌కు దగ్గరగా ఉండే క్యారెక్టర్‌లో నటించిందట శ్రీ రెడ్డి. ఈ సినిమాలో టాలీవుడ్ సీనియర్ హీరో రాజేంద్రప్రసాద్ ప్రధాన పాత్ర పోషించడం విశేషం. తాజాగా ఈ మూవీ సెన్సార్ ఫినిష్ అయిన నేపథ్యంలో రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు మేకర్స్. `డ్రీమ్‌` చిత్రంతో ఏడు ఇంట‌ర్నేష‌న‌ల్ ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో అవార్డులు ద‌క్కించుకున్న భ‌వానీ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఈ సినిమాకు సెన్సార్ బోర్డు నుంచి క్లియరెన్స్ వచ్చింది. చిత్రానికి U/A సర్టిఫికెట్ ఇచ్చారు. దీంతో ఈ 'క్లైమాక్స్' చిత్రాన్ని మార్చి 5వ తేదీన రిలీజ్ చేయబోతున్నట్లు పేర్కొన్నారు దర్శకనిర్మాతలు. ఇటీవలే విడుదలైన ఈ చిత్ర ట్రైలర్‌ సినిమాపై ఆసక్తి రేకెత్తించింది. ఇందులో నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ రోల్ మేజర్ అట్రాక్షన్ అయింది. ఆయన రోల్ వ్యాపారవేత్త విజయ్ మాల్యాను పోలి ఉండటం, అతనికి అమ్మాయిల వీక్నెస్ ఉండటం సినిమాలో కీలకం కానున్నట్లు తెలుస్తోంది. కరుణాకర్ రెడ్డి, రాజేశ్వర్ రెడ్డిలు నిర్మించిన ఈ చిత్రంలో సాషా సింగ్, శ్రీ రెడ్డి, పృద్వి, శివ శంకర మాస్టర్, రమేష్ తదితరులు నటించారు. క్లైమాక్స్ చిత్రం క్లైమాక్స్ ఎపిసోడ్ కచ్చితంగా అందరినీ థ్రిల్ చేస్తుందని నిర్మాతలు చెబుతుండటం సినిమాపై మరింత ఆసక్తి పెంచేస్తోంది. సో.. చూడాలి మరి 'క్లైమాక్స్'తో ఏం మెసేజ్ ఇవ్వబోతున్నారనేది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3aY8hjU
v

చంద్రబాబుకి ఎన్టీఆర్ ఫ్యాన్స్ సెగ.. కుప్పంలో చేదు అనుభవం.. అభిమానుల నినాదాలు

పర్యటనలో ఉన్న తెలుగుదేశం పార్టీ అధినేతకు షాక్ ఇచ్చారు . చిత్తూరు జిల్లా శాంతిపురంలో చంద్రబాబు రోడ్ షో నిర్వహించగా.. జూనియర్ ఎన్టీఆర్‌ని పార్టీలోకి ఆహ్వానించి.. కీలక బాధ్యతలు ఇవ్వాలంటూ ఆయన అభిమానులు నినాదాలు చేయడంతో చంద్రబాబు మౌనం వహించాల్సిన పరిస్థితి ఏర్పడింది. వందలాది మంది కార్యకర్తలు చంద్రబాబు కాన్వాయ్‌ ముందు జై ఎన్టీఆర్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేయడంతో పాటు.. కుప్పంకి ఎన్టీఆర్‌ని తీసుకుని రావాలంటూ నినాదాలతో హోరెత్తించడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అవుతోంది. దీంతో పాటు చంద్రబాబు కుప్పం పర్యటనలో భాగంగా పెద్ద ఎత్తున ఎన్టీఆర్ ఫ్లెక్సీలు కనిపించడం విశేషం. రానున్న రోజుల్లో ఎన్టీఆర్ పార్టీలో చురుకుగా పాల్గొనే అవకాశం ఇవ్వాలనే డిమాండ్ అధినేత ముందుంచారు టీడీపీ కార్యకర్తలు. మరి చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి. కష్టకాలంలో ఎన్టీఆర్ సాయం కోరతారో.. లేక కొడుకు లోకేష్ బాబుతోనే ఎన్నికలకు వెళ్తారో వేచి చూడాల్సిందే.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3sALf8J
v

ఎయిర్‌టెల్ ఎక్స్‌ట్రీమ్‌లో ‘ముబి’ సర్వీస్.. ఇకపై ఆ సినిమాలన్నీ చూసేయొచ్చు!

ముబి.. చాలా తక్కువ మందికి తెలిసిన క్యూరేటెడ్ ఫిల్మ్ స్ట్రీమింగ్ సర్వీస్ ఇది. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో మాదిరిగా ఇది కూడా ఒక స్ట్రీమింగ్ సర్వీస్. కాకపోతే వాటికి.. ఈ ‘ముబి’కి తేడా ఉంది. ఇందులో ఏ సినిమా పడితే ఆ సినిమాను తోసేయరు. చాలా జాగ్రత్తగా ఎంపిక చేసి అప్‌లోడ్ చేస్తారు. ప్రస్తుతం వినోదం అనేది ప్రపంచీకరణ అయిపోయింది. తెలుగు ప్రేక్షకులు కేవలం తెలుగు సినిమాలను, సిరీస్‌లను మాత్రమే చూడటం లేదు. ఇంగ్లిష్, కొరియన్, చైనీస్, జపనీస్.. ఇలా అన్ని భాషల కంటెంట్‌ను ఓటీటీ ప్లాట్‌ఫాంల ద్వారా చూస్తున్నారు. అయితే, ఇప్పటికీ చాలా కంటెంట్ మనకు ఓటీటీల ద్వారా దొరకడం లేదు. అలాంటి కంటెంట్‌ను ముబిలో చూడొచ్చు. అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో ప్రదర్శించిన.. అవార్డులను సొంతం చేసుకున్న సినిమాలు చాలానే మరుగున పడిపోయాయి.. పడిపోతున్నాయి. అలాంటి గొప్ప సినిమాలను అంతర్జాతీయంగా చాలా జాగ్రత్తగా ఎంపిక చేసి ‘ముబి’లో ఉంచుతున్నారు. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో లాంటి ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫాంలలో లేని ఇండియన్, ఇంటర్నేషనల్ మూవీస్‌ని ముబి యాప్‌లో చూడొచ్చు. ఈ యాప్‌లో రోజుకో కొత్త సినిమా అందుబాటులోకి వస్తుంది. అందుబాటులోకి వచ్చిన ప్రతి కొత్త సినిమా 30 రోజులపాటు ఇందులో ఉంటుంది. అయితే, ఈ ముబి సర్వీస్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకోవాలంటే కాస్త ఎక్కువగానే చెల్లించాలి. అందుకే, భారతీ ఎయిర్‌టెల్ తమ వినియోగదారుల కోసం ముబితో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఇకపై ముబిలో సినిమాలన్నింటినీ ఎయిర్‌టెల్ ఎక్స్‌ట్రీమ్‌లో చూడొచ్చు. ఇందులో కనిపించే ప్రతి సినిమాకు తెలుగు సబ్ టైటిల్స్ వస్తాయి. కాబట్టి, ఇతర భాషా చిత్రాలను బాగా ఆస్వాదించవచ్చు. ఆసిఫ్ కపాడియా ‘డిగో మారడోనా’ (2019), రూపెర్ట్ గూల్డ్ అవార్డ్ విన్నింగ్ మూవీ ‘జూడీ’ (2019), ఆషిమ్ అహ్లువాలియా దర్శకత్వంలో వచ్చిన ‘మిస్ లవ్‌లీ’ (2012), సలీమ్ అహ్మద్ ‘అడమింటే మకన్ అబు’ (2011), కాథీ యాన్ డెబ్యూ ఫిల్మ్ ‘డెడ్ పిగ్స్’ (2018), అలాగే విజయ్ కుమార్ దర్శకత్వం వహించి నిర్మించిన తమిళ చిత్రం ‘ఉరియాది’ (2016) వంటి ఎన్నో గొప్ప చిత్రాలు ముబిలో అందుబాటులో ఉన్నాయి. ఎయిర్‌టెల్‌ ఎక్స్‌ట్రీమ్‌తో భాగస్వామ్యం గురించి ముబి వ్యవస్థాపకుడు, సీఈవో ఎఫె కాకరెల్ మాట్లాడుతూ.. ‘‘ముబిని ఎయిర్‌టెల్ ఎక్స్‌ట్రీమ్‌లో అందుబాటులోకి తెచ్చేందుకు ఎయిర్‌టెల్‌‌తో ఒప్పందం చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. అద్భుతమైన ఎన్నో సినిమాలు ఎప్పటికప్పుడు ముబిలో దర్శనమిస్తాయి. అందమైన, ఆసక్తికరమైన సినిమాలను జాగ్రత్తగా ఎంపిక చేసి అందుబాటులోకి తెస్తాం. ఇప్పుడు ఈ సినిమాలన్నింటినీ ఎయిర్‌టెల్ ఎక్స్‌ట్రీమ్ వినియోగదారులకు అందిస్తున్నాం. ప్రపంచ వ్యాప్తంగా మరుగున పడిపోయిన అద్భుతమైన సినిమాలు, ఈ మధ్య కాలంలోని గొప్ప చిత్రాలను మీకు అందిస్తున్నాం. అలాగే, ఇండియన్ సినిమా నుంచి ఎన్నో గొప్ప చిత్రాలను ఎంపిక చేశాం’’ అని వెల్లడించారు. వింక్ మ్యూజిక్, ఎయిర్‌టెల్ ఎక్స్‌ట్రీమ్ యాప్ చీఫ్ ప్రొడక్ట్ అండ్ టెక్నాలజీ ఆఫీసర్ సుదీప్త బెనర్జీ మాట్లాడుతూ.. ‘‘‘ముబితో భాగస్వామ్యం ఏర్పరుచుకుని 335 మిలియన్లకు పైగా ఉన్న తమ వినియోగదారులకు అవార్డులను గెలుచుకున్న, విశిష్టమైన సినిమాలను అందిస్తుండటం ఆనందంగా ఉంది. మన ఆడియన్స్ ఎప్పుడూ కొత్తదనం కోసం చూస్తుంటారు. ముబితో కలిసి అలాంటి చిత్రాలను ఆడియన్స్‌కు అందించాలని మేం లక్ష్యంగా పెట్టుకున్నాం. ఇండియన్స్‌కు కావాల్సిన అన్ని రకాల కంటెంట్‌ను ఎయిర్‌టెల్ ఎక్స్‌ట్రీమ్ యాప్‌లో అందుబాటులోకి తేవాలని మేం దృఢ సంకల్పంతో ఉన్నాం. ఇండియన్ ఓటీటీ స్పేస్ మరింతగా విస్తరించేలా, ఆడియన్స్‌కు మరింతగా కంటెంట్‌ను అందుబాటులోకి తెచ్చేలా మేం కృషి చేస్తున్నాం’’ అని చెప్పారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2PexHBj
v

RGV గోవా ఆఫీసులో అప్సర రాణి.. తడిసిన అందాలతో రచ్చరచ్చ! ఏకంగా ఆ మాట చెప్పి షాకిచ్చిన వర్మ

ఈ సృష్టిలో దేన్నైనా తనదైన కోణంలో మాత్రమే చూసే తన అభిప్రాయాలను నిర్మొహమాటంగా బయటపెడుతుంటారు. ఏ విషయంలో నైనా మనసుకు ఏదనిపిస్తే అదే ముక్కుసూటిగా మాట్లాడేస్తుంటారు. ముఖ్యంగా అమ్మాయిల అందం గురించి ఆయన చేసే కామెంట్స్ ఎలా ఉంటాయో మనందరికీ తెలుసు. చివరకు తనకు పోర్న్ సినిమాలు చూసే అలవాటు కూడా ఉందనే విషయాన్ని బయటపెట్టిన వర్మ తాజాగా స్విమ్ సూట్‌లో తడిసిన అందాలు చూస్తూ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. గతంలో మియా మాల్కోవాతో న్యూడ్ వెబ్ సిరీస్ తీసి వర్మ సృష్టించిన సంచలనాలు అన్నీ ఇన్నీ కావు. మహిళ శరీరంలో అంగాంగాన్ని వర్ణిస్తూ రచ్చ రచ్చ చేశారు వర్మ. ఆ తర్వాత లాక్‌డౌన్ వేళ పలు సినిమాలతో రొమాంటిక్ ట్రీట్ ఇస్తూ సోషల్ మీడియాను షేక్ చేశారు. ఆ క్రమంలోనే 'థ్రిల్లర్' మూవీతో అప్సర రాణి అందాలను ప్రేక్షకుల ముందుంచారు. అప్పటి నుంచి వర్మ- అప్సర రాణి మధ్య మంచి బాండింగ్ ఏర్పడింది. సమయం దొరికినప్పుడల్లా పార్టీలు చేసుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు. దీంతో వీరిద్దరికి సంబంధించిన ప్రతి విషయం ఓ సంచలనం అవుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా అప్సర బికినీ లుక్ షేర్ చేస్తూ తనదైన కోణంలో కామెంట్స్ చేశారు వర్మ. తన గోవా ఆఫీసులోని స్విమ్మింగ్ పూల్‌లో బికినీతో అప్సర అలా నడిచి వస్తున్న వీడియోతో పాటు కొన్ని ఫొటోలు ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. ఈ మేరకు 'నీ చేతిలో ఉన్న టవల్, టవల్‌లోని పోగులు బాగా నచ్చాయని, దాన్ని ఏ షాపులో కొన్నావు' అని అడుగుతూ అప్సరకు ట్యాగ్ చేశాడు. దీనిపై రియాక్ట్ అయిన అప్సర.. వావ్! రామ్ గారు.. మీరు టవల్‌ను గుర్తించినందుకు చాలా ఆనందంగా ఉందని తెలుపుతూ 'నేను ఇప్పటి వరకు చూసిన వాటిలో అత్యంత అందమైన ప్రదేశం ఇది. బీచ్ పక్కనే ఉన్న మీ అందమైన గోవా ఆఫీస్‌లో కొంత సమయాన్ని గడపడం చాలా సంతోషం కలిగించింది' అని పేర్కొంది. తిరిగి దీనిపై రియాక్ట్ అయిన వర్మ తన మనసులోని మాట బయటపెట్టేశారు. ''ఇప్పుడు అర్థమైంది అప్సర. నీ ప్రశాంతమైన ఆధ్యాత్మిక స్పర్శతో నా గోవా ఆఫీస్, స్విమ్మింగ్ పూల్ ఎంతో పుణ్యం చేసుకుంది'' అని ఆయన పేర్కొన్నారు. చివరగా రామ్ గారు.. ఆ టవల్‌ మీ ఆఫీసులోదే అని తెలుపుతూ అసలు మ్యాటర్ చెప్పింది అప్సర. వీరిద్దరి మధ్య జరిగిన ఈ రొమాంటిక్ కన్వర్జేషన్ నెట్టింట వైరల్ అవుతోంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/37S4pPc
v

Love Story: 'సారంగ దరియా' సాంగ్ టీజర్.. అట్రాక్ట్ చేస్తున్న తెలంగాణ ఫోక్‌, సాయి పల్లవి లుక్స్

రియాలిటీ, నాచురల్ నటనకు ప్రాధాన్యమిస్తూ సినిమాలు రూపొందించే దర్శకుడు శేఖర్ కమ్ముల 'లవ్ స్టోరీ' అనే మూవీ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. 'ఫిదా' లాంటి బ్లాక్ బస్టర్ హిట్ సినిమా తర్వాత ఆయన చేస్తున్న సినిమా, పైగా నాచురల్ బ్యూటీ ఇందులో హీరోయిన్‌గా నటిస్తుండటంతో సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా తాజాగా ఈ సినిమాలోని 'సారంగ దరియా' సాంగ్ టీజర్ రిలీజ్ చేసి ఆకట్టుకున్నారు మేకర్స్. గతంలో తెలంగాణలో ఓ సింగర్ పాడిన 'దాని కుడీ భుజం మీద కడువా.. దాని పుస్తెపు రైకలు మెరియా.. అది రమ్మంటె రాదు సెలియా.. దాని పేరే సారంగ దరియా' అనే ఫోక్ సాంగ్‌ను ఈ 'లవ్ స్టోరీ' సినిమాలో రీమిక్స్ చేశారు. తెలంగాణ పల్లె పదాలపై సాయి పల్లవి చిందులేసింది. డైరెక్టర్ శేఖర్ కమ్ముల తన ఆలోచనలకు పదును పెడుతూ ఈ సాంగ్‌కి తగ్గట్టుగా పల్లెటూరి వాతావరణాన్ని ప్రతిబింబించే లొకేషన్స్ ఎంచుకొని షూట్ చేశారు. తాజాగా విడుదల చేసిన ఈ సాంగ్ టీజర్‌లో సాయి పల్లవి నాచురల్ లుక్స్ పాటకు ప్రాణం పోశాయి. మంగ్లీ పాడిన ఈ పాట ఫుల్ వీడియో ఫిబ్రవరి 28వ తేదీన స్టార్ హీరోయిన్ అక్కినేని సమంత చేతుల మీదుగా రిలీజ్ కానుంది. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్ పీ, అమిగోస్ క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు కె. నారాయణదాస్ నారంగ్, పి. రామ్మోహన్ రావు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. పవన్ సీహెచ్ బాణీలు కడుతున్నారు. చిత్రంలో , సాయి పల్లవి జంటగా నటిస్తున్నారు. రాజీవ్ కనకాల, ఈశ్వరీ రావు, దేవయాని ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. భారీ అంచనాల నడుమ ఏప్రిల్ 16న ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ విడుదల కానుంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3dIE89Y
v

మెగా, అక్కినేని కాంబోలో మూవీ.. నాగార్జునతో వైష్ణవ్ తేజ్.. రెండో సినిమాకే హ్యూజ్ రెమ్మ్యూనరేషన్

కుటుంబ అండదండలు ఎన్ని ఉన్నా టాలెంట్ లేనిదే సక్సెస్ అనేది అంత ఈజీగా దరిచేరదు. ముఖ్యంగా సినీ ఇండస్ట్రీలో స్టార్ కిడ్స్ ఎంతోమంది ఇండస్ట్రీకి వస్తున్నారు కానీ అందులో సక్సెస్ అనుకుంటోంది కొందరే. నటీనటులు కనబర్చే ప్రతిభ, సినిమా కంటెంట్‌లో ఉన్న సత్తానే వారి వారి కెరీర్‌కి బూస్టింగ్ అవుతుంది. అలానే సినీ వారసుడిగా తెరంగేట్రం చేసిన మెగా మేనల్లుడు .. తొలి సినిమాతోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవడంతో తెలుగు దర్శకనిర్మాతల చూపు ఈ యువ హీరోపై పడింది. ఈ క్రమంలోనే అక్కినేని నాగార్జునతో సినిమా చేసే ఛాన్స్ దక్కినట్లు తెలుస్తోంది. 'ఉప్పెన'తో తెలుగు ప్రేక్షకుల ముందుకొచ్చిన వైష్ణవ్ తేజ్.. కెమెరా ముందు అద్భుతమైన నటన కనబర్చి పులువురు సినీ ప్రముఖుల ప్రశంసలందుకున్నాడు. నాచురల్ లుక్, నటనతో టాలీవుడ్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. దీంతో 'ఉప్పెన' కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. ఈ నేపథ్యంలో వైష్ణవ్ తేజ్‌తో ఓ సినిమా చేసేందుకు ముందుకొచ్చారట. ఈ మేరకు మెగాస్టార్ చిరంజీవి నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ తీసుకున్న నాగార్జున.. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పనులు వేగవంతం చేశారని తెలుస్తోంది. అక్కినేని నాగార్జున నిర్మాతగా తన సొంత నిర్మాణ సంస్థ అన్నపూర్ణ ప్రొడక్షన్స్ బానర్‌పై ఈ సినిమా చేయడానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం. అయితే ఈ సినిమాలో నటిస్తున్నందుకు గాను వైష్ణవ్‌కు భారీ రెమ్యూనరేషన్ ఆఫర్ చేశారని తెలుస్తుండటం హాట్ టాపిక్ అయింది. మొదటి సినిమా 'ఉప్పెన'కు 50 లక్షల పారితోషికం తీసుకున్న వైష్ణవ్‌కి ఏకంగా మూడు కోట్ల రుపాయల భారీ ఆఫర్ ఇచ్చారట నాగార్జున. ఈ మేరకు డిఫరెంట్ కథను ఎంచుకున్న నాగ్.. ఈ సినిమాను కొత్త ఓ దర్శకుడితో రూపొందించబోతున్నారని సమాచారం.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2O0aceA
v

‘చెక్’ మూవీ రివ్యూ: నితిన్ ‘చదరంగం’!

చంద్రశేఖర్ ఏలిటి సినిమా అంటే.. కంటెంట్‌కి కొదువ ఉండదు. ‘ఐతే’.. ‘అనుకోకుండా ఓరోజు’.. ‘ఒక్కడున్నాడు’.. ‘ప్రయాణం’ వంటి డిఫరెంట్ కాన్సెప్ట్ చిత్రాలతో వెర్సటైల్ డైరెక్టర్ అనిపించుకున్నారాయన. వీటిలో ‘ఐతే’, ‘అనుకోకుండా ఒక రోజు’.. ఇలాంటి ఒకటి రెండు సినిమాలు మినహాయిస్తే చంద్రశేఖర్ ఏలేటి‌కి కమర్షియల్ సక్సెస్ లేదు. కథలో కంటెంట్ ఉన్నా.. కమర్షియల్ సక్సెస్‌తో గుర్తింపు సాధించలేకపోయారు చంద్రశేఖర్ ఏలేటి. లాంగ్ గ్యాప్ తరువాత కల్ట్ హీరో నితిన్‌తో బాక్సాఫీస్‌కి ‘చెక్’ పెట్టేందుకు చెక్ సినిమా రూపొందించారు. మరి ఈ సినిమా ఎలా ఉందో సమీక్షలో చూద్దాం. ట్రైలర్, టీజర్‌లతో పాటు ప్రమోషన్స్ ఇంటర్వ్యూలలోనూ ఈ సినిమా కథను ముందే రివీల్ చేశారు. ఉరిశిక్ష పడ్డ టెర్రరిస్ట్ ‘చెస్’లో విశ్వ విజేత అయ్యి తన ఉరిశిక్షకు ఎలా ‘చెక్’ పెట్టాడు అన్నదే ఈ సినిమా. నగరంలో జరిగిన టెర్రరిస్ట్ అటాక్‌లో 40 మంది చనిపోతారు. ఆ కేసులో చేయని నేరానికి ఆదిత్య (నితిన్)కు ఉరిశిక్ష పడుతుంది. ఆ శిక్ష నుంచి బయటపడే అన్ని దారులు మూసుకుపోవడంతో క్షమాభిక్ష కోసం ఎదురుచూస్తుంటాడు ఆదిత్య. అదే టైంలో జైలులో శివన్నారాయణ (సాయి చంద్).. ఆదిత్యలోని టాలెంట్‌ని గుర్తించి చెస్ నేర్పుతాడు. జైలు నుంచే ఒక్కో మెట్టు ఎక్కుతూ విశ్వ విజేత అవుతాడు ఆదిత్య. అయితే రాష్ట్రపతి క్షమాభిక్ష లభించి.. ఆదిత్య జైలు నుంచి బయటకు వస్తాడనుకునే టైంలో కథలో ఊహించని ట్విస్ట్ ఎదురౌతుంది. దీంతో ఆదిత్య ఉరిశిక్ష విధించే టైం దగ్గర పడుతుంది. ఆ టైంలో ఆదిత్య ఎలా తప్పించుకున్నాడు? అతనికి లాయర్ మానస (రకుల్ ప్రీత్ సింగ్) ఏవిధంగా సాయపడింది? తన ప్రేయసి యాత్ర (ప్రియా ప్రకాష్ వారియర్) వల్ల ఆదిత్య జీవితం జైలు గోడలకు ఎలా పరిమితం అయ్యింది? అన్నదే మిగిలిన కథ. డిఫరెంట్‌ కాన్సెప్ట్ చిత్రాలు తీయడంతో చంద్రశేఖర్‌ యేలేటి మాస్టర్‌. అలాంటి మాస్టర్ మెదడులో నుంచి ఓ అంతర్జాతీయ చెస్ మాస్టర్ కథ పుట్టుకొచ్చింది. సస్పెన్స్.. మైండ్ గేమ్‌‌.. ఇంటిలిజెన్స్‌తో తన మార్క్ చూపిస్తూ కథను ఆసక్తికరంగానే మొదలుపెట్టాడు దర్శకుడు. తనలో ఓ చెస్ క్రీడాకారుడు ఉన్నాడని గుర్తించే సీన్లు.. జైలు నుంచి నేషనల్ ఛాంపియన్ షిప్ గెలవడం.. అతని ఫ్లాష్ బ్యాక్ అంతా పకడ్బందీగానే నడిపించారు. కథ ముందే రివీల్ అయినా కథనాన్ని ఆసక్తికరంగానే నడిపించారు. ముఖ్యంగా హీరో క్యారెక్టరైజేషన్ థ్రిల్లింగ్‌గా అనిపిస్తుంది. డిఫరెంట్ షేడ్స్‌ ఉన్న పాత్రలో ఓ కొత్త నితిన్‌ని చూపించారు. ఇద్దరు హీరోయిన్లను కూడా గ్లామర్ డాల్స్‌ చూపించకుండా కథకు ఎంతవరకూ అవసరమో అంతవరకే ఉపయోగించుకున్నారు. అయితే ప్రీ క్లైమాక్స్‌కి వచ్చేసరికి కథ గాడితప్పడంతో పాటు.. వాస్తవపరిస్థితులకు దూరం అయ్యింది. క్రైమాక్స్‌లో చంద్రశేఖర్ ఏలేటి మార్క్ మిస్ అయ్యిందేమో అనిపిస్తుంటుంది. ఉరిశిక్ష పడ్డ ఉగ్రవాది ఖైదీ జైలు నుంచి తప్పించుకోవడమే పెద్ద టాస్క్ అయితే.. సొరంగం తవ్వి మరీ జైలు నుంచి బయటపడటం అనేది కన్వెన్సింగ్‌గా అనిపించదు. అయితే పాత్రల ఎంపిక.. వారిని ప్రజెంట్ చేసిన తీరు బాగానే ఉన్నా చాలా చోట్ల లాజిక్‌లు మిస్ అయినట్టే కనిపిస్తాయి. ఈ సినిమాతో హీరో నితిన్ నటుడిగా విలక్షణ పాత్రను ఎంచుకున్నాడు. జయం తరువాత ఎక్కువ టేక్‌లు తీసుకున్న సినిమా ఇదే అని ముందే చెప్పాడు నితిన్. ఆ టేక్‌లు ఈ పర్ఫెక్షన్ కోసమేనా అనేట్టుగా చేశాడు నితిన్. తనలోని ఓ కొత్త నటుడ్ని చూపించాడు. సినిమా మొత్తం జైలులోనే ఉండటంతో నితిన్ ఒకేరకం క్యాస్ట్యూమ్స్‌తో కనిపిస్తాడు. చేయని నేరానికి శిక్ష అనుభవిస్తున్న ఖైదీ.. తనలో ఆత్మ స్థైర్యం నింపుకుని గ్రాండ్ మాస్టర్ అయ్యే పాత్రలో ఒదిగిపోయాడు. ప్రియా వారియర్‌తో లవ్ ట్రాక్‌లో లవర్ బాయ్‌గానూ ఆకట్టుకున్నాడు. నటుడిగా నితిన్‌కి‌ మంచి గుర్తింపుతెచ్చే పాత్ర అయితే చెక్ చిత్రం ద్వారా లభించింది. ఇక హీరోయిన్‌గా రకుల్ ప్రీత్ సింగ్.. తొలిసారి గ్లామర్ హంగుల్ని పక్కన పెట్టి క్యారెక్టర్ స్కోప్‌ ఉన్న పాత్రలో నటించింది. లాయర్ మానసగా ఉన్నంతలో బాగానే ఆకట్టుకుంది. హీరోతో రొమాన్స్.. సాంగ్స్ లాంటి వాటికి ఈ సినిమాలో స్కోప్ లేకపోవడంతో కేవలం లాయర్ అనే క్యారెక్టర్‌కి పరిమితం అయ్యింది రకుల్. మరో హీరోయిన్ ప్రియా ప్రకాష్ వారియర్.. స్క్రీన్ మీద కనిపించినంతసేపూ గ్లామర్‌తో ఆకట్టుకుంది. ‘నిన్న చూడలేక’ సాంగ్‌లో వింక్ బ్యూటీ కనుల విందు చేసింది. కథలో ఆమెకి కీలకమైన నేపథ్యం ఉండటంతో వింక్ బ్యూటీకి మంచి రోల్ పడిందనే చెప్పాలి. ఉప్పెన సినిమాలో హీరో తండ్రిగా అద్భుత నటనతో ఆకట్టుకున్న దేవి ప్రసాద్.. ఈ సినిమాలో నితిన్ గురువుగా మరోసారి మెస్మరైజ్ చేశాడు. కథ పుంజుకునేది ఆయన పాత్రతోనే. తన సీరియారిటీని శివన్నారాయణ పాత్రతో మరోసారి ప్రేక్షకులకు రుచిచూపించాడు. జైలు అధికారులుగా మురళీశర్మ, సంపత్‌ రాజ్‌లు తమ పాత్రలకు న్యాయం చేశారు. అయితే ఈ తరహా పాత్రల్లో చాలాసార్లు కనిపించడంతో కొత్తగా అనిపించవు. పైగా నితిన్ ‘భీష్మ’ చిత్రంలో సంపత్ రాజ్ పోలీస్ ఆఫీసర్‌గానే కనిపించడంతో పోలిక తప్పనిసరే అనిపిస్తుంది. టెక్నికల్ పరంగా.. వివేక్ అన్నమలై ఆర్ట్ సినిమాకి ఓ కొత్త లుక్ తీసుకువచ్చింది. జైలు సన్నివేషాలు రియలిస్టిక్‌గా అనిపిస్తాయి. ఎమ్. నరేష్ రెడ్డి మాటలు ఈ సినిమాకి ప్లస్ అయ్యాయి. చాలాచోట్ల వేదాంతం వినిపించినట్టుగానే అనిపిస్తాయి. కళ్యాణ్ మాలిక్ రీ రికార్డింగ్‌ ఈ సినిమాకు ప్లస్ అయ్యింది. కథకు తగ్గట్టుగా మంచి మ్యూజిక్‌ ఇచ్చారు. రాహుల్ శ్రీ వాత్సవ్ ఫొటోగ్రఫీ బాగుంది. యాక్షన్ ఎపిసోడ్‌తో పాటు జైలు సన్నివేషాలు బాగా చూపించారు. మొత్తంగా చెక్ మాస్టర్ పీస్ మూవీ కాదు కానీ.. ఓ మంచి ప్రయత్నం. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ చిత్రాలను ఇష్టపడే వారికి నచ్చుతుంది. చంద్రశేఖర్ యేలేటి మార్క్ కనిపించినా బాక్సాఫీస్‌కి చెక్ పెట్టే రేంజ్‌లో అయితే ఈ ‘చెక్’ లేదు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3qZ9bC5
v

'అర్జున్ రెడ్డి' నటికి యాక్సిడెంట్.. ఇది హత్యాయత్నం అంటూ సినీ ప్రముఖుడిపై అనుమానం.. పోలీసులకు ఫిర్యాదు

'అర్జున్ రెడ్డి' నటి మరోసారి పోలీసులను ఆశ్రయించారు. విజయవాడలో కనకదుర్గ ఫ్లై ఓవరిపై తన కారు ప్రమాదనికి గురైందని, అయితే ఇది యాక్సిడెంట్ కాదని, తనను చేయడానికి చేసిన కుట్ర అని పేర్కొంటూ శ్రీ సుధ విజయవాడ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ యాక్సిడెంట్ వెనక ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కుట్ర దాగి ఉందేమో అని ఆమె అనుమానం వ్యక్తం చేయడం హాట్ టాపిక్ అయింది. సినిమాటోగ్రాఫ‌ర్ శ్యామ్ కె.నాయుడుపై నటి శ్రీ సుధ లైంగిక ఆరోపణలు చేస్తూ గతంలో పోలీస్ కేసు పెట్టిన సంగతి తెలిసిందే. తనను పెళ్లి చేసుకుంటానని న‌మ్మించి శారీర‌కంగా వాడుకుని మోసం చేశాడంటూ ఆమె పేర్కొంది. ఈ విషయమై అప్పట్లో హైదరాబాద్‌లోని ఎస్‌ఆర్‌ నగర్‌ పోలీసులకు ఆమె కంప్లైంట్ చేయడం, ఆ తర్వాత జరిగిన పరిణామాలతో శ్యామ్ కె.నాయుడు- శ్రీ సుధ ఇష్యూ జనాల్లో చర్చనీయాంశం అయింది. ఈ క్రమంలో కేసు ఉపసంహరించుకోవాల్సిందిగా తనకు బెదిరింపులు వస్తున్నాయని, అతని వల్ల తనకు ప్రాణహాని ఉందంటూ మరోసారి శ్రీ సుధ పోలీసులను ఆశ్రయించింది. తనను హత్యచేసే క్రమంలో భాగంగానే ఈ యాక్సిడెంట్‌ చేయించి ఉంటాడంటూ శ్యామ్‌ కె. నాయుడిపై శ్రీ సుధ సందేహం వ్యక్తం చేసింది. దీంతో వీరిద్దరి గొడవ మరోసారి తెరపైకి వచ్చింది. ‘ఐఫోన్' అనే షార్ట్ ఫిల్మ్‌లో నటించి యాక్టింగ్ కెరీర్‌ ప్రారంభించిన నటి శ్రీ సుధ.. ఎన్నో సినిమాలు, వ్యాపార ప్రకటనలు, షార్ట్ ఫిల్మ్‌ల్లో నటించి మెప్పించింది. 2014 నుంచి 2020 వరకు ఆమె సపోర్టింగ్ రోల్స్, లీడ్ రోల్స్ చేసి సత్తా చాటింది. అయినప్పటికీ సరైన బ్రేక్ అందుకోలేక పోయిన ఆమె.. శ్యామ్‌ కె. నాయుడితో పెట్టుకున్న వివాదంతో తరచుగా వార్తల్లో నిలుస్తోంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3sm0PF0
v

Thursday 25 February 2021

అజిత్ సైకిల్ రైడ్.. వేల కిలోమీటర్ల ప్రయాణం పెట్టుకున్న స్టార్ హీరో.. హైదరాబాద్ రోడ్లపై అలా!!

సెలబ్రిటీ స్టేటస్ వచ్చాక సాధారణంగా ప్రజల మధ్యలో కనిపించడానికి కాస్త కొంతమంది వెనుకాముందు అవుతుంటారు. కానీ కోలీవుడ్ స్టార్ హీరో మాత్రం సాధారణ జీవితం గడపడం, తన హాబీస్ అలాగే కొనసాగించడం లాంటి వాటికి ప్రాధాన్యం ఇస్తారు. ఈ హీరోకు బైకుల పిచ్చి మరీ ఎక్కువ. కొన్నిసార్లు షూటింగ్స్‌కు బైక్ పైనే వచ్చిన అనుభవం ఆయన సొంతం. షూటింగ్ స్పాట్ వందల కిలోమీటర్ల దూరంలో ఉన్నా సరే బైక్ మీద రైడ్ చేయడమంటే ఆయనకు మహా సరదా. ఈ క్రమంలోనే సినిమాలతో పాటు పర్సనల్ లైఫ్‌ని బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్తున్న ఆయన.. కొన్నిరోజుల రోజుల క్రితం ఓ లాంగ్ టూర్ వేశారు. తన స్నేహితులతో కలిసి 30 వేల కిలోమీటర్లకు పైగా రోడ్డు ప్రయాణం పెట్టుకున్న అజిత్.. తాజాగా హైదరాబాద్ నగరంలో సైక్లింగ్ చేస్తూ కనిపించారు. ఎవ‌రూ గుర్తు ప‌ట్ట‌కుండా ఉండేలా బ్లాక్ ఔట్‌ఫిట్‌లో ఫేస్‌ను క‌వ‌ర్ చేస్తూ సిటీ రోడ్లపై సైకిల్ రైడ్ చేశారు. సైకిల్‌పై హైదరాబాద్ చుట్టేసిన ఆయన, ఓ కేఫ్ దగ్గర చాయ్ తాగుతూ కనిపించారు. అయితే అజిత్‌తో రైడ్ చేసిన వ్య‌క్తులు తీసిన‌ ఫొటోలు సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అవి వైరల్‌గా మారాయి. సౌత్ ఇండియన్ తెరపై, ముఖ్యంగా కోలీవుడ్ ఇండస్ట్రీ మాస్ ఫాలోయింగ్ పుష్కలంగా ఉన్న అజిత్.. ప్రస్తుతం హెచ్. వినోథ్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. 'వలిమై' పేరుతో రూపొందుతున్న ఈ సినిమాకు బోనీ కపూర్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. పవర్‌ఫుల్ పోలీఫీసర్‌గా అజిత్ కనిపించనున్న ఈ మూవీని 2021 చివర్లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3byFIs4
v

'ఉప్పెన' మేకింగ్ వీడియో.. వైష్ణవ్ తేజ్, కృతి శెట్టికి సూపర్ స్టార్ట్ ఇచ్చిన మూవీ తెరకెక్కిందిలా!!

మెగా మేనల్లుడు, సాయి ధరమ్ తేజ్ సోదరుడు తొలి సినిమాతోనే కిక్ స్టార్ట్ అయ్యాడు. 'ఉప్పెన'తో ప్రేక్షకుల ముందుకొచ్చి అందరి మన్ననలు పొందాడు. ఆయన నటనపై సూపర్ స్టార్ మహేష్ బాబు సహా పలువురు సినీ స్టార్స్ సైతం ప్రశంసలు గుప్పించడం చూశాం. ఇక హీరోయిన్ నాచురల్ అందాలతో ఆకట్టుకుంది. కెమెరా ముందు ఆమె కదిలిన తీరు సినిమాకు ప్రధాన బలం అయింది. అలాగే విజయ్ సేతుపతి విలనిజం 'ఉప్పెన'కు కలెక్షన్ల ప్రవాహం పారిస్తోంది. కాగా, సూపర్ డూపర్ హిట్ అయిన ఈ సినిమా మేకింగ్ వీడియోతో మరోసారి ఆకట్టుకున్నారు మేకర్స్. బేబమ్మగా కృతి శెట్టిని, ఆశీర్వాదం పాత్రలో వైష్ణవ్ తేజ్‌ని‌, కృతి తండ్రి రాయణం పాత్రలో విజయ్‌ సేతుపతిని దర్శకుడు బుచ్చిబాబు మలిచిన తీరు ఈ వీడియోలో చూడొచ్చు. ప్రతి సీన్‌పై ఆయన స్పెషల్ కేర్ తీసుకున్నారని మేకింగ్ వీడియో చూస్తుంటే స్పష్టంగా తెలుస్తోంది. రాసుకున్న కథని తెరపై చూపించడానికి దర్శకుడు పడిన కష్టం, సెట్‌లో నటీనటులతో బుచ్చిబాబు అనుకున్నట్లుగా అవుట్‌పుట్ రాబట్టడం, ప్రముఖ దర్శకుడు కొరటాల శివ సందడి ఈ వీడియోలో కనిపిస్తున్నాయి. ఎలాగైతేనేం మెగా కాంపౌండ్ నుంచి ఎందరో హీరోలు సినీ గడపతొక్కారు కానీ అందరిలో ప్రత్యేకం అని నిరూపించుకున్నాడు వైష్ణవ్ తేజ్. ఈ ఉప్పెనతో హీరోయిన్ కృతి శెట్టి, డైరెక్టర్ బుచ్చిబాబు తెలుగు ప్రేక్షకులకు ఎంతో దగ్గరయ్యారు. మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్‌లు సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా తెలుగు యువత హృదయాల్ని హత్తుకుంది. నాచురల్ లవ్‌స్టోరీకి అంతా కనెక్ట్ అయ్యారు. దేవీ శ్రీ ప్రసాద్ బాణీలు మేజర్ ఎసెట్ అయ్యాయి. దీంతో విడుదలైన అన్నిచోట్లా విజయవంతంగా ప్రదర్శించబడుతున్న 'ఉప్పెన' లాభాల బాటలో పయనిస్తోంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3dRDBCz
v

చెక్ మూవీ ట్విట్టర్ రివ్యూ: ఫస్టాఫ్ రిపోర్ట్ ఇదీ.. పవన్, ఎన్టీఆర్ ఫ్యాన్స్ రియాక్షన్స్

యూత్ స్టార్ కథానాయకుడిగా క్రియేటివ్ డైరెక్టర్ చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వం వహించిన డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీ ‘చెక్’. రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, ప్రియా ప్రకాశ్‌ వారియర్‌ హీరోయిన్లుగా.. భవ్య క్రియేషన్స్ పతాకంపై వి. ఆనంద ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. నేటి శుక్రవారం (ఫిబ్రవరి 26న) ప్రపంచ వ్యాప్తంగా భారీ అంచనాలతో విడుదలైంది ఈ మూవీ. నాంది, ఉప్పెన, జాంబీరెడ్డి వంటి వరుస హిట్ చిత్రాలతో టాలీవుడ్ బాక్సాఫీస్ కళకళలాడుతోంది. ఈ తరుణంలో ‘చెక్’ అంటూ ప్రేక్షకుల్ని పలకరించబోతున్నాడు కల్ట్ బోయ్ నితిన్. ఈ యంగ్ హీరో నితిన్‌కి వీరాభిమాని కావడంతో ప్రతి సినిమాకి పవన్ కళ్యాణ్ ఫ్యాన్ సపోర్ట్ ఉండనే ఉంటుంది. ఈ సినిమాకి ట్వీట్‌లతో హీటెక్కిస్తున్నారు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్. నితిన్‌కి శుభాకాంక్షలు తెలియజేస్తూ.. ఈ సినిమా హిట్ కావాలని కోరుకుంటున్నారు. ఇక ఎన్టీఆర్ కూడా నితిన్ ‘చెక్’ సినిమాకి శుభాకాంక్షలు తెలియజేస్తూ ట్వీట్ చేయడం.. రాజమౌళి ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి హాజరుకావడంతో ఈ సినిమాపై అంచనాలు రెట్టింపు అయ్యాయి. ఇంతకీ ఈ సినిమా టాక్ ఏంటి?? యూఎస్ ప్రీమియర్ టాక్ ఎలా ఉంది? ట్విట్టర్‌లో ఆడియన్స్ రెస్పాన్స్ ఏంటో చూద్దాం. ఫస్టాఫ్ రిపోర్ట్.. చెక్ సినిమా ఫస్టాఫ్ కొన్ని ఆసక్తికరమైన సన్నివేషాలతో బాగుంది. అలాగే బోరింగ్ సీన్లు కూడా ఉన్నాయి. ప్రధాన సమస్య ఏంటంటే.. భావోద్వేగంతోనే కథకు కనెక్ట్ కావడం. ఫస్టాఫ్ చాలా డేసెంట్‌గా ఉంది.. కాస్త లాగ్ ఎక్కువగా ఉన్నట్టుగా అనిపిస్తుంది. క్లైమాక్స్ ఈ సినిమాకి ప్రధాన హైలైట్..


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3kmXMcW
v

పవర్ స్టార్ సినిమా ఎప్పుడేసినా చూస్తారు.. మాలాంటి వాళ్లకు అలా కాదు: ఆర్కే నాయుడు

‘మొగలిరేకులు’ సీరియల్‌‌తో బుల్లితెర ప్రేక్షకుల అభిమాన నటుడిగా మారిపోయారు ఆర్కే నాయుడు అలియాస్ వీర్ సాగర్. ఆర్కే నాయుడు అనే పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రను ఎంతో హుందాగా పోషించారాయన. ఈ ఒక్క సీరియల్‌తోనే సాగర్‌కు ఒక హీరోకు వచ్చినంత క్రేజ్ వచ్చింది. ఉత్తమ నటుడిగా నంది టీవీ అవార్డ్‌ను కూడా సొంతం చేసుకున్నారు సాగర్. ‘మొగలిరేకులు’ సీరియల్ తరవాత సాగర్ సినిమాల వైపు వెళ్లారు. ‘మిస్టర్ పర్ఫెక్ట్’లో ప్రభాస్‌ను స్నేహితుడిగా నటించారు. ఆ తరవాత హీరోగా సినిమాలు చేశారు. కానీ, సినిమాల్లో సాగర్ సక్సెస్ కాలేకపోయారు. దీంతో నటనను పక్కనబెట్టి బిజినెస్‌లో బిజీ అయ్యారు. అయితే, చాలా కాలం తరవాత మళ్లీ హీరోగా తన సెకెండ్ ఇన్నింగ్స్‌ను మొదలుపెట్టారు సాగర్. ‘షాదీ ముబారక్’ అనే ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌తో వస్తున్నారు. సాగర్ సరసన దృశ్యా రఘునాథ్‌ హీరోయిన్‌గా నటించారు. ఝాన్సీ, హేమ, రాజశ్రీ నాయర్‌, ప్రియదర్శి రామ్‌, హేమంత్‌, శత్రు, భద్రమ్‌, మధునందన్‌, అదితి, అజయ్‌ ఘోష్ ముఖ్య పాత్రలు పోషించారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు, శిరీష్ ఈ సినిమాను విడుదల చేస్తున్నారు. ఈ చిత్ర ట్రైలర్‌ను గురువారం హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్స్‌లో విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో దిల్ రాజు, సాగర్, సంగీత దర్శకుడు సునీల్ కశ్యప్, స‌హ నిర్మాత శ్రీనివాస్ రెడ్డి, దర్శకుడు పద్మశ్రీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా హీరో వీర్ సాగ‌ర్ మాట్లాడుతూ.. ‘‘దిల్‌ రాజు గారి బ్యాన‌ర్‌లో నా పేరు ప‌డుతుంద‌ని నేను అనుకోలేదు. ఆయ‌న బ్యాన‌ర్‌లో నా పేరు రావాల‌నే కోరిక మాత్రం ఉండింది. అది ఈరోజు నిజ‌మైంది. నా క‌ల‌ను నిజం చేసిన దిల్‌ రాజు గారికి థాంక్స్ అనే ప‌దం చాలా చిన్నదిగా అనిపిస్తుంది. చాలా చిన్న విష‌యాల్లో ఆయ‌న త‌న వంతు స‌పోర్ట్ చేస్తూ వ‌చ్చారు. అలాగే శిరీష్‌ గారికి ప్రత్యేక కృత‌జ్ఞత‌లు. సినిమా దిల్‌ రాజు, శిరీష్‌ గారి చేతుల్లోకి వెళ్లడం అనేది మిరాకిల్ అనే చెప్పాలి. లాక్‌డౌన్ త‌ర్వాత శ్రీ వెంక‌టేశ్వర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌లో ప‌వ‌ర్‌ స్టార్ ప‌వ‌న్‌ క‌ళ్యాణ్‌ గారి ‘వ‌కీల్‌ సాబ్’ సినిమా రిలీజ్ అవుతుంద‌ని అనుకుంటే మ‌ధ్యలో వీడెవ‌డ్రా ‘షాదీ ముబారక్’ అంటూ దూరాడు అని మెగా ఫ్యాన్స్‌, ప‌వ‌ర్‌ స్టార్ ఫ్యాన్స్ అనుకు‌న్నారు. కానీ వాళ్లు అర్థం చేసుకుంటార‌ని భావిస్తున్నాను. నేను ఎనిమిదేళ్లుగా స‌క్సెస్ కోసం వెయిట్ చేస్తున్నాను. ప‌వ‌ర్‌ స్టార్‌ గారి సినిమా ఎప్పుడేసినా జ‌నాలు చూస్తారు. కానీ మాలాంటి వాళ్ల సినిమాల‌కు చిన్న టైమ్ స్టార్ట్ మాత్రమే దొరుకుతుంది. అప్పుడు సినిమాను రిలీజ్ చేస్తే స‌క్సెస్‌తో పాటు నిర్మాత‌ల‌కు లాభాలు కూడా వ‌స్తాయి. రాజు గారు మంచి ఉద్దేశంతో ఎంక‌రేజ్ చేయ‌డానికి తీసుకున్న నిర్ణయ‌మిది. నన్ను కూడా ఎంక‌రేజ్ చేస్తార‌ని భావిస్తున్నాను. మెగాభిమానిగా స్టార్ట్ అయిన నేను బుల్లితెర‌పై మెగాస్టార్‌గా ఇమేజ్‌ను సొంతం చేసుకుని మ‌ళ్లీ బిగ్ స్క్రీన్‌లోకి ఎంట్రీ ఇస్తున్నాను. ఎస్‌వీసీ బ్యాన‌ర్ అంటే అంద‌రూ భారీగా ఊహిస్తారు. అంద‌రిలానే నేను కూడా ‘వ‌కీల్‌ సాబ్’ కోసం వెయిట్ చేస్తున్నాను. మ‌ధ్యలో ఈ మూవీని ఎంక‌రేజ్ చేస్తున్నందుకు ధ‌న్యవాదాలు. నా స్నేహితుడు శ్రీనివాస్ రెడ్డి, వినోద్‌, సాయిలతో పాటు మేం క‌లిసి ట్రావెల్ అయ్యాం. నా ఫ్రెండ్స్‌కు, నాకు ఈ క్యారెక్టర్ సూట్ అవుతుందా అనే చిన్న సందేహం కూడా ఉండేది. అయితే వాళ్లు నా స‌క్సెస్ కోసం ఈ సినిమా చేశారు. నేను కూడా హండ్రెడ్ పర్సెంట్ ఎఫ‌ర్ట్ పెట్టి సినిమా చేశాను. క‌చ్చితంగా సినిమా అంద‌రికీ న‌చ్చుతుందని భావిస్తున్నాను. టీజ‌ర్‌, ట్రైల‌ర్‌లో ఉన్న టెంపో సినిమాలోనూ ఉంటుంది. ఎక్కడా బోర్ ఫీల్ కారు. మార్చి 5న సినిమాను విడుద‌ల చేస్తున్నాం. అంద‌రూ మ‌మ్మల్ని ఎంక‌రేజ్ చేస్తార‌ని మ‌న‌స్ఫూర్తిగా కోరుకుంటున్నాం’’ అని అన్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3dMwZ8E
v

నాన్ స్టాప్ ఎంటర్‌టైన్మెంట్‌.. నాదీ గ్యారంటీ: ‘షాదీ ముబారక్’పై నిర్మాత దిల్‌ రాజు

స్టార్ హీరోలతో భారీ బడ్జెట్ చిత్రాల‌నే కాదు.. యూత్‌ను, ఫ్యామిలీ ఆడియెన్స్ హృద‌యాలు హ‌త్తుకునేలా కూల్ అండ్ ప్లెజెంట్ మూవీస్‌ను అందిస్తూ ఎన్నో సూప‌ర్ డూప‌ర్ హిట్స్‌ను సొంతం చేసుకున్న నిర్మాణ సంస్థ శ్రీ వెంక‌టేశ్వర క్రియేష‌న్స్‌. ఈ బ్యాన‌ర్ నుంచి తెలుగు ప్రేక్షకుల‌ను మెప్పించ‌డానికి సిద్ధమ‌వుతోన్న మ‌రో ఔట్‌ అండ్‌ ఔట్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘షాదీ ముబారక్‌’‌. వీర్‌సాగర్‌ (ఆర్కే నాయుడు), దృశ్యా రఘునాథ్‌ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రానికి పద్మశ్రీ దర్శకత్వం వహించారు. దిల్‌ రాజు, శిరీష్ నిర్మాత‌లు. ‘షాదీ ముబారక్‌’ మార్చి 5న విడుద‌లవుతుంది. ఈ సంద‌ర్భంగా గురువారం హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్‌లో ట్రైల‌ర్‌ను నిర్మాత దిల్‌ రాజు విడుద‌ల చేశారు. ఈ సందర్భంగా నిర్మాత దిల్‌ రాజు మాట్లాడుతూ.. ‘‘2020లో కొవిడ్ రావడం ఏంటో కానీ.. 2021లో సినిమాలు విడుద‌ల‌వుతున్న తీరు చూస్తుంటే 90ల్లో ప్రతి వారం రెండు, మూడు సినిమాలు విడుద‌ల‌య్యే రోజులు గుర్తుకువ‌స్తున్నాయి. ఇప్పుడు సినిమాల ఫ్లో స్టార్ట్ అయ్యింది. చిన్న, పెద్ద సినిమాలు ఫ్లో అవుతున్నాయి. ఈ ఏడాది మా బ్యాన‌ర్ నుంచి వ‌స్తున్న సినిమాలు, ఇత‌ర నిర్మాత‌ల‌తో క‌లిసి స‌హ నిర్మాణంలో చేస్తున్న సినిమాల ఫ్లో ఎక్కువ‌గా ఉంది. ఇక ‘షాదీ ముబార‌క్’ సినిమా విష‌యానికి వ‌స్తే.. యూనిట్ సినిమాను పూర్తి చేసుకున్న త‌ర్వాత ఓ రోజు సాగ‌ర్ నాకు సినిమా ట్రైల‌ర్‌ను చూపించాడు. చాలా ఆస‌క్తిక‌రంగా అనిపించ‌డంతో సినిమా చూస్తాన‌ని అన్నాను. సినిమా చూశాను. అక్కడ‌క్కడ కొన్ని పోర్షన్స్ త‌ప్పితే సినిమా అంతా హిలేరియ‌స్ ఎంట‌ర్‌టైనర్‌గా అనిపించింది. సినిమాను చాలా బాగా తెర‌కెక్కించారు. నాకు సినిమాపై ఉన్న ఆలోచ‌న‌ను ఎలా చేయాలో శ్రీనివాస్ రెడ్డి గారికి, సాగ‌ర్‌కి చెప్పాను. వాళ్లు బాల్‌ని నా కోర్టులో వేశారు. నేను నాకు అనిపించిన క‌రెక్షన్స్ గురించి చెప్పాను. వాళ్లు క‌రెక్షన్స్ చేశారు. త‌ర్వాత సినిమాను రిలీజ్ చేయ‌మ‌ని మ‌రోసారి బాల్‌ను నా కోర్టులోనే వేశారు. మంచి సినిమాను మా బ్యాన‌ర్ నుంచి రిలీజ్ చేద్దామ‌ని నిర్ణయించుకుని సినిమాను టేక్ ఓవ‌ర్ చేసుకున్నాం. సినిమా మ్యూజికల్‌గా, ఎంట‌ర్‌టైన్మెంట్‌‌గా అన్నీ బావున్నాయి. ద‌ర్శకుడు ప‌ద్మశ్రీ ఓ కొత్త పాయింట్‌తో సినిమాను తెర‌కెక్కించాడు. టీజ‌ర్, ట్రైల‌ర్ చూస్తే సినిమా హిలేరియ‌స్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌కెక్కింద‌ని అర్థమై ఉంటుంది. రెండు గంట‌ల ప‌దిహేను నిమిషాల నిడివి ఉన్న ఈ సినిమా అంతా న‌వ్విస్తూనే ఉంటుంది. నాన్ స్టాప్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ మూవీ. సినిమాను త‌ప్పకుండా ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తారు.. అది నా గ్యారంటీ. థియేట‌ర్‌కు వ‌చ్చి ప్రేక్షకులు సినిమాను స‌క్సెస్ చేస్తార‌ని కోరుకుంటున్నాను. ఎంటైర్‌ టీమ్‌కు ఆల్ ది బెస్ట్‌’’ అని అన్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3aUgtBK
v

‘మోసగాళ్ళు’ ట్రైలర్: డియర్ మంచు విష్ణు అంటూ చిరంజీవి ట్వీట్

మంచు విష్ణు హీరోగా నటించిన తాజా చిత్రం ‘మోసగాళ్ళు’. ఏవీఏ ఎంటర్‌టైన్మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్లపై మంచు విష్ణు స్వయంగా ఈ సినిమాను నిర్మించారు. జెఫ్రీ గీ చిన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కాజల్ అగర్వాల్, సునీల్ శెట్టి, నవీన్ చంద్ర, నవదీప్ ముఖ్య పాత్రలు పోషించారు. ఈ చిత్రాన్ని విష్ణు భారీ బడ్జెట్‌తో హై టెక్నికల్ వాల్యూస్‌తో నిర్మించారు. నిజ ఘటనల ఆధారంగా ప్రపంచంలో జరిగిన అతిపెద్ద ఐటీ స్కామ్‌‌ను ఈ చిత్రం ద్వారా వెండితెరపై ఆవిష్కరిస్తున్నారు. మంచు విష్ణు నటించిన తొలి పాన్ ఇండియా మూవీ ఇది. ‘మోసగాళ్ళ’ను తెలుగుతో పాటు హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో విడుదల చేస్తున్నారు. కాగా, ఈ చిత్రం ట్రైలర్‌ని మెగాస్టార్ చిరంజీవి గురువారం (ఫిబ్రవరి 25న) విడుదల చేశారు. ట్విట్టర్ ద్వారా ‘మోసగాళ్ళు’ ట్రైలర్‌ను విడుదల చేసిన చిరంజీవి.. నిజంగా జరిగిన ఒక కథ ఆధారంగా, యూఎస్ఏను వణికించిన అతిపెద్ద ఐటీ స్కామ్‌ను ఈ చిత్రంలో చూపించబోతున్నారని వెల్లడించారు. ప్రియమైన మంచు విష్ణుకు ఆల్ ది బెస్ట్ అని పేర్కొన్నారు. మొత్తం టీమ్‌కు ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు. మరోవైపు, ‘మోసగాళ్ళు’ ట్రైలర్ విడుదలైన సందర్భంగా హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్స్‌లో మంచు విష్ణు ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ‘‘2015లో ఒక బ్రదర్ అండ్ సిస్టర్ కలిసి ముంబయి, గుజరాత్‌లలో ఉండి ఒక సింపుల్ ఐడీయాతో అమెరికా డబ్బుని రూ. 4 వేల కోట్ల స్కామ్ చేశారు. అది ఎలా చేశారు. ఆ డబ్బు ఎక్కడుంది.. ఇంతకీ వాళ్ళు దొరికారా? లేదా? అనే ఇంట్రెస్టింగ్ బ్యూటిఫుల్ స్క్రిప్ట్‌తో ఈ చిత్రాన్ని చేశాం. యూఎస్‌లో ఉండి ఈ కథని డెవలప్ చేశాం. అమెరికాలో నిజంగా జరిగిన కథ ఇది. ఈ స్కామ్ వల్ల అక్కడ కొన్ని వేల కుటుంబాలు అతలాకుతలం అయ్యాయి. మూడు సంవత్సరాలు ‘మోసగాళ్ళు’ కథపై వర్క్ చేశాం. హాలీవుడ్ స్థాయికి ధీటుగా జెఫ్రీ ఈ చిత్రాన్ని ఫెంటాస్టిక్‌గా తెరకెక్కించాడు. కథ నచ్చి కాజల్ ఈ సినిమాని ఎంతో స్పోర్టివ్‌గా తీసుకొని చేసింది. నిజంగా చెప్పాలంటే ఈ చిత్రంలో కాజల్ హీరో.. మెయిన్ లీడ్ పాత్రలో నటించింది. అలాగే సునీల్ శెట్టి పోలీస్ క్యారెక్టర్ చేశారు. అలాగే నవదీప్, నవీన్ చంద్ర, వైవా హర్ష టెరిఫిక్ క్యారెక్టర్స్ చేశారు. డైమండ్ రత్నబాబు, గౌతమ్ రాజు చాలా హెల్ప్ చేశారు. ఫస్ట్ కాపీ చూశాక చాలా హ్యాపీగా కాన్ఫిడెంట్‌గా ఉన్నాం. చాలా నెర్వస్‌గా కూడా వుంది. సినిమా చూసిన వారంతా చాలా బాగుంది అని అప్రిషియేట్ చేశారు. ప్రేక్షకులు ఈ చిత్రాన్ని ఆదరించాలని కోరుకుంటున్నాను. అడిగిన వెంటనే మా చిత్రం ట్రైలర్‌ని రిలీజ్ చేసిన చిరంజీవి గారికి నా కృతజ్ఞతలు. అలాగే ఈ సినిమాకి వాయిస్ ఓవర్ వెంకటేష్ గారు చెప్పారు. ఆయనకి నా ప్రత్యేక ధన్యవాదాలు’’ అని అన్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3qTRowb
v

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...