Sunday 31 May 2020

‘సర్కారు వారి పాట’ నీకు మరో మైలురాయి కావాలి: పూరి జగన్నాథ్

ప్రతి సంవత్సరం తన తండ్రి నటశేఖర కృష్ణ జన్మదినం పురష్కరించుకుని సూపర్ స్టార్ మహేష్ తన కొత్త సినిమాకు సంబంధించిన కచ్చితంగా ఒక అప్‌డేట్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారు. ఈసారి తన కొత్త సినిమా ‘సర్కారు వారి పాట’ను ప్రకటించారు. టైటిల్ పోస్టర్‌ను కూడా విడుదల చేశారు. ఈ పోస్టర్‌లో మహేష్ కాస్త పొడవాటి జుట్టు, ఇప్పుడిప్పుడే వచ్చిన గెడ్డం, మెడ మీద రూపాయి బిల్ల టాటూ, చెవికి రింగుతో మునుపెన్నడూ చూడని మాస్ లుక్‌తో కనిపించారు. ఈ పోస్టర్‌లో మహేష్ లుక్‌ను పూర్తిగా చూపించకపోయినా.. ఈ హాఫ్ మాస్ లుక్‌ను చూసి ఫ్యాన్స్ సంబరపడిపోతున్నారు. కాగా, ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్, జీఎమ్‌బీ ఎంటర్‌టైన్మెంట్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్లపై నవీన్ యెర్నేని, వై.రవిశంకర్, రామ్ ఆచంట, గోపి ఆచంట నిర్మిస్తున్నారు. పరశురామ్ దర్శకత్వం వహిస్తున్నారు. తమన్ సంగీతం సమకూరుస్తున్నారు. డైరెక్టర్ పరశురామ్ ఇండస్ట్రీలోని ఒక టాప్ హీరోతో పనిచేయడం ఇదే తొలిసారి. మహేష్‌తో సినిమా తన కల అని.. ఆ కల నెరవేరుతోందని ఆయన అంటున్నారు. అయితే, సెన్సేషనల్ డైరెక్టర్ పూరి జగన్నాథ్.. పరశురామ్‌కు శుభాకాంక్షలు తెలిపారు. Also Read: ‘‘నీ చిన్న తనం నుంచి నీ ప్రయాణాన్ని నేను చాలా దగ్గరగా చూశాను. ఇప్పుడు నీ ప్రయాణంలో ‘సర్కారు వారి పాట’ మరో మైలు రాయి కావాలి. ఈ సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ కావాలని కోరుకుంటున్నా పరశురామ్. ఫస్ట్ లుక్, టైటిల్ రెండూ బాగా నచ్చాయి. మహేష్ బాబు అభిమానులు కచ్చితంగా సంబరాలు చేసుకుంటారు. టీమ్ మొత్తానికి ఆల్ ది బెస్ట్’’ అని పూరి జగన్నాథ్ ట్వీట్ చేశారు. పూరి జగన్నాథ్‌కు పరశురామ్ తమ్ముడి వరస. పరశురామ్‌ది కూడా విశాఖపట్నం జిల్లా నర్సీపట్నం దగ్గర పల్లెటూరే. పూరి జగన్నాథ్‌ స్ఫూర్తితోనే దర్శకుడు కావాలని పరశురామ్ హైదరాబాద్ వచ్చారు. ఎంబీఏ పూర్తిచేసిన పరశురామ్.. సినిమాలపై ఆసక్తితో మొదట ‘బొమ్మరిల్లు’ భాస్కర్, పూరి జగన్నాథ్ వద్ద అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశారు. 2008లో ‘యువత’ సినిమాతో దర్శకుడిగా మారారు. తొలి సినిమాతో విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. ఆ తరవాత ‘ఆంజనేయులు’, ‘సోలో’ సినిమాలతో ఫర్వాలదేనిపించినా.. ‘సారొచ్చారు’తో డిజాస్టర్ అందుకున్నారు. ఈ సినిమా దెబ్బతో సుమారు నాలుగేళ్లు గ్యాప్ తీసుకోవాల్సి వచ్చింది పరశురామ్. అయితే, 2016లో ‘శ్రీరస్తు శుభమస్తు’ సినిమా ద్వారా నిర్మాత అల్లు అరవింద్.. పరశురామ్‌ను ఆదుకున్నారు. అదే బ్యానర్‌లో 2018లో పరశురామ్ చేసిన ‘గీత గోవిందం’ బ్లాక్ బస్టర్ అయ్యింది. ఈ సినిమాతో పరశురామ్ మళ్లీ హిట్ ట్రాక్ ఎక్కారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2ZPEF2V
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...