Sunday 31 May 2020

మెగా అభిమానులకు క్రేజీ అప్‌డేట్: రామ్ చరణ్‌ కోసం కొరటాల స్కెచ్!!

మెగా పవర్ స్టార్ ప్రస్తుతం RRR మూవీతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. రాజమౌళి రూపొందిస్తున్న ఈ భారీ ప్రాజెక్టుతో పాటు కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి హీరోగా రూపొందుతున్న మెగా ప్రాజెక్టు '' మూవీలోనూ భాగం కాబోతున్నారు చెర్రీ. షూటింగ్స్ రీ ఓపెన్ అయిన వెంటనే ఈ రెండు సినిమాల సెట్స్‌పైకి ఆయన వెళ్లనున్నారు. ఈ క్రమంలోనే 'ఆచార్య'లో చరణ్ కోసం వేట ప్రారంభించిన కొరటాల.. చివరకు ఓ క్రేజీ బ్యూటీని ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది. ఇటీవలి కాలంలో వరుస హిట్స్ ఖాతాలో వేసుకుంటూ టాలీవుడ్ క్రేజీ హీరోయిన్‌గా దూసుకుపోతున్న రష్మిక మందనను రామ్ చరణ్ సరసన నటింపజేసేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారట. ఈ మేరకు ఆమెతో సంప్రదింపుల కార్యక్రమాలు కూడా జరుపుతున్నారని టాక్. మరోవైపు ఈ సినిమాలో చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్‌ని కన్ఫర్మ్ చేశారు కొరటాల శివ. Also Read: లేటెస్ట్ సమాచారం మేరకు 'ఆచార్య' మూవీలో రామ్ చరణ్ రోల్ చాలా కీలకం అని తెలుస్తోంది. చర‌ణ్ పాత్ర చాలా ప‌వ‌ర్‌ఫుల్‌గా చిరంజీవికి మార్గ‌నిర్దేశం చేసేలా ఉంటుందని సమాచారం. దేవాలయాల్లో జరుగుతున్న అక్రమాల నేపథ్యంలో ఈ మూవీ కథ సిద్ధం చేసిన కొరటాల శివ.. మెగా అభిమానులు మెచ్చేలా ఆ కథకు తెర రూపం ఇవబోతున్నారట. సో.. రామ్ చరణ్ సరసన రష్మిక అని వస్తున్న ఈ క్రేజీ అప్‌డేట్ ఎంత వరకు నిజం కానుందో చూద్దాం మరి.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3gHZGCw
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...