హిందీలో ప్రసారమయ్యే ‘యే రిష్తా క్యా కెహలాతా హై’ సీరియల్లో నటించిన ఇటీవల ఓ ఇంటివారయ్యారు. సుయేష్ రావత్ అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అయితే ఈ వేడుకకు ప్రధాని నరేంద్ర మోదీ అతిథిగా వెళ్లడం హాట్ టాపిక్గా మారింది. సాధారంగా మోదీ పెద్దగా పరిచయం లేని వారి వివాహాలకు వెళ్లరు. అలాంటిది వీరి వివాహ విందుకు ఎందుకు వెళ్లారు అని నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. హిందీ సీరియల్స్ చూసేవారికి మోహన ఓ నటిగా మాత్రమే తెలుసు. కానీ ఆమె ఓ యువరాణి అన్న అతి తక్కువ మందికి తెలుసు. మోహెన మధ్యప్రదేశ్లోని రెవా ప్రాంతానికి చెందిన రాజ వంశంలో జన్మించారు. అదీకాకుండా వారి వంశంలో వందేళ్ల తర్వాత ఓ యువరాణికి పెళ్లైంది. అందుకే మోహెన, సుయేష్ రావత్ పెళ్లి వేడుకను అంగరంగ వైభవంగా నిర్వహించారు. అందుకే మోదీని ఆహ్వానించి మరీ పెళ్లి వేడుకను ఘనంగా నిర్వహించారు. రేవా ప్రాంతంలో వివాహ విందును ఏర్పాటుచేశాక దిల్లీలోనూ మరో విందును ఏర్పాటుచేశారు. ఈ విందుకు ప్రధాని విచ్చేసి వధూవరులను ఆశీర్వదించారు. పిలవగానే వచ్చిన మోదీజీకి ధన్యవాదాలు తెలుపుతూ మోహన సోషల్ మీడియాలో ఫొటోలు పోస్ట్ చేశారు. అయితే పెళ్లి తర్వాత నటన మానేస్తానని మోహన ప్రకటించారు. మోహన మంచి డ్యాన్సర్ కూడా. ఎన్నో డ్యాన్స్ రియాల్టీ షోలలో పాల్గొన్నారు. మోహెన నటించిన ‘యే రిష్తా క్యా కెహలాతా హై’ సీరియల్ తెలుగులో ‘పెళ్లంటే నూరేళ్ల పంట’ అనే టైటిల్తో ప్రసారం అయింది. అయితే హిందీలో పాపులర్ అయినంత ఈ సీరియల్ తెలుగులో ఆకట్టుకోలేకపోయింది. దాంతో ప్రసారం చేయడం ఆపేసి సీరియల్ను హాట్ స్టార్లో పెట్టారు.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2rz2UDm
v
No comments:
Post a Comment