Saturday 30 November 2019

అడుగడుగో యాక్షన్‌ హీరో.. కార్పొరేట్‌ లీడర్‌గా బాలయ్య

నందమూరి బాలకృష్ణ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం రూలర్‌. ఎన్టీఆర్‌ కథానాయకుడు, మహానాయకుడు సినిమాలు నిరాశపరచటంతో రూలర్‌తో అభిమానులను ఖుషీ చేయాలనుకుంటున్నాడు బాలయ్య. అందుకు తగ్గట్టుగా తమిళ దర్శకుడు కేఎస్‌ రవికుమార్‌ డైరెక్షన్‌లో ఓ పక్కా కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాలో బాలయ్య సరసన సోనాల్‌ చౌహాన్‌, వేదికలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా డిసెంబర్‌ 20న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ప్రమోషన్‌ కార్యక్రమాలు ప్రారంభించిన చిత్రయూనిట్ ఇటీవల టీజర్‌ను రిలీజ్‌ చేశారు. తాజాగా సినిమాలోని ఫస్ట్ లిరికల్‌ను రిలీజ్‌ చేశారు. Also Read: బాలయ్య స్టైలిష్ కార్పోరేట్‌ లుక్‌కు సంబంధించిన ఈ పాటకు మంచి రెస్పాన్స్‌ వస్తోంది. చిరంతన్‌ భట్ స్వరాలందించిన ఈ పాటకు రామజోగయ్య శాస్త్రి సాహిత్యమందించారు. సాయి చరణ్‌ భాస్కరుని ఆలపించారు. అడుగడుగో యాక్షన్‌ హీరో అంటూ సాగే ఈ పాట బాలయ్య అభిమానులకు ఇన్‌స్టాంట్‌గా నచ్చేలా ఉంది. Also Read: ఈ సినిమాలో బాలకృష్ణ రెండు డిఫరెంట్ లుక్స్‌లో కనిపించనున్నాడు. ఇప్పటికే టీజర్‌లో రెండు లుక్స్‌ను రివీల్‌ చేశారు. ఒక లుక్‌లో పవర్‌ ఫుల్‌ మాస్‌ పోలీస్‌ ఆఫీసర్‌గా కనిపిస్తుండగా మరో లుక్‌లో స్టైలిష్ కార్పోరేట్‌ బిజినెస్‌ మేన్‌గా కనిపిస్తున్నాడు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2RaOB2z
v

వెటర్నరీ డాక్టర్ హత్య: మోదీని టార్గెట్ చేసిన సల్మాన్ ఖాన్

వెటర్నరీ వైద్యురాలి హత్య తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశమంతటగా కలకలం రేపుతోంది. ఇప్పటికే ఎందరో బాలీవుడ్ సినీ ప్రముఖులు ఈ ఘటనపై స్పందించారు. తాజాగా బాలీవుడ్ సూపర్‌స్టార్ ఈ ఘటనపై సోషల్ మీడియాలో ట్వీట్స్ చేశారు. భారత ప్రధాని నరేంద్రమోదీ ప్రభుత్వంపై పరోక్షంగా కామెంట్స్ చేశారు. ఈ దారుణ ఘటనకు పాల్పడిన నిందితులు మనుషుల మధ్య తిరుగుతున్న దరిద్రమైన దెయ్యాలంటూ సల్మాన్ ఖాన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ అమాయక బాధితురాలు అనుభవించిన నరకం గురించి తెలుసుకున్నాం కాబట్టి మరో అమాయకురాలు బలి కాకముందే సమాజం అంతా ఐక్యమై ఇలాంటి దెయ్యాలను ఏరిపారేయాలని తెలిపారు. మరే కుటుంబం ఇలాంటి బాధను అనుభవించకూడదని పేర్కొన్నారు. బేటీ బచావో బేటీ పడావో అనేది కేవలం ఓ క్యాంపెయిన్ మాత్రమే కాకూడదని దానిని ఆచరణలోనూ పెట్టాలని ఇన్‌డైరెక్ట్‌గా మోదీ ప్రభుత్వానికి కౌంటర్ వేశారు. మనమంతా ఒకటిగా ఉన్నామని ఇలాంటి రాక్షసులకు తెలిసి రావాలని అన్నారు. వెటర్నరీ వైద్యురాలి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ఈ దారుణ ఘటనకు పాల్పడిన నలుగురు నిందితులను తెలంగాణ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారించడం, జైలులో పెట్టడం దండగ అని తమకు అప్పగిస్తే పెట్రోల్ పోసి తగలబెడతామంటూ ప్రజలు నిరసనలు చేపడుతున్నారు. దేశ రాజధాని దిల్లీలోనూ ఈ ఆగ్రహ జ్వాలలు అలుముకున్నాయి. మరి ఈ నలుగురి నిందితులపై న్యాయస్థానం ఏ రకమైన నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2OznBrV
v

బాలీవుడ్‌లో భాగమతి రీమేక్‌.. హీరోయిన్‌ ఎవరంటే?

సౌత్‌ స్టార్ హీరోయిన్‌ అనుష్క నటించిన సూపర్‌ హిట్ లేడీ ఓరియంటెడ్ సినిమా భాగమతి. బాహుబలి తరువాత అనుష్క నటించిన ఈ సినిమా ఆమె కెరీర్‌లో మరో మెమరబుల్‌ సినిమాగా నిలిచిపోయింది. `ఎవడు పడితే వాడు రావడానికి ఎప్పుడు పడితే అప్పుడు పోవడానికి ఇదేమన్నా పశువుల దొడ్డా.. భాగమతి అడ్డా` అంటూ అనుష్క చెప్పిన డైలాగ్‌ అప్పట్లో తెగ వైరల్‌ అయ్యింది. అయితే దక్షిణాది భాషల్లో ఒకేసారి రిలీజ్‌ అయిన ఈ సినిమాను బాలీవుడ్‌లో రీమేక్‌ చేసేందుకు చాలా రోజులుగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే తెలుగులో అనుష్క చేసిన పాత్రను అదే స్థాయిలో పోషించగలిగే బాలీవుడ్‌ నటి కోసం ఇన్నాళ్లు ఎదురుచూశారు. తాజాగా భాగమతి రీమేక్‌కు రంగం సిద్ధమైనట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం హిందీలో మంచి ఫాంలో ఉన్న ఓ హాట్ బ్యూటీని భాగమతి రీమేక్‌ కోసం ఫైనల్‌ చేశారు. Also Read: ఇటీవల బాలా సినిమాతో సూపర్‌ హిట్ అందుకున్న భూమీ పడ్నేకర్‌, బాలీవుడ్‌ భాగమతి రీమేక్‌లో నటించనుంది. ప్రస్తుతం ఈ భామ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న పతీ పత్ని ఔర్‌ ఓ సినిమాలో నటిస్తోంది. అంతేకాదు ఇటీవల వేదికా లవ్‌లైన్‌ పేరుతో దాంపత్య సమస్యలుంటే నా దగ్గరకు రండి అంటూ ఓ క్యాంపెయిన్‌ కూడా స్టార్ట్ చేసింది భూమి. Also Read: అనుష్క ప్రధాన పాత్రలో తెరకెక్కిన భాగమతి సినిమాకు అశోక్‌ దర్శకుడు. ఈ సినిమాలో మురళీ శర్మ, ధన్‌రాజ్‌, విధ్యుల్లేఖ రామన్‌లతో పాటు మలయాళ నటులు ఉన్ని ముకుందన్‌, జయరామ్‌లు కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమాను హిందీలో బాలీవుడ్‌ స్టార్‌ హీరో అక్షయ్‌ కుమార్‌, టీ సిరీస్‌ సంస్థతో కలిసి నిర్మిస్తున్నాడు. దుర్గావతి అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారు. బాలీవుడ్‌లోనూ అశోక్‌ దర్శకత్వం వహించనున్న ఈ సినిమాను అక్షయ్‌ కుమార్‌ అధికారికంగా ప్రకటించారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/35QwgvK
v

``ఇద్దరి లోకం ఒక్కటే`తో మరో హిట్ కన్‌ఫర్మ్‌`

ఉయ్యలా జంపాల సినిమాతో టాలీవుడ్‌కు హీరోగా పరిచయం అయిన రాజ్‌ తరువాత తరువాత మంచి విజయాలతో ఆకట్టుకున్నాడు. ఇటీవల సక్సెస్‌ల విషయంలో కాస్త తడబడినా.. త్వరలో అంటే ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు. ఆడు మగాడ్రా బుజ్జి ఫేం జీఆర్‌ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను సక్సెస్‌ ఫుల్ ప్రొడ్యూసర్‌ దిల్ రాజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌పై తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాలో రాజ్‌ తరుణ్‌కు జోడిగా అర్జున్‌ రెడ్డి ఫేం షాలిని పాండే నటిస్తోంది. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమాను డిసెంబర్‌లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు చిత్రయూనిట్‌. ఇప్పటికే ప్రమోషన్‌ కార్యక్రమాలు ప్రారంభించిన చిత్రయూనిట్ రెండు పాటలను విడుదల చేశారు. ఈ రెండు పాటలకు మంచిరెస్సాన్స్‌ రావటంతో సినిమా మీద పాజిటివ్‌ బజ్‌ క్రియేట్ అయ్యింది. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే కథా కథనాలు సినిమా అవుట్‌పుట్‌ చాలా బాగా వచ్చిందన్న టాక్‌ వినిపిస్తోంది. అవుట్‌పుట్‌ మీద నమ్మకంతో సినిమాను సొంతంగా రిలీజ్ చేస్తున్నాడు. సినిమా సక్సెస్‌ను జెడ్జ్‌ చేయటంలో మంచి పేరున్న దిల్ రాజు ఈ సినిమాను స్వయంగా రిలీజ్‌ చేస్తుడంటంతో బిజినెస్‌ కూడా భారీగా జరుగుతోంది. ఈ సినిమాతో రాజ్‌ తరుణ్‌ ఖాతాలో మరో హిట్ ఖాయం అంటున్నారు ఇండస్ట్రీ వర్గాలు. ఇప్పటికే శాటిలైట్‌, డిజిటల్‌ రైట్స్‌తోనే సినిమా బ్రేక్‌ ఈవెన్‌ అయ్యింది. థియెట్రికల్‌ రిలీజ్‌ ద్వారా వచ్చే మొత్తం అంతా లాభాలే అని నిర్మాత దిల్‌ రాజు స్వయంగా ప్రకటించారు. దీంతో రిలీజ్‌కు ముందే రాజ్‌ తరుణ్‌, జీఆర్‌ కృష్ణల కాంబినేషన్‌లో హిట్‌ కొట్టేసింది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2LaWgdn
v

నా కూతురూ డాక్టరే.. అలా జరిగితేనే సొసైటీలో భయం ఉంటుంది: ఆలీ

రెండు రోజుల క్రితం హైదరాబాద్ శివారులో జరిగిన వెటర్నరీ డాక్టర్ హత్యాచార ఘటన చాలా బాధకరమని సినీ నటుడు, కమెడియన్ ఆలీ అన్నారు. ఢిల్లీలో జరిగిన నిర్భయ ఘటనతో నార్త్ ఇండియా మొత్తం కదిలిపోయిందని.. ఇన్ని సీసీటీవీ కెమెరాలు, ఇంత మంది పోలీసులు ఉన్నప్పటికీ హైదరాబాద్ నడిబొడ్డులో ఇలాంటి ఘటన జరగడం ఘోరమని ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం బాధితురాలి ఇంటికి వెళ్లి ఆమె తల్లిదండ్రులను ఆలీ పరామర్శించారు. వారికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ‘‘ఈ ఘటన ఎక్కడో మారుమూల ప్రాంతాల్లో గ్రామాల్లో జరగలేదు. సిటీలో జరిగింది. సిటీ నడిబొడ్డున జరిగింది. నిమిషానికి కొన్ని వందలు కార్లు తిరిగే హైవే పక్కన ఈ ఘటన జరిగిందంటే చాలా బాధాకరం. బాధితురాలి తండ్రి మాజీ ఆర్మీ ఉద్యోగి. ఆయన దేశానికి ఎంతో సేవ చేశారు. అలాంటి కుటుంబానికి ఇలా జరగడం చాలా బాధాకరం. ఆ ఫ్యామిలీకే కాదు ఏ కుటుంబానికి ఇలా జరగకూడదు. Also Read: 25 సంవత్సరాలు గుండెలపై మోసి పెంచుకున్న కూతురు, పైగా ఒక డాక్టర్ ఇలా ప్రాణాలు కోల్పోవడం జీర్ణించుకోలేని విషయం. శవం కూడా దొరకకుండా చేశారు. కనీసం శవమైనా దొరుకుంటే తల్లిదండ్రులు ఇంతగా బాధపడేవారు కాదు. ఒక రెండు కేజీల ముద్దను వాళ్ల చేతిలో పెట్టారు. ఆ తండ్రి గుండెకోత, ఆ తల్లి కడుపుకోత వేరే ఎవరికీ రాకూడదు. నేను ఈ కుటుంబాన్ని పరామర్శించడానికీ ఒక కారణం ఉంది. నా కూతురు కూడా డాక్టర్ చదువుతోంది. చనిపోయిన అమ్మాయి కూడా నా కూతురులాంటిదే. ఆమె తల్లిదండ్రులను చూస్తుంటే నా గుండె కరిగిపోయింది. దోషులను షూట్ చేయొద్దు, ఉరి తీయొద్దు.. నా కూతురుకి జరిగిందే వాళ్లకూ జరిగితే సొసైటీలో భయం ఉంటుంది.. నా కూతురి ఆత్మ శాంతిస్తుంది అని ఆ తల్లి చెప్పి ఏడుస్తుంటే నిజంగా నాకు చాలా బాధేసింది. దోషుల తరఫున వాదించకూడదని బార్ కౌన్సిల్ ఒక నిర్ణయం తీసుకుందని విన్నాను. కచ్చితంగా ఈ ఫ్యామిలీకి న్యాయం జరిగేలా చూసే బాధ్యత మనపై ఉంది’’ అని ఆలీ వెల్లడించారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2LaSZe9
v

ఇలాంటి మగ మృగాలను నడిరోడ్డుపై ఉరితీసినా తప్పులేదు: చిరంజీవి

దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన హైదరాబాద్ వెటర్నరీ డాక్టర్ హత్యాచార ఘటనపై మన తెలుగు సినిమా పరిశ్రమకు చెందిన పెద్దలు స్పందించకపోవడంపై ఇప్పటికే విమర్శలు వస్తున్నాయి. ప్రతి విషయంపై సోషల్ మీడియా వేదికగా స్పందించే స్టార్ హీరోలు.. ఇంత క్రూరమైన సంఘటన జరిగినా ఎందుకు స్పందించడం లేదంటూ చాలా మంది ప్రశ్నించారు. అయితే, ఎట్టకేలకు మెగాస్టార్ చిరంజీవి ఈ ఘటనపై స్పందించారు. ఈ మేరకు ఆదివారం రాత్రి ఒక వీడియో మెసేజ్‌ను విడుదల చేశారు. ‘‘గత రెండు మూడు రోజులుగా ఆడపిల్లలపై జరుగుతున్న అత్యాచారాలు, హత్యలు చూస్తుంటే గుండె తరుక్కుపోతోంది. ఈ దేశంలో ఆడపిల్లలకు భద్రత లేదనే భావం కలుగుతోంది. మగ మృగాల మధ్యా మనం బతుకుతోంది అనిపిస్తోంది. మనసు కలిచివేసిన ఈ సంఘటనల గురించి ఒక అన్నగా, ఒక తండ్రిగా స్పందిస్తున్నాను. ఇలాంటి నేరాలు చేసిన దుర్మార్గులకు శిక్షలు చాలా కఠినంగా ఉండాలి. భయం కలిగించేలా ఉండాలి. నడిరోడ్డుపై ఉరితీసినా తప్పులేదు. త్వరగా నేరస్థులను పట్టుకోవడం అభినందనీయమే. అలాగే, త్వరితగతిన శిక్ష పడేలా చూడాలి. అప్పుడే ఇలాంటి నేరాలు చేయాలంటే ఎవడైనా భయపడతాడు. ఆడపిల్లలు అందరికీ నేను చెప్పేది ఒక్కటే. మీ ఫోన్‌లో 100 నంబర్ స్టోర్ చేసి పెట్టుకోండి. అలాగే మీ స్మార్ట్‌ఫోన్‌లో ‘హాక్ ఐ’ యాప్‌ను డౌన్‌లోడ్ చేసి పెట్టుకోండి. ఒక్క బజర్ నొక్కితే చాలు షీ టీమ్స్ హుటాహుటిన మీ దగ్గరకు చేరుకుంటాయి. పోలీసు వారి సేవలను అలాగే వారి టెక్నాలజీని మీరు వినియోగించుకోండి. మహిళలకు రక్షణ కల్పించడం, వారిని గౌరవించడం ప్రతి ఒక్కరి బాధ్యత’’ అని వీడియోలో చిరంజీవి అన్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2Du3sNy
v

నేను చంద్రబాబు వ్యతిరేకిని కాదు.. ‘కమ్మ’ అంటే నాకు ఇష్టం: వర్మ ఇంటర్వ్యూ

‘కమ్మరాజ్యంలో కడపరెడ్లు’ సినిమాతో వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరోసారి సంచలనానికి తెరలేపారు. ఈ సినిమా ఇంకా విడుదలవ్వకపోయినా చేయాల్సినంత రచ్చ అయితే చేసేసింది. సినిమా టైటిల్ మొదలుకొని పోస్టర్లు, టీజర్, ట్రైలర్లు, పాటలు ఇలా ప్రతి ఒక్కటీ వివాదాస్పదమయ్యాయి. ముఖ్యంగా టైటిల్ రెండు కులాల మధ్య చిచ్చుపెట్టే విధంగా ఉందని చాలా మంది విమర్శించారు. ఇలాంటి సినిమా విడుదల కావడానికి వీళ్లేదని వాదిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని ప్రముఖ రాజకీయ నాయకుల పాత్రలను ప్రధానంగా చేసుకుని వివాదాస్పదమైన సెటైరికల్ సినిమా తీసిన రామ్ గోపాల్ వర్మను తాజాగా ‘సమయం’ పలకరించింది. ఆయనతో కాసేపు ముచ్చటించింది. ఈ క్రమంలో ‘సమయం’ అడిగిన పలు ప్రశ్నలకు వర్మ ఆసక్తికర సమాధానాలు చెప్పారు. Also Read: కడప అంటే తనకేమీ ప్రత్యేకమైన అభిమానం లేదని, కడపకే ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉందని అన్నారు. కడప నుంచి రాజశేఖర్ రెడ్డి, జగన్ లాంటి ఎంతో మంది నాయకులు ప్రస్తుత రాజకీయాల్లో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారని, సినిమా సబ్జెక్ట్ కూడా అదే కాబట్టి ‘కమ్మరాజ్యంలో కడపరెడ్లు’ అనే టైటిల్ పెట్టామని స్పష్టం చేశారు. టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుకి తాను వ్యతిరేకం అనే మాట వాస్తవం కాదని వర్మ వెల్లడించారు. రాష్ట్ర విభజన జరగడం, కమ్మ సామాజికవర్గం బలంగా ఉన్న అమరావతిలో రాజధాని ఏర్పాటు చేయడం, ఆ తరవాత అక్కడికి కడప రెడ్లు రావడం అనేది జగమెరిగిన సత్యమని.. దాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఒక డ్రమేటిక్ స్టోరీని తీశానని వర్మ చెప్పారు. ఒకరికి వ్యతిరేకంగా సినిమా తీయాలనే అజెండా తనకు లేదని స్పష్టం చేశారు. Also Read: ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమా కూడా చంద్రబాబు నాయుడుకు వ్యతిరేకంగా తాను తీయలేదని, ఎన్టీఆర్ జీవితంలో ఏం జరిగిందో చెప్పడమే తన ఉద్దేశం అని వర్మ అన్నారు. తనకు క్యాస్ట్ ఫీలింగ్ ‘కమ్మోళ్ల’ మీద ఉందని రామ్ గోపాల్ వర్మ చెప్పారు. ‘కమ్మ’ సామాజిక వర్గం అంటే తనకు ఇష్టమని, సినిమాలో వాళ్లకు వ్యతిరేకంగా ఏమీ చూపించడంలేదని వెల్లడించారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/37S8iCg
v

వర్మకు షాక్.. ‘కమ్మరాజ్యంలో కడపరెడ్లు’ సెన్సార్‌కు నో

సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన వివాదాస్పద చిత్రం ‘కమ్మరాజ్యంలో కడపరెడ్లు’. ఆంధ్రప్రదేశ్‌లోని ప్రముఖ రాజకీయ నాయకుల పాత్రలను ఆధారంగా చేసుకుని వర్మ తీసిన సెటైరికల్ మూవీ ఇది. టైటిల్‌తోనే తీవ్ర వివాదాస్పదమైన ఈ సినిమా ఆ తరవాత టీజర్లు, ట్రైలర్లు, పాటలతో మరింత కాకరేపింది. కులాల మధ్య చిచ్చుపెట్టేలా ఉన్న ఈ సినిమాను, చిత్ర టైటిల్‌ను చాలా మంది తీవ్రంగా వ్యతిరేకించారు. ఇక కేఏ పాల్ అయితే కోర్టుకెక్కారు. వాస్తవానికి ఈ చిత్రం ఈనెల 29న విడుదల కావాల్సి ఉంది. కానీ, అప్పటికి సెన్సార్ పూర్తికాలేదు. మరోవైపు హైకోర్టులో కేసు కూడా నడుస్తోంది. ఈ సినిమాను సెన్సార్ బోర్డు సభ్యులు చూసి వారం రోజుల్లో తమ అభిప్రాయం చెప్పాలని ఈనెల 28న హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కోర్టు ఆదేశాల మేరకు సెన్సార్ బోర్డు సభ్యులు శనివారం ఈ చిత్రాన్ని చూశారు. ఇది చాలా వివాదాస్పద చిత్రమని, దీనికి సెన్సార్ సర్టిఫికెట్ ఇచ్చేది లేదని సభ్యులు తేల్చి చెప్పినట్టు సమాచారం. దీంతో సెన్సార్ బోర్డు నిర్ణయంపై రివైవల్ కమిటీకి రామ్ గోపాల్ వర్మ ఫిర్యాదు చేయనున్నారని తెలిసింది. Also Read: ఇదిలా ఉంటే, ‘కమ్మరాజ్యంలో కడపరెడ్లు’ టైటిల్‌పై సెన్సార్ బోర్డు అభ్యంతరం తెలిపితే దాన్ని మార్చడానికి తాము సిద్ధంగా ఉన్నామని ఇప్పటికే రామ్ గోపాల్ వర్మ చెప్పారు. దీనికి ప్రత్యామ్నాయంగా ‘అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు’ అనే టైటిల్‌ను అనుకున్నామని స్పష్టం చేశారు. అయితే, సెన్సార్ బోర్డు కేవలం చిత్ర టైటిల్ మీదే కాకుండా కంటెంట్‌పై కూడా అభ్యంతరం తెలిపింది. చంద్రబాబునాయుడు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్, కేఏ పాల్ వంటి ప్రముఖుల పరువు ప్రతిష్ఠలకు భంగం కలిగేలా చిత్రంలో సన్నివేశాలు ఉండటంతో సెన్సార్‌ చేయడానికి నో చెప్పింది. Also Read:


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2L87WxA
v

Happy Birthday Raashi Khanna | Venky Mama


Happy Birthday Raashi Khanna | Venky Mama

from BharatStudent - Telugu - Actor Actress|Photo,Picture Galleries|Wallpapers|Screensavers|Movie Trailers|Film News and Gossips https://ift.tt/2qZjWL0

పెళ్లి వేడుకకు బ్రా వేసుకుని వెళ్లిన సినీ నటి.. ఇదెక్కడి ఫ్యాషన్

సెలబ్రిటీలు వేసే దుస్తులకు యూత్‌లో చాలా క్రేజ్ ఉంటుంది. ఫలానా హీరోయిన్ కట్టిన చీరనే కట్టు్కోవాలనుకుంటారు. ఫలానా హీరో వేసుకున్న షర్టే కొనుక్కోవాలని అనుకునే అబ్బాయిలూ ఉంటారు. అయితే వారు దుస్తులు వేసుకునే తీరుపై ఈరోజుల్లో సోషల్ మీడియాలో విపరీతంగా కామెంట్లు కూడా వస్తున్నాయని చెప్పాలి. స్టైల్, ఫ్యాషన్ పేరుతో ఎలా పడితే అలా అన్నీ విప్పి చూపించేస్తున్నారు. తాజాగా బాలీవుడ్ నటి కట్టుకున్న చీర సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అలనాటి బాలీవుడ్ తార నూతన్ మనవరాలైన ప్రనూతన్ ఇటీవల బాలీవుడ్‌లోకి అడుగుపెట్టి కుర్రకారును తనవైపునకు తిప్పుకున్నారు. కాగా.. గురువారం ప్రముఖ నిర్మాత సూరజ్ భర్జాత్యా కుమారుడు దేవాన్ష్ పెళ్లి వేడుక ఘనంగా జరిగింది. నిన్న సాయంత్రం ముంబయిలో గ్రాండ్‌గా వివాహ విందును ఏర్పాటుచేశారు. ఈ విందు బాలీవుడ్‌కు చెందిన ఎందరో సినీ ప్రముఖులు హాజరై సందడి చేశారు. వేడుకకు ప్రనూతన్‌ కూడా హాజరయ్యారు. అయితే ఆమె వేసుకున్న దుస్తులు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. చీర బాగానే ఉంది కానీ లోపల వేసుకునే బ్రాను ఆమె బ్లౌ్జ్‌గా ధరించారు. దాంతో అక్కడివారు చూపు తిప్పుకోలేకపోయారు. చీరను ముందు భాగంగా పూర్తిగా కప్పుకోకుండా తన అందాలను ఆరబోశారు. ఇంకేముంది.. కొత్త స్టైల్స్‌ను ఫాలో అవ్వాలనుకునే నెటిజన్లు ప్రనూతన్‌కు సపోర్ట్ చేస్తుంటే మరికొందరు ఆమె ఓవర్ ఎక్స్‌పోజింగ్‌ను చూసి నోరెళ్లబెడుతున్నారు. మున్ముందు అసలు ఏమీ వేసుకోరేమో అంటూ కామెంట్లు కూడా పెడుతున్నారు. ‘నోట్‌బుక్’ సినిమాతో ప్రనూతన్ బాలీవుడ్‌లోకి అడుగుపెట్టారు. కానీ ఈ సినిమా విజయం సాధించలేదు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2q4ap4M
v

Thakita Thakita Lyrical Video | Prati Roju Pandaage


Thakita Thakita Lyrical Video | Prati Roju Pandaage

from BharatStudent - Telugu - Actor Actress|Photo,Picture Galleries|Wallpapers|Screensavers|Movie Trailers|Film News and Gossips https://ift.tt/2OymQiB

BJPలో చేరిన సీనియర్ నటుడు.. షాకైన చిన్మయి శ్రీపాద

నటి రాధిక సోదరుడు, సినీ నటుడు రాధా రవి బీజేపీలో చేరారట. ఈ విషాయన్ని ఆయన స్నేహితుడు శేఖర్ సోషల్ మీడియా ద్వారా వెల్లడిస్తూ కంగ్రాట్స్ చెప్పారు. ఈ ఫొటోను ప్రముఖ సింగర్ చిన్మయి శ్రీపాద్ ట్వీట్ చేస్తూ.. ‘నమ్మలేకపోతున్నాను. నిజంగానా’ అంటూ షాకయ్యారు. ఎందుకంటే.. రాధారవి కొన్ని నెలల క్రితం లేడీ సూపర్‌స్టా్ర్ అయిన నయనతారపై షాకింగ్ కామెంట్స్ చేశారు. నయనతార నటించిన ఓ సినిమా ఆడియో లాంచ్ ఈవెంట్‌కు రాధారవి గెస్ట్‌గా వెళ్లారు. ప్రమోషన్స్‌లో నయనతార పాల్గొనదన్న విషయం తెలిసిందే. తాను పెట్టుకున్న రూల్ ప్రకారం ఆడియో లాంచ్ వేడుకకు కూడా నయన్ వెళ్లలేదు. ఈ విషయం గురించి రాధా రవి స్పందిస్తూ.. “నయనతారతమిళ సినిమాల్లో దెయ్యంగా, తెలుగు సినిమాల్లో సీతాదేవిగా నటిస్తుంది. మా రోజుల్లే సీతాదేవి లాంటి దేవత పాత్రలకు కేఆర్ విజయను ఎంచుకొనేవాళ్లం. ఇవాళ సీతగా ఎవరైనా నటించేయవచ్చు. మర్యాద మన్ననలు పొందేవాళ్లనూ ఆ పాత్రకు తీసుకోవచ్చు, పడుకొనేవాళ్లనూ తీసుకోవచ్చు” అంటూ నయనతార వ్యక్తిత్వాన్ని కించపరిచే రీతిలో మాట్లాడాడు. రాధారవి చేసిన ఈ వ్యాఖ్యల్ని వెంటనే ఏ పేరుపొందిన నటుడు కానీ, దర్శకుడు కానీ, నిర్మాత కానీ ఖండించే సాహసం చెయ్యలేకపోయారు. ఇదివరకు ‘మీ టూ’ ఉద్యమంలో పాల్గొన్నందుకు డబ్బింగ్ యూనియన్ నుంచి చిన్మయిని నిషేధించింది కూడా రాధా రవే. నయనతారపై ఆయన చేసిన వ్యాఖ్యల్ని మొట్ట మొదటగా ఖండించింది చిన్మయి కావడం గమనార్హం. “ఇతర యూనియన్ల విషయంలో తలదూర్చమని అప్పట్లో నా విషయంలో నిర్మాతల మండలి, నడిగర్ సంగం మౌనం పాటించాయి. ఇప్పుడు ఒక పేరుపొందిన నటిని ఆ మనిషి బహిరంగంగా అవమానించాడు. ఇప్పుడు అవి చర్యలు తీసుకుంటాయా? తీసుకునేట్లయితే చాలా చాలా కృతజ్ఞతలు” అని ఆమె ట్వీట్ చేశారు. అలాంటి రాధా రవిని బీజేపీ తమ పార్టీలోకి ఎలా ఆహ్వానించింది అని చిన్మయి పరోక్షంగా ప్రశ్నించారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2rEJ8X4
v

Friday 29 November 2019

అభిమాని మృతదేహం చూసి కన్నీరుపెట్టిన కార్తి

అభిమాని మరణాన్ని తట్టుకోలేకపోయారు ప్రముఖ తమిళ నటుడు కార్తి. చెన్నైకు చెందిన వ్యసాయ్ నిత్య అనే అభిమాని ఇటీవల రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. అతన్ని వెంటనే దగ్గర్లోని హాస్పిటల్‌కు తరలించారు. చికిత్స పొందుతూ ఈరోజు ఉదయం అతను చనిపోయాడు. ఈ విషయం తెలీడంతో హుటాహుటిన అభిమాని స్వస్థలమైన ఉళుండూరుపేటకు బయలుదేరారు. అయితే అభిమాని మృతదేహాన్ని చూసి కార్తి ఉద్వేగానికి లోనయ్యారు. కన్నీరు పెట్టుకున్నారు. ఆ సమయంలో తీసిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వ్యసాయ్‌కి కార్తి అంటే ఎంతో అభిమానం. కార్తి ఫ్యాన్స్ అసోసియేషన్ అయిన మక్కల్ నాల మండ్రం పేరిట ఎన్నో సేవా కార్యక్రమాలను చేపట్టారు. వ్యసాయ్ అంటే కార్తికి చాలా ఇష్టం. అలాంటి అభిమానిని కోల్పోవడంతో కార్తి తట్టుకోలేకపోయారు. వ్యసాయ్ కుటుంబీకులను కార్తి పరామర్శించారు. ఏ సాయం కావాలన్నా తాను ఎల్లప్పుడూ ముందుంటానని హామీ ఇచ్చారు. ఉళుండూరుపేట నుంచి కార్తి నేరుగా తాను నటించిన ‘తంబి’ సినిమా ఆడియో లాంచ్‌‌కు వెళ్లారు. ఆయన స్టేజ్‌పైకి ఎక్కగానే చనిపోయిన తన అభిమాని గురించి మాట్లాడుతూ ఉద్వేగానికి లోనయ్యారు. అందరూ నిమిషం పాటు మౌనం వహించాలని కోరారు. కార్తికి తన అభిమానులంటే ఎంతో ఇష్టం. వారి ఇళ్లలో జరిగే కార్యక్రమాలకు అప్పుడప్పుడూ వెళుతుంటారు. ఎప్పటినుంచో తెలిసిన అభిమానిని కోల్పోవడంతో కార్తి కన్నీరుమున్నీరయ్యారు. ‘ఖైదీ’ సినిమాతో బ్లాక్ బస్టర్ విజయం అందుకున్న కార్తి ప్రస్తుతం ‘తంబి’ సినిమాతో బిజీగా ఉన్నారు. తొలిసారి ఈ సినిమాలో తన వదిన జ్యోతికతో కలిసి నటించారు. త్వరలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.s


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2L5AR5e
v

మూడేళ్ల తరువాత తెలుగు సినిమాలో.. నానికి జోడిగా రీఎంట్రీ

ప్రస్తుతం వి సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్న నేచురల్‌ స్టార్‌ తదుపరి చేయబోయే సినిమాను కూడా లైన్‌లో పెట్టాడు. గతంలో నాని హీరోగా నిను కోరి సినిమాను తెరకెక్కించిన దర్శకత్వంలో నెక్ట్స్ మూవీ చేస్తున్నాడు నాని. ఇప్పటికే కథా చర్చలు కూడా పూర్తయిన ఈ సినిమా డిసెంబర్‌లో సెట్స్‌ మీదకు వెళ్లనుంది. షైన్‌ స్క్రీన్స్‌ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మిస్తున్న ఈ సినిమాలో నానికి జోడిగా నటించనుంది. నాని కెరీర్‌ను ములపు తిప్పిన ఎవడే సుబ్రమణ్యం సినిమాతో నాని, రీతూలు కలిసి నటించారు. ఇప్పుడు మరోసారి వీరిద్దరు జోడి కడుతుండటం ఆసక్తికరంగా మారింది. Also Read: నాగచైతన్య, సమంత హీరో హీరోయిన్లుగా మ‌జిలీ లాంటి సూప‌ర్‌హిట్ త‌ర్వాత శివ నిర్వాణ ద‌ర్శక‌త్వంలో ఈ సినిమా తెర‌కెక్కుతుంది. డిసెంబ‌ర్ నెల‌లో సినిమా లాంఛ‌నంగా ప్రారంభించి జ‌న‌వ‌రిలో రెగ్యుల‌ర్ షూటింగ్‌కు వెళ్లేందుకు ప్లాన్‌ చేస్తున్నారు చిత్రయూనిట్‌. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమాకు సంబంధించి పూర్తి వివరాలు త్వరలో వెల్లడించనున్నారు. ప్రస్తుతం నాని ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న `వి` సినిమాలో నటిస్తున్నాడు. సుధీర్‌ బాబు హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో తొలిసారిగా నాని ప్రతినాయక పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమా తరువాత శివ నిర్మాణ సినిమా పనులు ప్రారంభించనున్నాడు. Also Read: ఎన్టీఆర్‌ హీరోగా తెరకెక్కిన బాద్‌షా సినిమాతో టాలీవుడ్‌కు పరిచయం అయిన రీతూవర్మ ఎవడే సుబ్రమణ్యం సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. తరువాత పెళ్లి చూపులు సినిమాతో సూపర్‌ హిట్ అందుకొని హీరోయిన్‌గా సెటిల్‌ అయిపోయింది. పెళ్లి చూపులు తరువాత తెలుగులో ఒక్కే కేశవ సినిమా మాత్రమేచేసిన ఈ భామ మూడేళ్ల తరువాత తిరిగి తెలుగు సినిమాకు అంగీకరించింది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2OU1hIq
v

‘హీరోలు పెంచాల్సింది కండలు కాదు బుర్రలు’

ఎన్నో ఆశలతో ఇప్పుడిప్పుడు ఇండస్ట్రీలోకి అడుగుపెడుతున్న యంగ్ నటులకు ఓ సలహా ఇచ్చారు అలనాటి బాలీవుడ్ నటుడు . వారంతా కండలు పెంచి ఇండస్ట్రీలోకి వస్తున్నారని, కానీ పెంచాల్సింది కండలు కాదని అన్నారు. బుర్రలు పెంచాలని సూచించారు. ఈ విషయాన్ని రిషి ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ‘ఈరోజుల్లో ఇండస్ట్రీలోకి అడుగుపెడుతున్న నటులు ఎక్కువగా బాడీ బిల్డింగ్‌పై శ్రద్ధ పెడుతున్నారు. బాడీ ఉంటేనే ఛాన్స్‌లు వస్తాయని అనుకుంటున్నారు. కానీ ఇప్పటి నటులకు కావాల్సింది ఎమోషనల్ వ్యాయామం. ఇది నటులకు చాలా అవసరం. బాడీని పెంచుకునే బదులు బుర్రలు పెంచుకోండి. ఎందుకంటే నటించే నైపుణ్యాలు, మంచి కాన్సెప్ట్స్‌ని ఎంచుకునే సామర్ధ్యాలు ఉంటే తప్పకుండా యాక్టర్ అవుతారు. అలాంటివేమీ లేకపోతే సులువుగా వేరొకరు వచ్చి వారి స్థానాలను భర్తీ చేస్తారు. నన్ను చూడండి. నాకు సిక్స్ ప్యాక్ బాడీ ఉందా? కానీ ఇప్పటికీ నేను సినిమాలు చేస్తున్నాను. ఎందుకంటే ప్రతీ సినిమాలో నా క్యారెక్టర్‌ను నేనే క్రియేట్ చేస్తారు. నాకు వయసైపోయి ఉండొచ్చు. యంగస్టర్స్‌కు నేను రోల్ మోడల్ కాను’ ‘కానీ ఆయుష్మాన్ ఖురానా, రాజ్‌కుమార్ రావు, రణ్‌వీర్ సింగ్, విక్కీ కౌశల్‌, రణ్‌బీర్ కపూర్‌లను చూడండి. రణ్‌బీర్ నా కొడుకు కాబట్టి వాడి పేరు చెప్పడంలేదు. కానీ రణ్‌బీర్ కూడా టాలెంటెడ్ నటుడే. వారెవ్వరికీ భారీ శరీరాకృతులు లేవు. ఎందుకంటే కేవలం బాడీలుంటే నటులు అయిపోరు. జిమ్‌కి వెళ్లి డబ్బులు ఖర్చు చేస్తే యాక్టర్స్ అయిపోరు. దాని వల్ల డబ్బు పోవడం తప్ప ఏమీ ఉండదు. అమితాబ్ బచ్చన్‌ని చూడండి. ఆయన సినిమాల్లోకి అడుగుపెట్టినప్పుడు చాలా సన్నగా ఉండేవారు. ఇప్పటికీ అలాగే ఉన్నారు. 70 ఏళ్ల వయసులోనూ ఆయన్ను యాంగ్రీ యంగ్ మ్యాన్ ఆఫ్ హిందీ సినిమా అంటుంటారు’ అని తెలిపారు. రిషి కపూర్ క్యాన్సర్ ట్రీట్‌మెంట్ కోసం అమెరికాలో ఉన్నప్పుడు ఇప్పటికీ అక్కడి ఆడియన్స్ ఆయన సినిమాలను చూసి ఎంజాయ్ చేస్తున్నారు. ఈ విషయం తెలిసి షాకయ్యానని రిషి తెలిపారు. ‘ఇప్పటికీ ఇంటర్నేషనల్ ఆడియన్స్ నా సినిమాలు ఎంజాయ్ చేస్తున్నారని తెలిసినప్పుడు నేను నటించిన పది సినిమాల పేర్లు చెప్పి వాటిని కూడా చూడమని చెప్పాను. వాటిలో నేను అమితాబ్ కలిసి నటించిన ‘102 నాటౌట్’ సినిమా కూడా ఉంది. ఆ మరుసటి రోజు ఓ పెద్ద మనిషి బొకే తీసుకుని నా ఇంటికి వచ్చాడు. ‘102 నాటౌట్’ సినిమా చూశానని చెప్తూ ఏడ్చాశాడు. నా ఆస్తి కోసం నేనెప్పుడు చస్తానా అని నా కొడుకు ఎదురుచూస్తున్నాడు సర్ అంటూ కన్నీరుపెట్టుకున్నాడు. అప్పుడే నాకు తెలిసింది సినిమా వేలాది మంది మనసులను కదిలించగలదు అని. నాకు అతన్ని చూసి చాలా బాధేసింది’ అని వెల్లడించారు రిషి.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/34JI9Up
v

మాజీ బిగ్‌బాస్ కంటెస్టెంట్‌పై లైంగిక వేధింపులు

ఆడవాళ్లపై అఘాయిత్యాలకు అడ్డు అదుపు లేకుండాపోయింది. ఇలాంటి ఘటనలు కలకలం రేపుతున్నా కూడా కామాంధులు తమ వక్రబుద్ధిని ప్రదర్శిస్తూనే ఉన్నారు. సామాన్య అమ్మాయిలపైనే కాదు కామాంధులు సెలబ్రిటీలను కూడా వదలడం లేదు. తాజాగా మలయాళ బిగ్‌బాస్ షోలో పాల్గొన్న యువతిపై కదులుతున్న బస్సులో ఓ యువకుడు లైంగిక చర్యలకు పాల్పడ్డాడట. ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన గురువారం తెల్లవారు జామున కేరళలో చోటుచేసుకుంది. బాధితురాలు అళువ నగరంలో బస్సు ఎక్కి వెళుతుండగా, అప్పర్ బెర్త్‌లో నిద్రిస్తున్న ఓ యువకుడు అసభ్యకరంగా ప్రవర్తించాడట. ఎక్కడ పడితే అక్కడ చేతులు వేస్తుండడంతో కేకలు వేసింది. డ్రైవర్ బస్సు ఆపడంతో నిందితుడిని పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లాలని కోరింది. అంతేకాదు తనకు జరిగిన సంఘటనను లైవ్ స్ట్రీమింగ్ చేసింది. అయితే తాను ఏమీ చేయలేదంటూ ఆ కుర్రాడు బుకాయించాడు. సారీ చెప్పి పోలీసులకు మాత్రం పట్టించొద్దంటూ వేడుకున్నాడు. అయినా ఆ బాధితురాలు వెనక్కు తగ్గలేదు. కొట్టక్కల్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు నిందితుడిని ప్రశ్నించగా.. తాను ఆ అమ్మాయిపై ఎలాంటి అఘాయిత్యం చేయలేదని, బెర్త్ పక్కనున్న కర్టెన్స్ మూసేందుకు యత్నిస్తుంటే ఆ అమ్మాయే తప్పుగా అర్థంచేసుకుందని తెలిపాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. శంషాబాద్‌కు చెందిన ప్రియంక రెడ్డి దారుణ హత్యకు గురికావడం తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపింది. ఈ ఘటన జరిగిన రోజే అదే ప్రదేశంలో మరో యువతి మృతదేహం లభ్యం కావడంతో ప్రజలు షాక్‌కు గురయ్యారు. దాంతో పోలీసులు మరింత అప్రమత్తమై ఇలాంటి ఘటనలు జరగకుండా చూస్తామని తెలిపారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/34zojel
v

ఆ కేసులో సల్మాన్‌కు ఊరట.. చర్యలు తీసుకోలేమన్న కోర్టు

బాలీవుడ్‌ హీరో తన సినిమాలు కలెక్షన్లతో ఎంత ఫేమసో.. కేసులు వివాదాలతోనూ అంతే ఫేమస్. ముఖ్యంగా కృష్ణజింకలను వేటాడిన కేసులో సల్మాన్‌ ఇప్పటికీ కోర్టు చుట్టూ తిరుగుతూనే ఉన్నాడు. అంతేకాదు సల్మాన్‌ నిర్మాతగా తన బావమరిది ఆయుష్‌ శర్మ హీరోగా తెరకెక్కిన లవ్‌యాత్రి సినిమా కూడా సల్మాన్‌ను ఇబ్బందుల పాలు చేసింది. ఈ సినిమాకు ముందుగా లవ్‌రాత్రి అనే టైటిల్‌ను ఫిక్స్‌ చేశారు. అయితే ఆ టైటిల్ `నవరాత్రి`లా ఉందని కొన్ని హిందూ సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. కోర్టులో కేసుకు కూడా వేశాయి. 2018లో రిలీజ్ అయిన ఈ సినిమా బాక్సాఫీస్‌ దగ్గర బోల్తా పడినా సల్మాన్‌కు ఇబ్బందులు మాత్రం ఏడాది పాటు కొనసాగాయి. ఏడాది కాలంగా కొనసాగుతున్న ఈ కేసులో సల్మాన్‌కు ఊరట లభించింది. Also Read: సల్మాన్‌ తరుపున కోర్టుకు హాజరైన లాయర్‌ మాట్లాడుతూ `ఒకసారి సెన్సార్ సర్టిఫికేట్‌ జారీ అయిన తరువాత ఆ సినిమాను ఎక్కడైన ప్రదర్శించే హక్కు నిర్మాతకు ఉంటుంది. ఆ నిబంధనల ప్రకారం సల్మాన్‌ సినిమాను రిలీజ్‌ చేశార`ని తెలిపాడు. ఈ వాదనతో ఏకీభివించిన న్యాయస్థానం సల్మాన్‌పై ఎలాంటి చర్యలు తీసుకోలేమని తేల్చి చెప్పింది. ఇక సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం.. సల్మాన్‌ ప్రస్తుతం సూపర్‌ హిట్ దబాండ్‌ సిరీస్‌లో మూడో భాగంగా వస్తున్న దబాంగ్‌ 3 సినిమా పనుల్లో బిజీగా ఉన్నాడు. ప్రభుదేవా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో కన్నడ నటుడు సుధీప్‌ విలన్‌గా నటిస్తున్నాడు. ఈ సినిమాను హిందీతో పాటు దక్షిణాది భాషల్లోనూ రిలీజ్ చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నాడు. ఈ సినిమా డిసెంబర్ 20 ప్రేక్షకుల ముందుకు రానుంది. Also Read:


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2PauoaL
v

బంగారు కోడిపెట్ట.. ఖుష్బూ, జయప్రదతో చిరు స్టెప్పులు

మెగాస్టార్ చిరంజీవి హీరోగా 1992లో వచ్చిన ‘ఘరానా మొగుడు’ సినిమాలోని ‘బంగారు కోడిపెట్ట’ సాంగ్ ఎంత ఫేమస్సో అందరికీ తెలిసిందే. ఇదే పాటను ‘మగధీర’లో రీమేక్ కూడా చేశారు. తన కెరీర్‌లో మంచి పాపులర్ సాంగ్ అయిన ‘బంగారు కోడిపెట్ట’కు ఇటీవల మెగాస్టార్ డ్యాన్స్ చేశారు. అది కూడా ఖుష్బూ, జయప్రద వంటి ఒకప్పటి టాప్ హీరోయిన్లతో కలిసి స్టెప్పులేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇటీవల చిరంజీవి ఇంట్లో 80ల తారల గెట్ టుగెదర్ జరిగిన సంగతి తెలిసిందే. ఎన‌భైల‌ నాటి తార‌లంతా ‘క్లాస్ ఆఫ్ ఎయిటీస్’ పేరుతో ప్రతియేటా వార్షికోత్సవ వేడుక‌లు జ‌రుపుకుంటున్నారు. గ‌తంలో రకరకాల ప్రదేశాల్లో ఈ మీటింగ్ పార్టీ చేసుకున్నారు. ఈసారి ప‌దో వార్షికోత్సవ పార్టీ కావడంతో మెగాస్టార్ చిరంజీవి స్వయంగా ఈ కార్యక్రమానికి రూప‌క‌ల్పన చేశారు. అంతేకాకుండా హైదరాబాద్‌లోని జూబ్లీ హిల్స్‌లో కొత్తగా నిర్మించుకున్న తన ఇంట్లో ఈ వేడుకలు జరిపారు. Also Read: ఈనెల 23, 24వ తేదీల్లో జరిగిన ఈ వేడుకల్లో టాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్, శాండిల్‌వుడ్, బాలీవుడ్‌ నుంచి 40 మంది తారలు పాల్గొన్నారు. వీరంతా ఈ వేడుకల్లో బాగా ఎంజాయ్ చేశారు. తన మిత్రుల కోసం చిరంజీవి రకరకాల ఎంటర్‌టైన్మెంట్ ప్రోగ్రామ్స్ ప్లాన్ చేశారు. వాటిలో ఈ డ్యాన్స్ ప్రోగ్రాం ఒకటి. బంగారు కోడిపెట్ట పాటకు చిరంజీవి, ఖుష్బూ డ్యాన్స్ ఇరగదీశారు. 60 ఏళ్లు దాటినా మెగాస్టార్‌లో ఇంకా అదే జోష్. మధ్యలో జయప్రద కూడా వచ్చి చేరి చిరు‌తో కాలు కదిపారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/33wNXyT
v

అప్పటికీ ఇప్పటికీ ఏమీ మారలేదు: ప్రియాంక రెడ్డి హత్యపై అక్షయ్ కుమార్

హైదరాబాద్‌కు చెందిన వెటర్నరీ డాక్టర్ ప్రియాంక రెడ్డి హత్య కేసు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. కామంతో కళ్లు మూసుకుపోయిన దుర్మార్గులు ఆమెను అత్యాచారం చేసి హత్య చేశారు. ఆపై అత్యంత కిరాతకంగా ఆమెను దహనం చేశారు. ఈ హత్య కేసును హైదరాబాద్ పోలీసులు 24 గంటల్లోనే ఛేదించి నలుగురు నిందితులను అరెస్టు చేశారు. పక్కా ప్రణాళిక ప్రకారమే ఈ నలుగురు ప్రియాంకను రేప్ చేసి చంపేసినట్టు పోలీసులు వెల్లడించారు. ఇదిలా ఉంటే, ప్రియాంక రెడ్డి హత్యాచారం ఘటనపై దేశ వ్యాప్తంగా అందరూ స్పందిస్తున్నారు. అత్యంత కిరాతకంగా ప్రియాంకను చంపిన దుర్మార్గులను నడిరోడ్డుపై ఉరి తీయాలని కోరుతున్నారు. సామాన్యుల దగ్గర నుంచి సినీ ప్రముఖుల వరకు అంతా ప్రియాంక కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నారు. దోషులను కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు. ఢిల్లీ ‘నిర్భయ’ ఘటన తరవాత మళ్లీ ఆ స్థాయిలో దేశ వ్యాప్తంగా సంచలనమైన ఘటన ఇదే. Also Read: ఏం మారలేదు.. ప్రియాంక రెడ్డి హత్యాచార ఘటనపై బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ ట్విట్టర్ ద్వారా స్పందించారు. ‘‘హైదరాబాద్‌లో ప్రియాంక రెడ్డి కావచ్చు, తమిళనాడులో రోజా కావచ్చు లేదా రాంచీలో గ్యాంగ్ రేప్‌కు గురైన లా స్టూడెంట్ కావచ్చు.. ఇవన్నీ చూస్తుంటే మనం ఒక సమాజాన్ని కోల్పోతున్నట్టు అనిపిస్తోంది. అత్యంత విషాదకరమైన ఘటన నిర్భయ కేసు జరిగి ఏడేళ్లు అయ్యింది. అయినా ఇప్పటికీ మన నైతిక వస్త్రం ముక్కలుగా చిరుగుతూనే ఉంది. చట్టాలను మరింత కఠినంగా చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇలాంటి ఘటనలు ఆగాలి’’ అని అక్షయ్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/35N34pz
v

క్రూర మృగాలు కూడా సిగ్గుపడతాయి.. ప్రియాంక రెడ్డి హత్యపై అనుష్క

వెటర్నరీ డాక్టర్ ప్రియాంక రెడ్డి హత్య దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ఒక అభాగ్యురాలిపై నలుగురు కామ పిశాచులు లైంగిక దాడిచేసి అత్యంత క్రూరంగా హత్య చేయడం పట్ల ప్రతి ఒక్కరు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దోషులను నడిరోడ్డుపై ఉరితీయాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రియాంక రెడ్డి కుటుంబ సభ్యులకు ఆ దేవుడు శక్తిని, ధైర్యాన్ని అందించాలని ప్రార్థిస్తున్నారు. సామాన్య ప్రజల నుంచి సినీ, రాజకీయ ప్రముఖులు వరకు ప్రతి ఒక్కరూ ప్రియాంక రెడ్డి హత్యపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా తెలుగు సినిమా ప్రముఖులు ప్రియాంక రెడ్డి అత్యాచారం, హత్య ఘటనపై సోషల్ మీడియా ద్వారా స్పందిస్తున్నారు. నటి అనుష్క శెట్టి అయితే కాస్త ఘాటుగానే స్పందించారు. ప్రియాంక రెడ్డిని అత్యంత దారుణంగా హత్యచేసిన ఆ క్రిమినల్స్ చూసి క్రూర మృగాలు కూడా సిగ్గుపడతాయన్నారు. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పోస్ట్ పెట్టారు. Also Read: ‘‘అమాయకురాలైన ప్రియాంక రెడ్డిపై అత్యాచారం చేసి అనంతరం హత్య చేశారు. ఇది మానవత్వాన్ని కదిలించే విషాదకరమైన ఘటన. ఈ క్రిమినల్స్‌ను క్రూర మృగాలతో పోలిస్తే అవి కూడా సిగ్గుపడతాయి. మన సమాజంలో ఒక మహిళగా పుట్టడం నేరమా. ప్రియాంక మరణానికి కారకులైన వారికి వెంటనే శిక్షపడే విధంగా మనమందరం పోరాటం చేద్దాం. ప్రియాంక రెడ్డి కుటుంబానికి నా ప్రగాఢ సంతాపం తెలియచేస్తున్నాను’’ అని తన పోస్ట్‌లో అనుష్క పేర్కొన్నారు. కాగా, ఈ కేసులో ఇప్పటికే నలుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శంషాబాద్ సమీపంలోని తొండుపల్లి జంక్షన్ వద్ద ఉన్న టోల్ ప్లాజా వెనుక ఉన్న ఖాళీ ప్రదేశంలో ప్రియాంక రెడ్డిని రేప్ చేసి హత్య చేసినట్టు పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. అనంతరం ప్రియాంక మృతదేహాన్ని దుప్పట్లో చుట్టి 28 కి.మీ. దూరంలోని షాద్‌నగర్ వరకు తీసుకెళ్లారు. అక్కడ ఒక అండర్ బ్రిడ్జ్ వద్ద కిరోసిన్ పోసి ప్రియాంకను దహనం చేశారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2R1Gmpx
v

Priyanka హత్య: ‘సినిమాలోనే చంపలేకపోయా, అలాంటిది నిజంగా ఎలా చంపారు’

వెటర్నరీ డాక్టర్ ప్రియాంక రెడ్డి దారుణ హత్యతో తెలుగు రాష్ట్రాలు షాక్‌కు గురయ్యాయి. సాధారణ ప్రజలే కాదు సినీ ప్రముఖులు కూడా ఈ హీనమైన ఘటన పట్ల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిందితులకు ఉరిశిక్ష పడి తీరాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు. తాజాగా ఈ ఘటనపై ‘ఆర్ ఎక్స్ 100’ ఫేం స్పందించారు. తాను నటించిన ‘గుణ 369’ సినిమాలో ఓ అమ్మాయిపై చేయి వేసినందుకే నలుగురు యువకులను దారుణంగా చంపేస్తాడు. ఈ ఘటనను గుర్తుచేసుకుంటూ ఆయన ఓ ట్వీట్ పెట్టారు. ‘గుణ 369 సినిమాలో క్లైమాక్స్ సన్నివేశంలో నటిస్తున్నప్పుడే నాకు నాలుగైదు రోజులు చాలా డిస్టర్బింగ్‌గా ఉండేది. అలాంటిది నిజంగా అలాంటి ఘటన జరగడం మనం దాని గురించి ఏమీ చేయలేకపోవడం సిగ్గు చేటు. ప్రియాంక ఆత్మ ఎటూ శాంతించదు. అందుకే రెస్ట్ ఇన్ పీస్ సొసైటీ అనడం బెటర్. సారీ సిస్టర్ నిన్ను కాపాడుకోలేకపోయాం’ అని పేర్కొన్నారు. ‘గుణ 360’ సినిమాలో క్లైమాక్స్ సన్నివేశం దారుణంగా ఉంటుంది. ఓ ఆడపిల్లపై అఘాయిత్యం చేయాలని చూసిన దుండగులను కార్తికేయ దారుణంగా నరికేస్తుంటాడు. ఈ సన్నివేశం సినిమా మొత్తంలో హైలైట్‌గా నిలిచిందని చాలా మంది కామెంట్స్ చేశారు. చంపుతున్నట్లు నటించడానికే తనకు మనసే రాలేదంటే.. నిజంగా ఓ ఆడపిల్లను ఎలా చంపారు అని కార్తికేయ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రియాంక కదలికలపై కన్నేసిన నిందితులు పక్కా ప్రణాళికతోనే ఈ అఘాయిత్యానికి ఒడిగట్టారు. స్కూటీ టైర్‌లో ఉద్దేశ పూర్వకంగానే గాలి తీసేసి పంక్చర్‌ అయినట్లు నమ్మించారు. పంక్చర్ చేయిస్తామంటూ మాయమాటలు చెప్పి నలుగురు వ్యక్తులు ఆమెను కిడ్నాప్ చేశారు.మొత్తానికి తెలంగాణ పోలీసులు ప్రియాంక రెడ్డి కేసును ఛేదించారు. దారుణానికి ఒడిగట్టిన నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/37O0yky
v

Poonam Kaur: లేచిపోయిందా అని అడగడానికి పోలీసులకు సిగ్గులేదా?

ప్రియాంక రెడ్డి హత్య కేసు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపింది. వెటర్నరీ డాక్టర్ అయిన ప్రియాంక రెడ్డిపై నలుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారం చేసి అతిదారుణంగా పెట్రోల్ పోసి తగలబెట్టేశారు. అయితే ప్రియాంక ఎప్పటికీ ఇంటికి రాకపోయేసరికి ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు వెళ్లారు. ఆ సమయంలో పోలీసులు ప్రియాంక తల్లిదండ్రులను ప్రశ్నించిన తీరు వివాదాస్పదమైంది. ‘అమ్మాయి ఇంకా ఇంటికి రాలేదు సర్’ అని ప్రియంక తల్లిదండ్రులు ఫిర్యాదు చేస్తే.. ‘లేచిపోయిందేమో..’ అన్నారట. ఈ విషయాన్ని ప్రియాంక తల్లిదండ్రులు మీడియా ముందు బయటపెట్టడంతో ప్రజలు ఆగ్రహానికి గురవుతున్నారు. దీనిపై ప్రముఖ నటి స్పందించారు. ‘పోలీసులకు ఇది మర్యాదపూర్వకంగా అనిపించుకోదు. లేచిపోయిందేమో అని అడిగిన పోలీసులకు సిగ్గుగా లేదా. అసహ్యమేస్తోంది. వాట్ ద ఫ**’ అంటూ పూనమ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోపక్క ప్రియాంక హత్య కేసు మిస్టరీ వీడినట్లు తెలుస్తోంది. కేసు దర్యాప్తును ముమ్మరం చేసిన పోలీసులు నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ప్రియాంక రెడ్డి (22)ని లారీ డ్రైవర్లతో పాటు క్లీనర్లు అత్యంత పాశవికంగా గ్యాంగ్ రేప్ చేసి హతమార్చినట్లు తెలుస్తోంది. సీసీటీవీ ఫుటేజ్‌‌లను పరిశీలించి కేసులో నిందితులను గుర్తించారు. నలుగురు వ్యక్తులను అరెస్టు చేసి విచారిస్తున్నారు. ప్రియాంక మృతదేహాన్ని కిరోసిన్ పోసి తగలబెట్టినట్లు పోస్టుమార్టం రిపోర్టులో వెల్లడైనట్లు తెలుస్తోంది. అయితే.. ఇద్దరు అనుమానితులు ఓ పెట్రోల్ బంక్‌లో బాటిల్‌లో పెట్రోల్ నింపుకుంటున్న దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో నిక్షిప్తమయ్యాయి. ప్రియాంక మెడకు చున్నీ బిగించి ఊపిరాడకుండా చేసి చంపేసినట్లు భావిస్తున్నారు. ప్రియాంక తలపైనా గాయాలున్నట్లు వైద్యులు తెలిపారు. ఈ కేసులో నిందితులను పోలీసులు శుక్రవారం (నవంబర్ 29) మధ్యాహ్నం మీడియా ముందు ప్రవేశపెట్టనున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/35CeufM
v

Narendra Modi: టీవీ నటి పెళ్లికి హాజరైన ప్రధానమంత్రి

హిందీలో ప్రసారమయ్యే ‘యే రిష్తా క్యా కెహలాతా హై’ సీరియల్‌లో నటించిన ఇటీవల ఓ ఇంటివారయ్యారు. సుయేష్ రావత్ అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అయితే ఈ వేడుకకు ప్రధాని నరేంద్ర మోదీ అతిథిగా వెళ్లడం హాట్ టాపిక్‌గా మారింది. సాధారంగా మోదీ పెద్దగా పరిచయం లేని వారి వివాహాలకు వెళ్లరు. అలాంటిది వీరి వివాహ విందుకు ఎందుకు వెళ్లారు అని నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. హిందీ సీరియల్స్ చూసేవారికి మోహన ఓ నటిగా మాత్రమే తెలుసు. కానీ ఆమె ఓ యువరాణి అన్న అతి తక్కువ మందికి తెలుసు. మోహెన మధ్యప్రదేశ్‌లోని రెవా ప్రాంతానికి చెందిన రాజ వంశంలో జన్మించారు. అదీకాకుండా వారి వంశంలో వందేళ్ల తర్వాత ఓ యువరాణికి పెళ్లైంది. అందుకే మోహెన, సుయేష్ రావత్ పెళ్లి వేడుకను అంగరంగ వైభవంగా నిర్వహించారు. అందుకే మోదీని ఆహ్వానించి మరీ పెళ్లి వేడుకను ఘనంగా నిర్వహించారు. రేవా ప్రాంతంలో వివాహ విందును ఏర్పాటుచేశాక దిల్లీలోనూ మరో విందును ఏర్పాటుచేశారు. ఈ విందుకు ప్రధాని విచ్చేసి వధూవరులను ఆశీర్వదించారు. పిలవగానే వచ్చిన మోదీజీకి ధన్యవాదాలు తెలుపుతూ మోహన సోషల్ మీడియాలో ఫొటోలు పోస్ట్ చేశారు. అయితే పెళ్లి తర్వాత నటన మానేస్తానని మోహన ప్రకటించారు. మోహన మంచి డ్యాన్సర్ కూడా. ఎన్నో డ్యాన్స్ రియాల్టీ షోలలో పాల్గొన్నారు. మోహెన నటించిన ‘యే రిష్తా క్యా కెహలాతా హై’ సీరియల్ తెలుగులో ‘పెళ్లంటే నూరేళ్ల పంట’ అనే టైటిల్‌తో ప్రసారం అయింది. అయితే హిందీలో పాపులర్ అయినంత ఈ సీరియల్ తెలుగులో ఆకట్టుకోలేకపోయింది. దాంతో ప్రసారం చేయడం ఆపేసి సీరియల్‌ను హాట్ స్టార్‌లో పెట్టారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2rz2UDm
v

అర్జున్‌ సురవరం

ఎన్నో వాయిదాలు, వివాదాల తరువాత ఎట్టకేలకు ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తమిళ సూపర్‌ హిట్‌ కనితన్‌కు రీమేక్‌గా తెరకెక్కిన ఈ సినిమా తెలుగు ప్రేక్షకులకు సరికొత్త ఫీల్‌ ఇస్తుందంటున్నారు చిత్రయూనిట్‌

from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2qLIiIb
v

Thursday 28 November 2019

‘మీరు హీరోయిన్.. నన్ను పెళ్లి చేసుకోలేరు’

హీరోయిన్ల అందాలకు ముగ్దులైపోనివారు ఉండరు. హీరోయిన్‌ని అయినా కాకపోతిని అనుకోని అమ్మాయిలూ ఉండకపోరు. ఫలానా హీరోయిన్‌ని పెళ్లి చేసుకోవాలని కోరుకునే అబ్బాయిలు ఎందరో. ఇలాంటి ఆలోచన ఉన్న ఓ అబ్బాయే ఓ బాలీవుడ్‌ హీరోయిన్‌కి ప్రపోజ్ చేశాడు. ఆమె ఎవరో కాదు . విభిన్నమైన కాన్సె్ప్ట్స్ ఎంచుకుంటూ ప్రేక్షకుల మనసులు దోచుకున్న భూమికి ఫ్యాన్స్ ఎక్కువే. ఈ నేపథ్యంలో కఫీర్ సౌరభ్ అనే నెటిజన్.. భూమికి ప్రపోజ్ చేశాడు. ‘హాయ్ బ్యూటిఫుల్ మ్యామ్. మీ ఫొటో చూడకుండా ఒక్కరోజు కూడా ఉండలేను. మీరు చాలా ముద్దుగా ఉంటారు. మీరు సాధారణ అమ్మాయి అయితే బాగుండేది. కానీ ఇప్పుడు మీరు పెద్ద సెలబ్రిటీ. మిమ్మల్ని నేను ఎంత ప్రేమించినా లాభం లేదు. ఎందుకంటే మీరు నాలాంటి సాధారణ వ్యక్తిని పెళ్లి చేసుకోలేరుకదా. ఈ విషయం తలుచుకున్నప్పుడల్లా నాకు బాధగా ఉంటుంది’ అని ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ చూసిన భూమి చాలా స్వీట్‌గా రిప్లై ఇచ్చారు. ‘నేను సెలబ్రిటీ అయినా సాధారణ అమ్మాయిని అయినా ఇప్పుడు నాకు పెళ్లి చేసుకునే ఆలోచనలు చాలా తక్కువగా ఉన్నాయి. కానీ నువ్వు నన్ను ఎప్పుడూ మిస్ అవ్వకుండా చూసుకుంటాను. మంచి సినిమాలతో వెండి తెరపై సందడి చేస్తుంటాను’ అని రిప్లై ఇచ్చారు. భూమి రిప్లై చూసి ఎందరో నెటిజన్లు ఫిదా అయిపోయారు. నిజమైన ప్రొఫెషనల్‌గా సమాధానం ఇచ్చారు అంటూ పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. ‘బాలా’ సినిమాతో బ్లాక్ బస్టర్ సినిమా అందుకున్న భూమి.. ప్రస్తుతం ‘పతి పత్ని ఔర్ వో’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. కార్తిక్ ఆర్యన్, భూమి పెడ్నేకర్, అనన్య పాండే ఈ సినిమాలో ప్రధాన పాత్రల్లో నటించారు. ముదస్సర్ అజీజ్ డైరెక్ట్ చేసిన ఈ డిసెంబర్ 6న ప్రేక్షకుల ముందుకు రానుంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2R2ynsq
v

వెబ్‌ బాటలో మరో స్టార్‌ హీరోయిన్‌.. త్వరలోనే డిజిటల్‌ ఎంట్రీ!

ప్రస్తుతం అంతా డిజిటల్‌ రంగం వైపు అడుగులు వేస్తున్నారు. బడా బడా నిర్మాణ సంస్థలతో పాటు స్టార్ హీరోలు, హీరోయిన్లు కూడా వెబ్ సిరీస్‌లలో నటించేందుకు ఇంట్రస్ట్ చూపిస్తున్నారు. ఇప్పటికే పలువురు తెలుగు స్టార్స్‌ డిజిటల్‌ ప్లాట్‌ ఫామ్స్‌లోకి అడుగుపెట్టగా తాజాగా మరో టాప్‌ హీరోయిన్‌ ఈ రంగం దిశగా అడుగులు వేస్తోంది. తెలుగు, తమిళ్‌తో పాటు బాలీవుడ్‌లోనూ సత్తా చాటిన అందాల భామ తమన్నా భాటియా. తన అందంతో అందరి దృష్టినీ ఆకర్షించిన ఈ భామ ఇటీవల వరుసగా పాన్‌ ఇండియా సినిమాల్లో నటిస్తూ సత్తా చాటుతోంది. తాజాగా ఈ భామ మరో కొత్త ప్రయోగానికి రెడీ అవుతోంది. త్వరలో రిలీజ్‌కు రెడీ అవుతున్న ఓ వెబ్‌ సిరీస్‌లో ఈ భామ కీలక పాత్రలో నటిస్తోంది. Also Read: `నవంబర్‌ స్టోరి` పేరుతో తెరకెక్కుతున్న వెబ్‌ సిరీస్‌లో తమన్నా నటిస్తోంది. ఓ నేరుస్తుడైన తండ్రికి, అతని కూతురుతో ఉన్న అనుబంధం నేపథ్యంలో ఈ వెబ్‌ సిరీస్‌ను తెరకెక్కిస్తున్నారు. జీఎం కుమార్‌ తండ్రి పాత్రలో నటిస్తుండగా తమన్నా కూతురి పాత్రలో కనిపించనుంది. ఈ సందర్భంగా తమన్నా మాట్లాడుతూ తాను మరిన్ని విభిన్న పాత్రల్లో నటించాలని ఆశిస్తున్నట్టుగా వెల్లడించింది. రెగ్యులర్‌ రెండున్నర గంటల సినిమా ఫార్మాట్‌కు భిన్నంగా తెరకెక్కుతున్న వెబ్‌ సిరీస్‌లలో నటనకు మరింత స్కోప్‌ ఉంటుదన్న అభిప్రాయం వ్యక్తం చేసింది. Also Read: `ఎపిసోడ్స్‌గా తెరకెక్కే వెబ్ సిరిస్‌లో నా స్కిల్స్‌ను మరింతగా ప్రొజెక్ట్ చేసే అవకాశం ఉంటుంది. ఒక వెబ్ సిరీస్‌లో నటించటం అంటే కంటిన్యూస్‌గా 5 సినిమాల్లో నటించటమే. ఒక కథను సుధీర్ఘంగా తెరకెక్కించే అవకాశం ఉంటే మరింత డిటెయిల్‌గా కథ చెప్పవచ్చు. ఆ వెసులు బాటు వెబ్‌ సిరీస్‌లలో ఉంటుంది` అని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. కొత్త దర్శకుడు రామ్‌ సుబ్రమణియన్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ వెబ్‌ సిరీస్‌ను ఆనంద వికటన్‌ గ్రూప్‌ నిర్మిస్తోంది. దీంతో పాటు సరిలేరు నీకెవ్వరు సినిమాలో స్పెషల్‌ సాంగ్‌ చేస్తున్న ఈ బ్యూటీ బోలే చుడియన్‌ అనే హిందీ సినిమాలోనూ నటిస్తోంది. బాలీవుడ్‌ సూపర్‌ హిట్ క్వీన్ సినిమాకు రీమేక్‌గా తెరకెక్కిన దట్‌ ఈజ్‌ మహాలక్ష్మీ రిలీజ్‌ కావాల్సి ఉంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2R1RMd2
v

ఈ రోజు రిలీజ్‌ కావాల్సిన మరో సినిమా కూడా వాయిదా పడింది!

కోలీవుడ్ స్టార్‌ హీరో హీరోగా, లెజెండరీ దర్శకుడు దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ఎన్నై నోకి పాయుమ్ తోట. గౌతమ్‌ మీనన్‌ స్వయంగా నిర్మించిన ఈ సినిమా చాలాకాలంగా వాయిదా పడుతూ వస్తుంది. దాదాపు రెండున్నరేళ్లుగా ఈ సినిమాను విడుదల చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు గౌతమ్‌ మీనన్‌. కానీ ఆ ప్రయత్నాలేవి ఫలించటం లేదు. ధనుష్‌ లాంటి స్టార్‌ హీరో నటించిన సినిమాకు ఆర్థిక కష్టాలు రావటంపై సినీ వర్గాలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇటీవల కొంత తేరుకున్న గౌతమ్‌ మీనన్‌, ఈ సినిమాను రిలీజ్‌ చేసేందుకు ప్రయత్నాలు తిరిగి ప్రారంభించాడు. తమిళ్‌తో పాటు తెలుగులో తూటా పేరుతో ఈ సినిమా రిలీజ్‌ కు ప్లాన్‌ చేశాడు. గత నెల ఈ సినిమా రిలీజ్‌కు డేట్ ప్రకటించినా చివరి నిమిషంలో వాయిదా పడింది. Also Read: ఈ రోజు (29-11-2019) తూట రిలీజ్‌ అంటూ ప్రకటించారు చిత్రయూనిట్. పెద్దగా ప్రమోషన్‌ చేయకపోయినా సినిమాను వదిలేసి చేతులు దులుపుకోవాలని భావించారు. కానీ మరోసారి గౌతమ్‌ సినిమాను విడుదల చేయటంలో ఫెయిల్ అయ్యాడు. తెలుగుతో పాటు, చాలా చోట్ల తమిళ వర్షన్‌ రిలీజ్‌ కూడా ఆగిపోయినట్టుగా తెలుస్తోంది. కారణాలు వెల్లడించకపోయినా ఈ రోజు రిలీజ్‌ లేనట్టే అన ప్రచారం జరుగుతోంది. డిసెంబర్‌లో మరో డేట్‌ కోసం ఇప్పటికే ఆలోచిచటం మొదలు పెట్టారట గౌతమ్‌ మీనన్‌ టీం. ఓ స్టార్‌ హీరోతో స్టార్‌ డైరెక్టర్ తెరకెక్కించిన ఈ సినిమా రిలీజ్‌ విషయంలో ఇన్ని ఇబ్బందులు ఎదుర్కొవటం ఇదే తొలిసారి అంటున్నారు ఇండస్ట్రీ వర్గాలు. మరి ఇప్పటికైన తూటా కష్టాలు తీరి ప్రేక్షకుల ముందుకు వస్తుందేమో చూడాలి. Also Read:


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2Ds9q1n
v

Athade Srimannarayana Telugu Trailer


Athade Srimannarayana Telugu Trailer

from BharatStudent - Telugu - Actor Actress|Photo,Picture Galleries|Wallpapers|Screensavers|Movie Trailers|Film News and Gossips https://ift.tt/35KKE90

Enter The Girl Dragon Training Clips | Enter The Girl Dragon


Enter The Girl Dragon Training Clips | Enter The Girl Dragon

from BharatStudent - Telugu - Actor Actress|Photo,Picture Galleries|Wallpapers|Screensavers|Movie Trailers|Film News and Gossips https://ift.tt/2L4U47a

బార్‌లో సినీ నటిని చితక్కొట్టిన బౌన్సర్లు

అమెరికాలోని న్యూయార్క్‌లోని బార్‌లో దారుణం చోటుచేసుకుంది. ఓ హాలీవుడ్ నటిపై కొందరు దుండగులు దాడి చేశారు. వివరాల్లోకెళితే.. హాలీవుడ్ నటి అయిన జెన్నిఫర్ అగోస్టిని, తన స్నేహితురాలితో కలిసి న్యూయార్క్‌లోని మాన్‌హట్టన్‌లోని స్కైరూం బార్‌కు వెళ్లింది. బాగా తాగి ఎంజాయ్ చేసిన తర్వాత తెల్లవారుజామున 3 గంటలకు ఇళ్లకు తిరుగు ప్రయాణం అయ్యారు. ఆ సమయంలో అక్కడే ఉన్న 15 మంది ఆకతాయిలు వారిపై దాడికి పాల్పడ్డారు. ‘మీలాంటి తెల్ల ఆడకుక్కల దగ్గర డబ్బు ఉంది కాబట్టే ఇలా తాగి తిరుగుతున్నారు’ అని నోటికొచ్చినట్లు వాగారు. అంతటితో ఆగలేదు వారిని పట్టుకుని చావగొట్టారు. దాంతో జెన్నిఫర్‌ ముఖానికి తీవ్రగాయాలయ్యాయి. బార్ సిబ్బంది వారిని అడ్డుకుని పోలీసులకు అప్పగించారు. గాయపడిన నటిని ఆమె స్నేహితురాలిని హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. జెన్నిఫర్‌కు ఐదు కుట్లు పడ్డాయి. తల భాగంలోనూ తీవ్రంగా గాయాలైనట్లు డాక్టర్లు తెలిపారు. వారిపై దాడి చేసిన వారు ఆఫ్రికన్, అమెరికన్ సెక్యూరిటీ గార్డులుగా పోలీసులు గుర్తించారు. వారు అదే బార్‌లో బౌన్సర్లుగా పనిచేస్తున్నారట. వర్క్ పూర్తి చేసుకుని వెళ్లిపోయాక వారిలో ఓ వ్యక్తి క్రెడిట్ కార్డు మర్చిపోవడంతో తీసుకోవడానికి బార్‌కు వచ్చాడు. అయితే బార్ క్లోజ్ చేస్తున్నామని లోపలికి రావడానికి వీల్లేదని అన్నారట. అదే సమయంలో జెన్నిఫర్ తన స్నేహితులతో తూలుతూ బయటికి రావడంతో ఆ వ్యక్తి తన స్నేహితులను పిలిపించి వారిపై దాడి చేశాడు. నిందితులపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సీసీ కెమెరాల ఫుటేజ్‌ ఆధారంగా విచారణ జరుపుతున్నారు. జెన్నిఫర్ ‘బ్లూక్లిన్ టైస్’ అనే సినిమాలో నటించారు. అమెరికాలో ఇలాంటి కల్చర్ సర్వ సాధారణం. అలాంటిది ఓ నటిపై జాతి వివక్ష దాడి జరగడం వివాదాస్పదమైంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2OseAAK
v

మాజీ భర్త వల్ల కెరీర్ పోయింది: గాయని

‘ఓ బేబీ డాల్ మే సోనేదీ’ అనే పాట భారతదేశాన్ని ఒక ఊపు ఊపేసింది. బాలీవుడ్ హాట్ బాంబ్ సన్నీ లియోన్ నటించిన ‘రాగిని ఎంఎంఎస్’ సినిమాలోని పాట ఇది. ప్రముఖ సింగర్ పాడిన పాట. ఈ పాటతో కనికా పేరు మారుమోగిపోయింది. అయితే తన మాజీ భర్త వల్ల కెరీర్ పోయిందని బాధపడుతున్నారు కనికా. జియో సావన్ నిర్వహించిన ఓ కార్యక్రమంలో కనికా పాల్గొన్నారు. ఈ సందర్భంగా తన పెళ్లి తన కెరీర్‌కు ఎలా ఫుల్ స్టాప్ పెట్టిందో వివరించారు. ‘1998లో ఓ ఎన్నారై వ్యాపారవేత్తను పెళ్లి చేసుకున్నాను. అయితే అప్పటికే నేను సినీ పరిశ్రమలో పాటలు పాడటానికి ప్రయత్నిస్తున్నాను. అయితే అత్తింటివారు నేను పాటలు పాడతానంటే ఒప్పుకోలేదు. మాకు గానా బజానా కోడలు వద్దు అనేవారు. దాంతో నా భర్తతో ఓ ఒప్పందం కుదుర్చుకున్నాను. నేను సింగింగ్‌ని ప్రొఫెషన్‌గా తీసుకోను కానీ ప్రాక్టీస్ చేస్తాను అని చెప్పాను. ఇందుకు ఆయన ఒప్పుకున్నారు. ఆయన, నేను కలిసి మ్యూజిక్ డైరెక్టర్ల చుట్టూ తిరిగాం. అయినా కూడా నా భర్తకు నాకు మధ్య గొడవలు వచ్చాయి. దాంతో ఇద్దరం విడిపోవాలని నిర్ణయించుకున్నాం. అలా 2012లో ఆయనతో విడాకులు తీసుకున్నాను’ ‘సరిగ్గా అదే ఏడాదిలో నాకు ‘అలీఫ్ అల్లా’ అనే సినిమాలో ‘జుగ్నీ జీ’, ‘రాగిని ఎంఎంఎస్ 2’ సినిమాలో ‘బేబీ డాల్’ పాటలు పాడే అవకాశం వచ్చింది. ఈ రెండు పాటలు బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి. నా పేరు మారుమోగిపోయింది. ఆ తర్వాత చాలా సినిమాల్లో పాటలు పాడాను. ఇప్పుడు నా పేరుతో యూట్యూబ్ ఛానెల్ ఓపెన్ చేసి సొంతంగా రికార్డ్ చేసిన పాటలు పాడి షేర్ చేస్తున్నారు. దానికి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. అలా నా మాజీ భర్త వల్ల కోల్పోయిన కెరీర్‌ను అతనితో విడిపోయాక మళ్లీ దక్కించుకున్నాను’ అని వెల్లడించారు కనిక.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/33pOrH6
v

‘రాజావారు రాణిగారు’ రివ్యూ: రిఫ్రెషింగ్ మూవీ

కొత్తవాళ్లంతా కలిసి ఒక మంచి, రిఫ్రెషింగ్ సినిమాను తెలుగు ప్రేక్షకులకు అందించారు. సినిమాలో కొంచె ఫీల్ తగ్గింది, అక్కడక్కడా కాస్త నెమ్మదించింది అనే భావన తప్ప వంక పెట్టడానికి ఏమీలేదు. ముఖ్యంగా కామెడీ అదిరిపోయింది.

from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2OXBfnP
v

వర్మ పెట్టిన సినిమా చిచ్చు.. సెన్సార్ బోర్డ్‌కి ఏపీ ప్రభుత్వం లేఖ

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన పొలిటికల్ సెటైరికల్ మూవీ ‘కమ్మరాజ్యంలో కడపరెడ్లు’ను షెడ్యూల్ ప్రకారం రేపు (నవంబర్ 29న) విడుదల చేయాల్సి ఉంది. కానీ, ఈ సినిమాకు ఇప్పటి వరకు సెన్సార్ కార్యక్రమాలు పూర్తికాలేదు. దీనికి తోడు హైకోర్టులో కేసు కూడా నడుస్తోంది. చిత్ర విడుదలకు వీలులేకుండా ఈరోజు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. వారం రోజుల్లో సినిమాను చూసి సెన్సార్ సర్టిఫికేట్ ఇవ్వాలని సెన్సార్ బోర్డును హైకోర్టు ఆదేశించింది. టైటిల్ విషయంలో కూడా హైకోర్టు సీరియస్ అయ్యింది. రెండు కులాల మధ్య చిచ్చు పెట్టేలా సినిమా టైటిల్ ఉందని, దాన్ని మార్చాలని సూచించింది. ఇదిలా ఉంటే, ఈ టైటిల్ విషయమై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హైదరాబాద్‌లోని ప్రాంతీయ సెన్సార్ బోర్డు ఒక లేఖ రాసింది. ప్రభుత్వ సలహాదారు (పబ్లిక్ అఫైర్స్) సజ్జల రామకృష్ణారెడ్డి పేరిట ఈరోజు రీజినల్ సెన్సార్ బోర్డుకు ఒక లేఖ అందింది. చిత్ర టైటిల్‌ను మార్చాల్సిందిగా ఈ లేఖలో రీజినల్ సెన్సార్ ఆఫీసర్‌ను సజ్జల రామకృష్ణారెడ్డి కోరారు. ‘‘రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహించిన తెలుగు సినిమా ‘కమ్మరాజ్యంలో కడపరెడ్లు’ నవంబర్ 29న ఆంధ్రప్రదేశ్‌తో పాటు ఇతర రాష్ట్రాల్లో విడుదలవుతోంది. ఈ చిత్ర టైటిల్, పోస్టర్లు రెండు కులాల మధ్య చిచ్చు పెట్టే విధంగా ఉన్నాయి. అలాగే, ఇప్పటికే విడుదలైన రెండు ట్రైలర్లు టెంపోను బిల్డప్ చేశాయి. టీజర్లు కూడా కలకలం సృష్టించాయి. Also Read: రెండు కులాలను లక్ష్యంగా చేస్తూ పెట్టిన ఈ టైటిల్‌ను సామాజిక దృక్పథం కలిగి ఉన్న ఈ సవ్య సమాజం అంగీకరించదు. అందుకని ఈ చిత్ర టైటిల్‌ను మార్చాల్సిందిగా సంబంధిత నిర్మాణ సంస్థకు సూచించాలని కోరుతున్నాం. సినిమా, స్టోరీలైన్, కంటెంట్, అసలు దీనిలో ఏం చూపించారు వంటి విషయాలు పక్కనబెడితే అసలు టైటిలే అంగీకరించలేని విధంగా ఉందని మేం బలంగా నమ్ముతున్నాం. సమాజం అంగీకరించే విధంగా టైటిల్‌ను మార్చాలి. టైగర్ కంపెనీ ప్రొడక్షన్, అజయ్ మైసూర్ ప్రొడక్షన్ బ్యానర్లపై టి. శ్రీధర్, టి. నరేష్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మించారు’’ అని ఆ లేఖలో సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. కాగా, టైటిల్ విషయంలో సెన్సార్ బోర్డు అభ్యంతరం వ్యక్తం చేస్తే తమ వద్ద ప్రత్యామ్నాయం ఉందని ఇప్పటికే రామ్ గోపాల్ వర్మ వెల్లడించారు. టైటిల్‌ను ‘‘అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు’’ అని మారుస్తామని స్పష్టం చేశారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2OsVudI
v

బాల‌కృష్ణకి మంచు లక్ష్మి ఛాలెంజ్

నటసింహా నందమూరి బాలకృష్ణకు నటి మంచు లక్ష్మి ఛాలెంజ్ విసిరారు. ఆయనతో పాటు తమ్ముడు మంచు మనోజ్, హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్‌కు కూడా ఈ ఛాలెంజ్‌ను విసిరారు లక్ష్మి. ఇప్పటికే అర్థమైవుంటుంది ఆ ఛాలెంజ్ ఏంటో. అదేనండి.. మొక్కలు నాటే ఛాలెంజ్, గ్రీన్ ఛాలెంజ్. టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు సంతోష్ కుమార్ చేప‌ట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌కి మంచి ఆద‌ర‌ణ ల‌భిస్తోన్న సంగతి తెలిసిందే. ప్రముఖ రాజ‌కీయ నాయ‌కులు, సెల‌బ్రిటీలు, క్రీడా ప్రముఖులు ఇందులో భాగం అవుతున్నారు. న‌వంబర్ 13న ప్రముఖ యాంక‌ర్ సుమ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్వీక‌రించి మూడు మొక్కలు నాటారు. అనంతరం జూనియర్‌ ఎన్టీఆర్‌, రాహుల్‌ సిప్లిగంజ్‌, మంచు లక్షి, యాంకర్‌ ఓంకార్‌కు గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ విసిరారు. సుమ ఛాలెంజ్‌ని స్వీక‌రించిన మంచువార‌మ్మాయి త‌న ఇంట్లో మొక్క నాటారు. పర్యావరణాన్ని కాపాడే ఇలాంటి బృహత్తర కార్యక్రమంలో భాగం అయినందుకు సంతోషంగా ఉంద‌ని మంచు ల‌క్ష్మి ఈ సంద‌ర్బంగా పేర్కొన్నారు. ‘‘గ్రీన్ ఛాలెంజ్ చాలా ముఖ్యమైన‌ది. ఎన్ని చెట్లు నాటితే అంత మంచిది. ఇది నిరంత‌రాయంగా కొన‌సాగాలి. గ్రీన్ ఛాలెంజ్‌లో భాగంగా.. మంచు మ‌నోజ్‌, ర‌కుల్ ప్రీత్ సింగ్‌, నంద‌మూరి బాల‌కృష్ణల‌కి ఛాలెంజ్ విసురుతున్నాను’’ అని మంచు ల‌క్ష్మి చెప్పారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/34uwDMm
v

‘సెక్స్ కూడా సోషల్ మీడియాలోనే చేసుకోమంటారా?’

ఇండియాకు చెందిన సెలబ్రిటీలు మీడియా ముందు చాలా జాగ్రత్తగా ఉంటారు. కానీ విదేశాల్లో మాత్రం మీడియా ముందు జాగ్రత్తగా ఉండాలనుకునే ప్రముఖులు చాలా తక్కువ మంది ఉంటారు. అక్కడి వారికి కోపం వస్తే మీడియా ఉందా లేదా అని కూడా చూసుకోరు. నోటికి వచ్చినట్లు మాట్లాడేస్తుంటారు. తాజాగా కామిల్లా కాబిల్లో అనే అమెరికన్ సింగర్ ఓ షోలో ఫ్యాన్‌కి ఇచ్చిన సమాధానం అందరినీ షాక్‌కు గురిచేసింది. అసలేం జరిగిందంటే.. కామిలా కెనడియన్ సింగర్ షాన్ మెండెస్‌తో ప్రేమలో ఉంది. వీరిద్దరూ గాఢంగా ప్రేమించుకుంటున్నారు. వీరిద్దరూ ఎప్పుడు బయటికి వెళ్లినా లిప్ కిస్సె్స్ ఇచ్చుకుంటూ ఉంటారు. ఈ నేపథ్యంలో కామిల్లా ఇటీవల ఓ షోలో పాల్గొన్నారు. అభిమానులతో నేరుగా మాట్లాడారు. ఈ సందర్భంగా ఓ అభిమాని కామిల్లాను ప్రశ్నిస్తూ.. ‘పబ్లిక్ ప్రదేశాల్లో ముద్దులు ఎక్కువైపోతున్నాయ్’ అన్నారు. దాంతో కామిల్లాకు కాస్త కోపం వచ్చింది. ‘ఈ కామెంట్ నాపై పర్సనల్‌గా చేస్తున్న ఆటాక్‌లా అనిపిస్తోంది. మీడియా నా పబ్లిక్ రొమాన్స్‌ని నెగిటివ్‌గా చూపించేస్తోంది. అంటే ఇప్పుడు మీ అభిప్రాయం ప్రకారం ఇలాంటి రొమాంటిక్ ఫొటోలన్నీ సోషల్ మీడియాలో పోస్ట్ చేయాలంటారా? అయితే సెక్స్ కూడా సోషల్ మీడియాలోనే చేయాల్సి వస్తుంది’ అని కామెంట్ చేశారు. మీడియా ఉన్నా కూడా కామిల్లా తన ప్రియుడిని ముద్దు పెట్టుకోవడానికి ఏమాత్రం సందేహించరు. ఎవరేమనుకుంటే నాకేంటి అన్నట్లుగా వ్యవహరిస్తుంటారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/33rjwu5
v

వర్మకు షాక్‌ ఇచ్చిన హైకోర్టు.. `కమ్మ రాజ్యంలో..` రిలీజ్‌కు బ్రేక్‌

సంచలన దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం . ఈ శుక్రవారం (29-11-2019) రిలీజ్‌ కావాల్సిన ఈ సినిమాకు తెలంగాణ హైకోర్ట్‌ బ్రేక్‌ వేసింది. వర్మ ఈ సినిమా టైటిల్ ప్రకటించిన దగ్గర నుంచే ఈ సినిమాపై వివాదాలు మొదలయ్యాయి. టైటిల్ రెండు కులాల మధ్య చిచ్చు పెట్టేలా ఉందన్న విమర్శలు పెద్ద ఎత్తున వినిపించాయి. కొంత మంది వ్యక్తులను కించపరిచేలా వర్మ తన సినిమాలో పాత్రలను చూపించారన్న విమర్శలు కూడా ఉన్నాయి. ఇదే విషయమై కేఏ పాల్‌ కోర్టును ఆశ్రయించారు. అయితే వర్మ ఇవేవి పట్టించుకోకుండా సినిమా రిలీజ్‌కు ఏర్పాట్లు చేసుకున్నాడు. కానీ రిలీజ్‌కు కొన్ని గంటల ముందు హైకోర్ట్‌ వర్మకు షాక్‌ ఇచ్చింది. Also Read: కమ్మ రాజ్యంలో కడప రెడ్లు సినిమాపై దాఖలైన పిటీషన్లను విచారించిన తెలంగాణ హైకోర్టు సినిమా విడుదలపై స్టే విధించింది. సోలిసిటర్‌ జనరల్‌ రాజేశ్వర్‌ రావు సినిమాకు ఇంకా సెన్సార్‌ సర్టిఫికేట్‌ ఇవ్వలేవని కోర్టుకు తెలిపారు. సినిమా విషయంలో తలెత్తిన వివాదాలను పరిష్కరించి అభ్యంతరాలను స్వీకరించాలని సెన్సార్‌ బోర్డ్‌కు హైకోర్టు సూచించింది. వారం రోజుల్లోగా వివాదాలను పరిష్కరించి సినిమాకు సెన్సార్‌ సర్టిఫికేట్‌ జారీ చేయాలని హైకోర్ట్ ఆదేశించింది. ఈ సందర్బంగా హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. రెండు కులాల మధ్య చిచ్చు పెట్టే విధంగా ఉన్న సినిమా టైటిల్‌ను మార్చాలని చిత్రయూనిట్‌ను ఆదేశించింది. అయితే ఇప్పటికే టైటిల్‌ను అమ్మ రాజ్యంలో కడప బిడ్డలుగా మార్చామని కోర్టు తెలిపాడు వర్మ. సినిమాక వీలైనంత త్వరగా సెన్సార్‌ సర్టిఫికేట్‌ ఇచ్చేలా ఆదేశాలు ఇవ్వాలని కోర్టును కోరారు. Also Read:


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/34ouvpn
v

Dhandam Full Video Song | Kamma Rajyam Lo Kadapa Reddlu


Dhandam Full Video Song | Kamma Rajyam Lo Kadapa Reddlu

from BharatStudent - Telugu - Actor Actress|Photo,Picture Galleries|Wallpapers|Screensavers|Movie Trailers|Film News and Gossips https://ift.tt/33o0EvP

ఆ నటిపై కోపం లేదు, నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు: విజయ్ దేవరకొండ

యువ కథానాయకుడు విజయ్ దేవరకొండకు కోపం వచ్చింది. మీడియా ముందుకు వచ్చిన ప్రతీసారి ‘అర్జున్ రెడ్డి’ సినిమాను చుట్టుముట్టిన వివాదంపై ప్రశ్నలు అడుగుతుంటే చిరాకుగా ఉంటోందని అంటున్నారు. గోవాలో జరుగుతున్న ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియా వేడుకలో గెస్ట్‌గా పాల్గొన్నారు . ఈ సందర్భంగా సోషల్ మీడియాలో అర్జున్ రెడ్డి సినిమాపై వస్తున్న కామెంట్స్ గురించి, ప్రముఖ మలయాళ నటి పార్వతి సినిమాపై చేసిన కామెంట్స్ గురించి మాట్లాడారు. ‘నాకు చాలా చిరాగ్గా ఉంది. ఇక నా వల్ల కాదు. నేను దీని గురించే ఆలోచిస్తుంటే అది నా ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. నేను సాధారణంగా అర్థం చేసుకునే వ్యక్తిని. ‘అర్జున్ రెడ్డి’ సినిమాపై కొందరు అభ్యంతరం వ్యక్తం చేశారు. వారిలో నిజాయతీగా సమాజం గురించి ఆలోచిస్తూ ప్రశ్నలు వేసిన వారు ఉన్నారు. కానీ కొందరు అసలు ఏం మాట్లాడుతున్నారో కూడా తెలీకుండా కామెంట్లు చేస్తున్నారు. వారు పొరపాటుపడ్డారని అనుకుంటున్నాను. అర్జు్న్ రెడ్డి గురించి చాలా మంది చాలా ప్రశ్నలు అడిగారు. నాకు ఆ విషయంలో ఎలాంటి ఇబ్బంది లేదు’ ‘అర్జున్ రెడ్డి సినిమాపై పార్వతి కూడా తన అభిప్రాయాలను వెల్లడించారు. అందుకు నాకు ఆమెపై ఎలాంటి కోపం లేదు. ఆమె సినిమలు కూడా నాకు చాలా నచ్చాయి. కానీ నాకు కోపం వచ్చేది ఎక్కడంటే.. సోషల్ మీడియాలో ఈ సినిమాపై జరుగుతున్న హడావుడి. నెటిజన్స్ పిచ్చిపట్టినట్లుగా ప్రవర్తిస్తున్నారు. అసలు వాళ్లు ఏం మాట్లాడుతున్నారో వారికే అర్థంకావడంలేదు. నా అడ్డుపెట్టుకుని సెలబ్రేట్ చేసుకుంటున్నారు. అది నాకు నచ్చడంలేదు. అంతేకానీ మీరు అర్జున్ రెడ్డి సినిమా గురించి ఏం అనుకున్నా నేను పట్టించుకోను’ అని వెల్లడించారు విజయ్ దేవరకొండ.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2QXT1tv
v

ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపా.. బిజినెస్ జరిగినా సినిమా ఆలస్యమైంది!

ఎన్నో అవాంతరాల తరువాత నిఖిల్ సిద్ధార్థ్‌ హీరోగా తెరకెక్కిన ఈ శుక్రవారం (29-11-2019) ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సందర్భంగా హీరో నిఖిల్ ఈ సినిమాతో తన అనుబందాన్నీ, అనుభావాలను మీడియాతో పంచుకున్నాడు. సినిమా ఆలస్యానికి కారణాలను కూడా వెల్లడించాడు . ఈ ఏడాది మేలోనే రిలీజ్‌ కావాల్సిన అర్జున్‌ సురవరం దాదాపు 6 నెలలు ఆలస్యంగా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. అన్ని సినిమాలు ఆర్ధిక ఇబ్బందులతో ఆలస్యమవుతుంటాయి. కానీ మా సినిమాకు అలాంటి ఇబ్బందులు లేకపోయినా ఆలస్యమైందని ఆయన ఆవేదన వ్యక్తం చేశాడు. సినిమాతో సంబంధం లేని వ్యక్తుల కారణంగా రిలీజ్‌ ఆలస్యమైందని తెలిపాడు. Also Read: నిర్మాతలు, థియేటర్ల యజమానులు రిలీజ్‌కు ముందుకు వచ్చినా మధ్యలో ఉన్న వ్యక్తలు కారణంగానే సినిమా ఆలస్యమైందన్నాడు నిఖిల్‌. డిస్ట్రిబ్యూటర్ల నుంచి సరైన సహకారం అందకపోవటం కారణంగానే ఇలా జరిగిదని తెలిపాడు. తమకు సంబంధం లేని సినిమాలు, తమిళ సినిమాల బిజినెస్‌లతో లింక్‌ పెట్టి అర్జున్‌ సురవరం రిలీజ్‌ను వాయిదా వేయించారని తెలిపాడు. ఇది తన మనసుకు నచ్చిన సినిమా అన్న నిఖిల్.. అందుకే ఇన్ని అవాంతరాలు ఎదురైన సినిమా రిలీజ్‌ కోసం తాను ఇంత కష్టపడ్డానన్నాడు. ఈ సినిమా కోసం తాను సగం రెమ్యూనరేషన్‌ మాత్రమే తీసుకున్నానని, ఇన్నేళ్ల కెరీర్‌లో అలా రెమ్యూనరేషన్‌ వదులుకున్న సినిమా కూడా ఇదే అన్నాడు నిఖిల్‌. ఓ మంచి సినిమాను జనంలోకి తీసుకెళ్లాలనే ఇంత కష్టపడుతున్నామని తెలిపాడు. Also Read: చిత్ర దర్శకుడు సంతోష్ గురించి మాట్లాడుతూ.. `ఆయన పని రాక్షసుడు. అవుట్‌పుట్‌ కోసం నటుడ్ని ఎంత కష్టమైనా పడేలా చేస్తాడు. సినిమాలో ఓ సన్నివేశం కోసం నన్ను 36 సార్లు చెంపదెబ్బ కొట్టించాడు` అన్నాడు. ఈ సినిమారలో లావణ్య త్రిపాఠి పాత్ర కూడా ఎంతో కీలకమన్నాడు నిఖిల్‌. ఇన్నాళ్లు గ్లామర్‌ రోల్స్‌కే పరిమితమైన లావణ్య ఈ సినిమాలో యాక్షన్‌ ఎమోషనల్‌ సీన్స్‌లో నటించిందని తెలిపాడు. ఈ సందర్భంగా తన తదుపరి చిత్రాల వివరాలను కూడా వెల్లడించాడు నిఖిల్‌. ఇక మీదట రీమేక్‌ సినిమాలు చేయని చెప్పాడు. డిసెంబర్‌లో కార్తికేయ సీక్వెల్‌ ప్రారంభమవుతుందన్న యంగ్‌ హీరో గీతా ఆర్ట్స్‌ బ్యానర్‌లో వీఐ ఆనంద్‌ దర్శకత్వంలో ఓ సినిమా, హనుమాన్‌ అనే పేరుతో రొబోటిక్స్‌ నేపథ్యంలో మరో సినిమా చేస్తున్నాని తెలిపాడు. గతంలో ప్రకటించిన శ్వాస సినిమా ఆగిపోయిందని క్లారిటీ ఇచ్చాడు నిఖిల్‌. Also Read:


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/37JeuMP
v

Wednesday 27 November 2019

దాంపత్య సమస్యలుంటే నా వద్దకు రండి అంటున్న హీరోయిన్

మీ భార్య మీ మాట వినడంలేదా? మీ భర్తతో వేగలేకపోతున్నారా? అయితే వెంటనే చేయాల్సిందల్లా ‘వేదికా లవ్‌లైన్’ను సంప్రదించడమే. ఈ లవ్‌లైన్ ద్వారా మీ దాంపత్య సమస్యలన్నీ తీరిపోతాయని గ్యారెంటీ ఇస్తున్నారు బాలీవుడ్ నటి . ఆమె కథానాయికగా నటించిన సినిమా ‘పతి పత్ని ఔర్ వో’. కార్తిక్ ఆర్యన్ హీరోగా నటించారు. ఇందులో భూమి కార్తిక్ భార్య వేదిక పాత్రలో నటించారు. మరో బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే కార్తిక్ ప్రియురాలి క్యారెక్టర్‌లో నటించారు. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా భూమి ‘వేదికా లవ్‌లైన్’ అనే క్యాంపెయిన్‌ను ప్రారంభించారు. దీని ద్వారా భార్యాభర్తలు ఎదుర్కొంటున్న చిన్న చిన్న సమస్యలను తీర్చగలుగుతానని అంటున్నారు. ‘ఇది ఫన్ సోషల్ మీడియా క్యాంపెయిన్. భార్య, భర్తలతో నేను మాట్లాడి వారి చిన్న చిన్న దాంపత్య సమస్యలను తీరుస్తాను. ‘పతి పత్ని ఔర్ వో’ సినిమాలో నేను భార్య పాత్రను పోషించాను. కాబట్టి భార్యభర్తలకు నాకు తెలిసిన టిప్స్ చెప్పగలను. ఈ క్యాంపెయిన్ ద్వారా సినిమా ఎక్కువ మంది ప్రేక్షకులకు చేరువ అవుతందని ఆశిస్తున్నాను’ అని తెలిపారు. ఈ సినిమాను ముదస్సర్ అజీజ్ డైరెక్ట్ చేశారు. 1978లో ఇదే టైటిల్‌తో వచ్చిన క్లాసిక్ సినిమాకు ఈ సినిమా సీక్వె్ల్‌గా రాబోతోంది. ట్రైలర్‌కు మంచి స్పందన వచ్చింది. కాకపోతే ఇందులో కార్తిక్ ఆర్యన్ పెళ్లి తర్వాత జరిగే సెక్స్ గురించి చెప్పిన భారీ డైలాగ్ వివాదాస్పదమైంది. దాంతో ఈ డైలాగ్‌ను తొలగించేసినట్లు డైరెక్టర్ వెల్లడించారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2pU2U0a
v

Prema Lyrical Song - Cycle


Prema Lyrical Song - Cycle

from BharatStudent - Telugu - Actor Actress|Photo,Picture Galleries|Wallpapers|Screensavers|Movie Trailers|Film News and Gossips https://ift.tt/2rxAiua

Ismart Shankar: ఆ కుర్రాడికి ఫిదా అయిపోయిన చార్మి

డ్యాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కాంబినేషన్‌లో ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని కథానాయకుడిగా నటించిన సినిమా ‘ఇస్మార్ట్ శంకర్’. నిధి అగర్వాల్, నభా నటేష్ కథానాయికలుగా నటించారు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయం అందుకుంది. అయితే ఈ సినిమాలోని ‘సిలక సిలక’ పాటకు శ్రీకాంత్ అనే కుర్రాడు వేసిన డ్యాన్స్‌కి ఫిదా అయిపోయింది సినిమాకు సహ నిర్మాతగా వ్యవహరించిన చార్మి. రామ్‌లాగే అంతే ఎనర్జిటిక్‌గా పర్‌ఫెక్ట్‌గా డ్యాన్స్ చేసిన ఆ కుర్రాడి వీడియోను ట్విటర్‌లో షేర్ చేసింది. ‘అమేజింగ్ మ్యాన్. ఎంత ఎనర్జిటిక్‌గా ఉన్నాడు. అక్కడ నేను కూడా ఉంటే బాగుండేది నీతో పాటు డ్యాన్స్ చేసేదాన్ని’ అని ట్వీట్ చేశారు. ఈ వీడియోను యతీష్ యాదవ్ అనే నెటిజన్ ఈ వీడియోను షేర్ చేశాడు. పూరీ జగన్నాథ్, రామ్, చార్మీ, నిధి అగర్వాల్‌ని ట్యాగ్ చేశాడు. చాలా కాలం తర్వాత పూరీ జగన్నాథ్‌కి, రామ్‌కి ఈ సినిమాతో మంచి సక్సెస్ వచ్చింది. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా రూ.75 కోట్లు రాబట్టింది. మెమొరీ మార్పిడి అనే కొత్త కాన్సెప్ట్‌ను ఎంచుకున్న పూరీ.. హీరో డైలాగ్స్‌కు తెలంగాణ యాస‌ను జోడించి కుర్రకారులో జోష్ పెంచాడు. తన టేకింగ్‌తో సినిమాను మరో లెవల్‌కు తీసుకెళ్లాడు. అందుకు తగ్గట్టుగానే మణిశర్మ ఇచ్చిన మ్యూజిక్ సినిమాకు ప్లస్ అయింది. పూరీ కనెక్ట్స్ బ్యానర్‌పై పూరీ జగన్నాథ్, చార్మి సంయుక్తంగా నిర్మించారు. ఈ సినిమా మంచి లాభాలను తెచ్చిపెట్టడంతో పూరీ, చార్మి, నభా నటేష్ లగ్జరీ కార్లు కూడా కొనుక్కున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/35AEUym
v

షూటింగ్‌లో నటుడు మృతి.. రిస్కీ స్టంట్స్‌ చూసి గుండెపోటు

రియాలిటీ షోలు ఏదో వివాదంతో వార్తల్లో నిలుస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా సంచలనంగా మారిన బిగ్‌బాస్‌ అనేవివాదాలు కారణంగా కాగా తాజాగా చేజ్‌ మీ అనే చైనా రియాలిటీ షో కూడా వార్తల్లో నిలిచింది. ఈ షోలో కంటెస్టెంట్‌ చేసిన రిస్కీ్ స్టంట్‌ చూసి అక్కడికి గెస్ట్ వచ్చిన ఓ నటుడు మృతి చెందడం సంచలనంగా మారింది. ప్రముఖ మోడల్‌, యాక్టర్‌ (35) చైనాలో చిత్రీకరణ జరుగుతున్నో ఓ టీవీ షోకు అతిథిగా హాజరయ్యాడు. చేజ్‌ మీ అనే చిత్రీకరణలో ఆయన హఠాత్తుగా కిందపడిపోయారు. వెంటనే అక్కడున్న వారు స్పందించి ఆయన్ను ఆసుపత్రికి తీసుకెళ్లిన ఫలితం లేకపోయింది. షోలో భాగంగా కంటెస్టెంట్‌ చేసిన స్టంట్స్‌ చూసి ఆయనకు హార్ట్‌ ఎటాక్‌ వచ్చి ఉంటుందని డాక్టర్లు అభిప్రాయపడ్డారు. Also Read: దాదాపు మూడు గంటల పాటు గాడ్‌ఫ్రేను కాపాడేందుకు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. ఈ సంఘటనపై చేజ్‌ మీ నిర్వహకులు కూడా ఓ ప్రకటన విడుదల చేశారు. `సంఘటన జరిగిన వెంటనే అక్కడ ఉన్న డాక్టర్లు స్పందించి ప్రథమ చికిత్స అందించారు. తరువాత హాస్పిటల్‌కు తీసుకెళ్లి గాడ్‌ఫ్రేను కాపాడేందుకు అన్ని రకాలుగా కృషి చేశారు. కానీ ఫలితం దక్కలేదు. ఈ ఘటన పట్ల మేం తీవ్రం దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తున్నాం` అంటూ ఓ అధికారిక ప్రకటనను విడుదల చేశారు. తైవాన్‌కు చెందిన గాడ్‌ఫ్రే గావో ముందుగా ఫ్యాషన్‌ మోడల్‌గా అందరి దృష్టిని ఆకర్షించాడు. అంతేకాదు లూయిస్‌ విట్టన్‌ సంస్థకు మోడల్‌గా వ్యవహరించిన తొలి ఏసియన్‌ మోడల్‌కూడా గాడ్‌ఫ్రేనే కావటం విశేషం. పలు హాలీవుడ్‌, చైనీస్‌ సినిమాలోను నటించిన గాడ్‌ఫ్రే.. నటుడిగానూ తన మార్క్‌ చూపించాడు. Also Read:


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/35QIPYf
v

‘కమ్మరాజ్యంలో కడపరెడ్లు’ పేరు మార్పు.. కొత్త టైటిల్ ప్రకటించిన వర్మ

ఎట్టకేలకు వర్మ దిగిరాకతప్పలేదు.. ‘కమ్మ రాజ్యంలో కడపరెడ్లు’ టైటిల్‌ను మార్చుతూ ప్రకటన చేశారు. ఈనెల 29న విడుదల కానున్న ఈ సినిమాకు ఇదే టైటిల్‌తో సెన్సార్‌కు వెళ్లితే తిరస్కరణ తప్పదనే భావనతో టైటిల్‌ను మార్చుతూ నిర్ణయం తీసుకున్నారు. ‘కమ్మ రాజ్యంలో కడపరెడ్లు’ అనే టైటిల్‌ను ‘అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు’గా మార్చారు. రేపు సెన్సార్‌కు వెళ్తున్న ఈ సినిమాను వివాదాలు చుట్టేశాయి. ముఖ్యంగా ‘కమ్మరాజ్యంలో కడప రెడ్లు’ అనే టైటిల్‌లే వివాదం కావడంతో ఈ టైటిల్ మార్పుతో రేపు సెన్సార్ బోర్డ్‌కు వెళ్తున్నారు వర్మ. కాగా ఈ సినిమాలో తనను కించపరుస్తూ చూపించారని సినిమాను వాయిదా వేయాలని కోర్టుకెక్కారు కేఏ పాల్. మరోవైపు చంద్రబాబు, లోకేష్ బాబులను కించపరుస్తూ ఈ సినిమాను రూపొందించడంతో ‘కమ్మరాజ్యంలో కడపరెడ్లు’ సినిమా విడుదలపై గుర్రుగా ఉన్నారు తెలుగు తమ్ముళ్లు. ఇక విడుదలకు మధ్యలో ఒకే రోజు సమయం ఉండటం.. సెన్సార్ కార్యక్రమాలు ఇంకా కంప్లీట్ కాకపోవడంతో వర్మ గత సినిమాల మాదిరే ఈ సినిమా కూడా వాయిదా పడుతుందా? లేక సెన్సార్ సభ్యులు గ్రీన్ సిగ్నల్ ఇస్తారా? అన్నది సినీ రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2XRUDX4
v

రజినీకాంత్ ‘దుమ్ము ధూళి’ సాంగ్.. దుమ్ముదులిపిన ఎస్పీబీ

సూపర్ స్టార్ రజినీకాంత్ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా నటిస్తోన్న చిత్రం ‘దర్బార్’. నయనతార హీరోయిన్. ఎ.ఆర్.మురుగదాస్ దర్శకత్వం వహిస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఎ.సుబస్కరన్ ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. యువ సంగీత సంచలనం అనిరుధ్ రవిచందర్ సంగీతం సమకూరుస్తోన్న ఈ సినిమా నుంచి తొలిపాటను బుధవారం విడుదల చేశారు. ‘దుమ్ము ధూళి’ అంటూ సాగే ఈ పాట నిజంగా దుమ్మురేగిపోయేలా ఉంది. దిగ్గజ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఈ పాటను ఆలపించారు. తమిళం, తెలుగులోనూ ఆయనే పాడారు. ఎస్పీబీతో పాటు అనిరుధ్ కూడా గొంతు కలిపారు. తెలుగులో అనంత్ శ్రీరామ్ సాహిత్యం అందించారు. ఎస్పీబీ ఎప్పటిలానే మంచి ఊపుతో పాడారు ఈ పాట. దుమ్ముదులిపారు. వాస్తవానికి రజినీకాంత్ సినిమాల్లో సోలో సాంగ్స్‌ను ఎస్పీ బాలసుబ్రహ్మణ్యమే పాడుతూ ఉంటారు. అయితే, ‘కబాలి’, ‘కాలా’ చిత్రాల్లో ఎస్పీబీ పాటలు లేవు. ఆ లోటును రజినీ ఇప్పుడు తీర్చేసుకున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2QVNSC9
v

కొడుక్కి ఫ్లాప్‌ ఇచ్చిన దర్శకుడికి మరో ఛాన్స్‌ ఇస్తున్న స్టార్‌ ప్రొడ్యూసర్‌

టాలీవుడ్‌లో రచయితగా వరుస బ్లాక్‌ బస్టర్లు అందించిన రైటర్‌ . స్టార్‌ డైరెక్టర్లకు ఎన్నో సూపర్‌ హిట్ కథలను అందించిన వంశీ తాను దర్శకుడిగా మాత్రం సక్సెస్‌ కాలేకపోయాడు. టాలీవుడ్‌ స్టార్ హీరో ఛాన్స్‌ ఇచ్చినా దాన్ని నిలబెట్టుకోలేకపోయాడు. స్టైలిష్‌ స్టార్ అల్లు అర్జున్‌ హీరోగా తెరకెక్కిన సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు వక్కంతం వంశీ. దర్శకుడిగా వక్కంతం వంశీకి తొలి ప్రయత్నంలో దారుణమైన రిజల్ట్‌ వచ్చింది. ఈ సినిమా తరువాత వంశీ ఇండస్ట్రీలో కనిపించటం మానేశాడు. ఇతర దర్శకుల చిత్రాలకు కథలు ఇవ్వటం కూడా మానేశాడు. అయితే త్వరలో మరోసారి దర్శకుడిగా తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు రెడీ అవుతున్నాడు. Also Read: తనయుడు అల్లు అర్జున్‌కు భారీ డిజాస్టర్‌ ఇచ్చినా వంశీకి మరో చాన్స్‌ ఇస్తున్నాడు మెగా ప్రొడ్యూసర్‌ . అయితే ఈ సారి భారీ బడ్జెట్‌ సినిమాగా కాకుండా లో బడ్జెట్‌లో ఓ యంగ్ హీరోతో సినిమా చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం కథ రెడీ చేసే పనిలో వంశీ హీరో ఎవరన్నది ఇంకా ఫిక్స్‌ చేయలేదు. గతంలో పరుశురామ్‌కు కూడా ఇలాగే గీతా గోవిందం సినిమాతో బ్రేక్‌ ఇచ్చిన అల్లు అరవింద్‌. ప్రస్తుతం బొమ్మరిల్లు భాస్కర్‌తో ఓ సినిమాను నిర్మిస్తున్నాడు. ఈ సినిమాలో అక్కినేని నట వారసుడు అఖిల్ హీరోగా నటిస్తున్నాడు. అదే బాటలో ఇప్పుడు వక్కంతం వంశీ కెరీర్‌ను కూడా గాడిలో పెట్టే బాధ్యత తీసుకున్నాడు అల్లు అరవింద్‌. Also Read:


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/35CNGMj
v

‘ఆడియన్స్ నన్ను అక్రమ సంబంధాలు పెట్టుకునే హీరోగా చూస్తున్నారు’

బాలీవుడ్‌లో సీరియల్ కిస్సర్‌ అనే ట్యాగ్‌ను దక్కించుకున్నారు బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ. ఆయన సినిమాల్లో కంటెంట్ ఉన్నా లేకపోయినా కిస్సింగ్ సన్నివేశాలు మాత్రం ఎప్పుడూ ఉంటాయి. అందుకే ఆయన్ను సీరియల్ కిస్సర్ అంటుంటారు. అయితే ఈ ట్యాగ్ తనకు చాలా బాధ కలిగిస్తుందని ఇమ్రాన్ తెలిపారు. ఈ విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ‘నేను ఇలాంటి అసభ్యకరమైన పనులు చేస్తూనే నా కెరీర్‌ను మలుచుకున్నాను. సినిమాల్లో నా పాత్ర ఎప్పుడూ తప్పుగానే ఉంటుంది. ఇలాంటి కాకుండా ఇక నుంచి మంచిని చూపించే పాత్రల్లో నటించాలి. అలాంటి స్క్రిప్ట్స్‌ కోసం ఎదురుచూస్తున్నా. కానీ ఇప్పటివరకు అలాంటి స్క్రిప్ట్స్ రానేలేదు. అయితే జాన్ అబ్రహం, అక్షయ్ కుమార్‌లకు మాత్రం దేశభక్తుల్లా కనిపించే పాత్రలు దక్కుతుంటాయి. అందుకే ప్రజలు వారిని దేశభక్తులు అనుకుంటారు. కానీ నాకు మాత్రం కాపురాలు కూల్చే వ్యక్తిగా కనిపించే పాత్రలు, అక్రమ సంబంధాలు పెట్టుకునే వ్యక్తిగా కనిపించే పాత్రలు దక్కుతూ ఉంటాయి. అందుకే ప్రజలకు నా ముఖం చూడగానే వీడు అక్రమ సంబంధాలు పెట్టుకుంటూ ఉంటాడు అనుకుంటారు. కానీ నిజానికి నేను చాలా మంది వాడిని. కానీ ప్రజలు ఎవ్వరూ నమ్మరు’ అని తెలిపారు. ప్రస్తుతం ఇమ్రాన్ ‘ది బాడీ’ అనే క్రైం థ్రిల్లర్ పాత్రలో నటించారు. ఇందులో వేదిక, శోభితా ధూలిపాల కథానాయికలుగా నటించారు. బాలీవుడ్ నటుడు రిషి కపూర్ పోలీసు అధికారి పాత్రలో నటించారు. ఇమ్రాన్ గురించి వేదిక మాట్లాడుతూ.. ‘నిజానికి ఇమ్రాన్ చాలా మంచివాడు. ఈ సినిమాలో ఇమ్రాన్ నాతో అక్రమ సంబంధం పెట్టుకుంటాడు. అయితే నాకు ఇమ్రాన్ గురించి వ్యక్తిగతంగా ఏమీ తెలీదు కానీ అతను చాలా మంచివాడు అని అర్థమైంది’ అన్నారు. ఆ తర్వాత ఇమ్రాన్ మాట్లాడుతూ.. ‘కిస్సింగ్ సీన్స్‌లో నటించాల్సి ఉంటుంది. నీకు ఓకేనా అని వేదికను అడిగాను. ఇది కేవలం సినిమా మాత్రమే కాబట్టి ఆమె ఏమీ అనుకోలేదు. బహుశా నాతో సినిమా అనగానే వరస్ట్ సన్నివేశాలను ఊహించుకున్నట్లుంది’ అని చమత్కరించారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2qNES7u
v

ఆ దర్శకుడితో `అర్జున్‌ రెడ్డి`.. ఎలా సింక్‌ అవుతుంది?

అర్జున్‌ రెడ్డి సినిమాతో సెన్సేషనల్‌ స్టార్‌గా మారిపోయాడు టాలీవుడ్‌ యంగ్ హీరో . ఒక్క సినిమాతోనే స్టార్‌ ఇమేజ్‌ అందుకున్న విజయ్‌ ప్రస్తుతం వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌ అనే రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌లో నటిస్తున్నాడు. క్రాంతి మాధవ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో విజయ్‌కు జోడిగా నలుగురు భామలు నటిస్తుండటం విశేషం. విజయ్‌ మూడు డిఫరెంట్ లుక్స్‌లో నటిస్తున్న ఈ సినిమాలో రాశీఖన్నా, కేథరిన్‌ థ్రెస్సా, ఐశ్వర్యా రాజేష్‌, ఇసా బెల్లాలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇప్పటికే మేజర్‌ పార్ట్ షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా వాలెంటైన్స్‌ డే కానుకగా 2020 ఫిబ్రవరి 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా సెట్స్‌ మీద ఉండగానే మరో రెండు సినిమాలు లైన్‌లో పెట్టాడు అర్జున్‌ రెడ్డి. Also Read: వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌ షూటింగ్ పూర్తయిన వెంటనే డాషింగ్‌ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో సినిమా స్టార్ట్‌ చేసేందుకు ఓకె చెప్పాడు. పూరీ, చార్మీలు స్వయంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు అనే టైటిల్‌ను ఫిక్స్‌ చేశారు. ప్రస్తుతం ఆకాష్‌ హీరోగా తెరకెక్కుతున్న రొమాంటిక్‌ సినిమా నిర్మాణ పనుల్లో బిజీగా ఉన్న పూరీ, ఆ పనులు పూర్తయిన వెంటనే విజయ్‌ దేవరకొండ సినిమాను సెట్స్‌ మీదకు తీసుకెళ్లేందుకు ప్లాన్‌ చేస్తున్నాడు. అయితే తాజాగా మరో క్రేజీ కాంబినేషన్‌కు విజయ్‌ దేవరకొండ ఓకె చెప్పినట్టుగా తెలుస్తోంది. క్లాస్‌ చిత్రాల దర్శకుడిగా పేరున్న దర్శకత్వంలో విజయ్‌ దేవరకొండ ఓ సినిమా చేయనున్నాడు. అష్మా చమ్మా, గోల్కొండ హైస్కూల్‌, అమీ తుమీ, సమ్మోహనం లాంటి క్లాస్ సినిమాలతో పాటు జెంటిల్‌మెన్‌ లాంటి థ్రిల్లర్‌ను రూపొందించాడు ఇంద్రగంటి. Also Read: ప్రస్తుతం ఈ దర్శకుడు.. నాని, సుధీర్‌ బాబు కాంబినేషన్‌లో `వి` అనే సినిమాను రూపొందిస్తున్నాడు. ఈ సినిమాలో నాని తొలిసారిగా ప్రతినాయక పాత్రలో నటిస్తున్నాడన్న టాక్‌ వినిపిస్తోంది. అయితే ఈ సినిమా తరువాత విజయ్‌ దేవరకొండ హీరోగా ఓ సినిమా చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నాడట ఇంద్రగంటి మోహనకృష్ణ. ఇప్పటికే ఈ కాంబినేషన్‌కు సంబంధించి చర్చలు కూడా మొదలైనట్టుగా తెలుస్తోంది. అయితే క్లాస్‌ సినిమాలు మాత్రమే చేసే ఇంద్రగంటి మోహన కృష్ణ, క్రేజీ మాస్‌ ఇమేజ్‌ ఉన్న విజయ్‌ దేవరకొండతో సినిమా అంటే సెట్‌ అవుతుందా అన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు ఫ్యాన్స్‌. ఇప్పుడిప్పుడే జానర్‌ మారుస్తున్న ఇంద్రగంటి, విజయ్‌ దేవరకొండ కోసం ఎలాంటి కథ రెడీ చేశాడో తెలుసుకునేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2OlTZOu
v

Tuesday 26 November 2019

నాకు గిల్లడం ఇష్టం.. అందుకే `కమ్మ రాజ్యంలో కడప రెడ్లు` తీశా: ఆర్జీవి

సంచలన దర్శకుడు తెరకెక్కిస్తున్న మరో వివాదాస్పద చిత్రం . ప్రస్తుతం రాజకీయ పరిస్థితులపై వర్మ సెటైరికల్‌గా తెరకెక్కిస్తున్న ఈ సినిమా శుక్రవారం (29-110-2019) ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడుతో పాటు నారా లోకేష్‌, కేఏ పాల్‌, పవన్‌ కళ్యాణ్‌లను పోలిన పాత్రలు ఉన్నాయి. ఇప్పటికే టీజర్‌, ట్రైలర్‌, సాంగ్స్‌తో సినిమాకు కావాల్సినంత క్రేజ్‌ని తెచ్చి పెట్టాడు వర్మ. సినిమా రిలీజ్‌కు డేట్‌ దగ్గర పడుతుండటంతో సినిమా విశేషాలు తెలియజేసేందుకు మీడియా సమావేశం నిర్వహించాడు. హైదరాబాద్‌లోని తన ఆఫీస్‌లో ఏర్పాటు చేసిన ఈ సమావేశంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు వర్మ. Also Read: కమ్మ రాజ్యంలో కడప రెడ్లు ఓ మెసేజ్‌ ఓరియంటెడ్ సినిమా అంటున్నాడు వర్మ. ఈ సినిమాలో ఏ వర్గాన్ని తక్కువగా చేసి చూపించటం లేదన్నాడు. కేవలం కొన్ని సంఘటనల ఆధారంగా కథ రెడీ చేసుకున్నట్టుగా వెల్లడించాడు. తాను ఎవరినీ టార్గెట్‌ చేసి సినిమా చేయనని కేవలం తనకు ఇంట్రస్టింగ్‌గా అనిపించిన పాయింట్‌ను మాత్రమే సినిమాగా తెరకెక్కిస్తానని తెలిపాడు. మామూలు క్రైమ్‌ కన్నా.. పొలిటికల్‌ క్రైమ్‌ మరింత ఇంట్రస్టింగ్‌గా ఉంటుందని అందుకే ఈ మధ్య ఆ తరహా సినిమాలు ఎక్కువగా తెరకెక్కిస్తున్నానన్నాడు. కమ్మ రాజ్యంలో కడప రెడ్లు ఓ కామెడీ ఎంటర్‌టైనర్‌ అని షాక్‌ ఇచ్చాడు. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రమాణస్వీకారోత్సవం చూసినప్పుడు ఈ సినిమా ఐడియా వచ్చిందని వెల్లడించాడు వర్మ. తనదైన స్టైల్‌లో కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు కూడా చేశాడు. ఈ సినిమాను ఓ ప్రముఖ తండ్రి కొడుకులకు అంకిత ఇవ్వనున్నానని చెప్పి కొత్త మంట పెట్టాడు. అయితే వారి పేర్లు మాత్రం అడగవద్దన్నాడు. తనకు చిన్నప్పటి నుంచి గిల్లటం అంటే ఇష్టం అంటూ తను ఇలాంటి వివాదాస్పద చిత్రాలను ఎందుకు రూపొందిస్తున్నాడో క్లారిటీ ఇచ్చాడు. నాకు ఎవరైనా పొగిడితే నిద్రొచ్చేస్తుంది. బాగా తిట్టించుకోవటం నాకు ఇష్టం అందుకే ఇలాంటి సినిమాలు చేస్తున్నా అన్నాడు. Also Read: టైగర్‌ కంపెనీ ప్రొడక్షన్స్‌, అజయ్‌ మైసూర్‌ ప్రొడక్షన్స్‌ కంపెనీలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు సిద్ధార్థ్‌ తాతోలుతో కలిసి వర్మ దర్శకత్వం వహిస్తున్నాడు. భారీ స్టార్‌ కాస్ట్‌ ఏది లేకపోయినా వర్మ తనదైన ప్రమోషనల్‌ స్ట్రాటజీతో సినిమాకు కావాల్సినంత హైప్‌ తీసుకువచ్చాడు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2OLCTbS
v

Nick Jonas: బెస్ట్ గిఫ్ట్ ఇచ్చావ్.. థ్యాంక్స్ ప్రియాంక

గ్లోబల్ స్టార్ ఇంకొన్ని రోజుల్లో మొదటి పెళ్లి రోజును జరుపుకోబోతున్నారు. 2018 డిసెంబర్ 1న ప్రియాంక.. ప్రముఖ అమెరికన్ సింగర్ నిక్ జొనాస్‌ను పెళ్లి చేసుకున్నారు. ఈ సందర్భంగా ప్రియాంక ప్రీ వెడ్డింగ్ యానివర్సరీ గిఫ్ట్‌తో తన భర్తను సర్‌ప్రైజ్ చేశారు. ఇంతకీ తన ప్రియమైన భర్తకు ప్రియాంక ఇచ్చిన కానుక ఏంటో తెలుసా? జెర్మన్ షెపర్డ్ జాతికి చెందిన కుక్కపిల్ల. నిక్ నిద్రలేవక ముందే ప్రియాంక కుక్కను తీసుకెళ్లి సర్‌ప్రైజ్ చేశారు. కుక్కను చూడగానే నిక్ సర్‌ప్రైజ్ అయ్యారు. ఈ సమయంలో తీసిన వీడియోను ప్రియాంక, నిక్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ‘ప్రీ (ప్రియాంక ముద్దు పేరు) ఈరోజు ఉదయాన్నే నాకు బెస్ట్ సర్‌ప్రైజ్ ఇచ్చింది. మా పెంపుడు కుక్క గినోకి హాయ్ చెప్పండి. ఉదయం గినోని చూడగానే నేను నవ్వుతూనే ఉన్నాను. థ్యాంక్స్ ప్రియాంక చోప్రా’ అని పేర్కొన్నారు. ప్రియాంక చోప్రా కూడా ఈ వీడియోను పోస్ట్ చేశారు. ‘ఒకే ఫ్రేంలో ఎంత క్యూట్‌గా ఉన్నారో. హ్యాపీ యానివర్సరీ బేబీ’ అని క్యాప్షన్ ఇచ్చారు. ప్రియాంక వద్ద ఆల్రెడీ ఓ పెంపుడు కుక్క ఉంది. చిహ్వాహ్వా జాతికి చెందిన కుక్క పిల్లను ప్రియాంక ప్రాణంగా చూసుకుంటున్నారు. దాని పేరు డయానా. ప్రియాంక ఎక్కడికి వెళ్లినా దాన్ని వెంట తీసుకెళుతూ ఉంటారు. డయనా డైరీస్ పేరిట దానికి ఇన్‌స్టాగ్రామ్‌లో స్పెషల్ ఎకౌంట్ కూడా ఉంది. డయానానే మాట్లాడుతున్నట్లుగా ప్రియాంక టీం దాని ఫొటోలు పోస్ట్ చేస్తూ ఫన్నీ క్యాప్షన్స్ ఇస్తూ ఉంటారు. డయానాకు ఇన్‌స్టాగ్రామ్‌లో వేలల్లో ఫ్యాన్స్ ఉన్నారు. అంతేకాదు ప్రియాంక ఏదన్నా ఫ్యాషన్ ఈవెంట్స్‌కి వెళితే డయానాను కూడా తయారు చేసి తీసుకెళుతూ ఉంటుంది. ఇటీవల లాస్‌ఏంజెల్స్‌లో జరిగిన మెట్ గాలా అనే ఫ్యాషన్ ఈవెంట్‌కు ప్రియాంక నిక్‌తో పాటు డయానాను కూడా తీసుకెళ్లింది. డయానా కూడా ఫొటోలకు పోజులిచ్చింది. ఓ రకంగా డయానా స్టార్ కిడ్ అయిపోయిందనే చెప్పాలి. ఇకపోతే.. ప్రియాంక తన భర్తతో కలిసి ఫస్ట్ మ్యారేజ్ యానివర్సరీని ఎంజాయ్ చేయడానికి ఇటీవల దిల్లీ నుంచి అమెరికా వెళ్లింది. తాను నటిస్తున్న ‘ది వైట్ టైగర్’ సినిమా నుంచి కొన్ని రోజులు విరామం తీసుకుంది. ప్రియాంక కోసం నిక్ స్పెషల్ సర్‌ప్రైజ్ ఏర్పాటుచేయనున్నారట. ఇటీవల ప్రియాంక, నిక్ కలిసి లాస్‌ఏంజెల్స్‌లో ఏకంగా రూ.144 కోట్లు పెట్టి పెద్ద ఇల్లు కొనుక్కున్నారు. అక్కడే తమ తొలి వెడ్డింగ్ యానివర్సరీ సెలబ్రేషన్స్ జరుపుకోబోతున్నారట.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2Y08D1n
v

విజయ్ దేవరకొండ కొత్తింటి కోసం అంత ఖర్చుపెట్టారా!

సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ సొంతింటికి మారిన సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు శ్రీనగర్ కాలనీలో ఉంటున్న విజయ్ దేవరకొండ ఫ్యామిలీ తాజాగా ఫిల్మ్ నగర్‌లోని కొత్త ఇంటికి మారింది. ఫిల్మ్ నగర్‌లోని హీరో శ్రీకాంత్‌ ఇంటికి సమీపంలో ఈ ఇంటికి విజయ్ దేవరకొండ కొనుగోలు చేశారు. ఆదివారం తల్లిదండ్రులు, సోదరుడితో కలిసి గృహప్రవేశం చేశారు విజయ్. అయితే, ప్రస్తుతం ఈ ఇంటి గురించి ఇండస్ట్రీలో చర్చ మొదలైంది. ఈ కొత్త సొంతింటి కోసం విజయ్ దేవరకొండ రూ.20 కోట్లు వెచ్చించినట్టు ఇండస్ట్రీ టాక్. ఈ ఇంటిని చాలా విశాలంగా నిర్మించుకున్నారట విజయ్. ప్రస్తుతం విజయ్ మంచి ఫామ్‌లో ఉన్నారు. ‘గీతగోవిందం’ సినిమాతో విజయ్ మార్కెట్ భారీగా పెరిగిపోయింది. దీంతో ప్రస్తుతం ఆయన రూ.8 నుంచి రూ.10 కోట్ల వరకు పారితోషికం తీసుకుంటున్నారని టాక్. Also Read: అంతేకాకుండా సొంతంగా రౌడీ బ్రాండ్‌ పేరుతో బట్టల వ్యాపారం కూడా చేస్తున్నారు. ఇది కూడా బాగా కలిసొస్తోందట. వీటన్నిటికీ తోడు వాణిజ్య ప్రకటనల ద్వారా వచ్చేది కూడా పెద్దమొత్తంలోనే ఉంటుందని అంటున్నారు. పలు బ్రాండ్లకు విజయ్ బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్నారు. వీటి ద్వారా కూడా కోట్లలో ఆదాయం వస్తోంది. అంతేకాకుండా, విజయ్ దేవరకొండ సినిమా ప్రొడక్షన్‌లోకి కూడా దిగారు. తొలి చిత్రంగా ‘మీకు మాత్రమే చెప్తాను’ నిర్మించారు. ఈ చిత్రం కూడా బాగానే లాభాలను తెచ్చిపెట్టింది. Also Read: ప్రస్తుతం విజయ్ దేవరకొండకు ఒక మంచి అమ్మాయిని వెతికే పనిలో కుటుంబ సభ్యులు బిజీగా ఉన్నారట. విజయ్‌ను ఓ ఇంటివాడిని చేసేముందు అతనితో ఒక సొంతింటిని కొనిపించేశారు తల్లిదండ్రులు. ‘ఇల్లు కట్టేశావ్.. ఇక పెళ్లిచేసుకో’ అంటున్నారట తమ కుటుంబంలోని పెద్దలు. కాగా, కొత్తింటిలో తల్లిదండ్రులతో పాటు తమ్ముడు ఆనంద్ దేవరకొండతో కలిసి విజయ్ ఉంటున్నారు. అలాగే, గతంలో విజయ్ తండ్రి ఇందిరా నగర్ పరిసరాల్లో ఒక ఆఫీస్‌ని మెయింటెయిన్ చేసేవారు. ఇప్పుడు ఆ అడ్రస్ కూడా మారనుందట.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/37OJATo
v

LIVE: ‘అర్జున్ సురవరం’ ప్రీ రిలీజ్ వేడుక.. చిరంజీవి చీఫ్ గెస్ట్

యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ చాలా రోజులుగా ఎదురుచూస్తోన్న సమయం ఆసన్నమైంది. ఆయన హీరోగా నటించిన ‘అర్జున్ సురవరం’ సినిమా వాయిదాలు పడుతూ వస్తూ ఎట్టకేలకు విడుదలకు నోచుకుంది. ఈ సినిమా విడుదల ఆలస్యమైనా ప్రేక్షకులకు మాత్రం బాగానే గుర్తుండిపోయింది. దీనికి తోడు చిత్ర యూనిట్ మంచి ప్రచారం కల్పించడంతో అంచనాలు ఏర్పడ్డాయి. ఆ అంచనాలను మరింత పెంచేందుకు, చిత్ర ప్రచారంలో భాగంగా ఈరోజు ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహిస్తున్నారు. హైదరాబాద్‌లోని నెక్లెస్ రోడ్, పీపుల్స్ ప్లాజా‌లో నిర్వహిస్తోన్న ఈ ప్రీ రిలీజ్ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి చీఫ్ గెస్ట్‌గా హాజరవ్వటం విశేషం. కాగా, ఈ సినిమాలో నిఖిల్ సరసన లావణ్య త్రిపాఠి హీరోయిన్‌గా నటించారు. టి.ఎన్.సంతోష్ దర్శకత్వం వహించారు. ప్రముఖ నిర్మాత ‘ఠాగూర్’ మ‌ధు స‌మ‌ర్పణ‌లో మూవీ డైన‌మిక్స్ ఎల్ఎల్‌పి బ్యాన‌ర్‌పై రాజ్‌ కుమార్ ఆకెళ్ల నిర్మించారు. యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమాలో పోసాని కృష్ణముర‌ళి, సత్య, త‌రుణ్ అరోరా, వెన్నెల కిషోర్, నాగినీడు, విద్యుల్లేఖ రామన్ తదితరులు న‌టించారు. సామ్ సి.ఎస్ సంగీతం సమకూర్చారు. Also Read: ఇదిలా ఉంటే, ఇటీవల విడుదలైన ‘అర్జున్ సురవరం’ ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్న నిఖిల్ ఫ్యాన్స్ ట్రైలర్‌ చూసి తెగ సంబరపడిపోయారు. ట్రైలర్ సూపర్‌గా ఉందని, సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావాలని కోరుకున్నారు. నిఖిల్‌కు శుభాకాంక్షలు తెలిపారు. దీనితో పాటు తాజాగా విడుదలైన ‘కన్నే కన్నే’ సాంగ్ కూడా విపరీతంగా ఆకట్టుకుంది. ఈ సినిమాకు సామ్ సీఎస్ అందించిన నేపథ్య సంగీతం మరో ప్రధాన బలమని ఇటీవల నిఖిల్ అన్నారు. అన్ని రకాల కమర్షియల్ ఎలిమెంట్స్ ఈ చిత్రంలో ఉంటాయని చెప్పారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2rplaPw
v

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...