Friday 29 November 2019

Poonam Kaur: లేచిపోయిందా అని అడగడానికి పోలీసులకు సిగ్గులేదా?

ప్రియాంక రెడ్డి హత్య కేసు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపింది. వెటర్నరీ డాక్టర్ అయిన ప్రియాంక రెడ్డిపై నలుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారం చేసి అతిదారుణంగా పెట్రోల్ పోసి తగలబెట్టేశారు. అయితే ప్రియాంక ఎప్పటికీ ఇంటికి రాకపోయేసరికి ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు వెళ్లారు. ఆ సమయంలో పోలీసులు ప్రియాంక తల్లిదండ్రులను ప్రశ్నించిన తీరు వివాదాస్పదమైంది. ‘అమ్మాయి ఇంకా ఇంటికి రాలేదు సర్’ అని ప్రియంక తల్లిదండ్రులు ఫిర్యాదు చేస్తే.. ‘లేచిపోయిందేమో..’ అన్నారట. ఈ విషయాన్ని ప్రియాంక తల్లిదండ్రులు మీడియా ముందు బయటపెట్టడంతో ప్రజలు ఆగ్రహానికి గురవుతున్నారు. దీనిపై ప్రముఖ నటి స్పందించారు. ‘పోలీసులకు ఇది మర్యాదపూర్వకంగా అనిపించుకోదు. లేచిపోయిందేమో అని అడిగిన పోలీసులకు సిగ్గుగా లేదా. అసహ్యమేస్తోంది. వాట్ ద ఫ**’ అంటూ పూనమ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోపక్క ప్రియాంక హత్య కేసు మిస్టరీ వీడినట్లు తెలుస్తోంది. కేసు దర్యాప్తును ముమ్మరం చేసిన పోలీసులు నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ప్రియాంక రెడ్డి (22)ని లారీ డ్రైవర్లతో పాటు క్లీనర్లు అత్యంత పాశవికంగా గ్యాంగ్ రేప్ చేసి హతమార్చినట్లు తెలుస్తోంది. సీసీటీవీ ఫుటేజ్‌‌లను పరిశీలించి కేసులో నిందితులను గుర్తించారు. నలుగురు వ్యక్తులను అరెస్టు చేసి విచారిస్తున్నారు. ప్రియాంక మృతదేహాన్ని కిరోసిన్ పోసి తగలబెట్టినట్లు పోస్టుమార్టం రిపోర్టులో వెల్లడైనట్లు తెలుస్తోంది. అయితే.. ఇద్దరు అనుమానితులు ఓ పెట్రోల్ బంక్‌లో బాటిల్‌లో పెట్రోల్ నింపుకుంటున్న దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో నిక్షిప్తమయ్యాయి. ప్రియాంక మెడకు చున్నీ బిగించి ఊపిరాడకుండా చేసి చంపేసినట్లు భావిస్తున్నారు. ప్రియాంక తలపైనా గాయాలున్నట్లు వైద్యులు తెలిపారు. ఈ కేసులో నిందితులను పోలీసులు శుక్రవారం (నవంబర్ 29) మధ్యాహ్నం మీడియా ముందు ప్రవేశపెట్టనున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/35CeufM
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...