Saturday 30 November 2019

వెటర్నరీ డాక్టర్ హత్య: మోదీని టార్గెట్ చేసిన సల్మాన్ ఖాన్

వెటర్నరీ వైద్యురాలి హత్య తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశమంతటగా కలకలం రేపుతోంది. ఇప్పటికే ఎందరో బాలీవుడ్ సినీ ప్రముఖులు ఈ ఘటనపై స్పందించారు. తాజాగా బాలీవుడ్ సూపర్‌స్టార్ ఈ ఘటనపై సోషల్ మీడియాలో ట్వీట్స్ చేశారు. భారత ప్రధాని నరేంద్రమోదీ ప్రభుత్వంపై పరోక్షంగా కామెంట్స్ చేశారు. ఈ దారుణ ఘటనకు పాల్పడిన నిందితులు మనుషుల మధ్య తిరుగుతున్న దరిద్రమైన దెయ్యాలంటూ సల్మాన్ ఖాన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ అమాయక బాధితురాలు అనుభవించిన నరకం గురించి తెలుసుకున్నాం కాబట్టి మరో అమాయకురాలు బలి కాకముందే సమాజం అంతా ఐక్యమై ఇలాంటి దెయ్యాలను ఏరిపారేయాలని తెలిపారు. మరే కుటుంబం ఇలాంటి బాధను అనుభవించకూడదని పేర్కొన్నారు. బేటీ బచావో బేటీ పడావో అనేది కేవలం ఓ క్యాంపెయిన్ మాత్రమే కాకూడదని దానిని ఆచరణలోనూ పెట్టాలని ఇన్‌డైరెక్ట్‌గా మోదీ ప్రభుత్వానికి కౌంటర్ వేశారు. మనమంతా ఒకటిగా ఉన్నామని ఇలాంటి రాక్షసులకు తెలిసి రావాలని అన్నారు. వెటర్నరీ వైద్యురాలి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ఈ దారుణ ఘటనకు పాల్పడిన నలుగురు నిందితులను తెలంగాణ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారించడం, జైలులో పెట్టడం దండగ అని తమకు అప్పగిస్తే పెట్రోల్ పోసి తగలబెడతామంటూ ప్రజలు నిరసనలు చేపడుతున్నారు. దేశ రాజధాని దిల్లీలోనూ ఈ ఆగ్రహ జ్వాలలు అలుముకున్నాయి. మరి ఈ నలుగురి నిందితులపై న్యాయస్థానం ఏ రకమైన నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2OznBrV
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...