Saturday 30 November 2019

బాలీవుడ్‌లో భాగమతి రీమేక్‌.. హీరోయిన్‌ ఎవరంటే?

సౌత్‌ స్టార్ హీరోయిన్‌ అనుష్క నటించిన సూపర్‌ హిట్ లేడీ ఓరియంటెడ్ సినిమా భాగమతి. బాహుబలి తరువాత అనుష్క నటించిన ఈ సినిమా ఆమె కెరీర్‌లో మరో మెమరబుల్‌ సినిమాగా నిలిచిపోయింది. `ఎవడు పడితే వాడు రావడానికి ఎప్పుడు పడితే అప్పుడు పోవడానికి ఇదేమన్నా పశువుల దొడ్డా.. భాగమతి అడ్డా` అంటూ అనుష్క చెప్పిన డైలాగ్‌ అప్పట్లో తెగ వైరల్‌ అయ్యింది. అయితే దక్షిణాది భాషల్లో ఒకేసారి రిలీజ్‌ అయిన ఈ సినిమాను బాలీవుడ్‌లో రీమేక్‌ చేసేందుకు చాలా రోజులుగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే తెలుగులో అనుష్క చేసిన పాత్రను అదే స్థాయిలో పోషించగలిగే బాలీవుడ్‌ నటి కోసం ఇన్నాళ్లు ఎదురుచూశారు. తాజాగా భాగమతి రీమేక్‌కు రంగం సిద్ధమైనట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం హిందీలో మంచి ఫాంలో ఉన్న ఓ హాట్ బ్యూటీని భాగమతి రీమేక్‌ కోసం ఫైనల్‌ చేశారు. Also Read: ఇటీవల బాలా సినిమాతో సూపర్‌ హిట్ అందుకున్న భూమీ పడ్నేకర్‌, బాలీవుడ్‌ భాగమతి రీమేక్‌లో నటించనుంది. ప్రస్తుతం ఈ భామ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న పతీ పత్ని ఔర్‌ ఓ సినిమాలో నటిస్తోంది. అంతేకాదు ఇటీవల వేదికా లవ్‌లైన్‌ పేరుతో దాంపత్య సమస్యలుంటే నా దగ్గరకు రండి అంటూ ఓ క్యాంపెయిన్‌ కూడా స్టార్ట్ చేసింది భూమి. Also Read: అనుష్క ప్రధాన పాత్రలో తెరకెక్కిన భాగమతి సినిమాకు అశోక్‌ దర్శకుడు. ఈ సినిమాలో మురళీ శర్మ, ధన్‌రాజ్‌, విధ్యుల్లేఖ రామన్‌లతో పాటు మలయాళ నటులు ఉన్ని ముకుందన్‌, జయరామ్‌లు కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమాను హిందీలో బాలీవుడ్‌ స్టార్‌ హీరో అక్షయ్‌ కుమార్‌, టీ సిరీస్‌ సంస్థతో కలిసి నిర్మిస్తున్నాడు. దుర్గావతి అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారు. బాలీవుడ్‌లోనూ అశోక్‌ దర్శకత్వం వహించనున్న ఈ సినిమాను అక్షయ్‌ కుమార్‌ అధికారికంగా ప్రకటించారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/35QwgvK
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...