Wednesday 27 November 2019

రజినీకాంత్ ‘దుమ్ము ధూళి’ సాంగ్.. దుమ్ముదులిపిన ఎస్పీబీ

సూపర్ స్టార్ రజినీకాంత్ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా నటిస్తోన్న చిత్రం ‘దర్బార్’. నయనతార హీరోయిన్. ఎ.ఆర్.మురుగదాస్ దర్శకత్వం వహిస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఎ.సుబస్కరన్ ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. యువ సంగీత సంచలనం అనిరుధ్ రవిచందర్ సంగీతం సమకూరుస్తోన్న ఈ సినిమా నుంచి తొలిపాటను బుధవారం విడుదల చేశారు. ‘దుమ్ము ధూళి’ అంటూ సాగే ఈ పాట నిజంగా దుమ్మురేగిపోయేలా ఉంది. దిగ్గజ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఈ పాటను ఆలపించారు. తమిళం, తెలుగులోనూ ఆయనే పాడారు. ఎస్పీబీతో పాటు అనిరుధ్ కూడా గొంతు కలిపారు. తెలుగులో అనంత్ శ్రీరామ్ సాహిత్యం అందించారు. ఎస్పీబీ ఎప్పటిలానే మంచి ఊపుతో పాడారు ఈ పాట. దుమ్ముదులిపారు. వాస్తవానికి రజినీకాంత్ సినిమాల్లో సోలో సాంగ్స్‌ను ఎస్పీ బాలసుబ్రహ్మణ్యమే పాడుతూ ఉంటారు. అయితే, ‘కబాలి’, ‘కాలా’ చిత్రాల్లో ఎస్పీబీ పాటలు లేవు. ఆ లోటును రజినీ ఇప్పుడు తీర్చేసుకున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2QVNSC9
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...